-
స్టార్ రెజ్లర్ బజరంగ్పై.. తాత్కాలిక నిషేధం!
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియాపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) తాత్కాలిక నిషేధం విధించింది. మార్చి 10వ తేదీన సోనెపట్లో నిర్వహించిన జాతీయ రెజ్లింగ్ ట్రయల్స్ సందర్భంగా బజరంగ్ సెమీఫైనల్లో ఓడిపోయాక డోపింగ్ పరీక్షకు హాజరుకాకుండానే బయటకు వెళ్లిపోయాడు.దాంతో ‘నాడా’ ఏప్రిల్ 23న బజరంగ్పై తాత్కాలిక నిషేధం విధించింది. డోపింగ్ పరీక్షకు ఎందుకు హాజరుకాలేదో వివరణ ఇవ్వాలని కోరుతూ మే 7వ తేదీ వరకు బజరంగ్కు గడువు ఇచి్చంది. మరోవైపు తాను డోపింగ్ పరీక్షకు హాజరయ్యేందుకు నిరాకరించలేదని... ‘నాడా’ అధికారులు ఆరోజు గడువు తీరిన కిట్స్తో తన నుంచి శాంపిల్స్ సేకరించేందుకు వచ్చారని బజరంగ్ ఆరోపించాడు. ‘నాడా’ అధికారులకు తన న్యాయవాది సమాధానం ఇస్తాడని బజరంగ్ తెలిపాడు.ఇవి చదవండి: రవీంద్రజాలం... జడేజా ఆల్రౌండ్ షో.. -
‘నన్నోడించిన వాడ్నే పెళ్లి చేసుకుంటా’
‘‘బరిలో దూకండి. నన్ను ఓడించండి. ఆ దమ్మున్న మగవాడినే నేను పెళ్లి చేసుకుంటా’’.. పురుషాధిపత్యం కొనసాగుతున్న రోజుల్లో ఓ మహిళ విసిరిన సవాల్ ఇది. సాధారణ మహిళ అయితే చర్చకు అంతగా ఆస్కారం ఉండేది కాదు. కానీ, ఆ సవాల్ విసిరింది హమీదా బాను. ఇంతకీ ఇవాళ గూగుల్ హోం పేజీని గమనించారా?.. అందులో ఉంది ఆమెనే.1940-55 మధ్య.. కుస్తీ పోటీల్లో వందల మందిని ఓడించానని తనకు తానుగా ప్రకటించుకుంది హమీదా బాను. కళ్లారా ఆమె పాల్గొన్న పోటీలు చూసి అప్పటి మీడియా పొగడ్తలతో ఆమెను ఆకాశానికి ఎత్తేసింది. భారతదేశంలో తొలి మల్ల యోధురాలిగా హమిదా బాను పేరు చరిత్రకెక్కింది. ఇప్పుడు.. డూడుల్ రూపంలో ఆ యోధురాలికి గౌరవం ఇచ్చింది గూగుల్.సంప్రదాయ కుటుంబంలో పుట్టి.. హేతుబద్ధమైన పెద్దల్ని ఎదురించి.. ఇంటి నుంచి బయటకు వచ్చేసింది హమీదా. ఉత్తర ప్రదేశ్ మీర్జాపూర్ ఆమె స్వస్థలం. అక్కడి నుంచి ఆమె అలీఘడ్ వలస వెళ్లింది. అక్కడే సలాం పహిల్వాన్ ఆమెకు పరిచయం అయ్యాడు. ఆయన దగ్గర కుస్తీ శిక్షణ తీసుకుంటూ పలు పోటీల్లో పాల్గొందామె. అయితే 1954 ఫిబ్రవరిలో ఆమె ఇచ్చిన ఒక బహిరంగ ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనను ఓడించిన వాళ్లను వివాహం చేసుకుంటానని ప్రకటించి అటు ప్రజలు, ఇటు మీడియా దృష్టిని ఆకర్షించింది.ఛాలెంజ్లో భాగంగా.. పంజాబ్లో ఒకరిని, కోల్కతాలో ఒకరిని బాను ఓడించింది. ఆ తర్వాత గుజరాత్ బరోడాకు చేరుకున్న ఆమెకు ఘన స్వాగతం లభించింది. అప్పటికి ఆమె వయసు 34 ఏళ్లు. ఆ సవాల్ విసిరిన నాటికి ఆమె 300 మ్యాచ్లు పూర్తి చేసుకుందట. అయితే ఆమెతో తలపడాల్సిన చోటే గామా పహిల్వాన్ ఆఖరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఆమె బాబా పహిల్వాన్తో తలపడి.. కేవలం నిమిషం వ్యవధిలోనే ఆమె నెగ్గింది.బాను పాపులారిటీ ఏ స్థాయికి చేరిందో.. 1944లో బాంబే క్రానికల్ రాసిన ఒక కథనం చూస్తే తెలుస్తుంది. బాంబేలో ఆమె పాల్గొన్న ఒక మ్యాచ్ చూసేందుకు 20 వేల మంది ప్రేక్షకులు వచ్చారట. అయితే ప్రత్యర్థి గూంగా పహిల్వాన్ అసంబంద్ధమైన డిమాండ్లతో ఆ మ్యాచ్ జరగకుండా పోయింది. దీంతో ఆగ్రహించిన ప్రేక్షకులు స్టేడియంలో బీభత్సం సృష్టించారట.అమెజాన్ ఆఫ్ అలీగఢ్.. ముద్దుగా హమీదా బానుకు అప్పటి మీడియా పెట్టుకున్నపేరు. ఐదడుగల మూడు అంగుళాలు, 108 కేజీల బరువుతో.. రోజుకు ఐదున్నర లీటర్ల పాలు, రెండు లీటర్ల పండ్ల రసేఆలు, కేజీ మటన్, అరకేజీ బటర్, ఆరు గుడ్లు, రెండు ప్లేట్ల బిర్యానీ.. ఇలా ఆమె డైట్ గురించి కూడా అప్పట్లో పేపర్లు కథనాలు రాసేవి.హమిదా బాను కెరీర్ సగానికి పైగా వివాదాలతోనే సాగింది. మగవాళ్లతో ఆమె తలపడడాన్ని పలువురు బహిరంగంగానే వ్యతిరేకించారు. మొరార్జీ దేశాయ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె పోటీలపై నిషేధం విధించారు. అందుకు ఆమె బహిరంగంగానే ఆయనపై విమర్శలు గుప్పించింది. అలాగే.. ఆమె పాల్గొన్న పోటీల్లోనూ ప్రేక్షకుల నుంచి దాడులు తప్పలేదట. 1954 దాకా దేశ, విదేశీ రెజ్లర్లతో ఆమె తలపడింది. అయితే అదే ఏడాది విదేశాలకు వెళ్లే అవకాశం వచ్చినా.. ఆర్థిక స్తోమత లేకపోవడం, స్పానర్లు ఎవరూ ముందుకు రాలేదన్న కారణాలతో ఆమె ఆగిపోయింది. అయితే ఆ ఆగిపోవడం.. బరికి శాశ్వతంగా హమిదా బానును దూరం చేసింది కూడా. 1987లో మహేశ్వర్ దయాల్ అనే రచయిత ఆమె జీవితం మీద రాసిన పుస్తకంలో సంచలన విషయాల్ని పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్, పంజాబ్లో ఆమె కుస్తీ పోటీల్లో పాల్గొందని, మగ పోటీదారులతో మాత్రమే ఆమె తలపడేదని, అయితే కొన్ని చోట్ల ఆమె రహస్య ఒప్పందాలు కూడా చేసుకునేదని ఆయన రాశారు.రెజ్లింగ్ కెరీర్ మాత్రమే కాదు.. వ్యక్తిగత జీవితం కూడా ఒడిదుడుకుల నడుమ సాగింది. కోచ్ సలాం పహిల్వాన్తో కలిసి అప్పటిదాకా ప్రొఫెషనల్ రిలేషన్ సాగించిన ఆమె.. ఆ తర్వాత ఆయనతో సహజీవనం చేసింది. ఈ క్రమంలోనే ఆమెను విదేశీ పోటీలకు వెళ్లకుండా సలామే అడ్డుకున్నాడనన్న ఆరోపణ ఒకటి ఉంది. ఇంకోవైపు ఉత్తర భారతం నలుమూలల పోటీల్లో పాల్గొన్న హమిదాను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. ముంబై కల్యాణ్ ప్రాంతంలో ఉంటూ.. సలాంతో కలిసి పాల వ్యాపారం మొదలుపెట్టింది.సలాం కూతురు సహారా, బానును పినమ్మగా చెబుతుంటుంది. అయితే సలాం ఆమెను శారీరకంగానూ ఎంతో వేధించేవాడని బాను మనవడు ఫిరోజ్ షేక్(ఆమె దత్తపుత్రుడి కొడుకు) ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. యూరప్కు వెళ్లకుండా బానును నిలువరించిన సలాం.. ఆమెను చిత్రహింసలకు గురి చేశాడని, ఈ క్రమంలోనే ఆమె కాళ్లు, చేతులు విరిగియాని ఆరోపించారాయన. కొన్నాళ్లకు సలాం, బానులు విడిపోయారు. సలాం కల్యాణ్లోనే ఉంటూ పాల వ్యాపారం కొనసాగించింది. డబ్బు సరిపోని సమయంలో పిండి వంటలు చేసి రోడ్ల మీద అమ్ముకునేది. అలా మల్లు యోధురాలిగా పేరున్న హమీదా బాను.. చివరి రోజులు మాత్రం కష్టంగానే గడిచాయని పలు కథనాలు వెల్లడించాయి. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ అంకుర్ జైన్.. ఫోటోలు
భారతీయ సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త, బిలినీయర్ 'అంకుర్ జైన్' గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. భారతీయ మూలాలున్న ఈయన బిల్ట్ రివార్డ్స్ సీఈఓగా ఉన్నారు. ఇటీవల ఈయన మాజీ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్ 'ఎరికా హమ్మండ్'ను వివాహం చేసుకుని ఓ ఇంటివారయ్యారు.అంకుర్ జైన్, ఎరికా హమ్మండ్ ఏప్రిల్ 26న ఈజిప్ట్లోని పిరమిడ్స్ ఎదురుగా పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పెళ్లి వేడుకలకు కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు.. పలువురు వ్యాపార, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.పెళ్లి కొంత భిన్నంగా ఉండాలనే ఆలోచనతోనే వారు దక్షిణాఫ్రికాలోని సఫారీ సందర్శనలో మొదలు పెట్టి ఈజిప్ట్లో పెళ్లి వేడుకలను ముగించారు. న్యూయార్క్ సిటీకి చెందిన భారత సంతతి బిలియనీర్ అంకుర్ జైన్ రంబుల్ బాక్సింగ్ జిమ్కి వెళ్లే సమయంలో.. ఎరికా హమ్మండ్, అంకుర్కు ఫిజికల్ ట్రైనర్గా వ్యవహరించారు. ఈ పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది.ఎవరీ ఎరికా హమ్మండ్?ఎరికా హమ్మండ్ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్. ఆమె రెజ్లింగ్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఫిట్నెస్ కోచ్గా మారింది. ఈ సమయంలోనే బిలినీయర్ 'అంకుర్ జైన్'ను కలుసుకున్నారు. ఈమె స్ట్రాంగ్ అనే యాప్ కూడా స్టార్ట్ చేశారు. View this post on Instagram A post shared by Ankur Jain (@ankurjain) -
వినేశ్పైనే దృష్టి
బిషె్కక్ (కిర్గిస్తాన్): భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ వరుసగా మూడోసారి ఒలింపిక్స్కు అర్హత సాధించేందుకు సమాయత్తమైంది. నేటి నుంచి మూడు రోజులపాటు జరిగే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో వినేశ్ బరిలోకి దిగనుంది. వినేశ్ రెగ్యులర్ వెయిట్ కేటగిరీ 53 కేజీలు అయినప్పటికీ ఈ విభాగంలో ఇప్పటికే భారత్ నుంచి అంతిమ్ పంఘాల్ ఒలింపిక్స్కు అర్హత సాధించింది. దాంతో వినేశ్ 50 కేజీల విభాగంలో పోటీపడాలని నిర్ణయం తీసుకుంది. గత ఏడాది భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై లైంగిక వేధింపులకు సంబంధించిన వివాదంలో సాక్షి మలిక్, బజరంగ్ పూనియాలతో కలిసి వినేశ్ పోరాడింది. -
ఇది మహిళలందరి విజయం..మాకూ ధైర్యం: రెజ్లర్ వినేష్ ఫోగట్
బిల్కిస్ బానో కేసులో దోషుల క్షమాభిక్షను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రముఖ రెజ్లర్, ఒలింపిక్ మెడల్ విజేత వినేష్ ఫోగట్ (Vinesh Phogat) స్పందించారు. ఇది మహిళల విజయం అంటూ ఆమె ట్వీట్ చేశారు.ఈ పోరాటంలో విజయం సాధించిన బిల్కిస్ బానోకు అభినందనలు తెలిపారు. “బిల్కిస్ జీ, ఇది మన మహిళలదరి విజయం. మీరు సుదీర్ఘ పోరాటం చేశారు. మీ విశ్వాసం చూసి మాకూ ధైర్యం వచ్చింది” అని ఫోగట్ ట్విటర్లో పేర్కొంది. बिलकिस जी ये हम सब महिलाओं की जीत है। आपने लंबी लड़ाई लड़ी है। आपको देखकर हमें भी हिम्मत मिली है। 🙏 pic.twitter.com/zKWsPMjdhF — Vinesh Phogat (@Phogat_Vinesh) January 8, 2024 బీజేపీ ఎంపీ,మాజీ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు నిరసనగా మహిళా రెజ్లర్లు చేసిన చాలా పెద్ద పోరాటమే చేశారు. దాదాపు ఏడుగురుమహిళా రెజర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపించిన సుదీర్ఘ పోరాటం చేసిన వినేష్ ఫోగట్ ఒకరు. అయితే ఆ ఆరోపణలను సింగ్ ఖండిస్తూ వచ్చారు. (బిల్కిస్ బానో కేసు: ఎవరీ సంచలన మహిళా జడ్జి?) ఇది ఇలా ఉంటే ఇటీవల బ్రిజ్ భూషణ్ అనుచరుడు సంజయ్ సింగ్ను ఆ పదవిలో నియమించడం పెద్ద దుమారాన్ని రేపింది. దీంతో తమకు న్యాయం జరగలేదంటూ మహిళ రెజర్లు తీవ్ర అసంతృప్తిని ప్రకటించారు. ముఖ్యంగా ఈ పోరాటంలో మరో కీలక రెజ్లర్ సాక్షి మాలిక్ రిటైర్మెంట్ ప్రకటించింది. అలాగే వినేష్ ఫోగట్ ప్రతిష్టాత్మక అర్జున, ఖేల్ రత్న అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించారు. వీరికి మద్దతుగా రెజ్లర్ భజరంగ్ పూనియా కూడా తన అవార్డులను వెనక్కి ఇచ్చేసిన సంగతి తెలిసిందే. (హీరో అయితేనేం.. ఆ కూతురికి నాన్నేగా!) కాగా ఫోగట్ కామన్వెల్త్ , ఆసియా క్రీడలలో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్, అలాగే ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లలో అనేక ప తకాలు చాటుకుని భారతీయ సత్తా చాటిన ఏకైక భారతీయ మహిళా రెజ్లర్ కూడా. -
వినేశ్ కూడా వెనక్కిచ్చేసింది!
న్యూఢిల్లీ: భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కూడా కేంద్ర క్రీడా అవార్డులను వెనక్కి ఇచ్చేసింది. శనివారం కర్తవ్యపథ్ వద్ద ఆమె ‘ఖేల్రత్న’, అర్జున అవార్డులను వదిలేసి వెళ్లింది. కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్షిప్లలో పతకాలతో ఆమె దేశానికి కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టింది. ఫొగాట్ ఘనతలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ‘మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న’, అర్జున అవార్డులను ఇచ్చింది. అయితే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)లో మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన వివాదాస్పద మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్సింగ్ వర్గమే కొత్తగా ఎన్నికైంది. ఆయన విధేయుడైన సంజయ్ సింగ్ అధ్యక్షుడు అయ్యారు. దీన్ని ఏమాత్రం జీర్ణించుకోలేని స్టార్ రెజ్లర్ సాక్షి మలిక్ నిమిషాల వ్యవధిలోనే రిటైర్మెంట్ ప్రకటించింది. బజరంగ్ ‘పద్మశ్రీ’ని వెనక్కిచ్చాడు. బధిర రెజ్లర్ వీరేందర్ సింగ్ కూడా తన పురస్కారాన్ని వెనక్కిస్తున్నట్లు ప్రకటించాడు. తాజాగా ఫొగాట్ కూడా ముందు ప్రకటించినట్లే ఖేల్రత్న, అర్జున అవార్డుల్ని వెనక్కి ఇచ్చేందుకు ప్రధానమంత్రి నివాసానికి బయల్దేరింది. కర్తవ్యపథ్ వద్ద ఢిల్లీ పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో అవార్డుల్ని రోడ్డుపైనే వదిలేసింది. ఆ పురస్కారాలు ఇప్పుడు పోలీసుల ఆ«దీనంలో ఉన్నాయి. -
Rahul Gandhi: రెజ్లర్ల నిరసనలో పాల్గొని రాహుల్ కుస్తీ (ఫొటోలు)
-
వినేశ్ ఫొగాట్ సంచలన నిర్ణయం.. ‘ఖేల్రత్న... అర్జున’ వెనక్కి
న్యూఢిల్లీ: ఇప్పుడు వినేశ్ ఫొగాట్ వంతు వచ్చింది. ఈ స్టార్ రెజ్లర్ కూడా తన ఘనతలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఇచ్చిన అవార్డులను వెనక్కివ్వాలని నిర్ణయించుకుంది. రోడ్డెక్కి పోరాడినా... క్రీడాశాఖ నుంచి స్పష్టమైన హామీ లభించినా... మళ్లీ రెజ్లర్లకు అన్యాయమే జరిగిందని వాపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పురస్కారాలను అట్టిపెట్టుకోవడంలో అర్థమేలేదని వినేశ్ తెలిపింది. సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా తన ఆవేదనను ప్రధానికి లేఖ ద్వారా తెలియజేసింది. ‘ఇంత జరిగాక ఇక నా జీవితంలో ఈ రెండు అవార్డులకు విలువే లేదు. ఎందుకంటే ఏ మహిళ అయినా ఆత్మ గౌరవాన్నే కోరుకుంటుంది. నేనూ అంతే... నా జీవితానికి ఆ అవార్డులు ఇకపై భారం కాకూడదనే ఉద్దేశంతోనే నాకు మీరిచ్చిన అవార్డుల్ని వెనక్కి ఇస్తున్నాను ప్రధాని సార్’ అని ఆమె ‘ఎక్స్’లో లేఖను పోస్ట్ చేసింది. మహిళా సాధికారత, సమ సమానత్వం అనే ప్రకటనలకే ప్రభుత్వం పరిమితమని తీవ్రంగా ఆక్షేపించింది. మేటి రెజ్లర్ ఫొగాట్ ప్రపంచ చాంపియన్షిప్లో రెండు కాంస్య పతకాలు సాధించింది. మూడు (2014, 2018, 2022) కామన్వెల్త్ క్రీడల్లోనూ చాంపియన్గా నిలిచింది. ఆసియా క్రీడల్లో స్వర్ణం (2018), కాంస్యం (2014) చేజిక్కించుకుంది. కుస్తీలో ఆమె పతకాల పట్టును గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2016లో అర్జున, 2020లో ‘మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న’ అవార్డులతో సత్కరించింది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో లైంగిక ఆరోపణల కేసులో నిందితుడైన వివాదాస్పద మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ వర్గమే గెలిచింది. ఆయన విధేయుడు సంజయ్ సింగ్ అధ్యక్షుడిగా ఎన్నికవడంతో సాక్షి మలిక్ ఉన్న పళంగా రిటైర్మెంట్ ప్రకటించింది. రెజ్లర్ బజరంగ్ పూనియా, బధిర రెజ్లర్ వీరేందర్ సింగ్ ‘పద్మశ్రీ’ పురస్కారాలను వెనక్కి ఇచ్చారు. అయితే కేంద్ర క్రీడాశాఖ నియమావళిని అతిక్రమించడంతో డబ్ల్యూఎఫ్ఐని సస్పెండ్ చేసింది. -
స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ రిటైర్ మెంట్
-
కుస్తీకి సాక్షి స్వస్తి
న్యూఢిల్లీ: సాక్షి మలిక్... మహిళల కుస్తీలో పతకం పట్టుబట్టే స్టార్ రెజ్లర్. కామన్వెల్త్ క్రీడల్లో మూడు పతకాలు... ఆసియా చాంపియన్íÙప్లో నాలుగు పతకాలు... రియో ఒలింపిక్స్లో కాంస్య పతకం... ఇవిచాలు సాక్షి ఏస్థాయి రెజ్లరో చెప్పడానికి! దేశానికి పతకాలెన్నో తెచ్చిపెట్టిన ఆమె... గురువారం జరిగిన డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ విధేయుడే అధ్యక్షుడిగా ఎన్నికవడంతో ఇక చేసేదేమీ లేక బయట పోరాటానికి, బౌట్లో పతకం ఆరాటానికి సెలవిచ్చింది. కన్నీటి చెమ్మతో బరువెక్కిన హృదయంతో రిటైర్మెంట్ ప్రకటించింది. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడైన బ్రిజ్భూషణ్ ప్రధాన అనుచరుడు సంజయ్ సింగ్ భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. బ్రిజ్భూషణ్ పై ఢిల్లీ రోడ్లెక్కి సాక్షి సహా స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్, సంగీత ఫొగాట్ తదితరులు నిరసన తెలిపారు. పగలనక... రాత్రనక... తిండి నిద్రలేని రాత్రులెన్నో గడిపి బ్రిజ్భూషణ్ను గద్దె దింపాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన గద్దె దిగినప్పటికీ ఆయన నీడ సంజయ్ సింగ్ అధ్యక్షుడు కావడంతో జీర్ణించుకోలేకపోయిన సాక్షి తన ఆటకు టాటా చెప్పేసింది. స్టార్ రెజ్లర్లు బజరంగ్, వినేశ్ కూడా సంజయ్ ఎన్నికపై తప్పుబట్టారు. అవును... అందుకే గుడ్బై ‘బ్రిజ్భూషణ్ మహిళా రెజ్లర్ల పట్ల ప్రవర్తించిన తీరుపై గళమెత్తాం. కదంతొక్కాం. కేసు నమోదు చేయించాం. కానీ డబ్ల్యూఎఫ్ఐ తాజా ఎన్నికల్లో చివరకు ఆయన వర్గమే గెలిచింది. పదవులన్నీ చేజిక్కించుకుంది. అందుకే కెరీర్కు గుడ్బై చెప్పా. మేం మహిళా అధ్యక్షురాలైతే బాగుంటుందని అనుకున్నాం. కానీ అలా జరగలేదు’ అని మీడియా సమావేశంలో సాక్షి వాపోయింది. 15లో 13 పదవులు బ్రిజ్భూషణ్ వర్గానివే మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ డబ్ల్యూఎఫ్ఐలో తన పట్టు నిరూపించుకున్నాడు. ఆయన బరిలో లేకపోయినా... 15 పదవుల్లో ఆయన వర్గానికి చెందిన 13 మంది పదవుల్ని చేజిక్కించుకున్నారు. అధ్యక్ష పదవి ఎన్నికలో ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ సంఘం ఉపాధ్యక్షుడైన సంజయ్... 2010 కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతక విజేత అనిత షెరాన్పై 40–7 ఓట్ల తేడాతో గెలిచాడు. అనిత వర్గానికి చెందిన ప్రేమ్చంద్ లోచబ్ ప్రధాన కార్యదర్శి పదవి పొందడం... సీనియర్ ఉపాధ్యక్షుడిగా దేవేందర్ సింగ్ కడియాన్ ఎన్నికవడం ఒక్కటే ఊరట. మిగతా 4 ఉపాధ్యక్ష పదవులు బ్రిజ్భూషణ్ క్యాంప్లోని జైప్రకాశ్ (ఢిల్లీ), అశిత్ సాహా (బెంగాల్), కర్తార్ సింగ్ (పంజాబ్), ఫొని (మణిపూర్)లే సొంతం చేసుకున్నారు. ఉపాధ్యక్ష బరిలో దిగిన మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి, మాజీ రెజ్లర్ మోహన్ యాదవ్కు కేవలం ఐదు ఓట్లు లభించడం గమనార్హం. కోశాధికారిగా సత్యపాల్ (ఉత్తరాఖండ్), ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులందరూ బ్రిజ్భూషణ్ వర్గం వారే ఎన్నికయ్యారు. నిరసన దీక్ష చేపట్టిన రెజ్లర్లపై ఎలాంటి వివక్ష చూపం. ప్రతీకారం తీర్చుకోం. రెజ్లర్లందరిని సమానంగా చూస్తాం. వారికి కావాల్సిన సహకారాలు అందిస్తాం. మేం రెజ్లింగ్ ఆటపైనే దృష్టి పెడతాం. రెజ్లర్ల పొరపాట్లపై కాదు. ఎన్నికైన కొత్త కార్యవర్గమే డబ్ల్యూఎఫ్ఐని నడిపిస్తుంది. రోజువారీ వ్యవహారాల్లో నా ప్రమేయం ఉండదు. వారు కోరితేనే సలహాలిస్తా. –మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ -
రవి దహియాకు షాక్
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ రవి దహియా ఆసియా క్రీడలకు అర్హత సాధించలేకపోయాడు. టోక్యో ఒలింపిక్స్లో రజతం, కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం, వరుసగా మూడేళ్లు ఆసియా చాంపియన్గా నిలిచిన రవి దహియా (57 కేజీలు) ఆదివారం నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్లో ఆతీశ్ తోడ్కర్ (మహారాష్ట్ర) చేతిలో అనూహ్యంగా ఓడిపోయాడు. అయితే ఈ విభాగంలో అమన్ సెహ్రావత్ విజేతగా నిలిచి ఆసియా క్రీడల బెర్త్ను దక్కించుకున్నాడు. ఇతర విభాగాల్లో దీపక్ పూనియా (86 కేజీలు), విక్కీ (97 కేజీలు), యశ్ (74 కేజీలు), సుమిత్ మలిక్ (125 కేజీలు), విశాల్ కాళీరామన్ (65 కేజీలు) విజేతలుగా నిలిచారు. 65 కేజీల విభాగంలో బజరంగ్ పూనియాకు నేరుగా ఆసియా క్రీడల్లో ఆడే అవకాశం కల్పించడంతో విశాల్ ‘స్టాండ్బై’గా ఉంటాడు. -
రెజ్లర్ల పోరాటానికి ఊహించని షాక్.. అసలు నిజం ఇదేనా?
న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా రెజ్లర్లు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు,బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్కు వ్యతిరేకరంగా లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో నిరసనలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పోరాటానికి మైనర్ రెజ్లర్ తండ్రి రూపంలో ఊహించని షాక్ తగిలింది. ఆయన వేరే కారణం వల్ల కలిగిన కోపంతో బ్రిజ్ భూషణ్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినట్లు, అది తప్పుడు ఫిర్యాదని ఆ మైనర్ రెజ్లర్ తండ్రి మీడియాకు తెలపడంతో ఒక్కాసారిగా అంతా అవాక్కయ్యారు. ప్రస్తుతం మీరు ఇలా ఎందుకు మాట మారుస్తున్నారని విలేకరులు ఆయనను అడగగా.. ‘ఈ నిజం న్యాయస్థానం ద్వారా బయటకు రావడం కంటే ఇప్పుడు ఈ రకంగా బయటకు రావడమే మేలు’ అని చెప్పుకొచ్చారు. దీనిపై వివరణగా.. 2022లో అండర్-17 చాంపియన్షిప్ ట్రయల్స్ ఫైనల్స్లో తన కూతురు ఓడిపోయిందని తెలిపారు. ఆ పోటీలో తన కూతురు ఓటమికి కారణమైన రెఫరీని డబ్ల్యూఎఫ్ డిప్యూటేషన్ మీద పంపించిందని, దాని అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కాబట్టే ఆయనపై కోపంతో లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినట్లు చెప్పుకొచ్చారు. అయితే కేవలం ఒక మ్యాచ్లో ఓటమికి డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిపై ఇంత తీవ్రమైన ఆరోపణలు ఎందుకు చేశారని ప్రశ్నించారు. అందుకు ఆయన బదులిస్తూ.. మీకు అది ఒక్క పోటీనే కావచ్చని, కానీ అది తన కూతురుకు ఏడాది శ్రమకు ఫలితమని చెప్పారు. అంతేకాకుండా తన కూతురు ఓడిపోయిన అండర్-17 చాంపియన్షిప్ ట్రయల్స్పై నిష్పక్షపాతంగా విచారణ చేయిస్తామని అధికారులు నాకు హమీ ఇచ్చారని, అందుకు ఆరోపణలను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. చదవండి: ‘ఒడిశా ఘోర రైలు ప్రమాదం.. దేశానికి మరో ముప్పు ఉంది’ -
బ్రిజ్భూషణ్ను విచారించిన పోలీసులు..
న్యూఢిల్లీ: పలువురు మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ సింగ్ పోలీసుల విచారణకు హాజరయ్యాడు. కేసు తీవ్రత దృష్ట్యా ఢిల్లీ పోలీసులు పది మందితో ప్రత్యేక పరిశోధన బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఈ బృందంలో నలుగురు మహిళా పోలీసు అధికారిణులు కూడా ఉన్నారు. గత నెలలో బ్రిజ్భూషణ్పై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. విచారణకు హాజరుకావాలని ఇటీవల బ్రిజ్భూషణ్కు నోటీసులు జారీ చేయగా... గురువారం ఆయన హాజరయ్యారని... ‘సిట్’ మూడు గంటలపాటు ఆయనను ప్రశ్నించదన ఢిల్లీ పోలీసు ఉన్నాతాధికారి ఒకరు తెలిపారు. ఈ సందర్భంగా తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని, ఉద్దేశపూర్వకంగా తనను ఇరికిస్తున్నారని బ్రిజ్భూషణ్ సమాధానం ఇచ్చినట్లు ఆ పోలీసు అధికారి తెలిపారు. ఇప్పటికే 30 మంది సాక్షుల నుంచి వాంగ్మూలాలు తీసుకున్నామని, ఈ కేసుకు సంబంధించి మున్ముందు కూడా బ్రిజ్భూషణ్ను విచారణ కోసం పిలుస్తామన్నారు. మరిన్ని ఆధారాలు సేకరించేందుకు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, హరియాణా రాష్ట్రాలకు ఢిల్లీ పోలీసులు ప్రత్యేక బృందాలు వెళ్లినట్లు ఆ పోలీసు అధికారి వివరించారు. ఇప్పటికైతే మేజిస్ట్రేట్ ఎదుట మైనర్ రెజ్లర్ వాంగ్మూలాన్ని తీసుకున్నామని... త్వరలోనే మరో ఆరుగురు మహిళా రెజ్లర్ల స్టేట్మెంట్ను కూడా మేజిస్ట్రేట్ సమక్షంలో నమోదు చేస్తామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ కేసు విచారణ నిమిత్తం ‘సిట్’ ఏర్పాటు చేశామని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ హర్జీత్సింగ్ జస్పాల్కు శుక్రవారం ఢిల్లీ పోలీసులు నివేదిక సమరి్పంచగా.. తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేశారు. చదవండి: ఫైనల్లో బెర్త్ కోసం బరిలో భారత బాక్సర్లు -
రెజ్లర్ల నిరసనలో పాల్గొనేందుకు తరలి వస్తున్న రైతులు..బారికేడ్లను చేధించి..
జంతర్మంతర్ వద్ద భారత రెజ్లర్లు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత రెజ్లర్లకు మద్దతు ప్రకటించిన రైతు సంఘాలు ఈ రోజు పెద్ద ఎత్తున వారి నిరసనలో పాల్గొన్నారు. ఈ క్రమంలో జంతర్ మంతర్ వద్ద నాటకీయ పరిణామాం చోటు చేసుకుంది. నిజానికి రైతులు ఈ నిరసనలో పాల్గొంటారని తెలిసి ముందస్తుగా భారీగా పోలీసుల మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు కూడా. ఐతే సోమవారం రైతులు, పోలీసులు మధ్య ముఖాముఖి చర్చలనంతరం వారి ప్రవేశానికి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పెద్ద ఎత్తున తరలివంచిన రైతు సముహాలు జంతర్మంతర్ ఎంట్రీ వద్ద ఉన్న బారీకేడ్లను తోసుకుంటూ ఒకేసారి సమూహాంగా ప్రవేశించారు. దీంతో అక్కడ ఉన్న బారికేడ్లు పడిపోయాయి. అందువల్ల రైతులు కొందరూ వాటిపైకి ఎక్కి వెళ్లడం, మరికొందరూ కింద నుంచి వెళ్లడం వంటివి చేశారు. అంతేగాదు పోలీసుల బృందం వారి ప్రవేశాన్ని సులభతరం చేసేందుకు బారికేడ్లను పక్కకు తొలగించినట్లు ఢిల్లీ డిప్యూటీ కార్యాలయం ఆఫ్ పోలీస్ కార్యాలయం ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా ఢిల్లీ డిప్యూటీ కార్యాలయం ట్విట్టర్ వేదికగా ప్రజలను నకిలీ వార్తలను నమ్మెద్దని విజ్ఞప్తి చేసింది. జంతర్ మంతర్ వద్ద నిరసనకారులకు తగిన సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. భద్రత నిర్ధారిచడానికి డీఎఫ్ఎండీ ద్వారా ప్రవేశాన్ని నియంత్రిస్తున్నట్లు తెలిపారు. శాంతియుతంగా ఉండాలని, చట్టానికి కట్టుబడి ఉండాలని సూచించారు. ప్రస్తుతం నిరసన వేదిక ముందు పెద్ద సంఖ్యలో రైతులు కూర్చున్నారు. ఇదిలా ఉండగా..వినేశ్ ఫోగట్ మాట్లాడుతూ..తమ నిరసనను ఎవరూ భగ్నం చేయలేరని నొక్కి చెప్పారు. మే 21లోగా బ్రిజ్ భూషణ్ని అరెస్టు చేయకుంటే తమ నిరసనను మరింతగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా, వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్లతో సహా దేశంలో అగ్రశ్రేణి రెజ్లర్లంతా డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో జంతర్మంతర్ వద్ద పక్షం రోజులుగా నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిరసన చేసిన కిసాన్ మోర్చా ఆధ్వర్యంలోని రైతు సంఘాల సదరు రెజ్లర్లకు తమ మద్దతను ప్రకటించి, వారి నిరసనలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. #WATCH | Farmers break through police barricades as they join protesting wrestlers at Jantar Mantar, Delhi The wrestlers are demanding action against WFI chief and BJP MP Brij Bhushan Sharan Singh over allegations of sexual harassment. pic.twitter.com/k4d0FRANws — ANI (@ANI) May 8, 2023 (చదవండి: డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ను 21లోగా అరెస్ట్ చేయాలి) -
Vinesh Phogat: ఇలాంటివి చూసేందుకే పతకాలు సాధించామా?
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా భారత్ రెజ్లర్లు ఏప్రిల్ 23 నుంచి జంతర్మంతర్ వద్ద నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెజ్లర్ల నిరసను ఆపించి, తరలించేందుకు భారీ సంఖ్యలో ఢిల్లీ పోలీసులు జంతర్మంతర్ వద్దకు చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాల మద్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో వర్షం కారణంగా వారి పరుపులు తడిచిపోవడంతో బయటనుంచి మరికొన్నింటిని తీసుకొచ్చేందుకు యత్నించగా అందుకు పోలీసులు అంగీకరించలేదు. మేము నేరస్తులం కాదు.. ఈక్రమంలోనే బృందంలోని కొంతమంది సభ్యులను ఢిల్లీ పోలీసులు దూషించారు. దీంతో పోలీసులు, రెజ్లర్ల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ మేరకు రెజ్లర్ వినేష్ ఫోగట్ ఇలాంటి రోజులు చూడటానికేనా! తాము పతకాలు సాధించింది? అంటూ కన్నీటి పర్యంతమైంది. ఈ సందర్భంగా వినేష్ ఉద్వేగంగా మాట్లాడుతూ.. మాపై ఇలా పోలీసులు దురుసుగా ప్రవర్తించడానికి తామేమి నేరస్తులం కాదంటూ మండిపడ్డారు. ఘటనా స్థలంలో మహిళా పోలీసులు లేకపోవడంపై నిలదీశారు. ఓ పోలీసు అధికారి తాగిన మద్యం మత్తులో దుర్భాషలాడి, తమపై దాడి చేశారని ఆరోపణలు చేశారు. Watch | "Did We Win Medals To See Such Days?" Wrestler Vinesh Phogat Breaks Down pic.twitter.com/NXOrAZwfPA — NDTV (@ndtv) May 3, 2023 ఆప్ నేత అరెస్టు! ఈ క్రమంలో రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో నాలుగు పతకాలు గెలుచుకున్న బజరంగ్ పునియా ఉద్వేగభరితంగా తన పతకాలన్నింటిని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాని అని చెప్పారు. ఇదిలా ఉండగా ఈ ఘటనలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే సోమనాథ్ భారతితో సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమతి లేకుండా భారతి మంచాలు తీసుకొచ్చేందుకు యత్నించారని, దూకుడుగా ప్రవర్తించారని అందుకే ఆయనతోపాటు మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం జంతర్ మంతర్ ప్రాంతాన్ని సీల్ చేశారు. రెజ్లర్లను పరామర్శించేందుకు వస్తున్న ప్రతిపక్షాల హాజరును నమోదు చేసి మరీ నిరసన ప్రాంతానికి అనుమతించకుండా, రెజ్లర్లను కలవకుండా అడ్డుకున్నారు. కాగా, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై ఏడుగురు మహిళ రెజ్లర్లు లైంగిక వేధింపులకు గురి చేశారంటూ ఆరోపణలు చేశారు. అతడిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ తదనంతరం సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడంతో ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్పై రెండు కేసులు నమోదు చేశారు. (చదవండి: కోపంలో నోరు జారిన పోలీసు..సెకనులో టెర్రరిస్టుగా మారుస్తా! అని బెదిరింపులు) #WATCH | Delhi: A scuffle breaks out between protesting wrestlers and Delhi Police at Jantar Mantar pic.twitter.com/gzPJiPYuUU — ANI (@ANI) May 3, 2023 -
రా RAW రాజు
‘కాలం కలిసి రావాలి’ అంటూ కాలాన్ని మాత్రమే నమ్ముకునే వారు ఒక రకం.‘కాలం కలిసి రావాలి అంటే కష్ట పడాలి’ అనుకునే వారు రెండో రకం. ‘రైతుబిడ్డ’ విక్రమ్సింగ్ రెండో రకానికి చెందిన కుర్రాడు.తన నాయకత్వ లక్షణాలతో ‘ఆఫ్బిజినెస్’కు కొత్త వెలుగు తీసుకువచ్చాడు... హరియాణా మహేంద్రగఢ్ జిల్లాలోని మల్రా గ్రామంలో రైతు కుటుంబానికి చెందిన విక్రమ్సింగ్ ఖరీదైన స్కూళ్లలో ఎప్పుడూ చదువుకోలేదు. ఆరవతరగతిలో మాత్రమే ఇంగ్లీష్ చదువుకునే అవకాశం వచ్చింది. స్కూల్ పూర్తయిన తరువాత పొలానికి వెళ్లి తండ్రికి సహాయం చేసేవాడు.‘ఏ పనైనా ఇష్టంగా చేయాలి. నాకు వ్యవసాయం అంటే ఇష్టం. నువ్వు కూడా చదువును ఇష్టంగా చదువుకోవాలి. చదువుకోవడం నా వల్ల కాదు అనిపిస్తే నాతో పా టు పనిచెయ్యి’ అనే వాడు నాన్న. మరోవైపు స్నేహితులు...‘నువ్వు రెజ్లర్ కాకపో తే జీవితంలో ఏది సాధించలేవు’ అనేవారు. ఆప్రాం తంలో రెజ్లింగ్ బాగా పాపులర్. ప్రైజ్మనీ కూడా భారీగా ఉండేది. స్నేహితుల మాటలతో రెజ్లర్ కావాలనే ఆశ విక్రమ్లో మొలకెత్తింది. ఎక్కడ రెజ్లింగ్ పొటీలు జరిగినా వెళ్లేవాడు. ఇది గమనించిన టీచర్ ‘నువ్వు చదువులో ముందున్నావు. నీకు మంచి భవిష్యత్ ఉంది. ఇలా రెజ్లింగ్ అంటూ ఊళ్లు తిరిగితే చదువు దెబ్బతింటుంది’ అని హెచ్చరించాడు. ఇక అప్పటి నుంచి తన మనసులో నుంచి ‘రెజ్లింగ్’ను డిలిట్ చేశాడు విక్రమ్.ఇంజినీరింగ్ పూర్తి చేసిన తరువాత దిల్లీలో ఎంబీఏ చేశాడు. ఆ తరువాత కామర్స్ అండ్ ఫిన్టెక్ స్టార్టప్ ‘ఆఫ్బిజినెస్’లో చేరాడు. మూడు సంవత్సరాల తరువాత విక్రమ్ దశ తిరిగింది. ‘ఆఫ్బిజినెస్’కు ఉన్న మూడు యూనిట్లలో ఒకటైన ‘రా మెటీరియల్ బిజినెస్ యూనిట్’కు నాయకత్వ బాధ్యతలు అప్పగించడానికి సరిౖయెన వ్యక్తుల కోసం కంపెనీ పెద్దలు చూస్తున్న సమయంలో వారికి విక్రమ్ పేరు తట్టింది. అలా విక్రమ్ ‘రా మెటీరియల్ బిజినెస్ యూనిట్’కు హెడ్ అయ్యాడు. ‘రా మెటీరియల్స్ ఎట్ లోయెస్ట్ ప్రైసెస్–గ్యారెంటీడ్’ అనే మాటలో మాంత్రికశక్తి లేకపో వచ్చు. అయితే దీన్ని కస్టమర్లలోకి బలంగా తీసుకెళ్లడంలో విక్రమ్ విజయం సాధించాడు. ఫ్రెషర్స్తో తనదైన ఒక టీమ్ను ఏర్పాటు చేసుకోని, అడుగులో అడుగు వేస్తూ మెల్లగా నడుస్తున్న యూనిట్ను పరుగెత్తేలా చేశాడు. కోట్ల టర్నోవర్కు చేర్చాడు. ‘విక్రమ్లో నాయకత్వ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. మా నమ్మకాన్ని నిలబెట్టాడు’ అంటున్నాడు ‘ఆఫ్బిజినెస్’ సీయీవో ఆశీష్ మహాపా త్రో. ‘అదృష్టం కష్టం వైపు మొగ్గు చూపుతుంది అంటారు. నేను కష్టాన్నే నమ్ముకున్నాను. రైట్ ప్లేస్లో రైట్పర్సన్గా గుర్తింపు తెచ్చుకున్నప్పుడే విజయం సాధించగలం’ అంటున్న 29 సంవత్సరాల విక్రమ్సింగ్ ‘ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30’ జాబితాలో చోటు సంపాదించాడు. -
WWE: అంతుచిక్కని వ్యాధితో మాజీ రెజ్లింగ్ స్టార్ కన్నుమూత
మాజీ డబ్ల్యూడబ్ల్యూఈ(WWE), ఏఈడబ్ల్యూ(AEW) స్టార్ జైసిన్ స్ట్రిఫే(37) కన్నుమూశాడు. కొంతకాలంగా అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న జైసిన్ స్ట్రిఫే గురువారం అర్థరాత్రి కన్నుమూసినట్లు అతని సోదరుడు ప్రకటించాడు. జైసిన్కు ఏ రకమైన వ్యాధి సోకిందనేది వైద్యులు కూడా నిర్థారించేలేకపోయారని.. వైరస్ రూపంలో రోజు రోజుకు శరీరాన్ని తినేస్తూ బలహీనంగా తయారు చేసేదని.. మోతాదుకు మించి స్టెరాయిడ్స్ వాడడంతోనే మృతి చెందినట్లు పేర్కొన్నాడు. ఇక 2004లో ప్రొఫెషనల్ రెజ్లింగ్లో అడుగుపెట్టిన జైసిన్ డబ్ల్యూడబ్ల్యూఈ, ఆల్ ఎలైట్ రెజ్లింగ్(AEW)లో పాల్గొన్నాడు. ఆ తర్వాత 2010లో మాగ్నమ్ ప్రో రెజ్లింగ్కు ప్రమోటర్గా పనిచేశాడు. ఇక జైసన్ చివరిసారి గతేడాది నవంబర్లో ఆల్ ఎలైట్ రెజ్లింగ్లో పవర్హౌస్ హాబ్స్తో ఆడాడు. -
డబ్ల్యూడబ్ల్యూఈ దిగ్గజం ఇంట తీవ్ర విషాదం
డబ్ల్యూడబ్ల్యూఈ దిగ్గజం.. హాల్ ఆఫ్ ఫేమ్ కెవిన్ నాష్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కెవిన్ నాష్ కుమారుడు 26 ఏళ్ల ట్రిస్టన్ నాష్ శుక్రవారం రాత్రి కన్నుమూశాడు. ఈ విషయాన్ని రెజ్లింగ్ రిపోర్డర్ సీన్ రోస్ సాప్ వెల్లడించాడు. కాగా ట్రిస్టన్ నాష్ మృతి వెనుక కారణాలను రివీల్ చేయడానికి అతని కుటుంబసభ్యులు ఇష్టపడలేదని రోస్ సాప్ ట్వీట్ చేశాడు. ''కెవిన్ నాష్, తమరా నాష్ల తనయుడు ట్రిస్టన్ నాష్ 26 ఏళ్ల వయసులోనే కన్నుమూయడం బాధాకరం. తన తండ్రితో కలిసి ఇటీవలే పాడ్కాస్ట్ ఆరంభించిన ట్రిస్టన్ సరదాగా ఎంజాయ్ చేస్తున్న టైమ్లో ఇలా జరగడం దురదృష్టకరం. కుటుంబసభ్యుల వినతి మేరకు ట్రిస్టన్ మరణంపై ఎలాంటి వివరాలు వెల్లడించడం లేదు. కాగా ట్రిస్టన్ ఆత్మకు శాంతి చేకూరాలిన భగవంతుడిని ప్రార్థిస్తున్నా'' అంటూ తెలిపాడు. డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ రెజ్లర్.. మిక్ ఫోలీ(డిక్సీ కార్టర్) స్పందిస్తూ.. నా ప్రియమైన మిత్రుడు కెవిన్ నాష్ గుండె పగిలే వార్త నన్ను ఇబ్బంది పడుతుంది. ట్రిస్టన్ నాష్ ఇంత చిన్న వయసులో మనల్ని విడిచిపెట్టి వెళ్లడం దురదృష్టకరం. కెవిన్ నాష్ సహా అతని కుటుంబసభ్యులకు నా ప్రగాడ సానభూతి అంటూ ఎమెషనల్ అయ్యాడు. ఇక కెవిన్ నాష్ 1990లో అప్పటి డబ్ల్యూడబ్ల్యూఎఫ్(ఇప్పటి డబ్ల్యూడబ్ల్యూఈ)లో ప్రొఫెషనల్ రెజ్లింగ్ కెరీర్ను ప్రారంభించాడు. 2020లో రెజ్లింగ్కు కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. డీజిల్(Diesel), బిగ్ డాడీ కూల్(Big Daddy Cool) పేర్లతో పాపులర్ అయిన కెవిన్ నాష్ తన కెరీర్లో చీటింగ్ చేసి ఎక్కువ విజయాలు సాధించడం గమనార్హం. ఒకసారి డబ్ల్యూడబ్ల్యూఈ చాంపియన్, ఇంటర్కాంటినెంటల్ చాంపియన్షిప్ ఒకసారి, రెండుసార్లు డబ్ల్యూడబ్ల్యూఈ ట్యాగ్టీమ్ చాంపియన్గా నిలిచాడు. 2015లో వ్యక్తిగతంగా డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమ్గా నిలిచన కెవిన్ నాష్.. 2020లో మరోసారి న్యూ వరల్డ్ ఆర్డర్(NWO) తరపున రెండోసారి హాల్ ఆఫ్ ఫేమ్ ఇండక్టివ్లో చోటు దక్కించుకున్నాడు. Oh @RealKevinNash & Tamara...I am absolutely brokenhearted to hear about the passing of Tristen. Kevin was so proud of him & I always loved hearing him share stories about his love for his beautiful son. My thoughts, prayers & love to you both during this heart-wrenching time 💔 — Dixie Carter (@TNADixie) October 21, 2022 చదవండి: మెస్సీతో ఇంటర్య్వూ.. జర్నలిస్ట్ కన్నీటి పర్యంతం -
'ది గ్రేట్ ఖలీ' ఏందయ్యా ఇదీ.. టోల్గేట్ సిబ్బందితోనా..!
చండీగఢ్: డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్, ప్రముఖ భారత రెజ్లర్ ది గ్రేట్ ఖలీ(49) అలియాస్ దలీప్ సింగ్ రాణా మరోమారు వార్తల్లో నిలిచారు. పంజాబ్, లుధియానాలోని ఓ టోల్గేట్ వద్ద సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. టోల్ కార్మికుడిపై ఖలీ చేయి చేసుకున్నాడని అక్కడి సిబ్బంది ఆరోపించారు. టోల్గేట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఖలీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అయితే.. ఆ వీడియోలో టోల్ సిబ్బందిపై చేయి చేసుకున్నట్లు ఎక్కడా కనిపించలేదు. మరోవైపు.. లాధోవాల్ టోల్ ప్లాజా సిబ్బంది తనను బ్లాక్మెయిల్ చేశారని ఆరోపించారు దలిప్ సింగ్ రాణా. ఈ సంఘటన సోమవారం జరిగిందని పోలీసులు తెలిపారు. పంజాబ్లోని జలంధర్ నుంచి హరియాణాలోని కర్నాల్కు ఖలీ తన కారులో వెళ్తున్న క్రమంలో టోల్గేట్ వద్ద ఈ సంఘటన ఎదురైనట్లు చెప్పారు. ధ్రువీకరణ పత్రం అడిగిన తమ సిబ్బందిని ఎందుకు కొట్టారని ఖలీని టోల్ సిబ్బంది అడుగుతున్నట్లు ఆ వీడియోలో స్పష్టమవుతోంది. 'మిమ్మల్ని ఐడీకార్డు చూపించాలని అడిగారు. ఐడీ చూపించండి' అని టోల్ సిబ్బంది అడగగా.. మీరు నన్ను బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు ఖలీ. దానికి 'మిమ్మల్ని మేము బ్లాక్మెయిల్ చేయటం లేదు.. అతడిని ఎందుకు కొట్టారు? మీ దగ్గర ఉంటే ఐడీ చూపించండి' అని టోల్ సిబ్బంది సమాధానమిచ్చారు. అయితే.. తన వద్ద ఎలాంటి ఐడీ కార్డు లేదని ఖలీ వారితో చెప్పారు. WWE wrestler #GreatKhali clashes with toll plaza staff at #Ludhiana#TheGreatKhali #ViralVideo #Punjab #Khali #ludhiana #WWE pic.twitter.com/XYJEhsdVtL — Vineet Sharma (@Vineetsharma906) July 12, 2022 ది గ్రేట్ ఖలీ వాహనం టోల్గేట్ దాటి వెళ్లకుండా ముందు బారికేడ్ పెట్టారు అక్కడి సిబ్బంది. దీంతో కోపంతో ఊగిపోయిన ఖలీ దానిని తీసి పక్కన పడేశారు. టోల్ సిబ్బంది ఖలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు కలుగజేసుకుని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఇరువురు తమ వాదనలు పోలీసులకు వినిపించారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిన క్రమంలో వివరణ ఇచ్చారు ఖలీ. 'నిన్న పంజాబ్లోని లాధోవాల్ టోల్ప్లాజా వద్ద సిబ్బంది నా కారును అడ్డుకుని సెల్ఫీ కోసం నాతో అసభ్యంగా ప్రవర్తించారు. నేను అందుకు అంగీకరించకపోవటం వల్ల జాతివిద్వేష వ్యాఖ్యలు చేశారు. అలాగే కొన్ని బూతులు మాట్లాడారు.' అని ఖలీ చెప్పారు. ఇదీ చూడండి: దిల్లీ- ముంబైల మధ్య 'ఎలక్ట్రిక్ హైవే'.. దేశంలోనే తొలిసారి! -
ఓటమి ఎరుగని వీరుడు.. గామా ది గ్రేట్!
ఆదివారం (నిన్న) గూగుల్ డూడుల్ చూశారా? ఆయనెవరో గుర్తుపట్టారా? తన జీవితంలో ఒక్కసారి కూడా ఓటమి ఎరుగని రెజ్లింగ్ చాంపియన్ ‘గామా పహిల్వాన్’.. ఇంకా చెప్పాలంటే ‘గామా ది గ్రేట్’. మనోడే.. ఆయనను చూస్తేనే ప్రపంచంలోని ప్రఖ్యాత రెజ్లర్లు గడగడా వణికిపోయేవారంటే.. గామా పహిల్వాన్ రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఆదివారం ఆయన 144వ జయంతి సందర్భంగా గూగుల్ ప్రత్యేకమైన ‘డూడుల్’తో నివాళి అర్పించింది. సోమవారం (మే 23) ఆయన 62వ వర్ధంతి కూడా.. ఈ నేపథ్యంలో ఆ మహాబలుడి గురించి తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ గామా పహిల్వాన్ అసలు పేరు గులామ్ మహమ్మద్ భక్ష్ భట్. పంజాబ్లోని జబ్బోవల్ గ్రామంలో 1878 మే 22న జన్మించాడు. చిన్నవయసు నుంచే వ్యాయామాలు అలవాటు చేసుకున్న ఆయన.. 1888లో జరిగిన స్క్వాట్స్ పోటీలో పాల్గొన్నాడు. దేశవ్యాప్తంగా 400 మందికిపైగా రెజ్లర్లు పాల్గొన్న ఆ పోటీలో గెలవడం ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించాడు. 15 ఏళ్లకే రెజ్లింగ్ మొదలుపెట్టాడు. 1910లో 22 ఏళ్ల వయసులోనే భారత ప్రపంచ హెవీ వెయిట్ రెజ్లింగ్ చాంపియన్షిప్ గెలుచుకున్నాడు. 1927లో ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్ సాధించాడు. ఓటమి మాటే తెలియకుండా.. సాధారణంగా బాక్సర్లకు తమ ఎత్తు బాగా కలిసొస్తుంది. మరి గామా పహిల్వాన్ ఎత్తు 5.7 అడుగులే. 120 కిలోల బరువు ఉండేవాడు. రోజుకు 5 వేల స్క్వాట్స్ (గుంజిళ్ల వంటివి), మరో మూడు వేల పుషప్స్ చేసేవాడు. రాళ్లతో తయారుచేసిన 96 కిలోల బరువున్న చక్రాన్ని ఎత్తుకుని స్క్వాట్స్ చేసేవాడు. మరెన్నో ప్రత్యేక వ్యాయామాలనూ రూపొందించాడు. తాను 22 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే.. 1,200 కిలోల గుండ్రాయిని ఎత్తి రికార్డు సృష్టించాడు. అది ఇప్పటికీ బరోడా మ్యూజియంలో ఉంది. ♦ పోటీ ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా సరే.. గామా పహిల్వాన్ కొద్ది నిమిషాల్లోనే ముగించేవాడు. 1927 ప్రపంచ చాంపియన్షిప్ పోటీల్లో, ఆ తర్వాత జరిగిన విదేశీ టోర్నీల్లో.. అప్పటి ప్రపంచ ప్రఖ్యాత యూరప్, అమెరికన్ రెజ్లర్లు ఫ్రాంక్ గోట్చ్, బెంజమిన్ రోలర్, మౌరిస్ డెరిజ్, జోహన్ లెమ్, జెస్సీ పీటర్సన్ వంటివారిని వరుసగా ఓడించాడు. ♦ తర్వాత కూడా తనతో పోటీకి రావాలని అమెరికా, యూరప్ రెజ్లర్లతోపాటు జపాన్కు చెందిన టారో మియాకె, రష్యాకు చెందిన జార్జ్ హకెన్షిమిట్ వంటివారికీ గామా పహిల్వాన్ సవాల్ చేశాడు. కానీ ఎవరూ ముందుకురాలేదు. చివరికి ఒకరి తర్వాత ఒకరుగా 20 మంది రెజ్లర్లు వచ్చినా అందరితో పోరాడుతానని.. తాను ఓడిపోతే ప్రపంచ చాంపియన్షిప్ ప్రైజ్మనీని కూడా తిరిగిచ్చేస్తానని సవాల్ చేశాడు. అయినా గామాతో పోటీ పడేందుకు ఎవరూ ధైర్యం చేయకపోవడం గమనార్హం. నిజాం యోధులనూ ఓడించి 1940లో నిజాం రాజు గామా పహిల్వాన్ను హైదరాబాద్కు పిలిపించి పోటీలు నిర్వహించాడు. నిజాం జనానాలోని మల్లయోధులందరినీ గామా పహిల్వాన్ ఓడించాడు. దీనితో నిజాం అతడిని సన్మానించి పంపాడు. గామాకు బ్రూస్లీ ఫ్యాన్.. గామా పహిల్వాన్కు ప్రపంచ ప్రఖ్యాత మార్షల్ ఆర్టిస్ట్ బ్రూస్లీ పెద్ద ఫ్యాన్. గామా నుంచి స్ఫూర్తి పొంది కొన్ని వ్యాయామాలను తాను అనుసరించినట్టు బ్రూస్లీ చాలాసార్లు చెప్పడం గమనార్హం. ♦ గామా పహిల్వాన్ శకం నడిచినప్పుడు భారత్ బ్రిటీషు పాలనలో ఉంది. బ్రిటిష్ రాచ కుటుంబానికి చెందిన ప్రిన్స్ ఆఫ్ వేల్స్ గామాను సన్మానించి.. ఒక వెండి గదను బహూకరించాడు. హిందువులను కాపాడి.. దేశ విభజన సమయంలో గామా పహిల్వాన్ పాకిస్తాన్కు వెళ్లిపోయాడు. ఆ సమయంలో అక్కడి హిందువులు ఎంతో మందిని ఆయన కాపాడారని చెప్తారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భార్య కుల్సుమ్ గామా పహిల్వాన్ మనవరాలే. 50 ఏళ్లకుపైగా రెజ్లింగ్లో ఎదురులేని వీరుడిగా నిలిచి.. 74 ఏళ్ల వయసులో 1952లో రిటైరయ్యాడు. తర్వాత ఎనిమిదేళ్లకు 1960 మే 23న లాహోర్లో కన్నుమూశాడు. పారిపోయిన ప్రపంచ చాంపియన్ 1910 లండన్ ప్రపంచ చాంపియన్షిప్ పోటీల్లో అప్పటివరకు ప్రపంచ చాంపియన్గా ఉన్న బ్రిటిష్ స్టానిస్లస్ జిబిజ్కో.. గామా పహిల్వాన్ ధాటిని తట్టుకోలేకపోయాడు. ఓటమిని అంగీకరించకుండా.. తరచూ బోర్లా పడుతూ మ్యాట్ను పట్టుకుని ఉండిపోతూ వచ్చాడు. ఇలా రెండున్నర గంటలకుపైగా సాగిన మ్యాచ్ను డ్రాగా ప్రకటించారు. తర్వాత వారం రోజులకే వారిద్దరి మధ్య మళ్లీ పోటీ పెట్టారు. జిబిజ్కో భయంతో మ్యాచ్కు రాకపోవడంతో.. గామా పహిల్వాన్ను విజేతగా ప్రకటించారు. తర్వాత 1928లో మన దేశంలోని పటియాలాలో జరిగిన చాంపియన్షిప్లో జిబిజ్కో–గామా పహిల్వాన్ మధ్య పోటీ పడింది. జిబిజ్కోను గామా కేవలం రెండు నిమిషాల్లో మట్టికరిపించాడు. అప్పుడే ‘గామా పహిల్వాన్ పులి’ అంటూ జిబిజ్కో ప్రకటించాడు. (క్లిక్: చరిత్ర సృష్టించిన ఐపీఎల్ 2022..) -
యువ రెజ్లర్ పూర్ణిమకు ఆర్థిక సహాయం
సాక్షి, హైదరాబాద్: ఖేలో ఇండియా యూత్ గేమ్స్, సబ్ జూనియర్ జాతీయ రెజ్లింగ్ చాంపియన్షిప్ పోటీలకు సిద్ధమవుతున్న హైదరాబాద్కు చెందిన రెజ్లింగ్ క్రీడాకారిణి పూర్ణిమకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్-నాచారం) యాజమాన్యం ఏడాదిపాటు ఆర్థిక సహాయం చేయనుంది. 16 ఏళ్ల పూర్ణిమకు ప్రతి నెల రూ.10 వేలు ఏడాదిపాటు డీపీఎస్-నాచారం అందజేస్తుంది. ఈ మేరకు నాచారంలోని డీపీఎస్లో జరిగిన కార్యక్రమంలో పూర్ణిమకు రూ. 10 వేల చెక్ను డీపీఎస్ ప్రతినిధి మల్కా యశస్వి అందించారు. గత ఏడాది బళ్లారిలో జరిగిన జాతీయ సబ్ జూనియర్ క్యాడెట్ చాంపియన్షిప్లో పూర్ణిమ 61 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి, రెజ్లింగ్ కోచ్ నర్సింగ్ ముదిరాజ్, పూర్ణిమ తండ్రి జుమ్మి, రెజ్లర్లు మెట్టు శివ, మోహన్ గాంధీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధికారులు పాల్గొన్నారు. -
వైరల్ వీడియో: స్టేజీపైనే ఆటగాడి చెంప చెళ్లుమనిపించిన బీజేపీ ఎంపీ
రాంచీ: బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ సింగ్ బహిరంగంగా ఓ వ్యక్తి చెంప చెల్లుమనిపించారు. స్టేజ్పైనే ఆటగాడికి రెండు చెంపలు వాయించడంతో వేదికపై ఉన్న వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ ఘటన జార్ఖండ్లోని రాంచీలో అండర్-15 జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఈవెంట్లో చోటుచేసుకుంది. షహీద్ గణ్పత్ రాయ్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎంపీ భూషణ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో ఓ యువకుడికి15 ఏళ్లు దాటడంతో అండర్ -15 ఈవెంట్లో పాల్గొనేందుకు అధికారులు అనుమతించలేదు. దీంతో తనను పోటీల్లో పాల్గొనడానికి అనుమతించాలని స్టేజ్ మీదకు వెళ్లి ఎంపీ సింగ్ను పదే పదే ఇబ్బంది పెట్టాడు. దీంతో సహనం కోల్పోయిన ఎంపీ వేదికపై ఉన్న రెజ్లర్ను అందరిముందే చెంప దెబ్బ కొట్టాడు. యువ రెజ్లర్ వేదిక నుంచి కిందకు దిగుతుండగా రెండు సార్లు అతనిపై చేయిచేసుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆటగాడిపై ఎంపీ చేయి చేసుకోవడంపై ప్రస్తుతం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఎంపీ సింగ్ ప్రస్తుతం లోక్సభలో ఉత్తరప్రదేశ్లోని కైసర్గంజ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. BJP सांसद व भारतीय कुश्ती संघ के अध्यक्ष बृजभूषण शरण सिंह ने रांची में अंडर-15 नेशनल कुश्ती चैंपियनशिप के दौरान मंच पर एक युवा पहलवान को थप्पड़ जड़ दिया। वीडियो वायरल… pic.twitter.com/Tlm6LpXSHG — Ashraf Hussain (@AshrafFem) December 17, 2021 -
సీఎం ఇంటి ముందు ధర్నాకు దిగిన పద్మశ్రీ అవార్డు గ్రహీత
చంఢీఘడ్: 2021 పద్మశ్రీ అవార్డు గ్రహీత రెజ్లర్ వీరేందర్ సింగ్ యాదవ్ అలియాస్ గుంగా పహిల్వాన్.. హర్యానా(అతని సొంత రాష్ట్రం) రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఇంటి ముందు నిరసన దీక్ష చేపట్టాడు. బధిర క్రీడాకారులను పారా అథ్లెటుగా గుర్తించాలంటూ, పారా అథ్లెట్లతో సమానంగా తమకు కూడా హక్కులు కల్పించాలంటూ తాను సాధించిన పద్మ శ్రీ, అర్జున అవార్డులతో సీఎం ఇంటి ముందు గల ఫుట్పాత్పై కూర్చొని నిరసన తెలిపాడు. माननीय मुख्यमंत्री श्री @mlkhattar जी आपके आवास दिल्ली हरियाणा भवन के फुटपाथ पर बैठा हूँ और यहाँ से जब तक नहीं हटूँगा जब तक आप हम मूक-बधिर खिलाड़ियों को पैरा खिलाड़ियों के समान अधिकार नहीं देंगे, जब केंद्र हमें समान अधिकार देती है तो आप क्यों नहीं? @ANI pic.twitter.com/4cJv9WcyRG — Virender Singh (@GoongaPahalwan) November 10, 2021 ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. బధిర క్రీడాకారుల సమస్యలపై హరియాణా సీఎం స్పందించాలని కోరాడు. మంగళవారం(నవంబర్ 9) రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ శ్రీ పురస్కారాన్ని అందుకున్న వీరేందర్.. గంటల వ్యవధిలోనే బధిర అథ్లెట్ల హక్కుల కోసం నిరవధిక నిరసన చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. కాగా, హరియాణాలోని సస్రోలిలో జన్మించిన వీరేందర్కు వినబడదు, మాట్లాడలేడు. చదవండి: పాక్ కెప్టెన్ను ఆకాశానికెత్తిన గవాస్కర్.. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన -
'నేను చనిపోలేదు.. అది ఫేక్ న్యూస్': రెజ్లర్ నిషా దహియా
Nisha Dahiya Refuses Her Death Reports.. ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్ కాంస్య పతక విజేత, జాతీయ స్థాయి మహిళ రెజ్లర్.. నిషా దహియా చనిపోయిందన్న వార్తల్లో నిజం లేదు. హర్యానాలోని సోనిపట్లోని సుశీల్ కుమార్ అకాడమీలో జరిగిన కాల్పుల్లో నిషా దహియా, అతని సోదరుడుడ చనిపోయిందంటూ బుధవారం సాయంత్రం వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని తేలింది. తాను చనిపోయానంటూ వచ్చిన వార్తలపై నిషా దహియా స్వయంగా ట్విటర్ ద్వారా స్పందించింది. '' నేను చనిపోయానని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్లోని గోండాలో ప్రత్యేక శిక్షణలో ఉన్నాను. అది ఫేక్ న్యూస్.. ఆ వార్త నమ్మకండి'' అంటూ కామెంట్ చేసింది. -
'నేను చనిపోలేదు.. అది ఫేక్ న్యూస్': రెజ్లర్ నిషా దహియా
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
రైతు సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం
ధాన్యం సేకరణ సాఫీగా సాగాలి
పాఠశాలల ప్రారంభం లోగా పనులు పూర్తి
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్
4,63,983 మంది ఓటుకు దూరం
ప్రణాళిక సిద్ధం
డెంగీ నివారణకు సహకరించాలి
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి
కల్తీ విత్తనాలు అమ్మితే చర్యలు
తప్పక చదవండి
- రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
- బుల్ బ్యాక్ ర్యాలీ
- రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోంది: కేజ్రీవాల్
- ఇంటికి 100 మీటర్ల దూరంలో.. 26 ఏళ్ల పాటు చెరలో
- రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
- మలివాల్ వాంగ్మూలం నమోదు
- Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
- భార్యను బెదిరించబోయి ఉరి బిగిసి..
- నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
- తెలంగాణ ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
Advertisement