-
ఏపీ ఎన్నికలపై సీఈఓ ముకేశ్ కుమార్ కీలక ప్రెస్ మీట్
-
బీఆర్ఎస్ అద్భుత విజయం సాధించబోతోంది: కేసీఆర్
సాక్షి,హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అద్భుత విజయం సాధించబోతోందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో శనివారం(మే11) తెలంగాణభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు.‘ప్రజాగ్రహం కాంగ్రెస్ను ముంచేయబోతోంది. కరెంటు విషయంలో ప్రజలకు ఏం సమాధానం చెబుతారు. రెండు జాతీయ పార్టీలను మించి సీట్లు గెలవబోతున్నాం. చిల్లర రాజకీయాల కోసం టైమ్ వేస్ట్ చేశారు. కరెంట్ను ఎందుకు దెబ్బతీశారో అర్థం కావడం లేదు. నేనుండే చోట 7-8సార్లు కరెంటు పోయింది.పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాం గ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వస్తారా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళతారా చూద్దాం. పైన తథాస్తు దేవతలు ఉంటారు. ఏదైనా జరగొచ్చు. కేసులు అటు ఇటైతే రేవంత్రెడ్డి బీజేపీలోకి వెళతాడు. 26 నుంచి 32 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా వాళ్లతో టచ్లో ఉన్నారు. ఇద్దరం కలిసి గవర్నమెంట్ ఫాం చేద్దామంటున్నరు.వైఎస్ రాజశేఖర్రెడ్డి కొన్ని అద్భుత పథకాలు తీసుకొచ్చారు. మహానుభావుడు చనిపోయి ఏ లోకంలో ఉన్నాడో తెలియదు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, సీఎం రిలీఫ్ ఫండ్ పథకాలను ప్రవేశ పెట్టారు’ అని కొనియాడారు. -
తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్
-
పేదవాడు జీవచ్ఛవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు
-
మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం
-
హత్యలకు కుట్రలు ఆధారాలతో పోసాని
-
Watch Live: మీడియాతో ఎంపీ అవినాష్రెడ్డి
-
సోలో బాయ్ మూవీ ప్రెస్ మీట్ (ఫోటోలు)
-
కథ వినగానే మా నాన్న గుర్తొచ్చారు
‘‘మనకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ధైర్యం చెప్పే వ్యక్తి కుటుంబంలో ఒకరు ఉంటారు. ఆ ఒక్కరే ఫ్యామిలీ స్టార్. మా కుటుంబంలో ఫ్యామిలీ స్టార్ మా నాన్న గోవర్ధన్. ‘ఫ్యామిలీ స్టార్’ కథ వింటున్నప్పుడు నాకు మా నాన్న గుర్తొచ్చారు. అందుకే ఈ సినిమాలో హీరో పాత్రకి గోవర్ధన్ అనే పేరు పెట్టమని పరశురామ్కి చెప్పాను. ఈ నెల 8న మా నాన్న పుట్టినరోజు. ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం విషయంలో ఆయన గర్వపడతారని ఆశిస్తున్నాను’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించారు. వాసు వర్మ క్రియేటివ్ ప్రోడ్యూసర్గా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 5న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘రాజుగారి బ్యానర్లో నేను ‘కేరింత’ సినిమా ఆడిషన్కు వెళ్లి, సెలెక్ట్ కాలేదు. ఇప్పుడు ‘ఫ్యామిలీ స్టార్’ చేశాను. లాక్ డౌన్లో నా స్టాఫ్ జీతాలు, మెయింటెనెన్స్కి ఇబ్బంది కలిగింది. అప్పుడు రాజుగారే పంపించారు.. ఆయనకు సినిమా చేయాలని అప్పుడే అనుకున్నా. ఈ సినిమాకి నాకు పేరొస్తే ఆ క్రెడిట్ పరశురామ్కి ఇస్తాను’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘విజయ్, పరశురామ్ కలిసి ‘గీత గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ చేశారు. ‘ఫ్యామిలీ స్టార్’ కూడా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఏర్పడింది. విజయ్ ఈ సినిమాలో 360 డిగ్రీస్ క్యారెక్టర్ చేశాడు. నిర్మాతల గురించి ఆలోచించే హీరో విజయ్. అందుకే అతనితో మరో రెండు సినిమాలు చేయబోతున్నా’’ అన్నారు. ‘‘ఫ్యామిలీ స్టార్’లో ఇందు పాత్రను పోషించగలనా? లేదా అని భయపడ్డాను. కానీ, విజయ్, ‘దిల్’ రాజు, డైరెక్టర్గార్లు సపోర్ట్ ఇచ్చారు’’ అన్నారు మృణాల్ ఠాకూర్. -
Family Star Press Meet: ‘ఫామిలీ స్టార్’ మూవీ ప్రెస్ మీట్ (ఫోటోలు)
-
సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు
-
‘డీజే టిల్లు-2’ మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
సాయి ధరమ్ తేజ్ 'సత్య' ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
నందిగం సురేష్ బాబు ప్రెస్ మీట్
-
మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ లైవ్
-
Amar : మూడు దారులు : రాజకీయ రణరంగంలో భిన్న ధృవాలు
-
నరేన్ రామాంజుల రెడ్డి ప్రెస్ మీట్
-
ఏపీలో ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తాం: CEC రాజీవ్ కుమార్
-
ఎమోషనల్ రాఘవ రెడ్డి
శివ కంఠమనేని హీరోగా, రాశీ, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాఘవ రెడ్డి’. స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో సంజీవ్ మేగోటి దర్శకత్వంలో కేఎస్ శంకర్ రావ్, జి. రాంబాబు యాదవ్, ఆర్. వెంకటేశ్వర్ రావు నిర్మించిన ఈ చిత్రం జనవరి 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిర్మాత మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమాల వల్లే ఇండస్ట్రీ బతుకుతుంది. ఇండస్ట్రీని బతికించుకునేందుకు ‘రాఘవరెడ్డి’లాంటి సినిమాలను ప్రేక్షకులు విజయవంతం చేయాలి. ఈ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ కనిపిస్తున్నాయి’’ అన్నారు. ‘‘ఇంట్రవెల్ అందరికీ నచ్చుతుంది. క్లైమాక్స్ సీన్స్ ఎమోషనల్గా టచ్ అవుతాయి. ఆడియన్స్ కంటతడి పెడతారు’’ అన్నారు శివ కంఠమనేని. ‘‘తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత దర్శకుడిగా ‘రాఘవ రెడ్డి’ అనే ఓ మంచి సినిమా తీశాను’’ అన్నారు సంజీవ్. ‘‘ఈ సినిమాలో కూతురే ప్రపంచంగా బతికే దేవకి పాత్ర చేశాను’’ అన్నారు రాశీ. ‘‘ఈ సినిమాలో క్రిమినాలజీ ఫ్రొఫెసర్ రాఘవ రెడ్డిగా శివగారు నటించారు. యూత్కి కావల్సిన ఎలిమెంట్స్తో పాటు యాక్షన్, సోషల్ మెసేజ్ కూడా ఉన్నాయి’’ అన్నారు నిర్మాతలు. -
ఈ ఏడాది ముగింపులో మా సినిమా ఓ స్వీట్
‘‘హాయ్ నాన్న’ చిత్రంలో వినోదం, అన్ని రకాల భావోద్వేగాలున్నాయి. ఈ చిత్రకథపై ఉన్న కాన్ఫిడెన్స్తో కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని హీరో నాని అన్నారు. శౌర్యువ్ దర్శకత్వంలో నాని, మృణాల్ ఠాకూర్ జంటగా, బేబీ కియారా ఖన్నా కీలక పాత్రలో నటించిన చిత్రం ‘హాయ్ నాన్న’. మోహన్ చెరుకూరి, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాని విలేకరులతో పంచుకున్న విశేషాలు. ► ‘హాయ్ నాన్న’ కథని శౌర్యువ్ చెప్పినప్పుడే చాలా హై ఇచ్చింది. యాక్షన్ సినిమాల్లో ఒక రకమైన ఎనర్జీ ఉంటుంది. ‘యానిమల్’తో సహా ఈ ఏడాది వచ్చిన చాలా యాక్షన్ సినిమాలు కావాల్సిన దానికంటే ఎక్కువగానే స్పైస్ని పంచాయి. అయితే స్పైసీ తర్వాత ఉండే ఆ స్వీట్ని మా సినిమా ఇస్తుంది. ఈ ఏడాది అన్ని ఐటమ్స్ పెట్టారు కానీ, ముగించే ఐటమ్ నేను పెడతాను (నవ్వుతూ). ‘జెర్సీ’ చూసి బయటికి వచ్చినప్పుడు ప్రేక్షకుల్లో ఒక రకమైన భావోద్వేగం ఉంటుంది. కానీ, ‘హాయ్ నాన్న’ చూసి, ప్రేక్షకులు హ్యాపీగా నవ్వుతూ బయటికి వస్తారు. ఈ ఆనందంలోనే మనసుని హత్తుకునే భావోద్వేగాలు ఉంటాయి. ►నాకు కంఫర్ట్ జోన్ అనేది ఏదీ లేదు. కామెడీ సినిమాలు చేసినప్పుడు అది నా కంఫర్ట్ జోన్ అన్నారు. తర్వాత ‘జెర్సీ’ చేసినప్పుడు ఎమోషన్ నా కంఫర్ట్ జోన్ అన్నారు. ఆ తర్వాత ‘దసరా’ లాంటి రా మూవీ చేశాను. నాకు కంఫర్ట్ జోన్ అనేది లేకుండా సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అలాగే నేను ఇమేజ్ కోణంలో చూడను. కథ నచ్చిందనే ‘దసరా’ చేశాను.. ఇప్పుడు ‘హాయ్ నాన్న’ చేశాను. ఇది అందరికీ కనెక్ట్ అయ్యే సినిమాగా నిలుస్తుంది. ►ఇలాంటి ఓ మంచి సినిమాని ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లాలనే ప్రమోషన్స్ ఎక్కువగా చేశాం. అందులో భాగంగానే వెంకటేశ్గారిని ఇంటర్వ్యూ చేశా. ప్రమోషన్స్లో భాగంగానే హీరో శివరాజ్ కుమార్గారిని కలిశా. వెంకటేశ్గారు ‘నా తర్వాత ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకులు నిన్ను చూస్తారు’ అన్నారు. మనల్ని ఎవరైనా ఫ్యామిలీ హీరో అన్నప్పుడు హ్యాపీగా ఉంటుంది. ►వైర ఎంటర్టైన్మెంట్కి ‘హాయ్ నాన్న’ తొలి చిత్రం. మోహన్ చెరుకూరి, విజయేందర్ రెడ్డిగార్లు ΄్యాషనేట్ ్ర΄÷డ్యూసర్లు. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ ఓ పాటలో మాత్రమే కనిపిస్తారు. ►నా ‘దసరా’ సినిమా దాదాపు రూ. 120 కోట్లు వసూలు చేసింది. నా తర్వాతి చిత్రాలు కూడా అదే స్థాయిలో కలెక్షన్స్ రాబట్టాలని ఆలోచిస్తూ కూర్చుంటే ఎక్కువ సినిమాలు చేయలేను. ►‘యానిమల్’ లాంటి కథ వస్తే చేస్తాను. ‘దసరా’ చిత్రంలో నేను చేసిన పాత్రని ఎవరైనా ముందుగా ఊహించారా? చేశాకే బాగుందన్నారు. సవాల్తో కూడుకున్న పాత్రలు, కథలు వచ్చినప్పుడు చేయడానికే ఇష్టపడతాను. నాతో పని చేయాలని ‘బలగం’ వేణు అనుకుంటున్నారని ‘దిల్’ రాజుగారు చె΄్పారు. వేణు వచ్చి నాకు కథ చెబితే తప్పకుండా చేస్తాను. ప్రస్తుతం ‘సరి΄ోదా శనివారం’ సినిమా చేస్తున్నాను. ‘హిట్ 3’ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. పూర్తయిన వెంటనే షూటింగ్ మొదలుపెట్టేస్తాం. -
శ్రీకాంతాచారికి ఈ విజయం అంకితం: రేవంత్
-
కౌంటింగ్ ప్రక్రియపై ఈసీ ప్రెస్ మీట్
-
తండ్రిని తలుచుకుని ఎమోషనలైన స్టార్ హీరో
‘‘కొన్నేళ్ల క్రితం మా నాన్నను(రిషీ కపూర్) కోల్పోయా. నా చిన్నప్పుడు నాన్న షూటింగ్స్తో బిజీగా ఉండటంతో సరైన సమయాన్ని గడపలేకపోయాను. నాన్నపై నాకు ప్రేమ, గౌరవం ఉంది. కానీ, మా మధ్య స్నేహబంధం లేదు. ఆయనతో ఫ్రెండ్లీగా ఉండి మరెన్నో విషయాలు పంచుకుని ఉంటే బాగుండేదనే బాధ నాకు ఉంది. నా జీవితాంతం ఆ బాధ ఉంటుంది’’ అని హీరో రణ్బీర్ కపూర్ అన్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్బీర్ కపూర్, రష్మికా మందన్న జంటగా నటించిన చిత్రం ‘యానిమల్’. తండ్రీకొడుకుల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి దిమ్రీ కీలక పాత్రల్లో నటించారు. భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 1న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై నిర్మాత ‘దిల్’ రాజు రిలీజ్ చేస్తున్నారు. సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో రణ్బీర్ కపూర్ మాట్లాడుతూ–‘‘తెలుగు ప్రేక్షకులంటే నాకెంతో అభిమానం. ఇక్కడ వాళ్లు చూపించే ప్రేమాభిమానం మరో స్థాయిలో ఉంటాయి. సినిమాలు మానేసి నా కుమార్తె రాహ కోసం నా సమయాన్ని కేటాయించాలని ఉంది. కాకపోతే నేనూ నా కలలను సాకారం చేసుకోవాలి కాబట్టి అలా చేయలేను (నవ్వుతూ)’’ అన్నారు. సందీప్ రెడ్డి మాట్లాడుతూ–‘‘మహేశ్బాబుకు ‘యానిమల్’ కథ చెప్పలేదు. ‘డెవిల్’ కథ చెప్పాను. కానీ మా కాంబో కుదరలేదు’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘అన్ని చిత్రాలకు మన దగ్గర టికెట్ రేట్స్ ఎలా ఉంటాయో ‘యానిమల్’కి అలానే ఉంటాయి. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేశాం. అద్భుతమైన స్పందన లభించింది. ‘అర్జున్ రెడ్డి’ని మిస్ అయ్యాను. అప్పటి నుంచి సందీప్ సినిమా కోసం ప్రయత్నిస్తున్నాను. భూషణ్గారు నన్ను నమ్మి ఈ సినిమా మా చేతిలో పెట్టారు’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నేను రణ్బీర్ తండ్రి పాత్ర చేశాను’’ అన్నారు అనిల్ కపూర్. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ‘డీప్ ఫేక్ వీడియో’ గురించి రష్మిక మాట్లాడుతూ – ‘‘ఆ వీడియో చూసినప్పుడు ఇలాంటివాటికి రియాక్ట్ అయితే ఏమనుకుంటారో అనిపించింది. అయితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయడంతో.. తప్పకుండా స్పందించాలని నిర్ణయించుకున్నాను’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత భూషణ్ కుమార్, నటుడు బాబీ డియోల్ మాట్లాడారు. -
కాంగ్రెస్కు ఓటేస్తే..కేసీఆర్కు వేసినట్టే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది కేసీఆర్కు వేసినట్టేనని, బీఆర్ఎస్కు అధికారం అప్పగించినట్టేనని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే వెళ్లి బీఆర్ఎస్లో చేరారని, గత పదేళ్లలో అంతా కలసి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ అవినీతిపై విచారణ జరిపిస్తామని, దోచుకున్న సొమ్మును వసూలు చేస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలకు ఎలాంటి ప్రజాస్వామ్య విలువలు లేవని, వాటికి కుటుంబ పాలనే సర్వస్వమని విమర్శించారు. బీఆర్ఎస్–బీజేపీ మధ్య పొత్తు ఏర్పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలతో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే తెలంగాణ అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. శనివారం కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జీ ప్రకాశ్ జవదేకర్, ఇతర నేతలతో కలసి అమిత్ షా మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు మినహా చేసిందేమీ లేదు. మిషన్ భగీరథ, పాస్పోర్ట్ స్కాం, మియాపూర్ భూముల అక్రమాల్లో వందల కోట్ల కుంభకోణం, ఔటర్రింగ్రోడ్డు టెండర్ల స్కాం, కాళేశ్వరం ప్రాజెక్టు, ఢిల్లీ మద్యం స్కాం, గ్రానైట్ కుంభకోణం.. ఇలా ఎన్నో రూపాల్లో అవినీతి జరిగింది. కాగ్ నివేదిక ప్రకారం మిషన్ కాకతీయలో రూ.22వేల కోట్లు ఖర్చు చేసినా 65 శాతమే పనులు పూర్తయ్యాయి. దళితబంధు, డబుల్ బెడ్రూం స్కీంలలో దళితుల నుంచి కమీషన్లు దండుకున్న చరిత్ర బీఆర్ఎస్ నేతలది. విచారణ చేసి జైలుకు పంపుతాం బీఆర్ఎస్ సర్కార్ అవినీతిపై కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలపై ప్రస్తుతం విచారణ సాగుతోంది. తెలంగాణలో బీజేపీ సర్కార్ ఏర్పడగానే ఒక్కొక్కఅవినీతి ఆరోపణపై విచారణ జరిపి, దోషులుగా తేలిన ప్రతీ ఒక్కరిని కటకటాల వెనక్కి పంపిస్తాం. హైదరాబాద్లో రోహింగ్యాల చొరబాటు, ఇక్కడ ఆశ్రయం పొంది ఓటర్ కార్డులు పొందడంపై ఎన్ఐఏ విచారణ సాగుతోంది. దీనిపై కుట్రను ఎన్ఐఏ భగ్నం చేసింది. పదిరోజుల క్రితమే కేంద్రానికి నివేదిక ఇచ్చింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ అవినీతి సొమ్ముతో ఎన్నికల వాతావరణాన్ని కలుషితం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రలోభాల కోసం కర్ణాటక నుంచి, ఇతర రూపాల్లో వస్తున్న అక్రమ డబ్బు విషయంలో ఏజెన్సీలు, ఈసీ తగిన చర్యలు తీసుకుంటున్నాయి. కేసీఆర్ను మార్చాలంటూ కాంగ్రెస్కు ఓటేస్తే.. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ తెలంగాణ విరోధిగా నిలిచింది. సుదీర్ఘ పాలనలో తెలంగాణను అణచివేసింది. ఉమ్మడి ఏపీలో నాటి సీఎం టి.అంజయ్యను తీవ్రంగా అవమానించింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావును అవమానించిన తీరు తెలంగాణ ప్రజల మనస్సులో నాటుకుపోయింది. 2009లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి వెనక్కితగ్గి దాదాపు 1,500 మంది ఆత్మబలిదానాలకు కాంగ్రెస్ కారణమైంది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కానీ కాంగ్రెస్కు ఓటు వేసినా, ఒవైసీలకు ఓటు వేసినా బీఆర్ఎస్కు, కేసీఆర్కు పడ్డట్టే. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే వెళ్లి బీఆర్ఎస్లో చేరిపోయారు. బీఆర్ఎస్ను గెలిపిస్తే అవినీతి తప్ప మరేమీ చేయలేదు. గత పదేళ్లలో అంతా కలసి అవినీతికి పాల్పడ్డారు. తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు తీరాలంటే బీజేపీని గెలిపించాలి. ప్రస్తుత పథకాలేవీ ఆపబోం.. తెలంగాణతోపాటు దేశ భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికల్లో చైతన్యవంతమైన ఇక్కడి ఓటర్లు ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీకి అండగా నిలుస్తారని, డబుల్ ఇంజిన్ సర్కార్ను తీసుకొస్తారని మాకు పూర్తి విశ్వాసం ఉంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమై బీసీ నేతను సీఎంను ఎన్నుకుంటారు. ప్రస్తుతం అమలవుతున్న పథకాలేవీ మేం ఆపబోం. రాష్ట్రంలో బీజేపీ గెలిస్తే తొలి కేబినెట్ భేటీలోనే పెట్రోల్, డీజిల్లపై వ్యాట్ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంటాం. బీఆర్ఎస్ సర్కార్ ముస్లింలకు ఇస్తున్న 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వాటిని సర్దుబాటు చేస్తాం. ఎస్సీ వర్గీకరణకు చర్యలు తీసుకుంటాం. ప్రజలు రాష్ట్రంలో ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలి..’’అని అమిత్ షా విజ్ఞప్తి చేశారు. -
'సినిమా బాగుంటే అడుతది. లేదంటే పీకుతది'.. నాని ఆసక్తికర కామెంట్స్!
దసరాతో హిట్ కొట్టిన నేచురల్ స్టార్ నాని మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. దసరాలో మాస్ యాక్షన్లో అలరించిన.. ఈసారి మాత్రం హాయ్ నాన్న అంటూ తండ్రి, కూతుళ్ల ఎమోషనల్ స్టోరీతో రానున్నారు. సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో హీరోయిన్గా కనిపించనుంది. అయితే మూవీ ప్రమోషన్స్తో నాని బిజీ అయిపోయారు. తెలంగాణలో ఎన్నికల హడావుడి ఉండడంతో విభిన్నమైన రీతిలో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ మేనిఫెస్టో ప్రకటించిన నాని.. తాజాగా ప్రెస్మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్లో రాహుల్ మాట్లాడుతూ.. 'మన రాహుల్ వచ్చిండా. నువ్వు చాలా గమ్మత్తుగా ఉన్నావయ్యా. ఇక్కడ నార్త్, సౌత్ సినిమా అని ఉండదు. లవ్ స్టోరీ, ఫ్యామిలీ స్టోరీ కాదని నేను అనలే. మన సినిమాను పోస్ట్ పోన్ కానివ్వం. ఏమయ్యా రాహుల్ ప్రీ పోన్కు, పోస్ట్ పోన్కు ఆ మాత్రం తేడా తెల్వదా నీకు. సినిమా బాగుండే అడుతది. లేకుంటే పీకుతది. డిసెంబర్ 7న థియేటర్లో దావత్ చేసుకోవాలే. తమ్ముడు నువ్వు ఏదో కిరి కిరి పెట్టాలని చూస్తున్నావ్. అదే జరగదు. అనుకున్న టైంకే సినిమా రిలీజ్ అయితది.' నవ్వులు పూయించారు. హాయ్ నాన్న పార్టీ ప్రెస్ మీట్ అంటూ తెలంగాణం సీఎం కేసీఆర్ స్టైల్లో స్పీచ్ అదరగొట్టేశారు నాని. కాగా.. ఈ చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఊరికే Press meet పెట్టా 😬#HiNanna #HiNannaOnDec7th pic.twitter.com/bZIQroHN5P — Nani (@NameisNani) November 20, 2023
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ప్రశాంతంగా జాతర జరుపుకోవాలి
నేరచరిత లేనివారిని బైండోవర్ చేయొద్దు
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
టమాట సీజన్ ప్రారంభం
No Headline
కూడేరులో జూనియర్ కాలేజ్ ఏర్పాటు
బాధ్యతగా విధులు నిర్వర్తించండి
ఆ ఇద్దరు టీచర్లపై విద్యాశాఖ ప్రేమ
ఆకట్టుకున్న మాక్డ్రిల్
27 నుంచి విజయవాడ రైలు రద్దు
తప్పక చదవండి
- మాక్స్వెల్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
- జీతాలపై ప్రభావం.. ఎయిర్ఇండియా ఉద్యోగుల ఆందోళన!
- విడాకుల రూమర్స్.. ఈ ప్రపంచం గురించి పట్టించుకోనంటున్న నటుడు
- ఒకపుడు జర్నలిస్టు, అంబానీని మించిన ఇంద్రభవనంలో : అత్యంత అందమైన రాణి
- ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు.. ఈసీ సీరియస్
- ఈవెంట్లో ప్రియాంక చోప్రా.. వందల కోట్ల విలువైన నెక్లెస్తో!
- T20: బంగ్లాకు షాకిచ్చిన పసికూన.. మినీ టీమిండియా అంటూ..
- చనుగొండ్లలో చిరుత పిల్లల సంచారం.. భయాందోళనలో గ్రామస్తులు
- ఇజ్రాయెల్ హెచ్చరిక.. రాయబారులు వెనక్కి రండి
- నేమ్ప్లేట్ మార్చేసిన సూపర్ మామ్ సానియా మీర్జా ఫోటోలు వైరల్
Advertisement