-
TTD: తిరుమలలో నేటి భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 8 కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 3 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(సోమవారం) 70,815 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 25,245 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.16 కోట్లుగా లెక్క తేలింది. -
Tirumala: సర్వదర్శనానికి 16 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 16 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(శనివారం) 76,945 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 33,844 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 2.67 కోట్లుగా లెక్క తేలింది. -
Tirumala: 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 31 కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 12 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(శుక్రవారం) 60,545 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 32,527 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 2.53 కోట్లుగా లెక్క తేలింది. -
May 10 Tirumala: తిరుమలలో నేటి రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 10 కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 4 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(గురువారం) 65,508 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 25,996 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 2.97 కోట్లుగా లెక్క తేలింది. -
Tirumala: తిరుమలకు పెరిగిన భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 26 కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. సర్వదర్శనానికి 12 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(గురువారం) స్వామివారిని 65,313 భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 28,780 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.54 కోట్లుగా లెక్క తేలింది. -
Tirumala: సర్వదర్శనానికి 18 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 30 కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని వెల్లడించింది. ఇక.. నిన్న(గురువారం) స్వామివారిని 65,992 భక్తులు దర్శించుకున్నారు. అందులో 25,698 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.53 కోట్లుగా లెక్క తేలింది. నిఘా వేశాం.. ఆందోళన వద్దు తిరుమలలో మరోసారి వన్యప్రాణుల సంచారం కలకలం రేగుతున్న వేళ అటవీశాఖ అధికారులు స్పందించారు. వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓ శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ.. "మార్చి 4 నుండి ఇప్పటి వరకు 5 సార్లు చిరుత సంచారం గుర్తించాము. 250 అధునాతన కెమెరాలను ఏర్పాటు చేసాం. 4g నెట్ వర్క్ కెమెరాల ద్వారా జంతువుల సంచారం వెంటనే అలర్ట్ చేస్తుంది. క్రూర మృగాల సంచారం, చిరుతలు సంచారం గుర్తించిన వెంటనే సిబ్బంది అలెర్ట్ చేస్తాం. టీటీడీ విజిలెన్స్, అటవీశాఖ, వైల్డ్ లైఫ్ సిబ్బంది నడకదారిలో భద్రత చర్యలు చేపడుతాము.. ఏడవ మైలు నుండి నరసింహ స్వామి ఆలయం వరకు భక్తులను గుంపులుగా పంపుతాము భయపడాల్సిన అవసలేదు అన్నారు. అలాగే.. ప్రభుత్వం నియమించిన జాయింట్ కమిటీ ఇప్పటికి మూడు మార్లు తిరుమలలో పర్యటించారు. ఏప్రిల్ మొదటి వారంలో జాతీయస్థాయి వైల్డ్ లైఫ్ కమిటీ సమావేశం అవుతుంది. నడకదారిలో తీసుకోవల్సిన చర్యలపై నివేదిక ఇవ్వనున్నారు.. భక్తులు అటవీ ప్రాంతంలో వెళ్ల రాదు, శేషాచల కొండల్లో నీటికి కొరత లేదు, ఏనుగులు ప్రతి సంవత్సరం ఒకచోట నుంచి మరో ప్రదేశానికి వెళ్తుంటాయి. అధునాతన థర్మల్ డ్రోన్ కెమరా రాత్రి సమయంలో కూడా జంతువుల సంచారం పై నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు". -
Tirumala: సర్వదర్శనానికి 12 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. సర్వదర్శనానికి 12 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(ఆదివారం) 80,532 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల్లో 29,438 తలనీలాలు సమర్పించారు. మొత్తంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.95 కోట్లుగా లెక్క తేలింది. -
Tirumala: సర్వదర్శనానికి 18 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 16 కంపార్ట్మెంట్లలో వేచివున్న భక్తులు. దర్శనానికి 18 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(శుక్రవారం) స్వామివారిని 69,874 భక్తులు దర్శించుకున్నారు. అందులో 26,034 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.39 కోట్లుగా లెక్క తేలింది. వచ్చే 22న అయోధ్య రామా మందిరం ప్రారంభం.. నేడు ప్రత్యేక ప్లైట్లో అయోధ్య చేరనున్న టీటీడీ శ్రీవారి లడ్డులు. దేశీయ ఆవునెయ్యిని వినియోగించి లక్ష లడ్డూలు తయారి. నిన్న రాత్రి తిరుమల నుండి బయలుదేరిన లడ్డులు. -
Tirumala: సర్వదర్శనానికి 18 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. సర్వదర్శనానికి 18 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 14 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 6 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(గురువారం) స్వామివారిని 62,649 భక్తులు దర్శించుకున్నారు. అందులో 24,384 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.74 కోట్లుగా లెక్క తేలింది. -
Tirumala: సర్వదర్శనానికి 16 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. సర్వదర్శనం కోసం 16 గంటల సమయం పడుతోంది. ఇక ఆదివారం 86,107 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల్లో 29,849 తలనీలాలు సమర్పించారు. మొత్తంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.31 కోట్లుగా లెక్క తేలింది. ఇక ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయం ముందు భోగి పండుగను వైభవంగా నిర్వహించారు. వేకువజామున ఆలయ మహద్వారం ముందు ఆలయ అధికారులు, సిబ్బంది భోగి మంటలు వేశారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తులు కూడా పాల్గొన్నారు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్తున్న భక్తులకు గమనిక. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం ఉదయానికి 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి ప్రత్యేక దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. వివరాల ప్రకారం.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనానికి 15 గంటల సమయంలో పడుతోంది. అలాగే, ప్రత్యేక దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. ఇక, నిన్న(మంగళవారం) శ్రీవారిని 78,726 మంది భక్తులు శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో శ్రీవారి హుండీకి రూ.3.94 కోట్ల ఆదాయం వచ్చింది. 26,436 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక, ఈనెల 21న గరుడపంచమి సందర్భంగా గరుడ వాహసనసేవ కార్యక్రమం నిర్వహించనుంది టీటీడీ. రాత్రి ఏడు గంటలకు గరుడ వాహనంపై మలయప్పస్వామి దర్శనం ఇవ్వనున్నారు. కాగా, తిరుమల వెళ్లే భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. ఆర్టీసీ ప్రయాణికుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం రూ.300 టికెట్ల కోటాను 1000కి పెంచారు. 300 కిలోమీటర్ల దూరానికి పైబడిన నగరాల నుంచి వచ్చే బస్సులకు 80 శాతం టికెట్లు కేటాయించగా, 300 కిలోమీటర్ల లోపు నగరాల నుంచి వచ్చే బస్సులకు 20 శాతం కేటాయించారు. శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను శాసన సభ్యులు ,టీటీడీ చైర్మన్ శ్రీభూమన కరుణాకర్ రెడ్డి మంగళవారం రాత్రి పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేసి పనుల వేగం పెంచాలని ఆదేశించారు. మేయర్ డాక్టర్ శిరీష కమిషనర్ శ్రీమతి హరిత శ్రీ కరుణాకర్ రెడ్డి వెంట ఉన్నారు pic.twitter.com/qxhml3olNk — MCT Mayor Dr Sireesha (@mayortpt) August 15, 2023 ప్రయాణంతోపాటు స్వామివారి దర్శనం టికెట్ను నెలరోజులు ముందుగానే బుక్ చేసుకోవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈనెల 15వ తేదీ నుంచి అక్టోబరు 7వ తేదీ వరకు ప్రయాణ టికెట్లతోపాటు దర్శన టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చని వివరించారు. తిరుమల వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నవారు అదనపు కోటా టికెట్లను www.apsrtconline.in వెబ్సైట్ ద్వారా పొందవచ్చని సూచించారు. ఇది కూడా చదవండి: సిగ్నల్ లేకపోయినా క్షణాల్లో సమాచారం -
వర్షాల ప్రభావం.. తిరుమలకు తగ్గిన భక్తుల రద్దీ
సాక్షి, తిరుమల: తెలుగు రాష్ట్రాల్లో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో తిరుమలలో భక్తుల రద్దీ కొంతమేరకు తగ్గింది. కొందరు భక్తులు తిరుమల ప్రయాణం వాయిదా వేసుకుంటుండగా, మరికొందరు వేర్వేరు కారణాలతో కొండపైకి రాలేకపోతున్నారు. దీంతో భక్తుల రద్దీ తగ్గింది. ముఖ్యంగా సర్వదర్శనం నిన్న కేవలం ఆరు గంటల్లోనే జరిగింది ఉదయం తిరుమలో ఆరు కంపార్ట్మెంట్లలో భక్తులు ఉన్నారు. సర్వదర్శానానికి కేవలం ఆరు గంటల సమయం పట్టింది. మధ్యాహ్నం తర్వాత రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఇక, నిన్న(మంగళవారం) తిరుమల శ్రీవారిని 73,137 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే, శ్రీవారికి 27,490 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక, నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.06 కోట్లుగా ఉంది. ఎలాంటి టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులు త్వరగా వేంకటేశ్వరుడి దర్శనం పూర్తి కావడంతో సంతోషం వ్యక్తం చేశారు. అయితే, భక్తులు ముందస్తుగా దర్శన టికెట్లు ఆన్ లైన్ లో చేసుకుని ఆ తర్వాతే కొండపైకి రావాలని, దళారులను నమ్మి మోసపోవద్దని టిటిడి అధికారులు సూచించారు. ముందస్తుగా బుక్ చేసుకోకపోతే.. కొండపై కష్టమవుతుందని, సర్వదర్శనం మినహా ఏ విధంగా దర్శించుకోలేరని స్పష్టం చేశారు. Tirumala Lucky Dip Sevas, Step by step booking process 1. Thomala Seva - https://t.co/CHlu8eXQv7 2. Suprabatham Seva - https://t.co/O9mRdclgYf 3. Archana Seva - https://t.co/h1bytNW6gz#tirupati #tirumala #thomala #archana #suprabatham #ttd #bangalore #chennai #pune pic.twitter.com/6WnmkBvIn8 — Tirupati Tirumala Info (@tirupati_info) July 18, 2023 ఇక సెప్టెంబర్ లో జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో మరమ్మతులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఆగస్టు నెల మొత్తం శ్రీవారి పుష్కరిణిని మూసివేయనున్నారు. శ్రీవారి పుష్కరిణికి మరమ్మతులు చేసి బ్రహ్మోత్సవాలకు సిద్ధం చేస్తారు. మరోవైపు తిరుపతి, తిరుమలలో వర్షం ఎడతెరిపి లేకుండా పడుతోంది. మధ్యమధ్యలో కొంత తెరిపినిచ్చినా.. వర్షం పూర్తిగా తగ్గడం లేదు. కొండ మీద ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయాయి. చలి పెరిగింది. సాధారణంగానే శ్రీ వేంకటేశ్వరుడి నివాసమైన తిరుమల గిరులపై చల్లగా ఉంటుంది. మారిన వాతావరణంతో మరింత చల్లగా మారింది. Today at Tirumala Temple in the early hours pic.twitter.com/T2FLwYdTTw — GoTirupati (@GoTirupati) July 26, 2023 ఇది కూడా చదవండి: ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.. -
తిరుపతిలో సర్వ దర్శనం టోకెన్ల జారీ పునఃప్రారంభం
తిరుపతి అలిపిరి: తిరుమల శ్రీవారి దర్శనానికి క్యూలైన్లలో నిరీక్షించే పరిస్థితి లేకుండా సర్వదర్శనానికి టైం స్లాట్ పద్ధతిని టీటీడీ అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలో గతేడాది ఏప్రిల్లో నిలిపివేసిన సర్వదర్శనం టైంస్లాట్ (ఉచిత దర్శనం) టోకెన్ల జారీని టీటీడీ పునఃప్రారంభించింది. దర్శనానికి వెళ్లేవారికి తిరుపతిలోనే సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తోంది. కోవిడ్ కారణంగా 2020లో శ్రీవారి దర్శనాలను టీటీడీ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత దర్శనాలను ప్రారంభించినా పరిస్థితులకు అనుగుణంగా కేవలం 40,000 మందికి మాత్రమే దర్శనాలు కల్పిస్తూ వచ్చిన టీటీడీ ఈ ఏడాది మార్చి నుంచి సడలింపులనిస్తూ సర్వదర్శనానికి అనుమతించింది. దీంతో వేలాదిగా ప్రతి రోజూ తిరుమలకు భక్తులు వస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అతికష్టం మీద రోజుకు 85,000 మందికి పైగా దర్శనం చేసుకుంటున్నారు. భక్తులకు టైంస్లాట్ టోకెన్లు తీసుకురావాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, బోర్డు సభ్యులు నిర్ణయం తీసుకోవడంతో మంగళవారం నుంచి ఈ ప్రక్రియ పునఃప్రారంభమైంది. తొలిరోజున 13,000 మందికి టోకెన్లను జారీ చేశారు. 3 కేంద్రాలు..30 కౌంటర్లు శ్రీవారి సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లను అందించేందుకు తిరుపతిలో మూడు చోట్ల కౌంటర్లను టీటీడీ ఏర్పాటు చేసింది. తిరుపతి అలిపిరి వద్దనున్న భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాల్లో 30 కౌంటర్లను ఏర్పాటు చేసింది. భక్తుల మధ్య తోపులాట లేకుండా ప్రత్యేక క్యూలైన్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఆధార్ కార్డుతో సంప్రదించిన భక్తులకు సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు. ఇందుకుగాను ఆధార్ జిరాక్స్ కాపీలను భక్తులు తమవెంట తీసుకురావాలి. టోకెన్ల జారీ ఇలా.. శ్రీవారి సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు అధిక రద్దీ, ముఖ్య రోజుల్లో జారీ చేసిన టోకెన్ల వివరాలను టీటీడీ ప్రకటించింది. శని, ఆది, సోమ, బుధవారాల్లో 25,000 టోకెన్లు, మంగళ, గురు, శుక్రవారాల్లో 15,000 మందికి టోకెన్లు జారీ చేస్తున్నారు. ఏ రోజు టోకెన్ తీసుకున్న భక్తులకు అదే రోజున దర్శనం కల్పిస్తారు. ఇప్పటి దాకా సర్వదర్శనం 40 గంటల వరకు సమయం పట్టేది. ఈ పద్ధతితో అత్యంత తక్కువ సమయంలోనే దర్శనం చేసుకొంటున్నామని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్ దొరకని భక్తులు నేరుగా తిరుమలకు చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా సర్వదర్శనానికి వెళ్లడానికి టీటీడీ అనుమతిస్తోంది. -
తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీ
తిరుపతి అలిపిరి/తిరుమల: టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, గోవిందరాజస్వామి సత్రాల వద్ద మంగళవారం నుంచి ప్రయోగాత్మకంగా సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్ల జారీ ప్రక్రియను పున:ప్రారంభించనున్నట్లు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఆయన జేఈవో వీరబ్రహ్మం, ఇతర అధికారులతో కలిసి సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ శని, ఆది, సోమవారాల్లో 25 వేల టోకెన్లు, మిగతా రోజుల్లో 15 వేలు చొప్పున టోకెన్లు జారీ చేస్తామని తెలిపారు. టోకెన్ లభించిన భక్తుడు అదేరోజు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. టోకెన్లు దొరకని భక్తులు నేరుగా తిరుమల చేరుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్–2 ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి ఏర్పాట్లు చేశామన్నారు. ఆధార్ నంబరు నమోదు చేసుకుని టోకెన్లు జారీ చేయడం వల్ల భక్తులు దర్శనం చేసుకున్నా, చేసుకోకపోయినా నెలకు ఒకసారి మాత్రమే టోకెన్ పొందే అవకాశం ఉంటుందన్నారు. తిరుమలలో వసతికి సంబంధించి ఒత్తిడి తగ్గించడం కోసం డిసెంబర్ ఒకటో తేదీ నుంచి శ్రీవాణి ట్రస్ట్ దాతలకు తిరుపతిలోని మాధవంలో ఆఫ్ లైన్ టికెట్లు జారీ చేస్తామని, అక్కడే గదులు కేటాయిస్తామని చెప్పారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కంపార్ట్మెంట్లు 31 నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 85,131 మంది స్వామి వారిని దర్శించుకోగా, 31,188 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు రూ.4.47 కోట్లు సమర్పించుకున్నారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. నేడు తిరుమలలో పుష్పయాగం తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం నిర్వహించనున్న పుష్పయాగానికి సోమవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. సోమవారం ఉదయం ఆలయంలో మూలవిరాట్ ఎదురుగా ఆచార్య రుత్విక్వరణం (అర్చకులకు విధుల కేటాయింపు) నిర్వహించారు. సాయంత్రం ఆరుగంటలకు శ్రీవారి సేనాధిపతి అయిన శ్రీవిష్వక్సేనులను ఆలయం నుంచి ఊరేగింపుగా వసంత మండపానికి తీసుకెళ్లారు. అక్కడ మృత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహించి తిరిగి శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది వరకు ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ చేశారు. టీటీడీ ఈవో ఎ.వి.ధర్మారెడ్డి, వీజివో బాలిరెడ్డి, పేష్కార్ శ్రీహరి పాల్గొన్నారు. నేడు స్నపన తిరుమంజనం పుష్పయాగం సందర్భంగా మంగళవారం ఉదయం తొమ్మిది నుంచి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి ఉత్సవర్లకు సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపంలో స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తర్వాత ఉభయ దేవేరులతో కలిసి మలయప్పస్వామి మాడవీధుల్లో దర్శనమిస్తారు. పుష్పయాగం కారణంగా మంగళవారం పలు సేవలు రద్దుచేసింది. -
Srisailam Temple: శ్రీశైలంలో సామాన్య భక్తులకు పెద్దపీట
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సాధారణ రోజుల్లో సగటున 20 వేల నుంచి 25 వేల మంది, ప్రభుత్వ సెలవు రోజుల్లో 40 వేల నుంచి 50వేల మంది భక్తులు క్షేత్రాన్ని దర్శిస్తున్నారు. శ్రావణమాసం, కార్తీకమాసం తదితర పర్వదినాల్లో 70 వేల నుంచి 80 వేల దాకా భక్తులు వస్తుంటారు. వీరు సర్వదర్శనం క్యూలలో వెళ్లి మల్లన్నను దర్శించుకుంటారు. దర్శన సమయంలో వీఐపీలు వస్తే సర్వదర్శన క్యూలలోని సామాన్య భక్తులు కొద్దిసేపు ఆగాలి. ఈ సమస్యను పరిష్కరించేందుకు దేవస్థానం నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. సర్వదర్శనం భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వారు సులభంగా స్వామిని దర్శించుకునేలా వీఐపీ ప్రోటోకాల్ దర్శన విధానంలో మార్పులు చేసింది. దీనిని ఈనెల 5 నుంచి దేవస్థానం అమల్లోకి తీసుకొచ్చింది. రోజుకు రెండు సార్లు మాత్రమే దేవస్థానం ప్రవేశపెట్టిన నూతన విధానంలో రోజుకు రెండు సార్లు అది కూడా నిర్దిష్ట సమయాల్లో మాత్రమే ప్రముఖులకు భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనం కల్పిస్తారు. ప్రతిరోజు ఉదయం 5.30 నుంచి 6.15 గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి 7.30 గంటల వరకు ప్రముఖులకు విరామ దర్శనాన్ని, అభిషేకం, కుంకుమార్చన జరిపిస్తారు. ఆలయానికి వచ్చే ప్రముఖులు తమ పర్యటన వివరాలను కనీసం రెండు రోజులు ముందుగానే తెలియజేయాలనే నిబంధన పెట్టారు. సిఫారసు లేఖల విధానంలో మార్పులు ప్రముఖులు వసతి, దర్శనం, ఆర్జితసేవలను ఇతరులకు సిఫారసు చేసేందుకు ఎస్ఎంఎస్, వాట్సాప్ విధానాన్ని వినియోగించేవారు. దీనిని రద్దు చేసి విధిగా లెటర్హెడ్ పై కనీసం రెండు రోజులు ముందుగా దేవస్థానానికి సమాచారం ఇవ్వాలని నిబంధన పెట్టారు. అలాగే సిఫారసు లేఖపై స్పష్టంగా వసతి కావాల్సిన తేదీలు, దర్శనం, ఆర్జితసేవల వివరాలను, దర్శనానికి వచ్చే భక్తుల ఆధార్, ఫోన్ నెంబర్లను తప్పనిసరిగా పొందుపర్చాలి. యథావిధిగా స్పర్శ దర్శన వేళలు ప్రస్తుతం అమలులో ఉన్న స్పర్శ దర్శన సమయాలు యథావిధిగా కొనసాగుతాయి. ఉదయం 7 గంటల నుంచి 8.15 గంటల వరకు, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.15 గంటల వరకు, రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు స్పర్శదర్శనం కల్పిస్తారు. అలాగే ప్రతి మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు భక్తులకు ఉచిత స్పర్శదర్శనం కొనసాగుతోంది. సామాన్య భక్తుల కోసమే మార్పులు సామాన్య భక్తులకు శ్రీస్వామి అమ్మవార్ల దర్శనాన్ని మరింత సౌకర్యవంతంగా కల్పించేందుకు ప్రోటోకాల్ దర్శనంలో మార్పులు చేశాం. దేవస్థాన ఆగమ కమిటీ, దేవస్థానం ధర్మకర్తల మండలి సూచనల మేరకు ఈ మార్పులు చేశాం. ఈ కొత్త విధానంలో రోజుకు రెండు సార్లు మాత్రమే ప్రముఖులకు స్వామి అమ్మవార్ల దర్శనం, ఆర్జిత సేవలను కల్పిస్తున్నాం. అలాగే ప్రముఖుల సిఫారసు లేఖల విషయంలో కూడా కొన్ని మార్పులు చేశాం. ఈ నూతన విధానం ఇటీవలే అమల్లోకి తీసుకొచ్చాం. – ఎస్.లవన్న, శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి -
సర్వదర్శనం భక్తులకు అధిక ప్రాధాన్యత
తిరుమల: కలియుగ వైకుంఠంలో టీటీడీ ఇప్పటికే బ్రేక్ దర్శనాలు రద్దుచేసి సర్వదర్శనం భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తోంది. కరోనాకు ముందు తిరుమలలో ఉన్న పరిస్థితులు రెండేళ్ల తరువాత కనిపిస్తున్నాయి. వారాంతాలను తలపించేలా సాధారణ రోజుల్లోనూ భక్తుల రద్దీ నెలకొంది. తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని బుధవారం అర్ధరాత్రి వరకు 88,748 మంది దర్శించుకున్నారు. ఇందులో సర్వదర్శన క్యూలైన్ల ద్వారా 46,400 మంది, రూ.300 ప్రత్యేక దర్శనం క్యూలైన్ ద్వారా 25,819 మంది, వర్చువల్ సేవా టికెట్లు, సేవా టికెట్లు, టూరిజం శాఖ కేటాయింపు ద్వారా 16,529 మందికి శ్రీవారి దర్శన భాగ్యం లభించింది. కరోనా అనంతరం భక్తుల సంఖ్య 88 వేలు దాటడం ఇదే ప్రథమం. స్వామికి బుధవారం అర్ధరాత్రి వరకు 38,558 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి హుండీ ద్వారా కానుకల రూపంలో రూ.4.82 కోట్లు లభించాయి. గురువారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి అర్ధరాత్రి వరకు క్యూ లైన్లను పర్యవేక్షించి తిరిగి గురువారం ఉదయం కూడా తనిఖీలు చేశారు. భక్తులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. క్యూలైన్లో నిరంతరాయంగా అల్పాహారం, పానీయాలు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. సులభంగా సర్వదర్శనం సర్వదర్శనం కోసం కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు సులభతరంగా దర్శనం కల్పించేందుకు టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఒక క్యూలైన్లో రూ.300 ప్రత్యేక దర్శనం పంపిస్తూ, మరో క్యూలైన్లో సర్వదర్శనం భక్తులను అనుమతిస్తున్నారు. ఎక్కువసేపు క్యూ కంపార్ట్మెంట్లలో ఉంచకుండా 3 గంటల్లో దర్శనమయ్యేలా చర్యలు చేపట్టారు. బుధవారం అర్ధరాత్రి నుంచి వేగవంతంగా స్వామిదర్శనం లభిస్తోంది. 1,12,529 మందికి శ్రీవారి అన్న ప్రసాదం తిరుమలలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా శ్రీవారి భక్తులకు ఎలాంటిలోటు లేకుండా టీటీడీ అన్న ప్రసాదం అందిస్తోంది. వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, సీఆర్వో కార్యాలయం, రాంభగీచ, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లలో మొత్తం 1,12,529 మంది భక్తులకు అన్నప్రసాదాలు, అల్పాహారాలు, పానీయాలు అందజేశారు. -
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త
-
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త..
సాక్షి, తిరుమల: శ్రీవారి భక్తులకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుభవార్త చెప్పారు. త్వరలో స్వామివారి దర్శనానికి ఎక్కువ మంది భక్తులను అనుమతించనున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ మేరకు వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘భారీ వర్షాల కారణంగా నడకదారి భక్తులు ఇబ్బంది పడ్డారు. కరోనా తగ్గుముఖం పడుతోంది. అధికారులతో చర్చించి భక్తుల సంఖ్య పెంపుపై నిర్ణయం తీసుకుంటాం. సర్వదర్శనం టోకెన్లు ఆన్లైన్ లోనా.. లేదా ఆఫ్ లైనా అనేది త్వరలో నిర్ణయం తీసుకుంటామ’ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. చదవండి: (Andhra Pradesh: రాష్ట్ర ప్రయోజనాలే అజెండా) -
TTD: నాలుగున్నర గంటల్లోనే 7.08 లక్షల టికెట్లు ఖాళీ
తిరుమల: శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం నవంబర్, డిసెంబర్ నెలల టికెట్లను టీటీడీ ఆన్లైన్లో శుక్రవారం ఉదయం 9 గంటలకు విడుదల చేసింది. గత నెలలో రోజుకు 8 వేల ఎస్ఈడీ టికెట్లు జారీ చేయగా ప్రస్తుతం రోజుకు 12 వేల చొప్పున రెండు నెలలకు 7 లక్షల 8 వేల టికెట్లను విడుదల చేయగా మధ్యాహ్నం 1:30 గంటలకల్లా భక్తులు వీటిని కొనుగోలు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు భారీగా శ్రీవారి ఎస్ఈడీ టికెట్ల కోసం ఆన్లైన్లో ప్రయత్నించడంతో రికార్డు సమయంలో టికెట్లన్నీ ఖాళీ అయ్యాయి. పరిమిత సంఖ్యలోనే టికెట్లు జారీ చేస్తుండడంతో చాలా మంది భక్తులకు టికెట్లు లభించలేదు. టీటీడీ ఐటీ విభాగం, టీసీఎల్, జియో సంస్థ క్లౌడ్ మేనేజ్మెంట్ విధానం సాయంతో భక్తులు సులభంగా ఆన్లైన్లో టికెట్లను పొందారు. వెబ్సైట్లోకి ప్రవేశించేందుకు వర్చువల్ క్యూ ద్వారా ముందుగా వెబ్సైట్లో లాగిన్ అయ్యేందుకు సమయాన్ని కేటాయించారు. అనంతరం భక్తులు వర్చువల్ క్యూ పద్ధతి ద్వారా వెబ్సైట్లోకి ప్రవేశించి టికెట్లను బుక్ చేసుకున్నారు. దీంతో సర్వర్ల క్రాష్ సమస్య లేకుండా భక్తులు టికెట్లను పొందగలిగారు. టీటీడీకి రూ.21 కోట్ల ఆదాయం ఒకానొక దశలో దర్శన టికెట్ల కోసం ఒక్కసారిగా వెబ్సైట్లో ఏడు లక్షల హిట్లు వచ్చాయి. కేవలం మొదటి 24 నిమిషాల్లోనే రెండు లక్షల టికెట్లను భక్తులు కొనుగోలు చేశారు. 45 నిమిషాల వ్యవధిలో 3.35 లక్షల టికెట్లు, గంటలో 4 లక్షల 20 వేల టికెట్లు భక్తులు కొనుగోలు చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు 6 లక్షల 50 వేల టికెట్లు, 1.30 గంటలకు నవంబర్, డిసెంబర్కు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లన్నీ ఖాళీ అయ్యాయి. టికెట్ల విక్రయం ద్వారా టీటీడీకి దాదాపు రూ.21 కోట్ల ఆదాయం లభించింది. భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చే సమయంలో టీకా ఒక డోసు, రెండు డోసుల సర్టిఫికెట్, 12 గంటల ముందు కోవిడ్ పరీక్ష చేయించుకుని నెగిటివ్ రిపోర్టుతో గానీ శ్రీవారి దర్శనానికి రావచ్చు. శనివారం ఉదయం 9 గంటలకు నవంబర్కు సంబంధించిన శ్రీవారి సర్వదర్శనం టికెట్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. -
TTD: 25 నుంచి ఆన్లైన్లో శ్రీవారి సర్వ దర్శన టికెట్లు
-
సర్వదర్శనానికి బ్రేక్
చిత్తూరు , తిరుమల: తిరుమలలో సామాన్య భక్తుల అవస్థలు అధికారులకు పట్టడం లేదు. వీఐపీల సేవకే ప్రాధాన్యతనిస్తున్నారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న రోజుల్లో కూడా బ్రేక్ దర్శన సమయాన్ని కుదించడం లేదు. ఫలితంగా గంటల తరబడి సామాన్యులు సర్వదర్శనంలో నరకం చూస్తున్నా రు. పెరటాసి మాసాన్ని తమిళనాడులో పవిత్రం గా భావిస్తారు. ఈనెలంతా ఆ రాష్ట్రానికిచెందిన భక్తుల తాకిడి తిరుమలకు ఎక్కువగానే ఉంటుంది. ఏటా ఎదురవుతున్న అనుభవమే ఇది. తమిళనాడు నుంచి అధిక సంఖ్యలో భక్తులు వందల కిలోమీటర్లు కాలినడకన తిరుమలకు చేరుకుంటారు. మరోపక్క మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా ఎక్కువగానే వస్తున్నారు. వేసవి సెలవుల తరహాలో ఇప్పుడు రద్దీ కనిపిస్తోంది. రోజుకు 80 వేల నుంచి లక్ష మంది వరకు వస్తున్నారని అంచనా.. భక్తులతో క్యూలు నిండిపోతున్నాయి. ఎటుచూసినా భక్త జనసందోహంగా మారింది తిరుమల. భక్తుల సంఖ్య పెరిగినప్పుడు ఇందుకు అనుగుణంగా త్వరితగతిన దర్శన ఏర్పాటు చేయాల్సిన బాధ్యత టీటీడీ అధికారులపై ఉంది. కానీ వీరికివేమీ పట్టడం లేదు. 3 కిలోమీటర్ల మేర వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి క్యూ బయటకు భక్తుల వేచి ఉన్నా స్పందిం చడం లేదు. సర్వదర్శనానికి క్యూలో 15 గంటలు వేచి ఉండాల్సి వస్తోంది. సామాన్య భక్తులకు ఇచ్చే దివ్యదర్శనం, టైం స్లాట్ సర్వదర్శనం టిక్కెట్లను నిలిపివేయడంపై ఉన్న శ్రద్ధ వీఐపీ బ్రేక్ను నియంత్రించడంలో లేదని భక్తుల వేదన. రోజూ తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటలు దాటేవరకూ బ్రేక్ దర్శనం కొనసాగుతూనే ఉంది. ప్రొటోకాల్ వీఐపీల మాటెలా ఉన్నా కనీసం సిఫారసు లేఖలైనా కుదించడం లేదనే ఆరోపణలున్నాయి. వయోవృద్ధులు, చంటి బిడ్డల తల్లులు క్యూలో వేచి ఉండలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వల్ప తోపులాటలు కూడా జరుతున్నాయి. వీఐపీ సేవలకు టీటీడీ పరిమితం వీఐపీల ఒత్తిళ్లకు లోబడి రోజుకు 3 వేల నుంచి 4 వేల లోపు టిక్కెట్లను జారీ చేస్తున్నారు టీటీడీ అధికారులు. తమకు సంబంధించిన వారు వచ్చినా సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి మరీ టిక్కెట్లను పొందుతున్నారు. శని, ఆది వారాలలో కూడా వీఐపీ బ్రేక్ దర్శనాన్ని నియంత్రించలేకపోతున్నారు. వారానికి ఒకటి లేదా రెండు సిపారసు లేఖలను అనుమతించాల్సిన అధికారులు రోజూ అనుమతిస్తున్నారు. బోర్డు చైర్మన్, సభ్యులకు కోటాలో వందల టిక్కెట్లు, ప్రజాప్రతినిధులకు రోజుకు రెండు లేఖలపై టికెట్లను ఇస్తున్నారు. ఇతర అధికారులకు మరికొన్ని ఇవ్వడంతో వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఫలితంగా సమయం కాస్తా వారికే సరిపోతోంది. సామాన్య భక్తుల దర్శన సమయం కుదించి మరీ బ్రేక్ దర్శనాలు కొనసాగుతున్నాయి. 3,500 వీఐపీ టికెట్లను జారీ చేస్తే 3 నుంచి 4 గంటల వరకు దర్శన సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. 4 గంటల వ్యవధిలో 3 వేల నుంచి 4 మంది వీఐపీలు దర్శించుకొనే సమయంలో సామాన్య భక్తులు 15 వేల మందికి పైగా దర్శించుకుంటారు. ఇప్పటికైనా రద్దీ రోజులను దృష్టిలో పెట్టుకుని బ్రేక్ దర్శనాలను నియంత్రించి సర్వదర్శనం వేళ ఎక్కువగా ఉండాలని సామాన్య భక్తులు కోరుతున్నారు. -
శ్రీవారి దర్శనానికి 30 గంటలు
సెలవుల నేపథ్యంలో తిరుమల శనివారం భక్తజన సందోహమైంది. సర్వదర్శనం, కాలిబాట క్యూల్లో అన్నిచోట్లా కిక్కిరిసిన జనం కనిపించారు. క్యూల్లో చంటిబిడ్డలు, చిన్నారులు, వృద్ధులు నలిగిపోయారు. చిన్నారుల రోదనలు మిన్నంటాయి. సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 55,857 మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు నిండి, వెలుపల కిలోమీటరు వరకు క్యూకట్టిన భక్తులకు దర్శన సమయం 30 గంటలు పడుతోంది. శనివారం కావడంతో అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో కాలినడకన అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు 13 కంపార్ట్మెంట్లలో నిండడంతో పాటు వెలుపల కిలోమీటరు దూరం వరకు క్యూ కట్టారు. వీరికి 18 గంటల తర్వాత స్వామి దర్శనం లభించనుంది. గదుల కోసం పద్మావతి, సీఆర్వో, ఎంబీసీ-34 రిసెప్షన్ కేంద్రాల వద్ద భక్తులు పడిగాపులు కాచారు. తలనీలాలు సమర్పించేందుకు కల్యాణకట్టల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. రద్దీ పెరగడంతో ముందుజాగ్రత్తగా టీటీడీ అన్ని రకాల బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. రాజ్యాంగ హోదా కలిగిన వ్యక్తులకు పరిమిత సంఖ్యలో మాత్రమే టికెట్లు కేటాయించారు. కాగా, ఈనెల 26వ తేదీ సోమవారం తిరుమలలో శ్రీవారి రథసప్తమి మహోత్సవం నిర్వహించనున్నారు. ఒకరోజు బ్రహ్మోత్సవంగా ప్రసిద్ధి పొందిన రథసప్తమి పర్వదినాన ఏడు వాహన సేవల్లో స్వామిని దర్శించి తరించే అవకాశం ఉంది. - సాక్షి, తిరుమల
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!
మందు తాగినా లివర్ సేఫ్.. సరికొత్త జెల్ కనిపెట్టిన సైంటిస్టులు
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
ఆసీస్, పాక్ కాదు.. ఆ రెండు జట్లు మధ్యే వరల్డ్కప్ ఫైనల్
తిహార్ జైలుకు బాంబు బెదిరింపు..
Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR
ప్రధాని మోదీపై పిటిషన్... తిరస్కరించిన సుప్రీంకోర్టు
తప్పక చదవండి
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- హోర్డింగ్ కూలి 14 మంది మృతి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైళ్లు.. నేడు అదనపు ట్రిప్పులు
- మీ పిల్లలను సరైన క్రమంలో తీర్చిదిద్దాలంటే ఇలా చేయండి!
- తెలుగు సినిమాతో పరిచయమైన హీరోయిన్.. గుర్తుపట్టారా?
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- ‘గాజాపై అణు బాంబు వేయనివ్వండి’
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
Advertisement