-
CM Jagan: సింహంలా ఒక్కరే వస్తారు
సాక్షి, అన్నమయ్య: రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును వివరించడానికి వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతంగా సాగుతోంది. మంగళవారం అన్నమయ్య జిల్లాలో రాజంపేట నియోజకవర్గాల్లో సామాజిక సాధికార యాత్ర జరుగుతోంది. రాజంపేట బహిరంగ సభలో వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు మాట్లాడారు. ఇప్పటివరకు ఎంతో మంది ముఖ్యమంత్రులను చేశామని, కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం సామాజిక సాధికారత సాధించి చరిత్ర తిరగరాశారని అన్నారు. సీఎం జగన్ ఎంతో మంది సామాన్యులకు పదవులిచ్చారని తెలిపారు. బీసీలను రాజ్యసభకు పంపిన గొప్ప వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. మళ్లీ కొందరు అబద్దపు హామీలతో మోసం చేసేందుకు వస్తున్నారని అన్నారు. వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. వైఎస్ జగన్ను అశీర్వదించండని కోరారు. రాజంపేట ప్రజలు అదృష్టవంతులని.. రామలక్ష్మణుల్లా మల్లికార్జునరెడ్డి, అమరనాథ్రెడ్డిలు రాజంపేటను కాపాడుతున్నారని డిప్యూటి సీఎం అంజాద్ బాషా అన్నారు. రాజంపేట బహిరంగ సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మల్లికార్జునరెడ్డి, అమరనాథ్రెడ్డి వంటి నాయకులు రాజంపేటకు ఉండటం అదృష్టమని తెలిపారు. సామాజిక న్యాయాన్ని ఇంత వరకు ఎప్పుడైనా చూశామా? బీసీలు తనకు పేటెంట్ అని చెప్పిన చంద్రబాబు బీసీలను వాడుకొని వదిలేశారని ఆరోపించారు. కానీ ఆచరణలో సీఎం వైఎస్ జగన్ చేసి చూపారని గుర్తుచేశారు. ఇంటికొకరు ఇంజనీరు, వైద్యలు ఉండాలని ఆనాడు దివంగత వైఎస్సార్ ఆశించారని తెలిపారు. ఇప్పుడు ఆయన తనయుడు అదే పరిపాలనను కొనసాగిస్తున్నారని అన్నారు. టీడీపీ హాయంలో మైనార్టీ మంత్రి, ఎమ్మెల్యే లేరని, ఓట్ల కోసమే చివరలో ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారని మండిపడ్డారు. అదే వైఎస్ జగన్ మైనార్టీని డిప్యూటి సీఎంను చేశారని గుర్తుచేశారు. అనేక మందిని కార్పోరేషన్లకు చైర్మన్లుగా చేశారని పేర్కొన్నారు. కేవలం జగన్ను ఎదుర్కొవడానికి అన్ని పార్టీలు ఎకమవుతున్నాయని అన్నారు. ఎంతమంది ఏకమైనా సింహంలా జగన్ ఒక్కరే వస్తారని తెలిపారు. సీఎం జగన్ను ప్రతి ఒక్కరు ఆశీర్వదించాల్సిన అవసరం ఉందని అంజాద్ బాషా అన్నారు. రాజంపేటలో అభివృద్ది జరిగిందంటే దివంగత వైఎస్అర్, వైఎస్ జగన్ హాయంలోనే జరిగిందని కడప జడ్పీ ఛైర్మన్ అకేపాటి అమరనాధరెడ్డి తెలిపారు. రాజంపేట బహిరంగ సభలో అకేపాటి అమరనాధరెడ్డి మాట్లాడారు. రాజంపేటలో తాగునీరు సమస్య లేదంటే అది వైఎస్అర్ చలువే అన్నారు. రాజంపేటకు ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, తాను ప్రజలకు వాచ్మెన్లలా ఉన్నామని, అందరికీ అండగా ఉన్నామని తెలిపారు. ఇక్కడ ఎమ్మెల్యే గెలిపించి రాష్టంలో సీఎంగా వైఎస్ జగన్ గెలిపించాలని అన్నారు. అన్ని కులాలపై ప్రేమ చూపిన వ్యక్తి జగన్ అని కొనియాడారు. అందరినీ విద్యావంతులను చేయ్యాలని అనేక సంస్కరణలు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడున్న పథకాలన్ని అమలవ్వాలంటే మళ్లీ జగనే రావాలని తెలిపారు. -
ఘనంగా టాలీవుడ్ హీరో రానా తమ్ముడి పెళ్లి.. వధువు ఎవరో తెలుసా?
టాలీవుడ్ నిర్మాత సురేశ బాబు తనయుడు అభిరామ్ వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. రానాకు తమ్ముడైన అభిరామ్ వరసకు మరదలైన ప్రత్యూష అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. శ్రీలంకలో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్కు బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరలవుతున్నాయి. దాదాపు మూడు రోజుల పాటు ఈ పెళ్లి వేడుక జరిగింది. కాగా.. ఇటీవలే వరుణ్ తేజ్ సైతం పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేశ్ బాబుకి ఇద్దరు కుమారులు. పెద్దబ్బాయి రానా ఇప్పటికే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక రెండో అబ్బాయి అభిరామ్ కూడా 'అహింస' అనే మూవీతో టాలీవుడ్లో హీరోగా పరిచయమయ్యాడు. కానీ ఈ మూవీ అంత గుర్తింపు తీసుకురాలేదు. దీంతో కొన్నాళ్లు గ్యాప్ తీసి సినిమాలు చేస్తానని ప్రకటించాడు. అతను ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్లోనూ నటించడం లేదు. దీంతో పెళ్లి చేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. దగ్గుబాటి కుటుంబంలోకి అడుగుపెట్టనున్న అమ్మాయి స్వస్థలం కారంచేడు అని తెలుస్తోంది. View this post on Instagram A post shared by South Celebrity (@southcelebrity.insta) -
అలాంటి రాజకీయ నాయకులను చూస్తే కోపం వస్తుంది నాకు
-
రానా డ్రగ్స్ కేసు పై సురేష్ బాబు రియాక్షన్
-
ఆత్రేయ, వేటూరి గారు పెద్ద రైటర్స్..కానీ తప్ప తాగి..!
-
ఆఖరికి పవన్ కళ్యాణ్ సినిమా అయినా అంతే అంటున్న సురేష్ బాబు
-
మనకు వద్దు నాన్న అని చెప్తే వినలేదు..!
-
నా తమ్ముడి సినిమా పెద్ద హిట్ కావాలని చాలా కష్టపడ్డా..!
-
నా తమ్ముడి సినిమా వల్లే.. పవన్ తో గొడవ..!
-
నేను సంతోషంగా లేకపోవడానికి కారణం ఇదే
-
నా పెద్ద కొడుకు చాలా పిరికివాడు..!
-
చంద్రబాబు అరెస్ట్.. సినిమా వాళ్లు స్పందించడం సరికాదు: సురేశ్ బాబు
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన అరెస్ట్ ఖండించాలంటూ టాలీవుడ్ ప్రముఖులపై టీడీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. అయినప్పటికీ వారి నుంచి పెద్ద రెస్పాన్స్ రావట్లేదు. ఏ ఒక్క హీరో కూడా స్పందించలేదు. డైరెక్టర్ రాఘవేంద్రరావు, అశ్వినీదత్తో పాటు నట్టి కుమార్ మాత్రమే చంద్రబాబు అరెస్ట్ని ఖండించారు. బడా నిర్మాతలు, హీరోలు ఎవరూ స్పందించకపోవడంతో పలువురు టీడీపీ నాయకులు వారికి ఫోన్లు చేసి మరీ బ్రతిమిలాడుతున్నారట. (చదవండి: ఎన్టీఆర్పై చెప్పులు విసరడం నా కళ్లారా చూశా: మోహన్ బాబు) ఇదిలా ఉంటే..తాజాగా ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారంపై స్పందించాడు. సినిమా వాళ్లు రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా సినిమా వ్యాపారం చేసుకోవడం మంచిదని హితవుపలికారు. తాజాగా ఆయన సప్త సాగరాలు అనే సినిమా ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్ట్పై మీ స్పందన ఏంటని ఓ విలేకరి ప్రశ్నించగా ..సినిమా రంగం రాజకీయాలకు దూరంగా ఉండడమే మంచిదన్నారు. ‘ఇండస్ట్రీ ఎప్పుడూ రాజకీయాలకు, మతాలకు అతీతంగా ఉంటుంది. చాలా మంది పరిశ్రమ పెద్దలు ఇలానే ఉన్నారు. కొంతమంది కొన్ని రాజకీయ పార్టీలతో సంబంధాలు పెట్టుకున్నప్పటికీ, ఇండస్ట్రీకి రాజకీయం ఆపాదించలేదు. చంద్రబాబు అరెస్ట్ అనేది సున్నితమైన అంశం. దీనిపై ఇండస్ట్రీ స్పందించాల్సిన అవసరం లేదు. మేం రాజకీయ నాయకులం కాదు.. మీడియా కాదు.. మేం మూవీ మేకర్స్. సినిమాలు మాత్రమే తీస్తాం. చాలా మంది స్టేట్మెంట్ ఇవ్వమంటారు. ఏం ఇస్తాం? రోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ప్రతి అంశంపై స్టేట్మెంట్ ఇవ్వలేం కదా? తెలుగు దేశం పార్టీకీ సంబంధించిన వ్యక్తులు అయినప్పటికీ చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో సినిమా వాళ్లు స్పందించడం సరికాదు. ఇండస్ట్రీలో రాజకీయాలు ఉండకూడదని నా అభిప్రాయం’అని సురేశ్ బాబు అన్నారు. -
చంద్రయాన్–3లో దేవగుప్తం శాస్త్రవేత్త సురేశ్ బాబు
అల్లవరం: చంద్రుడి దక్షిణ ధృవంపైన ల్యాండర్ను దించిన తొలి దేశంగా భారత్ రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. మన రాష్ట్రంలోని శ్రీహరికోట నుంచి చంద్రయాన్–3ని ప్రయోగించగా ఈ క్రతువులో ఎంతోమంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు పాలుపంచుకున్నారు. వీరిలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం దేవగుప్తం గ్రామానికి చెందిన శాస్త్రవేత్త బలభద్ర సురేష్బాబు ఒకరు. చంద్రయాన్–3 ప్రాజెక్టు లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (ఎల్పీఎస్సీ) క్రయోజెనిక్ విభాగంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఒక మారుమూల గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టినా సురేశ్ బాబు కుంగిపోలేదు. గ్రామంలోనే పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. విఖ్యాత శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ను స్ఫూర్తిగా తీసుకున్నారు. ఆయనలా తాను ప్రముఖ శాస్త్రవేత్తగా పేరు తెచ్చుకోవాలనుకున్నారు. అమలాపురంలోని ఎస్కేబీఆర్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదివిన సురేశ్ బాబు తణుకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. ఆ తర్వాత ట్రిఫుల్ ఐటీ బెంగళూరులో విద్యనభ్యసించి త్రివేండ్రంలోని ఇస్రో కేంద్రంలో తొలి పోస్టింగ్ పొందారు. చంద్రయాన్–3లో కీలక పాత్ర పోషించడం ద్వారా ఎట్టకేలకు తన ఆకాంక్షను నెరవేర్చుకున్నారు. ఈ నేపథ్యంలో దేవగుప్తం సచివాలయంలో శాస్త్రవేత్త సురేశ్ బాబు తల్లిదండ్రులు సత్యభారతి, కామేశ్వరరావులను పలువురు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షుడు సాధనాల వెంకటరావు మాట్లాడుతూ.. చంద్రయాన్ విజయంలో గ్రామానికి చెందిన సురేశ్ బాబు కీలక పాత్ర పోషించడం దేశానికే గర్వకారణమని అభివర్ణించారు. నిరుపేద కుటుంబంలో పుట్టినా ఉన్నత స్థాయికి ఎదగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆయన మరిన్ని విజయాలు సాధించి గ్రామానికే కాకుండా, దేశానికి కూడా కీర్తిప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. సురేశ్ బాబు తండ్రి కామేశ్వరరావు మాట్లాడుతూ.. తన కుమారుడికి చిన్నప్పటి నుంచి ప్రశ్నించే తత్వం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు తిక్కిరెడ్డి శ్రీను, సుందరనీడి సాయి, ఎంపీటీసీ ముత్తాబత్తుల రాంబాబు, హెచ్ఎం వేణుగోపాల్, ఏఎంసీ డైరెక్టర్ ఈతకోట సతీష్, జగనన్న గృహ సారథుల కన్వీనర్ కుడుపూడి సూర్యప్రకాశరావు, వైఎస్సార్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పెచ్చెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
నా తమ్ముడు అభిరామ్ ‘అహింస’ అలరిస్తుంది: రానా
సాక్షి, ప్రకాశం(చీరాల): మూవీ మొఘల్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు మనవడు, సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్బాబు తనయుడు ప్రముఖ హీరో దగ్గుబాటి రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ చిత్రరంగంలోకి అరంగ్రేటం చేస్తున్న మొదటి సినిమా అహింస ప్రీ రిలీజ్ వేడుక వైభవంగా జరిగింది. శనివారం రాత్రి చీరాలలో స్థానిక ఎన్ఆర్అండ్పీఎం హైస్కూల్ గ్రౌండ్స్లో ఈ వేడుక నిర్వహించారు. సినీ నటీనటులను చూసేందుకు వేల సంఖ్యలో సినీ అభిమానులు, దగ్గుబాటి అభిమానులు తరలి రావడం విశేషం. ఉదయభాను యాంకర్గా వ్యవహరించి ప్రేక్షకులను అలరించారు. సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ పాటలను పాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్, హీరోయిన్ దీపిక దివని, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, డైరెక్టర్ తేజ, ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, వైఎస్సార్ సీపీ ఇన్చార్జి కరణం వెంకటేష్లు హాజరయ్యారు. (చదవండి: సీరియల్ హత్యలు, పోలీసుల ఈగో.. కేసు చేధిస్తారా?) ఎమ్మెల్యే బలరాం మాట్లాడుతూ రామానాయుడు కుటుంబం నుంచి మరో హీరో సినీ అరంగ్రేటం చేయడం శుభపరిణామమన్నారు. తెలుగు సినీఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన దగ్గుబాటి కుటుంబం ఎన్నో సందేశాత్మక చిత్రాలను రూపొందించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిందన్నారు. నూతన హీరో అభిరామ్ను అందరు ఆదరించాలన్నారు. దగ్గుబాటి కుటుంబంతో తమకు సన్నిహిత కుటుంబ సంబంధాలు ఉన్నాయని నూతన సినీమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చీరాలలో నిర్వహించడం గొప్ప విషయమన్నారు. సినీరంగానికి, చిత్రాల నిర్మాణానికి చీరాల నియోజకవర్గం అనుకూలమన్నారు. అహింస చిత్రం ప్రేక్షకులు ఆదరించి బ్రహ్మాండమైన విజయాన్ని సాధించాలన్నారు. సినీ హీరో దగ్గుబాటి రానా మాట్లాడుతూ తన తమ్ముడు అభిరామ్ హీరోగా నటిస్తున్న మొదటి చిత్రం అందరిని అలరిస్తుందని, ప్రేక్షకులు ఆదరించి విజయాన్ని చేకూర్చాలన్నారు. ప్రజల అభీష్టంతో ప్రేక్షకులను హత్తుకునేలా చిత్రాన్ని రూపొందించి చక్కని పాటలు, సంగీతం ఇచ్చామన్నారు. చీరాలతో మాకు విడదీయరాన్ని సంబంధం ఉందని తమ కుటుంబం సినీరంగం, సేవా కార్యక్రమాలు, రాజకీయాల్లో చెరగని ముద్రను పొందామని, నూతన నటీనటులను ప్రేక్షకులు ఆదరించాలని ఆయన కోరారు. -
సుధీర్ పక్కన హీరోయిన్ ఎలా సిగ్గు పడుతుందో చూడండి
-
‘భారతీయన్స్’ టీజర్ బాగుంది: సురేశ్ బాబు
ప్రముఖ రచయిత, ప్రేమకథా చిత్రాల స్పెషలిష్ట్ (ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా ఫేమ్) దీన్ రాజ్ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘భారతీయన్స్’. నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభా రంజన్, హీరోలుగా... సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై ప్రవాస భారతీయుడు డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి భారీ బడ్జెట్ తో అత్యంత నిర్మించారు. (చదవండి: యంగ్ హీరోతో కలిసి స్టెప్పులేసిన నిహారిక.. వీడియో వైరల్) తాజాగా ఈ చిత్రం టీజర్ని ప్రముఖ నిర్మాత డి. సురేశ్ బాబు రిలీజ్ చేసి, చిత్ర యూనిట్కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. తమ సంస్థకు "ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా" వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దీన్ రాజ్ దర్శకుడిగా పరిచయమవుతున్న "భారతీయన్స్" బిగ్గెస్ట్ బ్లస్టర్ కావాలని ఆకాంక్షించారు. (చదవండి: ఈ వారం ఓటీటీలో అలరించే సినిమాలివే!) దర్శకుడు దీనరాజ్ మాట్లాడుతూ ''దేశభక్తి సినిమాతో దర్శకుడిగా పరిచయం కావాలని ఈ కథ రాశా. మా నిర్మాతకు కూడా దేశభక్తి ఎక్కువ. కథ నచ్చి సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించే చిత్రమిది. భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి ప్రశంసలు అందుకున్న మా చిత్రం టీజర్ ను సురేష్ బాబు రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది'అని అన్నారు. హీరో నీరోజ్ మాట్లాడుతూ ''హీరోగా నాకు ఫస్ట్ సినిమా ఇది. అవకాశం ఇచ్చిన నిర్మాత శంకర్ గారికి, దర్శకులు దీన్ రాజ్ గారికి థాంక్స్'' అని అన్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు సత్య కశ్యప్ & కపిల్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. -
మన్యంరాజు టీజర్ బాగుంది: సురేశ్బాబు
‘‘మన్యంరాజు’ టీజర్ చాలా ఆసక్తిగా ఉంది. సినిమా చూడాలనే కుతూహలాన్ని రేపుతోంది. ఈ చిత్రం హిట్ అయి, యూనిట్కి మరిన్ని అవకాశాలు తీసుకురావాలి’’ అని నిర్మాత డి.సురేశ్ బాబు అన్నారు. జీవన్, బేబీ పరిణిక జంటగా బీయమ్ సోముసుందరం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మన్యంరాజు’. వాయుపుత్ర ఆర్ట్స్పై విజయ్ బాబు, వై.ప్రవీణ్, పుష్పలత.బి నిర్మించిన ఈ సినిమా టీజర్ని సురేశ్ బాబు రిలీజ్ చేశారు. బీయమ్ సోము సుందరం మాట్లాడుతూ–‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన చిత్రం ఇది’’ అన్నారు. ‘‘నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్, నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు జీవన్. ‘‘మే లో సినిమా విడుదలకి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు. ఈ కార్యక్రమంలో పరిపూర్ణానంద స్వామి, ఎంపీ, నిర్మాత ఎంవీవీ సత్యనారాయణ, నటుడు సప్తగిరి తదితరులు పాల్గొన్నారు. -
హీరో వెంకటేశ్ ఇంట తీవ్ర విషాదం
హీరో దగ్గుబాటి వెంకటేశ్ ఇంట విషాదం నెలకొంది. వెంకటేశ్, సురేశ్ బాబుల బాబాయ్, మూవీ మొఘల్ దివంగత రామానాయుడు సోదరుడు దగ్గుబాటి మోహన్ బాబు(73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం బాపట్ల జిల్లా కారంచేడులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. విషయం తెలుకున్న సురేశ్ బాబు.. కొడుకు అభిరాంతో కలిసి కారెంచేడు వెళ్లి బాబాయ్ మృతదేహానికి నివాళులర్పించాడు. హీరో వెంకటేశ్ షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్లడంతో కారెంచేడు రాలేకపోయినట్లు తెలుస్తోంది. రేపు ఉదయం వెంకటేశ్ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు దగ్గుబాటి మోహన్ బాబు మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, చీరాల వైసీపీ సమన్వయకర్త కరణం వెంకటేశ్ .. మోహన్ బాబు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. -
అన్నపూర్ణ ఫోటో స్టూడియోలో ఏం జరిగింది?
చైతన్యరావు, లావణ్య హీరో హీరోయిన్లుగా చెందు ముద్దు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’. ‘ఇచ్చట అందమైన ఫోటోలు తీయబడును’ అనేది ఉపశీర్షిక. బిగ్బెన్ సినిమాస్పై యశ్ రంగినేని నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్లుక్ని నిర్మాత డి.సురేష్బాబు విడుదల చేసి, సినిమా హిట్ సాధించాలని ఆకాంక్షించారు. చైతన్యరావు మాట్లాడుతూ –‘‘ఇప్పుడున్న ఫాస్ట్లైఫ్ నుంచి దూరంగా ప్రేక్షకులను 1980 నేపథ్యంలోకి తీసుకువెళ్లే సినిమా ఇది’’ అన్నారు. ‘‘గ్రామీణ నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన ప్రేమకథే ఈ చిత్రం. కథలో ఉన్న ట్విస్ట్లు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను అలరిస్తాయి’’ అన్నారు చందు. ‘‘ఫన్, థ్రిల్లింగ్, క్రైమ్ ఎలిమెంట్స్తో సాగే ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు నిర్మాత యశ్ రంగినేని. -
అవినాశ్ను ఇరికించేందుకే గూగుల్ టేకౌట్ కథ
కడప కార్పొరేషన్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాశ్రెడ్డిని ఇరికించేందుకే గూగుల్ టేకౌట్ కథ అల్లుతున్నారని కడప మేయర్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు చెప్పారు. అందుకే తాము కోర్టును ఆశ్రయించామే తప్ప సీబీఐకి భయపడి కాదన్నారు. వైఎస్ కుటుంబం ఇలాంటి ఎన్నో కుట్రలను ఎదుర్కొని నిలబడిందన్నారు. వారిది పదిమందికి సాయం చేసే గుణమే తప్ప ద్రోహం చేసే ఆలోచన లేదన్నారు. సురేష్బాబు శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సీబీఐపై ఉన్న నమ్మకం పోయేలా కేసు దర్యాప్తు సాగుతోందని అన్నారు. తాము లేవనెత్తుతున్న అనుమానాలపై దృష్టి పెట్టకుండా సీబీఐ ఒక కోణంలోనే దర్యాప్తు చేస్తోందని తెలిపారు. అవినాశ్రెడ్డి ఆయనకున్న అనుమానాలన్నీ లిఖితపూర్వకంగా ఇచ్చినా సీబీఐ అధికారులు పట్టించుకోలేదన్నారు. న్యాయవాది సమక్షంలో విచారించాలని, వీడియో తీయాలని కోరినా పట్టించుకోలేదన్నారు. వివేకా చనిపోయినప్పుడు మొదట ఫోన్చేసి చెప్పిన శివప్రకాశ్రెడ్డిని ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. దస్తగిరి అప్రూవర్గా మారడంతో అతడిని స్వేచ్ఛగా వదిలేశారన్నారు. హత్యకు ముందు సునీల్యాదవ్ అవినాశ్రెడ్డి ఇంట్లో ఉన్నాడని చెప్పడం దారుణమన్నారు. సీబీఐ అధికారులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని, ఎల్లో మీడియాకు లీకులిస్తూ అభూత కల్పనలకు తావిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా సీబీఐ అధికారులు వాస్తవాలను వెలికితీసి, నిజమైన దోషులను శిక్షించాలని కోరారు. దస్తగిరి ఎవరి పేరు చెబితే వారిని విచారిస్తున్నారు: వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్ఖాన్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డిని ఇరికించే కుట్ర జరుగుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్ఖాన్ చెప్పారు. ఆయన శుక్రవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. అప్రూవర్గా మారిన దస్తగిరి ఎవరి పేరు చెబితే వారిని చార్జిషీట్లో పెట్టి విచారణకు పిలవడం సరికాదన్నారు. ఎంపీ అవినాశ్రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేకపోయినా విచారణ పేరిట వేధించి, ఆయన రాజకీయ భవిష్యత్ను నాశనం చేయాలనే కుట్ర కనిపిస్తోందన్నారు. సీబీఐ విచారణను బీజేపీలోని టీడీపీ కోవర్టులు ప్రభావితం చేస్తున్నట్లు ఆరోపణలున్నాయని చెప్పారు. -
Nenekkadunna: టాలీవుడ్లోకి బాలీవుడ్ సీనియర్ హీరో కొడుకు
బాలీవుడ్ సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మాధవ్ కోదాడ దర్శకత్వంలో ‘నేనెక్కడున్నా' అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో ఎయిర్ టెల్ ఫేమ్ సశా ఛెత్రి కథానాయిక. కె.బి.ఆర్ సమర్పణలో మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు టైటిల్ వెల్లడించడంతో పాటు పోస్టర్, టీజర్ విడుదల చేశారు. అనంతరం సురేశ్ బాబు మాట్లాడుతూ..‘టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. కథ బాగుంటే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకు, ఇటువంటి కొత్త ప్రయత్నాలకు ప్రేక్షకుల ఆదరణ లభిస్తుంది. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. దర్శక, నిర్మాతలకు ఆల్ ది బెస్ట్' అని చెప్పారు. ‘జర్నలిజం, రాజకీయం నేపథ్యంలో వస్తున్న థ్రిల్లర్ చిత్రమిది. ఊహించని మలుపులతో సినిమా సాగుతుంది’అని దర్శకుడు మాధవ్ కోదాడ అన్నారు. ‘సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. ప్రస్తుతం సెన్సార్ సన్నాహాల్లో ఉన్నాం. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం’అని నిర్మాత మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి అన్నారు. -
ఫిలింనగర్ భూవివాదంలో కొత్త మలుపు
-
ఫిలింనగర్ భూవివాదంలో కొత్త మలుపు
-
భూ వివాదం: నిర్మాత సురేష్బాబు, రానాలపై క్రిమినల్ కేసు నమోదు
హైదరాబాద్: ఫిలింనగర్ భూ వివాదం కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. కోర్టు ఆదేశాల మేరకు నిర్మాత సురేష్బాబు, రానాలపై క్రిమినల్ కేసు నమోదైంది. తమను దౌర్జన్యంగా ఖాళీ చేయించారని వ్యాపారి ప్రమోద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఖాళీ చేయకుంటే అంతు చూస్తామని సురేష్బాబు బెదిరించినట్లు ఆరోపించారు. ఫిర్యాదు చేసినా బంజరాహిల్స్ పోలీసులు పట్టించుకోలేదన్నారు. దాంతో నాంపల్లి కోర్టును బాధితుడు ఆశ్రయించాడు. సురేష్బాబు, రానా సహా మరికొందరిపై కేసు నమోదుకు కోర్టు ఆదేశించింది. దాంతో సురేష్బాబు, రానాపై కేసు నమోదు చేసి విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేశారు. -
జూబ్లీహిల్స్లో ట్రాఫిక్ను కంట్రోల్ చేసిన సురేష్ బాబు
ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కారుదిగి స్వయంగా ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్లోని ఫిల్మ్నగర్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో అటువైపు వెళ్తున్న నిర్మాత సురేష్ బాబు స్వయంగా కారులోంచి దిగి ట్రాఫిక్ను కంట్రోల్ చేశారు. వాహనదారులకు సూచనలు చేస్తూ ట్రాఫిక్ను క్లియర్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బాధ్యతగల పౌరుడిలా వ్యవహరించారంటూ సురేష్ బాబుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
16, 17 తేదీల్లో జూనియర్ ఇంటర్లో ప్రవేశానికి కౌన్సెలింగ్
రేపు బాస్కెట్బాల్ జిల్లా జట్ల ఎంపిక
వరంగల్ పార్లమెంట్ పరిధిలో 2009 నుంచి 2024 వరకు నమోదైన ఓట్లు, పోలింగ్ శాతం...
పథకాలు పారదర్శకంగా అందించాలి
No Headline
రైతులు ధైర్యంగా ఉండాలి
వరంగల్ స్ట్రాంగ్రూంకు ఈవీఎంలు
వాతావరణం
ఓటుకు దూరంగా..
రేవణ్ణ అరెస్ట్ వెనుక కుట్ర: కుమార
తప్పక చదవండి
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
Advertisement