-
వాడేసిన ప్లాస్టిక్తో వండర్స్
మనింట్లో చాలా ప్లాస్టిక్ కవర్స్ పోగవుతాయి. వాటిని చెత్తలో పడేస్తాము. అవి ఎప్పటికీ మట్టిలో కలవక అలాగే కాలుష్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. కాని ఈ ప్లాస్టిక్ కవర్లనే రాజిబెన్ దారాలుగా చేసి బ్యాగులు అల్లుతుంది. బుట్టలు చేస్తుంది. పర్సులు చేస్తుంది. డోర్మ్యాట్లు సరేసరి. అందుకే ఆమెకు చాలా గుర్తింపు వచ్చింది. ఆమె వల్ల ఎందరికో ఉపాధి కలుగుతోంది. కొత్త ఆలోచన చేసిన వారే విజేతలు. గుజరాత్ కచ్ ప్రాంతంలోని కోటె అనే చిన్న పల్లెలో ఏమీ చదువుకోని అమ్మాయి – రాజి బెన్ పెరిగి పెద్దదయ్యి లండన్ వెళ్లి అక్కడ పెద్దవాళ్లతో తాను చేసిన కృషిని వివరించింది. ఆమె తన జీవితంలో ఇంత పెద్ద ప్రయాణం చేసి, గుర్తింపు పొందేలా చేసింది ఏమిటో తెలుసా? వృధా ప్లాసిక్. వాడేసిన ప్లాస్టిక్ రోడ్ల మీద, ఇళ్ల డస్ట్బిన్లలో, చెత్త కుప్పల మీద అందరూ ప్లాస్టిక్ కవర్లను, రేపర్లను పారేస్తారు. వాటిని ఏం చేయాలో ఎవరికీ ఏమీ తోచదు. అవి తొందరగా మట్టిలో కలిసిపోవు. కాని రాజిబెన్ వాటిని ఉపయోగంలోకి తెచ్చింది. వాటిని సేకరించి, కట్ చేసి పీలికలుగా మార్చి, కలిపి నేసి అందమైన వస్తువులు తయారు చేసింది. బ్యాగులు, సంచులు, పర్సులు... వాటి మన్నిక కూడా ఎక్కువ. ఎలా చేస్తారు? వాడేసిన ప్లాస్టిక్ క్యారీబ్యాగ్స్ను సేకరించి సర్ఫ్ నీళ్లతో కడుగుతారు. ఆ తర్వాత వాటిలోని మలినాలు పోవడానికి వేడి నీళ్లలో నానబెడతారు. తర్వాత రెండు రోజులు ఎండలో ఆరబెడతారు. ప్లాస్టిక్ మందంగా ఉంటే అర ఇంచ్ వెడల్పు రిబ్బన్లుగా; పలుచగా ఉంటే ముప్పావు ఇంచ్ రిబ్బన్లుగా కట్ చేస్తారు. ఈ ముక్కలను నాణ్యమైన జిగురుతో అంటించి పొడవైన ఉండగా మారుస్తారు. అంటే మగ్గం మీద నేయడానికి దారం బదులు ఈ ప్లాస్టిక్ ఉండనే ఉపయోగిస్తారు. ఈ ప్లాస్టిక్ దారాలతో నేస్తే దళసరి వస్త్రం తయారవుతుంది. దానిని కట్ చేసుకుని రకరకాల వస్తువులుగా చేతి నైపుణ్యంతో తీర్చిదిద్దుతారు. హ్యాండ్ బ్యాగ్లు, కూరగాయల బ్యాగ్లు, ఫోన్ బాక్సులు, పర్సులు.. ఇవన్నీ చాలా అందంగా ఉంటాయి. మన్నికతో ఉంటాయి. ఎలా వచ్చింది ఐడియా? రాజి బెన్ నేత కుటుంబంలో పుట్టింది. అయితే తండ్రికి నేత మీద విసుగుపుట్టి వ్యవసాయం చేసేవాడు. అదీగాక ఆడపిల్లలు మగ్గం మీద కూచోవడం నిషిద్ధం. కాని రాజి బెన్కి మగ్గం మీద పని చేయాలని 12 ఏళ్ల వయసు నుంచే ఉండేది. అందుకని మేనమామ కొడుకు దగ్గర రహస్యంగా మగ్గం పని నేర్చుకుంది. 14 ఏళ్లు వచ్చేసరికి మగ్గం పనిలో ఎక్స్పర్ట్గా మారింది. అయితే ఆమెకు పుట్టింటిలో కాని మెట్టినింటిలో గాని మగ్గం మీద కూచునే అవకాశమే రాలేదు. ఏడేళ్లు కాపురం చేశాక భర్త హటాత్తుగా మరణించడంతో రాజి బెన్ ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాల్సి వచ్చింది ముగ్గురు పిల్లల కోసం. కచ్లో ఒక ఎన్.జి.ఓ ఉంటే అక్కడ మగ్గం పని ఖాళీ ఉందని తెలిస్తే వెళ్లి చేరింది. అందమైన వస్త్రాలు అల్లి వాటిని ఆకర్షణీయమైన వస్తువులుగా తీర్చిదిద్దే స్థానిక కళలో ఆమె ప్రావీణ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. ఎన్.జి.ఓ వారు ఆమె చేసిన ఉత్పత్తులతో ఎగ్జిబిషన్ సేల్ నిర్వహించేవారు. 2012లో జరిగిన ఎగ్జిబిషన్లో ఒక విదేశీ డిజైనర్ ప్లాస్టిక్ను రీసైకిల్ చేసి తయారు చేసిన బ్యాగ్ను చూపించి ‘ఇలాంటిది తయారు చేయగలవా?’ అని అడిగాడు. అది ఎలా తయారయ్యిందో అర్థమయ్యాక రాజి బెన్కు నాలుగు రోజులు కూడా పట్టలేదు అలాంటి బ్యాగులు తయారు చేయడానికి. ఆ డిజైనర్ వాటిని చూసి సంతృప్తిగా కొనుక్కుని వెళ్లాడు. మరికొన్ని బ్యాగులు జనం క్షణాల్లో ఎగరేసుకుపోయారు. అప్పటి నుంచి వేస్ట్ ప్లాస్టిక్ నుంచి రాజి బెన్ హస్తకళా ఉత్పత్తులను తయారు చేస్తోంది. స్వచ్ఛ్ సుజల్ శక్తి సమ్మాన్ రాజి బెన్ ఖ్యాతి ఎంత దూరం వెళ్లిందంటే అమృత మహోత్సవం సందర్భంగా ‘స్వచ్ఛ్ సుజల్ శక్తి సమ్మాన్’ పురస్కారం ఆమెకు ప్రకటించారు. అలాగే యూరప్ దేశాల నుంచి ఆమె ఉత్పత్తులకు ఆర్డర్లు వస్తున్నాయి. ‘ప్లాస్టిక్ పీడ విరగడ అవ్వాలంటే దానిని ఎన్ని విధాలుగా రీసైకిల్ చేయవచ్చో అన్ని విధాలుగా చేయాలి. రాజి బెన్ కొత్త తరాన్ని తనతో కలుపుకుంటే ఆమె ఉత్పత్తులు చాలా దూరం వెళ్లడమే కాక పర్యావరణానికి మేలు కూడా జరుగుతుంది’ అని విదేశీ ఎంట్రప్రెన్యూర్లు అంటున్నారు. రాజి బెన్ ప్రస్తుతం 90 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. 2018 నుంచి సొంత సంస్థ పెట్టుకోవడంతో దాని టర్నోవర్ ఇప్పుడు సంవత్సరానికి 10 లక్షలు దాటిపోయింది. ఆమె గెలుపు గాథ మరింత విస్తరించాలని కావాలని కోరుకుందాం. -
బ్లాక్ బస్టర్గా రాజీ సినిమా
ముంబై : అలియా భట్ తాజా చిత్రం ‘రాజీ’ విమర్శకుల ప్రశంసలతో పాటు కాసుల వర్షం కురిపిస్తోంది. వంద కోట్ల వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. ఈ నెల 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా రెండు వారాల్లో రూ. 91.63 కోట్ల వసూళ్లు రాబట్టింది. మొదటి వారంలో రూ. 56.59 కోట్లు, రెండో వారంలో 35.04 కోట్ల కలెక్షన్లు తెచ్చుకున్నట్టు ప్రముఖ సినీ విమర్శకుడు, వాణిజ్య విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. ఒక సైనికుడి తల్లి నిజ జీవిత కథ ఆధారంగా ఇండియన్ నేవీ మాజీ లెఫ్టినెంట్ కమాండర్ హరీందర్ ఎస్ సిక్కా రాసిన ‘‘కాలింగ్ సెహమత్’’ నవల ఆధారంగా దర్శకురాలు మేఘనా గుల్జార్ ఈ సినిమాను తెరకెక్కించారు. అలియా భట్ సరసన విక్కీ కౌశల్ నటించారు. ఈ సినిమాలో అలియా భట్ నటనకు అన్నివైపుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. -
ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య
తాడిపత్రి రూరల్ : తాడిపత్రి మండలంలోని బొందెలదిన్నె గ్రామానికి చెందిన రాజీ (21) ఉరేసుకొని ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు .. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని మదన అనంతపురం గ్రామానికి చెందిన రాజీకి బొందెలదిన్నె గ్రామానికి చెందిన మల్లికార్జునకు రెండేళ్ల క్రితం వివాహం అయ్యింది. మల్లికార్జున గెర్దావ్ స్టిల్ప్లాంటులో విధులు నిర్వహించేవాడు. విధులకు సక్రమంగా వెళ్లకపోవడంతో తొలగించారు. దీంతో మల్లికార్జున ఖాళీగానే ఉంటున్నాడు. మనస్థాపం చెందిన రాజీ ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకుందా? లేక ఏమైన కారణాలు ఉన్నాయా? అన్న విషయం తెలియాల్సి ఉంది. అయితే మృతురాలి తల్లిదండ్రులు మాత్రం అత్తింటివారి వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుందని అంటున్నారు. మృతురాలికి సంతానం లేదు. ఎస్ఐ నారాయణరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యుల వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ లండన్ పర్యటన
వ్యక్తి దుర్మరణం
కొనసాగిన ఈ – కంటెంట్ జనరేషన్పై శిక్షణ
‘నన్నయ’ వర్సిటీ అభివృద్ధికి ‘న్యూయోమ్’ సహకారం
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
భూతదయకు ప్రా‘ధాన్యం’
రెండు బైక్లు ఢీకొని వ్యక్తి మృతి
అబ్బుర పర్చిన డాగ్ షో
సమ్మర్లో చదివేద్దాం
వాహనం ఢీకొని వ్యక్తి మృతి
తప్పక చదవండి
- అనంతలో ఘోర ప్రమాదం: పెళ్లి షాపింగ్ చేసి తిరిగొస్తుండగా..
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- అలాంటి సీన్స్ నా వల్ల కాదు.. కొందరు దర్శకులు కావాలనే..
- నేడు ఈఏపీ సెట్ ఫలితాలు
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- Delhi liquor scam: నిందితుల జాబితాలో ఆప్, కేజ్రీవాల్
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
- త్వరలో గ్రూప్–4 ఎంపిక జాబితా
- బుల్లితెర నటి కేసులో ట్విస్ట్.. ప్రియుడు సూసైడ్!
Advertisement