-
హీరోగా యూట్యూబర్ నిఖిల్.. సంగీత్ సినిమా లాంఛ్ (ఫోటోలు)
-
ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
పుణె: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్రలోని బారామతి లోక్సభ నియోవర్గంలో మంగళవారం పోలింగ్ జరిగింది. చాలా మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఎన్సీపీ నాయకురాలు, మహారాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు రూపాలి చకంకర్ ఈవీఎం పూజలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. సింహగఢ్ రోడ్, పుణె సిటీ పోలీస్స్టేషన్లలో ఆమెపై కేసు నమోదైంది.ఓటింగ్ సందర్భంగా ఖడక్వాస్లా ప్రాంతంలోని పోలింగ్ కేంద్రానికి రూపాలి చకంకర్ ప్లేటు, దీపంతో వచ్చారు. ఈవీఎం మెషిన్ వద్ద పూజలు చేశారు. స్థానికి ఎన్నికల అధికారులు ఉన్నతాధికారలకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమెపై సింహగఢ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.కాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్కు మహాయుతి కూటమి బారామతి లోక్సభ అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పటి నుంచి ఆమె కోసం చురుగ్గా ప్రచారం చేస్తున్న రూపాలి చకంకర్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. -
ఇషాన్ కిషన్తో కలిసి హార్దిక్ పాండ్యా పూజలు (ఫొటోలు)
-
‘అడవి రాముడి’కి నవ వసంతం
దుమ్ముగూడెం: ఛత్తీస్గఢ్ దండకారణ్యంలోని సుక్మా జిల్లా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో మూతబడిన ఒక రామాలయం తలుపులు సీఆర్పిఎఫ్ అధికారుల చొరవతో 21 ఏళ్ల అనంతరం తెరుచుకున్నాయి. సుక్మా జిల్లాలోని చింతల్నార్ పోలీస్స్టేషన్ పరిధి మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన కేరళపొంద గ్రామంలో పురాతన రామమందిరం ఉంది. ఆ గుడిలో గ్రామస్తులు ప్రతిరోజూ పూజలు నిర్వహించేవారు. దీనిపై ఆగ్రహించిన మావోయిస్టులు 2003 సంవత్సరంలో గుడి మూసేసి తాళాలు వేశారు. అప్పటి నుంచి ఆలయం నిరాదరణకు గురైంది. మావోయిస్టుల భయంతో స్థానికులు ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి ఎదురైంది. అయితే, కేరళపొంద గ్రామంలో నెల రోజుల క్రితం సీఆర్పీఎఫ్ క్యాంపు నిర్మించారు. ఈ క్రమంలో అధికారులు తరచుగా గ్రామస్తులతో సమావేశమై సమస్యలు తెలుసుకుంటుండగా.. 21 ఏళ్లుగా తెరుచుకోని రామాలయ అంశం బయటపడింది. అయితే, తమకు తాముగా గుడి తెరిస్తే మావోయిస్టులు ఇబ్బంది పెడతారని గ్రామస్తులు చెప్పడంతో సీఆర్పీఎఫ్ అధికారులు చొరవ తీసుకుని మంగళవారం ఆలయాన్ని తెరిచారు. 74వ బెటాలియన్కు చెందిన అధికారులు, జవాన్లతో పాటు గ్రామస్తులు ఆలయంతో పాటు చుట్టుపక్కల ప్రదేశాలను శుభ్రం చేశారు. ఈ రామమందిరంలో సీతారామలక్ష్మణుల విగ్రహాలు సుందరంగా ఉన్నాయని, గుడి శిఖరంపై ఆంజనేయస్వామి విగ్రహం ఉందని పోలీసులు తెలిపారు. గుడి తలుపులు తెరుచుకోవడంతో గ్రామస్తులు సంతోషంతో నృత్యం చేశారు. ఇక నుంచి ప్రతిరోజూ పూజలు చేస్తామని, ఈ ఏడాది శ్రీరామనవమి కూడా ఘనంగా నిర్వహిస్తామని గ్రామస్తులు వెల్లడించారు. -
పెళ్లి చేసుకున్న బుల్లితెర జంట.. ఇద్దరికీ రెండోదే!
బుల్లితెర నటుడు కరణ్ శర్మ, పూజా సింగ్ పెళ్లి పీటలెక్కారు. మార్చి 30న ముంబైలో వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబసభ్యులు సహా బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహం జరిగింది. బుల్లితెర తారలు సైతం పెళ్లిలో తెగ హడావుడి చేశారు. తమ పెళ్లి విషయాన్ని కొత్త జంట ఏప్రిల్ 1న సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. మిస్టర్ అండ్ మిసెస్ శర్మ అంటూ భర్తను ముద్దాడుతున్న ఫోటోలు షేర్ చేసింది పూజా సింగ్. ఏళ్ల తరబడి ఒకే సంస్థలో.. ఈ సెలబ్రిటీ జంట పెళ్లి వేడుకలు మార్చి 29 నుంచే మొదలయ్యాయి. హల్దీ, మెహందీ, సంగీత్ ఫంక్షన్స్ గ్రాండ్గా నిర్వహించారు. ఇద్దరూ ఒకే నిర్మాణ సంస్థలో ఏళ్ల తరబడి పని చేస్తున్నా ఎప్పుడూ పెద్దగా మాట్లాడుకుందే లేదు. కానీ ఓ మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా గతేడాది డిసెంబర్లో కలుసుకున్నారు. ఆ పరిచయమే ఏడడుగుల బంధానికి దారి తీసింది. పెళ్లి తర్వాత పూజ మాట్లాడుతూ.. కరణ్ భర్తగా దొరకడం తన అదృష్టమని ఉప్పొంగిపోయింది. అద్భుతంగా సాగాలి కరణ్ మాట్లాడుతూ.. బ్యాచిలర్ లైఫ్ నుంచి వివాహ బంధంలోకి అడుగుపెట్టాను. ఈ ప్రయాణం అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నానన్నాడు. కాగా ఇతడు సాసురాల్ సిమర్ కా 2, ఉదారియాన్, మోహి, ఏక్ నహీ పెంచాన్ వంటి సీరియల్స్తో పాపులర్ అయ్యాడు. పూజ.. దియా ఔర్ బాతీ హమ్, తేరే ఇష్క్ మే ఘాయల్, శక్తి: అస్తిత్వ కే ఎసాస్ వంటి సీరియల్స్తో ప్రేక్షకులకు దగ్గరైంది. ఈమె గతంలో కపిల్ చట్టానీని పెళ్లి చేసుకుంది. 2017లో ఆమె పెళ్లి జరగ్గా 2021లో విడిపోయారు. కరణ్ కూడా గతంలో టియారా ఖర్ను పెళ్లాడాడు. కానీ ఈ బంధం ఎంతోకాలం నిలవలేదు. 2016లో పెళ్లవగా నాలుగేళ్లకే విడిపోయారు. View this post on Instagram A post shared by Pooja Singh (@poojaa_singh_) View this post on Instagram A post shared by Jigyasa Singh (@jigyasa_07) చదవండి: బాడీ షేమింగ్.. ఎంత క్షోభ అనుభవించానో నాకు మాత్రమే తెలుసు: హీరోయిన్ -
ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు- రామ్ చరణ్ కాంబో.. గ్రాండ్గా పూజా కార్యక్రమం!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఈ సినిమా వైజాగ్ షెడ్యూల్ను పూర్తి చేసుకున్నారు. దీనికి సంబంధించిన రామ్ చరణ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. అయితే ఈ సినిమా తర్వాత చెర్రీ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ ఓకే చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించారు. ఈవెంట్కు ప్రముఖ దర్శకుడు శంకర్, సుకుమార్, చిరంజీవి, అల్లు అరవింద్, బోనీకపూర్,సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్తో పాటు పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. పూజా కార్యక్రమం అనంతరం రామ్చరణ్ మాట్లాడారు. బుచ్చిబాబు రాసిన కథ తనకెంతో నచ్చిందన్నారు. ప్రేక్షకులు తప్పకుండా ఎంటర్టైన్ అవుతారని చెర్రీ అన్నారు. కాగా.. ఉప్పెన తర్వాత బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తోన్న చిత్రమిదే. స్పోర్ట్స్ డ్రామాగా గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రామ్చరణ్ పాత్ర పవర్ఫుల్గా ఉండనుంది. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన జాన్వీకపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతమందించనుండగా... మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాను వర్కింగ్ టైటిల్ ఆర్సీ16తో రూపొందించనున్నారు. The stunning #RC16 pair looks soo adorable 😍✨@AlwaysRamCharan #JanhviKapoor #RC16PoojaCeremony #GameChanger pic.twitter.com/cdmMcnLajZ — Aℓω︎α︎yѕ🕊️ (@ALWAYSRAM16) March 20, 2024 They Called him a Mad Mann 🔥#RC16 #RC16PoojaCeremony pic.twitter.com/QipGxd9nzx — Raees (@RaeesHere_) March 20, 2024 -
భిన్న ఉపాధి...తొలి మహిళా షిప్ సర్వేయర్
స్త్రీలు సముద్రయానంలో పని చేయడానికి వెనుకాడతారు.సముద్రం మీదకు వెళ్లడానికి ధైర్యమున్నా కుటుంబాలు అంగీకరించవు. కాని పూజా ఛతోత్ దేశంలో మొదటి మహిళా షిప్ సర్వేయర్ కాగలిగింది.ఒక షిప్ తయారీ మొదలైనప్పటి నుంచీ అది సముద్రం మీద చేసే ప్రయాణం వరకూ అన్ని ప్రమాణాలు పాటించేలా చూసే ఉద్యోగమే షిప్ సర్వేయర్. పూజా ఛతోత్ పరిచయం. భారీ నౌక ప్రయాణిస్తూ ఉంటుంది. కనుచూపు మేరా నీలి రంగు సముద్రం తప్ప వేరే ఏమీ ఉండదు. ఉప్పునీటి గాలులు ముఖాన తాకుతుంటాయి. ఆ నౌక సముద్రయానానికి సురక్షితం అనే ఆమోదం తెలిపిన షిప్ సర్వేయర్ డెక్ మీద నిలబడి డ్యూటీ సమర్థంగా చేస్తున్నాననే తృప్తితో చిరునవ్వు చిందిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? పూజా ఛతోత్ను అడగాలి. ఆమె ఇప్పుడు బ్రిటన్కు చెందిన ప్రఖ్యాత సముద్రయాన సంస్థ ‘లాయెడ్స్ రిజిస్టర్’లో షిప్ సర్వేయర్గా పని చేస్తోంది. ఇతర దేశాలలో షిప్ సర్వేయర్లుగా మహిళలు ఇదివరకే పని చేస్తున్నా మన దేశంలో పూజా ఛతోత్ మాత్రమే తొలి మహిళా సర్వేయర్ కాగలిగింది. చిన్నప్పటి ప్రభావం పూజా ఛతోత్ది కేరళలోని కన్నూర్ జిల్లా. అక్కడి ‘ఎజిమల’ అనే చోట ఆసియాలోనే అతి పెద్దదైన భారత నావెల్ అకాడెమీ ఉంది. నావెల్ కేడెట్ల శిక్షణ అక్కడే జరుగుతుంది. బాల్యంలో తల్లిదండ్రులతో కలిసి అకాడెమీని సందర్శించిన పూజా శిక్షణలో ఉన్న నావెల్ కేడెట్లను చూసి స్ఫూర్తి పొందింది. ముఖ్యంగా చాలామంది పురుష కేడెట్ల మధ్య ఒకే ఒక మహిళా ఆఫీసర్ను చూసింది పూజ. అప్పుడే ఆ ఆఫీసర్లాగానే తానూ సముద్రం మీద పని చేసే ఉద్యోగం చేయాలని అనుకుంది. ‘నేను హైస్కూల్ చదువుతున్నప్పుడే అనుకున్నాను ఆఫీసులో ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు పని చేసే ఉద్యోగం చేయకూడదని’ అంది పూజ. నావెల్ ఆర్కిటెక్చర్ చదివి... సముద్రయాన రంగంలో పని చేయాలనుకున్నది పూజ. కొచ్చిలో నావెల్ ఆర్కిటెక్చర్ను 2020లో పూర్తి చేసింది. ఆ తర్వాత ఒక మెరైన్ కంపెనీలో ట్రయినీ నావెల్ ఆర్కిటెక్ట్గా చేరింది కాని ఆ పని రుచించలేదు. సముద్రపుగాలి తగలాలి అనుకుంది. ఆ సమయంలోనే తండ్రి స్నేహితుడొకడు షిప్ సర్వేయర్ ఉద్యోగం గురించి తెలిపాడు. అయితే ఆ రంగంలో స్త్రీలు ఇప్పటి దాకా లేరు. ‘నువ్వు మొదటిదానివి ఎందుకు కాకూడదు’ అన్నాడు తండ్రి. ఆ ్రపోత్సాహంతో లాయెడ్స్ రిజిస్టర్లో షిప్ సర్వేయర్గా ఉద్యోగం సంపాదించింది పూజ. రెండేళ్ల శిక్షణ షిప్ సర్వేయర్ మానసిక బలం, శారీరక సామర్థ్యం అవసరమయ్యే ఉద్యోగం. నౌక తయారవుతున్నప్పటి నుంచి సముద్రం మీదకు చేరే వరకూ చేరాక కూడా అన్ని నిర్మాణ, సాంకేతిక విభాగాలూ నిర్ణీత ప్రమాణాలు పాటిస్తున్నాయా లేదా చూడటమే ఈ ఉద్యోగం. నేల మీదా, సముద్రం మీదా పని ఉంటుంది. ఇందుకు కఠినమైన శిక్షణ అవసరం. లాయెడ్స్ రిజిస్టర్ సంస్థ ఆమెకు రెండేళ్లు శిక్షణ ఇచ్చింది. నౌకను తయారు చేసే మెటీరియల్ సర్వే శిక్షణ ముంబైలో తీసుకుంటే తయారీ విధానం సర్వే శిక్షణ కొచ్చిలో, గోవాలో తీసుకుంది. టెక్నికల్ శిక్షణ అంతా వైజాగ్, సింగపూర్లలో జరిగింది. రెండేళ్ల మొత్తం శిక్షణను సమర్థతతో పూర్తి చేయడం వల్ల ఇటీవల ఆమె షిప్ సర్వేయర్గా పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకుంది. పూజను చూసి మరెందరో యువతులు ఈ రంగంలోకి వస్తారు. ఏ రంగమూ మగవారి స్వీయసామ్రాజ్యం కాదని నిరూపిస్తారు. -
Dimple Hayathi: టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి ఇంట్లో పూజలు (ఫొటోలు)
-
సీక్రెట్గా రెండోసారి నిశ్చితార్థం చేసుకున్న స్టార్ హీరోయిన్
మరో హీరోయిన్ పెళ్లికి రెడీ అయిపోయింది. అయితే గతేడాది నవంబరులోనే ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు మరోసారి నిశ్చితార్థం చేసుకుంది. ఏంటి రెండు సార్లు చేసుకుందా అనుకుంటున్నారా? నిజమే, ఇందుకు సంబంధించిన ఫొటోల్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంతకీ ఎవరీ బ్యూటీ? పెళ్లి కొడుకు ఎవరనేది ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: ఈ ప్రేమ ఎప్పటికీ ప్రత్యేకమే: హీరోయిన్ సమంత) ఉత్తరాది సినిమాల్ని ఓటీటీల్లో చూసేవారికి మరాఠీ హీరోయిన్ పూజా సావంత్ కాస్త పరిచయమే. ఎందుకంటే డ్యాన్సర్గా కెరీర్ ప్రారంభించిన ఈమె.. 2010 నుంచి ఇండస్ట్రీలో ఉంది. ఇప్పటివరకు దాదాపు 20కి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. పలు టీవీ షోల్లో న్యాయనిర్ణేతగానూ వ్యవహరించింది. అలాంటిది గతేడాది నవంబరు చివర్లో ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించింది. కాకపోతే అప్పుడు నిశ్చితార్థం ఎక్కడో ఐలాండ్లో జరగ్గా.. ఇప్పుడు మాత్రం ఇరువురు కుటుంబ సభ్యుల మధ్య మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం జరిగింది. అబ్బాయి విషయానికొస్తే.. ఇతడి పేరు సిద్దేశ్ చవన్. ఆస్ట్రేలియాలో ఓ ఫైనాన్స్ కంపెనీకి ఇతడు ఓనర్ అని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఫొటోలు మాత్రమే పోస్ట్ చేశారు. అయితే త్వరలోనే పెళ్లి ఉండొచ్చని తెలుస్తోంది. సహా నటీనటులు అందరూ ఈమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'హనుమాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) View this post on Instagram A post shared by Pooja Sawant (@iampoojasawant) -
'శ్రీ పంచమి'కి ఆ పేరు ఎలా వచ్చింది? ఆ రోజే అక్షరాభ్యాసాలు ఎందుకు?
ప్రకృతిలో జరిగే మార్పులకు సూచనగా మనకు కొన్ని పండుగలు ఏర్పడ్డాయి. అలాంటి వాటిలో శ్రీపంచమి ఒకటి. మాఘ శుద్ధ పంచమినాడు ఈ పండుగను జరుపుకుంటారు. దీనిని సరస్వతీ జయంతి, మదన పంచమి అని కూడా అంటారు. ఇది రుతు సంబంధమైన పర్వం. వసంత రుతువుకు స్వాగతం పలికే పండుగగా శాస్త్రాలలో పేర్కొనబడింది. వసంత రుతువు రాకను భారతదేశమంతటా వసంత పంచమి పండుగగా ఉత్సాహంగా జరుపుకుంటారు. "మాఘ శుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమవుతుంది కనుక ఈ మాఘ శుద్ధ పంచమిని ‘వసంత పంచమి’గా వ్యవహరిస్తారు. అయితే ఈ పంచమినే రకరకాల పేర్లతో పిలుస్తారు. ఎందుకని? ఈ తిథికి ఎందుకంత ప్రాముఖ్యత? రుతు సంబంధమైన పండుగ కావడంతో, దీనికి ఆ పేరు వచ్చింది. ఈ పర్వదినాన్ని 'శ్రీపంచమి', 'మదన పంచమి', 'సరస్వతీ జయంతి' అనే పేర్లతోనూ పిలుస్తారు. మకర సంక్రాంతి తరవాత వసంత రుతువు లక్షణాలు ప్రకృతిలో కనిపిస్తాయి. చెట్లు చిగురించడం, పూలు పూయడం వంటి శుభ సంకేతాలు ఇదే రుతువులో ఆరంభమవుతాయి. వసంతుడికి ఆహ్వానం పలుకుతూ ప్రకృతి కాంత శోభాయమానంగా విరాజిల్లుతుంది. జ్ఞానానికి అధిదేవత సరస్వతీ దేవి. ఆమె జ్ఞాన స్వరూపిణి. శాస్త్రం, కళలు, విజ్ఞానం, హస్తకళలు మొదలైనవాటిని చదువుల తల్లి సరస్వతీదేవి అంశలుగా మన పెద్దలు భావించారు. సృజనాత్మక శక్తికీ, స్ఫూర్తికీ కూడా వీణాపాణి అయిన సరస్వతిని సంకేతంగా చెబుతారు మాఘమాసం శిశిర ఋతువులో వసంతుని స్వాగత చిహ్నమూగా ఈ పంచమిని భావిస్తారు. ఋతురాజు వసంతుడు కనుక వసంతుని ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదనుణ్ణి అనురాగవల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయటం కూడా శ్రీపంచమినాడే కనబడుతుంది. వీరి ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి. దానివల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడుతాయి. వసంతం అందరికీ ఎనలేని ఆనందం కలిగిస్తుంది. హరి పూజ, నూతన వస్త్రధారణను విధులుగా భావిస్తారు. రంగులు చల్లుకుంటారు. కొత్త ధాన్యం వచ్చే రోజులు కాబట్టి, బియ్యంతో పాయసం వండి నైవేద్యం పెడతారు. ఈ వసంత పంచమిని రాజస్థాన్లో విశేషంగా ఆచరిస్తారు. వంగ దేశంలో 'శ్రీ పంచమి' పేరుతో నిర్వర్తిస్తారు. సరస్వతి జన్మించిన రోజుగా భావించి, ఆ దేవిని భక్తి ప్రపత్తులతో కొలుస్తారు. గ్రంథాలను ఆ ప్రతిమ దగ్గర ఉంచి, పూజించి, సాయంకాలం వూరేగింపుగా వెళ్లి జలాశయంలో నిమజ్జనం చేస్తారు. రోమనులు సైతం పూజించేవారు.. ప్రాచీన కాలంలో రోమనులు సైతం ఈ ఉత్సవం జరిపేవారని చరిత్ర చెబుతోంది. ‘బ్రహ్మ వైవర్త పురాణం’ వసంత పంచమినాడే సరస్వతిని పూజించాలంటుంది. రతీదేవికి, కామదేవుడికి, వసంతుడికి పూజలు చేస్తారు. ముగ్గురూ ఒక్కరోజునే పూజలందుకుంటారు. వసంతోత్సవాల్ని వేర్వేరు పేర్లతో, పలు విధాలుగా ఆచరిస్తుంటారు. ఇది శీతకాలానికి, వేసవి కాలానికి సంధికాలం కావడంతో ప్రజలకు ఈ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కొత్త పంటలు వచ్చే కాలం ఇది. పైగా పశువులకు గ్రాసం పుష్కలంగా లభించేది కూడా ఈ కాంలోనే. ఇక వసంత పంచమినాడే సరస్వతీ జయంతి కావడంతో, ఈ పర్వదినం అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అక్షరానికి ఆమె అధిదేవత. ప్రణవ స్వరూపిణి, జ్ఞానానంద శక్తి, లౌకిక-అలౌకిక విజ్ఞాన ప్రదాయిని ఆమె. శ్రీవాణి కృప లేకుంటే, లోకానికి మనుగడే లేదు. వాగ్దేవి ఉపాసన వల్ల వాల్మీకి రామాయణ రచన చేశాడంటారు. శారద దీక్ష స్వీకరించి, వ్యాసుడు వేదవిభజన చేయగలిగాడంటారు. ఆదిశేషువు, బృహస్పతి, ఆదిశంకరులు, యాజ్ఞవల్క్యుడు వంటి ఎందరో శారదానుగ్రహం కారణంగా జ్ఞాన సంపన్నులయ్యారు. నాటి వ్యాసపురే నేటి బాసరగా.. వ్యాసుడు గోదావరీ తీరాన సైకతమూర్తి రూపంలో వాణిని ప్రతిష్ఠించాడని పురాణ కథనం. ఆ క్షేత్రమే వ్యాసపురిగా, బాసరగా ప్రసిద్ధి చెందింది. సరస్వతి శబ్దానికి ‘ప్రవాహ రూపంలో ఉండే జ్ఞానం’ అని అర్థం. వసంత రుతు శోభలకు వసంత పంచమి స్వాగతం పలుకుతుంది. శుద్ధ సత్వగుణ శోభిత సరస్వతి, శ్వేత వస్త్రాలంకృతగా హంస వాహినిగా తామర పుష్పం మీద కొలువుతీరి జ్ఞాన క్రతువు నిర్వహిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞానరాశులు అవుతారు. సరస్వతి ఆరాధన వల్ల వాక్సుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్భుద్ధినీ పొందుతారు. మేధాశక్తి, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు. అంత మహిమాన్వితమైన ఈ రోజునే చిన్నారులకు అక్షరాభ్యసం చేయిస్తే చక్కగా చదువుకుని వృద్ధిలోకి వస్తారని భక్తుల నమ్మకం. వేదాలు సరస్వతీ మాత నుంచే వెలువడ్డాయని ‘గాయత్రీ హృదయం’ గ్రంథం అభివర్ణించింది. సరస్వతీనది అంతర్ముఖీనమై గంగ యమునలతో కలిసి ‘త్రివేణి’ గా విరాజిల్లింది. దేశ విదేశాల్లో గీర్వాణి ఆరాధనలందుకుంటోంది. సరస్వతీదేవి వద్ద ఆయుధాలుండవు. అలాగే గ్రీకులు, రోమనులు ఆమెను జ్ఞానదేవతగా పూజించేవారు. వసంత పంచమిని విద్యారంభ దినంగా పరిగణిస్తారు. జ్ఞానశక్తికి అధిష్టాన దేవత- సరస్వతీమాత. జ్ఞాన, వివేక, దూరదర్శిత్వ, బుద్ధిమత్తత, విచార శీలత్వాదుల్ని అనుగ్రహిస్తుందంటారు. సరస్వతీదేవి పరమ సాత్వికమూర్తి. అహింసాదేవి. అమెకు యుద్ధం చేసే ఆయుధాలు ఏమీ ఉండవు. బ్రహ్మ వైవర్త పురాణం సరస్వతీ దేవిని అహింసకు అధినాయికగా పేర్కొంది. ధవళమూర్తిగా పద్మంపై ఆసీనురాలై ఉన్న వాగ్దేవి మందస్మిత వదనంతో కాంతులీనుతూ ఆశ్రితవరదాయినిగా దర్శనమిస్తుంది. సరస్వతి శబ్దానికి ‘ప్రవాహ రూపంలో ఉండే జ్ఞానం’ అని అర్థం. శుద్ధ సత్వగుణ శోభిత సరస్వతి, శ్వేత వస్త్రాలంకృతగా హంస వాహినిగా తామర పుష్పం మీద కొలువుతీరి జ్ఞాన క్రతువు నిర్వహిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ప్రవాహం చైతన్యానికి ప్రతీక. జలం జీవశక్తికి సంకేతం. నీరు సకల జీవరాశికి శక్తిని అందిస్తుంది. ఉత్పాదకతను పెంపొందిస్తుంది. ఈ ఉత్పాదకత వసంతరుతువు నుంచి ఆరంభమవుతుంది. ఆ ఉత్పాదక శక్తికి ప్రతిఫలమే సరస్వతి. ఉత్పాదకుడైన, సృష్టికర్త బ్రహ్మకు శారదే శక్తిదాయిని. అందువల్లే ఈ వసంత పంచమిని విద్యారంభ దినంగా పరిగణించారు మన పెద్దలు. (చదవండి: భవ్య రామమందిరంలోని బాలరాముడి కళ్లను వేటితో చెక్కారో తెలుసా!) -
Gyanvapi: జ్ఞానవాపిలో 30 ఏళ్ల తర్వాత మొదలైన పూజలు
-
సాయిపల్లవే అనుకుంటే ఆమె చెల్లి ఇంకా తోపు! వీడియో వైరల్
హీరోయిన్స్ అన్నాక అన్ని పాత్రలు చేయాలి.. అన్ని రకాల డ్రెస్సులూ ధరించాల్సి ఉంటుంది. కానీ కొందరు మాత్రం ఎక్స్పోజింగ్ డ్రెస్సుల జోలికి అస్సలు పోరు. ట్రెడిషనల్ దుస్తుల్లోనే కనిపిస్తూనే ఉంటారు. అందులో సాయి పల్లవి ఒకరు. సహజ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ అందరు హీరోయిన్లలా ఏ సినిమా పడితే ఆ సినిమా చేయదు. కథ నచ్చాలి, తన పాత్రలో దమ్ముండాలి.. అప్పుడే ఆ సినిమాకు సంతకం చేస్తుంది. అందుకే చాలామందికి ఈ హీరోయిన్ స్పెషల్. త్వరలో పెళ్లి ఇక ఈ బ్యూటీ ఇంట త్వరలో బాజా భజంత్రీలు మోగనున్న సంగతి తెలిసిందే! సాయిపల్లవి సోదరి పూజా కన్నన్ పెళ్లి పీటలెక్కనుంది. ఈ మధ్యే ఎంతో గ్రాండ్గా నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకలో కూడా హీరోయిన్, ఆమె సోదరి ఎంతో సింపుల్గా కనిపించారు. అంతేనా.. మాస్ పాటలు పెట్టుకుని ఫ్యామిలీ మొత్తం తీన్మార్ డ్యాన్స్ చేసింది. సాయిపల్లవే అనుకుంటే ఆమెను మించిపోయేలా స్టెప్పులేసింది పూజా. అక్కను మించిపోయిందిగా కాబోయే భర్తతో కలిసి ఫుల్ జోష్తో చిందేసింది. ఈ వీడియోను పూజా సోషల్ మీడియాలో షేర్ చేయగా క్షణాల్లో వైరల్గా మారింది. 'నిశ్చితార్థాన్ని ఇంత బాగా ఎంజాయ్ చేస్తారా..', 'ఎంగేజ్మెంట్ చేసుకుంటే మీలా చేసుకోవాలి..', 'వామ్మో.. ఈ వీడియోలో పూజా.. సాయిపల్లవిని డామినేట్ చేసింది' అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. సినిమాల సంగతి.. 'ప్రేమమ్' అనే మలయాళ చిత్రంతో వెండితెరకు హీరోయిన్గా పరిచయమైంది సాయిపల్లవి. ఆ తర్వాత తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించింది. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా, తెలుగులో 'తండేల్' చేస్తోంది. View this post on Instagram A post shared by Pooja Kannan (@poojakannan_97) చదవండి: బాటిల్ కోసం వ్యక్తిని చెప్పుతో కొట్టిన పాపులర్ సింగర్.. వీడియో వైరల్ అయోధ్యలోనే పెళ్లి చేసుకుంటానంటున్న నటుడు -
సాయి పల్లవి ఇంట్లో శుభకార్యం.. ఫోటోలు వైరల్!
టాలీవుడ్ హీరోయిన్ సాయిపల్లవి ఇంట వివాహా వేడుకలు మొదలయ్యాయి. ఆమె సోదరి, నటి పూజ కన్నన్ పెళ్లి వివాహం త్వరలో జరగనుంది. తన స్నేహితుడు వినీత్ను ఆమె పెళ్లాడనుంది. కొన్నేళ్లుగా పూజ, వినీత్ ప్రేమయాణం కొనసాగిస్తున్నారు. వీరి ప్రేమకు రెండు కుటుంబాల పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో త్వరలోనే వీరి వివాహం జరగనుంది. (ఇది చదవండి: ప్రభాస్ సలార్.. ప్రశాంత్ నీల్పై ప్రశంసలు.. ఎందుకంటే?) ఈ నేపథ్యంలోనే ఎంగేజ్మెంట్కు ముందు జరిగిన సెలబ్రేషన్స్కు సంబంధించిన ఫోటోలను పూజ తన ఇన్స్టాలో షేర్ చేశారు. మెహందీ పెట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. కాగా.. సాయిపల్లవి సోదరిగా పూజ సౌత్ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. కోలీవుడ్ చిత్రం ‘చితిరై సెవ్వానం’తో ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో పూజ నటనకు ప్రశంసలు అందుకున్నారు. జీవిత భాగస్వామిని పరిచయం చేస్తూ ఇటీవల ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. View this post on Instagram A post shared by Pooja Kannan (@poojakannan_97) -
ఆలయం ఏదైనా మీ ఇంట్లోనే టికెట్
సాక్షి, అమరావతి:ఏడాదిన్నర క్రితం దేవదాయ శాఖ పరిధిలోని 8 ప్రధాన ఆలయాల్లో ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఆన్లైన్ సేవలు సూపర్ సక్సెస్ అయ్యాయి. 8 ఆలయాల్లో ఏడాదిన్నర కాలంలో 10 లక్షల మందికి పైగా భక్తులు ఆన్లైన్ సేవల్ని వినియోగించుకున్నారు. భక్తుల రద్దీ బాగా ఎక్కువగా ఉండే రోజుల్లో సైతం భక్తులు 30 నుంచి 90 రోజుల ముందుగానే దర్శన టిక్కెట్లు, పూజలు, ఇతర సేవ టికెట్లతో పాటు ఆలయాల్లో అద్దె గదుల కోసం ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. తద్వారా దైవ దర్శనాలకు వెళ్లిన రోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఇష్టదైవాలను కొలిచారు. రాష్ట్ర ప్రభుత్వం 2021 మార్చి 3న మొదటిసారి శ్రీశైలం ఆలయంలో ఆన్లైన్ సేవలను ప్రాథమికంగా ప్రారంభించారు. ఆ తర్వాత 2022 జూలై 21వ తేదీ నుంచి ప్రధాన ఆలయాలైన సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ దుర్గగుడి, పెనుగంచిప్రోలు, కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాల్లో అన్ని రకాల సేవలను పూర్తిస్థాయి ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దశలవారీగా పెద్ద ఆలయాలన్నింటిలోనూ ఈ రకమైన ఆన్లైన్ సేవలను విస్తరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కాగా, ఈ సేవలు ప్రారంభించిన 2022 జూలై 21 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 23 తేదీ వరకు 10,20,943 మంది భక్తులు వినియోగించుకున్నట్టు దేవదాయ శాఖ అధికారులు వెల్లడించారు. కొన్ని ఆలయాలు కొన్ని రకాల సేవలను గరిష్టంగా 30 రోజుల ముందుగా మాత్రమే ఆన్లైన్ అందుబాటులో ఉంచుతుండగా.. ఆలయాలు, అక్కడి సేవల ఆధారంగా గరిష్టంగా 90 రోజుల ముందుగా కూడా ఈ సేవలు పొందే వీలు కల్పించినట్టు దేవదాయ శాఖ అధికారులు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు ఆలయాలకు వెళ్లే భక్తులు భక్తి పారవశ్యంతో దైవ దర్శనం పూర్తి చేసుకునేలా ప్రభుత్వపరంగా అన్ని చర్యలు చేపడుతున్నాం. ఆలయాల పైరవీలు, అక్రమాలకు తావు లేకుండా సేవ, దర్శన టికెట్లు ముందుగా కూడా భక్తులు ఆన్లైన్ ద్వారా పొందేలా ఏర్పాటు చేశాం. ఆలయాల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి ప్రభుత్వ ఖజానా నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దుర్గ గుడికి నిధులు కేటాయించారు. కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) నిధులను పూర్తిస్థాయిలో వినియోగించి పురాతన ఆలయాల పునఃనిర్మాణంతో పాటు కొత్త ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. – కొట్టు సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) అత్యంత సులభ విధానంలో బుకింగ్ ఆలయాల్లో పూజలు, సేవలు, దర్శన టికెట్లు భక్తులు సులభంగా ముందస్తుగానే బుక్ చేసుకోవడానికి వీలుగా దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఆన్లైన్ వెబ్సైట్ను ప్రభుత్వం పూర్తిగా ఆధునికీకరించింది. ఏ ఆలయానికి ఆ ఆలయం కాకుండా అన్ని ఆలయాలకు సంబం«ధించి ఈ రకమైన సేవలను ఒకేచోట నుంచి భక్తులు పొందేలా వెబ్సైట్ను రూపొందించారు. భక్తులు తమ ఫోన్ నంబర్ ఉపయోగించి ఈ సేవలు పొందేలా చర్యలు తీసుకున్నారు. -
ఎడిసన్, సాయిదత్తం పీఠంలో అయ్యప్ప మహా పడి పూజ
-
ఇవాళే కార్తీక పౌర్ణమి! జ్వాలా తోరణం ఎందుకు వెలిగిస్తారు?
సమస్త పాపాలను దగ్ధం చేసే జ్వాలా తోరణం మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశ పెట్టడం వెనుక ఒక కారణం ఉంది. యమలోకంలోకి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం. యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమశిక్ష. ఈ తోరణం గుండా వెళ్లకుండా ఉండాలంటే జ్వాలా తోరణ దర్శనం చేసుకోవాలి అని పెద్దలు చెప్పారు. కార్తీక పౌర్ణమిరోజున సాయంకాలం జ్వాలా తోరణం చేస్తారు ఎందుకు ? కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలా తోరణం. ఏ ఇతర మాసంలోనూ ఇలాంటి ఆచారం మనకు కనబడదు. కార్తీక పౌర్ణమినాడు శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పాతి.. ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు. అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకువచ్చి చుడతారు. దీనికి యమద్వారం అని పేరు కూడా ఉంది. ఈ నిర్మాణంపై నెయ్యి పోసి మంట పెడతారు. ఆ మంట కింద నుంచి పరమేశ్వరుడిని పల్లకిలో అటూ ఇటూ మూడు సార్లు ఊరేగిస్తారు. శ్రీనాథుడు ద్రాక్షారామంలో జరిగే జ్వాలాతోరణ మహోత్సవాన్ని భీమేశ్వర పురాణంలో వర్ణిస్తూ.. "కార్తీక వేళ భీమశంకరుని నగరమందు దూరునెవ్వాడు చిచ్చుర తోరణంబు వాడు దూరడు ప్రాణ నిర్వాణవేళ ఘోర భీకర యమద్వార తోరణంబు..’’ అంటాడు. మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనక ఒక కారణముంది. యమలోకంలోకి వెళ్లినవారికి మొదట దర్శనమిచ్చేది అగ్ని తోరణం. యమలోకానికి వెళ్లిన ప్రతి వ్యక్తీ ఈ తోరణం గుండానే లోపలికి వెళ్లాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష. ఈ శిక్షను తప్పించుకోవాలంటే ఈశ్వరుడిని ప్రార్థించటం ఒకటే మార్గం. అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి మూడు సార్లు అటూ ఇటూ వెళ్లి వస్తారో వారికి ఈశ్వరుడి కటాక్షం లభిస్తుంది. అతనికి యమద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదు. అందుకే అందరూ తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనాలి. దీని వెనక మరో తత్వకోణం కూడా ఉంది. జ్వాలాతోరణం కింద ఈశ్వరుడి పల్లకి పక్కనే నడిస్తే - ‘‘శివా ! నేను ఇప్పటి దాకా చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి. వచ్చే ఏడాది దాకా ఎటువంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తా..’’ అని ప్రతీకాత్మకంగా చెప్పటం. ఆ జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి - ఇంటి చూరులోనో.. గడ్డివాములోనో.. ధాన్యాగారంలోనోపెడతారు.అది ఉన్న చోట్ల భూతప్రేత ఉగ్రభూతాలు ఇంటిలోకి రావని.. ఈ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం... కార్తీకపౌర్ణమి నాడు ఏం చేయాలి? " సమస్త ప్రాణులకూ నేను మహోపకారం చేయగలను కార్తీకపౌర్ణమి నాడు. ఇతర ప్రాణులు చెయ్యలేవు. నేను ఏమి చెయ్యగలను? దీపం తీసుకెళ్ళి ఓ గదిలో పెట్టాననుకోండి కొంత ఫలితం. వీధిలోకి తీసుకువచ్చి దీపం పెట్టాననుకోండి విశేష ఫలితం. యధార్ధానికి శాస్త్రంలో ఏమి చెప్పారంటే ఆ రోజున వీధులలో ఉన్న చెత్త కూడా వెలిగించాలి. కానీ లౌకికాగ్నితో వెలిగించకూడదు. మీ ఇంట దీపం వెలిగించి కార్తీక పౌర్ణమి నాటి ప్రదోషవేళ, " దామోదరమావాహయామి " అనిగాని, " త్రయంబకమావాహయామి " అనిగాని అని, ఆ దీపంతో వెలిగించాలి. ఈ దీపం పెట్టి ఒక్కసారి ఆకాశం వంక చూసి ఈ శ్లోకం చెప్పాలి... కీటాఃపతంగా మశకా శ్చ వృక్షాః జటేస్ధలే... ఫలే ఏ నివసంతి జీవా దృష్ట్వాప్రదీపం నచ జన్మ భాగినః భవతింత్వ స్వపచాహి విప్రాః" ఈ దీపము దీపము కాదు, ఇది త్రయంబకుడు, ఇది దామోదరుడు. కాబట్టి ఈ దీపం వలన మొదటి ఫలితం ఎవరికి వెళ్ళాలంటే కీటకములు, పురుగులు, పతంగాలు, దోమలు, వృక్షాలకు వెళ్ళాలి. కాబట్టి ఈశ్వరా! నీ దీపపు వెలుతురు ఆ చెట్టు మీద పడుతుంది. కాబట్టి దామోదరుడి చెయ్యి దానిమీద పడినట్టే! త్రయంబకుని చెయ్యి దానిమీద పడినట్టే! అది అభ్యున్నతిని పొందాలి. నీటిలో ఉండే చేపలు, కప్పలు, తాబేళ్ళ వంటి వాటిపై ఈ దీపపు వెలుతురు పడినప్పుడు, ఆ ప్రాణులన్నీ కూడా నీ అనుగ్రహాన్ని పొందాలి. అక్కడితో వాటి పాపపుణ్యాలన్నీ నశించుపోవుగాక! ఇక వాటికి జన్మ లేకుండుగాక! ఉదర పోషణార్ధమే బ్రతుకుతున్న భయంకరమైన స్ధితిలో ఉన్న వాడిమీద ఈ దీపము యొక్క కాంతి ప్రసరించి వాడు వచ్చే జన్మలో అభ్యున్నతిని పొందుగాక! నువ్వు ఈ శ్లోకం చెప్పి నమస్కారం చేస్తే పరమేశ్వరుడు ఎంతో ఆనందాన్ని పొందుతాడు. మనం ఒక ఇల్లు కడితే ఆ ఇంట దీపం లేకుండా ఏ ఒక్కరోజు ఉండకూడదు. 365 రోజులూ దీపాలు వెలుగుతూ ఉండాలి. అలా దీపం వెలగకపోతే ఆ దోషం మీకే వస్తుంది. మళ్లీ ఆ ఇంట్లో తిరిగినందుకు ఆ పాపం పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తంగా ఇవ్వబడిన అద్భుతమైన తిధి "కార్తీక పౌర్ణమి". అందుకే కార్తీకపౌర్ణమి నాడు 365 వత్తులు గుత్తిదీపం ఆవునేతిలో ముంచి వెలిగిస్తుంటారు. దీపాలు ఇంటి యజమాని వెలిగించాలి. మా ఆవిడ వెలిగిస్తుంది, నేను టి.వి చూస్తాను అనకూడదు. యజమాని పంచె కట్టుకుని వెళ్ళి దేవాలయంలో దీపం వెలిగించాలి. ఇంట దీపం పెడితే కార్తీకపౌర్ణమి తిధి ప్రధానం. దేవాలయంలో దీపం పెడితే కృత్తికా నక్షత్రం ప్రధానం. (బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరావుగారి ప్రవచనం ఆధారంగా) --డీ. వీ ఆర్ భాస్కర్ (చదవండి: అలవాటుని అధిగమించటం అతికష్టం!) -
'కార్తీకమాసంలో ఇలా చేస్తే సర్వ పాపాలు తొలుగుతాయి'
మాసాల్లో కార్తీకం..యుగాల్లో కృత యుగం..శాస్త్రాల్లో వేదం..తీర్థాల్లో గంగానదికి సమానమైనవి లేవన్నది పురాణ వచనం. అంతటి మహత్యం గల కార్తిక మాసం శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైది. అందుకే భక్తులు వేకువనే చన్నీటి స్నానాలు.. జప, తప నియమాలు..పూజలు.. ఉపవాసదీక్షలు చేస్తారు. కార్తీక మాస విశిష్టతపై ప్రత్యేక కథనం. చిత్తూరు రూరల్: కార్తీక మాసంలో చంద్రుడు కృతికా నక్షత్రంలో ఉండడంతో ఈ నెలకు ఆ పేరు వచ్చింది. ఈ నెల శివకేశవులిద్దరికీ ప్రీతికరం. ఈ నేపథ్యంలో ఊరూరూ హరిహరుల నామస్మరణతో మార్మోగనున్నాయి. రాత్రి వేళల్లో వదీపాల వెలుగులు విరజిమ్మనున్నాయి. ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం వచ్చే నెల 12వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ నెల రోజులు శైవ, వైష్ణవ క్షేత్రాలు భక్తుల సందడితో కిటకిటలాడనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1,197 దేవాలయాలున్నాయి. వీటిలో శివాలయాలు 45 వరకు ఉన్నాయి. ఈ ఆలయాల్లో కార్తిక పూజలు శ్రేష్టంగా జరుగుతుంటాయి. ముఖ్యంగా కార్తీక సోమవారాల్లో ఆలయాలు భక్తులతో కళకళలాడనున్నాయి. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను ఆయా ఆలయ నిర్వాహకులు చేస్తున్నారు. భక్తులు ఇబ్బందులు లేకుండా దీపారాధన చేసేందుకు పనులు పూర్తి చేశారు. కార్తీక స్నానం కార్తీక మాసమంతా తెల్లవారుజామునే లేచి కృతికా నక్షత్రం అస్తమించేలోపు నది, చెరువు, కాలువల్లో కానీ, ఈ వనరులు అందుబాటులో లేకుంటే ఇంట్లో కానీ తలస్నానం చేయాలి.అప్పుడే కార్తీక స్నానం అవుతుంది. ఈ నియమంతో స్నానం చేసి, శివుడు, విష్ణువు, మరే దైవాన్ని అయినా ధ్యానించి, అర్ఘం ఇవ్వడంతో గంగానది, పుష్కర తీర్థాల్లో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతాయి. సర్వ పాపాలు తొలుగుతాయని భక్తుల నమ్మకం. పుణ్యప్రదం.. కార్తీక దీపం భారతీయ సంస్కృతిలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కార్తీక మాసంలో దీపారాధనకే ప్రథమ స్థానం. అందుకే ఇంట్లోకానీ, శివాలయంలో కానీ ప్రాతఃకాలం, సాయంకాలం దీపారాధన చేస్తారు. ఎవరైనా తెలిసికానీ, తెలియకుండా కానీ ఎక్కడైనా సరే దీపం పెడితే వారి పాపాలు హరిస్తాయని పురాణాలు తెలుపుతున్నాయి. దీపం, బంగారం, నవధాన్యాలు, అన్నం దానం చేస్తే సీ్త్రలకు సౌభాగ్యం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే దీపారాధనతో పాటు శివుడికి ప్రత్యేకంగా రుద్రాభిషేకం, లక్షబిల్వార్చ, అమ్మవారికి లక్షకుంకుమార్చన జరిపిస్తారు. వన భోజనం ప్రకృతి ఒడిలో సేదతీరుతూ అప్యాయతలను పంచుకునే అపురూప సందర్భం వనభోజనం కార్తిక మాస ప్రత్యేకం. ఐక్యత సాధనకు ఇది ఎంతో ఉపకరణం. కలిసిమెలసి మసలుకునే తత్త్వం వనభోజన సంబరాలతో అలవడుతుంది. ఈ కార్యక్రమం వనాలపై మన బాధ్యతను గుర్తు చేస్తుంది. ఈ భోజన సంబరంలో పూర్తి సాత్విక వంటకాలనే భుజిస్తారు. కార్తీకం.. ఆచరణ ఇలా కార్తిక మాసంలో మాంసాహారానికి దూరంగా ఉండాలి. తేలికైన ఆహారం భూజించాలి. ఉల్లి, వెల్లుల్లి తినకూడదు. పాలు, పండ్లు భుజించవచ్చు. రాత్రి భోజనం చేయకూడదు. అబద్ధాలు, దైవదూషణ చేయకూడదు. తప్పుడు పనులు చేస్తే పాపమని పురాణాలు చెబుతున్నాయి. పుణ్యఫలం సిద్ధిస్తుంది కార్తీక మాసంలోని ప్రతి రోజు కూడా అత్యంత శ్రేష్టమైనది. కార్తిక మాసం శివకేశవులకు చాలా ప్రీతపాత్రమైనది. తెల్లవారుజామునే ఆలయాలను దర్శించుకుని పూజలు చేయాలి. ఈ మాసంలో శివకేశవులను పూజిస్తే మహాపుణ్యం లభిస్తుంది. ఈ మాసంలో ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలి. ఈ దీపాలు మనిషిలోని అజ్ఞానాన్ని పారద్రోలే జ్ఞాన జ్యోతులు కావాలి. ఈ నెలలో 17న నాగుల చవితి, 18న స్కంధషష్టి, 26న కార్తీకదీపం అతిముఖ్యమైన పండుగలు. –సుధాకర్ గురుక్కల్, వేదపండితులు, చిత్తూరు -
దీపావళిని హిందువుల తోపాటు ఎవరెవరూ జరుపుకుంటారంటే..?
దీపావళిని కేవలం హిందువులు మాత్రమే కాదు వివిధ రకాల మతస్తులు కూడా జరుపుకుంటారు. అందులో కూడా చాలా విభిన్న రకాలుగా ఉంటాయి. ఇక దీపాలు వెలిగించి బాణాసంచాలు కాలుస్తూ దేశవిదేశాల్లో ఘనంగా జరుపుకునే ఈ పండుగను ఏయే మతస్తులు ఏవిధంగా జరుపుకుంటారో చూద్దాం!. ఈ పండగను హిందువులతో పాటుగా బౌద్ధులు, జైనులు,సిక్కులు కూడా వారి వారి మత సంప్రదాయాలను అనుసరించి పాటిస్తారు! కొందరు ఈ పండుగ నుంచి కొత్త సంవత్సరాన్ని కూడా ప్రారంభిస్తారు! ఈ పండగని ఉత్తర భారత దేశంలో ఐదు రోజుల పండుగగా చేస్తారు. దీపావళికి ముందు వచ్చే త్రయోదశిని ధనత్రయోదశిగా వ్యవహరిస్తూ ..ఆ రోజు లక్ష్మీ పూజ చేసే అలవాటు కూడా ఉంది. మనం మూడు రోజుల పండుగగా దీన్ని జరుపుకుంటాం !నరక చతుర్దశి,దీపావళి అమావాస్య,బలి పాడ్యమి అని ఆ మూడు రోజులను వ్యవహరిస్తారు!మొదటి రెండు రోజులు ఆశ్వయుజ మాసంలో చివరన వస్తాయి.మూడవది అయిన బలి పాడ్యమి మాత్రం కార్తీకమాసం మొదటి రోజున జరుపుకుంటారు!నరక చతుర్దశి రోజున తెల్లవారు జామునే నిద్రలేచి,నరకుని సంహరించి ,అభ్యంగన స్నానాలు ఆచరిస్తారు!సత్యభామ సమేతుడై శ్రీ కృష్ణుడు నరక సంహారం కోసం సమాయత్తమయ్యాడు!ఘోరయుద్ధం జరిగింది. చివరకు సత్యభామ చేతిలో నరకాసురుడు మరణించాడు. ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి నాడు రాత్రి రెండు జాములకు నరకాసుర సంహారం జరిగింది!ఆ పౌరాణిక గాధ మీకందరికీ తెలిసిందే! ఈ కధ బహుళ ప్రచారంలో ఉన్నప్పటికీ,ఈ పండుగకు ,దీనికీ సంబంధించిన సరైన నిర్ధారణ ఏ వ్రత గ్రంధాలలోనూ లేదు! నిజానికి దీని అర్ధం 'నరకం'నుండి విముక్తి పొందాలని!అయితే ,దానికి నరకాసురిడి పేరుని అన్వయించి నరక చతుర్దశిగా పండుగను చేసుకుంటున్నారు!ఈ పండుగను దేశమంతా ఎంతో ఘనంగా చేసుకుంటారు! కొత్త బట్టలు ధరించి,మిఠాయిలు పంచి, దీపాలతో గృహాలను అలంకరించి--ఎంతో దేదీప్యమానంగా ఈ పండుగను జరుపుకుంటారు. వ్యాపారులు ,లక్ష్మీపూజ చేసి వ్యాపార స్థలాలను కూడా రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించి ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. కొత్తగా పెళ్ళైన అల్లుళ్ళు అత్తవారింటికి రావటం కూడా ఆనవాయతీ ఉంది! ఈ పండుగకు దేశం మొత్తం మీద అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, బ్యాంకులకు, విద్యా సంస్థలకు సెలవు దినాలుగా ప్రకటిస్తారు!. ఈ దీపాలు వెలిగించటం వెనక ఒక ఆధ్యాత్మిక ఉద్దేశ్యం కూడా లేకపోలేదు!. దుర్గా దీపావళి..! మనలో ఉన్న అజ్ఞాన తిమిరాన్ని బయటికి త్రోలి,జ్ఞానజ్యోతిని వెలిగించుకోవాలని దీని ఉద్దేశ్యం. దీపావళి అంటే దీపముల వరుస అని అర్ధం. శ్రీరామచంద్రుడు 14 ఏండ్ల అరణ్యవాసం తర్వాత ఈ రోజున మళ్ళీ అయోధ్యలో కాలు పెట్టాడు. విజయదశమి రోజున రావణ సంహారం జరిగింది. పశ్చిమ బెంగాల్ ప్రజలు ఈ రోజు దీపావళి పండుగతో పాటుగా కాళీపూజను కూడా జరుపుకుంటారు. వారు ఈ పండుగను దుర్గా దీపావళి అని కూడా పిలుస్తారు. ఈ దీపావళి పండుగ రోజుల్లోనే అశోక చక్రవర్తి బౌద్ధమతాన్ని స్వీకరించటం చేత బౌద్ధులు కూడా ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. జైన మత స్థాపకుడైన మహావీరుడు నిర్యాణం చెందిన రోజు కూడా ఈ దీపావళి పండుగ రోజుల్లోనే రావటం వల్ల, జైనులు కూడా ఆయనకు స్మ్రుతి చిహ్నంగా దీపాలను వెలిగించి ఈ పండుగను చేసుకుంటారు! సిక్కుల తొమ్మిదవ గురువైన గురు హర్ గోవింద్ ఈ రోజునే గ్వాలియర్ చెరసాల నుంచి విడుదలయిన రోజు కావటం చేత, సిక్కు మతస్తులు కూడా దీపాలు వెలిగించి ఈ పండుగను జరుపుకుంటారు. దీపాలను వెలిగించటం భౌతికంగానే కాకుండా ఆధ్యాత్మికతను కూడా సంతరించుకుంది. దురదృష్టం ఏమిటంటే,కొందరికి మాత్రమే ఇది దీపావళి,చాలామంది పేదలకు ఇది అమావాస్య !అందరి కళ్ళల్లో ఆనందాన్ని చూసే అసలు దీపావళి త్వరలోనే రావాలని భగవంతుని వేడుకుందాం! --కూర్పరి - శారదాప్రసాద్ (చదవండి: దీపావళి లక్ష్మీ పూజా విధానం, వ్రత నియమాలు.!) -
దీపావళి లక్ష్మీ పూజా విధానం, వ్రత నియమాలు.!
విష్ణువు శక్తికి, మాయకు కారణం లక్ష్మీ పక్కనుండటమే అంటారు. భూదేవి కూడా ఆమె మరో అంశమని చెబుతారు. దేవీ మహాత్మ్యంలో మహాశక్తియే మహాలక్ష్మీగా చెప్పబడింది. ఆమెను అష్ట భుజ మహాలక్ష్మిగా వర్ణించారు. త్రిమూర్తులలో ఒకరైన శ్రీమహావిష్ణువు దేవేరి, భృగుమహర్షి కుమార్తె అయిన లక్ష్మీ దుర్వాసుని శాపంతో క్షీరసాగర మథనంలో ఉద్భవించింది. జైన మతంలో కూడా మహాలక్ష్మి తన భక్తులను కష్టాల నుంచి కాపాడి వారికి సిరిసంపదలను కలుగజేస్తుందని నమ్ముతారు. ఋగ్వేదకాలంలో అదితి,రాకా, పురంధ్రి మొదలగు దేవతలను మాతృమూర్తులుగా ఆరాధించారు. అధర్వణ వేదం ‘సినీవాలి’ అనే దేవతను ‘విష్ణుపత్ని’గా నుతించింది. వీరిలో ఏ దేవత లక్ష్మీదేవికి మాతృరూపమో తెలియడంలేదు. లక్ష్మీ దేవి గురించి వివిధ గాధలు పురాణాలలోను, ఇతిహాసాలలోను ఉన్నాయి. శ్రీ మహా విష్ణువునకు సృష్ట్యాది నుండి లక్ష్మి తోడుగానే ఉన్నదనిm, ఆమె నిత్యానపాయిని ఎన్నడూ విడివడనిది అని అర్థం. లక్ష్మీనారాయణులు వేరు వేరు కారని అని శ్రీవైష్ణవ సంప్రదాయంలో చెబుతారు. పురాణాలు, ఇతిహాసాలలో లక్ష్మీదేవి గురించి వివిధ రకాలుగా పేర్కొన్నారు. సృష్టి ఆరంభం నుంచే శ్రీమహావిష్ణువునకు లక్ష్మీదేవి తోడుగానే ఉందని, 'నిత్యానపాయిని' లక్ష్మీనారాయణులు వేరు వేరు కాదని కొందరు అంటారు. సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మీదేవిని జగన్మాత ప్రసాదించిందని దేవీ భాగవతంలో పేర్కొన్నారు. లక్ష్మీదేవి ఓసారి విష్ణువు నుంచి వేరు కావడంతో ఆయన శక్తి హీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆదేశాలతో భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మీదేవి ఆయనకు కుమార్తెగా జన్మించింది. అనంతరం విష్ణువుతో వివాహం చేశాడు. కాబట్టి లక్ష్మీదేవిని 'భార్గవి' అని కూడా అంటారు. దీపం జ్యోతి పరబ్రహ్మమ్, దీపం సర్వతమోహరమ్, దీపేన సాధ్యతే సర్వమ్, సంధ్యా దీపం నమామ్యహమ్. ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటాం. నరక చతుర్దశి తర్వాతి రోజే దీపావళి. వరాహస్వామికి , భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. లోకకంటకుడైన నరకుడు విష్ణువు చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా భూదేవి వరం పొందుతుంది. ఇక ఈ దీపావళి పర్వదినాన లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకునేలా ఆచరించాల్సిన పూజా విధానం ఏంటంటే.. లక్ష్మీ దేవిని వినాయకుడిని.. దీపావళి రోజు లక్ష్మీదేవిని విధిగా పూజించాలి. సంపద, శ్రేయస్సుకు దేవతగా చెప్పుకునే లక్ష్మీని పూజించేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి. సాయంత్రం వేళలో పూజ ప్రారంభించాలి. దీపావళి ప్రతి పూజలోనూ వినాయకుడిని ఆరాధించడం సంప్రదాయం. లక్ష్మీదేవిని వినాయకుడిని కలిపి పూజిస్తారు. లక్ష్మీదేవి పూజలో భాగంగా ముందుగా పసుపుతో వినాయకుడిని పూజిస్తారు. దీపం వెలిగించి ఈ కింది మంత్రంతో పూజ ప్రారంభించాలి. ప్రాణ ప్రతిష్ఠ ‘శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే బెల్లం ముక్కను నివేదన చేస్తూ ఓం ప్రాణాయస్వాహా, ఓం అపానాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అసునీతే పునరస్మా సుచక్షుః పునః ప్రాణ మిహనోధేహి భోగం జ్యోక్పశ్యేమ సూర్య ముచ్చరంత మనమతే మృడయానస్వస్తి అమృతమాపః ప్రాణానేన యధాస్థాన ముపహ్యయతే రక్తాం భోధిస్థపోతోల్లసదరుణ సరోజాధిరూఢాకరాబ్జైః పాశంకోదండ మిక్షూద్భవ మళిగుణమప్యం కుశం పంచబాణాన్ బిబ్రాణా సృక్కపాలం త్రిణయనవిలసత్ పీన వక్షోరుహాఢ్యా దేవీబాలార్కవర్ణాభవతు సుఖకరీ ప్రాణశక్తిః పరానః పై మంత్రాన్ని చదువుతూ ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి. కలశ స్థాపన వేదిక మధ్యలో ఎర్రటి వస్త్రాన్ని వేసి దాని మీద ధాన్యాన్ని పోసి కలశాన్ని ఉంచాలి. బంగారం, వెండి, రాగి పాత్రను కలశంగా పెట్టి అందులో మూడు భాగాలు నీటిని పోయాలి. కలశంలో మామిడి ఆకులను వేయాలి. వేదిక మీద పోసిన ధాన్యంలో తామర పువ్వును గీసి లక్ష్మీ విగ్రహాన్ని ఉంచాలి. అలాగే ఒక పళ్లెంలో కొన్ని నాణేలను ఉంచాలి. తరువాత కలశాన్ని కుంకుమతో అలకరించి ఈ కింది మంత్రాన్ని చదువుకోవాలి. ‘గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య’ లక్ష్మీదేవి అధాంగ పూజ చంచలాయై నమః పాదౌ పూజయామి చపలాయై నమః జానునీ పూజయామి పీతాంబర ధరాయై నమః ఊరూ పూజయామి కమలవాసిన్యై నమః కటిం పూజయామి పద్మాలయాయై నమః నాభిం పూజయామి మదనమాత్రే నమః స్తనౌ పుజయామి లలితాయై నమః -భుజద్వయం పూజయామి కంబ్కంఠ్యై నమః- కంఠం పూజయామి సుముఖాయై నమః- ముఖం పూజయామి శ్రియై నమః ఓష్ఠౌ పుఅజయామి సునాసికాయై నమః నాసికం పూజయామి సునేత్రాయై నమః ణెత్రే పూజయామి రమాయై నమః కర్ణౌ పూజయామి కమలాలయాయై నమః శిరః పూజయామి ఓం శ్రీలక్ష్మీదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి ఈ కింది మంత్రాన్ని పఠిస్తూ దీపం వెలిగించాలి ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఘృతాక్తవర్తి సంయుక్తం అంధరాశి వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహణ ముదితాభవ శ్రీలక్ష్మీదేవ్యై నమః దీపం దర్శయామి. లక్ష్మీ దేవికి తిలకాధారణ చేసి విగ్రహం ముందు పూలు, కుంకుమ, పసుపు, గంధం, నైవేద్యం, పండ్లు, కొబ్బరి, మొదలైనవి సమర్పణలు ఉంచాలి. అలాగే బంగారు, వెండి ఆభరణాలు, ముత్యాలు, నాణేలను కూడా సమర్పించవచ్చు. లక్ష్మీదేవికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత శుద్దోదక స్నానం చేయాలి. ఆభరణం, ముత్యాన్ని నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేయాలి. విగ్రహాన్ని వస్త్రంతో తుడిచి కలశంలో పెట్టాలి. ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తరం, శ్రీ సూక్తం మీ శక్తి కొద్ది స్తోత్రాలను చదివి, దీపం , దూపంలను సమర్పించిన అనంతరమే నైవైద్యం సమర్పించాలి. ఈ క్రింది మంత్రం చదువుతూ ప్రదక్షిణలు చేయాలి. యానకాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ త్రాహిమాం కృపయా దేవి శరణాగత వత్సల అన్యథా శరనం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష మహేశ్వరి శ్రీలక్ష్మీదేవ్యై నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. చివరిగా సాష్టాంగ నమస్కారం నమస్తే లోకజనని నమస్తే విష్ణు వల్లభే పాహిమాం భక్తవరదే శ్రీలక్ష్మ్యైతే నమో నమః శ్రీలక్ష్మీదేవ్యై నమః సాష్టాంగనమస్కారన్ సమర్పయామి సంధ్యాసమయంలో ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనె/కొబ్బరి నూనెతో దీపాలను ఇంటిముందర ఓ వరస క్రమంలో వెలిగించాలి. (చదవండి: వెలుగుల ఉషస్సు) -
కొత్తింటికి చేరిన భగవంత్ కేసరి భామ.. భర్తతో కలిసి పూజలు!
మగధీర సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఆ తర్వాత స్టార్ హీరోలందరి సరసన నటించింది. ఇటీవలే బాలకృష్ణ సరసన భగవంత్ కేసరి సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించింది. దసరా కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల కీలక పాత్ర పోషించింది. కాగా.. 2020లో తన ప్రియుడు గౌతమ్ కిచ్లును పెళ్లాడిన భామ కొన్నేళ్ల పాటు వెండితెరకు దూరమైంది. గతేడాదిలోనే ఈ జంటకు ఓ కుమారుడు జన్మించారు. తమ ముద్దుల కుమారుడికి నీల్ అనే పేరు పెట్టారు. ప్రస్తుతం మళ్లీ సినిమాలతో బీజీగా ఉంటోన్న ముద్దుగుమ్మ.. తాజాగా కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. తన భర్త, కుమారుడితో కలిసి గృహ ప్రవేశం చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను కాజల్ తన ఇన్స్టాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాజల్ తన ఇన్స్టాలో రాస్తూ..'నేను ఈ విషయాన్ని మీతో పంచుకోవడం చాలా భావోద్వేగాలతో ముడిపడి ఉంది. మా పవిత్రమైన కుటుంబ కోసం ఈ వారంలోనే గృహ ప్రవేశానికి సంబంధించిన పూజ జరిగింది. ఇది మేము ప్రేమతో కట్టుకున్నఇల్లు. ఇది నేను ఆ దేవుడి ఆశీర్వాదంగా భావిస్తున్నా. ఈ శుభ సందర్భంలో మా హృదయాలు కృతజ్ఞతతో నిండి ఉన్నాయి.' అంటూ పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖ సినీతారలు, ఫ్యాన్స్ అభినందనలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) -
పోలీస్ స్టేషన్ లో పూజారి ఫన్నీ పూజ
-
గౌస్–పూజ జోడీకి స్వర్ణం
సాక్షి, అమరావతి: జాతీయ క్రీడల్లో భాగంగా బ్యాడ్మింటన్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్కు స్వర్ణ పతకం లభించింది. గోవాలో జరుగుతున్న ఈ క్రీడల్లో మంగళవారం ముగిసిన మిక్స్డ్ డబుల్స్ విభాగంలో షేక్ గౌస్–పూజ (ఆంధ్రప్రదేశ్) జోడీ విజేతగా నిలిచి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో షేక్ గౌస్–పూజ ద్వయం 21–8, 21–17తో బొక్కా నవనీత్–కె.మనీషా (తెలంగాణ) జంటను ఓడించింది. ఫైనల్లో ఓడిన నవనీత్–మనీషా జోడీకి రజతం దక్కింది. తరుణ్కు పసిడి పతకం సింగిల్స్ విభాగంలో తెలంగాణకు రెండు పతకాలు దక్కాయి. పురుషుల సింగిల్స్ విభాగంలో మన్నేపల్లి తరుణ్ స్వర్ణ పతకాన్ని, మహిళల సింగిల్స్లో మారెడ్డి మేఘన రెడ్డి కాంస్య పతకాన్ని గెల్చుకున్నారు. ఫైనల్లో తరుణ్ 21–15, 16–21, 21–15తో సౌరభ్ వర్మ (మధ్యప్రదేశ్)పై నెగ్గగా... సెమీఫైనల్లో మేఘన రెడ్డి 21–7, 22–24, 16–21తో అదితి భట్ (ఉత్తరాఖండ్) చేతిలో ఓడిపోయింది. సౌరభ్ వర్మతో 70 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో నిర్ణాయక చివరి గేమ్లో తరుణ్ స్కోరు 15–15 వద్ద వరుసగా ఆరు పాయింట్లు గెలిచి గేమ్తోపాటు మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. సెమీఫైనల్లో తరుణ్ 12–21, 21–14, 22–20తో జాతీయ చాంపియన్ మిథున్ (కర్ణాటక)ను ఓడించడం విశేషం. -
దుర్గా పూజ మండపం వద్ద తొక్కిసలాట.. అయిదేళ్ల చిన్నారి సహా ముగ్గురి మృతి
పాట్నా: బిహార్లో విషాదం నెలకొంది. దసరా ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. దుర్గా పూజ మండపం వద్ద జరిగిన తొక్కిసలాట ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. మరో 10మందికి పైగా గాయపడ్డారు. గోపాల్గంజ్ జిల్లాలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. వివరాలు.. దేవి నవరాత్రుల సందర్భంగా రాజా దళ్ ప్రాంతంలో దుర్గా పూజ వేడుకలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఒకేసారి ఎక్కువ మంది గుమిగూడటంతో మండపం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో అయిదేళ్ల బాలుడు, ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై గోపాల్ గంజ్ ఎస్పీ స్వర్ణ ప్రభాత్ మాట్లాడుతూ.. సోమవారం రాత్రి 8.30 గంటలకు రాజాదలళ్ పూజా పండల్ గేటు దగ్గర తొక్కిసలాట జరిగిందని తెలిపారు. ఈ క్రమంలో ఓ బాలుడు కిందపడి పోవడంతో అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన ఇద్దరు మహిళలు సైతం కిందపడిపోయారన్నారు. అదే సమయంలో భక్తులు ప్రసాదం కోసం బారులు తీరడంతో తొక్కిసలాట జరిగిందని చెప్పారు. దీంతో ముగ్గురికి ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లారని,, ఆసుపత్రికి తరలించేలోపు ముగ్గురు మరణించారని పేర్కొన్నారు. వెంటనే పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని నియంత్రించినట్లు చెప్పారు. మరో 10కి పైగా గాయపడగా.. వారిని సదర్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అయితే భక్తుల రద్దీని నియంత్రించేందుకు మండపం వద్ద ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకపోవడమే తొక్కిసలాటకు దారితీసిందని పోలీసులు తెలిపారు. చదవండి: తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి -
మా అత్తమ్మ కు నెగిటివ్ ఫీలింగ్ కొంచెం ఎక్కువ
-
నన్ను చదవనిచ్చేవాడు కాదు...అంతగా అల్లరి చేసేవాడు
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- చైనా గ్యాంగ్ చెరలో భారతీయులు
- మాటలతో మూటలు
- అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వాలి: హరీశ్రావు
- ప్రపంచంతో పోటీపడేలా కొత్త పారిశ్రామిక పాలసీలు
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
Advertisement