-
బీజేపీకి రాజ్పుత్ల హెచ్చరిక
గాంధీనగర్: లోక్సభ ఎన్నికల వేళ ప్రచారంలో దూసుకుపోతున్న బీజేపీకి గుజరాత్ రాజ్కోట్ సెగ్మెంట్లో పురుషోత్తం రూపాలా అభ్యర్థిత్వం తలనొప్పిగా మారింది. రాజ్కోట్లో బీజేపీ అభ్యర్థి పురుషోత్తం రూపాలాను.. అక్కడి నుంచి ఉపసంహరించుకోపోతే రాజ్పుత్ సామాజిక వర్గం సంఘాలు పెద్దఎత్తున నిరసన తెలుపుతామనిహెచ్చరిస్తున్నాయి. గుజరాత్లోని 26 లోక్సభ స్థానాల్లో తమ నిరసనలు తీవ్రతరం చేస్తామంటున్నాయి. ఏప్రిల్ 19 వరకు రాజ్కోట్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ అభ్యర్థి పురుషోత్తం రూపాలాను ఉపసంహరించకోపోతే తమ నిరసన దేశంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని రాజ్పుత్ సంకల్ఫ్ సమితి చైర్మన్ కరన్సిన్హ చద్వా హెచ్చరించారు. ఈ సమతి రాజ్కోట్లో ‘రాజ్పుత్ ఆత్మగౌరవ సభ’ను ఆదివారం నిర్వహించింది. ఏప్రిల్ 16న రూపాల నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంతో ఆయన అభ్యర్థిత్వాన్ని బీజేపీ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఇక.. నామినేషన్కు చివరి తేదీ 19, అదే విధంగా నామినేషన్ల ఉపసంహరణ తేదీ 22 వరకు ఉంది. పటీదార్ సామాజిక వర్గానికి చెందిన రుపాలా మర్చి 22న వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పూర్వపు మహారాజులు.. బ్రిటిష్ వారితో సహా విదేశి పాలకుల అణచివేతకు లొంగిపోయారు. అదీకాక.. వారితో కలిసి భోజనం చేసి మహారాజులు తమ కుమర్తెలను విదేశీయులకు ఇచ్చి వివాహం జరిపించారని వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలపై రాజ్పుత్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు తెలిపారు. రూపాలా అభ్యర్థిత్వాన్ని రాజ్కోట్ పార్లమెంట్ స్థానం నుంచి ఉపసంహరించుకోవాలని బీజేపీని డిమాండ్ చేశారు. అయితే ఇప్పటికే రూపాలా రెండు సార్లు క్షమాపణలు చెప్పినా రాజ్పుత్ వర్గాలు నిరాకరించాయి. ఈ నేపథ్యంలో రూపాలాకు వ్యతిరేకంగా గుజరాత్ మొత్తం పోస్టర్లు వెలిశాయి. గుజరాత్లో మొత్తం 26 స్థానాలక మే 7 పోలింగ్ జరగనుంది. బీజేపీ రూపాలా అభ్యర్థిత్వాన్ని మార్చకపోతే.. వందల సంఖ్యలో నామినేషన్ల దాఖలు చేసి మరీ బీజేపీ అభ్యర్థిని ఓడిస్తామని హెచ్చరించారు. ‘బీజేపీలో విభేదాలు తలెత్తితే... రాత్రికిరాత్తే మంత్రులు, సీఎంను తొలగిస్తారు. కానీ, బీజేపీ నేత రాజ్పుత్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఎందుకు నిశ్శబ్దంగా ఉంటుంది? మేము పెద్ద ఎత్తున పోరాడుతాం. సమస్యలపై మేము ధ్యైరం చూపిస్తాం’ అని రాత్పుత్ల నేత తృప్తి బా తెలిపారు. కాగా.. కొంతమందిస్వార్థ ప్రయోజనాల కోసమే నిరసనలకు ఆజ్యం పోస్తున్నారని బీజేపీ పేర్కొంది. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనీష్ దోషి మాట్లాడుతూ.. ‘మేము చాలా విశ్వాసంతో ఉన్నాం. పాటీదార్, రాజ్పుత్లు అంతా కలిసి రూపాలాను ఓడిస్తారు’అని అన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పరేష్ ధమాని పోటీ చేస్తున్నారు. -
అప్పుడు పుజారాకు ఫోన్ చేశా.. రోహిత్కు థాంక్స్: అశూ భార్య
‘‘రాజ్కోట్ టెస్టు జరుగుతున్న సమయంలో పిల్లలు స్కూలు నుంచి వచ్చిన ఐదు నిమిషాల తర్వాత.. తను 500 వికెట్ల మార్కు అందుకున్నాడు. వెనువెంటనే మమ్మల్ని అభినందిస్తూ ఫోన్ కాల్స్ మొదలయ్యాయి. ఇంతలో మా అత్తయ్య పెద్దగా కేక పెట్టి కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించాం. అశ్విన్కు ఈ విషయం గురించి చెప్పకూడదని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే.. చెన్నై- రాజ్కోట్ మధ్య విమాన రాకపోకలు అంత ఎక్కువగా లేవని తెలుసు. అందుకే నేను ఛతేశ్వర్ పుజారాకు ఫోన్ చేసి అతడి కుటుంబ సభ్యుల సహాయం కోరాను. ఆ తర్వాత అశ్విన్కు ఫోన్ చేశాను. ఎందుకంటే ఆంటీని పరీక్షించిన తర్వాత.. ‘ఇలాంటి పరిస్థితుల్లో కొడుకు దగ్గరగా ఉంటే బాగుంటుంది’ అని డాక్టర్ చెప్పారు. అదే విషయం అశ్విన్తో చెప్పగానే తాను తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. వెంటనే కాల్ కట్ చేశాడు. ఆ తర్వాత 20 -25 నిమిషాలకు గానీ మళ్లీ మాట్లాడలేకపోయాడు. రోహిత్ శర్మ, రాహుల్(ద్రవిడ్) భాయ్, బీసీసీఐలోని ఇతర సభ్యులకు ధన్యవాదాలు. అశ్విన్ చెన్నైకి చేరేంతవరకు క్షేమసమాచారాలు అడుగుతూ మాకు అండగా నిలబడ్డారు. ఆరోజు అశ్విన్ వచ్చేసరికి అర్ధరాత్రి అయింది’’ అని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సతీమణి ప్రీతి నారాయణన్ ఉద్వేగానికి లోనైంది. అశ్విన్ ఐదు వందల టెస్టు వికెట్ల క్లబ్లో చేరాడన్న సంతోష సమయంలోనే అత్తగారు అనారోగ్యం పాలవడం తమను తీవ్ర మనోవేదనకు గురిచేసిందని పేర్కొంది. కష్టకాలంలో ఛతేశ్వర్ పుజారా కుటుంబం, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ తమకు అండగా నిలిచారని ప్రీతి కృతజ్ఞతాభావం చాటుకుంది. కాగా ఇంగ్లండ్తో స్వదేశంలో జరుగుతున్న ఐదు మ్యాచ్ల సిరీస్ సందర్భంగా మూడో టెస్టు మధ్యలోనే అశ్విన్ జట్టును వీడిన విషయం తెలిసిందే. 500 వికెట్ల క్లబ్లో చేరిన తర్వాత తల్లి అనారోగ్యం పాలైన నేపథ్యంలో సెలవు తీసుకుని చెన్నైకి వెళ్లాడు. అయితే, ఆమె ఆరోగ్యం కుదుటపడగానే మళ్లీ జట్టుతో చేరాడు. ఇక ప్రస్తుతం ధర్మశాలలో జరిగే ఐదో టెస్టుతో అశ్విన్ మళ్లీ బిజీ కానున్నాడు. అంతర్జాతీయ కెరీర్లో అశూకు ఇది వందో టెస్టు కావడం విశేషం. ఈ నేపథ్యంలో అశ్విన్ భార్య ప్రీతి.. ఈ సిరీస్ సమయంలో తమ కుటుంబం మానసిక వేదనకు గురైన తీరును వివరిస్తూ ఇండియన్ ఎక్స్ప్రెస్ కాలమ్లో తన మనసులోని భావాలు పంచుకుంది. చదవండి: Rohit Sharma: సాకులు చెప్పి తప్పించుకోవచ్చు.. కానీ ఉదయం 5.30 గంటలకే ఇలా.. -
నేటి గుజరాత్ పర్యటలో ప్రధాని మోదీ షెడ్యూల్ ఇదే..
ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆదివారం) గుజరాత్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రూ.52,250 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 25న ఉదయం 7:45 గంటలకు ప్రధాని ద్వారకా ఆలయాన్ని సందర్శించి పూజలు చేయనున్నారు. అనంతరం సుదర్శన్ వంతెనను సందర్శిస్తారు. ప్రధాని మోదీ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ద్వారకలో రూ.4,150 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. దీని తర్వాత మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రధాని మోదీ రాజ్కోట్కు వెళ్లనున్నారు. సాయంత్రం 4:30 గంటలకు రాజ్కోట్లోని రేస్ కోర్స్ గ్రౌండ్లో రూ. 48,100 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేయనున్నారు. ద్వారకలో జరిగే బహిరంగ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఓఖా ప్రధాన భూభాగంతో బేట్ ద్వారకా ద్వీపాన్ని కలుపుతూ సుమారు రూ. 980 కోట్లతో నిర్మించిన సుదర్శన్ సేతును జాతికి అంకితం చేయనున్నారు. ఇది దాదాపు 2.32 కిలోమీటర్ల పొడవుతో దేశంలోనే అతి పొడవైన కేబుల్ సపోర్ట్ బ్రిడ్జిగా గుర్తింపు పొందింది. వదినార్, రాజ్కోట్-ఓఖా, రాజ్కోట్-జెతల్సర్-సోమ్నాథ్ మరియు జెతల్సర్-వాన్సజలియా రైలు విద్యుదీకరణ ప్రాజెక్టుల వద్ద పైప్లైన్ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. ఫిబ్రవరి 26న దేశంలోని 550 అమృత్ భారత్ స్టేషన్లకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. పశ్చిమ బెంగాల్లోని బండేల్లో రూ.307 కోట్ల అంచనా వ్యయంతో ప్రపంచ స్థాయి స్టేషన్ను నిర్మించనున్నారు.టెలికాన్ఫరెన్సింగ్ ద్వారా బెంగాల్, జార్ఖండ్, బీహార్లోని 28 స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. -
Ind vs Eng: అతడి ఇన్నింగ్స్ అద్భుతం.. సిరీస్ గెలిచి తీరతాం!
India vs England, 3rd Test: ఇంగ్లండ్ ‘బజ్బాల్’ను టీమిండియా చితక్కొట్టింది. ఏకంగా 434 పరుగుల తేడాతో స్టోక్స్ బృందాన్ని ఓడించి రాజ్కోట్లో రాజసం చిందించింది. ఫలితంగా కనీవినీ ఎరుగని రీతిలో ఇంగ్లిష్ జట్టు ఘోర ఓటమిని చవిచూసింది. తద్వారా.. తమ క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా రెండో అతిపెద్ద పరాజయం మూటగట్టుకుంది స్టోక్స్ బృందం. అదే విధంగా ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-1తో వెనుకబడింది. ఈ విషయంపై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందించాడు. అతడి ఇన్నింగ్స్ అద్భుతం మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘బెన్ డకెట్ అద్భుత, అద్వితీయ ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్నింగ్స్ ఆసాంతం ఇలాంటి జోరే కొనసాగించాలని మేము భావించాం. టీమిండియా విధించిన లక్ష్యాన్ని ఛేదించాలనుకున్నాం. భారత రెండో ఇన్నింగ్స్లో మేము ఎక్కువ సేపు బౌలింగ్ చేయాలని భావించాం. కానీ అలా జరుగలేదు. అనుకున్న దాని కంటే ముందుగానే బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. కొన్నిసార్లు ప్రణాళికలను పక్కాగా అమలు చేయడం సాధ్యం కాదు. ఏదేమైనా మా ఆటగాళ్లకు అండగా నిలవడం ముఖ్యం. ప్రస్తుతం మేము 1-2తో వెనుకబడి ఉన్నాం. అయితే, ఈ మ్యాచ్ నుంచి నేర్చుకున్న పాఠాలతో తిరిగి పుంజుకుంటాం. సిరీస్ గెలుస్తాం ఈ ఓటమి నుంచి తేరుకుని తదుపరి రెండు మ్యాచ్లపై దృష్టి సారిస్తాం. కచ్చితంగా సిరీస్ గెలిచేందుకు ప్రయత్నిస్తాం’’ అని బెన్ స్టోక్స్ పేర్కొన్నాడు. కాగా మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ ధనాధన్ సెంచరీ(153)తో అలరించాడు. అయితే, రెండో ఇన్నింగ్స్లో మాత్రం 4 పరుగులకే రనౌట్ అయ్యాడు. ఇక టీమిండియా- ఇంగ్లండ్ మధ్య రాజ్కోట్ టెస్టు నాలుగు రోజుల్లోనే ముగిసిపోగా.. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 23 నుంచి నాలుగో టెస్టు ఆరంభం కానుంది. పరుగుల పరంగా ఇంగ్లండ్కు అతిపెద్ద టెస్టు ఓటములు ►562- వర్సెస్ ఆసీస్- ది ఓవల్ 1934 ►434- వర్సెస్ భారత్- రాజ్ కోట్- 2024 ►425- వర్సెస్ వెస్టిండీస్- మాంచెస్టర్ 1976 ►409- వర్సెస్ ఆసీస్- లార్డ్స్ 1948 ►405- వర్సెస్ ఆసీస్- లార్డ్స్ 2015 చదవండి: IND vs ENG: ఇంగ్లండ్తో నాలుగో టెస్టు.. టీమిండియాలో ఊహించని మార్పు! స్టార్ ప్లేయర్ దూరం -
రెప్పపాటులో జరిగిన అద్భుతం.. జురెల్ స్కిల్ చూడాల్సిందే!
India Wicket-Keeper Dhruv Jurel Inflicts Stunning Run-Out: ఇంగ్లండ్తో తొలి టెస్టులో ఓటమి గాయాలను చెరిపేసేలా టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. హైదరాబాద్లో ఎదురైన పరాభవానికి విశాఖపట్నంలో బదులు తీర్చుకున్న రోహిత్ సేన.. రాజ్కోట్లో చారిత్రాత్మక గెలుపుతో అభిమానులను ఖుషీ చేసింది. ఇంగ్లండ్ను ఏకంగా 434 పరుగుల తేడాతో చిత్తు చేసి భారత టెస్టు చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ(214)కు తోడు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా(5 వికెట్లు) బంతితో మాయాజాలం చేయడంతో ఈ గెలుపు సాధ్యమైంది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో మూడో టెస్టు సందర్భంగా భారత్ తరఫున ఇద్దరు యువ ఆటగాళ్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ వరుస అర్ధ శతకాలతో(62, 68) సత్తా చాటితే.. ఉత్తరప్రదేశ్ క్రికెటర్ ధ్రువ్ జురెల్ బ్యాటింగ్(తొలి ఇన్నింగ్స్లో- 46), వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో ప్రమాదకర బ్యాటర్, ఓపెనర్ బెన్ డకెట్(4)ను రనౌట్ చేసిన తీరు హైలైట్గా నిలిచింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ను గట్టెక్కించాలని కంకణం కట్టుకున్న డకెట్.. భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా (6.1వ ఓవర్లో) బౌలింగ్లో మిడ్ వికెట్ మీదుగా బంతిని తరలించగా.. మహ్మద్ సిరాజ్ బాల్ను ఆపాడు. Super Jurel 🦸♂️ with some 🔝glove-work 🔥👌#IDFCFirstBankTestSeries #INDvENG #BazBowled #JioCinemaSports pic.twitter.com/dTlzQZXKAn — JioCinema (@JioCinema) February 18, 2024 ఈ క్రమంలో మరో ఎండ్లో ఉన్న జాక్ క్రాలే పరుగుకు నిరాకరించగా.. డకెట్ వెంటనే వెనక్కి వెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ అంతలోనే సిరాజ్ వేసిన బంతిని అందుకున్న వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ మెరుపు వేగంతో స్టంప్ను ఎగురగొట్టాడు. రెప్పపాటులో జరిగిన ఈ అద్భుతం కారణంగా డకెట్ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. జురెల్ స్కిల్స్కు అద్దం పట్టే వీడియోను అభిమానులు నెట్టింట షేర్ చేస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. డకెట్ తొలి ఇన్నింగ్స్లో విధ్వంసకర శతకం(153)తో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. చదవండి: సర్ఫరాజ్ ఒక్కడేనా.. ఈ ‘వజ్రాన్ని’ చూడండి! (ఫొటో గ్యాలరీ కోసం క్లిక్ చేయండి) -
అయ్యో బెయిర్ స్టో.. ! టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు
టీమిండియాతో టెస్టు సిరీస్లో ఇంగ్లండ్ స్టార్ జానీ బెయిర్ స్టో పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. తొలి రెండు టెస్టుల్లో దారుణంగా విఫలమైన బెయిర్ స్టో.. తాజాగా రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో సైతం అదే తీరును కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్లో బెయిర్ స్టో ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో జానీ వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో బెయిర్ స్టో డకౌట్గా వెనుదిరిగాడు. తద్వారా అత్యంత చెత్త రికార్డును బెయిర్ స్టో తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్లో భారత్పై అత్యధిక సార్లు డకౌటైన ఆటగాడిగా బెయిర్ స్టో నిలిచాడు. ఈ ఇంగ్లీష్ బ్యాటర్ ఇప్పటివరకు టెస్టుల్లో భారత్పై 8 సార్లు డకౌటయ్యాడు. కాగా అంతకుముందు ఈ చెత్త రికార్డు పాకిస్తాన్ మాజీ ఆటగాడు డనేష్ కనేరియా పేరిట ఉండేది. కనేరియా 7 సార్లు భారత్పై డకౌటయ్యాడు. ఇక తాజా మ్యాచ్తో కనేరియాను బెయిర్ స్టో అధిగమించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 319 పరుగులకు ఆలౌటైంది. 207/2 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. అదనంగా 112 పరుగులు చేసి తమ ఇన్నింగ్స్ను ముగించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ డకెట్(153) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. భారత బౌలర్లలో సిరాజ్తో పాటు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లు పడగొట్టారు. కాగా తొలి ఇన్నింగ్స్లో టీమిండియాకు 126 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో భారత్ వికెట్ నష్టానికి 30 ఓవర్లలో 116 పరుగులు చేసింది. Jonny Bairstow has a habit of getting out early vs India in Tests ☹️#INDvENG pic.twitter.com/G0QkGteI5q — ESPNcricinfo (@ESPNcricinfo) February 17, 2024 -
రాజ్కోట్ టెస్ట్: టీమిండియాకు షాక్.. అశ్విన్ ఔట్
ఢిల్లీ: టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. ఇంగ్లండ్తో రాజ్కోట్లో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ నుంచి భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ వైదొలిగాడు. వ్యక్తిగత కారణాలతో అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ‘ఎక్స్’ ద్వారా వెల్లడించింది. అతని తల్లికి ఆరోగ్యం బాగోలోద ఇటువంటి పరిస్థితుల్లో అతడికి జట్టుతో పాటు బోర్డు అండగా నిలుస్తుందని తెలిపింది. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతుండడంతోనే అశ్విన్ మ్యాచ్ నుంచి దూరమైనట్లు తెలుస్తోంది. ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం, శ్రేయస్సు తమకు ఎంతో ముఖ్యమని తెలిపింది. ఈ కష్టకాలంలో అశ్విన్కు అవసరమైన సహాయాన్ని బోర్డు, టీమ్ఇండియా జట్టు అందిస్తుందని పేర్కొంది. R Ashwin withdraws from the 3rd India-England Test due to family emergency. In these challenging times, the Board of Control for Cricket in India (BCCI) and the team fully supports Ashwin.https://t.co/U2E19OfkGR — BCCI (@BCCI) February 16, 2024 ఈ మేరకు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఎక్స్(ట్విటర్) వేదికగా ఒక పోస్టు చేశారు. ఈ పరిస్థితుల్లో తన తల్లికి దగ్గర ఉండడం కోసం అశ్విన్ రాజ్కోట్ నుంచి చెన్నై వెళ్లినట్లు పేర్కొన్నారు. ఆమె తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్లో 445 పరుగులకు ఆలౌట్ అయింది. రెండోరోజు బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. మ్యాచ్లో అశ్విన్ శుక్రవారం ఒక వికెట్ తీసి 500 వికెట్ల క్లబ్లో చేరిన విషయం తెలిసిందే. భారత్ టెస్టు క్రికెట్లో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్గా ఘనతకెక్కాడు. మూడో టెస్టులో అశ్విన్ 37 పరుగులు చేసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇటువంటి తరుణంలో జట్టుకు అశ్విన్ దూరం కావడం పెద్దదెబ్బే. -
Ind vs Eng: సర్ఫరాజ్ ఖాన్ అరుదైన రికార్డు.. గిల్ను దాటేసి!
India vs England, 3rd Test: రాజ్కోట్ టెస్టు సందర్భంగా టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ చరిత్ర సృష్టించాడు. క్రికెట్ పుటల్లో అరుదైన జాబితాలో తన పేరును నమోదు చేసుకున్నాడు. కాగా ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా టీమిండియా- ఇంగ్లండ్ తొలి రెండో మ్యాచ్లలో చెరొకటి గెలిచి ప్రస్తుతం 1-1తో సమంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య గురువారం(ఫిబ్రవరి 15) మూడో టెస్టు మొదలైంది. ఇక ఈ మ్యాచ్ ద్వారా ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఎట్టకేలకు టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. రంజీల్లో పరుగుల వరద పారించి తొలి టెస్టు తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్ ఇంకా కోలుకోకపోవడంతో సర్ఫరాజ్కు తుదిజట్టులో చోటు దక్కింది. తద్వారా.. రంజీల్లో పరుగుల వరద పారించిన ఈ 26 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాటర్ టెస్టు క్యాప్ అందుకున్నాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టేనాటికి సర్ఫరాజ్ ఖాన్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో సగటు 69.85తో 3,912 పరుగులు రాబట్టాడు. సెంచరీల వీరుడు తద్వారా టీమిండియా తరఫున అరంగేట్రం చేసే నాటికి ఫస్ట్క్లాస్ క్రికెట్లో అత్యధిక సగటు కలిగి ఉన్న బ్యాటర్లలో ఆరో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో స్టార్ బ్యాటర్ శుబ్మన్ గిల్ను అధిగమించి.. క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. కాగా ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇప్పటి వరకు 45 మ్యాచ్లు ఆడిన సర్ఫరాజ్ ఖాన్ ఖాతాలో 14 సెంచరీలు, 11 అర్ధ శతకాలు ఉన్నాయి. భారత్ తరఫున అరంగేట్రం నాటికి ఫస్ట్క్లాస్ క్రికెట్లో అత్యధిక బ్యాటింగ్ సగటు కలిగి ఉన్న బ్యాటర్లు 88.37 - వినోద్ కాంబ్లీ (27 మ్యాచ్లు) 81.23 - ప్రవీణ్ ఆమ్రే (23) 80.21 - యశస్వి జైస్వాల్ (15) 71.28 - రుషి మోదీ (38) 70.18 - సచిన్ టెండుల్కర్ (9) 69.85 - సర్ఫరాజ్ ఖాన్ (45) 68.78 - శుబ్మన్ గిల్ (23) . చదవండి: Rohit Sharma: అతి వద్దు రోహిత్! From The Huddle! 🔊 A Test cap is special! 🫡 Words of wisdom from Anil Kumble & Dinesh Karthik that Sarfaraz Khan & Dhruv Jurel will remember for a long time 🗣️ 🗣️ You Can Not Miss This! Follow the match ▶️ https://t.co/FM0hVG5X8M#TeamIndia | #INDvENG | @dhruvjurel21 |… pic.twitter.com/mVptzhW1v7 — BCCI (@BCCI) February 15, 2024 -
#Sarfaraz Khan: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. తండ్రి, భార్య కన్నీటి పర్యంతం
Ind vs Eng 3rd Test- Sarfaraz Khan Debut- Beautiful moment: టీమిండియా తరఫున అరంగేట్రం చేయాలన్న యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. ఎన్నో ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాలని ఆశగా ఎదురుచూస్తున్న అతడి నిరీక్షణకు గురువారం(ఫిబ్రవరి 15) తెరపడింది. ఇంగ్లండ్తో మూడో టెస్టు సందర్భంగా సర్ఫరాజ్ ఖాన్ భారత తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే చేతుల మీదుగా ఈ ముంబై బ్యాటర్ టీమిండియా క్యాప్ అందుకున్నాడు. ఆ సమయంలో తండ్రి నౌషధ్ ఖాన్, సర్ఫరాజ్ భార్య రొమానా జహూర్ అతడి పక్కనే ఉన్నారు. ఈ క్రమంలో తన క్యాప్ను తండ్రికి చూపించగా.. అతడు దానిని ఆప్యాయంగా ముద్దాడి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన కొడుకు ఈ స్థాయికి చేరడం వెనుక కష్టాలను గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. వెంటనే సర్ఫరాజ్ వెళ్లి తండ్రిని ఆలింగనం చేసుకుని పరస్పరం అభినందనలు తెలుపుకొన్నారు. ఇక రొమానా సైతం కంటతడి పెట్టగా.. సర్ఫరాజ్ ఆమె కన్నీళ్లు తుడిచాడు. ఈ భావోద్వేగపూరిత సన్నివేశాలకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అన్నాదమ్ముళిద్దరూ క్రికెటర్లే మహారాష్ట్రలో 1997లో జన్మించిన సర్ఫరాజ్ ఖాన్ క్రికెటర్గా ఎదగడంలో అతడి తండ్రి నౌషద్ ఖాన్ది కీలక పాత్ర. సర్ఫరాజ్తో పాటు అతడి తమ్ముడు ముషీర్ ఖాన్ కూడా క్రికెటరే. ఇటీవలే అతడు అండర్-19 వరల్డ్కప్లో ఆడాడు. యువ భారత్ ఫైనల్ చేరుకోవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. అందుకే ఆలస్యం! ఇక సర్ఫరాజ్ ఖాన్ దేశవాళీ క్రికెట్లో ముఖ్యంగా రంజీల్లో అద్భుతంగా రాణించినప్పటికీ టీమిండియా ఎంట్రీ ఆలస్యమైంది. అతడి దూకుడు, ఆటిట్యూడ్ కారణంగానే టీమిండియా సెలక్టర్లు సర్ఫరాజ్ ఖాన్ను పక్కనపెట్టారనే వార్తలు వినిపించాయి. అయితే, అభిమానులు మాత్రం ప్రతిభావంతుడైన ఆటగాడికి అన్యాయం జరుగుతోందంటూ అనేక సందర్భాల్లో బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఇంగ్లండ్తో సిరీస్లో కేఎల్ రాహుల్ మూడో టెస్టుకు అందుబాటులో లేకుండా పోవడంతో సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రానికి మార్గం సుగమమైంది. రాజ్కోట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ ద్వారా ఉత్తరప్రదేశ్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ కూడా టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. చదవండి: Dhruv Jurel: తండ్రి కార్గిల్ యుద్ధంలో.. తల్లి బంగారు గొలుసు అమ్మి మరీ! From The Huddle! 🔊 A Test cap is special! 🫡 Words of wisdom from Anil Kumble & Dinesh Karthik that Sarfaraz Khan & Dhruv Jurel will remember for a long time 🗣️ 🗣️ You Can Not Miss This! Follow the match ▶️ https://t.co/FM0hVG5X8M#TeamIndia | #INDvENG | @dhruvjurel21 |… pic.twitter.com/mVptzhW1v7 — BCCI (@BCCI) February 15, 2024 -
Ind vs Eng: టీమిండియా బ్యాటింగ్.. ఇద్దరు ప్లేయర్ల అరంగ్రేటం
India vs England, 3rd Test: రాజ్కోట్ వేదికగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక, ఈ టెస్టులో టీమిండియా తరఫున సర్ఫరాజ్ ఖాన్, వికెట్ కీపర్ ధృవ్ జూరెల్కు అవకాశం కల్పించడంతో వీరిద్దరూ భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరగ్రేటం చేశారు. ఇక ఇంగ్లండ్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ స్థానంలో వెటరన్ పేసర్ మార్క్ వుడ్ తుదిజట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఇద్దరు పేసర్లు జేమ్స్ ఆండర్సన్, మార్క్ వుడ్లను ఆడించనుంది. కాగా ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లండ్ హైదరాబాద్ టెస్టులో.. టీమిండియా విశాఖపట్నం టెస్టులో గెలిచాయి. ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. తుది జట్ల వివరాలు.. టీమిండియా: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పాటీదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్ -
IND VS ENG 3rd Test: ఆ ముగ్గురు సహా మరో ఇద్దరికి చాలా ప్రత్యేకం..!
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రాజ్కోట్ వేదికగా రేపటి నుంచి ప్రారంభంకాబోయే మూడో టెస్ట్ మ్యాచ్ ముగ్గురు ఆటగాళ్లకు చాలా ప్రత్యేకంగా మారింది. రేపటి మ్యాచ్లో భారత వెటరన్ రవిచంద్రన్ అశ్విన్ మరో వికెట్ తీస్తే టెస్ట్ల్లో 500 వికెట్ల అరుదైన మైలురాయిని చేరుకోనుండగా.. ఇదే మ్యాచ్లో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జిమ్మీ ఆండర్సన్ మరో ఐదు వికెట్లు తీస్తే టెస్ట్ల్లో 700 వికెట్ల అత్యంత అరుదైన మైలురాయిని చేరుకుంటాడు. రేపటి మ్యాచ్ ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్కు 100వ టెస్ట్ కావడంతో ఈ మ్యాచ్ అతనికి చిరకాలం గుర్తిండిపోతుంది. ఈ మూడు ప్రత్యేకతలే కాకుండా రేపటి మ్యాచ్ ఇద్దరు టీమిండియా ఆటగాళ్లకు చిరస్మరణీయంగా మారే అవకాశం ఉంది. రాజ్కోట్ టెస్ట్తో యువ ఆటగాళ్లు సర్ఫరాజ్ అహ్మద్, దృవ్ జురెల్ టెస్ట్ అరంగేట్రం చేయడం దాదాపుగా ఖరారైపోయింది. ఆఖరి నిమిషంలో ఏదైనా జరిగితే తప్ప ఈ ఇద్దరి టెస్ట్ అరంగేట్రాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇలా రేపటి నుంచి ప్రారంభంకాబోయే రాజ్కోట్ టెస్ట్ మ్యాచ్ ఐదుగురు ఆటగాళ్లకు చాలా ప్రత్యేకంగా మారనుంది. ఇదిలా ఉంటే, భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇరు జట్లు చెరో మ్యాచ్లో గెలిచిన విషయం తెలిసిందే. హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ గెలువగా.. విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్ట్లో టీమిండియా విజయం సాధించింది. ఈ సిరీస్లో ఇరు జట్లు సమంగా ఉండటంతో రాజ్కోట్ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్లో గెలిచి ఆధిక్యతను పెంచుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. టీమిండియాను సీనియర్ల గైర్హాజరీ సమస్య కలవరపెడుతున్నప్పటికీ యువ ఆటగాళ్లు ఉత్సాహంగా కనిపిస్తూ గెలుపుపై ఆశలు సజీవంగా ఉంచారు. మరోపక్క ఇంగ్లండ్ టీమ్.. భారత్ను దెబ్బకొట్టేందుకు ఇదే సరైన సమయమని భావిస్తూ ప్రణాళికలు రచిస్తుంది. మరి రేపటి నుంచి ప్రారంభంకాబోయే మ్యాచ్లో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో వేచి చూడాలి. -
రాహుల్ అవుట్
రాజ్కోట్: భారత సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మూడో టెస్టుకూ దూరమయ్యాడు. గాయంతో అతన్ని రెండో టెస్టు నుంచి తప్పించి... ఇటీవలే మూడో టెస్టుకు ఎంపిక చేశారు. ఫిట్నెస్ సంతరించుకుంటేనే తుది జట్టుకు ఆడతాడని సెలక్షన్ సమయంలోనే స్పష్టం చేశారు. తాజాగా అతను పూర్తిగా కోలుకునేందుకు మరికొంత సమయం పట్టనుండటంతో మూడో టెస్టు నుంచి తప్పించారు. అతని స్థానంలో కర్ణాటక ఎడంచేతి వాటం బ్యాటర్ దేవదత్ పడిక్కల్ను ఎంపిక చేశారు. ‘రాహుల్ వందశాతం ఫిట్నెస్తో ఉంటేనే తుది జట్టుకు పరిగణిస్తామని ఇదివరకే చెప్పాం. అతను 90 శాతం కోలుకున్నట్లు తెలియడంతో రాజ్కోట్ టెస్టుకూ పక్కన బెట్టాం. అతని పరిస్థితిని బోర్డు మెడికల్ టీమ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది’ అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పునరావాస శిబిరంలో ఉన్న రాహుల్ నాలుగో టెస్టుకల్లా కోలుకుంటాడని ఆశాభావంతో ఉన్నట్లు ఆయన చెప్పారు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్టు 15 నుంచి రాజ్కోట్లో జరుగుతుంది. రాజ్కోట్కు ఇంగ్లండ్ స్వల్ప విరామం కోసం అబుదాబి వెళ్లిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టు సోమవారం తిరిగి భారత్ చేరుకుంది. వారంపాటు అక్కడ సేదతీరిన పర్యాటక జట్టు మూడో టెస్టు కోసం రాజ్కోట్ వేదికకు వచి్చంది. మంగళవారం సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎస్సీఏ) గ్రౌండ్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్ చేస్తారని స్థానిక వర్గాలు తెలిపాయి. స్పిన్నర్ జాక్ లీచ్ మోకాలి గాయంతో మిగతా టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. అతను అబుదాబి నుంచే స్వదేశానికి పయనమయ్యాడు. స్పిన్ త్రయం హార్ట్లీ, రేహాన్ అహ్మద్, బషీర్లతో పాటు పార్ట్టైమ్ స్పిన్ పాత్ర పోషించే జో రూట్ అందుబాటులో ఉండటంతో లీచ్ స్థానంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఇంకెవరినీ ఎంపిక చేయలేదు. నిజానికి అతను తొలిటెస్టు మాత్రమే ఆడాడు. లీచ్ రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 2 వికెట్లే తీశాడు. తర్వాతి రెండో టెస్టుకు దూరమయ్యాడు. -
Ind Vs Eng: టీమిండియా రాజభోగాలు.. రోహిత్ కోసం ప్రత్యేకంగా!
టీమిండియా- ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు గుజరాత్లో జరుగనుంది. రాజ్కోట్లోని సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియం ఇందుకు వేదిక. ఇక ఇప్పటికే ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇరు జట్లు చెరొకటి గెలిచి 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 15 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య మొదలుకానున్న మూడో టెస్టు ఇరుజట్లకు ప్రతిష్టాత్మకంగా మారింది. సిరీస్లో మరో ముందడుగు వేయాలంటే ఈ మ్యాచ్లో తప్పక గెలవాలని రోహిత్ సేన- స్టోక్స్ బృందం పట్టుదలగా ఉన్నాయి. మెనూలోని వంటకాలు ఇవే ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు ఆటగాళ్లు రాజ్కోట్కు చేరుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో క్రికెటర్లు బసచేసే సయాజీ హోటల్లో.. వారి కోసం ప్రత్యేకంగా తయారు చేయిస్తున్న వంటకాలకు సంబంధించిన వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆజ్తక్ కథనం ప్రకారం.. క్రికెటర్ల మెనూలో సంప్రదాయ వంటకాలు ఫఫ్దా- జిలేబి, ఖాఖ్రా, గతియా, తెప్లా, ఖమన్(బ్రేక్ఫాస్ట్)లతో పాటు కతియావాడి భోజనంలో భాగంగా.. దహీ తికరి, వఘేరెలా రోట్లో(పెరుగు, వెల్లుల్లి కలిపి బజ్రా రోటీని ఫ్రై చేస్తారు) వంటివి చేర్చారు. రాజభోగాలు ఇక డిన్నర్ కోసం కిచిడి కఢీ ప్రత్యేకంగా తయరు చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. సయాజీ హోటల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ బస కోసం ప్రత్యేకంగా రాయల్ సూట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. కాగా ఇంగ్లండ్తో మిగిలిన మూడు టెస్టులకు బీసీసీఐ ఇటీవలే జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లి సెలక్షన్కు అందుబాటులో ఉండకపోవడంతో అతడిని పక్కనపెట్టిన సెలక్టర్లు.. బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్నకు తొలిసారి పిలుపునిచ్చారు. అతడిపై వేటు.. అదే విధంగా.. ఫిట్నెస్ సమస్యల కారణంగా శ్రేయస్ అయ్యర్ను తప్పించిన మేనేజ్మెంట్.. తొలి టెస్టు తర్వాత గాయపడిన ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, బ్యాటర్ కేఎల్ రాహుల్ కోలుకుంటున్నట్లు తెలిపింది. వారిద్దరిని మూడో టెస్టుకు ఎంపిక చేసినా.. మ్యాచ్ ఫిట్నెస్ నిరూపించుకున్న తర్వాతే తుదిజట్టులో చోటు దక్కించుకుంటారని తెలిపింది. వాళ్లిద్దరికి సన్మానం ఇదిలా ఉంటే.. రవీంద్ర జడేజా, ఛతేశ్వర్ పుజారాలకు సౌరాష్ట్ర క్రికెట్ గ్రౌండ్ సొంతమైదానం. ఈ నేపథ్యంలో మూడో టెస్టు ఆరంభానికి ముందే ఈ ఇద్దరు టీమిండియా స్టార్లను సన్మానించాలని స్థానిక క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది. చదవండి: Ravindra Jadeja: మా కోడలి వల్లే ఇదంతా... మండిపడ్డ రివాబా! -
టెక్నాలజీతో న్యాయం మరింత చేరువ: సీజేఐ
రాజ్కోట్: ఆధునిక సాంకేతికత సాయంతో న్యాయాన్ని అందరికీ ప్రజాస్వామ్యయుతంగా చేరువ చేసేందుకు కృషి చేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వెల్లడించారు. శనివారం గుజరాత్లోని రాజ్కోట్లో నూతన జిల్లా కోర్టు భవనాన్ని ఆయన ప్రారంభించారు. కృత్రిమ మేధతో పని చేసే టెక్స్ట్ టు స్పీచ్ ‘కాల్–ఔట్’ సిస్టమ్ను, ఈ–ఫైలింగ్ 3.0 ప్లాట్ఫామ్ను ఆవిష్కరించారు. జిల్లా కోర్టుల ఆవశ్యకతను ఈ సందర్భంగా నొక్కిచెప్పారు. న్యాయం కోసం ముందుగా అక్కడికే వస్తారని గుర్తు చేశారు. పౌరుల హక్కుల సాధనకు జిల్లా కోర్టులే పునాదిరాళ్లన్నారు. ‘‘ద్వారకలోని సోమ్నాథ్ ఆలయం, పూరీలోని జగన్నాథాలయంపై ఉండే ధ్వజం న్యాయవాదులు, న్యాయమూర్తులు, పౌరులందరినీ కలిపి ఉంచే మానవత్వానికి ప్రతీక. అలాంటి మానవత్వానికి రాజ్యాంగమే రక్ష’’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. -
గుజరాత్ లో భారీ అగ్ని ప్రమాదం..
గుజరాత్ : రాజ్ కోట్ లోని ఫర్నీచర్ గొడౌన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు ఇచ్చిన సమాచారమందగానే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసింది. రాజ్ కోట్ లోని ఆనంద్ బంగ్లా చౌక్ సమీపంలో ఉన్న ఒక ఫర్నీచర్ గొడౌన్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఉన్నట్టుండి అగ్నికీలలు ఎగిసిపడటంతో ఒక్కసారిగా దట్టమైన పొగ మేఘాల్లా ఆకాశంలో అలుముకున్నాయి. స్థానికులు భయాందోళనలకు గురై అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు. వెంటనే అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకోగా సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు చుట్టుపక్కల ఇళ్లకు వ్యాపించకుండా అదుపు చేసింది అగ్నిమాపక సిబ్బంది. ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు గాని ఆస్తినష్టం ఎంత వరకు జరిగి ఉండవచ్చన్న వివరాలు తెలియాల్సి ఉంది. Fire breaks out at furniture godown near Anand Bangla Chowk in Rajkot. Fire tenders are at the spot. More details are awaited. pic.twitter.com/d9aA1x7sgF — Press Trust of India (@PTI_News) June 22, 2023 ఇది కూడా చదవండి: అజిత్ పవార్ ఏది కోరితే అదిస్తాం.. -
రంగస్థలం ఏడు ప్రపంచాలు
అక్షరాల్లోని రచనలను రంగస్థలం మీదికి తీసుకురావడం తేలిక కాదు. ఎందుకంటే, రచన చదివేటప్పుడు పాఠకుల మదిలో ఎన్నో రంగస్థలాలు ఆవిష్కారం అవుతాయి. తమ ఊహలకు, రంగస్థలానికి చెలిమి ఏర్పడాలి. ఈ విషయంలో నాటక సమాజం ‘థియేటర్ నిషా’ విజయం సాధించింది. స్త్రీ సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఎన్నో రచనలు చేసింది ప్రసిద్ధ హిందీ రచయిత్రి గౌర్ పంత్ (శివానీ) ఇది ఆమె శతజయంతి సంవత్సరం. దీన్ని దృష్టిలో పెట్టుకొని పంత్ కథలను నాటకంగా మలిచి ప్రదర్శిస్తోంది థియేటర్ నిషా... గుజరాత్లోని రాజ్కోట్లో జన్మించింది గౌర్ పంత్. పన్నెండు సంవత్సరాల వయసులో పంత్ తొలి కథ ఒక పిల్లల పత్రికలో ప్రచురిత మైంది. టాగూర్ ‘శాంతినికేతన్’లో చదువుకోవడం తనలోని సృజనను మెరుగుపెట్టుకోవడానికి కారణం అయింది. శివానీ కలం పేరుతో రాసిన ‘మై ముర్గా హూ’ కథకు ఎంతో పేరు వచ్చింది. ‘లాల్ హవేలి’ పేరుతో తొలి నవల రాసింది. ఆ తరువాత ఎన్నో కథలు, నవలలు రాసింది. అయితే ఆమె ఏది రాసినా స్త్రీ జీవితమే కేంద్రంగా ఉండేది. ఆ స్త్రీ తన కాల్పనిక ఊహాలోకం నుంచి దిగివచ్చిన స్త్రీ కాదు. తనకు పరిచయం ఉన్న స్త్రీలు, తాను చూసిన స్త్రీలు... ఇలా ఎందరో జీవితాల నుంచి ఎన్నో అద్భుతమైన పాత్రలు సృష్టించింది శివానీ. భర్త నుంచి హింసకు గురైన స్త్రీలు, అత్యాచార బాధితులు, కుటుంబ హింస బాధితులు, మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నవారు... ఎంతోమంది బాధితులు ఆమె రచనల్లో కనిపిస్తారు. శివానీ కూతురు ఐరా పాండే తల్లి రాసిన కొన్ని కథలను ‘అపరాధి: ఉమెన్ వితౌట్ మెన్’ పేరుతో ఇంగ్లీష్లోకి తీసుకువచ్చింది. దీనికి రెండవ భాగం కూడా వచ్చింది. ‘అపరాధి’ రెండవ భాగంలోని కథలను థియేటర్ నిషా ‘బిన్ను’ పేరుతో నాటకీకరించింది. ఇందులో బిన్ను, నసీమ్, మిసెస్ ఘోష్, లలిత, పాగలియా, మధుబెన్తో పాటు ఒక తల్లి పాత్ర కూడా ఉంటుంది. ఏడుగురి జీవితాలు ఏడు ప్రపంచాలై కనిపిస్తాయి. బిన్ను నుంచి నసీమ్ వరకు ఎవరూ ఊహాల్లో పుట్టిన పాత్రలు కాదు. నిజజీవితంలోని మహిళలు. వారి జీవితాలను శివానీ దగ్గరి నుంచి చూసింది. ఒక్కో పాత్రకు ఒక్కో ప్రత్యేకత, శైలి, పోరాటరూపం ఉంటాయి. ‘ఏడు పాత్రలను కలిపి నాటకానికి బిన్ను అని ఎందుకు పేరు పెట్టారు?’ అని అడిగితే ప్లే డైరెక్టర్ బాలక్రిష్ణన్ ఇచ్చిన సమాధానం ఇది... ‘శివానీ రచనల్లో నాకు బాగా నచ్చిన పాత్ర బిన్ను. అందుకే ఆ పేరు పెట్టాను. బిన్ను ఎక్కడా, ఎవరికీ తలవంచదు. పురుషులను సవాలు చేస్తుంది. అడ్డంకుల ముళ్లచెట్లను నరికేస్తూ ముందుకు వెళుతుంది. ఆమె స్వరంలో ధిక్కారం, వ్యక్తిత్వంలో ఆత్మగౌరవం కనిపిస్తాయి’ కేరళ నాటకోత్సవాలలో భాగంగా థియేటర్ నిషా ప్రదర్శించిన ‘బిన్ను’ నాటకానికి అద్భుతమైన స్పందన లభించింది. ప్రేక్షకుల్లో శివానీ రచనలతో ఎప్పటి నుంచో పరిచయం ఉన్నవారితోపాటు ఎంతమాత్రం పరిచయం లేని వారు కూడా ఉన్నారు. అయితే అందరికీ నాటకం నచ్చింది. ‘శివానీ రచనల గురించి తెలియని ఈ తరానికి బిన్ను నాటకం చూస్తే రచయిత్రి దృక్పథం ఏమిటో అర్థమవుతుంది. శతజయంతి సంవత్సరంలో శివానీకి ఒక ఘనమైన నివాళిగా ఈ నాటకాన్ని చెప్పుకోవచ్చు’ అంటుంది సీమా అనే ప్రేక్షకురాలు. ‘బిన్ను’ నాటకంలో... -
గాడిదలకు సీమంతం
-
గాడిదలకు సీమంతం.. ఆశ్చర్యంగా ఉందే..! వీడియో వైరల్
గుజరాత్: గాడిదలకు సీమంతం ఏంటి.. ఆశ్చర్యంగా ఉందే అనుకుంటున్నారా?. ప్రత్యేక జాతి అయిన హలరీ గాడిదలు అంతరించిపోయే ప్రమాద జాబితాలో ఉండటంతో వాటికి కాపాడుకునేందుకు గుజరాత్లోని రాజ్కోట్ ప్రజలు వినూత్నంగా ఆలోచించారు. అప్పుడే పుట్టిన గాడిద పిల్లలకు బారసాల నిర్వహించడంతో పాటు, గర్భం దాల్చిన వాటికి సీమంతం చేస్తున్నారు. ఉన్న వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ, వీటి సంఖ్యను పెంచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. గుజరాత్లో ఈ జాతికి చెందిన గాడిదలు కేవలం 450 మాత్రమే మిగిలి ఉన్నాయి. వీటి పాలకు ఎక్కువ డిమాండ్ ఉండటంతో అంతరించిపోతున్న ఈ జాతి గాడిదల ధరలు ఒక్కొక్కటి సుమారు లక్ష రూపాయలకు పైగా ఉంది. ఈవీ అంతరించిపోకుండా ఉండేందుకు ఆ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. ఈ జాతిని రక్షించడానికి, ప్రోత్సహించడానికి సింబయాసిస్ సంస్థ కూడా చర్యలు తీసుకుంటుంది. ఇటీవల రాజ్కోట్ జిల్లా ఉప్లేటా తాలూకాలోని కోల్కి గ్రామంలో హలరీ జాతి గాడిద ఈనడంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. గర్భం దాల్చిన మరో 33 గాడిదలకు సీమంతం కూడా చేశారు. నుదుటిన తిలకం దిద్ది, వస్త్రాలు కప్పారు. మహిళలు పూజలు చేసి, ఆహారం పెట్టారు. హలారి గదర్భ సంవర్ధన్ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు. ఆడ గాడిదలకు తిలకం, కుంకుమ, బియ్యం, గులాబీ చున్నీ (దుపట్టా), పూల దండలు సమర్పించడం ఆచారంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా కూడా వచ్చారు. చదవండి: ప్రభుత్వ ఉద్యోగితో బీజేపీ నేత డిష్యూం డిష్యూం.. వీడియో వైరల్.. -
Heeraben Modi: చెక్ డ్యామ్కు మోదీ తల్లి పేరు
అహ్మదాబాద్: దేశ ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమెకు నివాళిగా గుజరాత్లోని ఓ చెక్ డ్యామ్కు ఆమె పేరు పెట్టనున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. దాదాపు రూ. 15 లక్షలతో రాజ్కోట్-కలావడ్ రోడ్డులోని వాగుదాడ్ గ్రామ సమీపంలో న్యారీ నది వద్ద ఈ డ్యామ్ను నిర్మిస్తున్నారు. గిర్ గంగా పరివార్ ట్రస్ట్.. ఈ డ్యామ్ నిర్మాణ బాధ్యతలను చూసుకుంటోంది. బుధవారం స్థానిక ఎమ్మెల్యే దర్షితా షా, రాజ్కోట్ మేయర్ ప్రదీప్ దావ్ సమక్షంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని మోదీ తల్లికి నివాళిగా ఈ చెక్ డ్యామ్కు హీరాబా స్మృతి సరోవర్ అని నామకరణం చేయనున్నట్లు శుక్రవారం ప్రకటించారు గిర్ గంగా పరివార్ ట్రస్ట్ వాళ్లు. తద్వారా అయినవాళ్లు దూరమైనప్పుడు ఓ మంచి పని చేయాలనే ఆలోచన మరికొందరిలో కలుగుతుందని ఆశిస్తున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు ప్రకటించారు. గిర్ గంగా పరివార్ ట్రస్ట్.. పూర్తిగా విరాళాల సేకరణతోనే గత నాలుగు నెలల్లో 75 చెక్ డ్యామ్లు కట్టించింది. ప్రస్తుత డ్యామ్ నాలుగు వందల ఫీట్ల పొడవు, 150 ఫీట్ల వెడల్పు ఉంటుందని, ఒక్కసారి డ్యామ్ నిండితే తొమ్మిది నెలల వరకు నీరు ఎండిపోదని, చుట్టుపక్కల గ్రామాలకు నీటి సమస్య తీరనుందని ట్రస్ట్ నిర్వాహకులు ప్రకటించారు. -
మోర్బీ బ్రిడ్జి విషాదం.. 12 మంది బీజేపీ ఎంపీ కుటుంబ సభ్యులు మృతి
గుజరాత్లోని మోర్బీ నగరంలో మచ్చు నదీపై తీగల వంతెన కూలిన ఘోర దుర్భటన యావత్ భారత్ను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. సెలవు దినం.. ఆపై ఛట్ పూజ సంబరాలతో వందలాది మంది ఆహ్లాదంగా నదిపై జరిపిన సరదా విహారం ప్రాణాంతకంగా మారింది. అందరూ హడావిడిగా ఉండగా ఒక్కసారిగా బ్రిడ్జి కుప్పకూలడంతో ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే చాలా మంది నదిలో పడిపోయారు. చేతికి అందిన తీగలు పట్టుకొని కొందరు నదిలో పడకుండా ఆపుకోగలిగారు. వంతెన పునరుద్దరించిన నాలుగు రోజుల్లోనే కూలిపోవడంతో 130 మందికి పైగా జల సమాధి అవ్వడం తీరని విషాదంగా మారింది. మృతుల్లో అత్యధికులు మహిళలు, చిన్నారులే ఉండటం మరింత ఆవేదన కలిగిస్తోంది. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటనలో బీజేపీ ఎంపీ కుటుంబానికి చెందిన పలువురు మృతి చెందారు. రాజ్కోట్కు చెందిన బీజేపీ ఎంపీ మోహన్భాయ్ కళ్యాణ్జీ కుందారియా సోదరికి చెందిన 12 మంది కుటుంబ సభ్యులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ‘‘వంతెన కూలిన దుర్ఘటనలో ఐదుగురు పిల్లలతో సహా నా సోదరి కుటుంబంలోని 12 మంది సభ్యులను కోల్పోయాను. ఘటనా స్థలంలో ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్, స్థానిక యంత్రాంగం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. ప్రమాదం నుంచి బయటపడిన వారికి చికిత్స అందుతోంది. నదిలో ఉన్నవారి మృతదేహాలను వెలికితీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెస్క్యూ బోట్లు కూడా సంఘటనా స్థలంలో ఉన్నాయి. వంతెన కూలిన ఘటనలో పిల్లలు, మహిళలు ఎక్కువగా ఉన్నారు. 60 మృతదేహాలను వెలికితీశాం’ అని ఎంపీ పేర్కొన్నారు. చదవండి: 140 ఏళ్ల నాటి బ్రిడ్జి.. ఇటీవలే మరమత్తులు.. 4 రోజులకే పెను విషాదం 132కు చేరిన మృతుల సంఖ్య మోర్భీ కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 132కు చేరింది. ఇప్పటివరకు 177 మందిని రక్షించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పోలీసులు పేర్కొన్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యల్లో పలుపంచుకుంటున్నారని చెప్పారు. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీనితో సంబంధం ఉన్నవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హోం మంత్రి షర్ష్ సంఘ్వీ తెలిపారు. బ్రిడ్జి కూలిన ఘటనపై సెక్షన్లు 304, 308, 114 ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్)ను ఏర్పాటు చేశారు. 140 ఏళ్లనాటి వంతెన కాగా ఈ వంతెనను 140 ఏళ్ల నాటిది. 1879 ఫిబ్రవరి 20న అప్పటి ముంబై గవర్నర్ రిచర్డ్ టెంపుల్ దీనిని నిర్మాణాన్ని ప్రారంభించారు. 1880లో నిర్మాణం పూర్తయ్యింది. బ్రిటిష్ కాలం నాటి ఈవంతెనకు రూ. 2 కోట్లతో 7 నెలల పాటు మమరమత్తులు నిర్వహించి ఆధునీకరించారు. అయితే రిపేర్ తర్వాత వంతెనకు సేఫ్టి సర్టిఫికెట్ తీసుకోకుండానే తిరిగి తెరిచినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. -
అరవింద్ కేజ్రీవాల్పైకి నీళ్ల సీసా విసిరిన వ్యక్తి
రాజ్కోట్: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై గుర్తుతెలియని వ్యక్తి ప్లాస్టిక్ వాటర్ బాటిల్ విసిరాడు. అది ఆయనకు తగలకుండా, తలపై నుంచి వెళ్లి ముందుపడింది. గుజరాత్లోని రాజ్కోట్లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. నగరంలో దేవీ నవరాత్రుల్లో భాగంగా గర్బా వేడుకలో కేజ్రీవాల్ పాల్గొన్నారు. నడుస్తూ అభివాదం చేస్తుండగా, ఇంతలో వెనుక నుంచి ప్లాస్టిక్ నీళ్ల సీసా దూసుకొచ్చింది. అది కేజ్రీవాల్ తల పైభాగం నుంచి ముందుకు వెళ్లింది. ఈ దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఆప్ మీడియా కో–ఆర్డినేటర్ తెలిపారు. Water bottle thrown at #ArvindKejriwal in Rajkot, Gujarat. Delhi CM had come to attend Garba program. pic.twitter.com/AqX5VN6aMV — Hemir Desai (@hemirdesai) October 2, 2022 చదవండి: రాహుల్ భారత్ జోడో యాత్రలో సోనియా గాంధీ -
IND vs SA: దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత్.. సిరీస్ సమం
దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత్.. సిరీస్ సమం దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో భారత్ 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్ను టీమిండియా 2-2తో సమం చేసింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 87 పరుగులకే కుప్పకూలింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో వాన్ డెర్ డస్సెన్ 20 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక భారత బౌలర్లలో ఆవేష్ ఖాన్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. చాహల్ రెండు, హర్షల్ పటేల్, అక్షర్ పటేల్ తలా వికెట్ సాధించారు. అంతుకుమందు బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో దినేష్ కార్తీక్(55) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. హార్ధిక్ పాండ్యా(46) పరుగులతో రాణించాడు. కాగా కెప్టెన్ పంత్(17), శ్రేయస్ అయ్యర్(4) మరో సారి నిరాశపరిచాడు. ఇక ప్రోటీస్ బౌలర్లలో ఎంగిడీ రెండు వికెట్లు,జాన్సెన్, కేశవ్ మహారాజ్, ప్రిటోరియస్, నోర్ట్జే తలా వికెట్ పడగొట్టారు వరుస క్రమంలో వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా నాలుగో టీ20లో విజయం దిశగా భారత్ అడుగులు వేస్తుంది. ఆవేష్ ఖాన్ వేసిన 14 ఓవర్లలో దక్షిణాఫ్రికా వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. వాన్ డెర్ డస్సెన్(20), జాన్సెన్(12),మహారాజ్ పెవిలియన్కు చేరారు. నాలుగో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 59 పరుగుల వద్ద సౌతాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన మిల్లర్.. హర్షల్ పటేల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 11 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్: 70/4 మూడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన క్లాసన్.. చాహల్ బౌలింగ్లో ఎల్బీగా ఔటయ్యాడు. క్రీజులో డుస్సెన్(14), మిల్లర్(7) పరుగులతో ఉన్నారు. 9 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్: 53/23 రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 26 పరుగుల వద్ద సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. ఆవేష్ ఖాన్ బౌలింగ్లో ప్రిటోరియస్ డకౌటయ్యాడు. 6 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్: 35/2 తొలి వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా 24 పరుగులు వద్ద సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన డికాక్ రనౌట్ రూపంలో ఔటయ్యాడు. 4 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్: 22/0 నాలుగు ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా వికెట్ నష్టపోకుండా 22 పరుగుగులు చేసింది. అయితే కెప్టెన్ బావుమా గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. క్రీజులో డికాక్(13) , ప్రిటోరియస్ ఉన్నారు. చెలరేగిన కార్తీక్, హార్ధిక్ పాండ్యా.. దక్షిణాఫ్రికా టార్గెట్ 170 పరుగులు దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న నాలుగో వన్డేలో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో దినేష్ కార్తీక్(55) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. హార్ధిక్ పాండ్యా(46) పరుగులతో రాణించాడు. కాగా కెప్టెన్ పంత్(17), శ్రేయస్ అయ్యర్(4) మరో సారి నిరాశపరిచాడు. ఇక ప్రోటీస్ బౌలర్లలో ఎంగిడీ రెండు వికెట్లు,జాన్సెన్, కేశవ్ మహారాజ్, ప్రిటోరియస్, నోర్ట్జే తలా వికెట్ పడగొట్టారు 18 ఓవర్లకు భారత్ స్కోర్: 140/4 కార్తీక్(43),హార్ధిక్ పాండ్యా(40) పరుగులతో చెలరేగి ఆడుతున్నారు. 18 ఓవర్లకు భారత్ స్కోర్: 140/4 15 ఓవర్లకు భారత్ స్కోర్: 96/4 15 ఓవర్లు ముగిసే సరికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది. క్రీజులో హార్ధిక్ పాండ్యా(23),కార్తీక్(6) పరుగులతో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్ 81 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన పంత్..కేశవ్ మహారాజ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 12 ఓవర్లకు భారత్ స్కోర్: 78/3 12 ఓవర్లు ముగిసే సరికి భారత్ మూడు వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది. క్రీజులో పంత్(16),హార్ధిక్ పాండ్యా(23) పరుగులతో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా ఇషాన్ కిషన్(27) రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. అన్రిచ్ నోర్ట్జే బౌలింగ్లో వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి కిషన్ ఔటయ్యాడు. 6 ఓవర్లకు టీమిండియా స్కోర్: 40/2 6 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది. క్రీజులో ఇషాన్ కిషన్(27) పంత్(1) పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన భారత్.. అయ్యర్ ఔట్ 24 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 4 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. జాన్సెన్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. 3 ఓవర్లకు భారత్ స్కోర్: 24/2 తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా 13 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన గైక్వాడ్.. ఎంగిడి బౌలింగ్లో వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రాజ్కోట్ వేదికగా దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20లో టీమిండియా తలపడుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా మూడు మార్పులతో బరిలోకి దిగుతుండగా.. టీమిండియా ఎటువంటి మార్పులు చేయలేదు. తుదిజట్లు భారత్ : రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(కెప్టెన్/వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్ దక్షిణాఫ్రికా: టెంబా బావుమా(కెప్టెన్), క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, డ్వైన్ ప్రిటోరియస్, కేశవ్ మహరాజ్, మార్కో జాన్సెన్, లుంగి ఎంగిడి, తబ్రైజ్ షమ్సీ, అన్రిచ్ నోర్ట్జే -
IND Vs SA 4th T20: సిరీస్ సమం చేసేందుకు...
రాజ్కోట్: మారింది... ఒక్క విజయంతో సిరీస్ సీన్ మారింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత జట్టులో ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. రాజ్కోట్ మ్యాచ్ గెలిస్తే సిరీస్ 2–2తో సమం అవుతుంది. అప్పుడే లక్ష్యం దిశగా భారత జట్టు అడుగు వేస్తుంది. ఈ సిరీస్లో... సీనియర్లు లేని టీమిండియా తొలుత డీలా పడినా గత మ్యాచ్లో అటు బ్యాట్తో... ఇటు బౌలింగ్తో గర్జించింది. ఇప్పుడిదే ఉత్సాహంతో సిరీస్ సమం చేసేందుకు సన్నద్ధమైంది. శుక్రవారం జరిగే నాలుగో టి20 మ్యాచ్లో విజయమే లక్ష్యంగా రిషభ్ పంత్ సేన బరిలోకి దిగుతోంది. అయితే మరో ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిస్తేనే విజయం సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో భారత కోచ్ ద్రవిడ్ కుర్రాళ్లతో కూడిన జట్టును పట్టుదలతో సిద్ధం చేస్తున్నాడు. బ్యాటింగ్ బాగున్నప్పటికీ... వైజాగ్ మ్యాచ్లో భారత బ్యాటింగ్ ఆర్డర్లో ఓపెనర్లు రుతురాజ్, ఇషాన్లే మెరిపించారు. తర్వాత వచ్చిన వారంతా నిరాశపరిచారు. ఈ ద్వైపాక్షిక సిరీస్లో శ్రేయస్ అయ్యర్, కెప్టెన్ రిషభ్ పంత్ల నుంచి మ్యాచ్ను మలుపుతిప్పే ఇన్నింగ్సే కరువైంది. హార్దిక్ పాండ్యా కాస్త మెరుగనిపించినప్పటికీ మెరుపులు మాత్రం తక్కువే! ఈ కోవలో దినేశ్ కార్తీక్కు మినహాయింపేమీ లేదు. వీళ్లంతా ఓపెనర్ల కంటే సీనియర్లు... కానీ బాధ్యత పంచుకోవడంలో మాత్రం విఫలమవుతున్నారు. కీలకమైన నేటి మ్యాచ్లో సీనియర్లంతా ఆడితేనే పటిష్టమైన దక్షిణాఫ్రికాకు బదులివ్వగలం. లేదంటే బెంగళూరు (ఆఖరి మ్యాచ్)కు వెళ్లకముందే ఇక్కడే సిరీస్ను ప్రత్యర్థి జట్టు చేతుల్లో పెట్టాల్సి వస్తుంది. తొలి టి20తో పోల్చితే గత రెండు మ్యాచ్ల్లో బౌలింగ్ విభాగం మెరుగైంది. సీమర్లు భువనేశ్వర్, హర్షల్ పటేల్, స్పిన్నర్ చహల్ ప్రత్యర్థి బ్యాటర్స్ను చక్కగా కట్టడి చేస్తున్నారు. ఇదే నిలకడ ఈ మ్యాచ్లోనూ కొనసాగితే భారత్ విజయానికి బాట పడుతుంది. సిరీస్ లక్ష్యంగా సఫారీ ఇక్కడ టీమిండియా లక్ష్యం మ్యాచ్ అయితే... పర్యాటక జట్టు సిరీసే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. పైగా సీనియర్, డాషింగ్ ఓపెనర్ డికాక్ కూడా అందుబాటులోకి రావడం దక్షిణాఫ్రికాకు కలిసొచ్చే అంశం. బవుమా, డికాక్ జోడీ ఓపెనింగ్లో చెలరేగితే... డసెన్, క్లాసెన్, మిల్లర్లతో కూడిన మిడిలార్డర్ మిగతా పరుగుల సంగతి చూసుకుంటుంది. సఫారీ నెగ్గిన రెండు టి20లను పరిశీలిస్తే మిడిలార్డర్ పాత్రే కీలకంగా నిలిపింది. రాజ్కోట్ పిచ్పై పరుగులు ధారాళంగా రావడం ఖాయం. ఈ నేపథ్యంలో క్లాసెన్, మిల్లర్లు నిలదొక్కుకుంటే భారత బౌలర్లకు చుక్కలు చూపిస్తారు. ఇక బౌలింగ్ విషయంలో దక్షిణాఫ్రికాకు ఏ బెంగా లేదు. తొలి మ్యాచ్ మినహా... సీమర్లు నోర్జే, పార్నెల్, రబడ, స్పిన్నర్లు కేశవ్ మహరాజ్, షమ్సీలు భారత వికెట్లపై అద్భుతంగా రాణిస్తున్నారు. సఫారీ మళ్లీ సమష్టిగా కదం తొక్కితే భారత్కు కష్టాలు తప్పవు. ఆఖరి మ్యాచ్ దాకా లాగకుండా ఇక్కడే సిరీస్ను నెగ్గినా ఆశ్చర్యం లేదు. పిచ్–వాతావరణం ఈ వికెట్ బ్యాటింగ్కు స్వర్గధామం. పరుగుల విందు ఖాయం. టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపుతుంది. రుతుపవనాలతో వాతావరణం కాస్త చల్లబడింది. అయితే వర్షం పడే అవకాశాలు తక్కువే! జట్లు (అంచనా) భారత్: రిషభ్ పంత్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్, శ్రేయస్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్, హర్షల్, అవేశ్ ఖాన్, భువనేశ్వర్, చహల్. దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్), డికాక్, వాన్ డెర్ డసెన్, మిల్లర్, క్లాసెన్, ప్రిటోరియస్, పార్నెల్, రబడ, కేశవ్, నోర్జే, షమ్సీ. -
నాలుగో టీ20కి ముందు టీమిండియా ప్లేయర్ల ముందున్న రికార్డులివే..!
రాజ్కోట్ వేదికగా దక్షిణాఫ్రికాతో రేపు (జూన్ 17) జరుగబోయే నాలుగో టీ20కి ముందు టీమిండియా ప్లేయర్లను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. రేపటి మ్యాచ్లో రిషబ్ పంత్ మరో సిక్సర్ బాదితే అంతర్జాతీయ క్రికెట్లో 100 సిక్సర్లు బాదిన ఆటగాళ్ల క్లబ్లో చేరతాడు. టీమిండియా వెటరన్ ప్లేయర్ దినేశ్ కార్తీక్ మరో 64 పరుగులు చేస్తే అంతర్జాతీయ టీ20ల్లో 500 పరుగులను పూర్తి చేసుకుంటాడు. భువనేశ్వర్ కుమార్ మరో 4 వికెట్లు తీస్తే బుమ్రా (67వికెట్లు)ను అధిగమించి అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా రికార్డుల్లోకెక్కనున్నాడు. పొట్టి ఫార్మాట్లో 100 వికెట్ల మైలురాయిని చేరుకోవడానికి అక్షర్ పటేల్ ఒక్క వికెట్ దూరంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే, 5 మ్యాచ్ల ప్రస్తుత టీ20 సిరీస్లో టీమిండియా 1-2తో వెనుకబడి ఉన్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లో తొలి రెండు మ్యాచ్లు దక్షిణాఫ్రికా గెలుపొందగా, వైజాగ్లో జరిగిన మూడో టీ20లో టీమిండియా 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చదవండి: దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20.. టీమిండియా యువ పేసర్ దూరం..! -
వైరల్ వీడియో: భయమే లేని శునకం! సింహాన్ని ఎలా తరిమిందో చూడండి
సింహం అడవికి రాజు. దాన్ని చూస్తే ఏ జంతువైనా భయంతో వణికిపోతుంది. సింహాలు చాలా ప్రమాదకరమైనవి, శక్తివంతమైనవి. ఇక శత్రువును వెంటాడి ఆహారం చేసుకోవడంలో దిట్ట. అడవిలోనూ జంతువులను సింహాం గజగజ వణికిస్తే.. తాజాగా ఓ శునకం సింహాన్ని వెంటాడి ఏకంగా తరిమికొట్టింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. ఈ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. రాజ్కోట్కు 30 కిలోమీటర్ల దూరంలోని లోధికా తాలూకాలోని మాగాణి గ్రామంలో సింహం తిరుగుతున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. రైతుల పంట పొలాల వద్ద ఉండగా సింహాం కనిపించింది. కాగా అటవీ జంతువుల నుంచి పంటలను కాపాడేందుకు రైతులు పొలాల వద్ద ఓ కుక్కను కాపలాగా ఉంచారు. అయితే అటుగా వచ్చిన సింహాన్ని చూసి శునకం ఏమాత్రం భయపడలేదు. పంట పొలాల నుంచి గ్రామం వైపు వస్తున్న సింహాన్ని ఆ శనకం వెంటాడి గ్రామ సరిహద్దుల వరకు తరిమికొట్టింది. శనకం సింహాన్ని తరిమికొట్టడంతో గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. దీనిని చూసేందుకు జనాలు భారీగా తరలివచ్చారు. అనంతరం సింహం గురించి గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే సింహాన్ని తిరిగి గిర్ అభయారణ్యంలోకి పంపినట్లు అధికారుల తెలిపారు. చదవండి: క్రేజీ లవ్: గర్ల్ ఫ్రెండ్ కోసం మొత్తం గ్రామానికే కరెంట్ లేకుండా చేశాడు
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
సీబీఎస్ఈ పది, పన్నెండవ తరగతి ఫలితాలు విడుదల
ఎవరి లెక్క వారిదే..!
ఓటరు తీర్పు... ఈవీఎంలలో భద్రం
రాయల్ ఎన్ఫీల్డ్ దగ్ధం
వైఎస్సార్సీపీ గెలుపుకోసం పనిచేసిన వారికి ధన్యవాదాలు
దళిత మహిళా సర్పంచ్పై జనసేన దాడి
రామతీర్థంలో వైభంగా పూర్ణాహుతి
గ్రామాల్లో ద్రాక్ష పంట
చికెన్
పశువుల ఎరువుతో భూసారం పెంపు
తప్పక చదవండి
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement