-
'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' నుంచి విజయ్ చివరి సాంగ్ విడుదల
విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం'. వెంకట్ ప్రభు దర్శకత్వంలో జేజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సెప్టెంబర్ 5న విడుదల తేదీ ప్రకటించిన మేకర్స్ తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ను విడుదల చేశారు. విజయ్ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడంతో 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' సినిమా తర్వాత 'దళపతి 69' ప్రాజెక్ట్ మాత్రమే చేయనున్నాడు. 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' చిత్రంలో విజయ్ తండ్రీ, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తే.. తాజాగా విడుదలైన పాటను విజయ్తో పాటు వెంకట్ ప్రభు పాడటం జరిగింది. ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించారు. పలు సినిమాల్లో విజయ్ పాటలు పాడుతూ ఉంటాడు. ఇప్పటివరకు ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, హరీష్ జయరాజ్, అనిరుధ్ వంటి ప్రముఖ సంగీత దర్శకుల మ్యూజిక్ డైరెక్షన్లో పాట పాడగా అవన్నీ ప్రేక్షకాదరణ పొందాయి కూడా! తాజాగా యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వంలో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం చిత్రం కోసం చివరగా విజయ్ ఒక పాటను పాడడం విశేషం. కొన్నిరోజుల పాటు తమిళనాట ఈ సాంగ్ ఒక ఊపు ఊపేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. -
కుర్రాళ్ళ గుండెల్లో మోత మోగించే పాట విడుదల చేసిన విశ్వక్
టాలీవుడ్ సక్సెస్ఫుల్ హీరో విశ్వక్సేన్ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. రీసెంట్గా ‘గామి’ చిత్రంలో అఘోరా పాత్రలో నటించిన విశ్వక్ ప్రేక్షకులను మెప్పించాడు. తాజాగా ఆయన నటించిన మరో కొత్త చిత్రం విడుదలకు రెడీగా ఉంది. విశ్వక్, నేహాశెట్టి జంటగా నటించిన చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' నుంచి తాజాగా అదిరిపోయే సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. 'మోత మోగిపోద్ది..' అంటూ సాగే మాస్ ఐటెం సాంగ్ నెట్టింట దుమ్మురేపుతుంది. ఈ పాటలో విశ్వక్తో అయేషా ఖాన్ తన అందచందాలతో స్టెప్పులేసింది. చంద్రబోస్ రాసిన ఈ పాటకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. రంగస్థలం సినిమాలో 'రంగమ్మా మంగమ్మా' పాటతో మెప్పించిన 'ఎమ్ఎమ్ మానసి' ఇప్పుడు 'మోత మోగిపోద్ది..' అంటూ అదిరిపోయే సాంగ్ పాడింది. ఇటీవలే ఓం భీమ్ బుష్ సినిమాలో ప్రియదర్శి సరసన కనిపించిన అయేషాఖాన్ ఆ సినిమాతో బాగా పాపులర్ అయింది. ఇప్పుడు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'లో ఈ ఐటమ్ సాంగ్తో మోత మోగిపోయేలా స్టెప్పులు వేసింది. మే 17న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించారు. -
సినిమాలకు దూరం.. చివరిసారి పాట పాడనున్న విజయ్!
దళపతి విజయ్ హీరోగా టాప్ పొజిషన్లో ఉన్న విషయం తెలిసిందే. అలాంటిది ఇప్పుడు రాజకీయ ప్రవేశం చేసి సినిమాలకు దూరం కాబోతున్నారన్న మాట ఆయన అభిమానులను ఎంతో బాధిస్తోంది. ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అలా విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం. వెంకట్ ప్రభు దర్శకత్వంలో జేజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. యువన్ శంకర్ రాజా సంగీతంలో.. ఈ చిత్రంలో విజయ్ తండ్రీ, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇకపోతే యువన్ శంకర్రాజా చాలా కాలం క్రితం విజయ్ హీరోగా నటించిన పుదియ గీతై చిత్రానికి సంగీతాన్ని అందించాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం చిత్రానికి సంగీతాన్ని అందించడం విశేషం. ఇకపోతే విజయ్లో మంచి గాయకుడు ఉన్నాడన్న విషయం తెలిసిందే. మరోసారి పాట పాడనున్న విజయ్ పలు సినిమాల్లో ఆయన పాటలు పాడుతూ ఉంటాడు. ఇప్పటివరకు ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, హరీష్ జయరాజ్, అనిరుధ్ వంటి ప్రముఖ సంగీత దర్శకుల మ్యూజిక్ డైరెక్షన్లో పాట పాడగా అవన్నీ ప్రేక్షకాదరణ పొందాయి కూడా! తాజాగా యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వంలో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం చిత్రం కోసం విజయ్ ఒక పాటను పాడడం విశేషం. ఈ విషయాన్ని యువన్ శంకర్రాజా ఇటీవల ఒక కార్యక్రమంలో స్పష్టం చేశారు. ఇది విజయ్ అభిమానులను ఖుషీ పరిచే విషయమే అవుతుంది. చదవండి: పెళ్లి చేసుకుని లక్షలు కాజేసింది.. ఇప్పుడు బెదిరింపులు.. మీడియాను ఆశ్రయించిన భర్త -
ఆ స్టార్ హీరో సూర్యకు క్లాస్ మేట్ అని తెలుసా..?
-
నాగచైతన్య 'కస్టడీ' ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల
అక్కినేని నాగచైతన్య హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘కస్టడీ’. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు–తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతీశెట్టి కథానాయికగా నటిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ మూవీ మే 12 విడుదలకానుంది. మేస్ట్రో ఇళయరాజా, ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘హెడ్ అప్ హై..’ అంటూ సాగే తొలి లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను అరుణ్ కౌండిన్య, అసల్ కోలార్, యువన్ శంకర్ రాజా పాడారు. ‘‘హెడ్ అప్ హై..’ పాట పోలీసుల గొప్పతనాన్ని వర్ణిస్తుంది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. నాగచైతన్య తన గ్రేస్ఫుల్ డ్యాన్స్ పాటలోని ఎనర్జీని మ్యాచ్ చేశారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. అరవింద్ స్వామి,ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్, ‘వెన్నెల’ కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఖతీర్. -
Ilayaraja: వివాదంలో ఇళయరాజా.. మోదీపై కీలక వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై : సంగీత దర్శకుడు ఇళయరాజా వివాదాల్లో చిక్కుకున్నారు. ఇళయరాజా.. ప్రధాని మోదీ గురించి రాసిన ఒక పుస్తకానికి ముందు మాట రాశారు. ఇందులో మోదీని డాక్టర్ అంబేడ్కర్తో పోల్చారు. ఇదే ఇప్పుడు వివాదానికి దారి తీసింది. ఇళయరాజా వ్యాఖ్యలను కొందరు ఖండిస్తున్నారు. ఇళయరాజా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ఎంపీ పదవి కోసమే మోదీ భజన చేస్తున్నారని విమర్శి స్తున్నారు. ఈ విషయంపై ఇళయరాజా సోదరుడు, బీజేపీ సభ్యుడు గంగై అమరన్ స్పందిస్తూ.. అందరిలాగే ఇళయరాజా కూడా తన భావాలను వ్యక్తం చేశానని చెప్పారన్నారు. తన మాటల్లో తప్పు లేదనీ, అందుకు ఎలాంటి విమర్శలు ఎదురైనా తాను ఎదుర్కొంటానన్నారని, అదేవిధంగా తాను బీజేపీలో చేరలేదని, తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని చెప్పారని స్పష్టం చేశారు. ఇళయరాజా వ్యాఖ్యలపై ఆయన కొడుకు, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా స్పందిస్తూ.. కరుప్పు ద్రవిడన్ గర్వించదగ్గ తమిళన్ అని తన ట్విట్టర్లో పేర్కొన్నారు. -
19 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్!
కమర్షియల్ చిత్రాల దర్శకుడు సుందర్ సి తన తాజా చిత్రానికి శ్రీకారం చుట్టారు. అవ్నీ సినీమాక్స్, బెంజ్ మీడియా సంస్థలు కలిసి నిర్మిస్తున్న చిత్రం ఇది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో జీవా, జై, శ్రీకాంత్, మాళవిక శర్మ, రైజా విల్సన్, అమృత అయ్యర్, ఐశ్వర్యదత్ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. యోగిబాబు, కింగ్స్ లీ, ప్రతాప్ పోతన్, సంయుక్త షణ్ముగం, దివ్యదర్శిని తదితరులు ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ కానున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా 19 ఏళ్ల తరువాత సుందర్ సి, యువన్ శంకర్ రాజా కాంబోలో చిత్రం రూపొందుతుండడం గమనార్హం. ఇ.కృష్ణస్వామి ఛాయాగ్రహణంను అందిస్తున్న ఈ చిత్రం సోమవారం చెన్నైలో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. వినోదమే ప్రధానంగా రూపొందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ను చెన్నై, ఊటీ పరిసర ప్రాంతాల్లో నిర్వహించి ఒకే షెడ్యూల్లో పూర్తి చేయనున్నట్లు దర్శకుడు తెలిపారు. -
మనవరాలికి సంగీత పాఠాలు
ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా తన మనవరాలికి సంగీత పాఠాలు నేర్పిస్తున్నారు. ఇళయరాజా తనయుడు యువన్శంకర్ రాజా కుమార్తె జియా యువన్ ఇటీవల తాత దగ్గర పియానో నేర్చుకుంటున్న వీడియో చాలామందిని ఆకట్టుకుంది. పియానోతో సరిగమలు ఎలా పలికించాలో మనవరాలికి నేర్పుతున్న దృశ్యాన్ని వీడియో తీసి, సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు యువన్. ఈ వీడియో చూసిన శ్రుతీహాసన్ , విజయ్ ఏసుదాసు, శ్వేతాపండిట్ వంటి వారు ‘చాలా బాగుంది’ అంటూ జియాని అభినందిస్తూ కామెంట్లు పెట్టారు. కాగా ఇళయరాజా ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ‘రంగమార్తాండ’ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో బ్రహ్మానందం, రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆ సంగతలా ఉంచితే.. ఇళయరాజా వారసులుగా కుమారులు కస్తూరి రాజా, యువన్ శంకర్ రాజా, కుమార్తె భవతారిణి కూడా సంగీతప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఈ ముగ్గురూ సంగీతదర్శకులుగానే కాదు పాటలు కూడా పాడతారు. మరి.. ఇప్పుడు మనవరాలికి కూడా స్వరాలు నేర్పిస్తున్నారంటే ఇళయరాజా కుటుంబం నుంచి మరో మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ వచ్చే అవకాశం ఉందని ఊహించవచ్చు. -
ఇదే తొలిసారి.. చాలా ఇంట్రెస్ట్ అనిపించింది : రష్మిక
రష్మిక మందన్నా.. అతి కొద్ది కాలంలోనే టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్. ‘సరిలేరు నీకెవ్వరు’ తో భారీ హిట్ను తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమాల్లో వరుస ఆఫర్స్ దక్కించుకుంటోంది. తెలుగు,కన్నడ భాషా చిత్రాల్లో సత్తా చాటిన ఈ అమ్మడు ఇటీవల బాలీవుడ్లోకి కూడా ప్రవేశించింది. అక్కడ కూడా తన అందచందాలతో ప్రేక్షకుల మనసును దోచుకోవడానికి రెడీ అయింది. ఇదిలా ఉంటే, తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ మ్యూజిక్ ఆల్బమ్ లో కూడా నటించడం విశేషం. ‘టాప్ టక్కర్’ పేరుతో ఈ వీడియో ఆల్బమ్ను తెరకెక్కించారు. తాజాగా ఈ ఆల్బమ్కు సంబంధించిన టీజర్ను విడుదల చేసారు. ఈ పాటను ఉచానా అమిత్ బాద్షా, యువన్ శంకర్ రాజా, జోనితా గాంధీ పాడారు. ఈ పాటను ఉచానా అమిత్ బాద్షానే రాయడం విశేషం. ఈ పాటలో రష్మిక మందన్న తలపై సిక్కు పాగాతో కొత్త అవతారంలో కేక పుట్టిస్తోంది. ‘టాప్ టక్కర్’కు సంబంధించిన పూర్తి పాటను త్వరలో విడుదల చేయనున్నారు. కాగా, ‘టాప్ టక్కర్’ ఆల్బమ్ సాంగ్ గురించి చెబుతూ.. ‘మ్యూజిక్ ఆల్బమ్ లో నేను డ్యాన్స్ చేయడం ఇదే మొదటిసారి. ఈ అనుభవం బాగుంది. చాలా ఇంట్రెస్ట్ అనిపించింది కూడా. ఇది త్వరలో మీ ముందుకు రానుంది. ఇకపై పెళ్లిళ్లు, కాలేజీలు.. వంటి చోట ఈ ఆల్బమ్ వినిపిస్తుందనుకుంటున్నాను.. దీని కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నను' అంటూ సోషల్ మీడియాలో పేర్కొంది. ఇక సినిమా విషయాకొస్తే.. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’లో నటిస్తోంది. సిద్ధార్ధ్ మల్హోత్ర హీరోగా నటిస్తోన్న ‘మిషన్ మజ్ను’తో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. Top top top tucker.. 💃🏻 this is so exciting.. 1st time I’ve done something like this.. 💃🏻 and I’ve got to do it with the best in their respective industries.. yaaaaay!! So exciting.. releasing soon you guys!! 🥳 https://t.co/giiEcXlJJy pic.twitter.com/Q8U3cr6cqC — Rashmika Mandanna (@iamRashmika) February 8, 2021 -
ప్రేమను పంచుదాం
ప్రస్తుత పరిస్థితుల్లో అందరిలోనూ స్ఫూర్తిని పెంచి, ప్రేమను పంచాలనే ఉద్దేశంతో కమల్ హాసన్ కరోనా వైరస్ పోరాటంపై ‘అరివుమ్ అన్బుమ్’ (బుద్ధి, ప్రేమ) పేరుతో ఓ పాటను సిద్ధం చేశారు. జిబ్రాన్ సంగీతం అందించిన ఈ పాటను పాడటంతో పాటు కమల్ హాసనే స్వయంగా రాశారు. ఈ పాటకు కమల్ తో పాటు సుమారు 12 మంది ప్రముఖులు గొంతు కలిపారట. శంకర్ మహదేవన్, అనిరుధ్, జిబ్రాన్, యువన్ శంకర్ రాజా, దేవిశ్రీ ప్రసాద్, బొంబాయి జయశ్రీ, సిద్ శ్రీరామ్, సిద్ధార్థ్, శ్రుతీ హాసన్, ఆండ్రియా, తమిళ బిగ్ బాస్ ఫేమ్ ముగెన్ ఈ పాటను ఆలపించారు. ఈ పాటను ఎవరింట్లో వాళ్లు ఉండి రికార్డ్ చేశారు. ‘‘ఈ పాటను కమల్ హాసన్ గారు కేవలం రెండు గంటల్లో రాసేశారు. పాటలో 12 మంది వాయిస్ మాత్రమే కాదు 37 మంది కోరస్ వాయిస్లు వినిపిస్తాయి. వాళ్లను ఆన్ లైన్ ఆడిషన్ చేసి సెలక్ట్ చేశాను’’ అని ఈ పాటకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు జిబ్రాన్. త్వరలోనే ఈ పాట విడుదల కానుంది. -
ఇళయరాజా బయోపిక్ను తెరకెక్కిస్తా
చెన్నై ,పెరంబూరు: ఇళయరాజా బయోపిక్ తెరకెక్కనుంది. ఇటీవల జెండ్రీల బయోపిక్ చిత్రాల ట్రెండ్ నడుస్తోందని చెప్పవచ్చు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మాజీ ప్రధాని పీవీ.నరసింహరావు బయోపిక్ల నుంచి, క్రికెట్ కీడాకారులు, సినీ ప్రముఖుల బయోపిక్లు చిత్రాలుగా తెరకెక్కి వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ప్రస్తుతం దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్తో రెండు చిత్రాలు రూపొందుతున్నాయి. నటుడు సూర్య నటిస్తున్న సూరనై పోట్రు చిత్రం కూడా బడ్జెట్లో విమానాన్ని తయారు చేసిన జీఆర్.గోపీనాథ్ జీవిత చరిత్రే నన్నది గమనార్హం. రాజా ది జర్నీ సంగీతరంగంలో ఎంతో కీర్తి సాధించిన సంగీతజ్ఞాని ఇళయరాజా బయోపిక్ను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. దీన్ని ఆయన కొడుకు, సంగీత దర్శకుడు యువన్శంకర్ రాజా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే ఒక భేటీలో స్వయంగా వెల్లడించారు. తన తండ్రి ఇళయరాజా బయోపిక్ను తెరకెక్కించాలన్న ఆలోచన ఉందని, దానికి తానే దర్శకత్వం వహిస్తానని చెప్పారు. దీనికి దాజా ది జర్నీ అనే టైటిల్ బాగుంటుందని అన్నారు. నటుడు ధనుష్ కరెక్ట్ ఇళయరాజా పాత్రను పోషించడానికి నటుడు ధనుష్ కరెక్ట్ అని చెప్పారు. మరి ఇళయరాజా పాత్రలో నటించడానికి నటుడు ఆయన అంగీకరిస్తారా? అన్నది ఆసక్తిగా మారింది. మొత్తం మీద ఎన్నో జాతీయ, రాష్ట్ర అవార్డులను అందుకుని సంగీతరంగంలో రారాజుగా రాణిస్తున్న ఇళయరాజా బయోపిక్ సినిమాగా తెరకెక్కనుందన్న మాట. -
తిరిగొస్తున్నారు
‘ఎగిరే పావురమా, పెళ్లి చేసుకుందాం, మిస్టర్ అండ్ మిస్ శైలజా కృష్ణమూర్తి’ చిత్రాల ద్వారా హీరోయిన్ లైలా సుపరిచితురాలే. తమిళ, కన్నడ భాషల్లోనూ హిట్ చిత్రాల్లో నటించారామె. 2006లో వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమయ్యారు. గతేడాది తమిళంలో ఓ టీవీ షోలో జడ్జిగా కనిపించారు. తాజాగా తమిళ చిత్రం ‘అలీసా’ ద్వారా నటిగా తన సెకండ్ ఇన్నింగ్స్ను స్టార్ట్ చేయనున్నారట. యువన్ శంకర్ రాజా నిర్మించనున్న ఈ చిత్రం ద్వారా మని చంద్రు అనే నూతన దర్శకుడు పరిచయం కానున్నారు. ఈ సినిమా కాకుండా ‘కండ నాళ్ ముదల్’ సీక్వెల్లో కూడా లైలా యాక్ట్ చేయబోతారనే వార్త ప్రచారంలో ఉంది. మరి తెలుగు సినిమాల్లో కూడా కనిపిస్తారా? చూద్దాం. -
మెగాస్టార్ మెచ్చిన ‘ప్యార్ ప్రేమ కాదల్’
ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘ప్యార్ ప్రేమ కాదల్’. తమిళనాట ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో శ్రీ తిరుమల ప్రొడక్షన్ పతాకంపై యువన్ శంకర్ రాజా, విజయ్ మోర్వనేని సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఎలన్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హరీష్ కళ్యాణ్, రైజ విల్సన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు యువన్ స్వయంగా సంగీతం అందించారు. త్వరలో రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ -‘టీజర్ లాంచ్కి అంగీకరించడానికి కారణం . భరద్వాజ, విజయ్, యువన్లే. తమ్మారెడ్డితో 40ఏళ్ల అనుబంధం ఉంది. ఇక జనరేషన్ గ్యాప్ ఉన్నా యువన్ సంగీతం అంటే చాలా ఇష్టం. నా ఫేవరెట్ సంగీత దర్శకుడు అతడు. 80లలో ఎన్నో హిట్లిచ్చిన ఇళయరాజా కొడుకు అవ్వడం వల్లనే తనంటే ఇంత ఇష్టం. తను ఇంత బిజీ షెడ్యూల్లోనూ నిర్మాతగా మారుతున్నాడు అంటే ఈ సినిమాలో కంటెంట్ నచ్చడం వల్లనే అని అనుకుంటున్నా. ఇది హిట్టేనని భావిస్తున్నా’ అన్నారు. చిత్ర సమర్పకుడు తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ...‘యువన్ శంకర్ రాజా తొలి సారి నిర్మాతగా రూపొందించిన ప్యార్ ప్రేమ కాదల్ చిత్రాన్ని బాగా నచ్చి రిలీజ్ చేస్తున్నాం. యంగ్ టీమ్ అద్భుతంగా చేశారు’ అని తెలిపారు. నిర్మాత యువన్ శంకర్ రాజా మాట్లాడుతూ - ‘మెగాస్టార్ ఆశీస్సులతో ఈ సినిమా రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. నిర్మాతగా తొలి ప్రయత్నం ఎంతో ఎగ్జైటింగ్గా ఉంది. అందరి ఆదరణ కావాలి’ అన్నారు. మరో నిర్మాత విజయ్ మోర్వనేని మాట్లాడుతూ - ‘తమిళ్లోలానే తెలుగులోనూ విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. చక్కని కంటెంట్ ఉన్న సినిమా ఇది’ అన్నారు. -
చిరు చేతుల మీదుగా ‘ప్యార్ ప్రేమ కాదల్’ ట్రైలర్ లాంచ్
-
కాలేజీ ప్రేమకథ!
హరీష్ కల్యాణ్, రైజ విల్సన్ జంటగా ఎలన్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన సినిమా ‘ప్యార్ ప్రేమ కాదల్’. ఈ సినిమాను తమిళంలో సంగీత దర్శకుడు యువన్ శంకర్రాజా నిర్మించారు. కాలేజీ లవ్స్టోరీ బ్యాక్డ్రాప్లో సాగే ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో యువన్ శంకర్రాజా, విజయ్ మోర్వనేని తెలుగులో రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ‘‘ఈ సినిమా ప్రేమ కథలో ఉన్న భావోద్వేగాలకు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. యువన్ శంకర్ రాజా మంచి సంగీతం అందించారు. తెలుగులో ఈ సినిమాను అక్టోబర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు చిత్రబృందం. -
కళాశాల నేపథ్యంలో సాగే 'ప్యార్ ప్రేమ కాదల్'
ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం 'ప్యార్ ప్రేమ కాదల్'. తమిళనాట ఘనవిజయం సాధించిన ఈ చిత్రం త్వరలో తెలుగు ప్రేక్షకులను పలుకరించ బోతోంది.. శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లో సుప్రసిద్ధ సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పణలో నిర్మాతలు యువన్ శంకర్ రాజా మరియు విజయ్ మోర్వనేని కలిసి 'ప్యార్ ప్రేమ కాదల్' ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఎలన్ డైరెక్షన్ లో హరీష్ కళ్యాణ్, రైజ విల్సన్ హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం కళాశాల నేపథ్యంలో జరిగే ప్రేమకథ. ఎలన్ రచించి దర్శకత్వం వహించిన ఈ చిత్ర కధ, ప్రేమ లోని భావోద్వేగాలు ప్రేక్షకులను సమ్మోహితులను చేస్తాయి.చిత్రానికి, పాటలు, నేపధ్య సంగీతం అద్భుతంగా అందించారు యువన్ శంకర్ రాజా. ఈ ప్యార్ ప్రేమ కాదల్ తెలుగు నాట కనువిందు చెయ్యడానికి అక్టోబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది అని చిత్ర దర్శక, నిర్మాతలు తెలిపారు. తమ్మారెడ్డి భరద్వాజ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. -
కొత్త అవతారం
సరిగమలు పలకాల్సిన యువన్ శంకర్ రాజా స్టార్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్ చెప్పడానికి రెడీ అవుతున్నారు. శృతి మీద వర్క్ చేయాల్సిన ఆయన స్క్రీన్ప్లే రెడీ చేస్తూ, బిజీగా ఉన్నారు. విషయమేంటంటే... ఇళయరాజా తనయుడు, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఓ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. ‘‘స్క్రిప్ట్ రాయడం కొత్త అనుభవం. ఫ్యాన్స్ నా నుంచి ఊహించని సినిమా ఇవ్వబోతున్నాను’’ అన్నారు యువన్. జర్మన్ సంగీత దర్శకుడు టామ్ టైక్వార్ రూపొందించిన ‘పెర్ఫ్యూమ్’ చిత్రమే యువన్ దర్శకుడిగా మారడానికి ఇన్స్పిరేషన్ అట. -
ఎలక్ట్రానిక్ సంగీతాన్ని దూరంపెట్టండి
తమిళసినిమా: ఎలక్ట్రానిక్ సంగీతాన్ని దూరంగా పెట్టండి అని సంగీతజ్ఞాని ఇళయరాజా ఈ తరం సంగీత దర్శకులకు హితవు పలికారు. ఆయన కొడుకు, ప్రముఖ సంగీతదర్శకుడు యువన్శంకర్రాజా వైఎస్ఆర్ పిక్చర్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి కే.ప్రొడక్షన్స్ రాజరాజన్తో కలిసి నిర్మిస్తున్న చిత్రం ప్యార్ ప్రేమ కాదల్. యువ నటుడు హరీశ్, నటి రైసా విల్సన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా ఇళన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యువన్ శంకర్రాజానే సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ ఆదివారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ఏవీఎం స్టూడియోలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఇళయరాజా పాల్గొని చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాతగా మారిన యువన్ శంకర్రాజా మాట్లాడుతూ తన మిత్రుడు ఇర్ఫాన్ ఒకసారి మీ అభిమానుల కోసం ఒక చిత్రం చేయవచ్చుగా అని అన్నాడన్నారు. తన బలమే ప్రేమ గీతాలని, సమీప కాలంలో అలాంటి పాటలు తన చిత్రాల్లో చోటు చేసుకోలేదని అన్నారు. అందుకే ప్రేమ గీతాలతో కూడిన చిత్రం చేయాలన్న ఆలోచనే ఈ ప్యార్ ప్రేమ, కాదల్ చిత్రం అని తెలిపారు. అతిథిగా పాల్గొన్న నటుడు ధనుష్ మాట్లాడుతూ కళాకారులందరికీ ప్రేమే మానసిక శక్తి అని పేర్కొన్నారు. తుళ్లువదో ఇళమై, కాదల్ కొండేన్ చిత్రాల సమయంలో తానూ, అన్నయ్య సెల్వరాఘవన్ కష్టపడుతున్నప్పుడు యువన్శంకర్రాజా సంగీతమే తమకు గుర్తింపు తెచ్చిపెట్టిందన్నారు. అలా తాను ఆయనకు రుణ పడి ఉన్నానని అన్నారు. మరో నటుడు శింబు మాట్లాడుతూ ఇది ఆడియో ఆవిష్కరణ వేడుక మాదిరి కాకుండా సినీ ప్రముఖుల గెట్ టు గెదర్లా ఉందన్నారు. యువన్ శంకర్రాజా తనకు తండ్రి లాంటి వాడన్నారు. తను శత్రువులు కూడా బాగుండాలని భావించే వ్యక్తి అనీ, ఆయన కోసం వచ్చిన కూటం ఇదనీ శింబు పేర్కొన్నారు. ఇళయరాజా మాట్లాడుతూ తొలిసారిగా చిత్ర నిర్మాణం చేపట్టిన యువన్శంకర్రాజాను ఆశీర్వదించడానికి వచ్చానన్నారు. ఈ తరం సంగీత దర్శకులకు తాను చెప్పేదొక్కటేనని, ఎలక్ట్రానిక్ సంగీతాన్ని దూరంగా పెట్టి, సహజ సంగీత వాయిద్యాలతో భాణీలను కట్టాలని అప్పుడే నూతనోత్సాహాన్ని కలిగిస్తాయని హితవు పలికారు. కార్యక్రమంలో దర్శకుడు రామ్, శీనూరామసామి, అమీర్, అహ్మద్, నటుడు జయంరవి, విజయ్సేతుపతి, ఆర్య, కృష్ణ, శాంతను, నటి రేఖ, బింధుమాదవి, సంగీత దర్శకుడు డీ.ఇమాన్, సంతోష్నారాయణన్ పాల్గొన్నారు. -
త్వరలో ప్యార్ ప్రేమమ్ కాదల్ గీతాలు
తమిళసినిమా: సంగీతజ్ఞాని ఇళయరాజా వారసుడిగా రంగప్రవేశం చేసిన ఆయన రెండవ కొడుకు యువన్ శంకర్రాజా అనతికాలంలోనే తన కంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన పాటల కోసం చెవులు కోసుకునే సంగీత ప్రియులు ఉన్నారంటే అతి శయోక్తి కాదు. ఒక ట్రెండ్ సెట్టర్గా పేరు సంపాదించుకున్న యువన్ శంకర్రాజా తాజాగా చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. ఆయన వైఎస్ఆర్ ఫిలింస్ చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి కే.ప్రొడక్షన్స్ రాజరాజన్, ఇర్ఫాన్ మాలిక్లతో కలిసి నిర్మిస్తున్న చిత్రమే ప్యార్ ప్రేమమ్ కాదల్. హరీష్కల్యాణ్, బిగ్బాస్ ఫేమ్ రైసా విల్సన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఇలన్ దర్శకత్వం వహిస్తున్నారు. యువన్శంకర్రాజానే సంగీత బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రంలోని హై ఆన్ లవ్, డోప్ అనే పల్లవిలతో కూడిన రెండు పాటలను విడుదల చేశారు. ఈ పాటలకు సంగీత ప్రియుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని చిత్ర వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా డోప్ అనే పాట యువతను ఉర్రూతలూగిస్తోందని చెబుతున్నారు. చిత్ర పూర్తి స్థాయి ఆడియోను జూలై మొదటి వారంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. విభిన్న ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కించిన ప్యార్ ప్రేమమ్ కాదల్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉందని, నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు. -
‘అభిమన్యుడు’ మూవీ రివ్యూ
టైటిల్ : అభిమన్యుడు జానర్ : యాక్షన్ థ్రిల్లర్ తారాగణం : విశాల్, అర్జున్, సమంత, ఢిల్లీ గణేష్ తదితరులు సంగీతం : యువన్ శంకర్ రాజా నిర్మాత : విశాల్ దర్శకత్వం : పీఎస్ మిత్రన్ కోలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో విశాల్, టాలీవుడ్లో మార్కెట్ సాధించేందుకు చాలా రోజులుగా కష్టపడుతున్నాడు. గతంలో అతను నటించిన కొన్ని చిత్రాలు ఇక్కడా విజయాలు సాధించి విశాల్కు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. అదే ఊపులో మరో డిఫరెంట్ ఎంటర్టైనర్తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశాల్. కోలీవుడ్ లో ఘనవిజయం సాధించిన ఇరుంబు తిరై సినిమాను తెలుగులో అభిమన్యుడు పేరుతో అనువాదం చేసి రిలీజ్ చేశారు. మరి అభిమన్యుడుగా విశాల్ ఆకట్టుకున్నాడా..? కోలీవుడ్లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించిందా..? చూద్దాం కథ : కరుణ(విశాల్) ఆర్మీ మేజర్. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని ఆవేశపరుడైన ఆఫీసర్. కుటుంబ సమస్యల కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో కరుణ ఫేక్ డాక్యుమెంట్స్తో లోన్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ తీసుకున్న లోన్ డబ్బులు నిమిషాల్లోనే బ్యాంక్ ఎకౌంట్ నుంచి మాయం అవుతాయి. దీంతో హీరో ఏం చేయాలలో తెలియని పరిస్థితుల్లో నిస్సహాయుడిగా మిగిలిపోతాడు. హీరో అకౌంట్ నుంచి డబ్బు ఎలా మాయం అయ్యింది..? ఈ నేరాల వెనకు ఉన్న వైట్ కాలర్ పెద్ద మనిషి ఎవరు..? ఈ సైబర్ క్రైమ్ను హీరో ఎలా చేధించాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : విశాల్ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో మరింత మెచ్యూర్డ్గా కనిపించాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్లో విశాల్ నటన ఆకట్టుకుంటుంది. ఎమోషనల్ సీన్స్లోనూ ఆకట్టుకున్నాడు. మిలటరీ ఆఫీసర్గా విశాల్ లుక్ సూపర్బ్ అనిపించేలా ఉంది. సినిమాలో మరో కీలక పాత్ర ప్రతినాయకుడు అర్జున్. వైట్ డెవిల్ పాత్రకు అర్జున్ వంద శాతం న్యాయం చేశాడు. అర్జున్ను తప్ప మరొకరిని ఆ పాత్రలో ఊహించుకోలేని స్థాయిలో ఉంది ఆయన నటన. ముఖ్యంగా విశాల్, అర్జున్ల మధ్య వచ్చే సన్నివేశాల్లో ఇద్దరి నటన సూపర్బ్. హీరోయిన్ సమంత రెగ్యులర్ కమర్షియల్ సినిమా హీరోయిన్ పాత్రే. పాటలు, కామెడీ సీన్స్ తప్ప ఆ పాత్ర గురించి పెద్దగా చెప్పుకోవటానికేం లేదు. విశ్లేషణ : దర్శకుడు మిత్రన్ నేటి డిజిటల్ లైఫ్కు తగ్గ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విశాల్ బాడీ లాంగ్వేజ్ ఇమేజ్కు తగ్గట్టుగా అభిమన్యుడు సినిమాను రూపొందించాడు. ముఖ్యంగా సైబర్ క్రైమ్ కు సంబంధించి సన్నివేశాలను తెరకెక్కించేందుకు మిత్రన్ చేసిన పరిశోధన తెర మీద కనిపిస్తుంది. వ్యక్తిగత సమాచారం ఎలా చోరికి గురవుతుందన్న అంశాలను చాలా బాగా చూపించాడు. అయితే హీరో క్యారెక్టర్ను ఎస్టాబ్లిష్ చేసేందుకు ఎక్కువ సమయం తీసుకున్న దర్శకుడు తొలి భాగంలో చాలా సేపు రొటీన్ సన్నివేశాలతో బోర్ కొట్టించాడు. అసలు కథ మొదలైన తరువాత సినిమా వేగం అందుకుంటుంది. అయితే పూర్తిగా టెక్నాలజీకి సంబంధించిన కథ కావటంతో సామాన్య ప్రేక్షకులు ఏ మేరకు అర్థం చేసుకోగలరో చూడాలి. యువన్ శంకర్ రాజా థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన ఇంటెన్స్ మ్యూజిక్ తో మెప్పించాడు. సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ సినిమాటోగ్రఫి. జార్జ్ సీ విలియమ్స్ తన కెమెరా వర్క్తో సినిమా మూడ్ను క్యారీ చేశారు. అయితే ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. తొలి భాగంలో అనవసర సన్నివేశాలకు కత్తెర వేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : అర్జున్ నటన నేపథ్య సంగీతం సినిమాటోగ్రఫి మైనస్ పాయింట్స్ : తొలి భాగంలో కొన్ని బోరింగ్ సీన్స్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
అభిమన్యుడు చేయడం అదృష్టంగా భావిస్తున్నాను
విశాల్, సమంత జంటగా అర్జున్ ముఖ్య పాత్రల్లో పీయస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇరంబుదురై’. తెలుగులో ‘అభిమన్యుడు’. యం.పురుషోత్తమన్ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి. హరి తెలుగులో జూన్ 1న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా విశాల్ పాత్రికేయులతో పలు విశేషాలు పంచుకున్నారు. ► నా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా ‘ఇరంబుదురై’ నిలించింది. తమిళంలో సక్సెస్ సాధించినట్టే ఇక్కడా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమా ‘అభిమన్యుడు’. తమిళంతో పాటుగా తెలుగులోనూ రిలీజ్ చేద్దాం అనుకున్నాం. మే 11న చాలా తెలుగు సినిమాలు ఉండటంతో రిలీజ్ చేయలేకపోయాం. ► నా సినిమా జీవితం అర్జున్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ అయింది. ఆయనతో కలిసి యాక్ట్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. హీరో విలన్ మధ్య పోటీ చక్కగా కుదిరింది. మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో అర్జున్గారు పలికే సంభాషణలే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నాయి. ► ‘అభిమన్యుడు’ సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆర్మీ వాళ్లకు రేషన్ కార్డ్ ఉండదు. రైతులకు బ్యాంక్ లోన్లు ఇవ్వరు అనే విషయాలు తెలిశాయి. ఇలాంటి విషయాలు సినిమాలో డైలాగుల రూపంలో పెట్టాం. ► అందరూ డిజిటల్ ఇండియా, ఆధార్ కార్డ్ అంటున్నారు. దీని వల్ల ఎలాంటి పరిమాణాలు ఉంటాయి అని ఈ సినిమాలో చూపించాం. డిజిటల్ ఇండియా అవసరమా? అనే ప్రశ్నతో సినిమాను ఎండ్ చేశాం. పార్ట్ 2 కూడా రూపొందిస్తాం. ► టీమ్ అంతా బాగా కుదిరింది. సమంతతో యాక్ట్ చేయడం ఫస్ట్ టైమ్. మంచి కో–స్టార్. కెమెరా జార్జ్ సీ విలియమ్స్, సంగీతం యువన్ శంకర్ రాజా అన్నీ కరెక్ట్గా కుదిరాయి. అందరం దర్శకుడిని నమ్మాం. ► సినిమా రిలీజ్కు ముందు టెస్ట్ స్క్రీనింగ్ చేశాం. బయటవాళ్ళ అభిప్రాయాలను తీసుకొని నాలుగుసార్లు ఎడిట్ చేశాం. బయటవారి ఒపీనియన్ తీసుకోవడం మంచిదని తెలిసింది. ► క్రైమ్కి బలమైన శిక్ష ఉంటే తప్పు చేయాలనే ఆలోచన మానుకుంటారు. సినిమా అనేది స్ట్రాంగ్ మీడియం. సోషల్ అవేర్నెస్ సినిమాలు రూపొందించాలి అని మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ► నెక్ట్స్ ‘టెంపర్’ రీమేక్లో యాక్ట్ చేస్తున్నాను. కొత్త స్క్రీన్ప్లేతో చేయబోతున్నాం. మురగదాస్ అసిస్టెంట్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారు. ‘అభిమన్యుడు’ మూవీ రిలీజ్ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్లో ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మిత్రన్ మాట్లాడుతూ–‘‘దర్శకుడిగా ఇది నా ఫస్ట్ సినిమా. డిజిటలైజేషన్కి మరో వైపు ఎలా ఉంటుందో అని ఇందులో చూపించాం. సినిమా అనేది స్ట్రాంగ్ మీడియం. పాటనో ఫైట్నో కాకుండా సమాజంలో జరిగే విషయాల్ని ఈ సినిమాలో చూపించాం.పెళ్లైన హీరోయిన్ నటించకూడదు అనే విషయాన్ని దాటి సమంత సక్సెస్ కొట్టారు’’అన్నారు. ‘‘రంగస్థలం, మహానటి’ తర్వాత తమిళంలో ‘ఇరంబుదురై’తో సక్సెస్ అందుకున్నాను. ఇన్ఫర్మేషన్ థెప్ట్ గురించిన అవేర్నెస్ను కలిగిస్తూ కమర్షియల్ పంథాలో రూపొందించాం. తెలుగులోను సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను’’ అన్నారు సమంత. ‘‘ఈ సినిమాలో గ్రే షేడ్స్ ఉన్న పాత్రను పోషించాను. చాలా స్టైలిష్గా నా పాత్ర ఉంటుంది. ప్రస్తుతం ఉన్న కాలానికి టైలర్ మేడ్ మూవీ ఇది. మిత్రన్ ఫస్ట్ సినిమా అయినా చక్కగా తెరకెక్కించారు. అభిమన్యుడు మహాభారతంలో అల్టిమేట్ హీరో. అలాగే అన్సక్సెస్ఫుల్ హీరో. కానీ మా అభిమన్యుడు సక్సెస్ఫుల్ హీరో’’ అన్నారు అర్జున్. ఈ సినిమాకు సంగీతం:యువన్ శంకర్ రాజా. -
జూన్ 1న విశాల్ ‘అభిమన్యుడు’
‘ఇరుంబుదురై’ అంటూ ప్రస్తుతం తమిళ్ బాక్సాఫీస్ను షేక్ చేస్తున్నారు విశాల్. ఈ సినిమా విడుదలైన రెండో వారంలో కూడా హౌస్ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమా తెలుగులో అభిమన్యుడుగా ఎప్పుడో రిలీజ్ కావల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. విశాల్ సినిమాలకు తెలుగులో మంచి మార్కెట్ ఉండడం, సమంత హీరోయిన్గా నటించడం వల్ల అభిమన్యుడు సినిమాను పెద్ద ఎత్తులో జూన్ 1న రిలీజ్ చేయబోతున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటించారు. ఈ చిత్రానికి పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు యువన్ శంకర్రాజా సంగీతాన్ని అందించారు. ప్రస్తుతం విశాల్ ‘పందెంకోడి 2’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ తర్వాత తెలుగు ‘టెంపర్’ రీమేక్లో నటించనున్నారు. -
విజయ్ సేతుపతితో తెలుగమ్మాయి
తమిళసినిమా: నటుడు విజయ్సేతుపతితో అంజలి జత కడుతున్న తాజా చిత్రం శనివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. బాహుబలి–2 చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేసిన కే.ప్రొడక్షన్స్ ఎస్ఎన్.రాజరాజా, వైఎస్ఆర్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత, ప్రముఖ సంగీతదర్శకుడు యువన్శంకర్రాజా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వీరి కలయికలో ఇప్పటికే ప్యార్ ప్రేమ కాదల్ చిత్రం నిర్మాణంలో ఉంది. తాజాగా విజయ్సేతుపతి, అంజలి జంటగా నూతన చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు విజయ్సేతుపతి హీరోగా పణ్ణైయారుమ్ పద్మినియుమ్, సేతుపతి చిత్రాలను తెరకెక్కించిన ఎస్యూ.అరుణ్కుమార్ ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రతినాయకుడిగా లింగా నటిస్తుండగా ఒక ముఖ్య పాత్రలో వివేక్ ప్రసన్న నటిస్తున్నారు. ఇతర తారాగణాన్ని త్వరలోనే వెల్లడిస్తామని చిత్ర వర్గాలు వెల్లడించారు. యువన్శంకర్రాజా సంగీతాన్ని, విజయ్కార్తీక్ కన్నన్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లో రూపొందిస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్ర షూటింగ్ను తెన్కాశి, మలేషియాలో చిత్రీకరించడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇది కమర్శియల్ అంశాలతో కూడిన భారీ యాక్షన్ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు ఎస్యూ.అరుణ్కుమార్ తెలిపారు. -
ఇంట్లోనే కారులో పడుకున్న డ్రైవర్..!
చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్రాజాకు చెందిన ఖరీదైన కారు చోరీ కేసులో ఆసక్తికరమైన ట్విస్టు వెలుగుచూసింది. యువన్శంకర్రాజా డైవర్ నవాజ్ఖాన్ కారును దొంగలించినట్టు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు దాఖలైన సంగతి తెలిసిందే. పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ కెమెరా దృశ్యాలను తమకు చూపించాలని యువన్ సతీమణి జఫ్రూన్ నిసాను పోలీసులు కోరారు. సీసీటీవీ కెమెరాలు చూడటంతో ఆశ్చర్యకరమైన విషయం వెలుగుచూసింది. చోరీకి గురైనట్టు భావిస్తున్న కారు యువన్ నివాసంలోనే లెవల్-2కు బదులు లెవల్ -3లో పార్క్ చేసి ఉంది. వెంటనే కారు దగ్గరికి వెళ్లి చూడగా.. అందులో డ్రైవర్ నవాజ్ ఖాన్ ఇంకా పడుకొని ఉన్నాడు. ఏమైందని డ్రైవర్ను ఆరాతీయగా తాను కారులో నిద్రపోయానని, ఫోన్ చార్జింగ్ అయిపోవడంతో కాల్స్ రాలేదని అతను చెప్పాడు. దీంతో షాక్ తినడం యువన్ భార్య నిసా, పోలీసుల వంతైంది. పొరబడటం వల్లేనా!? సోమవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో డ్రైవర్ నవాజ్ఖాన్ యువన్కు చెందిన లగ్జరీ కారు ఆడీ-6ను బయటకు తీసుకువెళ్లాడు. తెల్లవారుజామున 2.40 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగివచ్చిన జఫ్రూన్ నిసా ఇంట్లోని లెవల్-3లో కారు పార్క్ చేసి లేకపోవడంతో సందేహించింది. యువన్శంకర్రాజా కూడా ఇంటివద్ద లేకపోవడంతో కారు చోరీకి గురైందేమోనన్న అనుమానంతో వెంటనే ఎంగ్మూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అర్ధరాత్రి అయినా కారు తిరిగిరాకపోవడం, డ్రైవర్కు ఫోన్ చేస్తే కలువకపోవడం వల్ల ఆమె పొరబడి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోందని స్థానిక మీడియా కథనాలు వస్తున్నాయి. తీరా కారు, డ్రైవర్తో సహా ఇంట్లోనే ఉండటంతో ఫిర్యాదును వెనుకకు తీసుకున్నట్టు తెలుస్తోంది. -
యువన్ శంకర్రాజా కారు చోరీ
పెరంబూరు:సంగీత దర్శకుడు యువన్ శంకర్రాజాకు చెందిన ఖరీదైన కారు అపహరణకు గురైంది. వివరాల్లోకెళితే ప్రఖ్యాత సంగీతదర్శకుడు ఇళయరాజా కొడుకు, యువ సంగీత దర్శకుడు యువన్శంకర్రాజా స్థానిక ఎతిరాజ్ రోడ్డులోని ఇంట్లో నివశిస్తున్నారు.ఆయన వద్ద నవాజ్ఖాన్ అనే వ్యక్తి కారు డైవర్గా పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో డ్రైవర్ నవాజ్ఖాన్ కారును బయటకు తీసుకెళ్లి అర్ధరాత్రి అయినా తిరిగి రాలేదు. యువన్శంకర్రాజా కూడా ఇంటి వద్ద లేకపోవడంతో కారు దొంగిలించబడిందన్న సందేహంతో ఆయన తరఫున ఎంగ్మూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి పరిస్థితిలో మంగళవారం వేకువజామున డ్రైవర్ నవాజ్ఖాన్ కారుతో యువన్శంకర్రాజా ఇంటికి తిరిగి వచ్చాడు. అతను కారును ఎక్కడికి తీసుకెళ్లాడు? ఎందుకు తీసుకెళ్లాడు. అన్న విషయాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే కారు లభించడంతో యువన్శంకర్రాజా ఫిర్యాదును వెనక్కు తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఫ్లాట్గా ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
సినిమా లవర్స్కి షాక్..2వారాలు థియేటర్స్ బంద్..
సైకో థ్రిల్లర్గా 'దక్షిణ'.. ట్రైలర్తోనే భయపెట్టారు!
కాకినాడ గెలుపుపై కన్నబాబు రియాక్షన్
ఆడ రాక పాత గజ్జెలు.. సీఎం రేవంత్పై హరీశ్రావు సెటైరికల్ ట్వీట్
తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు
లేఆఫ్స్కు గురయ్యారా?.. హెచ్1- బీ వీసాలో కొత్త నిబంధనలు
సెలబ్రెటీల స్వీట్ ఫ్యామిలీస్ (ఫోటోలు)
Wamiqa Gabbi: క్యూట్ లుక్స్తో ఫిదా చేస్తున్న వామిక గబ్బి (ఫోటోలు)
అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
తప్పక చదవండి
- లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- ఆస్ట్రేలియాలో ఏం జరుగుతోంది? ఎందుకలా..?
- రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్
- టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- సుచి లీక్స్.. నాకు ఆ ఫొటోలు త్రిషనే ఇచ్చింది: సుచిత్ర
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- పోటెత్తిన ఏపీ ఓటర్లు.. అప్పట్లో ఏం జరిగిందంటే..!
- చైనాకు ఒకేసారి రెండు దెబ్బలు.. షాకిచ్చిన బైడెన్, ట్రంప్!
- MS Dhoni: ఎల్లలు దాటిన అభిమానం.. వామ్మో ఇలా కూడా చేస్తారా?
Advertisement