-
నగరం బాట పట్టిన ఆంధ్రా ఓటర్లు.. దారులన్నీ రద్దీ!
ఎన్టీఆర్, సాక్షి: సొంత ఊళ్లకు వెళ్లి ఓట్లేసిన ఏపీ ఓటర్లు.. తిరిగి తెలంగాణ బాట పట్టారు. దీంతో హైదరాబాద్ వచ్చే రహదారుల్లో వాహనాల రద్దీ నెలకొంది. సోమవారం సాయంత్రం ఉదయం నుంచే ఇది మొదలుకాగా.. మంగళవారం ఉదయానికి అది మరింతగా పెరిగింది.ఆంధ్రా నుంచి పెద్ద ఎత్తున్న ఓటర్లు తిరిగి తెలంగాణకు వస్తున్నారు. కార్లు, బస్సులు.. ఏ వాహనం దొరికితే అది పట్టుకొని హైదరాబాద్కు బయల్దేరారు. పతంగి టోల్గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ నెలకొంది. ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సుమారు 6 లక్షల మంది తెలంగాణ నుంచి వచ్చినట్లు ఒక అంచనా. ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు టోల్గేట్ వద్ద సాధారణంగా 24 గంటల వ్యవధిలో 20 వేలకు పైగా వాహనాలు హైదరాబాద్ వైపు వెళ్తుంటాయి. అయితే.. సోమవారం మాత్రం సాయంత్రం 6.30 గంటలకు వీటి సంఖ్య 35 వేలకు పైగా చేరింది. ఈ ఉదయం ఆ రద్దీ అంతకంతకు పెరుగుతోంది.ఇక.. ఏపీలో పోలింగ్ కోసం ఓటర్లు పోటెత్తారు. సోమవారం ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరి ఓటేశారు. సాయంత్రం సైతం క్యూ లైన్లలో చాలామంది వేచి ఉండడం గమనార్హం. ఏపీలో భారీగా పోలింగ్ జరిగిందని ఏపీ సీఈవో ఎంకే మీనా వెల్లడించగా, కడపటి వార్తలు అందేసరికి అది 78.36 శాతంగా నమోదు అయినట్లు తెలుస్తోంది. పోలింగ్ శాతం ఇంకా ఎక్కువే నమోదు కావొచ్చని సీఈవో ఎంకే మీనా ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఎన్హెచ్ఏఐ నిర్ణయానికి ‘నో’ చెప్పిన ఈసీ
సార్వత్రిక ఎన్నికల వేళ వాహనదారులకు కేంద్ర ఎన్నికల సంఘం రిలీఫ్ కల్పించింది. టోల్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని లోక్సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు వాయిదా వేయాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)ను ఆదేశించింది. కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ అభ్యర్థన మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో వాహనదారుల నుంచి పాత టోల్ ఛార్జీలే వసూలు చేయాలని టోల్ ఆపరేటర్లకు ఎన్హెచ్ఏఐ సూచించింది. ఏటా ఏప్రిల్ ఒకటో తేదీన ఎన్హెచ్ఏఐ టోల్ ఛార్జీలు పెంచుతుంది. సంస్థ నిర్ణయాల ప్రకారం..సరాసరి ఐదు శాతం టోల్ ఛార్జీలు పెరుగుతాయి. ఈమేరకు ముందుగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆదివారం రాత్రి నుంచి పెరిగిన టోల్ ఛార్జీలు అమల్లోకి వస్తాయని ప్రకటించారు. కానీ కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ ఛార్జీల పెంపు అంశాన్ని ఎన్నికల సంఘం వద్దకు తీసుకెళ్లింది. దాంతో ఆ వ్యవహారాన్ని పరిశీలించిన ఈసీ ఎన్నికల నేపథ్యంలో పెంపు నిర్ణయం వాయిదా వేయాలని ఎన్హెచ్ఏఐను ఆదేశించింది. దాంతో తాజాగా ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా వెనక్కి తీసుకుంటున్నట్లు ఎన్హెచ్ఏఐ తెలిపింది. పెరిగిన టోల్ ఛార్జీలు ఎప్పటి నుంచి అమలవుతాయో తెలియజేస్తామని చెప్పింది. అప్పటివరకు పాత ఛార్జీలే వర్తిస్తాయని పేర్కొంది. ఇదీ చదవండి: పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. ఎంతంటే.. ఈ మేరకు ఆదివారం అర్ధరాత్రి నుంచి వాహనదారుల నుంచి వసూలు చేసిన అదనపు మొత్తం టోల్ ఛార్జీలను సదరు వాహనదారులకు వెనక్కు చెల్లిస్తామని ఎన్హెచ్ఏఐ వర్గాలు చెప్పాయి. ఈ నెల 26 నుంచి జూన్ ఒకటో తేదీ వరకూ ఏడు విడతల్లో దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతాయి. జూన్ నాలుగో తేదీన ఫలితాలు వెలువడతాయి. -
పెరిగిన టోల్ ధర.. ఏమిటీ టోల్ ట్యాక్స్? ఎందుకు చెల్లించాలి?
టోల్ట్యాక్స్ పెంచుతున్నట్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది. పెరిగిన ఛార్జీలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి. ఏటా ఏప్రిల్ 1న టోల్ రుసుం పెరుగుతుంది. ఈసారి పెరిగిన ధరలు 2025 మార్చి 31 వరకు అమలులో ఉంటాయి. పెరిగిన ఛార్జీల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో కార్లు, జీపులు, వ్యాన్లకు ఒక వైపు ప్రయాణానికి రూ.5, రానూపోనూ కలిపి రూ.10 అదనంగా చెల్లించాలి. తేలికపాటి వాణిజ్య వాహనాలు ఒక వైపు రూ.10, ఇరు వైపులా అయితే రూ.20, బస్సు, ట్రక్కులకు వరుసగా రూ.25, రూ.35, భారీ రవాణా వాహనాలకు రూ.35 నుంచి రూ.50 చొప్పున పెంచారు. 24 గంటల లోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు రుసుంలో 25 శాతం మినహాయింపు లభిస్తుంది. ఫాస్టాగ్ అమల్లోకి వచ్చాక టోల్ ప్లాజాల వద్ద వసూళ్లు కూడా భారీగా పెరిగాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు టోల్ట్యాక్స్ అంటే ఏమిటి..? దాన్ని ఎందుకు చెల్లించాలో ఈ కథనంలో తెలుసుకుందాం. రోడ్లను ఉపయోగించడానికి ప్రతి వాహనదారుడు ప్రభుత్వానికి రోడ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. వాహనం కొనేపుడే వాహనం బరువు, తయారైన సంవత్సరం, సీటింగ్ కెపాసిటీ, ఇంజిన్ రకాలను బట్టి రోడ్ ట్యాక్స్ మొత్తాన్ని నిర్ణయిస్తారు. ఇక ఈ ట్యాక్స్ చెల్లించాం కదా అని నేషనల్ హైవేపై వాహనంతో రౌండ్స్ కొట్టొచ్చని అనుకోవద్దు. ఎందుకంటే మళ్లీ ఆ రోడ్డుపై ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని టోల్ ట్యాక్స్ అంటారు. రవాణా సౌకర్యాలను మెరుగు పరిచేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) పని చేస్తుంది. ఇది ప్రైవేటు కాంట్రాక్టు సంస్థల సహాయంతో వివిధ రాష్ట్రాల మధ్య హైవేలు, ఎక్స్ప్రెస్ హైవేలు నిర్మిస్తుంది. రోడ్డు వేయడానికి చేసిన ఖర్చును టోల్ రూపంలో వసూలు చేసి కాంట్రాక్టర్లకు చెల్లిస్తుంది. ఈ ప్రక్రియ కొన్నేళ్లపాటు సాగుతుంది. రోడ్డు వేయడానికి ఖర్చు చేసిన మొత్తం వసూలైన తరువాత టోల్ ఫీజును 40 శాతానికి తగ్గించాలనే నిబంధన ఉంది. టోల్స్ మధ్య దూరం.. టోల్ ట్యాక్స్, టోల్ ఛార్జీలను కలిపి టోల్ అని సింపుల్గా పిలుస్తుంటారు. ఎక్స్ప్రెస్ వేస్, సొరంగ మార్గాలు, వంతెనలు, జాతీయ, రాష్ట్ర రహదారులపై రాకపోకలు సాగించే వాహనాల నుంచి ఈ టోల్ వసూలు చేస్తారు. ద్విచక్ర వాహనాలకు టోల్ నుంచి మినహాయింపు ఉంటుంది. మిగిలిన వాహనాల పరిమాణాన్ని బట్టి టోల్ వసూలు చేస్తారు. టోల్ చెల్లించే రహదారులను టోల్ రోడ్లని అంటారు. వీటి నిర్వహణ బాధ్యతను ఎన్హెచ్ఏఐ పర్యవేక్షిస్తుంటుంది. నిర్దేశిత ప్రదేశంలో టోల్ బూత్లు, ప్లాజాల పేరిట కౌంటర్లు ఏర్పాటు చేసి సంబంధిత మొత్తం చెల్లించిన తరువాతనే ఇక్కడ వాహనాలను రోడ్డుపైకి అనుమతిస్తారు. రెండు టోల్ బూత్ల మధ్య సాధారణంగా 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంతకంటే తక్కువ దూరంలోనూ ఉండే అవకాశముంది. ఆ దూరాన్ని బట్టి ట్యాక్స్ వసూలు చేస్తారు. ఏటా ఏప్రిల్ 1న అవసరాన్ని బట్టి టోల్ ధరలను పెంచుతున్నారు. ప్రయాణం సాఫీగా సాగేలా.. నాణ్యమైన, గుంతలు లేని రహదారిని వినియోగించి ప్రయాణం సాఫీగా చేస్తున్నందుకు చెల్లించే రుసుమే టోల్. రోడ్ల మరమ్మతులు, నిర్వహణ కోసం కూడా టోల్ నిధులను ఖర్చు చేస్తారు. ఏళ్ల తరబడి టోల్ వసూలు చేయడం వల్ల ఆ రోడ్డు వేయడానికి చేసిన ఖర్చు వసూలవుతుంది. ఈ మొత్తాన్ని ఎన్హెచ్ఏఐ తీసుకొని రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్లు, ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు చెల్లింపులు చేస్తుంది. టోల్గేట్ వసూలు చేసే దగ్గర టో వెహికల్, తాగునీరు, మరుగుదొడ్లు, అత్యవసర సేవలు, అగ్నిప్రమాద నియంత్రణ సౌకర్యాలుంటాయి. ఫాస్టాగ్తో తగ్గిన రద్దీ టోల్ప్లాజాల వద్ద వాహనాల రద్దీని తగ్గించేందుకు ఫాస్టాగ్ను ప్రవేశపెట్టారు. నగదు రహిత లావాదేవీలు చేసేందుకు ఫాస్టాగ్ ఉపయోగపడుతుంది. ఒక స్టిక్కర్లా కనిపించే ఫాస్టాగ్ను మొబైల్ నంబర్లా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ఫాస్టాగ్ను కొన్ని మొబైల్ యాప్లు, టోల్ప్లాజా కేంద్రాల వద్ద విక్రయిస్తారు. మనం టోల్గేట్ వద్దకు వెళ్లగానే అక్కడి స్కానర్లు ఫాస్టాగ్ను రీడ్ చేస్తాయి. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా నిర్దేశిత టోల్ మొత్తం అందులో నుంచి కట్ అవుతుంది. ఈ ఫాస్టాగ్ల కారణంగా టోల్గేట్ల వద్ద రద్దీ బాగా తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఏవైనా కారణాల వల్ల టోల్ ప్లాజాల దగ్గర 100 మీటర్ల కన్నా ఎక్కువ క్యూ ఉన్నట్టైతే వాహనదారులు టోల్ ఫీజు చెల్లించకుండా ముందుకు వెళ్లిపోవచ్చు. ఇదీ చదవండి: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. తగ్గిన ధరలు! వీరికి టోల్ ఉండదు.. టోల్ ప్లాజాల వద్ద రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, స్పీకర్లు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, న్యాయమూర్తులు, ఆర్మీ, పోలీసు ఉన్నత అధికారులు ప్రయాణించే అధికారిక వాహనాలకు మినహాయింపు ఉంటుంది. అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు, అంతిమయాత్ర వాహనాల నుంచి టోల్ తీసుకోరు. టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో ఆర్టీవో ఆఫీసులో రిజిస్టర్ అయిన వాహనాలకు స్థానికులు ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. -
వాహనదారులకు ముఖ్య గమనిక, ఫాస్టాగ్లపై కీలక అప్డేట్!
టోల్గేట్ల వద్ద సమయం ఆదా చేయడంతో పాటు, వాహనాల రద్దీని తగ్గించేందుకు కేంద్రం ఎలక్ట్రానిక్ పద్దతిలో ఫాస్టాగ్ వ్యవస్థని అందుబాటులోకి తెచ్చింది. దీన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) నిర్వహిస్తోంది. ఫాస్టాగ్లోని రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా ఫాస్టాగ్కు అనుసంధానం చేసిన ప్రీ ప్రెయిడ్ లేదా సేవింగ్ ఖాతా నుంచి నేరుగా టోల్ చెల్లింపులకు అవకాశం కల్పిచ్చింది. ఈ ఫాస్టాగ్ చెల్లింపులు పేమెంట్స్ పేటీఎం బ్యాంక్ (పీపీబీఎల్) ద్వారా జరిగేవి. కానీ సెంట్రల్ బ్యాంక్ పేటీఎంపై ఆంక్షలు విధించడంతో ఇప్పుడు ఫాస్టాగ్ యూజర్లు.. టోల్ చెల్లింపుల కోసం ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషించాలని విజ్ఞప్తి చేశారు. ఈ తరుణంలో పీపీబీఎల్లో ఫాస్టాగ్లను ఫిబ్రవరి 29 లోపు వినియోగించుకోవాలని ఎన్హెచ్ఏఐ సూచించింది. ఆ తర్వాత నుంచి తాము నిర్ధేశించిన బ్యాంకుల్లో మాత్రమే ఫాస్టాగ్లను కొనుగోలు చేయాలని తెలిపింది. నిర్ధేశించిన గడువు తర్వాత పీపీబీఎల్ మినహా బ్యాంకులు అందించే ఫాస్టాగ్లను పొందాలని వెల్లడించింది. ఇప్పుడు ఆయా బ్యాంకుల్లో నిర్ధేశించిన మొత్తాన్ని చెల్లించి ఫాస్టాగ్లను పొందవచ్చు. ఫాస్టాగ్ ఛార్జీలు? హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం ఫాస్టాగ్ యాక్టివేషన్ ఛార్జీలు నామమాత్రంగా ఉన్నాయి. అయితే, వినియోగదారులకు మూడు రకాల ఫాస్టాగ్ ఛార్జీలు ఉన్నాయని గుర్తించాల్సి ఉంటుంది. వాటిల్లో 1.ఫాస్టాగ్ జాయినింగ్ ఫీజు - ఫాస్టాగ్ యూజర్గా పేరు నమోదు చేసుకొని, మీ వాహనానికి ఫాస్టాగ్ను వినియోగించేలా యాక్టీవేట్ చేసేందుకు ఫాస్టాగ్ జాయినింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజు ఒక్కసారే ఉంటుంది. 2.సెక్యూరిటీ డిపాజిట్ - ఫాస్టాగ్ అకౌంట్ మూసివేసే సమయంలో ఎలాంటి బకాయిలు లేకుండా పూర్తిగా వాపస్ చేసేందుకు అతితక్కువ మొత్తంలో సెక్యూరిటీ డిపాజిట్గా చెల్లించాల్సి ఉంటుంది. మీ వాహనాన్ని బట్టి ఆ మొత్తం మారుతూ ఉంటుంది. యూజర్ల ఫాస్టాగ్ ఖాతాలో తగినంత నిధులు లేకుంటే, ఏదైనా బకాయి ఉన్న టోల్ ఛార్జీలను సర్దుబాటు చేయడానికి సెక్యూరిటీ డిపాజిట్ని బ్యాంకులు ఉపయోగించుకోవచ్చు 3.ఫాస్టాగ్ యాక్టివేషన్ టైం : ఫాస్టాగ్ యాక్టివేషన్ అయిన వెంటనే ఏదైనా టోల్ ఛార్జీలు చెల్లించడానికి ఈ మొత్తం మీ ఫాస్టాగ్ ఖాతాలో ఉంటుంది. ఈ థ్రెషోల్డ్ మొత్తం వాహనం తరగతిపై ఆధారపడి ఉంటుంది. ఫాస్టాగ్లు జారీ చేసే బ్యాంకులు, వినియోగదారులు ఫాస్టాగ్ కోసం ఎంత చెల్లించాలో తెలిపే వివరాలు ఇలా ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుత హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వాహనదారుల నుంచి ట్యాక్స్ కింద రూ.100, సెక్యూరిటీ కింద రూ.100 వసూలు చేస్తుంది. కారు, జీప్, వ్యాన్, టాటా ఏస్ ఇలాంటి మినీ-లైట్ కమర్షియల్ వాహనాలకు విధిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ జాయినింగ్ ఫీజుగా బ్యాంక్ రూ. 99.12 (GSTతో సహా) వసూలు చేస్తుంది. సెక్యూరిటీ డిపాజిట్ రూ. 200, కారు, జీప్, వ్యాన్ థ్రెషోల్డ్ మొత్తం రూ. 200. ఈ మొత్తం చెల్లిస్తేనే మీ ఫాస్టాగ్ పనిచేస్తుంది. లేదంటే ఎలాంటి ఉపయోగం ఉండదు ఎస్బీఐ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్లు, జీప్లు, వ్యాన్లు, టాటా ఏస్, ఇతర కాంపాక్ట్ లైట్ కమర్షియల్ వాహనాలకు ఫాస్టాగ్ ఫీజులు లేదా సెక్యూరిటీ డిపాజిట్లకు ఎలాంటి అదనపు రుసుములు వసూలు చేయదు. కాకపోతే ఫాస్టాగ్ యాక్టివేషన్ కోసం కనీస బ్యాలెన్స్ రూ. 200 అవసరమని గుర్తించాలి. యాక్సిస్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఫాస్టాగ్ జారీ చేసినందుకు కస్టమర్ నుంచి ఎలాంటి రుసుమును వసూలు చేయదు. అయితే, తిరిగి రెన్యువల్ చేసే సమయంలో బ్యాంక్ రూ.100 (అన్ని ట్యాక్స్లు కలిపి) వసూలు చేస్తుంది. కారు, జీపు, వ్యాన్ వంటి వాహనాలకు బ్యాంకు సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.200 వసూలు చేస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా బరోడా ఫాస్టాగ్ వన్ టైమ్ ఫీ కింద జీఎస్టీతో కలిపి రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ వాహనం రకాన్ని బట్టి మారుతుంది. థ్రెషోల్డ్ పరిమితి రూ. 200తో పాటు కారు, జీప్, వ్యాన్లకు రూ. 200 సెక్యూరిటీ డిపాజిట్ వసూలు చేస్తుంది. కెనరా బ్యాంక్ కెనరా బ్యాంక్ రెన్యువల్ సమయంలో రీ-ఇష్యూషన్ ఫీజు కింద రూ.100 వసూలు చేస్తుంది. టాగ్ని ఆన్లైన్లో రీ-లోడ్ చేయడానికి కన్వీనియన్స్ ఫీజు రూ.10 అవుతుంది. కారు, జీప్, వ్యాన్ వంటి వాహనాలకు సెక్యూరిటీ డిపాజిట్ రూ.200, థ్రెషోల్డ్ మొత్తం రూ. 100 ఉంది. ఐడీబీఐ ఐడీబీఐ బ్యాంక్ పన్నులతో సహా రూ. 100 రీ-ఇష్యూషన్ ఫీజును వసూలు చేస్తుంది. బ్యాంక్ ట్యాగ్ డిపాజిట్ రూ. 200 వసూలు చేస్తుంది. కొటక్ మహీంద్రా వీసీ4 కోసం బ్యాంక్ రూ. 100 వసూలు చేస్తుంది. ఇతర వెహికల్ క్లాస్కు ఫాస్టాగ్ జాయినింగ్ ఫీజుగా, డిపాజిట్గా రూ. 200 కట్టాల్సి ఉంటుంది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్ సెక్యూరిటీ డిపాజిట్గా రూ. 200, కస్టమర్ వాలెట్లో లోడ్ చేసే థ్రెషోల్డ్ మొత్తంగా రూ. 200 వసూలు చేస్తుంది. బ్యాంక్ వన్ టైమ్ ట్యాగ్ జాయినింగ్ ఫీజుగా రూ. 100 , రీఇష్యూన్స్ ఫీజు కోసం రూ. 100 వసూలు చేస్తుంది. పీఎన్బీ కారు, జీప్ , వ్యాన్ వంటి వాహనాలకు రూ. 200 సెక్యూరిటీ డిపాజిట్ ఛార్జ్ చేయబడుతుంది . థ్రెషోల్డ్ మొత్తం రూ. 100 ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఫాస్టాగ్కి ఒక్కసారి రుసుము రూ. GSTతో కలిపి 100. ట్యాగ్ జాయినింగ్ ఫీజు (వన్-టైమ్ ఫీజు) రూ. 99.99 (అన్ని వర్తించే పన్నులతో సహా), వన్-టైమ్ ట్యాగ్ రీ-ఇష్యూషన్ ఫీజు రూ. 99.99 (అన్ని వర్తించే పన్నులతో సహా). రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ వాహనం రకాన్ని బట్టి ఉంటుంది. కారు / జీప్ / వ్యాన్ కోసం వన్-టైమ్ సెక్యూరిటీ డిపాజిట్ (రిజర్వ్ చేయబడిన మొత్తం) మొత్తం రూ. 150. -
పంతంగి టోల్ ప్లాజా వద్ద సంక్రాంతి రష్
-
సంక్రాంతికి ఎఫెక్ట్.. టోల్ గేట్ వద్ద ప్రత్యేకంగా..
సాక్షి, యాదాద్రి భువనగిరి: సంక్రాంతి పండుగ సందర్భంగా నగరాల నుంచి ప్రజలు గ్రామాల బాట పట్టారు. సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో, హైవేలపై వాహనాల సంఖ్య పెరిగి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో టోల్బూత్ల మధ్య ట్రాఫిక్ క్లియర్ కోసం టోల్ సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వివరాల ప్రకారం.. సంక్రాంతి సందర్బంగా జాతీయ రహదారి -65పై హైదరాబాద్-విజయవాడ వైపు వాహనాల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో పంతంగి, కొర్లపహాడ్, మాడ్గులపల్లి వద్ద వాహనాలు నిలిచిపోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదనపు టోల్ బూత్లను టోల్ సిబ్బంది టోల్ సిబ్బంది ఏర్పాటు చేశారు. దీంతో, ట్రాఫిక్ కొంత మేరకు తగ్గింది. ఇక, సంక్రాంతి సందర్బంగా విజయవాడ బస్టాండ్కు ప్రయాణీకుల రద్దీ పెరిగింది. బస్టాండ్లో ప్లాట్ఫ్లామ్లు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాల నుంచి స్వస్థలాలకు ప్రయాణీకులు చేరుకుంటున్నారు. కాగా, ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణీకుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. -
టోల్ప్లాజా తొలగింపుపై మంత్రి కీలక వ్యాఖ్యలు
సాధారణంగా చాలామందికి నిర్ణీత గడువు తర్వాత టోల్ప్లాజాలను మారుస్తారు లేదా తొలగిస్తారనే అపోహ ఉంది. కానీ దానికి సంబంధించి కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ రహదారుల రుసుముల నిబంధనలు-2008 ప్రకారం.. నిర్దిష్ట గడువు పూర్తయిన తర్వాత మూలధన వ్యయాన్ని రికవరీ చేశాక టోల్ ప్లాజాలను తొలగించాలనే ఎలాంటి నిబంధనా లేదని కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దేశంలోని జాతీయ రహదారులపై ఏర్పాటు చేసిన ఏ ఒక్క టోల్ ప్లాజాలోనూ ఇప్పటివరకు మూలధన వ్యయాన్ని పూర్తిగా రికవరీ చేయలేదని గురువారం లోక్సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేల నిర్మాణ బాధ్యతలను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పర్యవేక్షిస్తాయి. రవాణా సౌకర్యాలను మెరుగు పరిచేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎన్హెచ్ఏఐ పని చేస్తుంది. ఇది ప్రైవేటు కాంట్రాక్టు సంస్థల సహాయంతో వివిధ రాష్ట్రాల మధ్య హైవేలు, ఎక్స్ప్రెస్ హైవేలు నిర్మిస్తుంది. రోడ్డు వేయడానికి చేసిన ఖర్చును టోల్ రూపంలో వసూలు చేసి కాంట్రాక్టర్లకు చెల్లిస్తుంది. ఈ ప్రక్రియ కొన్నేళ్లపాటు సాగుతుంది. ఇదీ చదవండి: ఉంటుందో..? ఊడుతుందో..? మరోవైపు, జాతీయ రహదారులపై టోల్ ఛార్జీల వసూలుకు జీపీఎస్ ఆధారిత వ్యవస్థను 2024 మార్చి నాటికి తీసుకురానునట్లు గడ్కరీ ఇటీవల ప్రకటించారు. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తొలగడంతో పాటు జాతీయ రహదారిపై ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. -
మార్చి నాటికల్లా టోల్ ప్లాజాలుండవ్!
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మార్చి నాటికల్లా ప్రస్తుత హైవే టోల్ ప్లాజాల స్థానంలో ప్రభుత్వం కొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టనుంది. జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్ మొదలైనవి వీటిలో ఉండనున్నాయి. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయాలు తెలిపారు. వాహనాలను ఆపకుండా ఆటోమేటిక్గా టోల్ వసూళ్లకు ఉపయోగపడే ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్కు సంబంధించి తమ శాఖ రెండు పైలట్ ప్రాజెక్టులను నిర్వహించినట్లు వివరించారు. 2018–19లో టోల్ ప్లాజాల దగ్గర నిరీక్షించే సమయం సగటున 8 నిమిషాలుగా ఉండగా.. 2020–21లో ఫాస్ట్ట్యాగ్లను ప్రవేశపెట్టిన తర్వాత క్రమంగా 47 సెకన్లకు తగ్గింది. దీంతో చాలా ప్రాంతాల్లో నిరీక్షణ సమయం తగ్గినప్పటికీ జనాభా ఎక్కువ ఉన్న నగరాలకు దగ్గర్లో పీక్ అవర్స్లో ఇప్పటికీ కొంత ఎక్కువగా నిరీక్షించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే కొత్త సాంకేతికతల పరిశీలన ప్రాధాన్యం సంతరించుకుంది. -
13 రాష్ట్రాల్లో వీరిదే హవా..! ఆదాయం రూ. కోట్లలోనే..
Sahakar Group Limited (SGL): దేశంలో రోడ్డు వ్యవస్థ మునుపటి కంటే మెరుగుపడింది. హైవేలు, అండర్ పాస్, ఫ్లైఓవర్ వంటి మార్గాలు ఎక్కువయ్యాయి, తద్వారా ప్రయాణం కూడా ఇప్పుడు సులభతరం అయిపోయింది. అయితే ఇప్పుడు ఏ ప్రధాన రహదారి ఎక్కినా ఎక్కడికక్కడ టోల్ ప్లాజాలు ఎదురవుతూనే ఉంటాయి. టోల్ ప్లాజా దాటాలంటే కచ్చితంగా టోల్ పీజు చెలించాల్సి ఉంటుంది. మనదేశంలో ఎక్కువ టోల్ ప్లాజాలు కలిగిన సంస్థ ఏది? దాని ఆదాయం ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతదేశంలో అత్యధిక టోల్ ప్లాజాలు తమ అధీనంలో ఉంచుకున్న అగ్రగామి సంస్థ 'సహకార్ గ్రూప్ లిమిటెడ్' (SGL). దేశవ్యాప్తంగా సుమారు 13 రాష్ట్రాల్లో తమ ఉనికిని చాటుకుంటున్న ఈ కంపెనీ 200 కంటే ఎక్కువ టోల్ ప్లాజాలను తమ పరిధిలో ఉంచుకుంది. 1996లో 'కిషోర్ అగర్వాల్' స్థాపించిన సహకార్ గ్రూప్ లిమిటెడ్, అతి తక్కువ కాలంలోనే మంచి పురోగతిని సాధించింది. 2011 - 12 ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ. 30 కోట్లు కాగా.. 2022 - 23 నాటికి రూ. 2700 కోట్లు కంటే ఎక్కువ ఆదాయం పొందగలిగింది. దీన్ని బట్టి చూస్తే టోల్ ప్లాజా రంగంలో ఎంత అభివృద్ధి సాదించించనే విషయం ఇట్టే అర్థమైపోతుంది. సహకార్ గ్రూప్ లిమిటెడ్ కంపెనీ స్వంత కంప్యూటరైజ్డ్ సిస్టమ్లను, స్వంత యాజమాన్య కంప్యూటరైజ్డ్ టోల్ రెవెన్యూ ఆడిటింగ్ సిస్టమ్ను అభివృద్ధి చేయడంతో సహా టోల్లను వసూలు చేయడానికి అప్పటికప్పుడు కొత్త విధానాలు అలవరిస్తోంది. 1996 సమయంలో ఈ సంస్థ కేవలం ముంబై చుట్టూ ఉన్న మున్సిపల్ కౌన్సిల్ల కోసం ఆక్ట్రాయ్ సేకరణతో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఆ తరువాత మహారాష్ట్ర రాష్ట్రంలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లకు క్రమంగా విస్తరించింది. ప్రస్తుతం దేశంలో ఎక్కువ టోల్ ప్లాజాలు కలిగిన సంస్థగా అవతరించింది. ఇదీ చదవండి: మరింత తగ్గిన బంగారం, వెండి - నేటి కొత్త ధరలు ఇవే.. సహకార్ గ్రూప్ లిమిటెడ్ సంస్థలో సుమారు 4000 కంటే ఎక్కువ మంది పనిచేస్తున్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతే కాకుండా టోల్ ప్లాజాల సంఖ్య కూడా తప్పకుండా పెరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
నకిలీ టోల్ప్లాజాతో కోట్లు కొట్టేశారు
గాం«దీనగర్: పూర్వం రహదారిపై దారి దోపిడీలు జరిగేవి. ఇప్పుడు దొంగలు ఏకంగా జాతీయరహదారిపై టోల్ప్లాజా ఒకటి తెరిచేసి దర్జాగా టోల్ వసూళ్లు మొదలెట్టేశారు. ఈ దోపిడీ ఘటనకు గుజరాత్ రాష్ట్రంలోని జాతీయరహదారి వేదికైంది. నకిలీ టోల్ప్లాజా ద్వారా మోసగాళ్ల ముఠా ఏకంగా రూ.75 కోట్లకుపైగా వసూళ్లకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఏడాదికాలంగా ఇది జరుగుతున్నా పోలీసులకు ఇంతకాలం సమాచారం లేకపోవడం విడ్డూరం. నకిలీ టోల్ప్లాజా గుట్టుమట్లు తాజాగా స్థానికంగా వెలుగులోకి వచ్చాక చిట్టచివరన పోలీసులకు తెలిశాయి. ప్రస్తుతం కేసు నమోదుచేసి దర్యాప్తు మొదలెట్టి ఐదుగురిని అరెస్ట్చేశారు. సంబంధిత వివరాలను పోలీసులు వెల్లడించారు. తక్కువ రేటు కావడంతో అంతా గప్చుప్ మోర్బీ జిల్లా, కఛ్ జిల్లాలను కలిపే 8ఏ నంబర్ జాతీయరహదారిపై వాఘసియా టోల్ప్లాజా ఉంది. దీని గుండా వెళ్లకుండా సమీప ప్రాంతం గుండా వెళ్లొచ్చని వాహనదారులు కనిపెట్టారు. అనుకున్నదే తడవుగా ఆ ప్రాంతం గుండా వెళ్లడం మొదలెట్టారు. ఈ విషయం తెల్సుకున్న ఒక ముఠా ఒక కొత్త పథకంతో రంగంలోకి దిగింది. ఈ మార్గంలో నిరుపయోగంగా ఉన్న ‘వైట్హౌజ్’ అనే సిరామిక్ ఫ్యాక్టరీని అద్దెకు తీసుకున్నారు. దానికి ఇరువైపులా హైవే వరకు కొత్త రోడ్లు వేశారు. ఫ్యాక్టరీలో టోల్ ప్లాజా కౌంటర్ నిర్మించి వసూళ్ల పర్వానికి తెరలేపారు. సాధారణంగా జాతీయరహదారిపై ఒక్కో వాహనాన్ని బట్టి రూ. 110 నుంచి రూ.595 వసూలుచేస్తారు. కానీ ఈ ‘దొంగ’ మార్గంలో వెళ్లే వాహనదారుల నుంచి ఈ ముఠా కేవలం రూ.20 నుంచి రూ.200 వసూలుచేసేవారు. ఇంత తక్కువకే టోల్గేట్ను దాటేస్తుండటంతో తెల్సినవారంతా ఈ మార్గంలోనే రాకపోకలు సాగించేవారు. కొత్త వాహనదారులకు, స్థానికులకు ఇది బోగస్ టోల్ప్లాజా అని తెల్సికూడా.. తక్కువ ధరలో పని అయిపోతుందని మిన్నకుండిపోయారు. దాంతో ముఠా వ్యాపారం ఒక ఏడాదిపాటు యథేచ్చగా సాగింది. గత 18 నెలల్లో ఈ ముఠా దాదాపు రూ.75 కోట్లు కొట్టేసిందని మాజీ ఐపీఎస్ రమేశ్ ఆరోపించారు. నిందితుల్లో పటేల్ నేత కుమారుడు స్థానిక మీడియాలో కథనాలు, విమర్శలు రావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఐదుగురిని అరెస్ట్చేశారు. సిరమిక్ ఫ్యా క్టరీ యజమాని అమర్షీ పటేల్తోపాటు అతని నలుగురు అనుచరులు, మరో వ్య క్తినీ అరెస్ట్చేశారు. అమర్షీ సౌరాష్ట్ర ప్రాంతంలో కీలకమైన పటిదార్ సామాజిక వర్గానికి చెందిన నేత కుమారుడు కావడం గమనార్హం. -
టోల్ప్లాజా వద్ద కారు బీభత్సం.. పలువురు మృతి
ముంబై: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అతి వేగంతో దూసుకొచ్చిన ఓ కారు.. టోల్ప్లాజా వద్ద క్యూ లైన్లో ఉన్న వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. ముంబైలోని వర్లీ ప్రాంతంలో టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న పలు వాహనాలను అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఢీకొట్టింది. గురువారం రాత్రి వర్లీ నుంచి బాంద్రావైపు వెళ్తున్న ఇన్నోవా కారు పలు వాహనాలను బలంగా ఢీకొంది. వర్లీలో సీ లింక్లో ఉన్న టోల్ ప్లాజాకు 100 మీటర్ల ముందు మొదట మెర్సిడెస్ కారును ఢీకొట్టిందని, ఆ తర్వాత మరో రెండు మూడు వాహనాలను ఢీకొట్టిందని డీసీపీ కృష్ణకాంత్ ఉపాధ్యాయ వెల్లడించారు. అయితే, మెర్సిడెస్, ఇన్నోవా సహా మొత్తం ఆరు కార్లు ప్రమాదానికి గురయ్యాయని ఆయన వివరించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందినట్టు తెలిపారు. ఇక, గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. మరో నలుగురి పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఆయన తెలిపారు. Major accident at Bandra- Worli Sea link last night. 3 dead, 6 injured.#Mumbai @RoadsOfMumbai @mumbaitraffic pic.twitter.com/DgF45ekUOA — Vivek Gupta (@imvivekgupta) November 10, 2023 -
రహదారులు.. రద్దీ
బీబీనగర్/చౌటుప్పల్: విజయదశమి, బతుకమ్మల పండుగల ప్రభావం జాతీయ రహదారులపై పడింది. హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్– విజయ వాడ జాతీయ రహదారులపై శనివారం వాహనా లు భారీగా బారులు తీరాయి. పండుగలకు హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు స్వస్థలాలకు వెళ్తున్నారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు టోల్ప్లాజా వద్ద ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు రద్దీ కొనసాగింది. జాతీయ రహదారిపై మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల కూడళ్ల వద్ద రోడ్డు దాటేందుకు ప్రజలు, వాహనదారులు అవస్థలు పడ్డారు. -
టోల్ప్లాజా వద్ద హైస్పీడ్లో కారు బీభత్సం.. ఒక్కసారిగా గాల్లోకి లేచి..
లక్నో: అతి వేగం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతుందని పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో రోడ్డు నిబంధనలను పాటించనందకు జరిమానాలు సైతం విధిస్తున్నారు. అయినప్పటికీ కొందరు వ్యక్తులు అజాగ్రత్తతో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 20ఏళ్ల యువకుడు మృతిచెందాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల ప్రకారం.. యూపీలోని బారాబంకి జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. లక్నో-సుల్తాన్పూర్ హైవేపై హైదర్గఢ్ టోల్ ప్లాజా వద్దకు ఓ కారు హైస్పీడ్లో వచ్చింది. ఆదర్శ్(20) అధిక వేగంతో కారు నడుపుతూ ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు. కారు అతివేగంలో ఉండటంతో టోల్ప్లాజా వద్దకు రాగానే అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో, కారు ఒక్కసారిగా గాల్లోకి లేచింది.. ప్రమాదం ధాటికి కారు పార్ట్స్ అన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. #बाराबंकी: लखनऊ सुल्तानपुर हाईवे पर हैदरगढ़ कोतवाली क्षेत्र में शुक्रवार शाम तेज रफ्तार कार टोल प्लाजा के गेट पर बने डिवाइडर से जा टकराई। इससे कार के परखच्चे उड़ गए। कार को काटकर अंदर फंसे घायल युवक को बाहर निकाला गया, मगर सीएचसी पर उसे मृत घोषित कर दिया गया।#सीसीटीवी pic.twitter.com/sXUsv0HsjU — Barabanki District (@districtbbk) October 14, 2023 ఇక, ఈ ప్రమాదంలో కారులో ఇరుక్కుపోయిన ఆదర్శ్ను అక్కడి టోల్ సిబ్బంది అతి కష్టం మీద బయటకు తీశారు. వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించగా.. ఆదర్శ్ను పరిశీలించిన వైద్యులు.. అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. ఈ సందర్బంగా టోల్ సిబ్బంది మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన వెంటనే కారులో నుంచి మంటలు వచ్చాయన్నారు. వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పివేసినట్టు తెలిపారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది కూడా చదవండి: లిక్కర్ స్కాంలో సంజయ్ సింగ్కు కోర్టు స్ట్రాంగ్ వార్నింగ్ -
ఎన్హెచ్–363 నిర్మాణంలో అదే జాప్యం.. మరోవైపు టోల్ వసూలు..
మంచిర్యాల: జాతీయ రహదారి–363 పనులు నాలుగేళ్లు అవుతున్నా ఇంకా కొనసాగుతూ నే ఉన్నాయి. ఓ వైపు రోడ్డుపై ప్రయాణం చేస్తున్నందుకు టోల్ వసూలు.. మరోవైపు పూర్తి కాని చోట పనులు సాగుతున్నాయి. రెండేళ్లలో పూర్తి కావాల్సిన రోడ్డు నిర్మాణం కరోనా, తర్వాత కూడా గడువు పొడగిస్తూనే ఉన్నారు. గత ఏడాది ఆగస్టు వరకే పూర్తి కావాలి. కానీ ఈ ఏడాది ఆగస్టు గడుస్తున్నా అందుబాటులోకి రాలేదు. మరోసారి జనవరి వరకు పనులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్కు గడువు ఇచ్చారు. ఏళ్లుగా నిర్మాణంలోనే.. రాజీవ్ రాష్ట్రీయ రహదారిని శ్రీరాంపూర్ జీఎం ఆఫీ సు నుంచి మహారాష్ట్ర సరిహద్దు కుమురంభీం జిల్లా వాంకిడి మండలం గోయగాం వరకు జాతీయ రహదారిగా మార్చుతూ 2016లో కేంద్రం గెజిట్ ఉత్తర్వులు ఇచ్చింది. 2017లో పని ఉత్తర్వులు, 2018లో భూ సేకరణ, 2019లో బిడ్డింగ్ పూర్తయ్యాయి. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో రెండేళ్ల నిర్మాణం, 15ఏళ్ల నిర్వహణ చేపట్టాలి. రెండు భాగాలుగా మొత్తం 94.602కిలోమీటర్లు నిర్మించాలి. కాంట్రాక్టర్ రూ.1356.90 కోట్లకు బిడ్ వేయగా.. అదనపు పనులతో నిర్మాణ వ్యయం రూ.1948కోట్లకు చేరింది. జిల్లాలో శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం నుంచి తాండూర్ మండలం గోయగాం వరకు 42కిలోమీటర్లు నిర్మించాలి. గత ఏడాదిగా పది శాతం పనుల నిర్మాణమే చేస్తున్నారు. వాస్తవానికి ఈ పనులు 24 నెలల్లో అంటే 2022 ఆగస్టులోపే చేయాలి. నిర్ణీత సమయంలో పూర్తి చేయకపోతే రోజుకు రూ.5లక్షల చొప్పున కాంట్రాక్టర్ పరిహారం వేయాలనే నిబంధనలు కూడా ఉన్నాయి. ఆ కాంట్రాక్టర్ గడువు పెంచాలని కనీసం కోరకున్నా అధికారులే జనవరి వరకు పెంచేందుకు ఆసక్తి చూపినట్లు సమాచారం. రక్షణ చర్యలు కరువు.. నిర్మించిన రోడ్డుకు టోల్ప్లాజా నుంచి రోజు రూ.లక్షల్లో వసూళ్లు చేస్తున్నారు. ప్రయాణికులకు అవగాహ న, భద్రత చర్యలు తీసుకోవడం లేదు. ఇటీవల ప్ర మాదాలు జరిగి పలువురు మృత్యువాత పడ్డారు. శ్రీరాంపూర్ బైపాస్ రోడ్డు, బెల్లంపల్లి బైపాస్ రో డ్డుపై రాత్రివేళ వెలుతురు సరిగా లేక భారీ వాహనా లు అదుపు తప్పుతున్నాయి. బోయపల్లి బోర్డు, క న్నాల, సోమగూడెం చర్చి సమీపంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. కొత్తగా రోడ్డు వేయడంతో అతివేగంతోనూ కొందరు ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రమాదాల నియంత్రణకు ఎన్హెచ్ఏఐ అధి కారులు చర్యలు తీసుకోవాలి. కానీ ఇప్పటివరకు అవేమీ చేపట్టడం లేదు. సిగ్నల్స్, మలుపులు, భద్ర త సూచికలు, రాత్రివేళ రేడియం స్టిక్కర్లు మెరిసేవి, అంబులెన్స్, ప్రథమ చికిత్స కిట్లు, టోల్ప్లాజా వద్ద జనరల్, మహిళలకు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలి. ఇవేమీ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. నెలలో రెండుసార్లు ఉన్నతాధికారులు స్థానిక డ్రైవ ర్లు, వాహనదారులకు సలహాలు, సూచనలు ఇవ్వా లి. ఇక వర్షాలు కురిస్తే సోమగూడెం, గాంధారి వనం సమీపంలో డ్రెయిన్స్ సరిగా లేక సమీపంలో వరద నీరు చేరుతోంది. వాహనదారుల భద్రత కోసం ప్ర త్యేక కన్సల్టెన్సీ పర్యవేక్షణకు నిధులు మంజూరవుతున్నా ఖర్చుకు అలసత్వం వహిస్తున్నారు. జాప్యంతో ఇబ్బందులు.. మందమర్రి పాత బస్టాండ్ వద్ద వంతెన నిర్మాణం జాప్యంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ట్రాఫిక్ జామ్తోపాటు ప్రమాదాలు జరగుతున్నాయి. కొత్తగా పిల్లర్లు వేసి బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం మంచిదే కానీ, జా ప్యం కావడంతో ఇబ్బందులు పడుతున్నాం. త్వరగా పూర్తి చేయాలి. – కొట్టె కొమురయ్య, మందమర్రి వచ్చే జనవరిలో పూర్తి చేస్తాం.. మందమర్రి వద్ద రోడ్డు నిర్మాణం ఉన్న చోట ఉన్న పైపులు మార్చడంలో జాప్యం ఏర్పడింది. దీంతో అక్కడ నిర్మాణంలో జాప్యం జరిగింది. వచ్చే జనవరి వరకు పనులు పూర్తి చేసేందుకు గడువు ఉంది. రోడ్డుపై వెళ్లేటప్పుడు వాహనదారులు నిబంధనలు పాటించాలి. రోడ్డు భద్రత చర్యలపై స్థానిక పోలీసు, ఆర్టీఏ అధికారులతో అవగాహన చేపడతాం. – కే.ఎన్.అజయ్మణికుమార్, పీడీ, ఎన్హెచ్ఏఐ, మంచిర్యాల -
నా కారునే ఆపుతావా.. టోల్గేట్ సిబ్బందిపై ఎంపీ దాడి
కోల్కతా: తన కారు ఆపాడని కోపంతో ఓ టోల్ బూత్ సిబ్బందిపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ దాడి చేసిన ఘటన పశ్చిమ బెంగాల్లోని బుర్ద్వాన్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం ప్రకారం టీఎంసీ ఎంపీ సునీల్ మండల్ ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్నారు. బుర్ద్వాన్లోని పల్సిట్లో గురువారం రాత్రి ఆయన కారు టోల్ గేటు దాటుతుండగా టోల్ ఉద్యోగి నిబంధనల ప్రకారం వాహనాన్ని ఆపాడు. అయినప్పటికీ డ్రైవర్ కారును ఆపలేదు. ట్రాఫిక్ కోన్ను ఢీకొట్టి ముందుకు నడిపాడు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న టోల్ బూత్ ఉద్యోగి ఉజ్వల్ సింగ్ ట్రాఫిక్ కోన్ను పక్కకు తీసేందుకు ప్రయత్నించాడు. ఇంతలో కారు దిగి వచ్చిన ఎంపీ సునీల్ మండల్ ఆ ఉద్యోగిపై మండిపడ్డారు. నా కారునే ఆపుతావా అంటూ అతడిపై చేయి చేసుకోవడంతో పాటు తోసేశారు. టోల్ ప్లాజా వద్ద ఉన్న ఇతర ఉద్యోగులు పరిగెత్తుకుంటూ వచ్చి ఎంపీకి నచ్చజెప్పడంతో ఈ గొడవ సద్ధుమణిగింది. అయితే ఈ ఘటన మొత్తం టోల్ప్లాజాలోని సీసీ కెమెరాలో రికార్డయింది. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో టీఎంసీ ఎంపీ సునీల్ మండల్స్పందించారు. తాను తొందరలో వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని తెలిపారు. సిబ్బంది అమర్యాదగా ప్రవర్తించడంతోనే తాను చేయి చేసుకున్నట్లు చెప్పారు. అయితే ఆ ఉద్యోగిని భౌతికంగా తోయడం తప్పేనంటూ క్షమాపణలు కూడా చెప్పారు. ये #MP #MLAs को समझना चाहिए कि टोल प्लाजा पर खडे सामान्य लोग उन्हें नहीं पहचानते. वो अपना काम कर रहे है. अगर गाडी रोक दी तो गुनाह नहीं कर दिया जनाब पश्चिम बंगाल के बर्दवान पूर्व के #सांसद #sunilmandal है हरकत तो दिख ही रही है https://t.co/w1sRx9QO3t pic.twitter.com/09EbhRDNDu — Archana Pushpendra (@margam_a) August 4, 2023 -
వాహనదారులకు అలర్ట్.. ఇక ఆగక్కర్లేదు,కొత్త టోల్ వ్యవస్థ రాబోతోంది
జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు ఆపాల్సిన అవసరం లేకుండా కొత్త టోల్ వ్యవస్థను అమలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. అవరోధం లేని టోల్ వ్యవస్థ కోసం ట్రయల్స్ కొనసాగుతున్నాయి. వాటి ట్రయల్స్ విజయవంతం అయిన వెంటనే, దానిని అమలు చేస్తాము" అని రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ వెల్లడించారు. ఈ వ్యవస్థ అమలులోకి వస్తే వాహనదారులు టోల్ బూత్ల వద్ద అర నిమిషం కూడా వేచి ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఈ నూతన వ్యవస్థ ద్వారా సామర్థ్యం మెరుగుపడటంతో పాటు ప్రయాణ సమయం తగ్గుతుందన్నారు. అలాగే కిలోమీటర్ల ఆధారంగా చెల్లింపుల వ్యవస్థకు ఉండొచ్చని తెలిపారు. గతంలో ఫాస్ట్ట్యాగ్ల వినియోగం ద్వారా టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని 47 సెకన్లకు తగ్గించామని, ప్రస్తుతం ప్రభుత్వం దానిని 30 సెకన్ల కంటే తక్కువకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆయన చెప్పారు. ఉపగ్రహ, కెమెరాలు వంటి సాంకేతికతల ఆధారితంగా పనిచేసే ఈ నూతన టోల్ వ్యవస్థ పైలట్ ప్రాజెక్ట్గా ఇప్పటికే ఢిల్లీ-మీరట్ ఎక్స్ప్రెస్వేలో పరీక్షిస్తున్నట్లు తెలిపారు. వాహనదారులు జాతీయ రహదారిపైకి ప్రయాణిస్తున్నప్పుడు టోల్ ప్లాజా వద్ద మీ వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్ను కెమెరా స్కాన్ చేసి డేటాను క్రోడీకరిస్తుంది. మీరు ప్రయాణించిన కి.మీ.లకు ఛార్జీలు విధిస్తుంది. టెలికాం సహా అన్ని రంగాలలో ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితంగానే ఇలాంటి పురోగతి అంతా జరుగుతోందని, టెలికమ్యూనికేషన్స్ రంగం అన్ని ఇతర రంగాలతో అనుసంధానమై ఉందని మంత్రి అన్నారు. మెరుగైన టెలికమ్యూనికేషన్ నెట్వర్క్లు టోల్ ప్లాజాల డేటాను నిర్వహించడంలో సహాయపడతాయని అన్నారు. చదవండి 'ప్రతి ఒక్కరినీ రక్షించలేం..' అల్లర్లపై సీఎం కీలక వ్యాఖ్యలు.. -
ఉమ్మడి అనంతపురం జిల్లాలో టోల్గేట్ల నుంచి రోజుకు రూ.కోటి
సాక్షి ప్రతినిధి, అనంతపురం : జాతీయ రహదారులపై వాహనాలు రయ్మంటూ దూసుకెళ్తున్నాయి. బెంగళూరు – హైదరాబాద్ జాతీయ రహదారి ఎక్కువ భాగం ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ఉంది. ఈ రహదారి గుండా రోజూ వేలాది వాహనాలు గమ్యస్థానానికి చేరుకుంటున్నాయి. ఏటా సగటున 15 శాతం వాహనాల రాకపోకలు పెరుగుతున్నట్టు ఎన్హెచ్ఏఐ (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) అధికారుల పరిశీలనలో వెల్లడైంది. నిమిషానికి 55 వాహనాలు అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని జాతీయ రహదారులపై మొత్తం 10 టోల్గేట్లు ఉన్నాయి. వీటిగుండా రోజుకు 80 వేల వాహనాల వరకు ప్రయాణిస్తున్నట్టు అంచనా. దీన్నిబట్టి చూస్తే అన్నిచోట్లా కలిపి నిమిషానికి సగటున 55 వాహనాలు టోల్గేట్లు దాటుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య 13 శాతం పెరిగినట్టు అంచనా వేస్తున్నారు. వీటిలో ఎక్కువ భాగం కార్లు ఉన్నట్టు తేలింది. ప్యాసింజర్ వాహనాలే ఎక్కువగా ప్రయాణిస్తున్నాయి. టోల్గేట్ల ద్వారా రోజూ రూ.కోటి వసూలు ఉమ్మడి జిల్లాలో టోల్గేట్ల ద్వారా రోజుకు రూ.90 లక్షల నుంచి కోటి రూపాయల వరకు వసూలవుతోంది. ప్రత్యేక సెలవు రోజులు, పర్వదినాల సందర్భంలో మరింత ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. 60 శాతం వసూళ్లు రాప్తాడు మండలం మరూర్, పెద్దవడుగూరు మండలం కాశేపల్లి టోల్గేట్ల ద్వారానే వస్తున్నాయి. ఇక్కడ ఒక్కో టోల్గేట్లో రోజుకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకూ వసూలవుతోంది. మిగతా టోల్గేట్ల నుంచి రోజుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వస్తున్నట్టు అంచనా. రానున్న ఏడాదిలో మరో రెండు టోల్గేట్లు అదనంగా వస్తున్నట్టు తెలుస్తోంది. వాహనాలు పెరిగాయి కరోనా తర్వాత నాన్ ట్రాన్స్పోర్టు వాహనాలు భారీగా పెరిగాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కంటే ప్రైవేటు టాన్స్పోర్టేషన్కు ప్రజలు ఇష్టపడుతున్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతుండడం ద్వారా కొనుగోలు సామర్థ్యం కూడా పెరిగింది. గతంలో ఒక అంబాసిడర్ కారు, సెల్ఫోన్ ఉంటే గొప్పగా చూసేవాళ్లం. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర సెల్ఫోను, చాలామంది వద్ద కార్లు కనిపిస్తున్నాయి. సొసైటీలో గొప్పగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ సొంతంగా ద్విచక్రవాహనం, కార్లు కొనుగోలు చేస్తున్నారు. దీని వల్ల వాహనాల సంఖ్య భారీగా పెరుగుతోంది. – వీర్రాజు, ఉప రవాణా కమిషనర్, అనంతపురం కార్ల విక్రయాల్లో దూకుడు ఉమ్మడి జిల్లాలో కార్ల విక్రయాలు గతంతో పోల్చితే భారీగా పెరిగాయి. ముఖ్యంగా కరోనా నుంచి అనంతపురంలోని మెజార్టీ ప్రజలు కార్ల ప్రయాణాన్నే ఇష్టపడుతున్నారు. ఐదారేళ్ల కిందట నెలకు 150 కొత్త కార్లు కొనుగోలు అయితే మహా గొప్ప. కానీ 2022–23 ఆర్థిక సంవత్సరంలో వివిధ కార్ల షోరూముల్లో కొనుగోలు చేసినవి 400కుపైగా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే సంవత్సరానికి 5వేల కార్ల విక్రయాలు జరుగుతున్నాయంటే వాటి దూకుడును అంచనా వేయొచ్చు. వీటి వల్ల కూడా ఉమ్మడి జిల్లాలో రోడ్లు బిజీ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. -
జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్!
ఆదిలాబాద్: పెన్గంగలో శనివారం రాత్రి వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. మండలంలోని డొల్లార వద్ద గల బ్రిడ్జిని తాకుతూ ప్రవాహం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బ్రిడ్జి మీదుగా రాకపోకలను నిలిపివేశారు. బ్రిడ్జికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పిప్పర్వాడ టోల్ప్లాజా వద్దనే వాహనాలను అపేసారు. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బ్రిడ్జికి ఇరు వైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆదివారం ఉదయం ప్రవాహ ఉధృతి తగ్గడంతో రాకపోకలను అనుమతించారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
టోల్ ఫీజుకు డబ్బులు లేక.. రాంగ్రూట్లో ప్రయాణించిన ఆర్టీసీ బస్సు
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): దుబారి టోల్ ఫీజు చెల్లించలేని కేఎస్ ఆర్టీసీ బస్సు వెనక్కు వెళ్లి పోయిన సంఘటన బెంగళూరు–మైసూరు ఎక్స్ప్రెస్వేపై చోటుచేసుకుంది. బుధవారం బెంగళూరు నుండి మైసూరు వెళ్తున్న బస్సుకు ఫాస్ట్ట్యాగ్ లేకపోవడంతో రామనగర తాలూకా శేషగిరి టోల్ వద్ద డబుల్ చార్జ్ చెల్లించాలని టోల్ సిబ్బంది చెప్పారు. దీంతో డ్రైవర్ అంత డబ్బులు తన వద్ద లేవని బస్సు వెనక్కు తీసుకుని కొన్ని కిలోమీటర్ల దూరం రాంగ్ రూట్లోనే వచ్చాడు. అనంతరం సర్వీస్ రోడ్ ద్వారా ప్రయాణించాడు. ఈ దృశ్యాలను కొందరు ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసారు. వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేసుకున్నారు. చదవండి మణిపూర్ ఘటన:. ప్రధాన నిందితుడి ఇంటి తగలబెట్టి.. కుటుంబాన్ని బహిష్కరించిన గ్రామస్తులు -
టోల్ గేట్ ఉద్యోగినిపై దాడి.. జుట్టు పట్టి లాగి..
లక్నో: ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. టోల్ పేమెంట్ చేయాలని అడిగినందుకు టోల్ ఫ్లాజా ఉద్యోగినిపై ఓ మహిళ దాడి చేసింది. జుట్టు పట్టుకుని కింద పడేసింది. ఈ ఘటన జాతీయ రహదారి 91పై జరిగింది. సీసీటీవీ ఆధారంగా రికార్డైన దృశ్యాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. టోల్ గేట్ వద్ద ఓ కారు వచ్చి ఆగింది. టోల్ ఫ్లాజా సమీప గ్రామస్థులమని చెబుతూ.. పంపించవలసిందిగా కోరారు. ఆ గ్రామస్థులేనడానికి ఏదైనా ఆధారం చూపించమని టోల్ ఫ్లాజా ఉద్యోగిని వారికి అడిగింది. దీంతో కారులో నుంచి బయటకు దిగిన మహిళ.. సదరు ఉద్యోగినితో వాగ్వాదానికి దిగింది. అనంతరం క్యాబిన్లోకి వచ్చి ఉద్యోగిని జుట్టు పట్టుకుని దాడి చేసింది. బాధితురాలిని బూతులు తిడుతూ కింద పడేసింది. సహచర ఉద్యోగులు చొరవ తీసుకుని ఆ మహిళను నిలువరించే ప్రయత్నం చేశారు. Woman's Brazenness Caught On Camera: Toll Plaza Employee Threatened, Hair Pulled https://t.co/hGIn4pSlSO pic.twitter.com/hMjzuID9bX — NDTV (@ndtv) July 17, 2023 ఈ ఘటనపై టోల్ ఫ్లాజా యాజమాన్యం సదరు మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఆ మహిళ టోల్ ఫ్లాజాకు సమీప గ్రామానికి చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. ఐడీ కార్డు అడిగిన నేపథ్యంలో ఇరువురి మధ్య వాగ్వాదం ప్రారంభమైనట్లు తెలిపారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇదీ చదవండి: వామ్మో.. ఈ మ్యాగీ కంటే బిర్యానీ బెటర్.. ధర చూసి షాకైన యూట్యూబర్! -
టోల్గేట్ బూత్లను ఢీకొన్న కంటైనర్
భిక్కనూరు: భిక్కనూరు సమీపంలోని టోల్ గేట్ వద్ద సోమవారం రాత్రి జరిగిన ప్రమాదంలో టోల్ బూత్ బాక్స్లు రెండు ధ్వంసమయ్యాయి. టోల్ గేట్ సిబ్బందికి ఒక్కరికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న కంటైనర్ అతి వేగంగా వచ్చి టోల్ గేట్ వద్ద ఉన్న డివైడర్తో పాటు రెండు బూత్ బాక్స్లను ఢీకొంది. దీంతో ఆరు, ఏడు బూత్ బాక్స్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అలాగే కామారెడ్డి వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారుపై టోల్బూత్ పడింది. దీంతో కారు ముందు భాగం ధ్వంసమైంది. అలాగే ఆరో బాక్స్లో విధులు నిర్వహిస్తున్న తిప్పాపూర్ గ్రామానికి చెందిన పోచయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోచయ్యను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రొక్లెయినర్తో బోల్తా పడిన కంటైనర్ను పక్కకు తొలగించి ధ్వంసమైన బూత్ బాక్స్లను రోడ్డు పక్కకు తప్పించారు. -
వేల కోట్ల ఆదాయం.. ఓఆర్ఆర్ను అమ్మాల్సిన అవసరం ఏంటి? రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరానికి మణిహారంగా కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డును కేసీఆర్ సర్కార్ ప్రైవేటు వ్యక్తులకు అమ్మకానికి పెట్టిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి విమర్శించారు. ప్రజలకు అవసరమయ్యే ఔటర్ రింగ్ రోడ్డును అమ్మాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం గాంధీభవన్లో రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. వేల కోట్ల ఆదాయం వచ్చే ఓఆర్ఆర్ను కేటీఆర్ ప్రైవేటుకు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. సూమారు 30వేల కోట్లు ఆదాయం వచ్చే సంపదను రూ. 7,380 కోట్లకే కారుచౌకగా ముంబై కంపెనీకి కట్టబెట్టారని విమర్శించారు. దేశంలోనే ఇది అత్యంత పెద్ద కుంభకోణమని ఆరోపించారు. ఇందులో రూ. 1,000 కోట్లు చేతులు మారాయని తెలిపారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించదని.. తాము మేం అధికారంలోకి వచ్చాక దీనిపై విచారణకు ఆదేశిస్తామని తెలిపారు. యాజమాన్యం కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. చదవండి: కొత్త సచివాలయంపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్, జయేష్ రంజన్ నిర్ణయాలన్నింటిపై కాంగ్రెస్ పార్టీ సమీక్షిస్తుందన్నారు. ఈ నిర్ణయాలపై బీజేపీ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. ప్రజల ఆస్తులు కేసీఆర్ అమ్ముతుంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. 2018 నుంచి టోల్ వసూలు బాధ్యత ఎవరికి ఇచ్చారో హెచ్ఎండీఏ అధికారులు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. పెట్టుబడులు అంటే నూతన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలి కానీ.. ఉన్న వాటిని తాకట్టు పెట్టడం కాదని హితవు పలికారు. చదవండి: హైదరాబాదీలకు అలర్ట్.. రేపు పార్కుల మూసివేత -
TSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు షాక్.. పెరిగిన టికెట్ ధరలు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులపై టీఎస్ఆర్టీసీ మరో భారం మోపింది. ఆర్టీసీ టికెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల జాతీయ రహదారులపై టోల్ చార్జీలను అయిదు శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. శనివారం నుంచి ఆ నిర్ణయం అమల్లోకి రానుండటంతో ఆర్టీసీపై మరింత భారం పడనుంది. పెరిగిన టోల్ చార్జీల భారాన్ని ప్రయాణికులపైనే వేసేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఈ మేరకు ఆర్టీసీ టికెట్లో వసూలు చేసే టోల్ ఛార్జీలను పెంచింది. టోల్ ఛార్జీలను పెంపుతో టికెట్ ధరలు సైతం పెరిగాయి. ఆర్డీనరి నుంచి గరుడ ప్లస్ వరకు బస్సుల్లో ఒక్కో ప్రయాణికుడిపై టోల్ ప్లాజా ఛార్జీలను తాజాగా రూ.4 వరకు పెంచినట్లు ప్రకటించింది. నాన్ ఏసీ స్లీపర్ బస్సుల్లో రూ.15 పెంచింది. ఏసీ స్లీపర్ బస్సుల్లో ఒక్కో ప్రయాణికుడిపై టోల్ ఛార్జీ రూ.20 వసూలు చేస్తున్నారు. టోల్ప్లాజాల మీదుగా వెళ్లే సిటీ ఆర్డినరీ బస్సుల్లో రూ.4 పెంచారు. పెరిగిన ధరలు శనివారం నుంచి అమల్లోకి వచ్చాయి. చదవండి: కేసీఆర్ది కొంపముంచే సర్కార్: బండి సంజయ్ -
పెరిగిన టోల్ నేటి అర్ధరాత్రి నుంచే అమలు.. ఛార్జీలు వివరాలు ఇలా
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల్లో చార్జీల పెంపు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది. రోడ్ల నిర్వహణకు సంబంధించి ఏటా ఏప్రిల్ ఒకటి నుంచి చార్జీల పెంపును ఆనవాయితీగా తీసుకున్న జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ).. ఈసారి కూడా కొత్త చార్జీలను సిద్ధం చేసింది. గతేడాది వివిధ కేటగిరీల వాహనాలకు సంబంధించి 8 శాతం నుంచి 15 శాతం వరకు ధరలు పెంచగా.. ఈసారి వాహనదారులపై కాస్త దయతలిచి 5.50 శాతంలోపే పెంపును పరిమితం చేసింది. (వాహనదారులకు షాక్?.. పెరగనున్న టోల్ చార్జీలు.. ఎంతంటే?) విజయవాడ రహదారిలోని పంతంగి టోల్ ప్లాజాను ఉదాహరణగా తీసుకుంటే.. గతేడాది కారు/జీపు/వ్యాన్ కేటగిరీలో చార్జీని రూ.80 నుంచి రూ.90కి అంటే రూ.10 పెంచగా... ఈసారి రూ.90 నుంచి రూ.95కు అంటే రూ.5 మాత్రమే పెంచింది. ఇక గతేడాది టోల్ ధరలు అమల్లోకి వచ్చాక కొత్తగా ఐదు ప్రాంతాల్లో టోల్గేట్లు అందుబాటులోకి వచ్చాయి. పెరగనున్న ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో టోల్ప్లాజాల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ.1,820 కోట్లు సమకూరాయి. ఈసారి దేశవ్యాప్తంగా మరిన్ని టోల్గేట్లు అందుబాటులోకి రావడం, ధరల పెంపు నేపథ్యంలో టోల్ వసూళ్లు రూ.2 వేలకోట్లను దాటిపోతాయని అంచనా. ఫాస్టాగ్తో కచ్చితమైన ఆదాయం గతంలో టోల్గేట్ల వద్ద నిర్వాహకులు భారీగా అక్రమాలకు పాల్పడటంతో.. వాహనాల నుంచి వసూలు చేసిన మొత్తంలో దాదాపు 25 శాతం పక్కదారి పట్టేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీనితో ప్రభుత్వ ఖజానాకు చేరే మొత్తం తక్కువగా కనిపించేది. ఫాస్టాగ్ అమల్లోకి వచ్చాక అక్రమాలకు తెరపడి, ప్రతి రూపాయి లెక్కలోకి వస్తోంది. దీనితో గత మూడేళ్లుగా టోల్ వసూళ్లు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 98.6 శాతం వాహనాలు ఫాస్టాగ్ను వినియోగిస్తున్నాయి. విజయవాడ రోడ్డులోని కోర్లపహాడ్ ప్లాజాలో.. కార్లు, జీపులు సింగిల్ జర్నీ చార్జి రూ.120 నుంచి రూ.125కు.. రిటర్న్ జర్నీ రూ.180 నుంచి రూ.200కు.. నెల పాస్ రూ.4,025 నుంచి రూ.4,225కు.. ► లైట్ కమర్షియల్ వాహనాలకు సింగిల్ ట్రిప్ రూ.190–రూ.200, రిటర్న్ జర్నీ రూ.285–రూ.300, నెలపాస్ రూ.6,385–రూ.6,710.. ► బస్సు, ట్రక్కులకు సింగిల్ ట్రిప్ రూ.395–రూ.415, రిటర్న్ జర్నీ రూ.595–రూ.625, నెలపాస్ రూ.13,240–రూ.13,910కు.. ► ఓవర్ సైజ్డ్ వెహికల్స్ సింగిల్ ట్రిప్ రూ.765 నుంచి రూ.805కు, రిటర్న్ జర్నీ 1,150–రూ.1,210, నెలపాస్ రూ.25,540–రూ.26840కు సవరించారు. చిల్లకల్లు టోల్ప్లాజాలో.. కార్, జీప్ సింగిల్ ట్రిప్పు రూ.100 నుంచి రూ.105కు, రిటర్న్ జర్నీ రూ.150–రూ.160, నెలపాస్ రూ.3,350–రూ.3,520కు పెంచారు. ► లైట్ కమర్షియల్ వాహనాలకు సింగిల్ ట్రిప్పు రూ.160 నుంచి రూ.165కు, రిటర్న్ జర్నీ రూ.240–రూ.250, నెలపాస్ రూ.5,290–రూ.5,560కు.. ► బస్సు, ట్రక్కులకు సింగిల్ ట్రిప్పు రూ.330–రూ.345, రిటర్న్ జర్నీ రూ.490–రూ.515, నెలపాస్ రూ.10,940–రూ.11,495కు.. ► హెవీ వెహికల్స్ సింగిల్ ట్రిప్పు రూ.635–రూ.665, రిటర్న్ జర్నీ రూ.955–రూ.1,000, నెలపాస్ రూ.21,170–రూ.22,240కు సవరించారు. జాతీయ రహదారి 765 మీద కడ్తాల్ వద్ద.. కార్లు, జీపులకు సింగిల్ ట్రిప్పు రూ.45, రిటర్న్ జర్నీ రూ.65, నెల పాస్ రూ.1,495కు.. ► లైట్ వెహికల్స్ సింగిల్ ట్రిప్పు రూ.75, రిటర్న్ జర్నీ రూ.110, నెలపాస్ రూ.2,420కు.. ► బస్సు ట్రక్కులకు సింగిల్ ట్రిప్పు రూ.150, రిటర్న్ జర్నీ రూ.230, నెల పాస్ రూ.5,070 ► హెవీ వెహికల్స్ సింగిల్ ట్రిప్పు రూ.290, రిటర్న్ జర్నీ రూ.435, నెలపాస్ రూ.9,675కు పెంచారు. జాతీయ రహదారి 167పై మహబూబ్నగర్ జిల్లా మున్ననూర్ టోల్ ప్లాజా.. కార్లు, జీపుల సింగిల్ ట్రిప్పు రూ.45, రిటర్న్ జర్నీ రూ.65, నెలపాస్ రూ.1,475కు పెంచారు. ► లైట్ వెహికల్ సింగిల్ ట్రిప్పు రూ.70, రిటర్న్ జర్నీ రూ.105, నెలపాస్ రూ.2,385కు.. ► బస్సులు, ట్రక్కుల సింగిల్ ట్రిప్పు రూ.150, రిటర్న్ జర్నీ రూ.225, నెలపాస్ రూ.4,995 ► భారీ వాహనాలకు సింగిల్ ట్రిప్పు రూ.285, రిటర్న్ జర్నీ రూ.430, నెలపాస్ రూ.9,540గా నిర్ధారించారు. జాతీయ రహదారి 163 చిట్లపల్లి టోల్ప్లాజా వద్ద కార్లు, జీపులకు సింగిల్ ట్రిప్పు రూ.65, రిటర్న్ జర్నీ రూ.95, నెలపాస్ రూ.2,110కు పెంచారు. ► లైట్ వెహికల్స్ సింగిల్ ట్రిప్పు రూ.100, రిటర్న్ జర్నీ రూ.155, నెల పాస్ రూ.3,410కు.. ► బస్సు/ట్రక్కులకు సింగిల్ ట్రిప్పు రూ.215, రిటర్న్ జర్నీ రూ.320, నెలపాస్ రూ.7,145కు.. ► హెవీ వెహికల్స్కు సింగిల్ ట్రిప్పు రూ.410, రిటర్న్ జర్నీ రూ.615, నెలపాస్ రూ.13,645కు పెంచారు. -
వాహనదారులకు షాక్?.. పెరగనున్న టోల్ చార్జీలు.. ఎంతంటే?
వాహనదారలు నెత్తిన టోల్ బాదుడుకు రంగం సిద్ధమైంది. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనూ ఎన్హెచ్ఏఐ టోల్ ఛార్జీలను సమీక్షిస్తుంది. అందులో భాగంగా ఈసారి 5 నుంచి 10 శాతం మేర పెరగనున్నట్లు తెలుస్తోంది. కొత్త రేట్ల లిస్టును ఎన్హెచ్ఏఐ ఈరోజు రాత్రి లేదా రేపు విడుదల చేయనుంది. 2008 నేషనల్ హైవేస్ ఫీజ్ ప్రకారం.. ప్రతి ఏడు కేంద్ర రవాణ శాఖ టోల్ ఛార్జీల పెంపుపై కొన్ని ప్రతిపాదనలు తెస్తుంది. ఆ ప్రతిపాదనలకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తర్వాత ఏప్రిల్ 1వ తేదీ నుండి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయి. దీని ప్రకారం కార్లు, తేలికపాటి వాహనాలపై ఒక్కో ట్రిప్పుకు ఐదు శాతం, భారీ వాహనాలకు టోల్ టాక్స్ అదనంగా 10 శాతం పెరిగే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం టోల్ టాక్స్ లను పెంచుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చదవండి: టోల్ప్లాజా, ఫాస్టాగ్ కథ కంచికి..ఇక కొత్త పద్ధతిలో టోల్ వసూళ్లు!
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
సీబీఎస్ఈ పది, పన్నెండవ తరగతి ఫలితాలు విడుదల
ఎవరి లెక్క వారిదే..!
ఓటరు తీర్పు... ఈవీఎంలలో భద్రం
రాయల్ ఎన్ఫీల్డ్ దగ్ధం
వైఎస్సార్సీపీ గెలుపుకోసం పనిచేసిన వారికి ధన్యవాదాలు
దళిత మహిళా సర్పంచ్పై జనసేన దాడి
రామతీర్థంలో వైభంగా పూర్ణాహుతి
గ్రామాల్లో ద్రాక్ష పంట
చికెన్
పశువుల ఎరువుతో భూసారం పెంపు
తప్పక చదవండి
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement