-
MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
2024 ఐపీఎల్ సీజన్ గత సీజన్లకు భిన్నంగా జోరుగా సాగుతుంది. ఈ సీజన్లో దాదాపుగా ప్రతి మ్యాచ్లో పరుగుల వరద పారడంతో పాటు భారీ సంఖ్యలో మెరుపు ఇన్నింగ్స్లు నమోదవుతున్నాయి. నిన్న (మే 6) ముంబై-ఎస్ఆర్హెచ్ మ్యాచ్లోనూ ఇలాంటి ఓ మెరుపు ప్రదర్శన నమోదైంది. ముంబై ఆటగాడు సూర్యకుమార్ (51 బంతుల్లో 102 నాటౌట్; 12 ఫోర్లు, 6 సిక్సర్లు) సునామీ శతకంతో విరుచుకుపడి తన జట్టుకు అపురూప విజయాన్నందించాడు. ఈ క్రమంలో ఓ ఆల్టైమ్ రికార్డు సమం అయ్యింది.ఓ సీజన్లో అత్యధిక సెంచరీల రికార్డును ప్రస్తుత సీజన్ సమం చేసింది. 2023 సీజన్లో రికార్డు స్థాయిలో 12 సెంచరీలు (అన్ని జట్లు కలిపి) నమోదు కాగా.. ఈ సీజన్లో ఇప్పటికే 12 సెంచరీలు పూర్తయ్యాయి. ఇంకా 19 మ్యాచ్లు ఆడాల్సి ఉండగానే భారీ సంఖ్యలో నమోదు కావడంతో ఈ సీజన్ గత సీజన్ల కంటే భిన్నమని మరోసారి రుజువైపోయింది.ఐపీఎల్లో ఏ యేడుకాయేడు సెంచరీల సంఖ్య పెరుగుతూ వస్తుంది. 2022 సీజన్ మొత్తంలో 8 సెంచరీలు నమోదైనప్పుడు అభిమానులు ఆహా ఓహో అన్నారు. ఇప్పుడు మరికొన్ని మ్యాచ్లు మిగిలుండగానే 12 సెంచరీలు నమోదవడం చూసి ఫ్యాన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. నిన్నటి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్పై ముంబై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ ముక్కీ మూలిగి 173 పరుగులు చేసింది. ట్రవిస్ హెడ్ (48). కెప్టెన్ కమిన్స్ (35 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేసి సన్రైజర్స్ పరువు కాపాడారు. ముంబై బౌలర్లలో పియూశ్ చావ్లా, హార్దిక్ పాండ్యా తలో 3 వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, అన్షుల్ కంబోజ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే సూర్యకుమార్.. తిలక్ వర్మ (37 నాటౌట్) సాయంతో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్లో ఓటమితో సన్రైజర్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోవడంతో పాటు నెట్ రన్రేట్ను కూడా దిగజార్చుకుంది. ఈ మ్యాచ్లో గెలుపుతో ముంబై ఆఖరి స్థానం నుంచి లేచొచ్చి తొమ్మిదో స్థానానికి చేరుకుంది. -
సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
ఐపీఎల్-2024లో వరుస ఓటములను చవిచూసిన ముంబై ఇండియన్స్ తిరిగి పుంజుకుంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కేవలం 3 వికెట్లు కోల్పోయి 17.2 ఓవర్లలో చేధించింది. కాగా లక్ష్య చేధనలో ముంబై 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఎస్ఆర్హెచ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. సూర్య తన హోం గ్రౌండ్లో విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లను ఊచకోత కోశాడు. ఓవైపు గాయంతో బాధపడుతూనే ముంబై ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. సూర్య కేవలం 51 బంతుల్లోనే 12 ఫోర్లు, 6 సిక్స్లతో 102 పరుగులతో ఆజేయంగా నిలిచి తన జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించాడు. అతడితో పాటు తిలక్ వర్మ(37నాటౌట్) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, మార్కో జానెసన్, కమ్మిన్స్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(48) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఆఖరిలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 17 బంతులు ఎదుర్కొన్న కమ్మిన్స్ 2 సిక్స్లు, 2 ఫోర్లతో 35 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. వీరిద్దరితో పాటు నితీష్ రెడ్డి(20), జానెసన్(17) రాణించారు. ఇక ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, చావ్లా తలా మూడు వికెట్లు సాధించగా.. అన్షుల్ కాంబోజ్, బుమ్రా చెరో వికెట్ సాధించారు. -
కోహ్లి, రోహిత్ కాదు.. వారిద్దరే టాప్ 2 టీ20 బ్యాటర్లు?
ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్ స్టార్ ఓపెనర్ జానీ బెయిర్స్టో దారుణమైన ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడిన బెయిర్ స్టో.. 16.00 సగటుతో కేవలం 96 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో గురువారం(ఏప్రిల్ 18) ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో బెయిర్ స్టోకు ఆడే అవకాశం దక్కలేదు. అతడిని పంజాబ్ మెనెజ్మెంట్ పక్కన పెట్టి రిలీ రూసోను జట్టులోకి తీసుకువచ్చారు. కానీ రూసో కూడా నిరాశపరిచాడు. అయితే తాజాగా బెయిర్ స్టో ప్రముఖ క్రీడా వెబ్సైట్ ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ ఫోకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో ప్రస్తుత వరల్డ్ క్రికెట్లో టాప్ 3 టీ20 బ్యాటర్లు ఎవరన్న ప్రశ్న బెయిర్స్టోకు ఎదురైంది. బెయిర్ స్టో వెంటనే తన తొలి రెండు ఎంపికలగా దక్షిణాఫ్రికా స్టార్ హెన్రిచ్ క్లాసెన్, భారత విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్లను ఎంచుకున్నాడు. మూడో ప్లేయర్ను ఎంచుకోవడానికి జానీ కాస్త సమయం తీసుకున్నాడు. కాస్త ఆలోచించి తన సహచర ఆటగాడు, ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్ను తన మూడో ఛాయిస్ గా ఎంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఈఎస్పీఎన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ప్రస్తుత ఐపీఎల్లో అదరగొడుతున్న టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి,రోహిత్ శర్మలను బెయిరో స్టో ఎంచుకోపోవడం గమనార్హం. Can you argue with this? 🤔 #25Questions with Jonny Bairstow 👉 https://t.co/u7aCIY24E4 pic.twitter.com/jIg4WSd7YQ — ESPNcricinfo (@ESPNcricinfo) April 19, 2024 -
CSK Vs MI: వావ్ వాట్ ఏ క్యాచ్.. మ్యాచ్ టర్నింగ్ పాయింట్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 20 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఈ హైవోల్టేజ్ పోరులో సీఎస్కే ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్లో దంచి కొట్టిన సీఎస్కే.. తర్వాత బౌలింగ్లోనూ సత్తాచాటింది. అయితే ఈ మ్యాచ్లో చెన్నై ఆటగాడు ముస్తాఫిజుర్ రెహ్మన్ కళ్లు చెదిరే క్యాచ్ను అందుకున్నాడు. ముస్తాఫిజుర్ పట్టిన క్యాచ్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్గా నిలిచింది. ముస్తాఫిజుర్ అద్బుతమైన క్యాచ్తో ముంబై విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ను పెవిలియన్కు పంపాడు. ముంబై ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన పతిరాన తొలి బంతికే ఇషాన్ కిషన్ను పెవిలియన్కు పంపాడు. ఈ క్రమంలో ఇంపాక్ట్ ప్లేయర్గా సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. అయితే ఆ ఓవర్లో మూడో బంతిని పతీరణ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా షార్ట్ లెంగ్త్ డెలివరీగా సంధిచాడు. సూర్యకుమార్ యాదవ్ అప్పర్ కట్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. షాట్ సరిగ్గా కనక్ట్ అయినప్పటికి బౌండరీ లైన్వద్ద ముస్తాఫిజుర్ అద్బుత విన్యాసం చేశాడు. థర్డ్మ్యాన్లో ఫీల్డింగ్ చేస్తున్న రెహ్మాన్ కాస్త ఎడమవైపు జరిగి జంప్ చేస్తూ క్యాచ్ను అందుకున్నాడు. కానీ జంప్ చేసే క్రమంలో సమన్వయం కోల్పోయిన రెహ్మన్.. బంతిని గాల్లోకి విసిరేసి తిరిగొచ్చి అందుకున్నాడు. ఇది చూసిన మిస్టర్ 360 బిత్తరపోయాడు. చేసేదేమి లేక సూర్య ఖాతాతెరవకుండానే పెవిలియన్కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Ishan Kishan ✅ Suryakumar Yadav ✅ Relive Matheesha Pathirana's double-delight over which also included a magnificent catch by Mustafizur Rahman at the ropes 👏👏 Watch the match LIVE on @starsportsindia and @JioCinema 💻📱#TATAIPL | #MIvCSK | @ChennaiIPL pic.twitter.com/XbSsEiXLgZ — IndianPremierLeague (@IPL) April 14, 2024 -
Surya Kumar Yadav: కొడితే కెమెరా పగలిపోయింది..!
ఐపీఎల్లో ఇవాళ (ఏప్రిల్ 14) రాత్రి బిగ్ ఫైట్ జరుగనుంది. చెరి ఐదు సార్లు ఛాంపియన్లైన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ముంబై ఇండియన్స్ హోం గ్రౌండ్ అయిన వాంఖడే మైదానంలో ఈ మ్యాచ్ జరుగనుంది. క్రికెట్ ఎల్ క్లాసికోగా పిలువబడే ఈ మ్యాచ్పై భారీ అంచనాలు ఉన్నాయి. ధోని, రోహిత్ మెరుపులు చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ రసవత్తర సమరంలో పైచేయి ఎవరిదో వేచి చూడాలి. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు ప్రత్యేకంగా సాధన చేస్తున్నారు. భారీ అంచనాలు ఉండటంతో ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్స్లో కఠోరంగా శ్రమిస్తున్నారు. ముంబై ఇండియన్స్ విధ్వంసకర వీరుడు సూర్యకుమార్ అందరికంటే ఎక్కువగా నెట్స్లో టైమ్ స్పెండ్ చేశాడు.స్కై నిన్న అంతా బ్రేక్ లేకుండా పాక్టీస్లో పాల్గొన్నాడు. ప్రాక్టీస్ చేసే క్రమంలో స్కై ఓ కెమెరాను పగలగొట్టాడు. Suryakumar Yadav broke a camera in the practice session 😁pic.twitter.com/dWM2RlEbwl — CricTracker (@Cricketracker) April 13, 2024 నెట్స్లో సాధన చేస్తుండగా.. డిఫెన్స్ షాట్ అడినప్పటికీ స్కై పక్కనే ఉన్న కెమెరా తునాతునకలైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. డిఫెన్స్ ఆడితేనే ఇలా అయితే స్కై భారీ షాట్ కొడితే పరిస్థితి ఏంటని అభిమానులు చర్చించుకుంటున్నారు. చాలాకాలం తర్వాత ఇటీవలే రీఎంట్రీ ఇచ్చిన స్కై.. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ మ్యాచ్లో 19 బంతులు ఎదుర్కొన్న స్కై.. 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ నేపథ్యంలో నేటి మ్యాచ్లోనూ సూర్యపై భారీ అంచనాలు ఉన్నాయి. స్కై నుంచి అభిమానలు మరో సుడిగాలి ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు. నేటి మ్యాచ్లో స్కైతో పాటు రోహిత్ శర్మపై కూడా అభిమానులు ఓ కన్నేసి ఉంచారు. ఈ సీజన్లో హిట్మ్యాన్ పెద్ద స్కోర్లు చేయనప్పటికీ జట్టుకు మెరుపు ఆరంభాలు ఇచ్చాడు. రోహిత్, స్కై చెలరేగితే నేటి మ్యాచ్లో సీఎస్కేకు కష్టాలు తప్పకపోవచ్చు. సీఎస్కేలోనూ స్కై లాంటి మెరుపు వీరులు చాలామంది ఉన్నారు. ధోని, శివమ్ దూబే, రచిన్ రవీంద్రపై ఆ జట్టు అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. -
'డివిలియర్స్ కంటే అతడు చాలా డేంజరస్.. ఆపడం ఎవరి తరం కాదు'
ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం సృష్టించాడు. ఈ ఏడాది సీజన్లో రెండో మ్యాచ్ ఆడిన సూర్యకుమార్.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన సూర్య ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. గ్రౌండ్ నలుమూలల షాట్లు ఆడుతూ బౌలర్లకు చమెటలు పట్టించాడు. ఈ క్రమంలో కేవలం 17 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 19 బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్.. 5 ఫోర్లు, 4 సిక్స్లతో 52 పరుగులు చేశాడు. ఈ క్రమంలో గాయం నుంచి కోలుకుని అద్బుత ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్పై భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. సూర్య అతను దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్కు బెటర్ వెర్షన్ భజ్జీ కొనియాడాడు. "సూర్యకుమార్ లాంటి ఆటగాడిని ఇప్పటివరకు నేను చూడలేదు. అతడి బౌలర్లను ఎటాక్ చేసే విధానం నమ్మశక్యం కానిది. అతడికి బౌలర్లకు ఎక్కడ బౌలింగ్ చేయాలో ఆర్ధం కాక తలలపట్టుకుంటున్నారు. ఒకవేళ నేను ఆడిన కూడా సూర్యకి బౌలింగ్ చేసేందుకు భయపడేవాడిని. సూర్య వేరే గ్రహంపై ఆడుతున్నట్లు ఉంది. సూర్యకుమార్ యాదవ్ చెలరేగితే ఆపడం ఎవరి తరం కాదు. ఇంతకముందు అందరూ ఏబీ డివిలియర్స్ గురించి మాట్లాడునుకోవారు. కానీ సూర్య తన ఆటతీరుతో ఏబీడీని మయమరిపిస్తున్నాడు. డివిలియర్స్ కంటే సూర్య డెంజరస్ ఆటగాడని నేను భావిస్తున్నాను. టీ20 ఫార్మాట్లో ప్రస్తుత తరం క్రికెటర్లలో సూర్యనే అత్యుత్తమ ఆటగాడని" స్టార్స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భజ్జీ పేర్కొన్నాడు. చదవండి: రోహిత్ను టీజ్ చేసిన కోహ్లి.. హిట్మ్యాన్ రియాక్షన్ వైరల్ -
RCB Vs MI: ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి విధ్వంసం.. దటీజ్ సూర్య భాయ్! వీడియో
ఐపీఎల్-2024లో తన తొలి మ్యాచ్లో విఫలమైన ముంబై ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. రెండో మ్యాచ్లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా వాంఖడే వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో సూర్యకుమార్ విధ్వంసం సృష్టించాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన సూర్య భాయ్ ఆర్సీబీ బౌలర్లను ఊచకోత కోశాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే ప్రత్యర్ధి బౌలర్లను తన ట్రేడ్ మార్క్ షాట్లతో స్కై వీరవీహరం చేశాడు. ఈ క్రమంలో కేవలం 17 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 19 బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్.. 5 ఫోర్లు, 4 సిక్స్లతో 52 పరుగులు చేశాడు. కాగా అతడికి ఇది తన ఐపీఎల్లో కెరీర్లోనే ఫాస్ట్స్ట్ హాఫ్ సెంచరీ కావడం విశేషం. అదేవిధంగా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున ఫాస్టెస్ట్ ఫిప్టీ నమోదు చేసిన రెండో ఆటగాడిగా మిస్టర్ 360 నిలిచాడు. ఈ జాబితాలో ఇషాన్ కిషన్ తొలి స్ధానంలో ఉన్నాడు. ఐపీఎల్-2021 సీజన్లో ఎస్ఆర్హెచ్పై కిషన్ కేవలం 16 బంతుల్లోనే ఆర్ధశతకాన్ని సాధించాడు. ఇక సూర్యకుమార్ విధ్వంసకర ఇన్నింగ్స్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు వెలకమ్ బ్యాక్ టూ సూర్యభాయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా టీ20 వరల్డ్కప్కు ముందు సూర్య ఈ తరహా ప్రదర్శన చేయడం భారత జట్టుకు కలిసొచ్చే ఆంశం. pic.twitter.com/4Z9pwCdawR — Muskaan Bhatt (@MuskaanBhatt11) April 11, 2024 -
ఎన్నో ఆశలు పెట్టుకున్నాము.. ఇలా చేస్తావని అనుకోలేదు!డకౌట్గా
ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తన రీఎంట్రీ మ్యాచ్లో తీవ్ర నిరాశపరిచాడు. గత రెండు నెలలగా ఆటకు దూరంగా ఉన్న సూర్యకుమార్.. ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్తో పునరాగమనం చేశాడు. ఈ మ్యాచ్లో సూర్య దారుణ ప్రదర్శన కనబరిచాడు. రీ ఎంట్రీలో సత్తాచాటాతుడాని భావించిన ముంబై అభిమానుల ఆశలను మిస్టర్ 360 ఆడియాశలు చేశాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన సూర్యకుమార్ సిల్వర్ డక్గా వెనుదిరిగాడు. రెండు బంతులు ఎదుర్కొన్న ఈ ముంబైకర్ అన్రిచ్ నోర్జే బౌలింగ్లో చెత్త షాట్ ఆడి ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. మిడాన్లో సబ్స్టిట్యూట్ ఫీల్డర్ జేక్ ఫ్రేజర్-మెక్గర్క్కు క్యాచ్ ఇచ్చి సూర్య ఔటయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏంటి సూర్య భయ్యా ఇలా చేశావు.. ఎన్నో ఆశలు పెట్టుకున్నాము అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. pic.twitter.com/CbTPcnUbnx — Cricket Videos (@cricketvid123) April 7, 2024 -
ముంబై ఇండియన్స్కు గుడ్ న్యూస్.. విధ్వంసకర వీరుడు వచ్చేస్తున్నాడు..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో వరుస పరాజయాలతో (హ్యాట్రిక్) సతమతమవుతున్న ముంబై ఇండియన్స్కు శుభవార్త తెలిసింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు, విధ్వంసకర వీరుడు సూర్యకుమార్ యాదవ్ ముంబై ఆడబోయే తదుపరి మ్యాచ్కు అందుబాటులో ఉంటాడని తెలుస్తుంది. ఎన్సీఏ వైద్యులు స్కైకు ఫిట్నెస్ క్లియెరెన్స్ ఇచ్చినట్లు సమాచారం. ఏప్రిల్ 7న (ఆదివారం) ఢిల్లీతో జరుగబోయే మ్యాచ్ సమయానికి స్కై వంద శాతం ఫిట్గా ఉంటాడని ఎన్సీఏకి చెందిన కీలక అధికారి వెల్లడించాడు. సూర్యకుమార్ గాయం కారణంగా ప్రస్తుత సీజన్లో ముంబై ఆడిన మొదటి మూడు మ్యాచ్లకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. స్కై గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై హ్యాట్రిక్ పరాజయాలు ఎదుర్కొంది. ఈ మూడు మ్యాచ్ల్లో సూర్య లేని లోటు స్పష్టంగా కనిపించింది. మడమ, స్పోర్ట్స్ హెర్నియా సర్జరీల కారణంగా సూర్యకుమార్ యాదవ్ గత నాలుగు నెలలుగా క్రికెట్కు దూరంగా ఉన్నాడు. రెండు సర్జరీలు విజయవంతంగా పూర్తి చేసుకున్న స్కై.. మార్చి నుంచి ఎన్సీఏ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు స్కైకు ఫిట్నెస్ పరీక్ష చేయగా అందులో విఫలమయ్యాడు. తిరిగి జరిపిన మరో రెండో పరీక్షల్లో స్కై పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తేలడంతో ఎన్సీఏ అతనికి ఐపీఎల్ అడేందుకు అనుమతిచ్చింది. -
#Riyan Parag: 'అతడొక సంచలనం.. సూర్యకుమార్లా ఆడుతున్నాడు'
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. తొలి రెండు మ్యాచ్ల్లో అదరగొట్టిన పరాగ్.. సోమవారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సంజూ శాంసన్, బట్లర్, జైశ్వాల్ వంటి స్టార్ ఆటగాళ్లు విఫలమైన చోట పరాగ్ సత్తాచాటాడు. తన అద్బుత ఇన్నింగ్స్తో రాజస్తాన్ను పరాగ్ గెలిపించాడు. ఈ మ్యాచ్లో 39 బంతులు ఎదుర్కొన్న పరాగ్ 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 3 మ్యాచ్లు ఆడిన పరాగ్.. 181 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో పరాగ్పై రాజస్తాన్ రాయల్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. పరాగ్ తన ఆట తీరుతో సూర్యకుమార్ యాదవ్ను గుర్తు చేస్తున్నడంటూ బాండ్ కొనియాడాడు. "పరాగ్ అద్బుతమైన ఆటగాడు. అతడు తన ఆట తీరుతో సూర్యకుమార్ యాదవ్ను గుర్తు చేశాడు. సూర్య ముంబై ఇండియన్స్లోకి కొత్తగా వచ్చినప్పుడు ఈ తరహా ప్రదర్శనే చేసేవాడు. పరాగ్కు మంచి బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. అతడు కేవలం 22 ఏళ్ల వయస్సుకే అద్బుతమైన టాలెంట్ను సంపాందించుకున్నాడు. కచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందు అతడు దేశవాళీ క్రికెట్లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. అందుకే అతడికి బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఇచ్చాం. దేవ్దత్ పడిక్కల్ను వదులుకోవడంతో పరాగ్ ఆ స్ధానంలో బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది. అతడి నుంచి ఈ తరహా ప్రదర్శన కోసం మేము ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాము. రాజస్తాన్ అతడిపై పెట్టిన పెట్టుబడికి ఇప్పుడు ప్రతిఫలం పొందుతుంది. మిగిలిన సీజన్లో కూడా రియాన్ తన ఫామ్ను కొనసాగించాలని ఆశిస్తున్నానని" క్రిక్ట్రాకర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాండ్ పేర్కొన్నాడు. -
ఓటమి బాధలో ఉన్న ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్! ఇక కష్టమే
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్ల్లో ఓటమి పాలై బాధలో ఉన్న ముంబైకు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఈ ఏడాది సీజన్లో మరి కొన్ని మ్యాచ్లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. అతడు ఇప్పటిలో జట్టుతో చేరేలా సూచనలు కన్పించడం లేదు. ప్రస్తుతం ఏన్సీఏలో ఉన్న సూర్య గాయం నుంచి కోలుకుంటున్నాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. సూర్య పూర్తి ఫిట్నెస్ సాధించడానికి మరి కొన్ని రోజుల పట్టనున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని బీసీసీఐ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. సూర్య చాలా త్వరగా కోలుకుంటున్నాడు. అతడు అతి త్వరలోనే ముంబై జట్టుతో కలవనున్నాడు. అయితే మొదటి రెండు మ్యాచ్లు ఆడలేకపోయిన సూర్య.. మరి కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉండే ఛాన్స్ ఉందని బీసీసీఐ సీనియర్ ఆధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం సూర్యలేని లోటు ముంబై జట్టులో స్పష్టంగా కన్పిస్తోంది. ఇక గతేడాది డిసెంబర్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో సూర్యకుమార్ యాదవ్ గాయపడ్డాడు. ఆ తర్వాత జర్మనీలో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్నాడు. అప్పటి నుంచి సూర్య మళ్ళీ మైదానంలో కనిపించలేదు. కాగా ముంబై ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్లో ఏప్రిల్ 1న రాజస్తాన్ రాయల్స్తో తలపడనుంది. -
IPL 2024: సన్రైజర్స్తో మ్యాచ్కు ముందు ముంబైకు మరో ఎదురుదెబ్బ
ఈ సీజన్ తొలి మ్యాచ్లో గుజరాత్ చేతిలో అనూహ్య ఓటమిని ఎదుర్కొన్న ముంబై ఇండియన్స్కు సన్రైజర్స్తో రేపు (మార్చి 27) జరుగబోయే కీలక మ్యాచ్కు ముందు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎన్సీఏ నుంచి ఎన్ఓసీ లభించని కారణంగా తొలి మ్యాచ్కు (గుజరాత్) దూరంగా ఉండిన సూర్యకుమార్ యాదవ్.. సన్రైజర్స్తో మ్యాచ్కు కూడా అందుబాటులో ఉండటం కష్టమేనని తెలుస్తుంది. ఎన్సీఏ స్కైకు ఇంకా ఎన్ఓసీ ఇవ్వలేదని సమాచారం. ఇవాళ సాయంత్రలోగా ఎన్సీఏ సూర్యకుమార్కు ఎన్ఓసీ ఇవ్వకపోతే.. రేపటి మ్యాచ్కు అతను అందుబాటులోకి రావడం దాదాపుగా అసాధ్యమే. ముంబై తొలి మ్యాచ్లో స్కై లేని లోటు స్పష్టంగా కనిపించింది. గుజరాత్తో మ్యాచ్లో సూర్యకుమార్ ఉండివుంటే ముంబై సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించి ఉండేది. రేపటి మ్యాచ్కు కూడా స్కై దూరమైతే అది ముంబై విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. Suryakumar Yadav didn't get the clearance from NCA to be fit for the IPL 2024. (Sports Tak). - He will miss 2nd match for Mumbai Indians. pic.twitter.com/bcpsTFtcMC — CricketMAN2 (@ImTanujSingh) March 26, 2024 కాగా, సూర్యకుమార్ గతకొంతకాలంగా గాయాలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. స్కై ఇటీవలే పలు సర్జరీలు చేయించుకుని ప్రస్తుతం ఎన్సీఏ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. స్కై ఐపీఎల్ ఆడాలంటే ఎన్సీఏ వైద్యుల అనుమతి తప్పనిసరి. వారు ఎన్ఓసీ ఇస్తేనే స్కైకు ఐపీఎల్ ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది. ఇదిలా ఉంటే, ముంబై ఇండియన్స్ హైదరాబాద్ వేదికగా ఎస్ఆర్హెచ్తో రేపు జరుగబోయే మ్యాచ్లో తాడోపేడో తేల్చుకోబోతుంది. ఇరు జట్లు తమతమ తొలి మ్యాచ్ల్లో ప్రత్యర్దుల చేతుల్లో ఓడటంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. ముంబై తమ తొలి మ్యాచ్లో గుజరాత్ చేతిలో ఓడగా.. సన్రైజర్స్ కేకేఆర్ చేతిలో పరాజయంపాలైంది. సన్రైజర్స్, ముంబై ఇండియన్స్ మధ్య రేపటి మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. -
ముంబై ఇండియన్స్కు గుండె పగిలే వార్త.. హార్ట్ బ్రేక్ పోస్ట్ పెట్టిన స్కై
ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్కు గుండె పగిలే వార్త. ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇన్స్టా స్టోరీలో హార్ట్ బ్రేక్ పోస్ట్ పెట్టి అభిమానులను కలవరపెట్టాడు. స్కై పరోక్షంగా తాను ఐపీఎల్ 2024 ఆడలేనన్న సంకేతాలిచ్చాడు. స్కై పోస్ట్ పెట్టిన సందర్భాన్ని బట్టి చూస్తే ఇదే నిజమని తెలుస్తుంది. గతకొంతకాలంగా గాయాలతో సతమతమవుతున్న స్కై ఇటీవలే పలు సర్జరీలు చేయించుకుని ఎన్సీఏ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. స్కై ఐపీఎల్ ఆడాలంటే ఎన్సీఏ నో అబ్జక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. తాజా పరిస్థితులను బట్టి చూస్తే ఎన్సీఏ సూర్యకుమార్కు ఎన్ఓసీ ఇచ్చేందుకు నిరాకరించినట్లుంది. అందుకే అతను సోషల్ మీడియా వేదికగా తన బాధను బహిర్గతం చేసి ఉండవచ్చు. Suryakumar Yadav's Instagram story. pic.twitter.com/2M7ZGBhTDN — Mufaddal Vohra (@mufaddal_vohra) March 19, 2024 ఇటీవలే రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్కు ఎన్ఓసీ ఇచ్చిన ఎన్సీఏ.. స్కై విషయంలో అధికారికంగా ఏమేరకు స్పందిస్తుందో వేచి చూడాలి. ఐపీఎల్ 2024 ప్రారంభానికి మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో స్కై క్రిప్టిక్ పోస్ట్ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతేడాది డిసెంబర్ నుంచి క్రికెట్కు దూరంగా ఉన్న సూర్యకుమార్ చీలిమండ, స్పోర్ట్స్ హెర్నియాలకు సర్జరీలు చేయించుకున్నాడు. సూర్యకుమార్ తాజా పోస్ట్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ ఎన్సీఏ స్కైకు ఎన్ఓసీ ఇవ్వకపోతే అతను సీజన్ మొత్తానికి దూరంగా ఉంటాడా లేక తొలి దశ మ్యాచ్లకు మాత్రమే దూరమవుతాడా అన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కే.. ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి. ముంబై ఇండియన్స్ ఈ సీజన్ తొలి మ్యాచ్ను మార్చి 24న ఆడనుంది. అహ్మదాబాద్లో జరిగే ఆ మ్యాచ్లో ముంబై.. గుజరాత్ టైటాన్స్ను ఢీకొంటుంది. -
IPL 2024: ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్..!
ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు ఫైవ్ టైమ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్కు చేదు వార్త వినిపిస్తుంది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ రాబోయే సీజన్ తొలి రెండు మ్యాచ్లకు దూరం కానున్నాడని తెలుస్తుంది. ఈ ఏడాది ఆరంభంలో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్న స్కై.. ముంబై ఆడే తొలి రెండు మ్యాచ్లకు అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువేనని ముంబై ఇండియన్స్ వర్గాల సమాచారం. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ వైద్యుల పర్యవేక్షణలో ఉన్న సూర్యకుమార్.. బ్యాటింగ్ ప్రాక్టీస్ ఇంకా మొదలుపెట్టలేదని తెలుస్తుంది. స్కై ఇటీవల తన ఫిట్నెస్ను రివీల్ చేస్తే కొన్ని వీడియోలు సోషల్మీడియాలో పోస్ట్ చేసినప్పటికీ.. వాటిలో ఎక్కడా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనపడలేదు. దీంతో అతను ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదన్న విషయం స్పష్టమైంది. ఎన్సీఏ వైద్య బృందం సైతం స్కైకు ఎన్ఓసీ ఇచ్చేందుకు మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. టీ20 ఫార్మాట్లో వరల్డ్ నంబర్ వన్ ర్యాంకర్ అయిన స్కై.. ఎంఐ ఆడే తొలి రెండు మ్యాచ్లకు దూరమైతే దాని ప్రభావం ఆ జట్టుపై భారీగా పడే అవకాశం ఉంటుంది. ఐపీఎల్ ప్రారంభానికి 10 రోజులు, ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్కు మరో 12 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో స్కై పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడో లేదో వేచి చూడాలి. కాగా, రాబోయే ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ను మార్చి 24న ఆడనుంది. అహ్మదాబాద్లో జరిగే ఈ మ్యాచ్లో ముంబై.. గుజరాత్ను ఢీకొట్టనుంది. గుజరాత్ నుంచి వలస వచ్చిన హార్దిక్ ఈ సీజన్లో ముంబై ఇండయన్స్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. అతను తన తొలి మ్యాచ్లోనే తన మాజీ జట్టుతో తలపడాల్సి ఉండటం ఆసక్తికరంగా మారింది. మరోవైపు ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తనకంటే చాలా జూనియర్ అయిన హార్దిక్ సారథ్యంలో సాధారణ ఆటగాడిగా కొనసాగుతాడో లేదో అన్న అంశంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇంగ్లండ్తో ఐదో టెస్ట్ చివరి రోజు ఆటలో రోహిత్ బరిలోకి దిగకపోవడాన్ని బట్టి చూస్తే, అతను ఈ సీజన్లో ముంబై ఇండియన్స్కు హ్యాండ్ ఇచ్చేలానే కనిపిస్తున్నాడు. ముంబై ఇండియన్స్కు చెందిన మరో స్టార్ ఆటగాడు, టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా కూడా హార్దిక్ సారథ్యంలో ఆడేందుకు ముందు నుంచే ససేమిరా అంటున్నాడు. ఇన్ని ప్రతికూలతల నడుమ ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి. 2024 ఐపీఎల్ సీజన్.. మార్చి 22న సీఎస్కే-ఆర్సీబీ మధ్య మ్యాచ్తో మొదలవుతుంది. -
Viral Video: ఆ ముగ్గురి షాట్లను ఎంత చక్కగా ఆడాడో చూడండి..!
గత కొన్ని రోజులుగా భారత క్రికెట్ సర్కిల్స్లో వినిపిస్తున్న పేరు ముషీర్ ఖాన్. ఈ 18 ఏళ్ల ముంబై కుర్రాడు అండర్-19 ప్రపంచకప్లో వరుస సెంచరీలతో విరుచుకుపడుతూ టాక్ ఆఫ్ ద కంట్రీగా మారాడు. క్రికెట్కు సంబంధించి ఏ ఇద్దరు ముగ్గురి మధ్య డిస్కషన్ జరిగినా ముషీర్ ఖాన్ పేరు వినిపిస్తుంది. అంతలా ముషీర్ ఓవర్నైట్ స్టార్ అయిపోయాడు. అయితే, ముషీర్ ఇంత హైప్ ఊరికే రాలేదు. వరల్డ్కప్ అతను పారించిన పరుగుల వరద, అతను ఆడిన షాట్లు, దూకుడు, టెక్నిక్.. ఇలా ఎన్నో కారణాల వల్ల అతనికి ఈ స్థాయి క్రేజ్ వచ్చింది. తాజాగా ఓ అభిమాని వరల్డ్కప్లో ముషీర్ ఆడిన కొన్ని షాట్లను ఎడిట్ చేసి సోషల్మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. అంతలా ఆ వీడియోలో ఏముందని అనుకుంటున్నారా..? అయితే ఈ వీడియోను మీరు కూడా చూసేయండి. Musheer khan channels his inner Ms Dhoni, Sachin Tendulkar, Suryakumar yadav #U19WorldCup2024 #IndianCricket pic.twitter.com/WJJLoyy4RU — Sahil (@Vijayfans45) January 31, 2024 నిలకడ, దూకుడు, వైవిధ్యంతో పాటు బలమైన టెక్నిక్ కలిగిన ముషీర్.. తనలో భారత క్రికెట్ దిగ్గజాల టాలెంట్ అంతా కలగలుపుకుని ఉన్నాడు. కెరీర్లో అత్యుత్తమ ఫామ్లో ఉన్నట్లు కనిపిస్తున్న ముషీర్ ప్రస్తుత వరల్డ్కప్లో తాను ఆడిన ప్రతి షాట్ను ఎంతో కాన్ఫిడెంట్గా ఆడాడు. ముషీర్ కాన్ఫిడెన్స్ ఏ స్థాయిలో ఉందంటే.. అతను అచ్చుగుద్దినట్లు సచిన్, ధోని, సూర్యకుమార్ యాదవ్ ట్రేడ్మార్క్ షాట్లను ఆడాడు. ముషీర్ ఈ షాట్లు ఆడిన విధానం చూసి అంతా నివ్వెరపోతున్నారు. ఇంత చిన్న వయసులో ఈ కుర్రాడు దిగ్గజాలు ఆడిన షాట్లను ఎంత చక్కగా ఇమిటేట్ చేస్తున్నాడంటే ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరలవుతుంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం భారత క్రికెట్ సర్కిల్స్లో ముషీర్తో పాటు అతని అన్న సర్ఫరాజ్ ఖాన్ పేరు కూడా వినిపిస్తుంది. దేశవాలీ క్రికెట్లో పరుగుల వరద పారించి, అభినవ బ్రాడ్మన్గా కీర్తించబడిన సర్ఫరాజ్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియా చోటు దక్కించుకున్నాడు. సర్ఫరాజ్ ఇంగ్లండ్తో రేపటి నుంచి ప్రారంభంకాబోయే రెండో టెస్ట్లో అరంగేట్రం చేయడం ఖాయమని తెలుస్తుంది. సర్ఫరాజ్, ముషీర్ల పేర్లు ఒకేసారి దేశం మొత్తం మార్మోగుతుండటంతో వీరి తండ్రి ఆనందోత్సాహాలతో ఉప్పొంగిపోతున్నాడు. ముషీర్.. ప్రస్తుత వరల్డ్కప్లో ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడి 81.25 సగటున 2 సెంచరీలు (ఐర్లాండ్పై 106 బంతుల్లో 118 పరుగులు, యూఎస్ఏపై 76 బంతుల్లో 73 పరుగులు), ఓ హాఫ్ సెంచరీ (యూఎస్ఏపై 76 బంతుల్లో 73 పరుగులు) సాయంతో 325 పరుగులు చేసి లీడింగ్ రన్స్కోరర్గా కొనసాగుతున్నాడు. ముషీర్ అన్న సర్ఫరాజ్ సైతం 2016 అండర్-19 వరల్డ్కప్లో లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. ప్రస్తుత అండర్-19 వరల్డ్కప్ ఎడిషన్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ భారత్.. అనధికారికంగా సెమీస్ బెర్త్ను ఖరారు చేసుకుంది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. యంగ్ ఇండియా తమ తదుపరి సూపర్ సిక్స్ మ్యాచ్లో (ఫిబ్రవరి 2) నేపాల్ను ఢీకొంటుంది. -
చాలా సంతోషంగా ఉంది.. సంబరాలకు రెడీ అవ్వు సర్ఫరాజ్: సూర్య
భారత జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్తో రెండు టెస్టుకు సర్ఫరాజ్ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. వైజాగ్ టెస్టుకు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా దూరం కావడంతో సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. సర్ఫరాజ్తో పాటు యూపీ ఆల్రౌండర్ సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్లను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ క్రమంలో సర్ఫరాజ్కు టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ అభినంధనలు తెలిపాడు. భారత జట్టు నుంచి తొలిసారి పిలుపు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సంబరాలకు రెడీ అవ్వు సర్ఫరాజ్ అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. వీరిద్దరూ దేశీవాళీ క్రికెట్లో ముంబై జట్టుకు ప్రాతినథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా గత కొంత కాలంగా దేశీవాళీ క్రికెట్లో సర్ఫరాజ్ అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు 45 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన సర్ఫరాజ్.. 69.85 సగటుతో 3,912 రన్స్ చేశాడు. 14 శతకాలు, 11 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇందులో ఓ ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది. ఫిబ్రవరి 2 నుంచి వైజాగ్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. చదవండి: Ind vs Eng: ఆఖరి 3 టెస్టులకు జట్టు ఎంపిక?.. కోహ్లి రీఎంట్రీ డౌటే!? -
చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు
టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్కు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. 2023 ఏడాదికిగాను ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా సూర్య భాయ్ ఎంపికయ్యాడు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును సూర్య అందుకోవడం వరుసగా రెండో సారి కావడం విశేషం. తద్వారా టీ20 ఫార్మాట్లో ఈ అవార్డును రెండు సార్లు అందుకున్న ఏకైక క్రికెటర్గా మిస్టర్ 360 నిలిచాడు. ఇక ఈ అవార్డు కోసం సూర్యతో పాటు సికందర్ రజా (జింబాబ్వే), అల్పేష్ రమ్జాని (ఉగాండా), మార్క్ చాప్మన్ (న్యూజిలాండ్) అవార్డు కోసం పోటీపడ్డారు. కానీ వీళ్లందరిలో సూర్య వైపే ఐసీసీ మొగ్గు చూపింది. 2023 ఏడాదిలో సూర్యకుమార్ 17 ఇన్నింగ్స్లో 48 సగటుతో 733 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లో రెండు సెంచరీలు ఉన్నాయి. కాగా అంతకుముందు 2022 ఏడాదిలోనూ ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా సూర్యకుమార్ నిలిచిన సంగతి తెలిసిందే. కాగా ఈ అవార్డును ఐసీసీ 2021 నుంచి బహుకరిస్తుంది. 2021లో పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ అందుకున్నాడు. మరోవైపు 2023 ఏడాదికి గాను ఐసీసీ ప్రకటించిన టీ20 జట్టుకు సూర్యనే కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఈ జట్టులో భారత్ నుంచి యశస్వి జైస్వాల్, రవి భిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్లకు చోటు దక్కింది. ఇక సూర్య ప్రస్తుతం గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్-2024 సమయానికి అతడు పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశం ఉంది. -
ఐసీసీ టెస్ట్ జట్టు ప్రకటన.. టీమిండియా నుంచి ఇద్దరు!
2023 అత్యుత్తమ టెస్ట్ జట్టును ఐసీసీ ఇవాళ (జనవరి 23) ప్రకటించింది. ఈ జట్టుకు సారధిగా ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఎంపిక కాగా.. టీమిండియా నుంచి ఇద్దరు ఆటగాళ్లకు చోటు లభించింది. ఈ జట్టుకు ఓపెనర్లుగా ఆసీస్ ఆటగాడు ఉస్మాన్ ఖ్వాజా, శ్రీలంక ప్లేయర్ దిముత్ కరుణరత్నే ఎంపిక కాగా.. వన్ డౌన్ బ్యాటర్గా న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, నాలుగో స్థానంలో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్, ఐదో ప్లేస్లో ఆసీస్ ఆటగాడు ట్రవిస్ హెడ్, వికెట్కీపర్ బ్యాటర్గా ఆసీస్ ఆటగాడు అలెక్స్ క్యారీ, ఆల్రౌండర్ల కోటాలో భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా ఆసీస్ సారధి పాట్ కమిన్స్, స్పెషలిస్ట్ పేసర్లుగా ఇంగ్లండ్ బౌలర్ మిచెల్ స్టార్క్, ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఎంపికయ్యారు. ఈ జట్టులో రిటైర్డ్ ఆటగాడు స్టువర్ట్ బ్రాడ్కు చోటు లభించడం అనూహ్యం. జట్ల వారీగా చూస్తే.. ఆస్ట్రేలియా నుంచి అత్యధికంగా ఐదుగురు ఆటగాళ్లు ఎంపిక కాగా.. ఇంగ్లండ్ నుంచి ఇద్దరు, భారత్ నుంచి ఇద్దరు, శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల నుంచి చెరో ఆటగాడు ఎంపికయ్యాడు. భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు ఈ జట్టులో చోటు దక్కకపోవడం ఆసక్తికరం. ఇదిలా ఉంటే, ఐసీసీ గతేడాది అత్యుత్తమ టెస్ట్ జట్టుతో పాటు వన్డే, టీ20 జట్లను కూడా ప్రకటించింది. ఒక్క ఆటగాడికి కూడా మూడు ఫార్మాట్ల జట్లలో చోటు లభించలేదు. 2023 ఐసీసీ టెస్ట్ జట్టు: ఉస్మాన్ ఖ్వాజా, దిముత్ కరుణరత్నే, కేన్ విలియమ్సన్, జో రూట్, ట్రవిస్ హెడ్, రవీంద్ర జడేజా, అలెక్స్ క్యారీ (వికెట్కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), రవిచంద్రన్ అశ్విన్, మిచెల్ స్టార్క్, స్టువర్ట్ బ్రాడ్ 2023 ఐసీసీ వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, ట్రవిస్ హెడ్, విరాట్ కోహ్లి, డారిల్ మిచెల్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్కీపర్), మార్కో జన్సెన్, ఆడమ్ జంపా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్ 2023 ఐసీసీ టీ20 జట్టు: ఫిలిప్ సాల్ట్, యశస్వి జైస్వాల్, నికోలస్ పూరన్, మార్క్ చాప్మన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సికందర్ రజా, అల్పేష్ రంజనీ, మార్క్ అడైర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, రిచర్డ్ నగరవ -
ఐసీసీ టీ20 జట్టు ప్రకటన.. కెప్టెన్గా సూర్య భాయ్
ఐసీసీ 2023 సంవత్సరపు అత్యుత్తమ టీ20 జట్టును ఇవాళ (జనవరి 22) ప్రకటించింది. ఈ జట్టుకు టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా ఎంపిక కాగా.. భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు చోటు దక్కలేదు. ప్రపంచ మేటి బ్యాటర్లైన కోహ్లి, రోహిత్లను విస్మరించిన ఐసీసీ అనూహ్యంగా భారత యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, రవి భిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్లకు చోటు కల్పించింది. సూర్యతో కలుపుకుని ఐసీసీ జట్టులో మొత్తం నలుగురు భారత ఆటగాళ్లకు చోటు లభించింది. యశస్వికి జతగా ఇంగ్లండ్ ఆటగాడు ఫిలిప్ సాల్ట్ను ఓపెనర్గా ఎంపిక చేసిన ఐసీసీ.. వన్డౌన్లో విండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, ఐదో స్థానంలో న్యూజిలాండ్ ఆటగాడు మార్క్ చాప్మన్, ఆల్రౌండర్ల కోటా జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా, ఉగాండ ప్లేయర్ అల్పేష్ రంజనీ, స్పెషలిస్ట్ బౌలర్లుగా మార్క్ అడైర్ (ఐర్లాండ్), రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్ (భారత్), రిచర్డ్ నగరవ (జింబాబ్వే)లను ఎంపిక చేసింది. ఐసీసీ ఈ జట్టులో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్ల నుంచి ఒక్క ఆటగాడిని కూడా ఎంపిక చేయకపోవడం విశేషం. -
టీమిండియాకు బిగ్ షాక్
జనవరి 11 14, 17 తేదీల్లో ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా ఇన్ ఫామ్ ఆటగాళ్లు రుతురాజ్ గైక్వడ్, సూర్యకుమార్ యాదవ్ ఆఫ్ఘన్ సిరీస్కు దూరమయ్యారు. వన్డే వరల్డ్కప్ సందర్భంగా గాయపడ్డ హార్దిక్ పాండ్యా కూడా ఈ సిరీస్కు దూరంగా ఉండనున్నాడు. ఈ విషయాన్ని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో వెల్లడించింది. కాగా, ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్ కోసం జట్టును ఎంపిక చేసేందుకు సెలెక్టర్లు ఇవాళ ముంబైలో సమావేశం కానున్నారు. అజిత్ అగర్కార్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్తో పాటు ఆతర్వాత ఇంగ్లండ్తో జరుగబోయే టెస్ట్ సిరీస్ (తొలి రెండు టెస్ట్లకు) కోసం కూడా భారత జట్టును ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్తో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తిరిగి టీ20ల్లోకి పునరాగమనం చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, టీమిండియాతో సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఇదివరకే ప్రకటించారు. ఆఫ్ఘన్ జట్టుకు సారధిగా ఇబ్రహీం జద్రాన్ వ్యవహరించనున్నాడు. ఇటీవలే వెన్నునొప్పికి సర్జరీ చేయించుకున్న రషీద్ ఖాన్ కూడా ఈ జట్టుకు ఎంపికయ్యాడు. టీమిండియాతో టీ20 సిరీస్కు అఫ్గనిస్తాన్ జట్టు.. ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మతుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జనత్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ హక్ ఫారూఖీ, ఫరీద్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీం, కైస్ అహ్మద్, గుల్బదిన్ నైబ్, రషీద్ ఖాన్. -
ప్రతిష్టాత్మక అవార్డుల రేసులో సూర్యకుమార్, యశస్వి జైస్వాల్
ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డులైన మెన్స్ టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ (2023), మెన్స్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ (2023) రేసులో ఇద్దరు టీమిండియా స్టార్ ఆటగాళ్లు నిలిచారు. మెన్స్ టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు నామినీస్ జాబితాలో విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్.. మెన్స్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు నామినీస్ జాబితాలో యశస్వి జైస్వాల్ ఉన్నారు. టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రేసులో స్కైతో పాటు జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా, న్యూజిలాండ్ ఆటగాడు మార్క్ చాప్మన్, ఉగాండ ఆటగాడు అల్పేశ్ రామ్జనీ ఉండగా.. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులో యశస్వితో పాటు న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర, సౌతాఫ్రికా పేసర్ గెరాల్డ్ కొయెట్జీ, శ్రీలంక పేసర్ దిల్షన్ మధుషంక నిలిచారు. గతేడాది ప్రదర్శన ఆధారంగా ఐసీసీ ఆయా ఆటగాళ్లను నామినేట్ చేసింది. 2023 టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ (17 ఇన్నింగ్స్ల్లో 48.86 సగటున 155.95 స్ట్రయిక్రేట్తో 733 పరుగులు) 2023 టీ20ల్లో సికందర్ రజా (11 ఇన్నింగ్స్ల్లో 51.50 సగటున 150.14 స్ట్రయిక్రేట్తో 515 పరుగులు), బౌలింగ్లో 14.88 సగటున 6.57 ఎకానమీతో 17 వికెట్లు 2023 టీ20ల్లో అల్పేశ్ రామ్జనీ (30 మ్యాచ్ల్లో 8.98 సగటున 4.77 ఎకానమీతో 55 వికెట్లు) 2023 టీ20ల్లో మార్క్ చాప్మన్ (17 ఇన్నింగ్స్ల్లో 50.54 సగటున 145.54 స్ట్రయిక్రేట్తో 556 పరుగులు) ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ నామినీస్ విషయానికొస్తే.. రచిన్ రవీంద్ర (10 మ్యాచ్ల్లో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 578 పరుగులు, 7 వికెట్లు), గెరాల్డ్ కొయెట్జీ (8 మ్యాచ్ల్లో 20 వికెట్లు), దిల్షన్ మధుషంక (9 మ్యాచ్ల్లో 21 వికెట్లు) వన్డే వరల్డ్కప్ 2023లో అద్భుత ప్రదర్శనల కారణంగా ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు. యశస్వి జైస్వాల్ (4 టెస్ట్లు, 15 టీ20ల్లో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీల సాయంతో 718 పరుగులు) అయితే ఫార్మాట్లకతీతంగా ఇరగదీసి ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో ముందున్నాడు. -
అయ్యో సూర్య.. ఊతకర్ర సాయంతో మిస్టర్ 360! వీడియో వైరల్
టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ గాయం కారణంగా దాదాపు రెండు నెలల పాటు ఆటకు దూరంగా ఉండనున్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో ఫీల్డింగ్ చేస్తుండగా సూర్య కాలు మెలిక పడింది. అనంతరం స్కానింగ్ తరలించగా చీలమండలో చీలిక వచ్చినట్లు తేలింది. సూర్య పూర్తిగా కోలుకోవడానికి కనీసం రెండు నుంచి మూడు నెలల సమయం పట్టనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే స్వదేశంలో జరగనున్న అఫ్గాన్తో టీసిరీస్కు మిస్టర్ 360 దూరమయ్యాడు. అయితే తన గాయంపై సూర్యకుమార్ తొలిసారి స్పందించాడు. త్వరగా గాయం నుంచి కోలుకుని తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తాని సూర్య తెలిపాడు. ఊతకర్ర సాయంతో నడుస్తున్న వీడియోను ఇన్స్టాగ్రామ్లో సూర్య షేర్ చేశాడు. "గాయపడటం సరదాగా ఏమీ ఉండదు. అయితే, గాయాలను నేను మరీ అంత సీరియస్గా తీసుకోను. ఈ గాయం నుంచి త్వరగా బయటపడేందుకు తీవ్రంగా శ్రమిస్తాను. అతి త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెడతానని హామీ ఇస్తున్నాను. అప్పటివరకు మీరందరూ ఈ హాలిడే బ్రేక్నును ఫ్యామీలీతో ఎంజాయ్ చేస్తూ సరదాగా ఉంటారని ఆశిస్తున్నాను" ఆ వీడియోకు క్యాప్షన్గా సూర్య రాసుకొచ్చాడు. ఇదిచూసిన నెటిజన్లు సూర్య త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. కాగా దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్లో సూర్య అదరగొట్టాడు. మూడో మ్యాచ్ల సిరీస్లో సూర్య ఒక సెంచరీ, ఒక ర్ధ సెంచరీతో 156 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచాడు. అదే విధంగా ఈ ఏడాది మొత్తం కూడా టీ20ల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. . ఈ ఏడాది 18 టీ 20 మ్యాచ్లు ఆడిన సూర్యకుమార్.. 48.86 సగటు.. 155.95 స్ట్రైక్ రేట్తో 733 పరుగులు చేశాడు. ఓవరాల్గా తన కెరీర్లో ఇప్పటివరకు 60 టీ20 మ్యాచుల్లో సూర్యకుమార్ నాలుగు సెంచరీలు, 17 అర్ధసెంచరీలతో 2,141 పరుగులు చేశాడు. కాగా సూర్య ప్రస్తుతం టీ20ల్లో నెం1 బ్యాటర్గా కొనసాగుతున్నాడు. చదవండి: IND Vs SA: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు.. భారత తుది జట్టు ఇదే! ఓపెనర్లు ఎవరంటే? View this post on Instagram A post shared by Surya Kumar Yadav (SKY) (@surya_14kumar) -
అర్ష్దీప్పై కోపంతో ఊగిపోయిన సూర్య..
-
అర్ష్దీప్పై కోపంతో ఊగిపోయిన సూర్య.. వేలు చూపిస్తూ! వీడియో వైరల్
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను 1-1తో డ్రాగా భారత జట్టు ముగించింది. కాగా మూడో టీ20 అనంతరం టీమిండియా స్టాండింగ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పేసర్ అర్ష్దీప్ సింగ్పై కోపంతో ఊగిపోయాడు. టీమ్ ప్రయాణిస్తున్న బస్సులో అర్ష్దీప్ వైపు వేలు చూపిస్తూ సూర్య ఏదో అన్నాడు. అయితే సూర్య కోపానికి గల కారణమింటో మాత్రం తెలియదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు సూర్య సరదగా అలా రియాక్ట్ అయివుంటాడని కామెంట్లు చేస్తున్నారు. కాగా మూడో టీ20లో సూర్య భాయ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగిన సంగతి తెలసిందే. ఇక ప్రోటీస్తో టీ20 సిరీస్ను సమం చేసిన టీమిండియా.. ఇప్పుడు వన్డే సిరీస్కు సిద్దమవుతోంది. డిసెంబర్ 17న జోహన్నెస్బర్గ్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా ఈ సిరీస్లో భారత కెప్టెన్గా కేఎల్ రాహుల్ వ్యవహరించనుండగా.. దక్షిణాఫ్రికా సారథిగా మార్క్రమ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. చదవండి: SA vs IND: ముంబై కెప్టెన్సీ నుంచి అవుట్.. దక్షిణాఫ్రికాకు బయలుదేరిన రోహిత్! వీడియో వైరల్ -
సిరాజ్ బుల్లెట్ త్రో.. సౌతాఫ్రికా బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో వైరల్
జోహన్నెస్బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో 106 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ సమమైంది. తొలి వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20 దక్షిణాఫ్రికా, మూడో టీ20లో భారత్ గెలుపొందాయి. కాగా ఈ మ్యాచ్లో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ సంచలన త్రోతో మెరిశాడు. సిరాజ్ తన మెరుపు త్రో సౌతాఫ్రికా స్టార్ ఓపెనర్ రీజా హెండ్రిక్స్ను పెవిలియన్కు పంపాడు. ఏమి జరిగిందంటే? ప్రోటీస్ ఇన్నింగ్స్ 4వ ఓవర్ వేసిన అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో రెండో బంతిని హెండ్రిక్స్ మిడ్-ఆన్ దిశగా షాట్ ఆడాడు. ఈ క్రమంలో సింగిల్ కోసం హెండ్రిక్స్ నాన్-స్ట్రైకర్స్ ఎండ్ పరిగెత్తాడు. అయితే మిడ్-ఆన్లో ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్ వెంటనే బంతిని అందుకుని నాన్-స్ట్రైకర్స్ ఎండ్ వైపు డైరక్ట్ త్రో చేశాడు. హెండ్రిక్స్ క్రీజుకు చేరిటప్పటికే బంతి స్టంప్స్ను గిరాటేసింది. ఇది చూసిన ప్రోటీస్ బ్యాటర్ షాక్కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఈ మ్యాచ్లో సిరాజ్ వికెట్ సాధించికపోయినప్పటికీ తన బౌలింగ్తో అందరని అకట్టుకున్నాడు. 3 ఓవర్లు వేసిన సిరాజ్ కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అందులో ఒక మెయిడిన్ ఓవర్ ఉండడం విశేషం. చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు With outswingers and direct hits, @mdsirajofficial has not missed his target today 🎯 Tune-in to the 3rd #SAvIND T20I LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/6UTxXnN7Fs — Star Sports (@StarSportsIndia) December 14, 2023
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement