-
'రెండు గంటల జర్నీ 20 నిమిషాల్లో'.. పుష్ప భామ ప్రశంసలు
నేషనల్ క్రష్గా అభిమానుల్లో పేరు సంపాదించుకున్న బ్యూటీ రష్మిక మందన్నా. గతేడాది యానిమల్తో హిట్ను ఖాతాలో వేసుకున్న ముద్దుగుమ్మ.. ప్రస్తుతం పుష్ప-2 చిత్రంలో నటిస్తోంది. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వస్తోన్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం ముంబయిలో ఉంటున్న కన్నడ భామ మీడియాతో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముంబయిలో నిర్మించిన అటల్ సేతు గురించి మాట్లాడింది. ఇండియాలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రశంసలు కురిపించారు.రష్మిక మాట్లాడుతూ..' ముంబై-ట్రాన్స్ హార్బర్ లింక్ అటల్ సేతు అద్భుతంగా ఉంది. 2 గంటల జర్నీ కేవలం 20 నిమిషాల్లో చేరుకుంటున్నాం. అసలు మాటలు రావడం లేదు. ముంబయి టూ నవీ ముంబయి, ముంబయి టూ గోవా, ముంబయి టూ బెంగళూరు ప్రయాణించడం చాలా ఈజీ అయిపోయింది. ప్రస్తుతం ఇండియా చాలా వేగంగా దూసుకెళ్తోంది. మరింత వేగంగా అభివృద్ది చెందుతోంది. ఈ విషయంలో మమ్మల్ని ఎవరూ ఆపలేరు" అంటూ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం రష్మిక చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. #WATCH | Mumbai: On the Mumbai-trans Harbour Link (MTHL) Atal Setu, Actor Rashmika Mandana says, "Who would have thought that something like this would have been possible. Now we can easily travel from Mumbai to Navi Mumbai. India is moving very fast and growing at a fast pace.… pic.twitter.com/ACwSoSNaa7— ANI (@ANI) May 14, 2024 -
సికందర్తో జోడీ
సికందర్తో జోడీ కట్టారు హీరోయిన్ రష్మికా మందన్నా. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో రూపొందనున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘సికందర్’. సాజిద్ నడియాడ్ వాలా ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా రష్మికా మందన్నా నటించనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.‘‘కొంతకాలంగా నా నెక్ట్స్ మూవీ ఏంటని అడుగుతున్నారు. ‘సికందర్’లో నటించనున్నాను. ఈ విషయాన్ని సర్ప్రైజ్గా ఫీలవుతారని అనుకుంటున్నాను. ‘సికందర్’లో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను’’ అని రష్మికా మందన్నా పేర్కొన్నారు. ఇది ఆమె కెరీర్లో 25వ చిత్రమని తెలుస్తోంది. ఇక ‘సికందర్’ వచ్చే ఏడాది రంజాన్కి రిలీజ్ కానుంది. -
Rashmika Mandanna: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక
‘పుష్ప’ చిత్రంలో పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది రష్మిక. ఆ తర్వాత తన ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే పెట్టింది. మిషన్ మజ్ను, గుడ్బై లాంటి బాలీవుడ్ సినిమాల్లో నటించినా.. అంతగా గుర్తింపు రాలేదు. కానీ యానిమల్ మూవీ రష్మికకు పెద్ద బ్రేక్ ఇచ్చింది. అందులో ప్రేమతో హింసించే భర్తకు భార్యగా రష్మిక అద్భుతంగా నటించి, విమర్శకుల ప్రశంసలు పొందింది. యానిమల్ తర్వాత రష్మికకు బాలీవుడ్లో వరుస అవకాశాలు వస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలో అవకాశం సొంతం చేసుకుంది ఈ నేషనల్ క్రష్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేసింది.‘మీరు ఎన్నో రోజులుగా నా సినిమా అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మీకోసమే ఈ సర్ప్రైజ్. ‘సికందర్’తో మీ ముందుకు వస్తున్నాను. ఇంత గొప్ప ప్రాజెక్ట్లో నటించే అవకాశం రావడం ఎంతో ఆనందంగా, గౌరవంగా ఉంది’ అని రష్మిక తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో రాసుకొచ్చింది. ఈ చిత్రానికి తమిళ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రష్మిక ‘కుబేర’, ‘రెయిన్ బో’, ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాల్లో నటిస్తోంది. ఆమె నటించిన పుష్ప 2 చిత్రం ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
ధనుష్, నాగార్జున హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా 'కుబేర'. ఈ సినిమా నుంచి ఇప్పటికే ధనుష్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. తాజాగా కింగ్ నాగార్జున లుక్ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ సినిమాలో నాగార్జున కీలకపాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.కుబేర సినిమాలో ధనుష్ కొంత సమయం పాటు రిచ్గా కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి. కానీ, ధనుష్ ఫస్ట్ లుక్లో మాత్రం బిచ్చగాడి పాత్రలో కనిపించారు. నాగార్జున మాత్రం పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా కోసం నాగార్జున అభిమానులతో పాటు ధనుష్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను ఇదే ఏడాదిలో విడుదల చేస్తామని డైరెక్టర్ శేఖర్ కమ్ముల చెప్పారు. -
Pushpa2 The Rule : ‘పుష్ప2’ మూవీ స్టిల్స్
-
పుష్ప 2 నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చేసింది
అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప 2 నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. పుష్ప పుష్ప అంటూ సాగిపోయే ఈ సాంగ్ ప్రోమోను బుధవారం (ఏప్రిల్ 24) రిలీజ్ చేశారు. కొద్దిరోజుల క్రితమే బన్నీ పుట్టినరోజు సందర్భంగా టీజర్ను రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా ఫ్యాన్స్కు మరో సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయిపోయారు. పుష్ప పుష్ప అంటూ సాగిపోయే పూర్తి పాటను కార్మికుల దినోత్సవం సందర్భంగా మే 1న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. పుష్ప చిత్రానికి సీక్వెల్గా వస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 15న రిలీజ్ కానుంది. పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానున్న ఈ చిత్రం బన్నీ మార్కెట్ స్థాయిని పెంచేలా ఉంది. ఈ సినిమా సుమారు రూ.1000 కోట్లకు పైగానే వసూలు చేస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే బాలీవుడ్ థియేట్రికల్ హక్కులు రూ. 200 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. నార్త్లో ఇంతటి భారీ మొత్తానికి అమ్ముడుపోయిన తొలి సినిమాగా పుష్ప రికార్డ్ క్రియేట్ చేసింది.పుష్ప ది రైజ్ చిత్రంతో నేషనల్ అవార్డు అందుకున్న బన్నీ.. తగ్గేదే లే అంటూ ప్రపంచవ్యాప్తంగా తన బ్రాండ్ను విస్తరిస్తున్నాడు. అందుకు తగ్గట్లుగానే రెండో భాగాన్ని తెరకెక్కించారు మేకర్స్ . ఈ చిత్రం కోసం సుమారు రూ.400 కోట్ల బడ్జెట్ను మైత్రీ మూవీ మేకర్స్ వారు పెట్టినట్లు సమాచారం. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్రధాన బలమని చెప్పవచ్చు. -
నా కంటే అందమైన వాళ్లున్నారు.. కానీ: రష్మిక ఆసక్తికర కామెంట్స్
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది యానిమల్ మూవీతో మరో బ్లాక్బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. అంతే కాదు భారతీయ సినిమాలోనే అత్యధికంగా అభిమానులను అలరించిన నటిగానూ మొదటి స్థానంలో ఉన్నారు. రష్మిక పలు భాషలు, పలు చిత్రాల్లో నటించినా తెలుగు చిత్రం పుష్ప ఈమె కెరీర్కు పెద్ద టర్నింగ్ పాయింట్గా నిలిచింది. ఈ చిత్రం తరువాతనే బాలీవుడ్ ఎంట్రీ యానియల్ సినిమాతో హిట్ కొట్టింది. కాగా ఇటీవల రష్మిక మందన్నా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకంటే అందం, ప్రతిభ కలిగిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారన్నది తనకు తెలుసన్నారు. అయితే తనకు మంచి అవకాశాలు రావడంతో ఆ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. ఇందుకు తాను నిజంగా కృతజ్ఞతురాలినై ఉంటానన్నారు. జీవితంలో సంతోషాన్ని, మీరు పొందిన విజయాన్ని సాధారణంగా భావించరాదన్నారు. గత కొద్ది కాలంగా తాను నేర్చుకున్నది ఇదేనని నటి రష్మిక మందన్నా పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఈ కన్నడ బ్యూటీ పుష్ప -2: ది రూల్ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో తెరపైకి రానుంది. ఈ చిత్రంపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ తర్వాత చావ అనే ఒక హిందీ చిత్రం, రెయిన్బో అనే ద్విభాషా చిత్రం (తమిళం, తెలుగు), ది గర్ల్ ఫ్రెండ్ అనే తెలుగు చిత్రం రష్మిక చేతిలో ఉన్నాయి. -
ఛాయ్ పే శ్రీవల్లి.. బేగంపేటలో రష్మిక సందడి (ఫొటోలు)
-
Pushpa 2 Teaser Photos: చీర కట్టులో పుష్ప రాజ్ విశ్వరూపం
-
'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా "ది గర్ల్ ఫ్రెండ్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. నేడు రష్మిక మందన్న బర్త్ డే సందర్భంగా "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా నుంచి శుభాకాంక్షలు చెబుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో రష్మిక సింపుల్ మేకోవర్లో బ్యూటిఫుల్గా కనిపిస్తోంది. "ది గర్ల్ ఫ్రెండ్" లో ఆమె కాలేజ్ స్టూడెంట్గా నటిస్తున్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది. వైవిధ్యమైన ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతున్న "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్లో ఉంది. ఇప్పటికి 60 శాతం షూటింగ్ పూర్తయినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే పుష్ప 2 చిత్రం నుంచి కూడా రష్మిక ఫస్ట్ లుక్ పోస్ట్ విడుదలైంది. అందులో ఆమె లుక్ చూసిన ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు ఉండటంతో టీజర్ విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటన వచ్చేసింది. ఈ ఏడాదిలో రష్మిక నుంచి దాదాపు నాలుగు సినిమాలు విడుదల కానున్నాయి. -
తండ్రి కష్టాలను తాను మోస్తూ.. పోరాటం కొనసాగించిన 'రష్మిక మందన్న'
రష్మిక మందన్నా.. నిజానికి కన్నడ నటి. నేడు 28వ పుట్టిన రోజు జరుపుకుంటుంది. మోడల్గా కెరీర్ ప్రారంభించిన రష్మిక 'కిరిక్ పార్టీ' చిత్రంతో కన్నడ సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత 'ఛలో' సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ‘గీతగోవిందం, సరిలేరు నీకెవ్వరు, పుష్ప,యానిమల్ చిత్రాలతో నేషనల్ క్రష్గా వెలిగిపోతుంది. తనపట్ల పలు రకాలుగా రూమర్స్, డీప్ ఫేక్ వీడియోలు వంటివి ఎదురైనా బలంగా నిలబడింది. అందుకే నేడు ఆమె పాన్ ఇండియా రేంజ్లో సత్తా చాటుతూ చరిత్రలో తనకంటూ ఒక పేజీని ఏర్పాటు చేసుకుంది. రష్మిక విద్యాభ్యాసం వివరాలు రష్మిక మందన్న కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరాజ్పేట్లో ఏప్రిల్ 5, 1996లో జన్మించారు. రష్మిక కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత రష్మిక M. S. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుంచి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి పెంచుకున్న రష్మిక.. చదువును నిర్లక్ష్యం చేస్తూ నటి కావాలని కలలు కనలేదు. చదువులో అగ్రస్థానంలో నిలిచిన రష్మిక మొదట మోడలింగ్ షోలలో పనిచేయడం ప్రారంభించింది. అలా ఒక షోలో ఆమెను చూసిన రక్షిత్ శెట్టి 'కిరిక్ పార్టీ' సినిమాలో ఎలాంటి ఆడిషన్ లేకుండానే ఛాన్స్ ఇచ్చాడు. అద్దె ఇంట్లో జీవితం ప్రారంభం రష్మిక చిన్నప్పుడు తమ కుటుంబం మొత్తం ఓ అద్దె ఇంట్లో ఉండేవారమని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆర్థిక కష్టాల కారణంగా రెంట్ కట్టలేకపోవడంతో పదే పదే ఇల్లు మారాల్సి వచ్చేదని చెబుతూ ఆ సమయంలో కంటతడి పెట్టుకుంది. తల్లిదండ్రులు చివరికి తనకి ఆడుకోవడానికి ఒక బొమ్మని కూడా కొనివ్వలేకపోయారని వాపోయింది. పాఠశాల రోజుల్లో తన కుటుంబం ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంది. ఆపై వ్యాపారాల్లో నష్టం వచ్చి తన నాన్నగారు బాధపడిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఎలాగైనా ఆ పరిస్థితిని మార్చాలని రష్మిక బలంగా కోరుకుంది. అందుకు తగ్గట్లు కష్టపడింది. తన తల్లిదండ్రులకు ఎలాంటి సినీ నేపథ్యం లేదు.. అయినా ధైర్యంగా ఇందులో అడుగుపెట్టింది. ఇప్పుడు తను రెండుజేతులా ఆర్జిస్తూ తండ్రికి బిజినెస్లో ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తోంది. అలానే ఓ పెద్ద ఇల్లుని కూడా పేరంట్స్కి గిప్ట్గా ఇచ్చింది. ఛలో టూ పుష్ప కిరిక్ పార్టీ సినిమా విజయంతో రష్మిక మందన్నకు ఛలో సినిమాలో ఛాన్స్ దక్కింది. కేవలం రంగుల కలలు కని సినిమాల్లోకి తను రాలేదు. ఈ వృత్తిలో ఉండే సాధకబాధకాల గురించి ముందే తెలుసుకుంది. అయితే ప్రతి వృత్తిలో ఉన్నట్లే సినిమారంగంలో కూడా ఒడిదొడుకులు, ఎగుడుదిగుళ్లు ఉంటాయనేది కూడా బాగా తెలుసు అందుకే ఆమెపై ఎన్ని రూమర్స్ వచ్చినా బలంగా తట్టుకుని నిలబడింది. సరైన అవకాశం కోసం ఎదురుచూసింది. ఆ సమయం పుష్ప సినిమాతో వచ్చింది. దీంతో ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రస్తుతం పుష్ప2 తో అంతకు మించి ఇమేజ్ ను సాధించడానికి రెడీగా ఉంది రష్మిక. ఫస్ట్ రెమ్యునరేషన్ కిరిక్ పార్టీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక రూ. 1.50 లక్షలు మాత్రమే రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఆ తర్వాత ఛలో సినిమాకు రూ. 50 లక్షలు అందుకున్నారని టాక్. టాలీవుడ్ తర్వాత కోలీవుడ్లోకి అడుగుపెట్టింది రష్మిక. తమిళంలో కార్తీ సరసన నటించిన ఆమె ఆ తర్వాతి సినిమాలోనే తలపతి విజయ్ సరసన నటించే అవకాశాన్ని చేజిక్కించుకుని కోలీవుడ్ మార్కెట్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 5 కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్న రష్మిక యానిమల్ సినిమాకు మాత్రం రూ. 7 కోట్ల వరకు తీసుకున్నట్లు టాక్. పేదరికం నుంచి కోట్లలో సంపద చిన్నతనంలో నాన్న పడుతున్న కష్టాన్ని తన కళ్లతోనే చూసింది. ఎలాగైనా తన కుటుంబ పరిస్థితిని మార్చాలని కోరుకుంది. అందుకే సంపాదించిన ప్రతి రూపాయి ఇప్పటికి కూడా తన తండ్రికి అప్పజెప్పుతుంది. ప్రస్తుతం సినిమా రెమ్యునరేషన్తో పాటు ఆమె పలు ప్రకటనల్లో కూడా కనిపిస్తుంది. ఒక్కో ప్రకటనకి డెబ్బై లక్షల నుంచి కోటి రూపాయల వరకు డిమాండ్ చేస్తోందట. అలా ఇప్పటి వరకు మొత్తంగా రూ. 70 కోట్ల వరకు రష్మిక సంపాధించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్న మాట. 23 ఏళ్లకే కోటీశ్వరురాలిగా మారిన రష్మికకు బెంగళూరు, కూర్గ్, గోవా, హైదరాబాద్, ముంబై సహా నగరాల్లో ఇళ్లు ఉన్నాయట. ఇందులో రష్మిక బెంగళూరులోని లగ్జరీ ఇంటి విలువ 10 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. రష్మికకు కార్లంటే చాలా ఇష్టం మరియు అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. టయోటా ఇన్నోవా, ఆడి క్యూ3, మెర్సిడెస్ బెంజ్ సి క్లాస్, రేంజ్ రోవర్ స్పోర్ట్, హ్యుందాయ్ క్రెటా వంటి ఖరీదైన కార్లు ఆమె గ్యారేజీలో వరుసలో ఉన్నాయి. ముఖ్యంగా ఆమె సినిమాల్లో సంపాదించని డబ్బును తన తండ్రి ద్వారా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెడుతందని సమాచారం. దాంతో తన ఆస్తులతో పాటు.. సంపద కూడా భారీగా పెరుగుతూ వస్తోందట. చిన్నప్పుడు తన తల్లిదండ్రులను గర్వించేలా చేయాలని బలంగా కోరుకున్న రష్మిక అనుకున్నట్లు గానే సాధించింది. చిన్నతనంలోనే తన జీవితం గురించి ఏ విధంగా అయితే కలలుకనిందో వాటిని నిజం చేసుకుంది. అయినా జీవితంలో ఇంకా సాధించాల్సింది చాలానే ఉందంటున్న రష్మిక.. అవన్నీ నెరవేరాలని కోరుకుంటూ నేషనల్ క్రష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. -
అప్పుడేమో చప్పట్లు.. ఇప్పుడేమో విమర్శలు.. అయినా తగ్గేదేలే!
రష్మిక ఒక్క నవ్వు నవ్వితే చాలు.. ఇంకేమింకేమింకేం కావాలే.. చాల్లే ఇది చాలే... అంటూ కుర్రకారు దిల్ ఖుష్ అయిపోతారు. కొంటెగా కన్ను గీటినా, చిలిపిగా ఓ నవ్వు నవ్వినా.. తను ఏం చేసినా అభిమానులకు ఇష్టమే! తెలుగు ప్రేక్షకులకు తొలిసారిగా చలో సినిమాలో కళ్లజోడుతో కనిపించింది. గీతగోవిందంలో హీరోను ముప్పు తిప్పలు పెట్టించింది. తన అల్లరితనం, చలాకీతనం ఇక్కడివారికి భలే నచ్చేసింది. సరిలేరు నీకెవ్వరు మూవీలో కూడా అదే హుషారుతనం. యానిమల్ మూవీతో విమర్శలు వెంటనే నేషనల్ క్రష్గా తనకంటూ ఓ బిరుదిచ్చేశారు. మధ్యలో కొన్ని ఫ్లాపులు అందుకున్నప్పటికీ పుష్పలో అల్లు అర్జున్ సరసన నటించే ఛాన్స్ అందుకుంది. ఇది పాన్ ఇండియా రేంజ్లో హిట్టవడంతో బాలీవుడ్లోనూ అవకాశాలు రాగా అక్కడా సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలో గతేడాది యానిమల్ మూవీ చేసింది. ఇందులో రష్మిక ఎవరూ ఊహించని పాత్రలో కనిపించింది. భర్తను ప్రాణంగా ప్రేమించే మధ్యతరగతి గృహిణిగా కనిపించింది. భర్త ఎన్ని తప్పులు చేసినా అతడిని వదిలేయడానికి ఆమె మనసు అంగీకరించదు. ట్రోల్స్ సహించను ఇలాంటి రోల్ చేసినందుకు రష్మికను ఆడిపోసుకున్నారు. తను సమాజంలో జరుగుతుంది చూపించినప్పటికీ దాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఎట్టకేలకు ఈ ట్రోలింగ్పై స్పందించింది రష్మిక. 'అమ్మాయిల శరీరాన్ని ట్రోల్ చేస్తే నేనస్సలు సహించలేను. ఇప్పుడు చాలామంది నన్ను, నా సినిమాలను, డైలాగులు చెప్పేటప్పుడు నా ముఖకవళికలను.. ఇలా ప్రతిదాన్ని ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా యానిమల్లో కర్వా చౌత్ సీన్ గురించి విమర్శిస్తున్నారు. సెట్లో ఈ సీన్ చేసినప్పుడు అందరూ చప్పట్లు కొట్టారు. సినిమా రిలీజయ్యాక మాత్రం జనాలు తిట్టిపోస్తున్నారు. అయినా నా పర్ఫామెన్స్ ఏంటో నాకు తెలుసు' అని రీసౌండ్ వచ్చేలా కౌంటర్ ఇచ్చింది. ఎదుగుదలతోనే జవాబు నిజానికి ఈ సామాజిక మాధ్యమాల వల్ల సెలబ్రిటీల మీద విషం కక్కుతున్నారు. కొందరు దానివల్ల ఎంతో బాధపడుతున్నారు, డిప్రెషన్కు లోనవుతున్నారు. కానీ బాధపడుతూ కూర్చుంటే లాభం లేదనుకునే ఇలా ట్రోలింగ్ను తిప్పికొట్టింది రష్మిక. నవ్వినా, తుమ్మినా, దగ్గినా తప్పులు తీసే కాలం ఇది.. కాబట్టి ప్రతిసారి నోటితో ఆన్సరివ్వకుండా.. తగ్గేదేలే అన్న రీతిలో తన ఎదుగుదలతోనే ట్రోలింగ్కు ధీటైన సమాధానం చెప్తోంది శ్రీవల్లి. చదవండి: సందీప్, లావణ్య త్రిపాఠి హిట్ సినిమా.. ఏడేళ్ల తర్వాత తెలుగులో విడుదల పుష్పరాజ్ సతీమణి శ్రీవల్లీ లుక్ చూశారా..? -
Rashmika Mandanna: పుష్పరాజ్ సతీమణి శ్రీవల్లీ లుక్ చూశారా..?
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'పుష్ప: ది రూల్'. ఈ చిత్రంలో శ్రీవల్లీగా 'రష్మిక మందన్న' నటిస్తున్న విషయం తెలిసిందే. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా తాజాగా పార్ట్-2 సంబంధించిన లుక్ను మేకర్స్ తాజాగా రివీల్ చేశారు. మొదటి భాగంలో చాలా సింపుల్గా కనిపించిన శ్రీవల్లీ పార్ట్-2లో మాత్రం చాలా రిచ్గా కనిపిస్తోంది. ఒంటి నిండా బంగారు నగలతో మెరిసిపోతుంది. ఇప్పటి వరకు చూసిన శ్రీవల్లీ ఓ లెక్క ఇకనుంచి చూడబోయే శ్రీవల్లీ మరో లెక్క అన్నట్లు ఆ పోస్టర్ ఉంది. రష్మిక పుట్టినరోజు సందర్భంగా తాజాగా విడుదలైన ఈ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. పార్ట్-1 సమయంలో విడుదల చేసిన లుక్తో.. ఇప్పుడు విడుదల చేసిన లుక్ను పోలుస్తూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. రష్మిక మరింత పవర్ఫుల్గా ఇందులో కనిపించబోతుందని వారు చెప్పుకొస్తున్నారు. మొదటిభాగం చివర్లో పుష్పరాజ్కు శ్రీవల్లితో పెళ్లి అయినట్లు చూపిన సంగతి తెలిసిందే.. ఇక రెండో పార్ట్లో పుష్పకు భార్యగా ఆమె కనిపించనుంది. ఈ సీక్వెల్లో ఆమె పాత్ర చాలా పవర్ఫుల్గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఆగష్టు 15న విడుదల కానుందని మరోసారి మేకర్స్ ప్రకటించారు. Wishing the 𝒏𝒂𝒕𝒊𝒐𝒏'𝒔 𝒉𝒆𝒂𝒓𝒕𝒕𝒉𝒓𝒐𝒃 'Srivalli' aka @iamRashmika a very Happy Birthday 🫰🏻#Pushpa2TheRuleTeaser on April 8th 🔥#PushpaMassJaathara 💥#Pushpa2TheRule Grand Release Worldwide on 15th AUG 2024. Icon Star @alluarjun @aryasukku #FahadhFaasil… pic.twitter.com/AnsbEXZqJT — Pushpa (@PushpaMovie) April 5, 2024 -
RashmikaMandanna : అద్దె కట్టడానికి డబ్బుల్లేవు..మరెలా వచ్చిందీ స్టార్డమ్
సినీ పరిశ్రమలో మహిళలు నిలదొక్కుకోవడం అంటే మాటలు కాదు. స్టార్ హీరో, మెగాహీరో, సూపర్ స్టార్, క్రేజీ స్టార్, గ్లోబల్ స్టార్, ప్యాన్ ఇండియా స్టార్ ఈ ట్యాగ్లు, బిరుదులు అన్నీ హీరోలకే. వీటిన్నింటిని తోసి రాజని తామేంటో నిరూపించుని నిలబడిన వారు చాలాకొద్దిమంది. అలాంటి వారిలో టాప్లో ఉంటుంది నేషనల్ క్రష్గా పేరు తెచ్చుకున్న నటి రష్మికమందన్నా. టాలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని చోట్లా స్టార్ హీరోయిన్గా చలామణి అవుతోంది. ‘తగ్గేదేలే’ అంటూ దూసుకు పోతోంది. ఒక కుగ్రామంనుంచి వచ్చి ఇంత స్టార్డమ్ ఎలా తెచ్చుకుంది.. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. 1996 ఏప్రిల్ 5న పుట్టింది రష్మిక. ఆంగ్ల సాహిత్యం, జర్నలిజం, మనస్తత్వశాస్త్రంలో డిగ్రీలు చేసింది. రష్మిక మధ్యతరగతి కుటుంబానికి చెందినది. తల్లిదండ్రులు ఆర్థికంగా కష్టపడటం చూసింది.అద్దె కట్టడానికి కూడా డబ్బు లేని పరిస్థితిని కూడా చూసింది. కర్ణాటకలో పుట్టిపెరడంతో 2016లో కన్నడ మూవీతో "కిరిక్ పార్టీ" , తెరంగేట్రం చేసింది. తొలి సినిమాలనే సూపర్హిట్ అయింది. 20 ఏళ్లకే నటిగా మారిన రష్మిక అదృష్టం వరించింది. ఈ మూవీ బడ్జెట్ రూ.4 కోట్లు కాగా బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల బిజినెస్ చేసింది. అందం, అభినయానికి , పట్టుదల, కృషిని జోడించింది. అలా టాలీవుడ్కి పరిశ్రమను ఆకర్షించింది. 2018 లో "ఛలో" తో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. కిల్లర్ లుక్స్తో ఇటు యూత్ ఐకాన్గా, అటు దర్శక నిర్మతాల బెస్ట్ ఆప్షన్గా మారింది. సమంతా సినిమా తిరస్కరించడంతో. రష్మిక మందన్నకు అదృష్టం వరించింది. ఇక ఆ తరువాత "డియర్ కామ్రేడ్", గీత గోవిందం" వంటి చిత్రాలలో తన అద్భుతమైన నటనతో రష్మిక అగ్ర నటిగా నిలదొక్కుకుంది. స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. వరుస సినిమాలతో ఈమె మన తెలుగు అమ్మాయే అన్నట్టుగా మారిపోయింది. అగ్రహీరోల సరసన కూడా నటించింది. ఆ తరువాత అల్లు అర్జున్ సరసన నటించిన 'పుష్ప' సినిమా ఆమెకు ఎక్కడలేని స్టార్డమ్ తెచ్చి పెట్టింది. చిత్తూరు యాసతో శ్రీవల్లిగా అందరినీ అబ్బుర పరిచింది. శ్రీవల్లి కాస్తా 'నేషనల్ క్రష్' గా అవతరించింది. ఇక ‘సామి.. సామి’ సాంగ్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. పుష్ప రికార్డు వసూళ్లను రాబట్టింది. దీంతో బాలీవుడ్ కూడా రారమ్మని ఆహ్వనించింది. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి "మిషన్ మజ్ను"లో రష్మిక మందన్న బాలీవుడ్ అరంగేట్రం చేసింది. అటు తమిళంలో కార్తీతో కలిసి "సుల్తాన్" లో కోస్టార్గా నటించింది. తరువాత విజయ్ లాంటి పెద్ద స్టార్స్ పక్కన కూడా అవకాశాలు వచ్చాయి. బాలీవుడ్ రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన సెన్సేషనల్ మూవీ 'యానిమల్' మూవీ రష్మిక మందన్న కెరీర్ని కొత్త మలుపు తిప్పింది. తమిళంలో విజయ్తో చేసిన 'వారిసు' మూవీ కూడా సూపర్హిట్ అయింది. దీంతో ఇంటర్ నేషనల్ క్రష్గా మారిపోయింది. అంతేనా ఇటీవల వరల్డ్ టాప్ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా త '30 అండర్ 30' అనే కేటగిరీలో చోటు సంపాదించుకుంది. సినిమా పరిశ్రమనుంచి అత్యంత ప్రతిభావంతుల్లో ఒకరిగా నిలిచింది. అవార్డులు "కిరిక్ పార్టీ"లో తన నటనకు ఉత్తమ తొలి నటిగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు (SIIMA) గెలుచుకుంది. “గీత గోవిందం” మూవీకి ఉత్తమ నటిగా జీ సినీ అవార్డ్స్ తెలుగు , తెలుగు ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు వీటన్నింటికన్న మిన్నగా తన యాక్టింగ్ స్టయిల్, స్మైల్, ఆన్-స్క్రీన్ లుక్స్, మెస్మరైజింగ్ లుక్స్తో పాన్-ఇండియా స్టార్గా లక్షలాదిమంది అభిమానుల గుండెల్లో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. వ్యక్తిగత జీవితంలో ఎదురుదెబ్బలు, డేటింగ్ రూమర్లు, పెళ్లికబుర్లు, ట్రోలింగ్లు, డీప్ ఫేక్ వీడియోలు ఇవేవీ రష్మిక కమిట్మెంట్ను దెబ్బతీయలేవు.. ఒక్క చిరునవ్వుతో అవన్నీ బలా దూర్ అంటారు ఫ్యాన్స్. -
రష్మిక మందన్న గురించి ఈ విషయాలు తెలుసా..?
-
అందం + అభినయం +అల్లరి.. హ్యాపీ బర్త్డే రష్మిక మందన (ఫొటోలు)
-
ఆ ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్యామిలీస్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
వీకెండ్లో రష్మిక ఎవరిని కలుస్తుందంటే..?
నటీ నటుల్లో ఒక్కొక్కరికి ఒక్కో పాలసీ వుంటుంది. కొందరు ఆదివారం షూటింగ్లకు సెలవు ప్రకటిస్తుంటారు. మరి కొందరు వారాంతర రోజున కుటుంబసభ్యులకు కేటాయిస్తూ వుంటారు. ఇంకొందరు పార్టీలకు, పబ్లకు వెళుతుంటారు. ఇక రష్మిక మందన్న ఏం చేస్తారో తెలుసా? ఇండియా క్రష్ అయిన ఈ బ్యూటీ చేతినిండా చిత్రాలతో క్షణం కూడా తీరికలేనంత బిజీ. ఇటీవల ఈమె నటించిన హిందీ చిత్రం యానిమల్ సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంతో రష్మిక మందన్న బాలీవుడ్లోనూ స్టార్ అంతస్థుకు చేరుకున్నారు. అక్కడ మరిన్ని అవకాశాలు ఈ బ్యూటీని వెతుక్కుంటూ వస్తున్నాయట. ఇటీవల జపాన్ వెళ్లి వచ్చిన రష్మికకు అక్కడ అభిమానుల నుంచి ఘనస్వాగతం లభించడం విశేషమనే చెప్పాలి. ఇకపోతే తెలుగు, తమిళం భాషల్లోనూ పలు చిత్రాలలో నటిస్తూ రష్మిక మందన్న బిజీగా వున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన నటిస్తున్న పుష్ప–2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. అదేవిధంగా రెయిన్బో, ది గర్ల్ఫ్రెండ్ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. నటిగా ఇంత బిజీగా ఉన్నా కూడా ఈ అమ్మడు వీకెండ్లో తన మిత్రబృందంతోనే ఎక్కువగా గడుపుతారట. కుటుంబసభ్యులకు కాస్త సమయాన్ని కేటాయించినా, ఎక్కువగా స్నేహితులతోనే జాలీగా గడిపేస్తారట. ఇది తన పాలసీ అని రష్మిక మందన్న వర్గం మాట. -
ఐదు భాషల్లో డబ్బింగ్
‘నేను సూడలేదని ఓ పులుపెక్కి పోతాండవట కదా..’ అంటూ ‘పుష్ప’ సినిమాలో రష్మికా మందన్నా అదో రకం మాస్ స్టయిల్లో చెప్పిన డైలాగ్ చాలా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఈ కూర్గ్ బ్యూటీ ‘పుష్ప’ కోసం చిత్తూరు యాస నేర్చుకుని మరీ ఆ సినిమాలో తాను చేసిన శ్రీవల్లి పాత్రకు డబ్బింగ్ చెప్పారు. ఇక ఈ మధ్యకాలంలో సంచలన విజయం సాధించిన ‘యానిమల్’కి హిందీలోనూ, ఆ చిత్రం తెలుగు, కన్నడ అనువాదాలకూ తన పాత్రకు సొంత గొంతు వినిపించారు. ఇప్పుడు ఏకంగా ఐదు భాషలు మాట్లాడారు రష్మికా మందన్నా. తాను లీడ్ రోల్ చేస్తున్న ‘గర్ల్ ఫ్రెండ్’ చిత్రం టీజర్కి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ హిందీ భాషల్లో డబ్బింగ్ చెప్పారు రష్మిక. ఆమె మలయాళం మాట్లాడటం ఇదే తొలిసారి. ఐదు భాషల్లోనూ రష్మిక డబ్బింగ్ చెప్పిన విధానం అద్భుతం అని కొనియాడుతున్నారు ‘గర్ల్ ఫ్రెండ్’ చిత్రదర్శకుడు రాహుల్ రవీంద్రన్. ఈ నెల 5న రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఐదు భాషల టీజర్ విడుదల కానుంది. మరి.. రష్మికతో టీజర్కి డబ్బింగ్ చెప్పించిన రాహుల్ పూర్తి పాత్రకు ఆయా భాషల్లో డబ్బింగ్ చెప్పిస్తారేమో చూడాలి. -
రష్మిక బర్త్డే రోజే వస్తున్న 'ఫ్యామిలీ స్టార్'... విజయ్ ఏం చెప్పాడంటే?
విజయ్ దేవరకొండ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ‘ఫ్యామిలీస్టార్’ మరో కొద్దిరోజుల్లో థియేటర్లోకి రానున్నాడు. వేసవి సందర్భంగా ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్కు జోడీగా మృణాల్ ఠాకూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు - శిరీశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కుటుంబ వినోదంతో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మూవీ టీమ్ ప్రమోషన్లు చేస్తోంది. అందులో భాగంగా ఫ్యామిలీ స్టార్తో కిట్టీ పార్టీ అంటూ ఇండిస్ట్రీకి చెందిన కొందరు నటీమణులతో విజయ్ దేవరకొండి చిట్చాట్ జరిపారు. ఈ సందర్భంగా సినిమా విడుదల విషయంలో విజయ్కు ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురైంది. ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న విడుదల అవుతుంది కదా.. ఆ తేదీన ఏదైనా విశేషం ఉందా..? అని విజయ్ దేవరకొండను ఓ నటి అడిగారు. ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ విడుదల చేయడానికి ప్రధాన కారణం ఎక్కువగా సెలవులు ఉండటమే అని విజయ్ దేవరకొండ చెప్పారు. దీంతో అక్కడ ఉన్న వారు నవ్వడం ప్రారంభించారు. 'యాదృచ్ఛికంగా ఎప్రిల్ 5న ఇంకేదో ఉంది.. అదే రష్మిక మందన్న పుట్టినరోజు అనుకుంటా' అని మరోకరు అన్నారు. దీనికి విజయ్ మాట్లాడుతూ.. 'అవును ఆరోజున రష్మిక పుట్టినరోజు ఉంది. అది మాకు లక్కీ అవుతుందని అనుకుంటున్నాను.' అని అన్నారు. వాస్తవంగా ఏప్రిల్ 5,6,7 తేదీలు వీకెండ్తో ముగుస్తాయి. ఆ తర్వాత వెంటనే ఉగాది, రంజాన్ పండుగలు ఒకే వారంలో ఉన్నాయి. దీంతో ఫ్యామిలీ స్టార్కు కలెక్షన్స్ పరంగా బాగా కలిసొస్తుందని విజయ్ పేర్కొన్నాడు. విజయ్- రష్మిక ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 5వ తేదీన రష్మిక పుట్టినరోజు ఉంది.. సినిమా కూడా అదేరోజున విడుదల కానున్నడం ఇప్పుడు వారి ప్రేమ విషయం మరింత ఆసక్తిగా మారింది. -
విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్.. రష్మిక ట్వీట్ వైరల్!
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. తాజాగా రిలీజైన ట్రైలర్కు అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ ట్రైలర్ ఏకంగా యూట్యూబ్లో నంబర్వన్ ప్లేస్లో ట్రెండింగ్లోకి వచ్చింది. తాజాగా ట్రైలర్ వీక్షించిన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా చిత్రం బృందానికి అభినందనలు తెలిపింది. ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది. ఫ్యామిలీ స్టార్ కచ్చితంగా విజయం సాధిస్తుందని రాసుకొచ్చింది. ఆ తర్వాత పార్టీ కావాలని ట్విటర్ ద్వారా కోరింది. ఈ ట్వీట్కు స్పందించిన విజయ్ దేవరకొండ.. క్యూటెస్ట్ అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. గతంలో చాలాసార్లు ఈ జంటపై డేటింగ్ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. Cutest 🩷 https://t.co/I6ATSjqc6Q — Vijay Deverakonda (@TheDeverakonda) March 28, 2024 I wish my darlings @ParasuramPetla 🌻 and @TheDeverakonda 🤍 the bestestestestttt for #FamilyStar .. ❤️❤️ April 5th it isssss! So exciteddddd! 🩷 You guys definitely have a winner on hand! 🥳💃🏻 party kavaliiiii! 🥳🥳✨@mrunal0801 all the best my love! ❤️ https://t.co/f4aPH1ajnk — Rashmika Mandanna (@iamRashmika) March 28, 2024 -
ఆరు నెలల తర్వాత అక్కడ అడుగుపెట్టిన రష్మిక.. కారణం ఇదే
ఇప్పుడు ఇండియన్ సినిమా క్రష్ ఎవరంటే.. టక్కున రష్మిక మందన్నా పేరే చెబుతారు. పాన్ ఇండియా చిత్రం పుష్ప తరువాత ఈ కన్నడ బ్యూటీ క్రేజ్ బాలీవుడ్ వరకు పాకింది. 2016లో కన్నడ చిత్రం కిరాక్ పార్టీతో కెరీర్ను ప్రారంభించిన ఈ బ్యూటీ అక్కడ మరో రెండు చిత్రాలు చేసి, టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో 'ఛలో' చిత్రంలో నటించి, గుర్తింపు పొందిన రష్మిక మందన్నా గీతగోవిందంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక పుష్ప చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయాన్ని సాధించింది. కట్ చేస్తే బాలీవుడ్లో పాగా వేసేసింది. అక్కడ తొలుత నటించిన రెండు చిత్రాలు పెద్దగా ఆడకపోయినా, మూడో చిత్రం 'యానిమల్' సంచలన విజయాన్ని సాధించింది. ఈ చిత్రంపై విమర్శలు వెల్లువెత్తినా, కలెక్షన్లు మాత్రం దుమ్మురేపాయి. దీంతో రష్మిక మందన్నా పాన్ ఇండియన్ నటిగా వీర లేవల్లో పాపులర్ అయింది. తాజాగా చావ అనే హిందీ చిత్రంలో నటిస్తున్న ఈమె ప్రస్తుతం తనకు అనూహ్య క్రేజ్ను తెచ్చి పెట్టిన పుష్ప చిత్ర సీక్వెల్ను పూర్తి చేసే పనిలో ఉంది. దీనితో పాటు రెయిన్బో అనే ద్విభాషా( తెలుగు, తమిళం) చిత్రం, ది గర్ల్ఫ్రెండ్ చిత్రాల్లో కూడా నటిస్తున్న రష్మిక మందన్నా ఇప్పుడు వర్కౌట్స్పై పూర్తిగా దృష్టి పెట్టిందట. అదేమిటీ ఇప్పటివరకూ వర్కౌట్స్ చేయడం లేదా? అని ఆశ్యర్యపోతున్నారా? నిజమే పని బిజీయో, లేక మరే కారణంగానో ఈ అమ్మడు గత ఆరేడు నెలలుగా వర్కౌట్స్ చేయడం లేదట. ఇక నుంచి వర్కౌట్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటానని చెప్పింది. దీని గురించి రష్మికనే తన ఎక్స్ మీడియాలో పేర్కొంది. అంతే కాదు ఇకపై కచ్చితంగా ప్రతి రోజు క్రమం తప్పకుండా వర్కౌట్స్ చేస్తానని చెప్పింది. ఈ సందర్భంగా తీవ్రంగా తను వర్కౌట్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
రష్మిక కసరత్తు మామూలుగా లేదుగా...! వీడియో వైరల్
టాలీవుడ్, బాలీవుడ్ అంతటా తన సత్తా చాటుకుంటున్న స్టార్ హీయిన్ రష్మిక మందన్న ఫిట్నెస్ కోసం తెగ కష్టపడుతోంది. మండు వేసవిలో జిమ్లో చెమటలు కక్కుతోంది. జిమ్లో కసరత్తు చేస్తున్న నెట్టింట్ హల్ చల్ చేస్తోంది. నేషనల్ క్రష్ వీడియో చేసి ఫ్యాన్స్ అంతా అబ్బురపడుతున్నారు. హీరోయిన్గా నిలదొక్కుకోవాలంటే... ఆ మాత్రం చేయాల్సిందే.. కీప్ గోయింగ్ అంటూ కమెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎపుడూ ఫ్యాన్స్కు దగ్గరగా ఉండే ఈ భామ తాజాగా వర్కౌట్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది.ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గతంలో జిమ్లో వర్కవుట్స్ చేస్తున్న వీడియోలనుచాలాపోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోయిన సమంత కూడా ఇలాంటి వీడియోలను గతం చాలా పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా గంటల తరబడి జిమ్ చేయడం, కష్టమైన వర్కవుట్స్ చేయడం ఆమెకి బాగా అలవాటు. ఆమె బాడీ చూస్తే ఈ విషయం ఇట్టే అర్థం అవుతుంది. కరియర్ పరంగా చూస్తే సూపర్, డూపర్ సినిమాలతో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంటోంది. ఇటీవల పుష్ప, యానిమల్ లాంటి సినిమాలతో అటు సౌత్, ఇటు నార్త్లోనూ బ్లాక్ బస్టర్ సినిమాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ కాంబోలో పుష్ప2లో మరోసారి తన హవా చాటుకునేందుకు సిద్దమవుతోంది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
పుష్ప సినిమా నుంచి రష్మిక వీడియో లీక్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- రష్మిక మందన్న కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప-2. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 2021లో విడుదలై పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్గా నిలిచిన ‘పుష్ప: ది రైజ్’ మూవీకి సీక్వెల్గా ‘పుష్ప: ది రూల్’ రూపొందుతోంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి రష్మిక లుక్ లీకైంది.. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని యాగంటి క్షేత్రంలో ‘పుష్ప: ది రూల్’ సినిమా షూటింగ్ సందడి నెలకొంది. అక్కడే ఈ ఫోటో లీక్ అయినట్లు తెలుస్తోంది. ఫోటోతో పాటు వీడియో కూడా లీక్ అయింది. ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ యాగంటి, వైజాగ్ తదితర ప్రాంతాల్లో జరుగుతోంది. యాగంటి క్షేత్రంలోని గుహలో కొలువైన శ్రీ వెంకటేశ్వరస్వామికి హీరోయిన్ రష్మిక మందన్నా బంగారు కిరీటాన్ని బహూకరించే సన్నివేశాలను తెరకెక్కించారు సుకుమార్. పుష్ప టీమ అక్కడకు వస్తుందని తెలియడంతో భారీగా ప్రజలు అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో కొందరు వీడియో తీయడంతో అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. Wooohoooooo Here is Srivalli's 1st look Now the excitement to watch this film has increased further. Teri Jhalak Asharfi @iamRashmika 🔥❤️#RashmikaMandanna ❤️pic.twitter.com/EsZEfMcXkS — Rashmika Delhi Fans (@Rashmikadelhifc) March 19, 2024 -
ఐపీఎల్ RCB ప్రోమోలో రష్మిక.. వీడియో వైరల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ప్రముఖ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సీజన్ 17కు ముందు కీలక నిర్ణయం తీసుకుంది. 2024 నుంచి ఆర్సీబీ ఫ్రాంచైజీ తమ జట్టు పేరులో చిన్న మార్పు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం RCB తమ జట్టు పేరును ఇంగ్లీషులో (Royal Challengers Bangalore) అని రాస్తోంది. ఇకపై (Royal Challengers Bengaluru) అని మార్చనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇదే విషయాన్ని చెబుతూ ఇప్పటికే పలు వీడియోలను RCB విడుదల చేసింది. తాజాగా రష్మిక మందన్న కూడా ఆర్సీబీ కోసం ఒక ప్రోమోను విడుదల చేసింది. అందులో రష్మిక మందన్న మేకప్ వ్యాన్ లోపలికి వెళ్తుంది. ఆ వ్యాన్ లోపల అద్దంపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని రాసి ఉంది. అది చూసిన రష్మిక రాయల్ ఛాలెంజర్స్ను మాత్రమే ఉంచి బెంగళూరు అనే పదాన్ని తుడిచిపెట్టేసింది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఇలాంటి వీడియో ఒకటి రిషబ్ శెట్టి కూడా గతంలో విడుదల చేశారు. 16 ఏళ్లుగా జట్టు పేరు మార్చాలని అక్కడి స్థానికులు ఆర్సీబీని కోరుతున్నారు. స్థానిక అభిమానుల కోరికమేరకు ఆర్సీబీ ఈ మార్పు చేస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి 19న చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఆర్సీబీ అన్బాక్స్ ఈవెంట్లో పేరు మార్పుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. మార్చి 22న CSK, RCB మధ్య జరిగే మ్యాచ్తో ఐపీఎల్-2024 సీజన్ ప్రారంభం కానుంది.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
16, 17 తేదీల్లో జూనియర్ ఇంటర్లో ప్రవేశానికి కౌన్సెలింగ్
రేపు బాస్కెట్బాల్ జిల్లా జట్ల ఎంపిక
వరంగల్ పార్లమెంట్ పరిధిలో 2009 నుంచి 2024 వరకు నమోదైన ఓట్లు, పోలింగ్ శాతం...
పథకాలు పారదర్శకంగా అందించాలి
No Headline
రైతులు ధైర్యంగా ఉండాలి
వరంగల్ స్ట్రాంగ్రూంకు ఈవీఎంలు
వాతావరణం
ఓటుకు దూరంగా..
రేవణ్ణ అరెస్ట్ వెనుక కుట్ర: కుమార
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
Advertisement