-
Allu Arjun Jatara Look Secret: పుష్పరాజ్ భీకర రూపం రహస్యం ఇదేనా?
పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ పీక్కు చేరింది. ఈ మూవీకి జాతీయ ఉత్తమ అవార్డు గెలుచు కుని మరో మెట్టు ఎక్కాడు అల్లు అర్జున్. దీనికి సీక్వెల్గా వస్తున్న 'పుష్ప 2: ది రూల్' పై అంచనాలు కూడా అదే రేంజ్లో ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే పుష్ప 2 సినిమా టీజర్లో అల్లు అర్జున్ నీలి రంగు చీర, నగలు, నిమ్మకాయ దండలతో వెరైటీ లుక్ హాట్టాపిక్గా నిలిచింది. దీంతో అభిమాన హీరో కొత్త ట్రెండ్ సెట్ చేయడం ఖాయమని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. 2003లో గంగోత్రి సినిమాతో తెరంగేట్రం చేసిన అల్లు అర్జున్ ..ఈ మూవీలో లేడీ గెటప్తో కనిపించి అలరించాడు. తాజాగా పుష్ప-2 సినిమాలో కూడా అమ్మవారి భీకర రూపంతో ఫ్యాన్స్ని మరింత ఎట్రాక్ట్ చేస్తున్నాడు. ఎర్రచందనం, తిరుపతి జిల్లాలో కథ సాగుతుంది కనుక ఇది గంగమ్మ జాతర నేపథ్యమే ఈ లుక్అని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏంటీ గంగమ్మ జాతర తెలుసుకుందాం రండి. తిరుపతి గ్రామదేవత శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. గంగమ్మ జాతరకు 900 ఏళ్ల చరిత్ర ఉంది. గ్రామదేవతగా అవతరించిన గంగమ్మ.. సాక్షాత్తు తిరుమల శ్రీవారి చెల్లెలని భావిస్తారు. వారం రోజుల పాటు జరిగే గంగమ్మ జాతరకు ఒక ప్రత్యేకత ఉంది. గంగమ్మ జాతర విశిష్టత పూర్వం తిరుపతిని పాలెగాళ్లు పరిపాలించే రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంలోని అందమైన యువతులను బలాత్కరించేవాడట. కొత్తగా పెళ్ళైన వధువులంతా మొదటిరాత్రి తనతో గడపాలంటూ ఆంక్షలు విధించి వేధించేవాడట. ఈ పాలెగాడిని అంతమొందించి స్త్రీ జాతిని రక్షించేందుకు జగన్మాత తిరుపతికి 2 కి.మీ దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించిందని భావిస్తారు భక్తులు. యుక్త వయసుకొచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలెగాడి కన్నుపడి ఆమెను బలాత్కరించబోయాడట. దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది.. తనను అంతమొందించేందుకు అవతరించిన పరాశక్తే గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కోవడంతో అనేక వేషాలు ధరించి మూడు రోజులపాటు గాలించినా ఫలితం దక్కలేదు. దీంతో నాలుగోరోజు గంగమ్మ-దొరవేషం వేసి, పాలెగాడిని అంత మొందించిందని భక్తుల విశ్వాసం. ఈ దుష్టశిక్షణను తలచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ జాతర చేసుకుంటారు. ఈ జాతరలో తొలి రోజున బైరాగివేషం ,రెండోరోజు బండవేషం,మూడోరోజు తోటివేషం,నాలుగోరోజు దొరవేషం వేసుకుంటారు. నాలుగో రోజున పాలెగాడిని సంహరించిన గంగమ్మ ఐదోరోజున మాతంగి వేషం ధరిస్తారు. ఆరోరోజు సున్నపుకుండల వేషం వేస్తారు. ఏడోరోజున జాతరలో భాగంగా సప్పరాల ఉత్సవం జరుగుతుంది. గోపురాన్ని పోలిన సప్పరాలను (వెదురు బద్దలతో) తయారుచేసి వాటిని శరీరంపై నిలబెట్టుకుంటారు. అలా చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని ప్రతీతి. అదేరోజున కైకాల కులస్థులు పేరంటాళ్ళ వేషం వేస్తారు.మగవారు ఆడవేషం వేసుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. ఇలా చేస్తే అమ్మవారు అనుగ్రహించి తమ కోర్కెలు తీరుస్తుందని భక్తుల నమ్మకం. పేరంటాలు వేషంలోఉన్న కైకాల కులస్థులు ఆలయానికి చేరుకుని నీలం రంగు ద్రవంతో బంకమట్టిని కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్నితయారుచేస్తారు. భక్తులంతా అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకున్నాక ఆ విగ్రహం నుంచిమట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. ఎనిమిదిరోజులపాటు ఘనంగా జరిగిన జాతర ఈ ఘట్టంతో ముగుస్తుంది. బన్నీ న్యూ లుక్ రహస్యం వీడాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. మరోవైపు పుష్ప 2: ది రూల్ టీజర్కి రెస్పాన్స్ ఒక రేంజ్లో ఉంది. బన్నీ మాతంగి లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ‘‘మరో బ్లాక్బస్టర్..బన్నీకి మరో జాతీయ అవార్డు పక్కా" అని కమెంట్ చేశారు. -
Allu Arjun HD Images: ప్రతి పాత్రా ప్రత్యేకం.. వెండితెర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు ప్రత్యేకం (ఫొటోలు)
-
అల్లు అర్జున్ పుష్ప మూవీ.. ఆ స్టైల్ కాపీ కొట్టేశారా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప బాక్సాఫీస్ను షేక్ చేసింది. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రం పలు రికార్డులు కొల్లగొట్టింది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. శ్రీవల్లిగా టాలీవుడ్ను అభిమానులను అలరించింది. ఎర్రచందనం సిండికేట్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాతో అల్లు అర్జున్ను ఓ రేంజ్ స్థాయికి తీసుకెళ్లింది. అంతే కాకుండా ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ కూడా అందుకున్నారు. అయితే ఈ సినిమాలో పుష్పరాజ్ మేనరిజానికి సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా భుజం కాస్తా పైకి ఎత్తి బన్నీ నటించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఇప్పటికీ ఆ స్టైల్కు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఏది ఏమైనా ఈ చిత్రంలో అల్లు అర్జున్ డైలాగ్స్, వాకింగ్ స్టైల్ ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకున్నాయి. పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదేలే అనే డైలాగ్ అభిమానులను ఓ ఊపు ఊపేసింది. పుష్ప సినిమాలో ముఖ్యంగా అల్లు అర్జున్ నడక ఎప్పటికీ మర్చిపోలేరు. అయితే అచ్చం అల్లు అర్జున్ లాగే ఆ వాకింగ్ స్టైల్ను టాలీవుడ్ హీరో చేసి చూపించారు. కాకపోతే ఇప్పుడు కాదండోయ్. దాదాపు 22 ఏళ్ల క్రితమే శ్రీహరి అలాంటి మేనరిజంతో మెప్పించారు. ఇది చూసిన టాలీవుడ్ ఫ్యాన్స్ షాకవుతున్నారు. 2002లో వచ్చిన పృథ్వీ నారాయణ అనే చిత్రంలో సేమ్ బన్నీ వాకింగ్ స్టైల్తో అదరగొట్టారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ శ్రీహరి అద్భుతంగా చేశారంటూ కామెంట్స్ చేశారు. మరికొందరేమో పుష్ప మేనరిజం కాపీ కొట్టారా? అంటూ డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ప్రస్తుతం బన్నీ పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. pushpa walking style appatlone srihari gaaru 👌❤️ pic.twitter.com/4PJj9Y1Z1Z — celluloidpanda (@celluloidpanda) March 25, 2024 -
ఎన్ని కోట్లు ఇచ్చినా ఇకపై వాటికి మాత్రం 'నో'!
‘ఊ అంటావా మావ.. ’ అంటూ ‘పుష్ప’లోని ప్రత్యేక పాటలో వీలైనంత గ్లామరస్గా కనిపించడంతో పాటు హాట్ స్టెప్స్తో, హాట్ హాట్ హావభావాలతో ఐటమ్ సాంగ్ లవర్స్ని ఆకట్టుకున్నారు సమంత. అయితే ఈ బ్యూటీ ఈ రేంజ్లో చేయడం చాలామందిని షాక్కి గురి చేసింది. ‘అవసరమా?’ అని చర్చించుకున్నవాళ్లూ ఉన్నారు. సమంత కూడా ఈ పాట చేసినప్పుడు చాలా అసౌకర్యంగా ఫీలయ్యారట. ఆ విషయం గురించి ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ – ‘‘ఊ అంటావా..’ పాట ఫస్ట్ షాట్ తీసేటప్పుడు భయంగా అనిపించింది. నా కాళ్లు వణికాయి. నేను అంత అందంగా ఉండనని, కొందరు అమ్మాయిల్లా బాగుండననీ అనుకుంటుంటాను. దాంతో నాకు ‘ఊ అంటావా..’ పాట సవాల్లా అనిపించింది. అయితే సెక్సీగా కనిపించడం అనేది నా ఆలోచన కాదు కాబట్టి ఆ పాట చిత్రీకరణ అప్పుడు వణికిపోయాను. కానీ ఓ వ్యక్తిగా, నటిగా నాకు అసౌకర్యంగా అనిపించినవి, క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడం నుంచే నేను ఎదిగాను. ‘ఊ అంటావా..’ పాట నాకు సౌకర్యం కాదనిపించినా కొత్తగా ఏదైనా చేయాలని చేశాను. నిజానికి ఆ పాట లిరిక్స్ నాకు సవాల్గా అనిపించాయి. అమ్మాయిలంటే అందం మాత్రమే కాదనేలా ఆ పాట ఉంటుంది. అది నచ్చి చేశాను’’ అన్నారు. ఇకపై ఇలాంటి పాటలు చేస్తారా? అనే ప్రశ్నకు ‘‘లేదు.. ఎందుకంటే ఇలాంటి సవాళ్లను స్వీకరించాలనుకోవడంలేదు’’ అన్నారు సమంత. ఇక ప్రత్యేక పాటలకు సమంత ‘ఊహూ’ అంటారని స్పష్టమైపోయింది. -
అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 3 బిగ్ అప్డేట్
-
తెలుగు స్టార్ దర్శకుడికి ఇంత పెద్ద కూతురు ఉందా? గుర్తుపట్టారా మరి?
ఈ అమ్మాయి గురించి ఎవరికీ పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఈమె తండ్రి గురించి టాలీవుడ్లో ఎవరినీ అడిగినా సరే చెప్పేస్తారు. ఎందుకంటే స్వతహాగా టీచర్ అయిన ఇతడు.. ఎవరి దగ్గర పనిచేయకుండానే ఇండస్ట్రీలోకి వచ్చాడు. తనదైన మార్క్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓ రెండు మూడేళ్ల క్రితం మాత్రం తన లేటెస్ట్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఆ దర్శకుడి కూతురి ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మాయి పేరు సుకృతి వేణి. తండ్రి పేరు సుకుమార్. యస్.. మీరు ఊహించింది కరెక్టే. పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి డైరెక్టర్ సుకుమార్ కూతురే. తాజాగా ఈమె పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ క్రమంలోనే సుకుమార్ భార్య తబిత కొన్ని ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇందులో సుకృతిని చూస్తే సడన్గా గుర్తుపట్టలేరు. ఎందుకంటే గతంలో ఒకటి రెండు సార్లు కనిపించిన కాస్త చిన్నపిల్లలా అనిపించింది. కానీ ఇప్పుడు టీనేజీలోకి వచ్చేసింది. (ఇదీ చదవండి: చాన్నాళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు) అయితే సడన్గా సుకుమార్ కూతురు ఫొటో చూసి.. అందంగా ఉన్నారని కామెంట్స్ పెడుతున్నారు. అలానే ఈ అమ్మాయి.. త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందేమోనని అంటున్నారు. అయితే సుకృతికి యాక్టింగ్ టాలెంట్ ఉందా లేదా? అనేది పక్కనబెడితే పాడే ప్రతిభ ఉంది. ఎందుకంటే సొంతంగా యూట్యూబ్ ఛానెల్ కూడా ఈమెకి ఉంది. అలానే అమెరికాలోని మసాచుసెట్స్ బెర్కెలే మ్యూజిక్ కాలేజీలో కోర్స్ చేస్తున్నట్లు ఉంది. ఇవన్నీ చూస్తుంటే సింగర్ అయ్యేలా కనిపిస్తుంది. ఒకవేళ సింగర్ అయితే అప్పుడు తెలుగు సినిమాల్లో పాడుతుందా? లేదంటే పాప్ సింగర్ అవుతుందా అనేది చూడాలి. ఇకపోతే 'పుష్ప' ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ని 'బన్నీ మామ' అని పిలుస్తూ క్యూట్గా మాట్లాడింది ఈమెనే. కావాలంటే యూట్యూబ్లో వీడియో చూడండి. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: చెల్లి ఎంగేజ్మెంట్.. డ్యాన్స్తో దుమ్మురేపిన సాయిపల్లవి!) View this post on Instagram A post shared by Thabitha Bandreddi (@thabitha_sukumar) View this post on Instagram A post shared by Thabitha Bandreddi (@thabitha_sukumar) -
అల్లు అర్జున్ 'పుష్ప'గాడికి రెండేళ్లు.. ఆశ్చర్యం కలిగించే రికార్డ్స్
సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'పుష్ప' 2021 డిసెంబర్ 17న పాన్ ఇండియా రేంజ్లో విడుదలైంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా కోసం సుమారు రూ. 170 కోట్లు ఖర్చు చేసినట్లు నివేదికలు ఉన్నాయి. బన్నీ- రష్మిక మందన్నల యాక్టింగ్ ఈ సినిమా విజయానికి బలమైన కారణమైతే.. సినిమా చివరి భాగంలో ఫహద్ ఫాజిల్ పాత్ర హైలెట్గా నిలిచింది. ప్రముఖ హీరోయిన్ సమంత ఈ సినిమా కోసం 'ఉ అంటావా... ఊ ఊ అంటావా..' పాటలో ప్రత్యేకంగా కనిపించింది. ఇలా పుష్ప సినిమాకు ఎన్నో అదనపు ఆకర్షణలతో విడుదలై.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారుగా రూ. 373 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. నేటికి (డిసెంబర్ 17) ఈ సినిమా విడదులై రెండు ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డులతో పాటు పలు ఆసక్తకరమైన విషయాలు మరోసారి గుర్తుచేసుకుందాం. ► అల్లు అర్జున్కు పుష్ప తొలి పాన్ ఇండియా సినిమా.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల చేశారు. ► ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగిన ఈ సినిమా నిడివి 2: 59 గంటలు. 'పుష్ప' అత్యధిక భాగం అడవుల్లోనే షూట్ చేశారు. అందుకోసం మారేడుమిల్లి అడవులను ఎంపిక చేసుకున్నారు. ► అల్లు అర్జున్ 'పుష్ప' గెటప్లో రెడీ అయ్యేందుకు మేకప్ కోసం దాదాపు రెండు గంటల సమయం పట్టేదని బన్నీ చెప్పాడు. తెల్లవారుజామున 4.30 నిద్రలేచి సెట్కు వెళ్లితే.. ఉదయం 5 నుంచి 7 వరకూ మేకప్ కోసమే సమయం పట్టేదట. షూటింగ్ పనులు పూర్తయ్యాక మేకప్ తీయడానికి 30 నిమిషాల సమయం పట్టేదని బన్నీ గతంలో చెప్పాడు. ► ఈ సినిమాలోని పాటలు అన్నీ కలిపి యూట్యూబ్లో 7బిలియన్ వ్యూస్ సాధించాయి. అంటే 700కోట్ల మంది వీక్షించారు. ఇండియాలో ఈ రికార్డు సాధించిన తొలి చిత్రంగా పుష్ప రికార్డుకెక్కింది. ► యూట్యూబ్ 'టాప్ 100 గ్లోబల్ సాంగ్స్' జాబితాలో 'ఊ అంటావా మావ.. ఊఊ అంటావా!' పాట మొదటి స్థానంలో నిలవగా.. 'సామీ సామీ' పాట రెండో స్థానం దక్కించుకుంది. దాక్కో దాక్కో మేక 24వ స్థానంలో ఉంటే శ్రీవల్లి సాంగ్ 74వ ప్లేసులో నిలిచింది. ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా అనే పాట మాత్రం 97వ స్థానంలో నిలిచింది. ► 'ఆర్య'తో బన్నీకి సూపర్ హిట్ ఇచ్చిన సుకుమార్.. దాదాపు పదేళ్ల తర్వాత 'పుష్ప' కోసం మళ్లీ వాళ్లిద్దరూ ఈ ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపారు. ► ప్రపంచవ్యాప్తంగా పుష్ప రూ.373కోట్లు (గ్రాస్) వసూలు చేసింది. ఒక్క హిందీలోనే రూ.108 కోట్లు (నెట్) కలెక్షన్లు రాబట్టడం విశేషం. 2021లో విడుదలైన చిత్రాల్లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప రికార్డు క్రియేట్ చేసింది. ►ఓటీటీలోనూ 'పుష్ప' గాడు దుమ్ములేపాడు. 2022లో అమెజాన్ప్రైమ్ వీడియోలో అత్యధికమంది వీక్షించిన మూవీగా నిలిచింది. టెలివిజన్లోనూ పుష్పరాజ్ ఏమాత్రం తగ్గలేదు. 2022లో అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధించిన చిత్రంగా పుష్ప నిలిచింది. అప్పట్లో 10మిలియన్+ ఇన్స్టా రీల్స్ క్రియేట్ చేసి ఇండియాలో పుష్పతో ఇన్స్టాగ్రామ్నే షేక్ చేశాడు. ► అవార్డుల విషయంలోనూ 'తగ్గేదేలే' అంటూ దూసుకుపోయాడు. ఏడు ఫిల్మ్ఫేర్ అవార్డులతో పాటు ఏడు సైమా అవార్డులు ఈ చిత్రానికి దక్కాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ గీత రచయిత, ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డులు వచ్చాయి. ► ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్- 2022 పుష్పకు దక్కింది ► పుష్ప సినిమాకు రెండు జాతీయ అవార్డులు దక్కాయి. ఉత్తమ హీరోగా అల్లు అర్జున్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్కు దక్కాయి. ► 7 ‘సాక్షి ఎక్సలెన్స్’ అవార్డ్స్ను దక్కించుకున్న పుష్ప. -
నిమిషం యాడ్ కోసం రూ. 10 కోట్లు.. రిజెక్ట్ చేసిన అల్లు అర్జున్
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందాడు. దీంతో అతని రెమ్యునరేషన్తో పాటు పలు యాడ్ రెమ్యునరేషన్ కూడా పెరిగింది. సుకుమార్ డైరెక్ట్ చేసి పుష్ప నుంచి పార్ట్ -2 త్వరలో విడుదల కానుంది. 2024 కొత్త ఏడాదిలో బన్నీ పేరు మరోసారి పాన్ ఇండియా రేంజ్లో వెలిగిపోవడం ఖాయం. ఇలాంటి సమయంలో కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తుల కోసం యాడ్స్ రూపంలో ప్రమోట్ చేయాలని కోరడం సహజం. ఈ క్రమంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ఒక మద్యం కంపెనీకి చెందిన తమ ఉత్పత్తులను ప్రమోట్ చేయాలని కోరాయాట. అందుకు సుమారు రూ. 10 కోట్లు ఆఫర్ చేశాయట. కేవలం 60 సెకండ్లు మాత్రమే తమ యాడ్లో కనిపిస్తే చాలని కోరాయట.. కానీ ఈ డీల్ను అల్లు అర్జున్ సున్నితంగా రిజెక్ట్ చేశారని సమాచారం. మద్యం, సిగరెట్స్, గుట్కా తదితర దుర్వ్యసనాల యాడ్స్లలో నటిస్తే సమాజంలో చెడును వ్యాప్తి చేసినట్లు అవుతుందని అయన చెప్పారట.. అందు కోసం ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా తాను చేయనని చెప్పి పంపించేశాడట బన్నీ. ప్రజలకు హానికరం చేసే వస్తువులను ప్రమోట్ చేసి వాటి ద్వారా వచ్చే డబ్బు తనకు అవసరం లేదని ఆయన ఫ్యాన్స్ కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు. సరోగేట్ యాడ్స్ నిషేధం మద్యం, సిగరెట్స్, గుట్కా తదితర హానికరమైన వాటిని సరోగేట్ యాడ్స్ అంటారు. నియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఉండే ప్రకటనల (యాడ్స్) నియంత్రణకు కేంద్రం మార్గదర్శకాలను నిర్ణయించింది. ఈ మేరకు సరోగేట్ యాడ్స్ (ప్రచారం చేయడానికి వీల్లేని ఉత్పత్తులకు సంబంధించి వాటి పేరుతోనే అదేరీతిలో ఉండే వేరే ఉత్పత్తులను చూపించడం)ని కూడా నిషేధించింది. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ గతంలో ఒక పాన్ మసాలా ప్రొడక్ట్ తో కుదుర్చుకున్న బ్రాండ్ అంబాసిడర్ కాంట్రాక్టును రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే ప్రమోషనల్ డబ్బులను కూడా వాపసు ఇచ్చేశారు. ఈ పాన్ మసాలా ప్రకటనను చట్టం నిషేధించిన సరోగేట్ యాడ్స్ గా పరిగణిస్తారని బిగ్ బీ కి తెలియక ఒప్పుకున్నట్లు ఆయన తెలిపిన విషయం తెలిసిందే. భారతదేశంలో ఎందుకు నేరం కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ చట్టం 1995 ద్వారా పొగాకు, మద్యం, సిగరెట్లు వంటి ఉత్పత్తుల ప్రకటనలపై భారత్లో నిషేధం ఉంది. దీంతో సెలబ్రీటిలతో ఈ సరోగేట్ ప్రకటనలు పుట్టుకొచ్చాయి. ప్రజల ఆరోగ్యానికి హానికరమైన ఉత్పత్తుల ప్రకటనలు ఉండకూడదని భారత ప్రభుత్వం నిర్ణయించింది. టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ 2003, సెక్షన్ 5 అనే చట్టాన్ని కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. సిగరెట్లు, పొగాకు వంటి హానకరమైన ఉత్పత్తుల వినియోగాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రోత్సహించ కూడదని ఆ చట్టం చెబుతుంది. దీంతో ప్రస్తుతం చాలామంది సెలబ్రిటీలు వాటిని ప్రమోట్ చేయడం లేదు. -
‘పుష్ప’ నటుడు కేశవ అరెస్ట్
పంజగుట్ట:‘పుష్ప’సినిమాలో హీరో స్నేహితునిగా నటించి ఎంతో క్రేజ్ సంపాదించుకున్న నటుడు జగదీశ్ అలియాస్ కేశవ (మచ్చా) ఓ యువతి ఆత్మహత్యకు కారణమయ్యాడు. పంజగుట్ట పోలీసులు బుధవారం అతన్ని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. కేసు పూర్వాపరాలిలా.. కాకినాడకు చెందిన యువ తి ఓ సంస్థలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే, సినిమాల్లో జూనియర్ ఆరి్టస్టుగా నటిస్తుండేది. పంజగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలోని సంగీత్నగర్లో అపార్ట్మెంట్లో ఓ ఫ్లాట్లో నివసిస్తుండేది. తల్లి దండ్రులు కాకినాడలోనే ఉండగా, ఆమెకు భర్తతో విడాకులు అయ్యాయి. కొంతకాలం కిందట ఆ యువతికి మణికొండలో నివసించే నటుడు జగదీశ్ పరిచయమయ్యాడు. పరిచయం కాస్తా ప్రేమగా మారి కొద్దిరోజులు లివింగ్ రిలేషన్లో ఉన్నారు. జగదీశ్ ఆ యువతిని కాదని మరో యువతిని వివాహం చేసుకోవడంతో ఆమె జగదీశ్ను దూరం పెట్టసాగింది. ఫోన్ చేసినా లిఫ్ట్ చేసేది కాదు. రహస్యంగా ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి ఈ క్రమంలో గత నెల 27న మహిళ నివసించే ఫ్లాట్ వద్దకు వచ్చిన జగదీశ్.. సదరు మహిళ మరో యువకునితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను కిటికీలోనుంచి తీశాడు. ఆ తర్వాత డోర్కొట్టి లోనికి వెళ్లి మీ బాగోతం మొత్తం రికార్డ్ చేశానంటూ వారిని బెదిరించాడు. ఫొటోలు డిలీట్ చెయ్యా లని ఎంత బతిమిలాడినా వినలేదు. దీంతో ఆ యువతి, యువకుడు పోలీసులకు ఫోన్ చేస్తామనడంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు కూడా ఫోన్లో వేధించాడు. 29వ తేదీ ఉదయం ఆ యువతి మరొకరితో సన్నిహితంగా ఉన్న ఫొటో పంపించి.. ఇలాంటి ఫొటోలుఇంకా చాలా ఉన్నాయనీ, అవన్నీ బయటపెడతానని బెదిరించాడు. దీంతో తీవ్ర ఆందోళన, ఒత్తిడికి గురైన యువతి ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎలాంటి సూసైడ్ నోట్ లేకపోవడంతో ఆత్మహత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మరుసటిరోజు యువతి బంధువులు జగదీశ్ వేధింపులను పోలీసులకు వివరించగా ఆ మేరకు కేసు పెట్టారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు జగదీశ్ను పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
'పుష్ప' నటుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం అదే?
'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ ఫ్రెండ్ పాత్ర చేసిన నటుడు జగదీష్ని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలు చేస్తున్న ఈ నటుడు ఇప్పుడు పోలీసుల అదుపులో ఉండటం షాకింగ్గా అనిపించింది. ఇంతకీ ఏమైంది? ఓ జూనియర్ ఆర్టిస్టు.. మరో వ్యక్తితో ఉన్నప్పుడు నటుడు జగదీశ్ ఫొటోలు తీశాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. ఈ వేధింపులు తాళలేక మనస్తాపానికి గురైన సదరు మహిళ (జూనియర్ ఆర్టిస్టు).. గత నెల 29న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మహిళ ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకున్నారు. దీనంతటికి కారణం 'పుష్ప' నటుడు జగదీష్ అని నిర్ధారించుకున్నారు. అయితే గత కొన్నిరోజుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఇతడిని.. అరెస్ట్ చేసి, కోర్టులో బుధవారం హాజరు పరిచారు. ఆత్మహత్య చేసుకున్న మహిళతో గతంలో జగదీశ్కు సినీ రంగంలో పరిచయం ఉందని పోలీసులు తెలిపారు. ఇక జగదీష్ కెరీర్ విషయానికొస్తే.. మల్లేశం, జార్జిరెడ్డి, పలాస 1978 తదితర చిత్రాల్లో సహాయ పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా సుకుమార్ దృష్టిలో పడి 'పుష్ప' లాంటి పాన్ ఇండియా మూవీలో అవకాశం దక్కించుకున్నాడు. మచ్చ మచ్చ అని అల్లు అర్జున్ కూడా ఉండే పాత్రలో కామెడీ పండించాడు. 'సత్తిగాని రెండెకరాలు' అనే సినిమాలో హీరోగానూ నటించాడు. 'పుష్ప 2'తో బిజీగా ఉన్న ఇతడు అరెస్ట్ ఇప్పుడు ఒక్కసారిగా అందరినీ అవాక్కయ్యేలా చేసింది. -
జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్.. సరికొత్త చరిత్ర
జాతీయ అవార్డుల కార్యక్రమం ఢిల్లీలో అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా తెలుగు హీరో అల్లు అర్జున్ అవార్డు అందుకున్నాడు. 'పుష్ప' చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు. అయితే తెలుగు సినీ చరిత్రలో ఈ పురస్కారం దక్కించుకున్న తొలి తెలుగు నటుడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. (ఇదీ చదవండి: లియో నిర్మాతలకు షాకిచ్చిన మద్రాస్ హైకోర్ట్!) ఈసారి జాతీయ అవార్డులతో తెలుగు సినిమా కళకళలాడిపోయింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్.. రాష్ట్రపతి నుంచి పురస్కారం అందుకోగా.. 'ఉప్పెన'కి బుచ్చిబాబు, 'పుష్ప' సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, 'ఆర్ఆర్ఆర్' సినిమాకుగాను నేపథ్య సంగీతానికి కీరవాణి, కొరియోగ్రఫీకి ప్రేమ్ రక్షిత్, స్పెషల్ ఎఫెక్ట్స్కి శ్రీనివాస్ మోహన్, ప్లే బ్యాక్ సింగర్ కాలభైరవ, స్టంట్ కొరియోగ్రఫీకి కింగ్ సోలమన్ అవార్డులు అందుకున్నారు. అలానే 'కొండపొలం' పాటకు చంద్రబోస్ కూడా జాతీయ అవార్డులు అందుకున్నారు. View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) జాతీయ అవార్డుల పూర్తి జాబితా ఇదే ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప) ఉత్తమ నటి: ఆలియా భట్ (గంగూబాయి) & కృతిసనన్ (మిమీ) ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి (ద కశ్మీరీ ఫైల్స్ - హిందీ) ఉత్తమ సహాయ నటుడు: పంకజ్ త్రిపాఠీ (మిమీ- హిందీ) ఉత్తమ దర్శకుడు: నిఖిల్ మహాజన్ (గోదావరి - మరాఠీ సినిమా) ఉత్తమ సంగీత దర్శకుడు (సాంగ్స్): పుష్ప- దేవిశ్రీ ప్రసాద్ ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ (బీజీఎమ్) : ఆర్ఆర్ఆర్- ఎమ్.ఎమ్ కీరవాణి బెస్ట్ ఫీచర్ ఫిలిం: రాకెట్రీ: ద నంబీ ఎఫెక్ట్ (హిందీ) ఉత్తమ పిల్లల చిత్రం: గాంధీ & కో (గుజరాతీ) ఉత్తమ కొరియోగ్రఫీ: ఆర్ఆర్ఆర్-ప్రేమ్ రక్షిత్ ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: ప్రీతిశీల్ సింగ్ డిసౌజా (గంగూబాయి కతియావాడి) ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: ఆర్ఆర్ఆర్-శ్రీనివాస్ మోహన్ బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్: శ్రేయా ఘోషల్ (ఇరవిన్ నిహాల్ - తమిళ మూవీ) బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్: కాలభైరవ (ఆర్ఆర్ఆర్ - కొమురం భీముడో) ఉత్తమ లిరిక్స్: చంద్రబోస్-కొండపొలం మూవీ (తెలుగు) ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ అవార్డ్(స్టంట్ కొరియోగ్రఫీ): ఆర్ఆర్ఆర్- కింగ్ సోలమన్ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: వీరా కపూర్ ఏ (సర్దార్ ఉద్దామ్-హిందీ) ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: దిమిత్రీ మాలిక్ & మాన్సి ధ్రువ్ మెహతా (సర్దార్ ఉద్దామ్) ఉత్తమ ఎడిటింగ్: సంజయ్ లీలా భన్సాలీ (గంగూబాయి కతియావాడి మూవీ) బెస్ట్ ఆడియోగ్రఫీ (లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్): అరుణ్ అశోక్ & సోనూ కేపీ (చవిట్టు మూవీ-మలయాళం) బెస్ట్ ఆడియోగ్రఫీ (సౌండ్ డిజైనర్) : అనీష్ బసు (జీలీ మూవీ- బెంగాలీ) బెస్ట్ ఆడియోగ్రఫీ (రీరికార్డిస్ట్ ఆఫ్ ద ఫైనల్ మిక్స్డ్ ట్రాక్): సినోయ్ జోసెఫ్ (సర్దార్ ఉద్దామ్-హిందీ) బెస్ట్ స్క్రీన్ప్లే (ఒరిజినల్): షాహీ కబీర్ (నాయట్టు సినిమా-మలయాళం) బెస్ట్ స్క్రీన్ప్లే (డైలాగ్ రైటర్) : ప్రకాశ్ కపాడియా & ఉత్కర్షిణి వశిష్ట (గంగూబాయి కతియావాడి) బెస్ట్ సినిమాటోగ్రఫీ: అవిక్ ముఖోపాధ్యాయ్ (సర్దార్ ఉద్దామ్ మూవీ-హిందీ) ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: భవిన్ రబరీ (ఛెల్లో షో - గుజరాతీ సినిమా) బెస్ట్ ఫిలిం ఆన్ ఎన్వైర్మెంట్ కంజర్వేషన్: అవషావ్యూహం (మలయాళం) బెస్ట్ ఫిలిం ఆన్ సోషల్ ఇష్యూస్: అనునాద్-ద రెజోనెన్స్ (అస్సామీస్) బెస్ట్ పాపులర్ ఫిలిం ఆన్ ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్: ఆర్ఆర్ఆర్ ఇందిరాగాంధీ అవార్డ్ ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిలిం ఆఫ్ ఎ డైరెక్టర్: మెప్పాడియన్ (మలయాళం) స్పెషల్ జ్యూరీ అవార్డ్: షేర్ షా (హిందీ సినిమా) నర్గీస్ దత్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్: ద కశ్మీరీ ఫైల్స్ (హిందీ) భాషల వారీగా ఉత్తమ చిత్రాలు బెస్ట్ మీషింగ్ ఫిల్మ్: బూంబా రైడ్ బెస్ట్ అస్సామీస్ ఫిల్మ్: అనుర్ బెస్ట్ బెంగాలీ ఫిల్మ్: కల్కొకో-హౌస్ ఆఫ్ టైమ్ బెస్ట్ హిందీ ఫిల్మ్: సర్దార్ ఉద్దామ్ బెస్ట్ గుజరాతీ ఫిల్మ్: లాస్ట్ ఫిల్మ్ షో బెస్ట్ కన్నడ ఫిల్మ్: చార్లి 777 బెస్ట్ మైథిలీ ఫిల్మ్: సమాంతర్ బెస్ట్ మరాఠీ ఫిల్మ్: ఏక్ దా కై ఝాలా బెస్ట్ మలయాళ ఫిల్మ్: హోమ్ బెస్ట్ మెయిటెయిలోన్ ఫిల్మ్: ఏక్ హోయిగీ యమ్ (అవర్ హౌమ్) బెస్ట్ ఒడియా ఫిల్మ్: ప్రతిక్ష్య (ద వెయిట్) బెస్ట్ తమిళ్ ఫిల్మ్: కడైసి వివసై (ద లాస్ట్ ఫార్మర్) బెస్ట్ తెలుగు ఫిల్మ్: ఉప్పెన నాన్ ఫీచర్ ఫిలింస్ బెస్ట్ నాన్ ఫీచర్ ఫిల్మ్: ఏక్ థా గావ్ (గర్హివాలీ - హిందీ) బెస్ట్ వాయిస్ ఓవర్: కులదా కుమార్ భట్టాచారి (హాథీ బందూ) బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్: ఇషాన్ దీవేచా (సక్కలెంట్) బెస్ట్ ఎడిటింగ్: అబ్రో బెనర్జీ (ఇఫ్ మెమొరీ సెర్వ్స్ మీ రైట్) బెస్ట్ ఆన్లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్: సురుచి శర్మ (మీన్ రాగా) బెస్ట్ ఆడియోగ్రఫీ(ఫైనల్ మిక్స్డ్ ట్రాక్): ఉన్ని కృష్ణన్ (ఏక్ థా గావ్) బెస్ట్ సినిమాటోగ్రఫీ: బిట్టూ రావత్ (పాతాళ్ తీ) ఉత్తమ డైరెక్షన్: బకుల్ మతియానీ (స్మైల్ ప్లీజ్) ఉత్తమ కుటుంబ కథా చిత్రం: చాంద్ సాన్సీ (హిందీ) ఉత్తమ షార్ట్ ఫిక్షన్ ఫిలిం: దాల్ బాత్ (గుజరాతీ) స్పెషల్ జ్యూరీ అవార్డ్: రేఖా మూవీ (మరాఠీ) బెస్ట్ ఏనిమేషన్ ఫిల్మ్: కండిట్టుండూ (మలయాళం) బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ ఫిలిం: లుకింగ్ ఫర్ చలాన్ (ఇంగ్లీష్) బెస్ట్ ఎక్స్ప్లోరేషన్ ఫిలిం: ఆయుష్మాన్ (ఇంగ్లీష్-కన్నడ) బెస్ట్ ఎడ్యుకేషనల్ ఫిలిం: సిర్పంగిలన్ సిర్పంగల్ (తమిళం) బెస్ట్ ఫిలిం ఆన్ సోషల్ ఇష్యూస్(షేర్డ్): మీతూ దీ (ఇంగ్లీష్) & త్రీ టూ వన్ (మరాఠీ-హిందీ) బెస్ట్ ఎన్వైర్మెంట్ ఫిలిం: మున్నం వలవు (మలయాళం) బెస్ట్ ప్రమోషనల్ ఫిలిం: వర్లీ ఆర్ట్ (ఇంగ్లీష్) బెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫిలిం: ఇథోస్ ఆఫ్ డార్క్నెస్ (హిందీ-బెంగాలీ) బెస్ట్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఫిలింస్: టీఎన్ కృష్ణన్ బౌ స్ట్రింగ్స్ టూ డివైన్ బెస్ట్ బయోగ్రాఫికల్ ఫిలిం(షేర్డ్): రుఖు మతిర్ దుఖు మహీ (బెంగాలీ) & బియాండ్ బ్లాస్ట్ (మణిపురి) బెస్ట్ ఎత్నోగ్రాఫిక్ ఫిలిం: ఫైర్ ఆన్ ఎడ్జ్ (టివా) బెస్ట్ డెబ్యూ నాన్ ఫియేచర్ ఫిలిం ఆఫ్ ఎ డైరెక్టర్: పాంచిక (గుజరాతీ- డైరెక్టర్ అంకిత్ కొఠారీ) -
ద–పొలిటికల్–‘పుష్ప’! సినిమాలూ, రాజకీయ గుర్తులు.. తగ్గేదేలే
సినిమాలంటే అందరికీ ఆసక్తి కదా. మామూలు జనాలకు మరీ ఎక్కువ. అందుకే జనాలందరికీ సినిమా భాషలోనే తమ అర్జీలు చెప్పుకుంటే పరమ క్యాచీగా ఉంటుందనుకున్నాయి రాజకీయ పార్టీలు. బాడీ లాంగ్వేజీలోలాగా... తమనే గెలిపించాలంటూ ‘మూవీ లాంగ్వేజీ’లో పొలిటికల్ పార్టీలు విన్నవించుకోవాలని నిర్ణయించుకుంటే... ఆ వచ్చే అభ్యర్థనలకు ఊహారూపమే ఈ వాక్యాలు... ‘పుష్ప సినిమా చూశారుగా అందరూ. అందులోని పాటలో హీరో చెప్పు జారిపోలా. అచ్చం అలాగే జారింది మా అధికారం కూడా. అయితే హీరోగారి గూడ పైకి లేచి నిలబడింది చూశారా... ఈసారి అచ్చం మీరూ మమ్మల్ని పైకి లేపండి. గూడను కాదు... మా చేతిని. అదే... చేతి గుర్తును.’’ ‘ప్రజలారా... చేతిగుర్తు వారి మాటలు చెవిన పెట్టకండి. అసలు పుష్ప అంటే ఏమిటి? పువ్వు! దీని బట్టి తెలియడంల్యా.. ఎవరికి ఓటెయ్యాలో! పుష్పకు ఓటెయ్యండి. అంటే ‘పువ్వు గుర్తు’కు అని అర్థం. పువ్వు గుర్తు అంటే కమలం పార్టీ అని విజ్ఞులైన మీకు వేరే చెప్పాలా?’’ ‘ఈ పువ్వు గుర్తువారూ, ఆ చెయ్యి గుర్తు వారూ ఎలాంటివాళ్లు? ఆ సినిమాలోనే చూశారుగా. గంధం చెక్కల ఆచూకీ చెప్పేదాకా కారెక్కించి తిప్పుతారు. తీరా ఆచూకీ దొరికాక... హీరో కారెక్కబోతుంటే కార్లోంచి కాలు పక్కకు లాగేస్తారు. నాల్రూపాయలు పారేసి... షేర్ ఆటోలో రమ్మంటారు. ఓడనెక్కేదాక ఓడమల్లయ్యా... ఓడ దిగాక బోడ మల్లయ్య. ఇలాంటి పార్టీలకా మీ ఓటు? పాపం... హీరో అప్పటికప్పుడు కారు కొనాల్సి వచ్చింది. హీరో కొన్నదేమిటి? ‘కారు’! ఆ సంగతి గుర్తుపెట్టుకోండి. అసలు మా కారు గుర్తుకు ఓటేస్తే... కృతజ్ఞతకొద్దీ ఎప్పుడూ కార్లోనే తిప్పుతాం. కారు దిగకండి... మమ్మల్నీ దించకండి. కారు స్పీడు విషయంలో మీరు తగ్గేదేల్యా... మమ్మల్ని తగ్గించేదే ల్యా’’ సినిమా అభ్యర్థనలు పూర్తయ్యాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటూ హెచ్చరించే కేన్సర్ క్యారెక్టర్ ‘ముఖేశ్’ఈసారి ఈ సినిమా యాడ్స్ అయ్యాక వచ్చాడు. అతడు చెప్పేదేమిటంటే... ‘‘అసలా మూవీ హీరోయే ఓ ఎర్రచందనం స్మగ్లర్. అతడు చేసేదే అడవుల్ని నరకడం. మీకు అర్థమవ్వడం కోసం ఎంతటి సినిమా ఉపమాలిచ్చినా సరే... ఈ నెగెటివ్ కేరెక్టర్ల పట్ల పాజిటివ్ కోణంలో కాకుండా అసలు కేరెక్టర్లను గుర్తెరిగి ఎంచుకోండి. ఐదేళ్ల పాటు హాయిగా మిమ్మల్ని మీరే పరిపాలించుకోండి. -
‘రారా సామి’పాటకి స్కూల్ గర్ల్ స్టెప్పులు..రష్మిక ‘క్యూట్’ రియాక్షన్
అల్లు అర్జున్, రష్మిక మందన్నా కలిసి నటించిన పుష్ప చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. ముఖ్యంగా ఆ సినిమాలోని ‘రారా సామి’పాటకు రష్మిక వేసిన స్టెప్పులు బాగా వైరల్ అయ్యాయి. అప్పట్లో ఎక్కడ చూసిన ఈ పాటే మోగేది. చాలా మంది రీల్స్ చేసి.. ఈ పాటను వైరల్ చేశారు. పలువురు హీరోయిన్లు కూడా ఈ పాటకు స్టెప్పులేశారు. సినిమా విడుదలై రెండేళ్లు కావోస్తున్న ‘రారా సామి’ క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. తాజాగా ఈ పాటకు దాదాపు ఐదేళ్లు వయసు ఉన్న చిన్నారి చిందులేసి అలరించింది. మహారాష్ట్రకు చెందిన ఆ చిన్నారి.. స్కూల్ కల్చరల్ ప్రోగ్రామ్లో భాగంగా రారా సామి పాటకు డ్యాన్స్ చేసింది. ఆమెతో పాటు మిగతా విద్యార్థులు కూడా స్టెప్పులేసి అలరించారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. దీనిని రష్మిక ఎక్స్(ట్విటర్)లో షేర్ చేస్తూ.., ‘సో క్యూట్’ అంటూ అని క్యాప్షన్ ఇచ్చింది. So cute 🥰 https://t.co/bfXDGQ8dMJ — Rashmika Mandanna (@iamRashmika) October 2, 2023 -
'ఏక్ రూపాయ్వాలా, నీ యవ్వ తగ్గేదేలే...'
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అడవిలో చెట్లు కొట్టుకునే కూలోడు అంతర్జాతీయ స్మగ్లర్గా ఎదిగిన కథ ‘పుష్ప’ సినిమా. వాస్తవానికి అలాంటి ఘటనలు నిజ జీవితంలో జరగవు. కానీ.. ఉమ్మడి కరీంనగర్లో పీ డీఎస్ బియ్యం కొనుగోలు చేసి.. అధిక ధరలకు ఇ తర రాష్ట్రాలకు ఎగుమతి చేసే వ్యాపారిని చూస్తే ని జమే అనిపిస్తోంది. ‘ఏక్ రూపాయ్వాలా’ కోడ్ నే మ్తో అధికారులు ముద్దుగా పిలుచుకునే ఈ స్మగ్లర్ నెట్వర్క్ ఒకప్పుడు పాత కరీంనగర్ జిల్లాకే పరిమి తం. నేడు ఇతర రాష్ట్రాలకు విస్తరించింది. రెండేళ్ల క్రితం ఉమ్మడి జిల్లా దాటి మహారాష్ట్రలో ఎంటర్ అ య్యాడు. ఆ సమయంలో అతడి దందా.. పీడీఎస్ బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్న తీరును ‘సాక్షి’ దినపత్రిక ‘ఏక్ రూపాయ్వాలా’ శీర్షికన వ రుస కథనాలు ప్రచురించింది. వీటిపై డీజీపీ కార్యాలయం స్పందించి దాడులకు ఆదేశించింది. అప్పటి కరీంనగర్ సీపీ సత్యనారాయణ నేతృత్వంలో టా స్క్ఫోర్స్ బృందాలు వరుస దాడులతో విరుచుకుపడ్డాయి. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిని బైండోవర్ కూడా చేశాయి. దీంతో కొంతకా లం సదరు వ్యాపారి, అతని అనుచరులు కార్యకలాపాలు నిలిపివేశారు. సైకిళ్లతో మొదలై.. గూడ్స్ రైళ్లలో తరలించే స్థాయికి.. ఒకప్పుడు గ్రామాల్లో సైకిళ్లపై తిరుగుతూ.. పీడీఎస్ బియ్యాన్ని సేకరించి వాహనాల్లో తరలించడంలో ఏక్ రూపాయ్వాలాది అందెవేసిన చేయి. అప్పట్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికలు వ రుసగా రావడం.. పత్రికల్లో వరుస కథనాలు రావడంతో అతడి వ్యాపారం సుప్తావస్థలోకి వెళ్లింది. ఆ తర్వాత కొత్త పద్ధతిలో వ్యాపారంలోకి దిగాడు. అధి కారులకు లంచాలిస్తూ.. మహారాష్ట్రకు బియ్యం తరలించడం కంటే అధికారికంగానే ఎగుమతి చేయాల ని నిర్ణయించాడు. అదునుకోసం చూస్తున్న అతడికి తమిళనాడు తెలంగాణ ప్రభుత్వానికి బియ్యం కో సం చేసిన వినతి ఆసరాగా దొరికింది. రూ.37.50కు కిలో చొప్పున కావాలని తమిళనాడు కోరడం.. ఆ డీల్ రద్దు కావడంతో ‘ఏక్ రూపాయ్వాలా’ రంగంలోకి దిగాడు. కిలో రూ.31.50కే ఇస్తామని డీల్ కుది ర్చినట్లు సమాచారం. ఎగుమతికి కావాల్సిన బి య్యంలో తనవంతుగా పీడీఎస్ రైస్ ఇచ్చేందుకు సి ద్ధమయ్యాడు. అతడికి కావాల్సినంత బియ్యం ఇచ్చేందుకు ఉమ్మడి జిల్లాలోని పలువురు రైస్మిల్లర్లు కూడా సమ్మతించారని తెలిసింది. ఇందులో కస్ట మ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ఉన్నట్లు తెలిసింది. వా రం వ్యవధిలో దాదాపు ఐదు వేల టన్నుల బియ్యాన్ని కరీంనగర్ నుంచి గూడ్స్ ద్వారా ఎగుమతి చేసినట్లు సమాచారం. వీటివిలువ దాదాపు రూ.160 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. డిమాండ్ నేపథ్యంలో మరోరూ.60 కోట్ల విలువైన 2వేల ట న్నుల బియ్యాన్ని తరలించేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు మరో గూడ్స్రేక్ (కొన్ని బోగీలతో కూ డిన రైలు)ను ఇప్పటికే బుక్చేశారని సమాచారం. ఇంత జరుగుతున్నా.. సివిల్ సప్లయి అధికారులు, పోలీసులకు సమాచారం లేకపోవడం గమనార్హం. అటెన్షన్ డైవర్షన్లో అందెవేసిన చేయి.. తెలంగాణ, మహారాష్ట్రలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాలో ‘ఏక్ రూపాయ్వాలా’ది అందె వేసిన చే యి. అచ్చం వీరప్పన్ తరహాలో.. పోలీసులు బందో బస్తుల్లో నిమగ్నమయ్యే సందర్భాల్లోనే భారీ వాహనాల్లో టన్నుల కొద్దీ బియ్యం రాష్ట్ర సరిహద్దులు దా టిస్తాడు. ఇపుడు బహిరంగ దందా చేస్తున్న నేపథ్యంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. తమ పై సివిల్ సప్లయీస్, పోలీసుల కన్ను పడకుండా.. గణేశ్ ఉత్సవాల్లో అధికారులు తలమునకలైన సందర్భాన్ని వాడుకుని రైలు ద్వారా తెలివిగా.. పకడ్బందీగా తమిళనాడుకు బియ్యం ఎగుమతి చేశా డు. త్వరలో ఎన్నికలకోడ్ రాబోతోంది. కోడ్ వస్తే వాహన తనిఖీలు పెరుగుతాయి. దానికి ముందే రెండోవిడత సరుకు పంపేలా ఏర్పాట్లు పూర్తయ్యాయని సమాచారం. కిలో రూపాయి బియ్యాన్ని రూ. 4 లేదా రూ.5 కమీషన్ చొప్పున విక్రయించే ‘ఏక్ రూపాయ్ వాలా’ నేడు రూ.వందల కోట్ల వ్యాపారా నికి పడగలెత్తిన తీరు సినిమా కథను తలపిస్తోంది. ఫిర్యాదు వచ్చింది చర్యలు తీసుకుంటాం కరీంనగర్ నుంచి తమిళనాడుకు సీఎంఆర్ బియ్యం అక్రమంగా వెళ్తున్నాయని మాకు అధికారికంగా ఫిర్యాదు వచ్చింది. వెంటనే అడిషనల్ కలెక్టర్, సివిల్ సప్లయీస్ ఉన్నతాధికారులకు చేరవేశాను. వారు స్పందించి రంగంలోకి దిగారు. అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. – రవీందర్ సింగ్, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ -
ఏంది పుష్పా ఇది? ఇంకా షూటింగే కాలే.. అప్పుడే వెయ్యి కోట్లా?
పుష్ప.. పుష్పరాజ్.. అప్పుడే వేట మొదలుపెట్టాడు. పుష్ప సినిమాకు కలెక్షన్స్ మాత్రమే కాదు అవార్డులు సైతం వచ్చాయి. 69 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న జాతీయ ఉత్తమ నటుడి అవార్డును పుష్పరాజ్ తన వశం చేసుకున్నాడు. ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల్లో అల్లు అర్జున్కు ఉత్తమ నటుడి పురస్కారం వరించింది. దీనిపై యావత్ తెలుగు ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఈ అవార్డుతో తన రేంజ్ ఏంటో మరోసారి చూపించాడు పుష్పరాజ్. ఇకపోతే ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే! మొదటిదాన్ని మించిపోయేలా రెండో పార్ట్ తీయాలని ప్రయత్నిస్తున్నాడు సుకుమార్. మేకింగ్ దశలోనే పుష్ప 2కి అదిరిపోయే ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్కు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏకంగా రూ.1000 కోట్లు ఆఫర్ చేసినట్లు టాక్! పుష్ప 2 సినిమాకు సంబంధించిన అన్ని రకాల హక్కులను తమకు సొంతం చేయాలని, అలాగైతే వెయ్యి కోట్లు ఇస్తామని ముందుకు వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. మరి ఈ ఆఫర్కు పుష్ప మేకర్స్ ఎలా స్పందించారు? అసలు ఈ ప్రచారంలో నిజమెంత? అన్నది తెలియాల్సి ఉంది. చదవండి: మొదటి వారం నామినేషన్స్లో 8 మంది.. ఎవరెవరంటే? -
మెగా ఫ్యాన్స్ సపోర్ట్తో ఎంట్రీ.. ఆపై దూరం.. బన్నీ సమాధానం ఇదే
‘‘ఒకరు అదే పనిగా మనల్ని విమర్శిస్తున్నారంటే మనం ఎదిగినట్లే... బయటకు చెప్పలేం... చాలా అవమానాలుంటాయి.. నాది అత్యాస.. నాకు అన్నీ కావాలి... నేషనల్ బెస్ట్ హీరో అని ఊరికే ఇచ్చేయరు’’... ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్నారు అల్లు అర్జున్. ‘జాతీయ ఉత్తమ నటుడు’ అవార్డు దక్కించుకున్న ఆనందంలో ఉన్న అల్లు అర్జున్తో శనివారం జరిపిన ఇంటర్వ్యూలోని విశేషాలు ఈ విధంగా... ► జాతీయ ఉత్తమ నటుడి ప్రకటన రాగానే మీ రియాక్షన్? అల్లు అర్జున్: ఇంగ్లీష్లో ఎలైటెడ్ (ఉక్కిరి బిక్కిరి.. పట్టరానంత ఆనందం...) అంటారు. నా ఫీలింగ్ అదే. అయితే ఈ అవార్డు నాకు వచ్చింది నా వల్ల కాదు. సుకుమార్ వల్ల వచ్చిందన్నది నా ఫస్ట్ ఫీలింగ్. అవార్డు ప్రకటన రాగానే నేను, సుకుమార్ ఆప్యాయంగా హత్తుకుని, ఆ ఉద్విగ్న క్షణాల్లో అలా ఓ నిమిషానికి పైగా ఉండిపోయాం. మైత్రీ మూవీ మేకర్స్ కాకుండా ‘పుష్ప’ని ఎవరు తీసినా ఈ సినిమా ఇంత బాగా వచ్చి ఉండేది కాదు. నాతో ‘పుష్ప’ తీశారని అలా అనడంలేదు. ‘రంగస్థలం’ చూసినçప్పుడే ‘మైత్రీ సపోర్ట్ చేసింది కాబట్టే నువ్వు అనుకున్న సినిమా తీయగలిగావు. ఈ సినిమాని వేరే ఏ బేనర్తో చేసినా తీయలేకపోయేవాడివి’ అని సుకుమార్తో అన్నాను. ‘పుష్ప’కి కూడా ఇదే వర్తిస్తుంది. ► ఈ తరంలో తెలుగులో ఉన్న ‘బెస్ట్ యాక్టర్స్’లో మీరు ఒకరు. ముందు తరాల్లో ఎందరో ‘బెస్ట్ యాక్టర్స్’ ఉన్నారు. వారికి ఉత్తమ జాతీయ నటుడు అవార్డు లభించలేదు. ఈ విషయంపై మీ అభి్రపాయం.. నాకు అవార్డు వచ్చినందుకు ఎంత హ్యాపీగా ఉందో.. ముందు తరాల వారికీ, నా సమకాలీన నటులకు అవార్డు రాలేదన్నది అంతే బాధాకరమైన విషయం. వారంతా అర్హులే. జాతీయ అవార్డు దక్కించుకునే స్థాయి నటనను అందరూ ప్రదర్శించారు. కానీ ఎందుకో వారికి రాలేదు. సామర్థ్యం లేక వారికి అవార్డులు రాలేదనుకుంటే అది మన తెలివితక్కువతనమే. మన పరిశ్రమలో ఎప్పుడూ గొప్ప నటులు ఉంటూనే ఉన్నారు. కానీ ఎందుకో కుదర్లేదు.. ఈసారి కుదిరింది. ► అంటే.. కాస్త అదృష్టం కూడా కలిసి రావాలంటారా? అదృష్టాన్ని నమ్మను. మన కృషి మనం చేస్తూ ఉంటే సరైన చాన్స్, టైమ్ వచ్చినప్పుడు కొడితే ఆ పాయింట్ను అదృష్టం అంటా. మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే విషయంలో నేను ఎప్పుడూ కృషి చేస్తూనే ఉన్నాను. ఇక ఇప్పుడు తెలుగు సినిమాలకు దేశవ్యాప్త గుర్తింపు దక్కడం, తెలుగు సినిమాలపై అందరి దృష్టి పడటం అనేది అవకాశం. సో... నా కృషికి చాన్స్, టైమ్ కలిసి స్ట్రైక్ అయ్యాయి. ఇది లక్ అంటాను. ► మీ 20 ఏళ్ల సక్సెస్ఫుల్ కెరీర్లో మీ కుటుంబం, అభిమానుల, ఇండస్ట్రీ భాగస్వామ్యం ఎంత.. నా సక్సెస్లో అందరి సపోర్ట్ ఉంది. ఏ సపోర్ట్ లేదని అనలేను. నా ఫ్యామిలీ, ఇండస్ట్రీ సపోర్ట్ ఉంది. ఎక్కువ శాతం ఉన్న నా సొంత ఫ్యాన్స్ సపోర్ట్తో పాటు మెగా ఫ్యాన్స్, ఇతర హీరోల ఫ్యాన్స్ ప్రోత్సాహం కూడా ఉంది. ► మీ కెరీర్ ఫస్ట్ మొదలైంది మెగా ఫ్యాన్స్ సపోర్ట్తోనే. ఆ తర్వాత మీకు సొంత ఆర్మీ (అభిమానులు) ఏర్పాటైంది. ఇలా ఓన్ ఫ్యాన్ బేస్ డెవలప్ అయ్యాక పాజిటివిటీతో పాటు నెగటివిటీ కూడా వచ్చింది. ఈ విషయాన్ని ఎలా చూస్తారు.. నేనే కాదు.. ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి అయినా ఒకచోటు నుంచి మొదలై, జీవితంలో ఎదిగే క్రమంలో కొంత టైమ్ గడిచాక తనకంటూ ఓ డెవలప్మెంట్ జరుగుతుంది. అది సహజం.. ఇందుకు ఉదాహరణగా చాలామంది ఉన్నారు. కొన్నిసార్లు పిల్లలు తమ తల్లిదండ్రుల కన్నా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఇదొక సహజమైన ప్రయాణం. ► కానీ ఎక్కడ మొదలయ్యారో ఆ నీడలో ఉండాలని వేరేవాళ్లు అనుకోవడం సహజంగా జరుగుతుంటుంది.. నేనేమనుకుంటానంటే.. ఒకరు విశేషంగా ఎదుగుతూ, ఓ లెవల్కి వచ్చాక.. వారు మన దగ్గర ఉండలేరని వారికే అర్థం అయిపోతుంది.. వాళ్లు ఇక్కడ సరిపోరని. అది పేరెంట్స్ అయినా కావొచ్చు.. ఫ్యామిలీలో ఎవరైనా కావొచ్చు. అయితే వాళ్లు ఎప్పుడు కోరుకుంటారంటే.. వాళ్లకంటే తక్కువగా ఉన్నప్పుడో.. ఇప్పుడు వాళ్లు ఎంత ఉన్నారో.. మనం అంతే ఉన్నప్పుడు ఎందుకు బయటకు వెళ్లాలని కోరుకుంటారు. అదే మనం ‘టెన్ ఎక్స్’ ఎదిగాం అనుకుంటే అప్పుడు వాళ్లు కోరుకోరు. ఇదంతా సైజ్ డిఫరెన్స్పై ఆధారపడి ఉంటుంది. ► చిరంజీవిగారి ఇంటికి వెళ్లారు కదా. ఆయన స్పందన.. చిరంజీవిగారు చాలా మంచి మాట అన్నారు. ఓ జాతీయ అవార్డు రావడానికి ఓ నటుడికి కావాల్సిన కారణాలు ఇరవై ఉంటే.. అన్ని కారణాల్లోనూ నువ్వు వంద మార్కులు కొడతావ్ అన్నారు. బాడీ లాంగ్వేజ్.. మేకప్ కావొచ్చు... సంభాషణల ఉచ్చారణ కావొచ్చు.. ఇలా కొన్ని చెప్పుకుంటూ వచ్చారు. చిరంజీవిగారికి ఉన్న అనుభవంతో ఓ విషయాన్ని ఆయన మనకన్నా బాగా చూడగలరు. బాగా పెర్ఫార్మ్ చేశావ్. చెప్పాలంటే.. నీకు ఇవ్వకపోతే తప్పయిపోయేది అనే స్థాయిలో పెర్ఫార్మ్ చేశావన్నారు. ► ఏదైనా మనకు దక్కినప్పుడు అందుకు మనం నిజంగా అర్హులమేనా? అనే ఓ ఆలోచన కలగడం సహజం. నేషనల్ అవార్డు ప్రకటించినప్పుడు అలాంటి ఆలోచన మీకేమైనా కలిగిందా? నేనూ సుకుమార్గారు ఎప్పుడూ నిజం అనేది ఒకటి ఉంటుందని మాట్లాడుకుంటుంటాం. మేం నిజాయితీగా కష్టపడ్డాం. ఆ కష్టం ప్రజలకు కనెక్ట్ అయ్యింది. ఇది నిజం. ఒక సినిమా బాగుందా? లేదా అనేది నిజం మాట్లాడుతుంది. బాగోలేని సినిమాను నేను ఎంత ప్రమోట్ చేసినా వర్కౌట్ కాదు. కానీ మనం నిజాయితీగా కష్టపడ్డప్పుడు ఆ కష్టమే మాట్లాడుతుంది. అది నిజం. అప్పుడు నిజం దానంతట అదే మాట్లాడుతుంది. ఒకవేళ నేను సినిమాలో బాగా యాక్ట్ చేసి, నేనే బాగోలేదని చెప్పినా కూడా నా మాట ఎవరూ నమ్మరు. ఎందుకంటే నిజం నాకంటే గొప్పది.. నన్ను మించినది అనేది నా అభప్రాయం. ► తెలుగు సినిమాకు ఈ ఏడాది ఎక్కువగా జాతీయ అవార్డులు వచ్చాయి... ఈ విషయం గురించి ఏమంటారు? ఈ గౌరవం దక్కడానికి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ముఖ్య కారణంగా చెప్పుకోవాలి.. ‘పుష్ప’ కూడా. ‘ఆర్ఆర్ఆర్’కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. దీంతో జాతీయ స్థాయిలో ‘ఆర్ఆర్ఆర్’ను గౌరవించుకోకపోతే అది తప్పవుతుందనే ఓ ప్రత్యేక ఫీలింగ్ ఆ సినిమాపై ఉంది. ఏదో ఆస్కార్స్కు వెళ్లింది కదా అని కాకుండా నిజంగా ఆ సినిమాకు సంబంధించి ఎవరెవరికి రావాలో వారికి ఇచ్చారు. తెలుగు సినిమాకు ప్రాముఖ్యత చేకూర్చారు. అందుకు తగ్గ కష్టం కూడా ఆ సినిమాలు పడ్డాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తెలుగు ఇండస్ట్రీ ప్రామిసింగ్గా ఉంది. ఈ ఇంపాక్ట్ వారిపై (జ్యూరీని ఉద్దేశిస్తూ..) కూడా ఉంటుంది. ► ఈ సమయంలో మీ తాత (ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య)గారు ఉండి ఉంటే సంతోషించేవారు.. ఆయన జీవించి ఉన్నట్లయితే.. ఇన్నేళ్ల చరిత్రలో నా మనవడు కొట్టాడు. తన జీవితానికి ఇది చాలని ఆయన ఫీలయ్యే సందర్భం కచ్చితంగా అయ్యుండేది. ఆ విషయం పక్కన పెడితే... నేను నేషనల్ అవార్డుని సాధించడం మా నాన్నగారు చూడగలిగారు. నాకు అదే చాలా అదృష్టం. ► ‘పుష్ప’లో నటనపరంగా తగ్గేదే లే అన్నట్లు నటించారు. ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్, రామ్చరణ్ అద్భుత నటనతో పాటు ఆ సినిమా ఆస్కార్తో గ్లోబల్గా రీచ్ అయింది. తమిళ ‘జై భీమ్’లో సూర్య నటన అద్భుతం.. ఈ పెద్ద పోటీలో జాతీయ అవార్డు ఎవరికి దక్కుతుందనే కోణంలో ఆలోచించారా? మనం సౌత్లో ఉన్నాం కాబట్టి ఈ రెండు సినిమాల గురించే మాట్లాడటం సహజం. అయితే పోటీలో హిందీ నుంచి ‘షేర్షా, సర్దార్ ఉద్దమ్’ వంటి చిత్రాలు ఉన్నాయి. ఇంకా వేరే భాషల నుంచి వేరే చిత్రాల్లో నటించిన హీరోలు ఉన్నారు. పోటీలో 20 మందికి పైగా ఉన్నారు. కానీ ఫైనల్గా నేషనల్ హీరో ఒక్కడే. ఈ ప్రాసెస్లో ‘పుష్ప’ హీరోకి అవార్డు దక్కే అర్హత పూర్తిగా ఉంది. ఎందుకంటే నేషనల్ హీరోని సెలక్ట్ చేసేటప్పుడు అతని నటన చూస్తారు.. సినిమాని కాదు. అయినా బెస్ట్ ఫిలిం కింద నేషనల్ అవార్డుకి ‘పుష్ప’ని తీసుకోరు. ఎందుకంటే స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్ కాబట్టి. అందుకే ఉత్తమ చిత్రం కేటగిరీకి మేం ‘పుష్ప’ని పంపించలేదు. బెస్ట్ యాక్టర్ కేటగిరీ అనేది పూర్తిగా నటనని బేస్ చేసుకునే ఇస్తారు. ఆ విధంగా పుష్పరాజ్.. బెస్ట్ అనుకుని, నామినేషన్కి పంపించాం. మా నమ్మకం నిజమైంది. ► 20 ఏళ్ల కెరీర్.. 20 మందికి పైగా హీరోలతో పోటీ పడి నేషనల్ అవార్డు తెచ్చుకున్న ఈ ఆనందంలో మీ కెరీర్ని విశ్లేషించుకుంటే ఏమనిపిస్తోంది? యాక్చువల్గా ఇలా ఆనందంగా ఉన్నప్పుడు కాదు.. ‘సాడ్ మూమెంట్స్’ అప్పుడే ఎక్కువ ఎనలైజ్ చేసుకుంటాం. హ్యాపీ అప్పుడు హాయిగా అలా వెళ్లిపోతాం. 20 ఏళ్ల లైఫ్ టైమ్లో ఏ మనిషికైనా హ్యాపీ.. సాడ్ ఈ రెండూ ఉంటాయి. బయట చూసేవాళ్లకు అంతా స్మూత్గా ఉన్నట్లు కనిపిస్తుంది కానీ ఏ మనిషి జీవితం కూడా ఈ రెండూ లేకుండా ఫ్రిజ్లో పెట్టిన మటన్లా ఫ్రీజ్ అయిపోవడం జరగదు (నవ్వుతూ). ఏ చెట్టుకి ఆ గాలి. బయటకు చెప్పలేకపోవచ్చు కానీ.. చాలా అవమానాలు ఉంటాయి. ఆ చెప్పలేనివి జరిగినప్పుడు విశ్లేషణ అనేది మొదలవుతుంది. అందులోంచే నేర్చుకోవడం, నడుచుకోవడం కూడా తెలుస్తుంది. ► మీరన్నట్లు అవమానాలు సహజం. పైగా ఇప్పుడీ డిజిటల్ వరల్డ్లో ట్రోల్స్ ఎక్కువ.. వీటిని పట్టించుకుంటారా? హండ్రెడ్ పర్సంట్ అన్నీ పట్టించుకుంటాను. కాకపోతే ‘ఫన్’గా తీసుకుంటాను. మన కోసం ఒకళ్లు పని గట్టుకుని టైమ్ కేటాయించి, అదే పనిగా విమర్శిస్తున్నారంటే మనం ఎదిగినట్లే కదా (నవ్వుతూ). మా స్టాఫ్లో ఒకరు.. ‘చూడండి సార్.. మీ గురించి ఇలా అనుకుంటున్నారు’ అంటే, ‘మంచిదే కదా.. మనం ఎదిగినట్లు అర్థం’ అన్నాను. ఏమీ లేకుండా మిగిలిపోయినవాళ్లను ఎవరూ పట్టించుకోరు. సో.. మనల్ని పట్టించుకున్నారంటేనే మనం సాధిస్తున్నాం అని అర్థం. ► మరి.. ‘మెగా ఫ్యాన్స్’, ‘అల్లు అర్జున్ ఆర్మీ’ అంటూ ఫ్యాన్ వార్ జరుగుతుంటుంది కదా.. ఆ వార్ని కూడా పట్టించుకుంటారా? నేను ఏదైనా ఒకటి పట్టించుకోనంటే ఆ ఫ్యాన్ వార్ని మాత్రమే. నేనస్సలు పట్టించుకోను. ఎందుకు పట్టించుకునేంత టైమ్ లేదు. ఫ్యాన్స్ పని ఫ్యాన్స్ చూసుకుంటారు. నా పని నేను చూసుకుంటాను. ► వసూళ్లు, అవార్డుల గురించి పట్టించుకుంటారా..? వీటి గురించి అయితే పక్కాగా ఆలోచిస్తాను. వేరే వాటి గురించి ఆలోచించను. నా ఫోకస్ అంతా వాటిపైనే ఉంటుంది. మిగతావారి గురించి నాకు తెలియదు కానీ నాకు మాత్రం అన్నీ కావాలి. అవార్డులు కావాలి... కలెక్షన్స్ కావాలి. ప్రజల్లో పేరు, నా సినిమా నిర్మాతలకు డబ్బులు రావాలి. జనాలకు పిచ్చెక్కిపోయే సినిమాలు ఇవ్వాలి.. ఇలా నాకు అన్నీ కావాలి. ఆ క్లారిటీ నాకు ఉంది. నాది అత్యాశ.. నాకు అన్నీ కావాలి. అందుకే తగ్గేదే లే అంటూ హార్డ్ వర్క్ చేస్తాను. ఆగేదే లే అంటూ సినిమాలు చేసుకుంటూ వెళతాను.. ► ‘పుష్ప 2’ తర్వాత మీ ప్రాజెక్ట్? ప్రస్తుతం ‘పుష్ప 2’ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. వాళ్లకు న్యాయం చేయాలనే ఆలోచనే ప్రజెంట్ నా మైండ్లో ఉంది. ‘పుష్ప 2’ తర్వాత నా తర్వాతి సినిమాపై మరింత క్లారిటీ ఇస్తాను. ► ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ సినిమా తర్వాత మీరు కొంత గ్యాప్ తీసుకున్నారు. ఆ తర్వాత మీరు చేసిన ‘అల.. వైకుంఠపురములో.., పుష్ప’ హిట్. ఆ గ్యాప్లో మిమ్మల్ని మీరు తెలుసుకోవడమే ఈ హిట్స్కి కారణమా.. నా గురించి నేను వంద శాతం తెలుసుకోవడానికి ఆ సమయం నాకు దొరికినట్లయింది. నేను ఏం తప్పులు చేశాను? ఎటు వెళ్తున్నాను అని ఆలోచించుకున్నాను. కొందరు సలహాలు ఇచ్చారు. చెప్పాలంటే నన్ను నేను సరిద్దుకున్న సమయం అది. అలా నన్ను నేను సరిదిద్దుకుని ఇకనుంచి తగ్గేదే లే... ఆపేదేలే అనుకున్నాను. ► జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు సాధించారు. ఇక వాట్ నెక్ట్స్ అనే ప్రెజర్ ఏమైనా? దేశవ్యాప్తంగా సినిమా పెరుగుతోంది. తెలుగు సినిమా మరింతగా ప్రగతి పథంలో ముందుకు వెళుతోంది. ఇప్పుడు మనం ఏ ప్రయోగాలు చేసినా రిసీవ్ చేసుకోవడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇది ప్రెజర్ కాదు.. పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. చెప్పాలంటే ఎవరికైనా ప్రెజర్ లేదూ అంటే అది మనకే. తెలుగు పరిశ్రమతో పోటీపడాలని ఇతర ఇండస్ట్రీలు ఒత్తిడికి గురవుతున్నాయి. ► మీ నాన్నగారు (నిర్మాత అల్లు అరవింద్) చాలా సంతోషపడి ఉంటారు. అలాగే మీ కుటుంబ సభ్యులు ఎలా స్పందించారు... అవార్డు సాధించిన నాకన్నా.. మా నాన్నగారికి ఎక్కువ శుభాకాంక్షలు వచ్చాయి (నవ్వుతూ). మా అమ్మ అయితే ఆనందంతో మాట్లాడలేకపోయారు. అమ్మ హగ్లోనే ఆమె సంతోషం అర్థమైపోయింది. అలాగే నా సినిమా గురించి మా ఆవిడ (స్నేహా) ఎప్పుడూ భావోద్వేగానికి లోనవ్వదు. కానీ తొలిసారి ఎమోషన్కి గురై, నన్ను హత్తుకుంది. -
నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీస్.. ఏయే ఓటీటీల్లో?
జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. అలానే మిగతా దక్షిణాది భాషల్లోని చిత్రాలు సైతం అవార్డులు గెలుచుకున్నాయి. 'పుష్ప' మూవీకిగానూ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డు గెలుచుకోవడం మాత్రం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిపోయింది. అలానే 'ఆర్ఆర్ఆర్'కి ఏకంగా ఆరు పురస్కారాలు దక్కడం కూడా టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచింది. (ఇదీ చదవండి: మహేశ్బాబు.. జాతీయ అవార్డు మిస్ చేసుకున్నాడా?) అయితే చాలామంది ఎవరెవరికి ఎన్ని అవార్డులు వచ్చాయనేది చూస్తుంటే.. సినీ ప్రేమికులు మాత్రం ఏ సినిమా ఏ ఓటీటీలో ఉందా అని తెగ వెతికేస్తున్నారు. అయితే అలాంటి వాళ్ల కోసం మేం ఆ లిస్టుతో వచ్చేశాం. అవార్డులు గెలుచుకున్న చిత్రాలు ప్రస్తుతం ఏ ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయనేది తెలియాలంటే దిగువన లిస్ట్పై అలా ఓ లుక్కేసేయండి. నేషనల్ అవార్డ్ మూవీస్- ఓటీటీ ఆర్ఆర్ఆర్ - జీ5, డిస్నీ ప్లస్ హాట్స్టార్ (తెలుగు) పుష్ప - అమెజాన్ ప్రైమ్ (తెలుగు) రాకెట్రీ: ద నంబి ఎఫెక్ట్ - జియో సినిమా (తెలుగు-హిందీ) ఉప్పెన - నెట్ఫ్లిక్స్ (తెలుగు) కొండపొలం - నెట్ఫ్లిక్స్ (తెలుగు) ద కశ్మీర్ ఫైల్స్ - జీ5 (తెలుగు డబ్బింగ్) చార్లి 777 - అమెజాన్ ప్రైమ్ (తెలుగు డబ్బింగ్) గంగూబాయి కతియావాడి - నెట్ఫ్లిక్స్ (తెలుగు డబ్బింగ్) మిమీ - నెట్ఫ్లిక్స్ (హిందీ) #Home - అమెజాన్ ప్రైమ్ (తెలుగు డబ్బింగ్) షేర్షా - అమెజాన్ ప్రైమ్ (హిందీ) సర్దార్ ఉద్దామ్ సింగ్ - అమెజాన్ ప్రైమ్ (హిందీ) కడైసి వివసయ్ - సోనీ లివ్ (తెలుగు డబ్బింగ్) నాయట్టు - నెట్ఫ్లిక్స్ (తెలుగు డబ్బింగ్) (ఇదీ చదవండి: బ్రహ్మానందం ఇంటికెళ్లిన బన్నీ.. కారణం అదేనా?) -
మహేశ్బాబు.. జాతీయ అవార్డు మిస్ చేసుకున్నాడా?
స్టార్ హీరో అల్లు అర్జున్.. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకోవడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది. 'పుష్ప' మూవీ రిలీజైనప్పుడు బన్నీ గురించి ఎంత మాట్లాడుకున్నారో.. అవార్డు రావడంతో అంతకంటే ఎక్కువగానే మాట్లాడుకుంటున్నారు. అదే టైంలో హీరో మహేశ్ బాబు మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఫస్ట్ ఛాయిస్ మహేశ్ 'రంగస్థలం' లాంటి బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన తర్వాత మహేశ్తో సినిమా చేయాలని డైరెక్టర్ సుకుమార్ ఫిక్సయ్యాడు. ముందుగా తెలంగాణ బ్యాక్డ్రాప్తో ఓ స్టోరీ అనుకున్నారట. కొన్నాళ్లకు ఎర్ర చందనం స్మగ్లింగ్పై సుక్కు.. ఓ లైన్ రెడీ చేశాడు. మహేశ్తో ఈ మూవీ చేయాలనుకుని.. ఏడాది పాటు దీనిపై వర్క్ చేశారట. కానీ మహేశ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నాడు. అప్పట్లో దీనిపై మహేశ్ ట్వీట్ కూడా పెట్టాడు. Due to creative differences, my film with Sukumar is not happening. I wish him all the best on the announcement of his new project. Respect always for a film maker par exellence. 1 Nenokkadine will remain as a cult classic. Enjoyed every moment working on that film. — Mahesh Babu (@urstrulyMahesh) March 4, 2019 (ఇదీ చదవండి: బ్రహ్మానందం ఇంటికెళ్లిన బన్నీ.. కారణం అదేనా?) లైన్లోకి బన్నీ మహేశ్తో సినిమా అనుకున్నప్పుడు ఓ లైన్ రెడీ చేసిన సుకుమార్.. దాన్ని బాగా డెవలప్ చేసి అల్లు అర్జున్ కి వినిపించాడట. అలా ఈ కాంబో సెట్ అయింది. ఆ తర్వాత ఈ సినిమా.. పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ సృష్టించింది. ఇప్పుడు 'పుష్ప' అనేది మూవీ కాదు బ్రాండ్ అనేంతలా మారిపోయింది. అల్లు అర్జున్ కి నటుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది. ఛాన్స్ మిస్? ఇప్పుడు 'పుష్ప' సినిమాకుగానూ అల్లు అర్జున్కి జాతీయ అవార్డు రావడంతో మహేశ్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. అయితే సుక్కు.. మహేశ్ తో సినిమా చేయాలనుకున్నప్పుడు హీరోగా పోలీస్ క్యారెక్టర్ అనుకున్నారట. కానీ బన్నీ లైన్ లోకి వచ్చేసరికి అది కాస్త కూలీ టూ డాన్ పాత్రగా మారింది. కాబట్టి మహేశ్ ఎలాంటి అవకాశం మిస్ చేసుకోలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రెండు వేేర్వేరు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ చేసుంటే అప్పుడు మహేశ్కి జాతీయ అవార్డు వచ్చుండేదా లేదా అనేది అప్పుడు తెలిసేది తప్పు ఇప్పుడు ఈ డిస్కషన్ అనవసరం. (ఇదీ చదవండి: 'పుష్ప'కి జాతీయ అవార్డులు.. ఆ అంశాలే కలిసొచ్చాయా?) -
అల్లు అర్జున్ను పట్టుకుని ఏడ్చేసిన సుకుమార్, వీడియో వైరల్
పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదేలే.. అంటూ ఒక్క డైలాగ్తో అరాచకం సృష్టించాడు అల్లు అర్జున్. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లతో రికార్డులు తిరగరాసిన ఇతడు తాజాగా ఎవరూ ఊహించని అవార్డు అందుకున్నాడు. 69 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న జాతీయ ఉత్తమ నటుడి అవార్డును కొల్లగొట్టాడు. తెలుగు సినీచరిత్రలోనే బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న తొలి హీరోగా చరిత్ర సృష్టించాడు. దీంతో బన్నీ ఇంట పండగ వాతావరణం నెలకొంది. పుష్ప సినిమాకుగానూ బన్నీకి అవార్డు వరించిన క్రమంలో డైరెక్టర్ సుకుమార్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. అల్లు అర్జున్ను హత్తుకుని ఆనందంతో ఏడ్చేశాడు. కొద్ది క్షణాలపాటు బన్నీని పట్టుకుని ఎమోషనలయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు.. అల్లు అర్జున్ ఫస్ట్ రియాక్షన్ ఇదే! -
ఏడాది దాటిపోయింది.. ఇంకా వదల్లేదా!
ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్కు భారతీయ సినిమాలంటే అమితమైన ప్రేమ. ముఖ్యంగా తెలుగు సినిమాలపై ఆ ప్రేమ మరింత ఎక్కువగా ఉంటుంది. పుష్ప సినిమా వచ్చి ఏడాది దాటిపోయినా ఇంకా వార్నర్ 'తగ్గేదే లే' అంటూ తిరుగతున్నాడు. ఇప్పట్లో 'పుష్ప' మేనియా వార్నర్ను వదిలేలా లేదు. తాజగా టీమిండియాతో వన్డే సిరీస్ గెలిచాకా ట్రోఫీ అందుకునే సమయంలో వార్నర్ పుష్ప సెలబ్రేషన్స్ చేయడం వైరల్గా మారింది. చెన్నై వేదికగా జరిగిన చివరి వన్డేలో టీమిండియా 21 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. దీంతో 2-1తో ఆస్ట్రేలియా సిరీస్ను కైవసం చేసుకుంది. మూడో వన్డేలో విక్టరీ తర్వాత ఆసీస్ జట్టు ట్రోఫీ అందుకున్న సమయంలో వార్నర్ తనదైన స్టైల్లో ఎంజాయ్ చేశాడు. పుష్ప చిత్రంలోని 'తగ్గేదే లే' అన్న ఫేమస్ డైలాగ్తో హీరో అల్లుఅర్జున్ ఇచ్చిన ఫోజును వార్నర్ ఇమిటేట్ చేశాడు. ప్లేయర్లతో గ్రూపు ఫోటో దిగిన సమయంలో వార్నర్.. తగ్గేదేలే అంటూ హల్చల్ చేశాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కూడా పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ వాకింగ్ స్టైల్ను ఇమిటేట్ చేయడం కూడా బాగా ఆసక్తి కలిగించింది. ఆసీస్ నిర్దేశించిన 270 పరుగుల లక్ష్యఛేదనలో టీమ్ఇండియా 49.1 ఓవర్లలో 248 పరుగులకు పరిమితమైంది. విరాట్ కోహ్లీ(54), హార్దిక్ పాండ్యా(40) చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరిచారు. ఆడమ్ జంపా(4/45) నాలుగు వికెట్లతో విజృంభించాడు. తొలుత ఆసీస్ 49 ఓవర్లలో 269 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్(47) టాప్ స్కోరర్గా నిలిచాడు. హార్దిక్ పాండ్యా (3/44), కుల్దీప్ యాదవ్(3/56) మూడేసి వికెట్లు తీశారు. జంపాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, మార్ష్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ దక్కాయి. Gd morning 🖤🖤#Warner and #Pushpa ... A never ending story 🔥🔥@alluarjun @davidwarner31 co fan 😅 pic.twitter.com/NcIkuFBEFM — Stylish 🌟 Shiva goud AA Dhf (@ShivagoudAA) March 23, 2023 చదవండి: పంజాబ్ కింగ్స్కు ఏకకాలంలో గుడ్న్యూస్.. బ్యాడ్న్యూస్ దేశం క్లిష్ట పరిస్థితుల్లో.. వాళ్లకు ప్లాట్లు, ఖరీదైన ఫోన్లు? -
Maha Shivaratri 2023: థియేటర్స్లో మళ్లీ ఆ సూపర్ హిట్ మూవీస్..ఎక్కడ?
ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో రీరిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోలు నటించిన సూపర్ హిట్ చిత్రాలను మళ్లీ థియేటర్స్లో ప్రదర్శిస్తూ.. అభిమానులను అలరిస్తున్నారు. హీరోల పుట్టినరోజు లేదా ఏదైన పండగ రోజు చూస్కొని పాత సినిమాలను మళ్లీ విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలు మహేశ్బాబు, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణల సినిమాలు రీరిలీజై.. మంచి వసూళ్లను రాబడుతున్నాయి. దీంతో స్పెషల్ డే వస్తే చాలు ఓల్డ్ సూపర్ హిట్ మూవీస్.. రీరిలీజ్కు రెడీ అవుతున్నాయి. శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 18న కూడా చాలా సినిమాలు మళ్లీ థియేటర్స్లో సందడి చేయడానికి సిద్దమవుతున్నాయి. శివరాత్రి రోజు రీరిలీజ్కు రెడీ అయిన స్టార్ హీరోల సినిమాలపై ఓలుక్కేద్దాం. పుష్ప ది రైజ్ ఐకాన్స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప. 2021 డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. మహా శివరాత్రిని పురస్కరించుకొని ఫిబ్రవరి 18న హైదరాబాద్లోని సుష్మ 70 ఎమ్ఎమ్ థియేటర్లో ఉదయం 3 గంటలకు స్పెషల్ షో వేయనున్నారు. అఖండ.. నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అఖండ. 2021 డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల రాబట్టింది. ఇందులో అఘోరాగా బాలయ్య నటన అందరిని ఆకట్టుకుంది. శివరాత్రి సందర్భంగా ఈ సినిమా మళ్లీ విడుదల కాబోతుంది. ఫిబ్రవరి 18న హైదరాబాద్లోని సుదర్శన్ 35 ఎమ్ఎమ్ థియేటర్లో అర్థరాత్రి 12.15 నిమిషాలకు, సుష్మ 70 ఎమ్ఎమ్ థియేటర్స్లో రాత్రి 11.49 గంటలకు ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. వాల్తేరు వీరయ్య మెగాస్టార్ చిరంజీవి, రవితేజ కలిసి నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం వాల్తేరు వీరయ్య కూడా మళ్లీ థియేటర్స్లో సందడి చేయనుంది. శివరాత్రి పురస్కరించుకొని ఫిబ్రవరి 18న సంధ్య 70 ఎమ్ఎమ్ లో అర్థ రాత్రి 12.15గంటలకు, అలాగే ఉదయం 3 గంటలకు వాల్తేరు వీరయ్య స్పెషల్ షో వేయనున్నారు. కాంతార చిన్న చిత్రంగా విడుదలై భారీ విజయం సాధించిన కన్నడ చిత్రం ‘కాంతార’. ఈ చిత్రం కన్నడ వెర్షన్ గతేడాది సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టించింది. ఇదే పేరుతో టాలీవుడ్లో అక్టోబర్ 15న విడుదలై..ఇక్కడ కూడా భారీ వసూళ్లను రాబట్టింది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శివరాత్రి రోజు హైదరాబాద్లోని సప్తగిరి 70ఎమ్ఎమ్ థియేటర్లో అర్థరాత్రి 12 గంటలకు, ఉదయం 3 గంటలకు ప్రదర్శంచనున్నారు. టెంపర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన టెంపర్ మూవి ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఎన్టీఆర్ని కొత్త లుక్లో చూపించడమే కాదు.. యాక్టింగ్లోనూ మరో యాంగిల్ని ప్రేక్షకులకు తెలియజేసిన చిత్రమిది. ఈ చిత్రాన్ని మహాశివరాత్రి సందర్భంగా హైదరాబాద్లోని దేవి థియేటర్స్లో అర్థరాత్రి 12.15 గంటలకు, సంధ్య థియేటర్స్లో అర్థరాత్రి 12.30 గంటలకు ప్రదర్శించనున్నారు. వీటితో పాటు మహేశ్బాబు నటించిన సరిలేరే నీకెవ్వరు సినిమా కొత్తపేటలోని మహాలక్ష్మీ కాంప్లెక్స్లో శనివారం అర్థరాత్రి 11.59 గంటలకు, దూకుడు చిత్రం సుదర్శన్లో ఉదయం 3 గంటలకు ప్రదర్శించనున్నారు. అలాగే పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం కూడా మహాలక్ష్మీ కాంప్లెక్స్లో ఉదయం 3 గంటలకు విడుదల కానుంది. -
ఓ పెద్ద కథ ..రెండు సినిమాలు
అన్ని సినిమాలకూ కథ ఉంటుంది. కొన్ని సినిమాలకు పెద్ద కథ ఉంటుంది. అయితే ఆ పెద్ద కథని రెండున్నర గంటల్లో చూపించలేరు. అందుకే రెండు మూడు భాగాలుగా చూపిస్తారు. అలా ఈ ఏడాది ఇటు సౌత్ అటు నార్త్లో ‘పార్ట్ 2’ సినిమాలు చాలానే రానున్నాయి. తొలి భాగం విడుదలై, ఘనవిజయం సాధించిన నేపథ్యంలో మలి భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక కొన్ని చిత్రాలైతే తొలి, మలి భాగం రెండూ ఆన్సెట్స్లో ఉన్నాయి. ఈ చిత్రాల గురించి తెలుసుకుందాం. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఈ చిత్రం తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ 2021 డిసెంబరులో రిలీజై సూపర్హిట్ అయింది. దీంతో మలి భాగం ‘పుష్ప: ది రైజ్’పై మరింత ఫోకస్ పెట్టింది ఈ టీమ్. ఈ సినిమా షూటింగ్ వైజాగ్లో జరుగుతోంది. ‘పుష్ప: ది రూల్’ను ఈ ఏడాదే రిలీజ్ చేయా లనుకుంటున్నారు. మరోవైపు మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన హిస్టారికల్ ఫిల్మ్ ‘పొన్నియిన్ సెల్వన్’. విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రం తొలి భాగం గత ఏడాది సెప్టెంబరులో విడుదలై ఘనవిజయం సాధించింది. ఆల్రెడీ షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న రెండో భాగం ఈ ఏడాది ఏప్రిల్ 28న విడుదల కానుంది. అలాగే తమిళంలో ‘వడ చెన్నై’, ‘అసురన్’ వంటి సూపర్ హిట్స్ను అందించిన దర్శకుడు వెట్రిమారన్ ప్రస్తుతం ‘విడుదలై’ అనే సినిమాను తీస్తున్నారు. విజయ్ సేతుపతి, సూరి హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. రెండు భాగాలకు సంబంధించిన మేజర్ షూటింగ్ పూర్తయింది. మొదటి భాగాన్ని ఈ ఏడాది వేసవిలో, రెండో బాగాన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలనుకుంటున్నారు. అదే విధంగా మరో తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘వెందు తనిందదు కాడు’ (తెలుగులో ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు) చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగం గత ఏడాది సెప్టెంబరులో విడుదలైంది. మలి భాగం రిలీజ్పై త్వరలో ఓ స్పష్టత రానుంది. అదే విధంగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలోనే విక్రమ్ హీరోగా ‘ధృవనక్షత్రం’ అనే సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందకు రానుందని కోలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. తొలి భాగాన్ని ఈ ఏడాదిలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అటు మలయాళంలో ‘రామ్’ రెండు భాగాలుగా రూపొందుతోంది. మోహన్లాల్కు ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ వంటి హిట్స్ను అందించిన జీతూ జోసెఫ్ ఈ సినిమాకు దర్శకుడు. సౌత్లోనే కాదు నార్త్లోనూ ఈ ట్రెండ్ కనిపిస్తోంది. రణ్బీర్ కపూర్ హీరోగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. ట్రయాలజీగా ఈ సినిమాను తీస్తున్నారు. తొలి భాగం విడుదలైన విషయం తెలిసిందే. మలి భాగం త్వరలోనే సెట్స్కి వెళ్లనుంది. అలాగే జాన్ అబ్రహాం హీరోగా రూపొందిన ‘ఎటాక్’ తొలి భాగం గత ఏడాది ఏప్రిల్లో రిలీజైంది. మలి భాగం రెడీ అవుతోంది. ఇవే కాదు.. రెండు భాగాల చిత్రాలు కొన్ని సెట్స్లో, ఇంకొన్ని చర్చల దశల్లో ఉన్నాయి. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కె’, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ‘సలార్’ చిత్రాలు చేస్తున్నారు ప్రభాస్. ఈ చిత్రాలు రెండు భాగాలుగా విడుదల కానున్నాయని టాక్. అలాగే హీరో ఎన్టీఆర్, దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్లో ఓ సినిమా ఉందనే టాక్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందని, తొలి భాగంలో ఎన్టీఆర్ హీరోగా, రెండో భాగంలో ధనుష్ హీరోగా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక సూర్య హీరోగా శివ డైరెక్షన్లో రూపొందుతున్న చిత్రం కూడా రెండు భాగాలుగా వస్తుందని టాక్. ఇంకా బాలీవుడ్ నిర్మాతలతో కలిసి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, రామాయణం ఆధారంగా ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా రెండు భాగాలు రానుందని టాక్. -
కాలం వెనక్కి వెళ్లే కథలు.. రీల్లైఫ్లో అలాంటి బ్యాక్గ్రౌండ్తో వస్తున్న సినిమాలివే
2023లో ఉన్నప్పుడు 40, 50, 60 ఏళ్లు... అంతకుమించి వెనక్కి వెళ్లే అవకాశం వస్తే...? రియల్ లైఫ్లో సాధ్యం కాకపోవచ్చు. కానీ రీల్ లైఫ్లో ఏదైనా సాధ్యమే. కాలం వెనక్కి వెళ్లొచ్చు.. ముందుకూ వెళ్లొచ్చు. ఇప్పుడు కాలం వెనక్కి వెళ్లే కథలు వెండితెరపైకి రావడానికి రెడీ అవుతున్నాయి. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. స్టువర్టుపురం దొంగగా ముద్రపడిన టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’. హీరో రవితేజ టైటిల్ రోల్లో వంశీ దర్శకత్వంలో అభిషేక్ నామా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. స్టువర్టుపురంలో 1970–1980 కాలంలో చోటుచేసుకున్న ఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రం ఇది. వీలైనంత త్వరగా ఈ చిత్రం పూర్తి చేసి ఈ ఏడాదే థియేటర్స్లోకి తీసుకురావాలనుకుంటున్నారు మేకర్స్. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం హీరోగా చేస్తున్న చిత్రాల్లో ‘సలార్’ ఒకటి. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 1970 బ్యాక్డ్రాప్లో ఉంటుందన్న టాక్ ఆల్రెడీ ఫిల్మ్నగర్లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ‘సలార్’ చిత్రం ఈ ఏడాది సెప్టెంబరు 28న విడుదల కానుంది. మరోవైపు రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్చరణ్ క్యారెక్టర్లో షేడ్స్ ఉంటాయి. రామ్చరణ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. తండ్రి పాత్ర సన్నివేశాలన్నీ 1960–1970 బ్యాక్డ్రాప్కి సంబంధింనవని తెలిసింది. ఐఏఎస్ ఆఫీసర్ల నేపథ్యంలో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్లు నిర్మిస్తున్నారు. ఇంకోవైపు అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘పుష్ప’ చిత్రకథ 1990 బ్యాక్డ్రాప్ నుంచే ఆరంభం అవుతుంది. రెండు భాగాల ఈ సినిమాలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ గత ఏడాది డిసెంబరు 19న విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘పుష్ప’ రెండో భాగం ‘పుష్ప: ది రైజ్’ నిర్మాణంలో ఉంది. ఈ సినిమాకు కూడా 1990 బ్యాక్డ్రాప్ ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది వర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈ వేసవిలో థియేటర్స్లో ఆడియన్స్కు ‘దసరా’ చూపేందుకు రెడీ అవుతున్నారు హీరో నాని. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. 1980–1990 బ్యాక్డ్రాప్లో తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల పరిసర ప్రాంతాల్లో ఉన్న ఓ గ్రామం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలిసింది. ఆ గ్రామంలో నెలకొన్న పరిస్థితులను ధరణి (నాని) ఏ విధంగా పరిష్కరించాడు, వెన్నెల (ఇందులో హీరోయిన్ కీర్తీ సురేష్ పాత్ర)తో అతని లవ్స్టోరీ ఏమైంది? అన్నదే ‘దసరా’ ప్రధాన కథాంశం. మరోవైపు ‘డెవిల్’ సినిమా కోసం 1945వ కాలం నాటి బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్గా మారిపోయారు కల్యాణ్ రామ్. స్వాతంత్య్రం రాకముందు బ్రిటిష్వాళ్లు పరి΄ాలింన మద్రాస్ ప్రెసిడెన్సీలో జరిగిన కొన్ని రహస్య అంశాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించి ఎవరికీ తెలియని ఓ రహస్యాన్ని ఛేదించడానికి గూఢచారిగా కల్యాణ్ రామ్ ఏం చేశారు? అన్నదే ‘డెవిల్’ కథాంశం. నవీన్ మేడారం దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే థియేటర్స్లోకి రానుంది. ఇంకోవైపు ‘హరోం హర’ అంటున్నారు హీరో సుధీర్బాబు. జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ఇది. ‘ది రివోల్ట్’ అనేది క్యాప్షన్. సుమంత్. జి నాయుడు నిర్మిస్తున్న ఈ సినిమా 1989 నాటి కుప్పం నేపథ్యంలో సాగుతుంది. తమిళ ఇండస్ట్రీలోనూ కొన్ని సినిమాలు ఉన్నాయి. హీరో కమల్హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్గా వీరి కాంబినేషన్లోనే ప్రస్తుతం ‘ఇండియన్ 2’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రధానంగా స్వాతంత్య్రానికి పూర్వం అంటే 1920–1930 నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. ఇక ధనుష్ హీరోగా నటిస్తున్న తాజా ΄ాన్ ఇండియన్ ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్’ది 1930–1940 బ్యాక్డ్రాప్ అని త్ర యూనిట్ ఆల్రెడీ ప్రకటింంది. అరుణమాదేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కన్నడ ప్రముఖ నటుడు శివరాజ్కుమార్, సందీప్ కిషన్ కీ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రాలే కాదు.. దర్శకుడు వెట్రిమారన్తో సర్య కమిట్ అయిన ‘వాడివాసల్’, శివ దర్శకత్వంలో సర్య చేస్తున్న 42వ సినిమాలు కూడా గతంలోకి తీసుకెళ్లేవే. 1990 బ్యాక్డ్రాప్ అంటే బొమ్మ హిట్టే అని గత ఏడాది బాక్సాఫీస్ లెక్కలు చెబుతున్నాయి. హిట్ రిపీట్ అయితే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది కాబట్టి.. రిపీట్ అవ్వాలని కోరుకుంటుంటారు. గత ఏడాది తెలుగులో బిగ్గెస్ట్ హిట్గా నిలి, బాక్సాఫీస్ వద్ద దాదాపు ర. 1300 కోట్ల గ్రాస్ను వసలు చేసిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా 1920 బ్యాక్డ్రాప్లో ర΄÷ందింది. ఇక సువరు 90 కోట్ల ర΄ాయల గ్రాస్ కలెక్షన్స్ను రాబట్టి సపర్హిట్గా నిలిన ‘సీతారామం’ చిత్రకథ 1964–1985 బ్యాక్డ్రాప్లో సాగుతుందన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాలే కాదు... బాక్సాఫీస్ వద్ద ర. 1100 కోట్లు రాబట్టిన ‘కేజీఎఫ్: ఛాప్టర్ 2 (1980 నేపథ్యంలో...), ర. 400 కోట్లకు పైగా వసలు చేసిన కన్నడ బ్లాక్బస్టర్ ‘కాంతార’ (కథ 1847లో స్టార్ట్ అయినా మేజర్ కథాంశం, స్క్రీన్ ప్లే..1990 బ్యాక్డ్రాప్లోనే సాగుతుంది), హిందీలో ర. 300కోట్లకు పైగా వసలు చేసిన సపర్హిట్ మూవీ ‘ది కశ్మీరీ ‡ఫైల్స్’ (స్క్రీన్ ప్లే 2020లో స్టార్ట్ అయినా... కథ మేజర్గా 1989–1990 నేపథ్యంలోనే సాగుతుంది) కొన్నేళ్లు వెనక్కి తీసుకెళ్లే చిత్రాలే కావడం విశేషం. ఈ జాబితాలో మరికొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. యాక్షన్, థ్రిల్లర్ అంశాలతో పాటు ఆధ్యాత్మిక అంశాలతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక ప్రస్తుతం ‘విరసాక్ష’ సినిమాలో హీరోగా నటిస్తున్నారు సాయిధరమ్ తేజ్. 1990 నేపథ్యంలో ఓ ఫారెస్ట్ బేస్డ్ విలేజ్లో సాగే థ్రిల్లర్ సినిమా ఇది. మూఢ నమ్మకాలు, సైన్స్, ఆధ్యాత్మిక అంశాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని టాక్. కార్తీక్ దండు దర్శకత్వంలో బీవీఎన్ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 21న రిలీజ్ కానుంది. ఈ చిత్రాలే కాదు... 1990ల నేపథ్యంలో రూపొందుతోన్న మరికొన్ని చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాయి. -
పుష్ప: ది రైజ్ వచ్చి సరిగ్గా ఏడాది.. స్పెషల్ పోస్ట్ షేర్ చేసిన మూవీ టీం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం.. ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేసింది. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్.. తగ్గేదే లే’ అంటూ ఇండియన్ బాక్సాఫీస్పై దాడి చేసి కోట్ల రూపాయలను కొల్లగొట్టేశాడు ‘పుష్పరాజ్’. ఈ మూవీ ఫస్ట్పార్ట్ పుష్పా: ది రైజ్ రిలీజై ఈ రోజుకి(డిసెంబర్ 17) సరిగ్గా ఏడాది. ఈ సందర్భంగా మూవీ యూనిట్ ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేసింది. ఈ మూవీ వచ్చి ఏడాది అయిన పుష్ప రాజ్ సృష్టించిన ఇంపాక్ట్ ఇప్పటికి అలానే ఉంది. చదవండి: పట్టలేని సంతోషంతో భార్యను హగ్ చేసుకున్న అభిషేక్.. ఆ రూమర్లకు ఈ వీడియో చెక్ ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సృష్టించిన సంచలనం, గెలుచుకున్న అవార్డులు, కలెక్ట్ చేసిన మొత్తం వసూళ్లను ఈ సందర్భంగా వెల్లడిచింది మూవీ యూనిట్. పుష్పరాజ్తో రిలీజ్ చేసిన ఈ పోస్టర్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 365 కోట్లు కలెక్ట్ చేసిందని, ఇక పాటలు 6 బిలియన్ల వ్యూస్ రాబట్టి తొలి భారత చిత్రంగా నిలిచిందని పేర్కొంది. అదే విధంగా ఇండియన్ ఫిలిం ఆఫ్ ది ఈయర్గా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా గెలిచిందని, అమెజాన్ ప్రైంలో అత్యధికంగా చూసిన ఇండియన్ మూవీగా పుష్ప నిలిచిందని తెలిపారు. 7 ఫలింఫేర్ అవార్డ్స్, 7 సైమా ఆవార్ట్స్తో పాటు.. చదవండి: రామ్ చరణ్పై ‘కింగ్ ఖాన్’ షారుక్ ఆసక్తికర వ్యాఖ్యలు 7 సాక్షి ఎక్స్లెన్స్ అవార్డులను కైవసం చేసుకున్నట్లు వెల్లడించింది పుష్ప టీం. అలా ఇండియాలో సెన్సెషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ ఇటీవల రష్యాలో కూడా విడుదలైన సంగతి తెలిసిందే. డిసెంబర్ 8, 2022లో రష్యా వ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ చిత్రం అక్కడ సైతం కలెక్షన్స్ కొల్లగొడుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా పుష్ప టీం రష్యాలో పర్యటించింది. ఈ సందర్భంగా రష్యా టూర్లో భాగంగా పుష్ప టీం తీసుకున్న ఫొటోను సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఫొటోను షేర్ చేశాడు. కాగా పుష్ప పార్ట్ 2 రిలీజ్ డేట్ కోసం ప్రేక్షకులంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ను జరుపుకుంటోంది. 1 year for the Pan Indian Blockbuster #PushpaTheRise 🔥 1 year for Icon Star @alluarjun setting the screens on fire as #PushpaRaj 🔥 1 year for the sensation at the Indian Box Office 🔥#1YearForIndianHGOTYPushpa @iamRashmika @aryasukku @ThisIsDSP @MythriOfficial pic.twitter.com/3bqf52fb7B — Pushpa (@PushpaMovie) December 17, 2022 View this post on Instagram A post shared by Devi Sri Prasad (@thisisdsp) -
ఈ ఏడాది ఎక్కువమంది చూసిన సినిమాలివే!
'సినిమా చూపిస్త మామా.. నీకు సినిమా చూపిస్త మామా.. సీనుసీనుకీ నీతో నేను సీటీ కొట్టిస్త మామా.. ఇది ఓ పాటలోని లిరిక్.. కానీ అక్షరాలా ఇదే నిజం చేసి చూపించాయి కొన్ని సినిమాలు.. చిన్న, పెద్ద సినిమాలెన్నో ఈసారి భారీ విజయాన్ని మూటగట్టుకుని ప్రేక్షకుడితో నిజంగానే సీటీ కొట్టించాయి. థియేటర్లోనే కాదు, ఓటీటీలో కూడా రచ్చ లేపాయి. అలా ఇండియాలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎక్కువ మంచి చూసిన టాప్ 10 సినిమాల్లో మొదటి ఐదు చిత్రాలు సౌత్వే కావడం గమనార్హం. ఇంతకీ ఆ సినిమాలేంటో చూసేద్దాం... 1. పుష్ప 2. కేజీఎఫ్ 2 3. కేజీఎఫ్ 1 4. సీతారామం 5. పొన్నియన్ సెల్వన్ 1 6. బచ్చన్ పాండే 7. జుగ్ జుగ్ జియో 8. రన్వే 34 9. జురాసిక్ వరల్డ్ డొమైన్ 10. గెహ్రియాన్ చదవండి: భార్యను కౌగిట్లో బంధించిన తారక్ అర్జున్ కల్యాణ్ దృష్టిలో శ్రీసత్య కంటెంట్ మాత్రమే!
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఏలూరులో చల్లారని రగడ...
పరిచయం పెంచుకొని.. పాపను విడిచి
ఏకకాలంలో ఎన్నోపనులు..!
బస్సు ప్రమాదం జరగటానికి అసలు కారణాలు
చంద్రబాబు ఎత్తులు ఫలించాయా !..సక్సెస్ రేట్ ఎంత..?
వారణాసి.. రాజకీయ చరిత్ర ఇదే!
ఉప్పెనలా ఏపీలో ఓటింగ్.. రాబోయేది 'ఫ్యాన్' టాస్టిక్ రిజల్ట్స్
మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ కస్టడీ పొడగింపు
ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ ఫుల్ ఫోకస్.. మరో కొత్త ప్లాన్!
NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
తప్పక చదవండి
- మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ కస్టడీ పొడగింపు
- పాడెపై వెళ్లి నామినేషన్! గోరఖ్పూర్లో విచిత్రం
- కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
- NOTA: నోటా.. కోరల్లేని పులి!
- Anasuya Bharadwaj: అందానికే కాదు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనసూయ.. బర్త్డే స్పెషల్ (ఫోటోలు)
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- టాలీవుడ్ హీరోయిన్కి అరుదైన వ్యాధి.. ఆస్పత్రిలో బెడ్పై అలా
- పదేళ్ల తర్వాత.. చాట్జీపీటీ కంపెనీ కోఫౌండర్ సంచలన నిర్ణయం!
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
Advertisement