-
‘ టిల్లు స్క్వేర్’ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
వారిద్దర్నీ చూస్తుంటే గర్వంగా ఉంది: ఎన్టీఆర్
‘‘విశ్వక్ సేన్కి, సిద్ధుకి చాలాసార్లు చెప్పాను. మీపై నమ్మకం ఉంది.. ఇండస్ట్రీ ముందుకు వెళ్లడానికి చాలా సాయపడతారు, కష్టపడతారు అని. ఈ రోజు వారిద్దర్నీ చూస్తుంటే చాలా గర్వంగా, ఆనందంగా ఉంది. కొత్త ఆలోచనలను ముందుకు తీసుకెళ్లటానికి చిత్ర పరిశ్రమకి ఇలాంటి డేర్ డెవిల్స్ కావాలి’’ అని హీరో ఎన్టీఆర్ అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం మార్చి 29న విడుదలైంది. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన ‘డబుల్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ఆఫ్ టిల్లు స్క్వేర్’ వేడుకకి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘నవ్వించడం ఓ వరం. నవ్వకపోవడం అనేది శాపం. నేను నవ్వడం మొదలుపెడితే ఆపుకోవడం కష్టం. అలాంటిది నేను ఇక నవ్వలేను బాబోయ్ అనేలా ‘టిల్లు స్క్వేర్’తో నవ్వించాడు సిద్ధు.. చాలామందిని నవ్వించాడు. మల్లిక్ రామ్గారు ‘టిల్లు స్క్వేర్’ని అద్భుతంగా తీశారు. అనుపమ, నేహాశెట్టి లేకపోతే ఈ సినిమా ఇంత హిట్టయ్యేది కాదు. ఇక ‘దేవర’ సినిమా రిలీజ్ లేట్ అయినా సరే.. రేపు మీరందరూ (ఫ్యాన్స్) కాలర్ ఎగరేసుకునేలా ఆ చిత్రాన్ని అందించటానికి ప్రయత్నిస్తాం’’ అన్నారు. డైరెక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘టిల్లు స్క్వేర్’ వంద కోట్లు చేసింది. ‘దేవర’తో ఎన్టీఆర్ వెయ్యి కోట్ల వసూళ్లు సాధించాలి’’ అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ–‘‘త్రివిక్రమ్గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ సినిమాలకి నీకు ఏవైనా అవార్డులు వచ్చాయా? అని నన్ను చాలామంది అడిగారు. వారందరికీ ఎన్టీఆర్ అన్న నా గురించి మాట్లాడిన వీడియో చూపించి.. ఇంతకంటే పెద్ద అవార్డు ఏదైనా ఉందా? అన్నాను’’ అన్నారు. ‘‘అందరి కృషి వల్లే ఈ సినిమా బ్లాక్బస్టర్ అయ్యింది’’ అన్నారు మల్లిక్ రామ్. -
Om Bheem Bush Movie: ఓం భీమ్ బుష్ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
కడుపుబ్బా నవ్వుకునే మూవీ, చివరి 20 నిమిషాలైతే..
హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఓం భీమ్ బుష్. 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. యువి క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి నిర్మించారు. మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ హిట్ అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు మారుతి ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్ దిల్ రాజు మాట్లాడుతూ.. నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్.. ఈ ట్యాగ్ లైన్ పెట్టాలంటే ధైర్యం వుండాలి. థియేటర్కు వెళితే నవ్వుకుని వస్తున్నామని ప్రేక్షకులే చెబుతున్నారు. మంచి ఎంటర్టైనర్ మూవీ ఈ సమ్మర్కు వచ్చింది. అందరూ థియేటర్కు వెళ్లి ఎంజాయ్ చేయండి' అన్నారు. డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ... 'ఓం భీమ్ బుష్' ప్రీమియర్ చూశాను. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఈ ముగ్గురి కాంబినేషన్ను కలపడమే ఈ విజయం. ప్రేక్షకులని తప్పకుండా అలరించాలనే టెన్షన్ ఆ ముగ్గురిలో గమనించాను. దర్శకుడు అద్భుతంగా కథ రాసుకుంటే.. ఈ ముగ్గురు ఇంకా అద్భుతంగా నటించారు. మీరు ఇచ్చే డబ్బులకి వందశాతం న్యాయం చేస్తుంది' అన్నారు. కష్టే ఫలి హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. ఈ సినిమా చాలా రోజులు ఆడుతుందని మా అందరి గట్టి నమ్మకం. థియేటర్స్ లో విజల్స్ పడుతున్నాయి. ముఖ్యంగా చివరి ఇరవై నిమిషాలకు మహిళా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది అన్నారు. రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ.. కష్టే ఫలి అంటారు. మా దర్శకుడు మమ్మల్ని కష్టపెట్టి ఫలితాన్ని పొందాడు. (నవ్వుతూ) కష్టం పడటంలో కూడా ఓ ఆనందంగా వుంటుంది. తెరపై మమ్మల్ని మేము చుసుకున్నపుడు మిగతావారు అనందంగా నవ్వడం చూసి మేము ఆనంద పడుతున్నాం'' అన్నారు. దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి మాట్లాడుతూ... ప్రేక్షకులు సినిమా చూసి పగలబడి నవ్వుతున్నారు. వారి నవ్వులు చూసిన తర్వాత మేము రెండేళ్ళు పడిన కష్టం మర్చిపోయామని చెప్పారు. చదవండి: నటిని నానామాటలన్న అత్త.. ఇప్పుడేమో తెగ పొగిడేస్తోంది! -
లంబసింగి మూవీ సక్సెస్ మీట్ (ఫోటోలు)
-
Premalu Movie: ‘ప్రేమలు’ సినిమా సక్సెస్మీట్ (ఫొటోలు)
-
కాళికాదేవి ఎపిసోడ్లో నన్ను నేను నమ్మలేకపోయాను: రవితేజ
రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘ఈగల్’. ఇందులో కావ్యా థాపర్, అనుపమా పరమేశ్వరన్స్ హీరోయిన్లు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదలైంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా సక్సెస్మీట్లో రవితేజ మాట్లాడుతూ– ‘‘ఈగల్’కు ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన సంతోషాన్నిస్తోంది. కార్తీక్ ‘ఈగల్’ కథ చెప్పినప్పుడే సహదేవ వర్మ పాత్రకు ఎగ్జైట్ అయ్యాను. నా పాత్ర మేకోవర్కు మంచి ప్రశంసలు వస్తున్నాయి. సినిమాలోని కాళికాదేవి ఎపిసోడ్లో నన్ను నేను నమ్మలేకపోయాను. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి అభినందనలు. హరీష్ శంకర్తో చేస్తున్న ‘మిస్టర్ బచ్చన్స్ ’ సినిమాతో ఈ బ్యానర్లో హాట్రిక్ కొడుతున్నాం. కార్తీక్, కావ్యా థాపర్లకు మంచి భవిష్యత్ ఉంది’’ అన్నారు. ‘‘యాక్షన్స్ సినిమా తీయాలనే నా ఆశ రవితేజగారి ‘ఈగల్’తో నెరవేరింది’’ అన్నారు కార్తీక్. ‘‘రవితేజగారితో ‘ధమాకా’లాంటి బ్లాక్బస్టర్ ఇచ్చి, ఇప్పుడు ‘ఈగల్’తో ఈ బ్లాక్బస్టర్ను కొన సాగించాం’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్. దర్శకుడు హరీష్శంకర్, ‘ఈగల్’ యూనిట్ సభ్యులు ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. -
ఈమాట చెప్పగానే అమల, చైతన్య ఆశ్యర్యపోయారు: నాగార్జున
‘‘సెప్టెంబరు 20న నాన్నగారి(అక్కినేని నాగేశ్వరరావు) బర్త్ డే. ఆ రోజు విగ్రహావిష్కరణ పూర్తికాగానే ‘నా సామిరంగ’ షూటింగ్కు బయలుదేరాను. ‘ఎందుకంత తొందర.. ఇంకాస్త సేపు ఉండొచ్చుగా’ అని అమల నాతో అన్నారు. సంక్రాంతికి రిలీజ్ చేయాలని నేను చెప్పగానే పిల్లలతో సహా అందరూ ఆశ్చర్యపోయారు. నేను సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తానన్న నమ్మకాలు బయట ఎవరికీ లేవు. నా టీమ్ ముఖాల్లో మాత్రం ఆ నమ్మకం ఉంది. సినిమాను రిలీజ్ చేశాం. కీరవాణిగారు బాగా సపోర్ట్ చేశారు. మా టీమ్ అందర్నీ చాలా మిస్ అవుతున్నాను’’ అని నాగార్జున అన్నారు. ఆయన హీరోగా, ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, మిర్నామీనన్ , రుక్సార్ థిల్లాన్ , షబ్బీర్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘నా సామిరంగ’. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలైంది. ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోందని చిత్రయూనిట్ చెబుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఆదివారం జరిగిన ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్లో నాగార్జున మాట్లాడుతూ– ‘‘మాపై అపరిమితమైన ప్రేమను చూపిస్తున్న అక్కినేని ఫ్యాన్స్కు ముందుగా థ్యాంక్స్. సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా ఎప్పుడూ ఒకేలా ఉంటారు. నేను కనపడగానే నవ్వుతూనే ఉంటారు. ఆ నవ్వే నాకు చాలా ధైర్యం. అలాగే తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్. సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నామని, కాస్త ఆలస్యంగా మేం చెప్పినప్పటికీ సహకరించిన డిస్ట్రిబ్యూటర్స్కు థ్యాంక్స్. నెక్ట్స్ సంక్రాంతికి కలుద్దాం’’ అన్నారు. ‘‘నాగార్జునగారితో సినిమా చేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. కీరవాణి, చంద్ర బోస్గార్లు ఇలానే కలిసి ఉంటూ ఇంకా మంచి మ్యూజిక్ ఇవ్వాలి’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్. ‘‘ఓ సినిమా విడుదలై, సక్సెస్ సాధించి, సెలబ్రేషన్స్ షీల్డ్స్ అందుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఇలా నా తొలి సినిమాకే జరగడం నా అదృష్టం’’ అన్నారు విజయ్ బిన్నీ. ‘‘నవరస భరితమైన సినిమాగా ‘నా సామిరంగ’ నిలిచింది’’ అన్నారు సంగీత దర్శకుడు కీరవాణి. ఈ సక్సెస్మీట్లో పాటల రచయిత చంద్రబోస్ మాట్లాడారు. ఈ కార్య క్రమంలో నాగార్జున, కీరవాణి చేతుల మీదుగా డిస్ట్రిబ్యూటర్స్, చిత్రబృందం షీల్డ్స్ అందుకున్నారు. -
ప్లాంట్–మ్యాన్ని ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్
‘‘డైరెక్టర్గా ‘కాలింగ్ బెల్, రాక్షసి’ వంటి సినిమాలు తీశాను. నిర్మాతగా నేను చేసిన మొదటి సినిమా ‘ప్లాంట్–మ్యాన్’. మా చిత్రాన్ని ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇలాంటి స్పందన వస్తే ఏడాదికి రెండు చిన్న సినిమాలు చేసి కొత్త వారిని పరిచయం చేయాలని ఉంది’’ అని నిర్మాత పన్నారాయల్ అన్నారు. చంద్రశేఖర్, సోనాలి జంటగా కె.సంతోష్బాబు దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్లాంట్–మ్యాన్’. డీఎం యూనివర్సల్ స్టూడియోస్పై పన్నారాయల్ నిర్మించిన చిత్రం ‘ప్లాంట్–మ్యాన్’. ఇటీవల విడుదలైన ఈ సినిమా థ్యాంక్స్ మీట్లో కె.సంతోష్బాబు మాట్లాడుతూ–‘‘మా ‘ప్లాంట్–మ్యాన్’ సినిమాకి ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారం వల్లే ఇంత మంచి సినిమా చేయగలిగాను’’ అన్నారు. ‘‘మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. నాకు హీరోగా అవకాశం ఇచ్చిన పన్నాగారికి కృతజ్ఞతలు’’ అన్నారు చంద్రశేఖర్. ‘‘ఇలాంటి ఒక మంచి సినిమాలో భాగమైనందుకు సంతోషం’’ అన్నారు సోనాలి. -
‘హాయ్ నాన్న’ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
'కోటబొమ్మాళి పీఎస్' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
‘మంగళవారం’ మూవీలో మాస్క్లో ఉంది ఎవరో తెలుసా...(ఫొటోలు)
-
మంగళవారం మూవీ సక్సెస్ మీట్.. పాయల్ రాజ్పుత్ సందడి (ఫోటోలు)
-
Bhagavanth Kesari Movie Success Meet: ‘భగవంత్ కేసరి’ విజయోత్సవ వేడుక (ఫొటోలు)
-
Leo Success Meet: విజయ్ ‘లియో’ మూవీ విజయోత్సవ వేడుక (ఫొటోలు)
-
లక్ష్యంతో సాగితే విజయం తథ్యం
సాక్షి, హైదరాబాద్: ప్రతి వ్యక్తీ లక్ష్యాన్ని నిర్దేశించుకొని కష్టపడితే విజయం తప్పకుండా వరిస్తుందని మంత్రి కె.తారక రామారావు అన్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ మన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అని వివరించారు. కేసీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక సింగిల్ విండో ఎన్నికల్లో నిరుత్సాహపడినా ఆ తర్వాత పట్టుదలతో కష్టపడ్డారన్నారు. తెలంగాణ లక్ష్యసాధనలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా తట్టుకొని నిలబడ్డారని.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదని చెప్పారు. గురువారం ఓ హోటల్లో ఎస్టీ ఆంట్రప్రెన్యూర్స్ సక్సెస్ మీట్లో మంత్రి సత్యవతి రాథోడ్తో కలసి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన యువత ఉన్నత శిఖరాలకు ఎదగాలని కలలు కనాలని, అలాంటి వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. గిరిజన పారిశ్రామికవేత్తలను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీ పథకాలతో గిరిజన యువత అత్యున్నత స్థాయికి ఎదుగుతున్నారని పేర్కొన్నారు. ఏ కులంలో పుట్టామనేది ముఖ్యం కాదని, అవకాశాలను అందిపుచ్చుకోవడం అత్యంత కీలకమని చెప్పారు. ఆంట్రప్రెన్యూర్స్గా ఎదిగిన గిరిజన యువత భవిష్యత్ తరాలకు మార్గదర్శకులు కావాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కేటీఆర్ గతంలో జరిగిన ఆసక్తికరమైన ఘటనను తెలియజేశారు. గతంలో సీఎం కేసీఆర్ను కలిసేందుకు షాపూర్జీ–పల్లోంజీ గ్రూప్కు చెందిన దివంగత బిజినెస్ టైకూన్ సైరస్ మిస్త్రీ వచ్చారని చెప్పారు. అప్పుడు తన తండ్రి షాపూర్జీ పల్లోంజీ గ్రూప్లో సబ్కాంట్రాక్టర్గా పనిచేసినట్లు కేసీఆర్ గుర్తుచేసుకోగా మిస్త్రీ ఆశ్చర్యపోయారని కేటీఆర్ పేర్కొన్నారు. సైరస్ మిస్త్రీ ఇంటికి వెళ్లిన తర్వాత రికార్డులు తిరగేసి ఫోన్ చేశారని, 1950–60 మధ్య కాలంలో పనిచేసినట్లు వివరించారన్నారు. ఎన్నికల్లో గెలిచేది మళ్లీ మేమే.. త్వరలో ఎస్టీ ఆంట్రప్రెన్యూర్స్ కోసం ఉత్పత్తుల పార్కు పెడతామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎల్లారెడ్డి మండలంలో ముగ్గురు దళితబంధు లబ్ధిదారులు రైస్మిల్లు పెట్టుకున్నారని చెప్పారు. అదేవిధంగా వాటర్ వర్క్స్ విభాగానికి దళితబంధు పథకం కింద 150 వాహనాలు పంపిణీ చేశామన్నారు. వచ్చే నెల 3న మరోసారి బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని, అప్పుడు మళ్లీ సక్సెస్ మీట్ జరుపుకుందామని చెప్పారు. సీఎం వల్లే ఎస్టీల ఎదుగుదల: సత్యవతి రాథోడ్ రాష్ట్రంలో గిరిజనులు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారని, సీఎం కేసీఆర్ విజన్ వల్లే ఇది సాధ్యమైందని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. గతంలో అనేక పార్టీలు, ప్రభుత్వాలను చూశామని, కానీ గిరిజనులను ఎవరూ పట్టించుకోలేదన్నారు. గిరిజనులు చదువు తర్వాత ఉద్యోగం చేసే స్థాయి నుంచి ఉద్యోగ అవ కాశా లు కల్పించే స్థాయికి ఎదిగారని, గిరిజనులపై సీఎం కేసీఆర్కు ప్రేమ ఉందన్నారు. బీఆర్ఎస్ పాలన లోనే గిరిజన రిజర్వేషన్ పెంచుకోవడంతోపాటు మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎస్టీలకు మరిన్ని అవకాశాలు కల్పించామని, గిరిపుత్రులకు పోడు పట్టాలు అందించామని గుర్తుచేశారు. ప్రజలు ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని, ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తే మనం నష్టపోతామని వ్యాఖ్యానించారు. -
Rudramkota Movie Success Meet: రుద్రం కోట మూవీ సక్సెస్ మీట్ (ఫోటోలు)
-
Ameesha Patel: గదర్ 2 సినిమాతో రూ.300 కోట్లు కొల్లగొట్టిన హీరోయిన్ (ఫోటోలు)
-
BRO Success Meet Photos: ‘బ్రో’ మూవీ సక్సెస్ మీట్ (ఫోటోలు)
-
బేబీ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్లో మెగాస్టార్ (ఫోటోలు)
-
'BRO' Movie Success Celebrations: ‘బ్రో’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
స్టేజిపైనే బోరున ఏడ్చేసిన హీరోయిన్.. కారణమిదే!
అశ్విన్ బాబు, నందితా శ్వేత పోలీస్ పాత్రల్లో నటించిన లేటేస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'హిడింబ'. ఈ చిత్రానికి అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో తెరకెక్కించారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో ఎస్వీకే సినిమాస్పై గంగపట్నం శ్రీధర్ నిర్మించారు. అమ్మాయిల సీరియల్ కిడ్నాప్లకు సంబంధించిన కేసును ఛేదించే కథాంశంతో ఈ సినిమా రూపొందించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రబృందం సక్సెస్ మీట్ను ఏర్పాటు చేసింది. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన హీరోయిన్ నందితా శ్వేత ఫుల్ ఎమోషనలయ్యారు. స్టేజ్పై మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. (ఇది చదవండి: వేకేషన్కు మహేశ్ బాబు ఫ్యామిలీ.. ఎయిర్పోర్ట్లో సందడి!) నందితా శ్వేత మాట్లాడుతూ.. ' హిడింబ టైటిల్ చూడగానే అందరికీ కేవలం థ్రిల్లర్ మూవీ అనుకుని ఉంటారు. కానీ ఫ్యామిలీ కూడా వచ్చి చూస్తున్నారు. ఈ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు సీరియస్ రోల్ నేను చేస్తానని అనుకోలేదు. దర్శకుడు అనిల్ నాపై ఎంతో నమ్మకం ఉంచి నాకు క్యారెక్టర్ ఇచ్చారు. అశ్విన్ - అనిల్ వల్లే నా పాత్రకు పూర్తిగా న్యాయం చేశా. వాళ్లు నన్ను ఎంతగానో సపోర్ట్ చేశారు.' అని అన్నారు. నందితా మాట్లాడుతూ..' ఈ మూవీ నాకు సెంటిమెంటల్గా ఎంతో కనెక్ట్ అయి ఉంది. ఎందుకంటే ఈ మూవీ చేసేటప్పుడు మా ఫాదర్ చనిపోయారు. ఈ మూవీ వల్లే నాకు పేరు వచ్చింది. ఆయన ఆశీస్సుల వల్ల నేను ఇక్కడ ఉన్నాఅంటూ తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఎక్కడికిపోతావు చిన్నవాడా తర్వాత ‘హిడింబ’తోనే నాకు ఇంత గుర్తింపు వచ్చిందని' నందితా శ్వేత అన్నారు. (ఇది చదవండి:'హిడింబ' సినిమాకు రీ–సెన్సార్ చేశాం.. కారణం ఇదే' ) -
రంగబలి మూవీ సక్సెస్ మీట్ ఫోటోలు
-
రుద్రంగి విజయంతో హ్యాపీ
‘‘రుద్రంగి’ కోసం ఏడాదిన్నర కష్టపడ్డాం. ఇప్పుడు సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వస్తుండటం మాకెంతో హ్యాపీగా ఉంది’’ అని దర్శకుడు అజయ్ సామ్రాట్ అన్నారు. జగపతిబాబు, మమతా మోహన్దాస్, విమలా రామన్, ఆశిష్ గాంధీ, నవీనా రెడ్డి ముఖ్య ΄ాత్రల్లో నటించిన చిత్రం ‘రుద్రంగి’. రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం రిలీజైంది. ‘‘థియేటర్లోనే చూడాల్సిన సినిమా ఇది. ప్రేక్షకులు మాకు ఇంకా స΄ోర్ట్ చేస్తారని భావిస్తున్నాం’’ అని ఈ సినిమా సక్సెస్ మీట్లో ఆశిష్ గాంధీ అన్నారు. -
ఛలో తర్వాత రంగబలి
‘‘రంగబలి’ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు ‘ఛలో’ తర్వాత ‘రంగబలి’ మరో బ్లాక్ బస్టర్ ఇచ్చింది. మంచి కథతో సినిమా తీసిన పవన్కి, ఈ జర్నీలో సపోర్ట్ చేసిన సుధాకర్కి థ్యాంక్స్’’ అన్నారు హీరో నాగశౌర్య. పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో నాగశౌర్య, యుక్తి తరేజ జంటగా నటించిన చిత్రం ‘రంగబలి’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ మూవీ శుక్రవారం (జులై 7న) విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం సక్సెస్ మీట్లో పవన్ బాసంశెట్టి మాట్లాడుతూ– ‘‘మా సినిమా కలెక్షన్స్ బాగున్నాయి’’ అన్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
సీబీఎస్ఈ పది, పన్నెండవ తరగతి ఫలితాలు విడుదల
ఎవరి లెక్క వారిదే..!
ఓటరు తీర్పు... ఈవీఎంలలో భద్రం
రాయల్ ఎన్ఫీల్డ్ దగ్ధం
వైఎస్సార్సీపీ గెలుపుకోసం పనిచేసిన వారికి ధన్యవాదాలు
దళిత మహిళా సర్పంచ్పై జనసేన దాడి
రామతీర్థంలో వైభంగా పూర్ణాహుతి
గ్రామాల్లో ద్రాక్ష పంట
చికెన్
పశువుల ఎరువుతో భూసారం పెంపు
తప్పక చదవండి
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
Advertisement