-
మెరుపు తీగలా మారిపోయిన ఓప్రా విన్ఫ్రే!
ఓప్రా విన్ఫ్రే ప్రపంచ ప్రసిద్ధి చెందిన టీవీ వ్యాఖ్యాత. ఆమె టీవీ షో ది ఓప్రా టాక్ షో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. ఈ షో ఆమెకు గ్లోబల్ సెలబ్రెటీ స్టేటస్ హోదా తెచ్చిపెట్టింది. ఆమె కూడా గత కొంతకాలం ఒబెసిటీ సమస్యలు ఎదుర్కొన్నారు. అధిక బరువుతో ట్రోలింగ్ గురయ్యారు. ఏమైందో ఏమో కొన్నాళ్ల వరకు కనిపించకుండా పోయి సడెన్గా స్లిమ్గా మారిపోయి అలానాటి ఓప్రాని తలిపించేలా మారిపోయింది. ఇప్పుడు ఫిట్నెస్పై ఛాలెంజ్లు విసురుతు ఎలా బరువు తగ్గించుకోవాలో అందరికీ పాఠాలు చెప్పేస్తోంది. 70 ఏళ్ల విన్ఫ్రే గత కొన్ని దశాబ్దాలుగా భారీ కాయంతో ఇబ్బందు ఎదర్కొంది. చాలామంది ముఖం మీద లావుగా ఉన్నారని అనడం, ట్రోలింగ్ వంటి వాటితో విసుగుపోయింది. అదీగాక 2021లో మోకాలి శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ఇక ఆమెకు బోలెడెంత్ రెస్ట్ దొరికింది. ఇకం అంతే ఇదే సమయం అనుకుని బరువు తగ్గే విషయంపై దృష్టి పెట్టింది. పూర్తిగా బాడీ ఫిట్నెస్పై దృష్టి కేంద్రీకరించినట్లు స్వయంగా ఆమె వెల్లడించింది. ఆకలిని నియంత్రించుకునేలా వైద్యుల సూచనలతో కొన్ని రకాల మందులు వాడుతున్నట్లు కూడా వెల్లడించింది. మంచి ఫిటనెస్ నిపుణుల సాయంతో మంచిగా డైట్ని ఫాలో అయి బరువు తగ్గినట్లు వెల్లడించారు. ఇప్పుడు తనకెంతో హాయిగా ఉందని ఆనందంగా చెబుతుంది. భారీ కాయం నుంచి నాకిప్పటికీ విముక్తి లభించింది. అందుకోసం ఆమె ప్రతి రోజు ఐదు నుంచి మూడు మైల్లు వాకింగ్, వారాంతరాల్లో 10 మేళ్లకు పైగా నడవటం, రోజుకు గాలన్ నీరు తాగటం వంటివి తీసుకున్నట్లు తెలిపింది. ఎలాగైన తాను తగ్గాలని గట్టిగా సంకల్పించుకుని ఇన్ఫ్ల్యూయెన్షియల్ పర్సనాలిటీగా ఆవిర్భవించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఐతే ఆమె వైద్యపరంగా బరువు తగ్గేందుకు ఎలాంటి మందులు వాడిందనేది వెల్లడించకపోయినా వైద్యుల సూచనల ప్రకారం డైట్ ఫాలో అయ్యి తగ్గానని పరోక్షంగా చెప్పింది. ఒకనొక దశలో ఎంత సంకల్పశక్తి ఉన్న బరువు తగ్గడం కష్టం అనిపించింది కానీ కఠినమైన ఫిట్నెస్ ఫాలో అయ్యి నిపుణుల సలహాలు తీసుకుంటే పెద్దకష్టమేమి కాదని అంటోంది. ఇప్పుడామె బాగా అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారికి ఆదర్శంగా నిలవడమేగాక ఎలా బరువు తగ్గాలో సలహాలు కూడా ఇచ్చేస్తోంది. బరువు తగ్గాలనుకుంగే ఏజ్తో సంబంధం లేదని కూడా ఫ్రూవ్ చేసింది ఓప్రా విన్ఫ్రే. (చదవండి: ఫ్లూ జ్వరంలా ఉందని తేలిగ్గా తీసుకుంది..కట్ చేస్తే అంతలోనే..) -
ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ స్టార్! జస్ట్ 40 ఏళ్లకే నూరేళ్లు..
అమెరికన్ ఫిట్నెస్ ఇన్ప్లుయెన్సర్, ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ స్టార్ జస్ట్ 40 ఏళ్ల వయసులోనే అనూహ్యంగా మరణించింది. ఎలాంటి కారణాలు లేకుండానే చనిపోయింది. ఓ రెస్టారెంట్కి భోజనానికి వెళ్లినప్పుడూ ఈ ఘటన జరిగింది. దీంతో ఆమె మరణానికి దారితీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేయగా చాలా షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. బరువు తగ్గాలనుకోవడమే ఆమెకు శాపమైందా? త్వరిగతిన బరువు తగ్గితే ప్రాణాలు కోల్పోతామా? తదితరాల గురించే ఈ కథనం.! అమెరికాలోని 40 ఏళ్ల మేకప్ ఆర్టిస్ట్ బ్రాందీ మల్లోరీ 2014లో ఏబీసీ వెయిట్ లాస్ రియాలటీ షోతో ఒక్కసారిగా ఆమె పేరు వార్తల్లో మారుమ్రోగిపోయింది. ఎందుకంటే? అక్కడ ఆ వెయిట్లాస్ షోలో ఏకంగా మల్లోరి 70 కిలోల బరువు తగ్గింది. విపరీతమైన బరువుతో బాధపడుతున్నవారికి ఆమె ఆదర్శంగా నిలిచింది. ఆమెలా బరువు తగొచ్చనే ఆలోచనను రేకెత్తించింది. అయితే ఆమె ఓ రెస్టారెంట్కి వెళ్లి ఫుడ్ ఆర్డర్ చేసి తెచ్చుకుని కార్ వద్దకు వచ్చింది. అంతే ఆ తర్వాత ఆమె ఏమయ్యిందో ఏమో!..ఒక్కసారిగా కుప్పకూలిపోయి చనిపోయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమె మరణానికి గల కారణాలపై ముమ్మరంగా దర్యాప్తు చేయగా కారణాలు ఏమి తెలియలేదు. చివరకి బరువు తగ్గేందుకు ఆమె తీసుకున్న విధానమే కారణమా? అనే సందేహలు తలెత్తాయి. దీంతో ఆ దిశగా విచారణ చేయగా.. బరువు తగ్గడం కోసం చేసే విపరీతమైన వ్యాయామాలు కారణంగానే చాలామంది చిన్న వయసులోనే ప్రాణాలను కోల్పోతున్నట్లు వైద్యులు వెల్లడించారు. అందుకోసం వారి అనుసరించే కట్టుదిట్టమైన డైటే.. ప్రధాన కారణం అని అన్నారు. "సడెన్గా కేలరీలు పరిమితంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం, వల్ల బరువు తొందరగా తగ్గొచ్చు గానీ అది మీ ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే? పోషకాహార లోపం, అలసట, కండరాల నష్టానికి దారితీస్తుంది. ఇది శరీరంలోని జీవక్రియలకు ప్రభావితం చేసి ఆరోగ్యంపై ప్రభావం ఏర్పడుతుంది. అలాగే ఆకలిని నియంత్రించే సప్లిమెంట్స్ కూడా ప్రమాదమే. అవి మధుమేహం వంటి ఇతరత్ర వ్యాధులకు దారితీసి ప్రాణాంతకం కావొచ్చు. కొందరూ బారియాట్రిక్ సర్జరీలతో గణనీయమైన బరువు తగ్గేలా లక్ష్యం పెట్టుకుంటున్నారు. దీని వల్ల స్పీడ్గా బరువు తగ్గినప్పటికీ జీవితాంతం ఆహార నియమాలు పాటించాల్సిందే. ఏదిపడితే అది తినకూడదు. అందువల్ల త్వరితగతినే బరువు తగ్గేందుకు అనుసరించే పద్ధతులకు మన శరీరం వెంటనే సహకరించలేదు. మనం సడెన్గా మొదలు పెట్టే డైట్కి మన శరీర వ్యవస్థ అడ్జెస్ట్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. కాబట్టి నిధానంగా ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గే యత్నాలు చేయండి అని హితువు చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. లేదంటే ఇలానే హఠాన్మరణాలకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. (చదవండి: పచ్చి మిర్చిని పచ్చిగా తినడమా? అనుకోవద్దు!.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా!) -
బరువు తగ్గడం..అంత బరువేం కాదు!
కొంతమంది శరీరతత్వాన్ని బట్టి బరువు పెరగడం, తగ్గడమనేది పెద్ద టాస్కే. మంచి పౌష్టికాహారం, కొవ్వులతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా బరువు పెరగడం సులభమే. కానీ దాన్ని తగ్గించుకోవాలంటే మాత్రం చుక్కలు కనిపిస్తాయి. ఇందుకు చాలా మంది సినీ తారలు కూడా నిదర్శనం. నిత్యం యోగా చేసే సినీతారలు, తదితర వంటి సెలబ్రిటీలే ఇంత కష్టపడుతుంటే.. మనలాంటి సామాన్యులు బరువు తగ్గడం సాధ్యమేనా అని నిరాశ పడొద్దు. బిజీ లైఫ్ వల్ల చాలామందికి వ్యాయామం చేయడానికి సమయం చిక్కదు. అలాగని డైటింగ్ చేస్తూ కడుపు మాడ్చుకోవడం కూడా కష్టమే. అందుకే చాలామంది సులభంగా బరువు తగ్గే మార్గాలను ఎంచుకుంటారు. అలాంటివారికి ఈ కింది చిట్కాలు ఉపయోగ పడవచ్చు. స్పీడ్గా బరువు తగ్గాలంటే.. మంచి నీటిని తరచు తాగడం వల్ల ఆహారం తక్కువగా తీసుకుంటాం. ముఖ్యంగా భోజనానికి ముందు నీరు తాగడం వల్ల కొద్దిగా తింటే చాలు పొట్ట నిండిన భావన కలుగుతుంది. 12 వారాలపాటు చేసిన ఓ అధ్యయనంలో భోజనానికి ముందు నీళ్లు తాగని వారితో పోలిస్తే.. తాగేవారు త్వరగా బరువు తగ్గుతార ని తేలింది. అలాగే కంటినిండా నిద్ర పోయినా బరువు తగ్గతారని పరిశోధనలో తేలింది టీవి చూస్తూనో సెల్ ఫోన్ చూస్తూ కూడా తిన్న బరువు పెరుగుతారట. ఇలాంటి అలవాటును మానుకునే యత్నం చేసినా బరువు తగ్గే అవకాశం ఉంది. ఈ మూడు టెక్నిక్లు ఫాలో అయితే స్పీడ్గా బరువు తగ్గొచ్చు ఈజీగా బరువు తగ్గేందుకు ఏం చేయాలో..ఏం చేయకూడదో చూద్దాం. ఆహారాన్ని కంగారుగా తినకూడదు. నెమ్మదిగా నమిలి తినాలి. దీనివల్ల తక్కువ ఆహారం తీసుకుంటారు. నెమ్మదిగా ఆహారం తీసుకోవడం వల్ల కడుపు త్వరగా నిండిన ఫీలింగ్ వస్తుంది. మీరు రోజూ తీసుకొనే ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండాలి. ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు త్వరగా నిండుతుంది. ఆకలి తగ్గితే శరీరంలోకి తక్కువ క్యాలరీలు చేరతాయి. జీఎల్పీ–1, ఘెర్లిన్ హార్మోన్లపై ప్రొటీన్లు ప్రభావం చూపడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. తియ్యని శీతలపానీయల జోలికి వెళ్లొద్దు. సోడా కలిగిన డ్రింక్స్ వల్ల రోగాల ముప్పు పెరుగుతుంది. చక్కెర శాతం ఎక్కువగా ఉండే పానీయాల వల్ల శరీరంలోకి ఎక్కువ క్యాలరీలు చేరతాయి. కంటి నిండా నిద్రలేకపోయినా సరే బరువు పెరిగే అవకాశాలు ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. నిద్రలేమి వల్ల లెప్టిన్, ఘెర్లిన్ హార్మోన్లపై ప్రభావం పడుతుంది. ఒత్తిడి వల్ల కార్టిసాల్ అనే హార్మోన్ విడుదలై ఆకలి పెరుగుతుంది. ఆకలి పెరగడం వల్ల అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటారు. దానివల్ల శరీరంలోకి ఎక్కువ క్యాలరీలు చేరతాయి. నిద్రలేమి, ఒత్తిడి వల్ల మధుమేహం, ఊబకాయం వంటి అనేక రుగ్మతలు వస్తాయి. యోగర్ట్, లెంటిల్స్, క్వినోవా, చికెన్ బ్రెస్ట్, చేపలు, ఆల్మండ్స్లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల తొందరగా ఆకలి వేయదు. మొక్కల నుంచి లభించే విస్కోస్ ఫైబర్ అనే పీచుపదార్థం బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. బీన్స్, ఓట్స్ సెరల్స్, బ్రస్సెల్స్ స్ప్రౌర్ట్స్, ఆస్పరాగస్, నారింజ, అవిసె గింజల్లో విస్కోస్ ఉంటుంది. ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. కంచం నిండుగా భోజనం చేస్తే బరువు కూడా అదే స్థాయిలో పెరుగుతారు. ఆకలి వేసినప్పుడు మధ్య మధ్యలో బాదం తదితర డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది. టీవీ లేదా ల్యాప్టాప్లో సినిమాలు, వీడియోలు చూస్తూ తినడం వల్ల కూడా బరువు పెరుగుతారు.ఎందుకంటే.. వాటి ధ్యాసలో పడి అతిగా తినేస్తారు కాబట్టి తింటున్నా అన్న భావనతో తినడం మంచిది. (చదవండి: ఆకస్మిక మైకం.. తరచు తలనొప్పా?) -
నేను పెళ్లి చేసుకుంటే ఇబ్బంది పడతానా?!
∙నాకు 27 ఏళ్లు. రెండేళ్ల కిందట బేరియాట్రిక్ సర్జరీ అయింది. ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవడం వలన వైవాహిక జీవితంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తవచ్చా? ప్రెగ్నెన్సీ, డెలివరీలో కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా? – వృంద శాఖాయ్, నాందేడ్ అత్యధిక బరువు ఉండి, అలాగే బీపీ, సుగర్ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉండి, ఆరునెలల పాటు ఆహార నియమాలు పాటిస్తూ, వ్యాయామాలు చేసినా ఫలితం లేనప్పుడు, పిల్లలు కలగడానికి కూడా పీసీఓడీ, అధిక బరువు కారణమైతే బేరియాట్రిక్ సర్జరీ ద్వారా బరువు తగ్గవచ్చు. గ్యాస్ట్రిక్ బ్యాండింగ్, గ్యాస్ట్రిక్ బైపాస్, స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ వంటి పద్ధతుల ద్వారా బేరియాట్రిక్ సర్జరీ చేస్తారు. వీటిలో ఆహారం కొద్దిగా తినగానే పొట్ట నిండినట్లు అనిపించడం, ఇంకా ఎక్కువ తినలేకపోవడం, తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం, ఆహారంలోని కొవ్వు, ప్రొటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్ వంటి పదార్థాలు ఎక్కువగా రక్తంలోకి చేరకపోవడం వంటి ప్రక్రియల వల్ల ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి 10–20 కేజీల వరకు బరువు తగ్గే అవకాశం ఉంటుంది. బేరియాట్రిక్ సర్జరీ వల్ల వైవాహిక జీవితంలో ఏమీ ఇబ్బందులు ఉండవు. బేరియాట్రిక్ సర్జరీ వల్ల అధిక బరువు తగ్గడంతో పాటు విటమిన్–బీ12, విటమిన్–డి, ఐరన్, క్యాల్షియం వంటి అనేక పోషక పదార్థాల లోపం తలెత్తుతుంది. దీనివల్ల వీరిలో బరువు తగ్గడం ఒక స్టేజికి వచ్చాక పోషకాల లోపం కోసం డాక్టర్ల పర్యవేక్షణలో విటమిన్స్, సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉండాలి. కాబట్టి సర్జరీ జరిగిన ఏడాది తర్వాత గర్భం కోసం ప్రయత్నం చేయవచ్చు. ఈ జాగ్రత్తలు సరిగా తీసుకోనప్పుడు కొందరిలో రక్తహీనత, విటమిన్స్ లోపం వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఇలాంటప్పుడు గర్భం దాల్చటం వల్ల గర్భంలో పిండం సరిగా ఎదగకపోవడం, అబార్షన్లు, బిడ్డలో అవయవ లోపాలు, ఎదుగుదల లోపాలు, నెలలు నిండకుండా కాన్పు జరగడం, బిడ్డ గర్భంలోనే చనిపోవడం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆహారం తీసుకోవడంలో ఇబ్బందులు, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలు కూడా ఉండవచ్చు. అందువల్ల మీరు పెళ్లి తర్వాత గర్భం కోసం ప్రయత్నం చేసే ముందే సర్జరీ చేసిన డాక్టర్ను సంప్రదించి, వారి సలహా మేరకు సీబీపీ, విటమిన్–డి వంటి అవసరమైన రక్తపరీక్షలు చేయించుకోవాలి. ఏవైనా పోషక లోపాలు ఉంటే వాటిని ఆహార నియమాలు, సప్లిమెంట్ల ద్వారా సరి చేసుకున్నాకనే గర్భం కోసం ప్లాన్ చేయడం మంచిది. గర్భం రాకముందు నుంచే ఫోలిక్ యాసిడ్ మోతాదు అదనంగా తీసుకోవాలి. అలాగే మల్టీవిటమిన్లు తీసుకుంటూ ఉండాలి. అవసరమైతే మల్టీవిటమిన్లు ఇంజెక్షన్ రూపంలో తీసుకోవలసి ఉంటుంది. గర్భం దాల్చగానే గైనకాలజిస్టును సంప్రదించి, వారి సలహా మేరకు విటమిన్స్తో పాటు క్యాల్షియం, ఐరన్ మాత్రలు తీసుకుంటూ ఉండాలి. బిడ్డ ఎదుగుదలకు సంబంధించి రెండో నెలలో స్కానింగ్, మూడో నెలలో ఎన్టీ స్కాన్, ఐదో నెలలో బిడ్డ అవయవాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు టిఫా స్కాన్, ఏడో నెల నుంచి బిడ్డ బరువు పెరుగుదల తెలుసుకోవడానికి గ్రోత్ స్కానింగ్ వంటివి చేయించుకోవాలి. సమస్యలను బట్టి తగిన సమయంలో కాన్పు చేయించుకోవడం వల్ల ఎక్కువ కాంప్లికేషన్స్ లేకుండా తల్లీబిడ్డా క్షేమంగా ఉంటారు. బేరియాట్రిక్ సర్జరీ వల్ల ఆహారం ఎక్కువగా తినలేరు కాబట్టి న్యూట్రీషనిస్ట్ సలహా మేరకు క్రమ పద్ధతిలో కొద్ది కొద్దిగా రోజుకు ఆరుసార్లు పోషకాహారం తీసుకోవాల్సి ఉంటుంది. ∙నాకు 28 ఏళ్లు. రెండు రొమ్ముల్లోనూ గడ్డలున్నాయి. డాక్టరుకి చూపిస్తే ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అవి సహజమే అన్నారు. నాకింకా పెళ్లి కాలేదు. వైవాహిక జీవితాన్ని ఇబ్బంది పెట్టవు కదా? – స్వర్ణలత, కాకినాడ కొందరిలో రొమ్ములో ఉన్న ఫైబ్రస్ టిష్యూ ఎక్కువగా పెరిగి గడ్డలా తయారవుతుంది. దీనినే ఫైబ్రో ఎడినోమా అంటారు. ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావం వల్ల, కొందరిలో జన్యుపరమైన కారణాల వల్ల, ఇంకా తెలియని కారణాల వల్ల ఇవి రావచ్చు. ఇవి బఠాణీగింజ అంత పరిమాణం నుంచి నిమ్మకాయంత పరిమాణం వరకు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇవి చిన్న గోలీలా ఉండి, పట్టుకుంటే చిక్కకుండా రొమ్ములో కదిలిపోతుంటాయి. వీటి వల్ల ప్రమాదం ఏమీ లేదు. కాకపోతే, పరిమాణం త్వరగా పెరగడం, మరీ పెద్దగా ఉండి నొప్పి పెడుతుంటే, చిన్న ఆపరేషన్ చేసి తొలగించి, దానిని ల్యాబ్కు పరీక్షల కోసం పంపడం జరుగుతుంది. ఇవి సాధారణంగా 13–35 సంవత్సరాల వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అల్ట్రసౌండ్ స్కానింగ్ చేయించుకోవడం వల్ల వాటి పరిమాణం కరెక్టుగా ఎంత ఉన్నదీ, అవి ఫైబ్రోఎడినోమా గడ్డలేనా లేక ఏవైనా తేడాగా ఉన్న గడ్డలా అనే సంగతి తెలుస్తుంది. దానిబట్టి తర్వాత మమోగ్రామ్, బయాప్సీ వంటి ఇతర పరీక్షలేవైనా అవసరమా లేదా అనేది తెలుస్తుంది. వీటి వల్ల వైవాహిక జీవితానికి ఇబ్బందేమీ లేదు. ఈ లోపల మీరు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ, బరువు పెరగకుండా ఉంటే అవి సైజు పెరగకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. డా‘‘ వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
అవును.. కంపెనీలను తగ్గిస్తాం
న్యూయార్క్: ఉప్పు నుంచి సాఫ్ట్వేర్ దాకా విస్తరించిన టాటా గ్రూప్... ‘వెయిట్లాస్’ ట్రీట్మెంట్ను మొదలుపెడుతోంది. ప్రస్తుతం వందకుపైగానే ఉన్న గ్రూప్ కంపెనీల సంఖ్యను కచ్చితంగా తగ్గిస్తామని టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ స్పష్టం చేశారు. పతాక శీర్షికల కోసం తాము ఏదైనా వ్యాపారం నుంచి వైదొలగాలని భావించడం లేదని, రాబడులు ఇవ్వని వ్యాపారాలను మాత్రమే వదిలేయాలని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విఖ్యాత ఫార్చూన్ మేగజీన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అంశాలను వెల్లడించారు. కాగా, టెక్నాలజీ సంబంధ కంపెనీలన్నింటినీ సాఫ్ట్వేర్ దిగ్గజం టీసీఎస్ గూటికిందికి... అలాగే ఇతరత్రా సారూప్యతలున్న కంపెనీలను మరికొన్ని పెద్ద కంపెనీల్లో కలిపేసే ప్రణాళికల్లో టాటా గ్రూప్ ఉందంటూ ఇటీవల కొన్ని కథనాలు వచ్చిన నేపథ్యంలో చంద్రశేఖరన్ వ్యాఖ్యలు దీన్ని ధ్రువీకరించినట్లయింది. ‘ఇప్పటికే మాది 100 బిలియన్ డాలర్ల గ్రూప్. ఈ వృద్ధిని మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలంటే... పెద్ద కంపెనీలు అవసరం. ఎక్కువ సంఖ్యలో చిన్నచిన్న కంపెనీలతో భారీ వృద్ధి సాధ్యం కాదు. అందుకే మాకు ఇప్పుడు టాప్ కంపెనీలు కావాలి. అయితే, ఆయా వ్యాపార రంగాల్లో మాకున్న ప్రతి కంపెనీ నంబర్ వన్ లేదా రెండో ర్యాంకులో ఉండాలనేది నా అభిప్రాయం కాదు. టాప్ కంపెనీలు మాత్రం అత్యవసరం’ అని టాటా గ్రూప్ అధిపతి వివరించారు. పనితీరు మెరుగ్గా ఉండాల్సిందే... ‘ఇప్పుడు రాబడులు ఇవ్వని కంపెనీలు రానున్న రోజుల్లో ఇస్తాయని నేను అనుకోను. అలాంటి వ్యాపారాల నుంచి వైదొలగుతాం. దీని గురించి చాలా ఆలోచించా. తప్పనిసరిగా కంపెనీల సంఖ్య(పోర్ట్ఫోలియో)ను తగ్గించుకుంటాం. గ్రూప్ నిర్వహణలో ఉన్న ప్రతీ కంపెనీ పనితీరు మెరుగ్గా ఉండాల్సిందే. వృద్ధి రేటు, లాభదాయకత, పెట్టుబడులపై రాబడి వంటి అంశాలన్నీ సమీక్షిస్తాం. పనితీరు బాగోలేకుంటే గ్రూప్లో ఉండటానికి అర్హత లేనట్టే. వేగంగా పరుగెత్తాలంటే బరువును తగ్గించుకొని సన్నబడాల్సిందే’ అని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. నాకు చాలా స్వేచ్ఛ ఉంది... టాటా గ్రూప్లో ప్రధాన వాటాదారులైన టాటా ట్రస్టులకు బోర్డు నిర్ణయాల గురించి, భవిష్యత్తు ప్రణాళికల గురించి చెప్పడంలో తప్పేముందని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. అయితే, ప్రతి ఒక్క కంపెనీకి సంబంధించి ఏం చేస్తున్నామనేది తాను ట్రస్టులకు వివరించడం లేదన్నారు. ఇక నానో కారు విషయంలో టాటా మోటార్స్కు ఇతర ప్రాధామ్యాలు ఉన్నాయని చెప్పారు. ‘దేశీయంగా టాటామోటార్స్ కార్ల విక్రయాలు చాలా తక్కువ. అందులోనూ ఈ నానో అనేది మరింత చిన్న విభాగం. నానో ప్లాంట్ను మూసేయాలన్న నిర్ణయాన్ని తమ బోర్డు తీసుకుంటుందని నేను అనుకోవడం లేదు. ఇక గ్రూప్ చైర్మన్గా నాకు చాలా స్వేచ్ఛ ఉంది’ అని చంద్ర పేర్కొన్నారు. అయితే, ఏదైనా నిర్ణయం తీసుకునేముందు మేనేజ్మెంట్తో విస్తృతంగా చర్చిస్తామన్నారు. కాగా, మిస్త్రీ కుటుంబంతో టాటా సన్స్ బంధం ఎలా ఉండబోతోందన్నదానిపై వ్యాఖ్యానించేందుకు ఆయన నిరాకరించారు. మిస్త్రీతో వివాదం అంశం కోర్టుల్లో ఉన్నందున తాను దీనిపై మాట్లాడబోనని తేల్చిచెప్పారు. -
ఇక సర్జరీతో పనిలేదు!
ఊబకాయులకు తీపి కబురు.సర్జరీ అవసరం లేకుండా బరువు తగ్గే విధానాన్ని రేడియాలజిస్ట్లులు కనుగొన్నారు. ఫోటో ఆధారిత ట్రీట్మెంట్ బేరియాట్రిక్ ఆర్టేరియల్ ఎమ్బాలిసేటన్ (బీఏఈ)పద్ధతి ద్వారా రోగి పొట్టలోని ఒక భాగానికి రక్తప్రసరణను తగ్గించి బరువు తగ్గేలా చేస్తారు. ప్రస్తుతం అనుసరిస్తున్న శస్త్రచికిత్స సర్జికల్ గ్యాస్టిక్ట్ బైపాస్ కు విభిన్నంగా ఎటువంటి ఆహార,వ్యాయామ నియమాలతో పనిలేకుండా బీఏఈ పనిచేస్తుందని యూఎస్ లోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ పరిశోధకుడు క్లిఫార్డ్ వెసిస్ తెలిపారు. ప్రాథమిక దశ పరిశోధనల్లో బీఏఈ ప్రస్తుతం అమల్లో ఉన్న చికిత్స కంటే మెరుగ్గా ఉంది.కొంత మంది రోగుల మీద జరిపిన పరిశోధనల్లో మొదటి నెలలో 5.9 శాతం, ఆరు నెలల తర్వాత 13.3 శాతం బరువుల్లో సగటు తేడాలు కనిపించాయి.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
17, 18 తేదీల్లో గైట్లో ఎస్టీయూ రాష్ట్ర స్థాయి శిక్షణ
నేడు, రేపు గురుకుల పాఠశాలల్లో సీట్ల భర్తీ
No Headline
No Headline
శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణం
శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ‘గంగుల’
కరీంనగర్లో ‘లండన్’ ఎగ్జిబిషన్
నేలకు సారం.. పంటకు ప్రాణం
పనులు సత్వరమే పూర్తి చేయాలి
బీమా చెక్కు అందజేత
తప్పక చదవండి
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
- Virat Kohli: ఒక్కసారి క్రికెట్కు వీడ్కోలు పలికితే.. కోహ్లి నోట రిటైర్మెంట్ మాట!
- భారత సంతతి బాలుడికి దుబాయ్ పోలీసుల సత్కారం!
- IPL 2024: సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరదు.. ఆ నాలుగు జట్లే! ఫ్యాన్స్ ఫైర్
- మళ్లీ మనదే అధికారం.. చరిత్ర సృష్టించబోతున్నాం: సీఎం జగన్
Advertisement