-
ప్రభాస్ తర్వాత బుజ్జిని నడిపిన నాగచైతన్య.. వీడియో వైరల్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వస్తున్న సినిమా 'కల్కి 2898'. దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దిశా పటానీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే మొదలయ్యాయి.కల్కి సినిమాలో భాగంగా బుజ్జిని ఎప్పుడైతే ప్రభాస్ పరిచయం చేశాడో ఆ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది. బుజ్జి, భైరవ పాత్రల్ని పరిచయం చేస్తూ తాజాగా ఒక కార్యక్రమాన్నే మేకర్స్ నిర్వహించారు. బుజ్జి అనే పేరుతో కూడిన వాహనం కూడా కథలో కీలకం. ఆ వాహానాన్ని నడుపుకుంటూ ప్రభాస్ మొదటిసారి కనిపించి సందడి చేశాడు. అయితే, తాజాగా బుజ్జి వాహనాన్ని అక్కినేని నాగచైతన్య కూడా నడిపాడు. వాహనాన్ని చూసిన నాగచైతన్య ఆశ్చర్యపోయాడు. ఇంజనీరింగ్లో ఉన్న రూల్స్ అన్నీ బ్రేక్ చేస్తూ దీనిని తయారు చేశారా అని ఫన్నీగా కామెంట్ చేశాడు. బుజ్జిని డ్రైవ్ చేసిన నాగచైతన్య వీడియోను మేకర్స్ షేర్ చేశారు. సైన్స్ ఫిక్షన్ చిత్రంగా తెరకెక్కిన కల్కి జూన్ 27న విడుదల కానుంది.Look who's met #Bujji... @chay_akkineni, hope you had a fantastic time.#Kalki2898AD #Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @BelikeBujji @saregamaglobal @saregamasouth #Kalki2898ADonJune27 pic.twitter.com/8odhpYDqMz— Vyjayanthi Movies (@VyjayanthiFilms) May 25, 2024 -
అన్ని ఈవెంట్లు ఒక లెక్క బుజ్జి ఈవెంట్ మరో లెక్క ఇది ప్రభాస్ రేంజ్
-
ప్రభాస్ బుజ్జి.. ఎక్కడ తయారు చేశారో తెలుసా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వస్తోన్న సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. అత్యంత భారీ బడ్జెట్తో వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఫ్యాన్స్కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలోని డిఫరెంట్ లుక్తో కారు(బుజ్జిని) అభిమానులకు పరిచయం చేశారు. ఇందుకోసం భారీ ఈవెంట్ను కూడా నిర్వహించారు. డిఫరెంట్ లుక్లో ఉన్న బుజ్జిని చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.అయితే ఇప్పుడు అందరిదృష్టిని ఆకర్షిస్తోన్న బుజ్జి గురించి నెట్టింట చర్చ మొదలైంది. అసలు బుజ్జిని ఎవరు తయారు చేశారు? డిఫరెంట్ లుక్లో ఉన్న బుజ్జిని ఎక్కడ తయారు చేశారు? అన్న విషయంపై ఆసక్తి నెలకొంది. బుజ్జికి సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకొచ్చాయి. బుజ్జిని తయారు చేసేందుకు ప్రముఖ కంపెనీలైన మహీంద్రా, జాయెమ్ ఆటోమోటివ్ సంయుక్తంగా రూపొందించారు.కల్కి సినిమా కోసం రూపొందించిన ఈ కారును తమిళనాడులోని కోయంబత్తూర్లో తయారు చేశారు. బుజ్జి బరువు దాదాపు ఆరు టన్నుల బరువుతో రూపొందించారు. ఈ కారు తయారికీ దాదాపు రూ.7 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. ముందు రెండు, వెనుక భాగంలో ఒక టైరు మాత్రమే కలిగి ఉన్న బుజ్జి ఫ్యాన్స్కు విపరీతంగా ఆకట్టుకుంది. ఈ ప్రత్యేకమైన కారును ప్రభాస్ స్వయంగా నడుపుకుంటూ వచ్చి అభిమానులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా అమితాబ్, కమల్గారు లాంటి గ్రేటెస్ట్ లెజెండ్స్తో పని చేసే అవకాశం నాకు రావడం నా అదృష్టమని అన్నారు. కాగా.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న విడుదల కానుంది. Meet #Bujji - a 6 tonne monster of a machine built by Mahindra and Jayem AutmotiveFor the first time in the world #Kalki2898AD movie crew built a car completely from scratch just for a movie 🔥🔥Made Up with a Cost of 7Cr for Car which is INSANE pic.twitter.com/l534NTCrOU— Australian Telugu Films (@AuTelugu_Films) May 23, 2024 -
‘నాగి..నిన్ను కొట్టాలి.. ‘బుజ్జి’ గ్లింప్స్పై ప్రభాస్ రియాక్షన్
‘బుజ్జి’.. ఈ పేరు గత నాలుగైదు రోజులుగా టాలీవుడ్లో హల్ చల్ చేసింది. నా జీవితంలోకి చాలా ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారంటూ ప్రభాస్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అందరూ ‘బుజ్జి’పై ఆసక్తిని కనబరిచారు. దానికి తగ్గట్టే నిన్న(మే 22) మేకర్స్ హైదరాబాద్లో ఓ బిగ్ ఈవెంట్ని ఏర్పాటు చేసి బుజ్జిని పరిచయం చేశారు. ప్రభాస్ ఓ భారీ స్టంట్ చేస్తూ బుజ్జి తో మాస్ ఎంట్రీ ఇచ్చాడు. డార్లింగ్ ఎంట్రీ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. అయితే ఈ స్టంట్ పర్ఫెక్ట్గా రావడం కోసం ప్రభాస్ మూడు రోజుల పాటు రోజుకు నాలుగైదు గంటలు ప్రాక్టీస్ చేశారట. అందుకే ఆ కారు(బుజ్జి)ని పర్ఫెక్ట్గా గ్రౌండ్లోకి తీసుకురావడమే కాకుండా.. దాంతో చక్కర్లు కొట్టి ఆకట్టుకున్నాడు.అయితే బుజ్జి పరిచయం కేవలం 56 సెకన్ల వరకే ఉండడంతో ప్రభాస్తో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా కాస్త నిరాశకు లోనయ్యారు. బుజ్జి వీడియో చూశాక పక్కనే ఉన్న దర్శకుడు నాగ్ అశ్విన్ చూసి ‘ఏంటి సార్.. మూడేళ్లలో తీసి 50 సెకన్లు చూపిస్తారా?..మిమ్మల్లి కొట్టాలి ఇక్కడకు రండి’అంటూ నాగికి ప్రభాస్ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘నాగీ మూడేళ్లు నన్ను బుజ్జితో వేధించాడు. ఫైనల్లీ బుజ్జీని పరిచయం చేశాం. నేనేదో మన డార్లింగ్స్కి హాయ్ చెప్పి వెళ్లి పోదాం అనుకుంటే .. నాతో ఫీట్లు చేయించాడు. క్యూరియాసిటీని పెంచేందుకే నాగి నాతో ‘స్పెషల్ పర్సన్’ అని ట్వీట్ వేయించాడు. బుజ్జి నాకు చాలా ప్రత్యేకం. బుజ్జి మెదడు కంటే బాడీ నాకు ఇష్టం’ అని ప్రభాస్ అన్నారు. -
Kalki 2898 AD Bujji Event Photos: అట్టహాసంగా ‘కల్కి 2898 ఏడీ’ ఈవెంట్ (ఫొటోలు)
-
నాగీ మూడేళ్లు నన్ను బుజ్జితో వేధించాడు!
‘‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉంది బుజ్జి, భైరవ గ్లింప్స్. ఎంజాయ్ చేశారా? ‘కల్కి..’లో అమితాబ్ సార్, కమల్ సార్తో పని చేసే అవకాశం ఇచ్చిన అశ్వినీదత్గారికి, నాగీ (నాగ్ అశ్విన్)కి థ్యాంక్స్. హోల్ ఇండియా ఇన్స్పైర్ అయ్యే అమితాబ్, కమల్గారు లాంటి గ్రేటెస్ట్ లెజెండ్స్తో పని చేసే అవకాశం నాకు రావడం నా అదృష్టం’’ అని హీరో ప్రభాస్ అన్నారు. ఆయన హీరోగా నటించిన పాన్ ఇండియన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదుకోన్ హీరోయిన్. అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు చేశారు. వైజయంతీ మూవీస్పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా జూన్ 27న విడుదలవుతోంది. కాగా బుధవారం హైదరాబాద్లో నిర్వహించిన ‘కల్కి స్పెషల్ క్రియేటివ్ ఈవెంట్’లో సినిమాలోని బుజ్జి (కారు) పాత్రను పరిచయం చేశారు. ఈవెంట్లో ఈ వాహనాన్ని ప్రభాస్ నడిపారు. అనంతరం ప్రభాస్ మాట్లాడుతూ– ‘‘నాగీ మూడేళ్లు నన్ను బుజ్జితో వేధించాడు. ఫైనల్లీ బుజ్జీని పరిచయం చేశాం. నేనేదో మన డార్లింగ్స్కి హాయ్ చెప్పి వెళ్లి΄ోదాం అనుకుంటే ఈ కార్లు.. ఫీట్లు ఏంటి సార్ (నవ్వుతూ). బుజ్జి సూపర్ ఎగ్జయిటింగ్. నేను కూడా ‘కల్కి’ టీజర్, సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాను. కమల్ సార్ ‘సాగర సంగమం’ సినిమా చూసి నాకలాంటి బట్టలు కావాలని మా అమ్మను అడిగాను.. అలాంటివి కుట్టించుకుని వేసుకున్నాను. ఇక ఈ వయసులో కూడా అశ్వినీదత్గారి ΄్యాషన్ చూసి ఆయన వద్ద ఎంతో నేర్చుకోవాలనిపిస్తుంది. నాకు తెలిసి 50 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న నిర్మాత ఆయనొక్కరే. ఆయన కుమార్తెలు స్వప్న, ప్రియాంకలకు కూడా ఆయనలా ΄్యాషన్, ధైర్యం ఉంది. వాళ్లు పని చేసే విధానానికి మేమంతా స్ఫూర్తి ΄÷ందుతాం అని మా సిస్టర్స్కి చెబుతుంటాను’’ అన్నారు. ‘‘బుజ్జి కారుని ఎంతో కష్టపడి తయారు చేయించాం. ఇందుకోసం మహీంద్ర ఆటోమొబైల్ ఇంజినీర్స్ ఎంతో శ్రమించారు’’ అన్నారు నాగ్ అశ్విన్. నిర్మాతలు అశ్వినీ దత్, స్వ΄్నా దత్, ప్రియాంకా దత్, కృష్ణంరాజు సతీమణి శ్యామల పాల్గొన్నారు. -
Kalki 2898 AD Hyderabad Event: గ్రాండ్గా ప్రభాస్ కల్కి ఈవెంట్.. బుజ్జి లుక్ రివీల్ చేసిన మేకర్స్ (ఫొటోలు)
-
ప్రభాస్- నాగ్ అశ్విన్ 'కల్కి 2898 ఏడీ'.. బుజ్జి లుక్ చూశారా?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వస్తోన్న సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్పై భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ను మేకర్స్ రివీల్ చేయనున్నారు.ఈ సినిమాలోని బుజ్జి పేరుతో ఉన్న కారును ఫ్యాన్స్కు పరిచయం చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన భారీ ఈవెంట్లో బుజ్జి లుక్ను రివీల్ చేశారు. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సినిమాను జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. Darlings... In life, you meet people for the first time only once. World, meet #Bujji...- https://t.co/8XhJordNtn#Kalki2898AD #Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @BelikeBujji @saregamaglobal… pic.twitter.com/SvwwuXpzBa— Kalki 2898 AD (@Kalki2898AD) May 22, 2024 -
Kalki 2898: 12 సెకన్లు.. రూ.3 కోట్లు, రాజమౌళిని ఫాలో అవుతున్న ‘కల్కి’టీమ్!
సినిమాను తీయడం ఒకెత్తు అయితే.. ఆ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. అందుకే ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రేక్షకులను రీచ్ అయ్యేందుకు అదెంచ్చె ఏ చిన్న అవకాశాన్ని వదులుకోరు. ఇక సినిమా ప్రమోషన్స్ విషయంలో రాజమౌళి తర్వాతే మరెవరు అయినా. ఆయన సినిమాను తెరకెక్కించేందుకు ఎలా కష్టపడతాడు.. అంతే స్థాయిలో సినిమా ప్రమోషన్స్కి కష్టపడతాడు. ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో ఆయన చేసిన ప్రమోషన్స్ బాగా కలిసొచ్చింది. ఇద్దరు హీరోలతో దేశం మొత్తం తిరిగి సినిమాను అన్ని భాషల వారికి దగ్గరయ్యేలా చేశాడు. కేవలం ప్రమోషన్స్ కోసమే దాదాపు రూ.20 కోట్ల ఖర్చు చేసినట్లు తెలిసిందే. ఇప్పుడు రాజమౌళి స్ట్రాటజీనే ఫాలో అవుతుంది ‘కల్కి’ టీమ్. (చదవండి: రెండు ఓటీటీల్లో 'కల్కి'.. ఏకంగా అన్ని కోట్లకు అమ్మేశారా?)సినిమా ప్రమోషన్స్కి భారీగా ఖర్చు చేయబోతుంది. ప్రపంచ వ్యాప్తంగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీని కోసం దాదాపు రూ. 50 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. రీసెంట్గా ఐపీఎల్లో కూడా ‘కల్కి 2898 ఏడీ’ యాడ్ని రన్ చేశారు. ప్రభాస్ కల్కి అవతార్లో కనిపించి సినిమాను ప్రమోట్ చేశాడు. ఇది కేవలం 12 సెకన్ల యాడ్ మాత్రమే. దీని కోసం మేకర్స్ రూ. 3 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కల్కి సినిమా ప్రమోషన్స్కి ఖర్చు చేసే డబ్బుతో టాలీవుడ్లో ఓ బడా సినిమానే తీయొచ్చు. (చదవండి: స్టార్ హీరో కొడుకు సెకండ్ హ్యాండ్ బట్టలు వాడుతాడు)నేడు(మే 22)రామోజీఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ని నిర్వహించబోతున్నాడు మేకర్స్. ఈ ఈవెంట్లో బుజ్జిని పరిచయం చేయనున్నారు. ప్రభాస్తో పాటు చిత్రబృందం అంతా ఈ ఈవెంట్కి హాజరవుతున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉండడంతో..అందుకు తగ్గట్లే భారీ ఏర్పాట్లు చేశారట. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్తో నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె ఇతర కీలక పాత్రలు పోషించారు. జూన్ 27న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. -
రెండు ఓటీటీల్లో 'కల్కి'.. ఏకంగా అన్ని కోట్లకు అమ్మేశారా?
ప్రభాస్ 'కల్కి' కోసం తెలుగు ప్రేక్షకులు వెయిటింగ్. ఎందుకంటే సంక్రాంతి తర్వాత సరైన మూవీ థియేటర్లలోకి రాలేదు. అలా వేసవి అంతా వృథా అయిపోయింది. దీంతో ఆడియెన్స్ని 'కల్కి'.. మళ్లీ థియేటర్లలోకి రప్పిస్తుందని అందరూ అనుకుంటున్నారు. విడుదలకు దాదాపు మరో నెలరోజులు మాత్రమే ఉండటంతో ప్రమోషన్స్ ఆల్రెడీ మొదలుపెట్టేశారు. తాజాగా ఓటీటీ డీల్ కూడా పూర్తయిపోయినట్లు తెలుస్తోంది.'బాహుబలి' తర్వాత ప్రభాస్ ఒప్పుకొన్న పాన్ ఇండియా సినిమాల్లో 'కల్కి' ఒకటి. 'మహానటి'తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ నాగ్ అశ్విన్.. దాదాపు ఐదారేళ్ల నుంచి ఈ ప్రాజెక్ట్ మీదే ఉన్నాడు. అలా విడుదలకు సిద్ధం చేశారు. జూన్ 27న గ్రాండ్గా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. అయితే మూవీని రెండు ఓటీటీలకు అమ్మేశారట.(ఇదీ చదవండి: Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్)హిందీ వెర్షన్ హక్కుల్ని దాదాపు రూ.200 కోట్లకు నెట్ఫ్లిక్స్ దక్కించుకుందని, అలానే దక్షిణాది భాషలకు కలిపి రూ.175 కోట్లకు అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం రికార్డ్ ఓటీటీ డీల్ 'కల్కి'దే అని చెప్పొచ్చు.ఇకపోతే 'కల్కి'లో ప్రభాస్తో పాటు దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ లాంటి భారీ తారాగణం ఉంది. అలానే దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ కూడా ఉన్నారని టాక్ నడుస్తోంది. వైజయంతీ మూవీస్ దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ పెట్టి నిర్మించినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'ఫ్యామిలీస్టార్'ను వాళ్లు కావాలనే టార్గెట్ చేశారు: ఆనంద్ దేవరకొండ) -
బ్రెయిన్ ఉంటే సరిపోతుందా...
భైరవ బెస్ట్ ఫ్రెండ్ బుజ్జి... కానీ బుజ్జి అంటే మనిషి కాదు. మరి.. బుజ్జి అనేది వాహనమా? లేక ఓ టైమ్ మిషన్లాంటి పరికరమా? అనేది ఈ నెల 22న తెలుస్తుంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ అండ్ ఫ్యూచరిస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్న ఈ సినిమాను అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో భైరవ ΄ాత్రధారిగా ప్రభాస్, అశ్వత్థామ ΄ాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో మరో సూపర్ హీరోలాంటి బుజ్జి ΄ాత్ర కూడా ఉంది. ఈ ΄ాత్రను పూర్తిగా చూపించకుండా ఓ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఈ పాత్రకు హీరోయిన్ కీర్తీ సురేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ‘మనుషుల శరీరాన్ని బ్రెయిన్ కంట్రోల్ చేసినట్లే.. బుజ్జి బాడీని కూడా బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంటుంది’ (నాగ్ అశ్విన్), ‘హాయ్.. నేను బుజ్జి బ్రెయిన్... బ్రెయిన్ ఉంటే సరిబ్రెయిన్ ఉంటే సరిపోతుందా...తుందా... బాడీ కూడా కావాలి కదా.. భైరవ ఎక్కడికీ.. నా బాడీ బిల్డ్ చేయడానికేనా..’ (కీర్తీ సురేష్ వాయిస్ ఓవర్), ‘నీ టైమ్ స్టార్టైంది బుజ్జి.. పదా!’ (ప్రభాస్) అనే డైలాగ్స్ ఈ వీడియోలో ఉన్నాయి. ఈ బుజ్జి గురించిన పూర్తి వివరాలను ఈ నెల 22న వెల్లడిస్తామని మేకర్స్ తెలి΄ారు. ఇక ‘కల్కి 2898 ఏడీ’ జూన్ 27న విడుదల కానుంది. -
హీరోయిన్ అనుష్క.. ఆ నిర్మాతని పెళ్లి చేసుకోబోతుందా?
అందం, అభినయం.. ఇలా రెండింటిలోనూ కేక పుట్టించే టాలెంట్ ఉన్న బ్యూటీ అనుష్క శెట్టి. గతంలో ఆమె నటించిన సినిమాలు ఈ విషయాన్ని ప్రూవ్ చేశాయి. ప్రస్తుతం ఈమె చాలావరకు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తోంది. తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగిన అనుష్క.. 40 ఏళ్లు దాటినా సరే ఇప్పటికే సింగిలే. ఈ క్రమంలో చాలాసార్లు పెళ్లి రూమర్స్ వచ్చాయి. కానీ ఈసారి మాత్రం ఏకంగా ఓ నిర్మాతతో ఏడడుగులు వేయబోతుందని అంటున్నారు. ఇందులో నిజమెంత?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?)'బాహుబలి'తో పాన్ ఇండియా రేంజులో గుర్తింపు తెచ్చుకున్న అనుష్క.. ఈ మూవీ చేస్తున్న టైంలోనే 'సైజ్ జీరో'లో నటించింది. ఇందులో పాత్ర కోసం భారీగా బరువు పెరిగింది. ఆమె జీవితంలో చేసిన పెద్ద పొరపాటు ఇదే. సినిమా హిట్ అవ్వలేదు. అప్పటి నుంచి అనుష్క కూడా బరువు తగ్గట్లేదు. దీంతో చాలావరకు అవకాశాలు తగ్గిపోయాయి. గతేడాది 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం మలయాళం ఓ మూవీ చేస్తోంది.హీరోయిన్లలో అనుష్క మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని చెప్పొచ్చు. ఈమె వయసు ఇప్పుడు 42 ఏళ్లు. ఈమె-ప్రభాస్ పెళ్లి గురించి ఇప్పటికే చాలాసార్లు పుకార్లు వచ్చాయి. తాము మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పి ఇద్దరూ క్లారిటీ ఇచ్చేశారు. టాలీవుడ్ దర్శకుడితోనూ పెళ్లంటూ గతంలో రూమర్స్ వచ్చాయి. కానీ అది అబద్ధమని తేలింది. ఇప్పుడు అలా మరోసారి టాక్ మొదలైంది. అనుష్క త్వరలో పెళ్లికి రెడీ అయిందని, కన్నడ నిర్మాతతో ఏడడుగులు వేయనుందని అంటున్నారు. ఇది కూడా కేవలం ఓ రూమర్లానే అనిపిస్తుంది. కొన్నిరోజులాగితే నిజమేంటనేది తెలిసిపోతుంది.(ఇదీ చదవండి: మళ్లీ ట్విట్టర్లోకి నాగబాబు.. వివాదాస్పద ట్వీట్ తొలగింపు) -
తనకు ఇష్టమైన 'బుజ్జి'ని పరిచయం చేసిన ప్రభాస్.. ఆసక్తిగా వీడియో
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'కల్కి 2898 ఏడీ'. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా గత కొన్ని రోజులుగా ట్రెండింగ్లో కొనసాగుతూనే ఉంది. కొన్ని గంటల క్రితం ప్రభాస్ చేసిన ఒక పోస్ట్తో కల్కి సినిమా పేరు భారీగా ట్రెండ్ అయింది. 'ఎట్టకేలకు మన జీవితంలోకి ఓ ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారు. వెయిట్ చేయండి.' అంటూ అయిన షేర్ చేసిన పోస్ట్పై అందరూ ఎంతగానో ఆసక్తి కనపరిచారు. కొంత సమయం తర్వాత 'నా బుజ్జిని మీకు పరిచయం చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.' అంటూ మరో పోస్ట్ చేశారు. దీంతో అసలు బుజ్జి ఎవరు..? ఎలా ఉంటుంది..? అని అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.తాజాగా బుజ్జికి సంబంధించిన ఒక గ్లింప్స్ను మేకర్స్ విడుదల చేశారు. చాలా ఆసక్తిగా కొనసాగిన ఈ విడియోలో ఒక చిన్న రోబోను బుజ్జి అని అందరూ పిలుస్తూ ఉంటారు. బుజ్జికి వాయిస్ను కీర్తి సురేష్ ఇచ్చింది. 'నా లైఫ్ ఎంటి..? బాడీ లేకుండా బతికేయాల్సిందేనా' అంటూ బుజ్జి చెబుతుండగా ఇంతలో ప్రభాస్ ఎంట్రీ ఇచ్చి 'నీ టైమ్ మొదలైంది బుజ్జి' అంటూ ఒక వాహనాన్ని రివీల్ చేయబోయాడు. కానీ ఇంతలోనే ట్విస్ట్ ఇస్తూ బుజ్జి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటూ జూన్ 22 వరకు వేచి ఉండాల్సిందేనని తెలిపారు. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా 'కల్కి' విడుదల కానుంది. -
ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..
-
భైరవ స్పెషల్ పర్సన్ బుజ్జి
తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు? అంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. తమ అభిమాన హీరో పెళ్లి ఎప్పుడా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ వివాహంపై ఎప్పటికప్పుడు రూమర్లు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే పెళ్లి వార్తల గురించి ప్రభాస్ ఎప్పుడూ స్పందించలేదు. తాజాగా శుక్రవారం ఉదయం ‘‘డార్లింగ్స్... ఫైనల్లీ నా జీవితంలోకి చాలా ప్రత్యేకమైన వ్యక్తి ప్రవేశించనున్నారు.. వేచి చూడండి’ అంటూ ఇన్స్టాగ్రామ్లో ప్రభాస్ చేసిన పోస్ట్ వైరల్గా మారింది.ఈ పోస్ట్ పెళ్లి గురించేనా? ఆయన పరిచయం చేయబోతున్న ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు? అనే చర్చ జరిగింది. కాగా శుక్రవారం సాయంత్రం ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా ‘‘డార్లింగ్స్... బుజ్జిని మీకు పరిచయం చేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని మరో పోస్ట్ షేర్ చేశారు. దాంతో ప్రభాస్ పెట్టిన ఈ రెండు పోస్ట్లు ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ప్రచారంలో భాగం అనే టాక్ తెర పైకి వచ్చింది.. ఈ చిత్రంలో భైరవ పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా... బుజ్జి పేరుతో ఓ పాత్ర ఉంది. ఆ బుజ్జి ఎవరు అనేది ఈరోజు సాయంత్రం తెలిసిపోతుంది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వినీదత్ నిర్మిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ జూన్ 27న విడుదల కానుంది. -
ప్రభాస్ బ్యాచిలర్ లైఫ్ కు స్వస్తి ?
-
డార్లింగ్ లైఫ్లోకి స్పెషల్ పర్సన్?.. ఆసక్తికర పోస్ట్ (ఫొటోలు)
-
ఒకే స్టేజిపై కల్కి - పుష్ప.. ఫ్యాన్స్ కి పూనకాలే
-
ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్
డార్లింగ్ ప్రభాస్ నుంచి సడన్ సర్ప్రైజ్ వచ్చింది. స్వతహాగా ఇంట్రావర్ట్ అయిన ఇతడు.. బయటకు కనిపించడం తక్కువ. ఇక మాట్లాడటం అయితే గగనం అని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు ఇన్ స్టాలో అందరూ అవాక్కయ్యేలా ఇన్ స్టాలో స్టోరీ పెట్టాడు. త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతున్నామని అంటున్నాడు. ఇంతకీ ఏంటి విషయం? ఏమై ఉండొచ్చు?(ఇదీ చదవండి: అది ఫేక్ న్యూస్.. రూమర్స్పై మహేశ్-రాజమౌళి మూవీ నిర్మాత క్లారిటీ)'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్.. ఊపిరి సలపనంత బిజీగా మారిపోయాడు. గతేడాది 'సలార్'తో హిట్ కొట్టి మళ్లీ సక్సెస్ అందుకున్నాడు. త్వరలో 'కల్కి'గా రాబోతున్నాడు. జూన్ 27న థియేటర్లలోకి రాబోతుంది. రిలీజ్కి మరో 40 రోజులు కూడా లేదు. ఇంకా ప్రమోషన్స్ ఎప్పుడు మొదలుపెడతారా అని అందరూ వెయిట్ చేస్తుండగా.. ప్రభాస్ ఇన్ స్టాలో ఇంట్రెస్టింగ్ స్టోరీ పెట్టాడు.'డార్లింగ్స్.. ఫైనల్లీ నా జీవితంలోకి చాలా ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారు. వెయిట్ చేయండి' అని ప్రభాస్ తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. అయితే ఇది పెళ్లి గురించే అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు బిజీ షెడ్యూల్లో ప్రభాస్ పెళ్లి చేసుకోవడం అసాధ్యం. కాబట్టి కొత్త మూవీ ప్రమోషన్ లేదా అంటే ఇంకేదైనా అయ్యిండొచ్చని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అదేంటో ప్రభాస్ చెప్పేవరకు వెయిట్ అండ్ సీ.(ఇదీ చదవండి: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్) -
నో రెమ్యునరేషన్.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ప్రభాస్?
డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు ఊపిరి సలపనంత బిజీగా ఉన్నాడు. గతేడాది చివర్లో 'సలార్'తో హిట్ కొట్టాడు. త్వరలో 'కల్కి'గా రాబోతున్నాడు. జూన్ 27న థియేటర్లలోకి ఈ సినిమా రానుంది. దీని తర్వాత 'రాజా సాబ్', 'సలార్ 2'కి రెడీ అవుతున్నాడు. సరిగ్గా ఈ టైంలో ప్రభాస్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. రూపాయి కూడా తీసుకోకుండా పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడని టాక్ అయితే వచ్చింది. ఏంటి సంగతి? ఆ సినిమా ఏది?(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన 'దసరా' నటుడి హిట్ సినిమా)పైన చెప్పిన సినిమాలతో పాటే ప్రభాస్.. మంచు విష్ణు హీరోగా నటిస్తూ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న 'కన్నప్ప' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ విషయం చాలారోజుల క్రితమే బయటకొచ్చింది. అయితే ప్రభాస్, శివుడిగా కనిపించబోతున్నాడని టాక్ వచ్చింది కానీ పరశురాముడి పాత్ర చేస్తున్నాడని లేటెస్ట్ సమాచారం. ఇందులో నటిస్తున్నందుకు గానూ పూర్తిగా రెమ్యునరేషన్ తీసుకోవట్లేదట. మంచు ఫ్యామిలీతో తనకున్న అనుబంధం దృష్ట్యా ఇలా చేశాడట.ఇకపోతే మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న 'కన్నప్ప'లో అక్షయ్ కుమార్ (హిందీ), శివరాజ్ కుమార్ (కన్నడ), మోహన్ లాల్ (మలయాళం) కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇలా పాన్ ఇండియా అప్పీల్తో సినిమా తీస్తున్నారు. ఈనెల 20న క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో 'కన్నప్ప' టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. దీనిబట్టి సినిమాపై ఓ అంచనాకు రావొచ్చు.(ఇదీ చదవండి: రామ్-పూరీ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ ఎలా ఉందంటే?) -
ఆ టైమ్ కి కల్కి రిలీజ్ అవుతుందా..?
-
కన్నప్ప: మంచు విష్ణు చెప్పింది కాకుండా ప్రభాస్..
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి వరుస అప్డేట్లు వదులుతున్నారు. ఈ మధ్యే కన్నప్ప సెట్స్లోకి ప్రభాస్ అడుగు పెట్టిన విషయం తెలిసిందే! ప్రభాస్ తన పాత్ర తానే సెలక్ట్ చేసుకున్నాడంటున్నాడు విష్ణు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో రిలీజ్ చేశాడు. ‘కన్నప్ప నుంచి ఏ న్యూస్ వచ్చినా అందరూ ఆత్రుతగా చూస్తున్నారు. గత ఐదారు అప్డేట్లు టాప్లో ట్రెండ్ అయ్యాయి. నా మిత్రుడు ప్రభాస్ షూట్లో జాయిన్ అయ్యాడని చెప్పిన వార్త దేశ వ్యాప్తంగా ట్రెండ్ అయింది. ప్రభాస్ను కలిసినప్పుడు..కన్నప్ప కథలో చాలా గొప్ప పాత్రలున్నాయి. ఆ పాత్రలను అద్భుతమైన ఆర్టిస్టులు పోషిస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్కు, డై హార్డ్ ఫ్యాన్స్ కోసం ఓ ఆసక్తికర విషయం చెప్పాలి. ప్రభాస్ను కలిసినప్పుడు.. నేను కన్నప్ప సినిమా చేస్తున్నా.. నువ్వు ఒక క్యారెక్టర్ చేయాలని చెప్పాను. అందుకాయన ‘కథ బాగా నచ్చింది నాకు ఫలానా పాత్ర ఇంకా బాగా నచ్చింది.. ఆ క్యారెక్టర్ నేను చేయొచ్చా?’ అని అడిగారు. ఏ కారెక్టర్ అయితే ప్రభాస్కు బాగా నచ్చిందో అదే పాత్రను పోషించారు. అద్భుతమైన అప్డేట్త్వరలోనే ఒక్కో పాత్రను మీ ముందుకు తీసుకొస్తాను. అధికారికంగా ఆ పాత్రల గురించి మేం చెప్పినప్పుడే నమ్మండి. బయట వచ్చే వాటిని నమ్మకండి. సోమవారం నాడు మీకు అద్భుతమైన అప్డేట్ ఇవ్వబోతున్నాము’ అన్నాడు. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్పను మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్గా ప్రఖ్యాత హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కెచా ఖంపక్డీ పని చేస్తున్నారు.చదవండి: నా కన్నా మా అక్కే అందంగా ఉండేది.. టార్చర్ పెట్టా: నటి -
కన్నప్ప సెట్స్లో...
వరుస పాన్ ఇండియా చిత్రాలతో దూసుకెళుతున్న హీరో ప్రభాస్ తాజాగా ‘కన్నప్ప’ చిత్రం షూటింగ్లో జాయిన్ అయ్యారు. విష్ణు మంచు హీరోగా రూపొందుతున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్బాబు ఈ సినిమా నిర్మిస్తున్నారుపాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్బాబు, మోహన్ లాల్, శరత్కుమార్, బ్రహ్మానందం వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే అక్షయ్ కుమార్, మోహన్బాబు, మోహన్ లాల్, శరత్కుమార్ తమ పాత్రలకు సంబంధించిన చిత్రీకరణలను పూర్తి చేశారు. తాజాగా ప్రభాస్ ‘కన్నప్ప’ సెట్స్లోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయనకి సాదర స్వాగతం పలికింది యూనిట్. ‘‘విష్ణు మంచు కలల ప్రాజెక్టుగా ‘కన్నప్ప’ రూపొందుతోంది. శివ భక్తుడైన భక్త కన్నప్ప అచంచలమైన భక్తిని, విశ్వాసాన్ని చూపించబోతున్నాం.ఆకర్షణీయమైన విజువల్స్, అద్భుతమైన కథా కథనాలతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కెచా ఖంపక్డీ వంటి వారు ‘కన్నప్ప’కి పని చేస్తున్నారు. -
జననేతపై అభిమానం.. ఎన్టీఆర్, ప్రభాస్ ఫ్యాన్స్ మద్దతు
సాక్షి, కర్నూలు జిల్లా: సినిమాల్లో ఎందరు హీరోలున్నా రాజకీయాల్లో మాత్రం సీఎం జగన్ ఒక్కరే హీరో.. అంతులేని అభిమానం ఆయనకే సొంతం. తాజాగా, కర్నూలు ప్రచార సభలో సీఎం జగన్కు ఎన్టీఆర్, ప్రభాస్ ఫ్యాన్స్ మద్దతు తెలిపారు. ది లీడర్ జగన్ అంటూ ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రదర్శించారు. జై జగన్ అంటూ ఎన్టీఆర్, ప్రభాస్ ఫ్యాన్స్ సభలో నినాదాలు చేశారు.సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలకు జనం ప్రభంజనంలా తరలివస్తున్నారు. ఓవైపు సీఎం జగన్ నిర్వహిస్తున్న ప్రచార సభలకు సునామీలా జనం పోటెత్తుతుండటం.. మరోవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి స్పందనే లేకపోవడంతో కూటమి శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. -
కన్నప్పలో అడుగుపెట్టిన ప్రభాస్.. ఫోటో వైరల్
మంచువిష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో మోహన్బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్ టైన్మెంట్స్పై మోహన్బాబు నిర్మిస్తున్నారు. తాజాగా కన్నప్ప ప్రాజెక్ట్లోకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అడుగుపెట్టేశారు. ఈమేరకు మంచు విష్ణు అధికారికంగా ప్రకటించేశారు.ఈ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అతిథి పాత్రలో నటించబోతున్నట్లు చాలా రోజుల నుంచి వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ, తాజాగా విష్ణు అధికారికంగా ప్రకటించడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. ఈ మూవీలో అతడు నందీశ్వరుడి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం ప్రభాస్ కేవలం మూడు రోజుల సమయం మాత్రమే కేటాయించినట్లు సమాచారం ఉంది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తి అయిపోయింది. దాదాపు షూటింగ్ కార్యక్రమం పూర్తి దశలో ఉన్న కన్నప్ప ఇదే ఏడాది విడుదల కానుంది.మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ కన్నప్పను మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివుని భక్తుడైన భక్త కన్నప్ప అచంచలమైన భక్తిని, విశ్వాసాన్ని చూపించబోతున్నారు. "కన్నప్ప"లో ప్రఖ్యాత హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కెచా ఖంపక్డీతో సహా ఆకట్టుకునే అద్భుతమైన టీం పని చేస్తోంది. ఆకర్షణీయమైన విజువల్స్, అద్భుతమైన కథ, కథనాలతో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu)
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- మీ ఇంటిని చక్కదిద్దుకోండి..!
- Lok Sabha Election 2024: ఆరో విడతలో 61.11 శాతం
- కలిసికట్టుగా ముందుకు..
- ఇంత దారుణంగా మాట్లాడిన ప్రధాని దేశ చరిత్రలోనే లేరు: ప్రియాంక
- Lok Sabha Election 2024: ముస్లింల ఓట్ల కోసం ‘ముజ్రా’
- India Meteorological Department: రాజస్తాన్లోని ఫలోదీలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత
- ఏసీబీ వలలో రావులపాలెం సీఐ
- సిరుల విరులు..కొండ చీపుర్లు
- వైఎస్సార్సీపీ నాయకుడిపై హత్యాయత్నం
- అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ డంప్ స్వాధీనం
Advertisement