-
సీఎం రేసుపై సచిన్ పైలెట్ కీలక వ్యాఖ్యలు
జైపూర్: రాజస్థాన్లో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో సీఎం రేసుపై సీనియర్ నాయకుడు సచిన్ పైలెట్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం పీఠంపై ఎవరు కూర్చోవాలనేది ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు, పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని తెలిపారు. క్షమించు.. మర్చిపో.. సాగిపో అనే విధానాన్నే కాంగ్రెస్ పెద్దలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తనకు సూచించారని పేర్కొన్నారు. భవిష్యత్పైనే దృష్టి సారించానని సచిన్ పైలెట్ చెప్పారు. రాజస్థాన్ ఐదేళ్ల రోడ్మ్యాప్పైనే ప్రస్తుతం పనిచేస్తున్నానని పేర్కొన్నారు. ఐక్యంగా కాంగ్రెస్ పార్టీకి విజయం తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఐక్యమత్యంగా పోరాడుతున్నారని చెప్పారు. ఏ విషయాన్నైనా నాయకులందరం కూర్చోని తేల్చుకుంటామని అన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండేదని తెలిపిన పైలెట్.. ఈ ఐదేళ్లపాటు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని ప్రజలు రుచి చూశారని చెప్పారు. రాజస్థాన్ చరిత్రలో ఈసారి ఎన్నికలు చరిత్రాత్మకంగా నిలుస్తాయని అన్నారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజస్థాన్ రాజకీయ చరిత్రలో నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్ ఎదురులేని పార్టీగా కొనసాగింది. 1990లో మొదటిసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఒకసారి కాంగ్రెస్ వస్తే మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చే సాంప్రదాయం కొనసాగుతోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్కు గడ్డుకాలమే నడుస్తున్నా.. మరి ఈసారి ప్రజలు ఏం తీర్పు ఇవ్వనున్నారో వేచి చూడాల్సి ఉంది. కాంగ్రెస్లో సీఎం పదవిపై సీనియర్ నాయకుడు అశోక్ గహ్లోత్, సచిన్ పైలెట్ వర్గాల మధ్య పోటీ నడుస్తోంది. గత ఎన్నికల్లో విజయం సాధించిన నాటి నుంచి పైలెట్, గహ్లోత్ వర్గాల మధ్య నిరంతరం నువ్వా-నేనా అన్నట్లు పోటీ నెలకొంది. కానీ పార్టీ కేంద్ర అధిష్ఠానం ఎప్పటికప్పుడు కల్పించుకుని వివాదాన్ని సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. గహ్లోత్కు పీఠాన్ని అప్పగించేలా సచిన్ పైలెట్ను ఒప్పించారు. అయితే.. ఈసారి సీఎం పదవి దక్కించుకోవాలని సచిన్ పైలెట్ వర్గం ఆశిస్తోంది. ఇదీ చదవండి: ఇంకా ఎంత దిగజారుతారు..? నితీష్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఫైర్ -
'రాహుల్ గాంధీది ఐరన్ లెగ్'
హైదరాబాద్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాహుల్ ది ఐరన్ లెగ్ అని, ఆయన ఎక్కడ అడుగుపెడితే అక్కడ ఖాళీ అవుతుందని దుయ్యబట్టారు. సచివాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కాంగ్రెస్ హయాంలో జరిగిన ఆత్మహత్యలు గురించి రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. రైతు ఆత్మహత్యల గురించి మాట్లాడిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ లో పర్యటించాలన్నారు. తమను విమర్శించే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు. రాష్ట్రంలో తాము చేస్తున్న అభివృద్ధిని చూడలేకే తమపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ శుక్రవారం నుంచి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వరికోత మిషన్ను తరలిస్తున్న డీసీఎం బోల్తా
కారు, బైక్ ఢీ.. భర్త మృతి
ఒకదానికొకటి ఢీకొన్న మూడు కార్లు
దేవుడి విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తి అరెస్ట్
మట్టి తరలిస్తున్న వారిపై కేసు
అధిక వడ్డీ ఆశచూపి మోసం
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు దుర్మరణం
తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి
ఓటేసి వస్తూ రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
24న కృషి విజ్ఞాన కేంద్రంలో వరి విత్తన మేళా
తప్పక చదవండి
- ఆ ఇద్దరి నామినేషన్లు రద్దు చేయాల్సిందే.. బీజేపీ డిమాండ్
- భారత సంతతి బాలుడికి దుబాయ్ పోలీసుల సత్కారం!
- సందీప్ లమిచానే శిక్ష రద్దు.. వరల్డ్కప్ జట్టులో చోటు?
- పెంపుడు కుక్క పెట్టిన గొడవ.. నడిరోడ్డుపైనే చితకబాదారు
- అందుకే ఓడిపోయాం!.. వరుస వైఫల్యాలు.. ఇకనైనా: సంజూ
- ఏపీలో ఓటేసుకునే స్వేచ్ఛ కూడా లేదా?
- సన్నీ లియోన్ బర్త్డేను ఎందుకు జరుపుకున్నారో చెప్పిన యువకులు
- Yadadri: ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్లు.. సాయం చేయండి
- తెలంగాణలో దంచికొట్టనున్న వానలు.. హైదరాబాద్కు కుంభవృష్టి హెచ్చరిక!
- ‘హలో అప్పారావ్.. ఏంటి పరిస్థితి!’
Advertisement