-
● రెండు కిలోమీటర్లు మేర రెడ్జోన్
శ్రీకాకుళం క్రైమ్: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ నాలుగో తేదీన జరగనున్న నేపథ్యంలో ఎచ్చెర్ల శివానీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, చుట్టూ రెండు కిలోమీటర్లు మేర రెడ్జోన్ అమలు చేస్తున్నామని ఎస్పీ జీఆర్ రాధిక గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన 8 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానానికి లెక్కింపు జరగనున్న నేపథ్యంలో డ్రోన్సు, బెలూన్సు ఎగరేయడం కూడా నిషేధించామని ఎస్పీ పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ● సోషల్ మీడియా పోస్టులపై నిఘా శ్రీకాకుళం క్రైమ్ : సామాజిక మాద్యమాల (సోషల్ మీడియా)పోస్టులపై ప్రత్యేక నిఘా పెట్టామని ఎస్పీ జీఆర్ రాధిక పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ తదితర యాప్లోన్ని గ్రూపు ల్లో ఉద్దేశపూర్వకంగా కుల, మత, రాజకీయ పార్టీలను, వ్యక్తులను రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టకూడదని, అవాస్తవాలు ఇతరులకు షేర్ చేయకుండా గ్రూప్ అడ్మిన్ ముందస్తుగా నియంత్రణ చర్యలు తీసుకోవాలన్నారు. వదంతులు పోస్ట్ చేసినవారిపై, గ్రూప్ అడ్మిన్పై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎన్నికలకు సంబంధించి.. సోషల్ మీడియా లేదా వాట్సాప్లో ఎగ్జిట్ పోల్స్, ఎన్నికల ఫలితాలపై ఎలాంటి విద్వేషాలు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టకూ డదని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన ప్రతి సున్నిత అంశంపైన ప్రత్యేక నిఘా ఉంటుందని, అందుకోసం జిల్లా కేంద్రంగా సోషల్ మీడియా సెల్ విభాగం సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తుంటారని తెలిపారు. ఇతరులను రెచ్చగొట్టే పోస్టులు, అవాస్తవాలు పోస్టు చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ అన్నారు. -
● కౌంటింగ్ హాళ్లకు పటిష్ట భద్రత
ఎచ్చెర్ల క్యాంపస్: స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ హాళ్ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికలు అధికారి డాక్టర్ మనజీర్ జిలానీ సమూ న్ అన్నారు. చిలకపాలెం శివానీ ఇంజినీరింగ్ కాలేజ్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రా లను ఆయన గురువారం పరిశీలించారు. నియోజక వర్గాల వారీగా కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్షించారు. కౌంటింగ్ రోజు అంబులెన్స్లు నిలుపు స్థలం, వైద్య ఆరోగ్య శాఖ శిబిరాలు, భోజన ఏర్పాట్లు స్టాల్స్ వంటి ఏర్పాట్లు పరిశీలించారు. పార్కింగ్ స్థలం, అధికారులు, పొలిటికల్ ఏజెంట్లు, అభ్యర్థులు ప్రవేశాలు వంటి అంశాలు పరిశీలించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, జెడ్పీ సీఈఓ డి.వెంకటేశ్వరరావు, ఆర్ఓలు పాల్గొన్నారు. -
1 నుంచి పింఛన్ల పంపిణీ
శ్రీకాకుళం పాత బస్టాండ్: వృద్ధులు, వితంతువులు, ఇతర సామాజిక భద్రతా పింఛన్లను గత నెలలాగానే ఈ నెల కూడా రెండు పద్ధతుల్లో లబ్ధిదారులకు అందజేయనున్నారు. బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానంగా ఉన్న లబ్ధిదారులకు వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో నేరుగా డీబీటీ విధానంలో పింఛను మొత్తాన్ని జమ చేస్తారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేశారు. ఈ నెలకు గాను జిల్లాలో 3,19,702 పింఛను దారులు ఉన్నారు. వీరికి రూ.93.30 కోట్లను విడుదల చేశారు. ఈ పింఛన్లలో 2,38,993 మంది లబ్ధిదారులకు రూ. 71.69 కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. మిగిలిన 80,709 మందికి రూ. 21.60 కోట్లను జూన్ ఒకటో తేదీ నుంచి 5వ తేదీ వరకు జిల్లాలోని 732 గ్రామ వార్డు సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ ఇతర సిబ్బంది నేరు గా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి ఇస్తారు. ఒకటి నుంచి ఐదో తేదీ లోగా అందరూ పింఛన్లు తీసుకోవాలని, గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి అందజేయాలని డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్ కోరారు. నిబంధనల ప్రకారమే మెనూపొందూరు: ప్రభుత్వ నిబంధనల మేరకే పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులు మెనూను అమలు చేయాలని డీఈఓ వెంకటేశ్వరరావు సూచించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎండీఎం నిర్వాహకులకు నిర్వహించిన ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో పా ల్గొని మాట్లాడారు. విద్యార్థులకు అందించాల్సి న పౌష్టికాహారం తయారీపై ఎండీఎం నిర్వాహకులు శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంవీలు పీవీ రామరాజు, పి.రాజారావు తదితరులు పాల్గొన్నారు. ఇసుక అక్రమ రవాణాకు సెబ్ కళ్లెం శ్రీకాకుళం క్రైమ్ : నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) అధికారులు కళ్లెం వేశారు. సెబ్ జాయింట్ డైరెక్టర్ (అదనపు ఎస్పీ) డి.గంగాధరం ఆదేశాలతో అధికారులు పలు చోట్ల దాడులు నిర్వహించారు. సెబ్ జేడీ గంగాధరం చెప్పిన వివరాల మేరకు.. బుధ, గురువారాల్లో ఎచ్చెర్ల మండలం పొన్నాడ, శ్రీకాకుళం రూరల్ మండలం బట్టేరు–భైరి, కరజాడ, ముద్దాడ పేటల్లో 213 టన్నుల ఇసుక లోడులతో ఉన్న 11 ట్రాక్టర్లను, ఎనిమిది లారీలను సీజ్ చేశారు. బట్టేరులో దొరికిన నాలుగు లారీల్లో వంద టన్నుల ఇసుకతో పాటు సీజ్ చేసిన లారీలను ఆయా మండలాల పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లకు అప్పగించారు. -
మనోళ్లు అదుర్స్
ఐసెట్, ఈసెట్లో ఏపీ–ఈసెట్లో.. ● ఐసెట్లో 98 శాతం, ఈసెట్లో 89 శాతం అర్హత సాధించిన విద్యార్థులు ● ఈ సెట్లో 1, 8, 9వ ర్యాంకులు సొంతం ● ఐసెట్లో 7వ ర్యాంకులో నిలిచిన కొర్లాం శ్రీకర్శ్రీకాకుళం న్యూకాలనీ, ఎచ్చెర్ల క్యాంపస్: ఏపీఐసెట్–2024, ఏపీఈసెట్–2024 ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన విద్యార్థులు సత్తాచాటారు. గురువారం వెలువడిన ఐసెట్, ఈసెట్ ఫలితాల్లో టాప్ ర్యాంకులు సాధించారు. వివిధ పాలిటెక్నిక్ కోర్సులు చదివి ఇంజినీరింగ్ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు పొందేందుకుగాను రాసే ఏపీఈసెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు శభాష్ అనిపించారు. 89.01 శాతం మంది ప్రవేశాలు పొందేందుకు అర్హత సాధించారు. జిల్లా నుంచి 1576 మంది విద్యార్థులు ఏపీఈసెట్కు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 1520 మంది పరీక్ష రాశారు. 1353 మంది అర్హత సాధించారు. మెరిసిన వలంటీర్ ఈసెట్–2024 పరీక్ష ఫలితాల్లో రణస్థలం మండలంలోని కొవ్వాడ గ్రామానికి చెందిన మైలపల్లి శిల్ప రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించింది. ఈమె ఇదివరకు వలంటీర్గా సేవలు అందించింది. శ్రీకాకుళం మహిళ పాలిటెక్నికల్ ప్రభుత్వ కళాశాలలో డీ–ఫార్మశీ రెండో సంవత్సరం చదువుతున్న శిల్ప అద్భుత ప్రతిభ చూపడంపై స్థానికులు ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆమె తండ్రి పేరు పోలీసు. ఆయన ఓ టైలర్, తల్లి లక్ష్మి గృహిణి. జ్యోత్స్నకు 8వ ర్యాంకు ఆమదాలవలస: ఏపీ ఈసెట్ ఫలితాల్లో శ్రీహరిపురం గ్రామానికి చెందిన కూన జ్యోత్స్న అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ విభాగంలో రాష్ట్రస్థాయిలో 8వ ర్యాంకు సాధించి సత్తా చాటింది. విద్యార్థిని తల్లి అరుణకుమారి కాంట్రాక్టు ఉద్యోగి కాగా, తండ్రి రమణమూర్తి న్యాయవాది. ఈ సందర్భంగా ఆమెకు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. మెరిసిన రాహుల్ గార: ఏపీ ఈసెట్ ఫలితాల్లో మండలంలోని తూలుగు గ్రామానికి చెందిన కొర్లాపు రాహుల్ 9వ ర్యాంకు సాధించాడు. తండ్రి కొర్లాపు గోపాలరావు రైతు కాగా, తల్లి గృహిణి. ఏపీ ఐసెట్.. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికిగాను ఇంజినీరింగ్, డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులకు నిర్వహించిన ఏపీ ఐసెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు విజయబావుటా ఎగురవేశారు. రికార్డుస్థాయిలో 98 శాతం మంది అర్హత సాధించారు. శ్రీకాకు ళం, టెక్కలి కేంద్రాలుగా జరిగిన ఈ పరీక్షకు 1210 మంది దరఖాస్తు చేసుకోగా.. 1103 మంది పరీక్ష రాశారు. ఇందులో 1088 మంది అర్హత సాధించారు. మెరిసిన కొర్లాం శ్రీకర్.. ఏపీ ఐసెట్ ఫలితాల్లో జిల్లాకు చెందిన కొర్లాం శ్రీకర్ రాష్ట్రస్థాయిలో 7వ ర్యాంకు సాధించా డు. శ్రీకాకుళం నగరంలోని ఇందిరానగర్కాలనీలో నివాసం ఉంటున్న కొర్లాం శ్రీకర్ తండ్రి కె.శ్రీరామాచార్యులు– ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సీనియర్ లెక్చరర్గా పనిచేస్తున్నారు. తల్లి కె.నిశ్చల ఎంపీడీఓగా పనిచేస్తున్నారు. -
కుటుంబ సభ్యుల చెంతకు వృద్ధుడు
పాతపట్నం: విజయనగరం జిల్లా, గుర్ల మండలం కొలాని గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని వృద్ధుడు జమ్ము తమ్మినాయుడును పాతపట్నంకు చెందిన ప్రదీప్ యువసేన సభ్యులు ఆయన కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. తమ్మినాయుడు కొద్ది రోజులుగా పాతపట్నం మండల కేంద్రంలోనే తిరుగుతున్నారు. ప్రదీప్ యువసేన సభ్యులు జి.రాము, ఎస్.ప్రదీప్, సుందరావు, నాగేశ్, శంకర్లు వృద్ధుడి వివరాలు తెలుసుకుందామని ఆరా తీసి ఆయన ఫొటోను వాట్సాప్ గ్రూపుల్లో పెట్టారు. ఆ ఫొటో చూసిన వృద్ధుని కుటుంబ సభ్యులు ఫోన్లో ప్రదీప్ యువసేన సభ్యులను సంప్రదించారు. అన్ని వివరాలు తెలుసుకున్నాక గురువారం పాతపట్నం వచ్చి వృద్ధుడిని తమ ఇంటికి తీసుకెళ్లారు. ప్రదీప్ యువసేన సభ్యులను అందరు అభినందించారు. -
రెండు బ్రాంచ్లకు ఎన్బీఏ గుర్తింపు
ఎచ్చెర్ల క్యాంపస్: శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో రెండు బ్రాంచ్లకు ఎన్బీఏ (నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్) గుర్తింపు లభించినట్లు ప్రిన్సిపాల్ జి.గోవిందనాయుడు తెలిపారు. కళాశాలలో గురువారం వివరాలు తెలియజేశారు. డిప్లమా ఇన్ కంప్యూటర్ ఇంజినీరింగ్ (డీసీఎంఈ)లో 60 సీట్లు ఉండగా ఈ కోర్సుకు, డిప్లమా ఇన్ ఫార్మశీ (డీ ఫార్మా) 40 సీట్లు ఉండగా ఈ కోర్సుకు ఎన్బీఏ అక్రిడేషన్ లభించినట్లు చెప్పారు. డిప్లమా ఇన్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ (డీఏఈఐఈ)లో 30 సీట్లు ఉన్నట్లు చెప్పారు. పాలిసెట్ కౌన్సెలింగ్లో విద్యార్థినులు మహిళా పాలిటెక్నిక్ కళాశాల ఎంచుకుంటే మంచి భవిష్యత్ ఉంటుందని, అవకాశం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వసతి గృహం సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. 2027 ఏడాది వరకు ఎన్బీఏ గుర్తింపు లభిస్తుందని అన్నారు. తమ విద్యార్థులు రూ. 8 లక్షలు వార్షిక ప్యాకేజీకి సైతం ఎంపికయ్యారని అన్నారు. -
కొనసాగుతున్న పాలీసెట్ కౌన్సెలింగ్
ఎచ్చెర్ల క్యాంపస్: పాలిటెక్నిక్ ప్రవేశాలకు సంబంధించిన పాలీసెట్–2024 కౌన్సెలింగ్ కొనసాగుతోంది. శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ల్లో కౌన్సెలింగ్లో భాగంగా వెబ్ ఆధారిత సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 27న కౌన్సెలింగ్ ప్రారంభం కాగా, గురువారం షెడ్యూ ల్ మేరకు 43001 నుంచి 59000 ర్యాంకు మధ్య విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు. ఈ పరిశీలనకు 312 మంది హాజరయ్యారు. సహాయ కేంద్రంలో శుక్రవారం 59001–75000 ర్యాంకు మధ్య ధ్రువీకరణ పత్రాలు పరిశీలించనున్నారు. కౌన్సెలింగ్ షెడ్యూల్లో జూన్ నాలుగున సార్వత్రిక ఎన్నికలు కౌంటింగ్, శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా మార్పులు చేశారు. ఆన్లైన్ ఫీజు చెల్లింపులో ఎలాంటి మార్పు ఉండదు. జూన్ రెండు లోపు చెల్లించాలి. రెండో తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్లో మార్పు ఉండదు. షె డ్యూల్ మేరకు విద్యార్థులు హాజరు కావాల్సి ఉంటుంది. జూన్ మూడో తేదీన జరగాల్సిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ జూన్ 6వ తేదీన జరుగుతుంది. ప్రత్యేక రిజర్వేషన్లు వర్తించే వారికి సైతం ఇదే షెడ్యూల్ వర్తిస్తుంది. పాత షెడ్యూల్ మేరకు ఆ ప్షన్ల ఎంట్రీకి ఈ నెల 31 నుంచి జూన్ ఐదు వర కు అవకాశం ఇవ్వగా, ప్రస్తుతం జూన్ ఏడు నుంచి పదో తేదీ వరకు మార్పు చేశారు. ఆప్షన్ల మా ర్పు తేదీ జూన్ 5 నుంచి 11వ తేదీకి మార్చారు. అలాట్మెంట్ల ప్రకటన జూన్ ఏడు నుంచి 13వ తేదీకి మార్చారు. సీటు లభించిన విద్యార్థులు కళాశాలకు రిపోర్టు చేయాల్సిన తేదీ జూన్ 10 నుంచి 14 వరకు కాగా, జూన్ 14 నుంచి 19 మధ్యకు మార్చారు. క్లాస్వర్క్ ప్రారంభం జూన్ 10 నుంచి కాగా, జూన్ 14వ తేదీకి మార్పు చేశారు. కౌన్సెలింగ్ ప్రక్రియను శ్రీకాకుళం ప్రభుత్వ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ జి.దామోదర్రావు, అధ్యాపకులు మురళీకృష్ణ పర్యవేక్షిస్తున్నారు. షెడ్యూల్లో మార్పులు -
పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో జాగ్రత్త
శ్రీకాకుళం పాతబస్టాండ్: పొరపాట్లకు తావివ్వకుండా కేటాయించిన విధులు నిర్వహించాలని, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సక్రమంగా చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధి కారి డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ ఎన్నికల అధికారులు, సిబ్బందికి సూచించారు. ఆయన గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆర్ఓలు, ఎఆర్ఓలు, సూపర్వైజర్లకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రి యపై ఆచరణాత్మకంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 4న ఉదయం 6 గంటలకు శివానీ ఇంజినీరింగ్ కళాశాల కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో భాగంగా మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కార్య క్రమం జరుగుతుందని, అనంతరం 8 నియోజకవర్గాల కౌంటింగ్ హాళ్లలో ఈవీఎంల ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతుందన్నారు. పార్లమెంటు నియోజకవర్గం కౌంటింగ్ హాలు వద్ద ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, ఇందుకోసం పా ర్లమెంట్కి 30 టేబుళ్లు, అసెంబ్లీకి 3నుంచి4 టేబుళ్లు ఏర్పా టు చేస్తామని, ఒక్కో టేబుల్కు 500 చొప్పున పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి టేబుల్కు పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఆయన వివరిస్తూ ఇందులో రెండు కవర్లు ఉంటా యని, బయటి కవర్ని ఫారం 13–సి గా పిలుస్తారని, దాన్ని తెరిచిన తర్వాత రెండు డాక్యుమెంట్లు ఉంటాయని, అందులో ఒకటి డిక్లరేషన్ 13–ఏ, ఇంకొకటి 13–బి కవరులో వాస్తవ పోస్టల్ బ్యాలెట్ ఉంటుందన్నారు. డిక్లరేషన్ 13–ఏ లో తప్పనిసరిగా ఓటరు సంతకం చేసి ఉండాలని, దానితోపాటు గెజిటెడ్ అధికారి ధ్రువీకరించి సంతకం చేసి స్టాంపు వేయడం లేదా హోదాని రాసి ఉండాలని, అలా ఉంటేనే అది చెల్లుబాటు బ్యాలెట్ ఓటుగా పరిగణించాలన్నారు. చెల్లుబాటు కాని ఓట్లు ఏవైనా ఉంటే 13–సి కవర్లో ఉంచి తిరస్కరిస్తూ వేరుగా పెట్టెలో ఉంచడం జరుగుతుందన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి సెల్ ఫోన్లకు అనుమతి లేదన్నారు. లెక్కింపు ప్రక్రియలో సమస్యలు ఉత్పన్నమైతే పరిష్కారానికి సానుకూలంగా స్పందించాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియలో పాటించాల్సి న ఆయా విషయాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చారు. శిక్షణ తరగతులలో జాయింట్ కలెక్టర్, ఆమదాలవలస రిట ర్నింగ్ అధికారి ఎం.నవీన్ మాట్లాడు తూ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియను సమన్వయంతో నిర్వహించాలన్నారు. ఎన్నికల నిబంధనలు విధిగా పాటించాలన్నారు. జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ -
వచ్చేస్తున్నాయ్..!
పుస్తకాలుశ్రీకాకుళం న్యూకాలనీ: పాఠ్య పుస్తకం పిల్లలను పిలుస్తోంది. ఇప్పటికే వినూత్న రీతిలో ప్రభుత్వం పుస్తకాలను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని బడి తెరిచిన తొలి రోజే పిల్లల చేతిలో పెట్టేందుకు ప్రభుత్వం సకల ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నడూ లేని విధంగా పాఠశాలల ప్రారంభం రోజే విద్యాకానుక పేరుతో విద్యార్థులకు వస్తువులను అందజేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. వరుసగా ఈ ఏడాది కూడా పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఈ విద్యాకానుక వస్తువుల్లో పాఠ్యపుస్తకాలు ప్రధానమైనవి. ఇప్పటికే పాఠ్యపుస్తకాలను ప్రింటర్స్ నుంచి నేరుగా జిల్లా కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. వీటిని జిల్లా కేంద్రం నుంచి మండలాలకు తరలిస్తున్నారు. ఈ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. 8,9,10 క్లాసుల పుస్తకాలు నేరుగా మండల కేంద్రాలకు.. 8, 9, 10 తరగతులకు సంబంధించి సెమిస్టర్–1 పాఠ్యపుస్తకాలు నేరుగా ముద్రణా కేంద్రం నుంచి మండల విద్యాశాఖాధికారి కార్యాలయానికి చేరుకుంటున్నాయి. వీటిని మండల కేంద్రంలో భద్రపరుస్తున్నారు. ఈ మూడు తరగతులకు కలిపి 8,12,584 పాఠ్యపుస్తకాలు అవసరమని నిర్ణయించారు. 8వ తరగతికి 2,32,698 అలాగే 9వ తరగతికి 3,12,532, ఇక 10వ తరగతికి 2,67,621 పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు అందజేయనున్నారు. ఇందులో 40 శాతం మేర పుస్తకాలు మండల కేంద్రాలకు చేరుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఆన్లైన్లోనూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠ్యపుస్తకాలను పీడీఎఫ్ రూపంలో ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉండే విధంగా విద్యా శాఖ తగు చర్యలు తీసుకుంది. ఈ ఏడాది జిల్లా నుంచి ఇప్పటికే 28210 మంది ఆన్లైల్లో పుస్తకాలు డౌన్లోడ్ చేసుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అలాగే కోడ్ స్కాన్ చేస్తే దీక్ష పోర్టల్లో పాఠాల వీడియోలు కూడా ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. మండల కేంద్రాలకు తరలిస్తున్నాం ప్రింటర్స్ నుంచి జిల్లా గోడౌన్కు చేరుకున్న పుస్తకాలను వెంటవెంటనే ప్రత్యేక వాహనాల్లో మండల కేంద్రాలకు తరలిస్తున్నాం. 8–10 తరగతుల పుస్తకాలు నేరుగా ప్రింటర్స్ నుంచి ఎంఈఓ కేంద్రాలకు చేరుకుంటున్నాయి. ఎంఈఓలు వారి పరిధిలోని పాఠశాలలకు విద్యార్థుల సంఖ్యను బట్టి వాటి సరఫరా పూర్తిచేస్తారు. – ఎన్.సతీష్, మేనేజర్, జిల్లా ప్రభుత్వ పాఠ్యపుస్తక కార్యాలయం, శ్రీకాకుళం బడి తెరిచే రోజే.. పాఠశాలలు ప్రారంభమైన తొలి రోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన. అందుకు అనుగుణంగా ఉన్నతాధికారుల సూచనల మేరకు విద్యాశాఖ తరఫున అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఆన్లైన్లో కూడా పాఠ్యపుస్తకాల పీడీఎఫ్ కాపీలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. – కె.వెంకటేశ్వరరావు, జిల్లా విద్యాశాఖాధికారి బడి తెరిచే నాటికి పాఠ్యపుస్తకాలు రెడీ జిల్లాకు చేరుకుంటున్న పాఠ్యపుస్తకాలు విద్యాశాఖ పాఠ్యపుస్తకాల కేంద్రానికి 1 నుంచి 7 తరగతుల పుస్తకాల రాక 8,9,10 తరగతుల పాఠ్యపుస్తకాలు ముద్రణా కేంద్రాల నుంచి ఎంఈఓ కార్యాలయానికి చేరవేత ఆన్లైన్లో పీడీఎఫ్ రూపంలో అందుబాటులో ఉన్న పాఠ్యపుస్తకాలు జిల్లాకు 7.37లక్షల పాఠ్యపుస్తకాలు.. జిల్లా వ్యాప్తంగా జూన్ 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. జిల్లాలో 30 మండలాల పరిధిలో 2155 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు ఉన్నాయి. ఆ రోజు విద్యార్థులకు ప్రస్తుత సెమిస్టర్కు సంబంధించిన పాఠ్యపుస్తకాలను బడులకు చేరవేస్తున్నారు. పాఠశాలలు తెరిచిన రోజే పిల్లలకు వీటిని పంపిణీ చేయానికి విద్యాశాఖాధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా అధికారులు తగు చర్యలు తీసుకున్నారు. సెమిస్టర్–1కు సంబంధించి ఒకటి నుంచి 7వ తరగతి వరకు 7,37,662 బుక్స్ అవసరమని గుర్తించారు. గత ఏడాది పంపిణీ చేయగా మిగిలిన 1,10,737 బుక్స్తో కలిపి 6,26,925 బుక్స్ ప్రింటర్స్ నుంచి జిల్లా గోడౌన్కు చేరాల్సి ఉంది. ఇప్పటి వరకు 3,76,327 పాఠ్యపుస్తకాలను మండల కేంద్రాలకు తరలించారు. మిగిలిన పుస్తకాలను శరవేగంగా పంపిణీ చేస్తున్నారు. -
కోరం లేక పలాస మున్సిపల్ సమావేశం వాయిదా
కాశీబుగ్గ : పలాస–కాశీబుగ్గ మున్సిపల్ సమావేశ మందిరంలో గురువారం జరగాల్సిన మే నెల సర్వసభ్య సమావేశం కోరం లేక వాయిదాపడింది. ఉదయం 11 గంటలకు తెలుగుదేశం పార్టీకి చెందిన తొమ్మిది మంది కౌన్సిలర్లతో పాటు మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు మాత్రమే హాజరయ్యారు. 21 మంది వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు, ముగ్గురు కో ఆప్షన్ సభ్యులు హాజరుకాకపోవడంతో కోరం సరిపోలేదు. కొద్దిసేపు వేచి చూసిన అనంతరం చైర్మన్ గిరిబాబు సమావేశం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు అధికార పార్టీకి దూరంగా ఉన్నారని, అందుకు నిరసనగా వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు బాయ్కాట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మున్సిపల్సమావేశం సందర్భంగా టీడీపీ, వైఎస్సార్ సీపీ మధ్య గొడవలు జరుగుతాయని పోలీసులు ఊహించారు. దీంతో కాశీబుగ్గ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు కాశీబుగ్గ ఎస్ఐ వెంకటరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో గస్తీ కాశారు. అయితే కోరం లేక సమావేశం వాయిదా పడింది. ఈ తరుణంలో మున్సిపల్ సమావేశానికి ముందు ఓ తెలుగుదేశం నాయకుడు మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సమావేశ మందిరంలో ఉన్న మంత్రి నేమ్ ప్లేట్ను విరగ్గొట్టడం చర్చనీయాంశమైంది. -
‘రైతులకు రశీదులు తప్పనిసరిగా ఇవ్వాలి’
టెక్కలి: ఖరీఫ్ సీజన్కు సంబంధించి రైతులకు విత్తనాలు విక్రయించే ప్రైవేటు డీలర్లు తప్పనిసరిగా రశీదులు ఇవ్వాలని జిల్లా వ్యవసాయాధికారి కె.శ్రీధర్ ఆదేశించారు. టెక్కలి సబ్ డివిజన్ పరిధిలో గల వ్యవసాయాధికారులు, ప్రైవేట్ విత్తనాల డీలర్లతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలను నిర్దేశించిన ధరలకే అమ్మకాలు చేయాలని పేర్కొన్నారు. అలాగే విత్తనాల ధరల పట్టికలను కచ్చితంగా ఉంచాలన్నారు. ఎక్కడైనా కృత్రిమ కొరత సృష్టించి, నకిలీ విత్తనాలు విక్రయించినట్లు తెలిస్తే ఆయా డీలర్లపై చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్ హెచ్చరించారు. సమావేశంలో ఏడీ బీవీ తిరుమలరావు తో పాటు నాలుగు మండలాలకు చెందిన వ్యవసాయాధికారులు పాల్గొన్నారు. -
పులికందిరీగల దాడిలో వృద్ధురాలు మృతి
వజ్రపుకొత్తూరు రూరల్: మండలం పల్లిసారథి గ్రామానికి చెందిన వృద్ధురాలు బత్తిని మాకమ్మ(75) పులికందిరీగల దాడిలో మృతి చెందారు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలు మేరకు మాకమ్మ మంగళవారం సాయంత్రం గ్రామానికి సమీపంలో ఉన్న తోట నుంచి ఇంటికి వస్తున్న తరుణంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పులికందిరీగల దాడిలో తీవ్రంగా గాయపడిన మాకమ్మను కాశీబుగ్గలో గల ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు తెలిపారు. తోటల్లో పులికందిరీగలు ఎక్కువగా ఉన్నాయని తోటలకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని జీడి రైతులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యంకాశీబుగ్గ: మందస మండలం కొండలోగాం పంచాయతీ పరిధిలోని రామరాయ, కొయ్యడూరి గ్రామాల మధ్య పంటపొలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులకు గురువారం మృతదేహం కనిపించడంతో వారు మందస పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు మృతదేహాన్ని గుర్తించి హరిపురం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. అయితే మృతుడి వివరాలు తెలియరాలేదు. అతడి వివరాలు ఎవరికై నా తెలిస్తే మందస పోలీసు స్టేషన్కు సమాచారం అందించాలని ఎస్ఐ బి.అనిల్కుమార్ కోరారు. 6309990865, 9912261521 నంబర్లను సంప్రదించాలని సూచించారు. గొడవలకు దిగితే కఠిన చర్యలు శ్రీకాకుళం క్రైమ్ : ఎన్నికల ఫలితాల లెక్కింపు ప్రక్రియ సమీపిస్తున్న నేపథ్యంలో కారణం లేకుండా గొడవల్లో పాల్గొంటే సహించేది లేదని శ్రీకాకుళం డీఎస్పీ యర్రగుంట శృతి రౌడీషీటర్లను హెచ్చరించారు. నగరంలోని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద గురువారం ఆమె మాట్లాడుతూ ఫలితాలు వెలువడ్డాక రాజకీయ పార్టీల ప్రమేయంతో కవ్వింపు చర్యలకు దిగినా, ధర్నాలు, ర్యాలీల్లో మీ పాత్ర ఉందని తెలిసినా కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ నెల 6 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందన్నారు. 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ కూడా ఉన్నందున నలుగురికంటే ఎక్కువమంది గూమిగూడి ఉండకూడదని, ఇంటికి సాయంత్రం వేళల్లో త్వరగా వెళ్లిపోవాలని హితవు పలికారు. బాణసంచా, డీజేలకు అనుమతి లేదని, మద్యం తాగి అల్లర్లకు దిగరాదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎస్ఐ బలివాడ గణేష్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. -
ముగిసిన ఇంటర్ సప్లిమెంటరీ
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ (ప్రధాన జనరల్ కోర్సుల) పరీక్షలు గురువారంతో ముగిశాయి. కొన్ని కేంద్రాల్లో మాత్రమే ఒకేషనల్/బ్రిడ్జి కోర్సుల విద్యార్థులు పదుల సంఖ్యలో మరో రెండు రోజులపాటు పరీక్షలు రాస్తారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 24వ తేదీ నుంచి 51 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షల్లో భాగంగా.. రెండు సెషన్లుగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఆఖరి రోజు గురువారం కామర్స్, కెమిస్ట్రీ పేపర్లకు ఉదయం ఫస్టియర్ విద్యార్థులు 7129 మంది పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 6,765 మంది పరీక్ష రాశారు. 364 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం సెకెండియర్ విద్యార్థులు 2221 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 2109 మంది పరీక్షకు హాజరయ్యారు. 112 మంది డుమ్మా కొట్టారు. మొత్తం మీద ఆఖరి రోజు 476 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలపై నిరంతరం ఫోకస్.. ఇంటర్మీడియెట్ విద్య జిల్లా డీవీఈఓ కోట ప్రకాశరావు, ఇంటర్మీడియెట్ బోర్డు ఆర్ఐఓ ప్రగడ దుర్గారావు, డీఈసీ కమిటీ సభ్యులు బొమ్మలాట శ్యామ్సుందర్, గూన సింహాచలం, కీర్తి తవిటినాయుడు, ఇతర అధికారులు నిరంతరం పర్యవేక్షించారు. వీరితోపాటు మూడు ఫ్లయింగ్, రెండు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు పరీక్ష కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలను చేపట్టారు. ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులు ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా పరీక్ష కేంద్రాలపై ఫోకస్ చేశారు. మరో మూడు నాలుగు రోజుల్లో ఈ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన జవాబుపత్రాలను ఆన్లైన్లో మూల్యాంకనం మొదలుపెట్టేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. -
No Headline
2023లో జరిగిన ప్రమాదాలను పరిశీలిస్తే.. రహదారులు ఘోర ప్రాణాంతకం కాని ప్రమాదాలు ప్రమాదాలునేషనల్ హైవే 139 167 స్టేట్ హైవే 58 133 ఇతర రోడ్లు 84 229 గడిచిన మూడేళ్లలో జిల్లాలోని రోడ్డు ప్రమాదాల పరిస్థితి సంవత్సరం జరిగిన చనిపోయిన గాయాలైన ప్రమాదాలు వారు వారు 2021 722 252 843 2022 811 270 1003 2023 810 297 902 గడిచిన మూడేళ్లలో జిల్లాలోని రోడ్డు ప్రమాదాల పరిస్థితి సంవత్సరం జరిగిన చనిపోయిన గాయాలైన ప్రమాదాలు వారు వారు 2021 722 252 843 2022 811 270 1003 2023 810 297 902 2023లో జరిగిన ప్రమాదాలను పరిశీలిస్తే.. రహదారులు ఘోర ప్రాణాంతకం కాని ప్రమాదాలు ప్రమాదాలునేషనల్ హైవే 139 167 స్టేట్ హైవే 58 133 ఇతర రోడ్లు 84 229 -
1000 లీటర్ల సారా ఊట ధ్వంసం
మెళియాపుట్టి: మండలంలోని మామిడి గుడ్డి గిరిజన గ్రామంలో డీటీఎఫ్, ఎస్ఈబీ, ఇంటెలిజెన్స్ బృందాలు గురువారం సారా తయారీ స్థావరాలపై దా డులు చేశాయి. ఈ దాడుల్లో 1000 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. 40 లీటర్ల నాటు సారాని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం తయారీ నేరమని, గిరిజన యువత తమ భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని అన్నారు. దాడుల అనంతరం ఆయా గ్రామాల ప్రజలకు నాటుసారా తయారీ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. టెక్కలి ఎస్ఈబి సిఐ రాజశేఖర్ నాయుడు, ఎస్ఈబీ సిబ్బంది పలువురు ఉన్నారు. -
రూ.10 లక్షలు దోపిడీ కేసులో మరొకరి అరెస్టు
సారవకోట: మండలంలోని ధర్మలక్ష్మీపురం గ్రామానికి సమీపంలో ఇటీవల ఒక కాంట్రాక్టర్ దగ్గర నుంచి పోలీసులమని చెప్పి రూ.10 లక్షలు దోపిడీ చేశారు. ఈ కేసులో మరొకరిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ అప్పారావు తెలిపారు. ఈ దోపిడీలో 12 మంది ఉన్నారని ఇప్పటివరకు 11 మందిని అరెస్టు చేసి రిమాండ్ పంపించామని, గురువారం ఆ దోపిడీలో ప్రధాన నిందితుడు శివ ప్రసాద్ను అరెస్టు చేసి రిమాండ్కు పంపించామన్నారు. 16న జిల్లా స్విమ్మింగ్ సంఘ ఎన్నికలు శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం జూన్ 16వ తేదీన జరగనుందని ఆ సంఘ జిల్లా అధ్యక్షు డు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేఎన్ఎస్వీ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీకాకుళం నగరంలోని సానావీధిలో ఉన్న హారికా కన్స్ట్రక్షన్స్ కార్యాలయంలో ఆ రోజు ఉదయం 10 గంటలకు స్విమ్మింగ్ అసోసియేషన్ సమావేశంతో పాటు నూతన కార్యవర్గ ఎన్నికలను కూడా నిర్వహి స్తున్నట్టు పేర్కొన్నారు. సమావేశానికి స్విమ్మింగ్ అసోసియేషన్ నాయకులు, కార్యవర్గ సభ్యులు, సీనియర్ స్విమ్మర్లు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని హారికాప్రసాద్ కోరారు. రాత్రి గస్తీలు మరింత ముమ్మరం శ్రీకాకుళం క్రైమ్ : ఎన్నికల లెక్కింపు ప్రక్రియ సమీపిస్తున్న వేళ ఎస్పీ ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా పోలీసులు రాత్రివేళల్లో (నైట్) గస్తీలు మరింత ముమ్మరం చేశారు. చెక్ పోస్టుల్లోను, మద్యం దుకాణాలు, వ్యాపార సముదాయాలు, ముఖ్య కూడళ్లలో వాహనాలు తనిఖీ చేస్తూ అక్రమ రవాణాకు అవకాశం లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. శ్రీకాకుళం నగర పరిధిలో ట్రాఫిక్ సీఐ ఎం.అవతారం బుధవారం అర్ధరాత్రి దాటాక పలు లాడ్జీలు, ఆర్టీసీ కాంప్లెక్సు, బలగ, ఉమెన్స్ కాలేజీ, అరసవల్లి కూడళ్లలో గస్తీ విధులు నిర్వర్తించి అనుమానితులున్న చోట వారిని ఆపి వివరాలు సేకరించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి ●● డీఎంఓ జగన్ మోహనరావు సీతంపేట: మలేరియా, డెంగీ వంటి సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా నివారణ అధికారి టి. జగన్ మోహనరావు అన్నారు. గురువారం స్థానిక ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. జ్వరపీడితుల్లో మలేరియా పాజిటివ్ లక్షణాలున్న వ్యక్తులతో మాట్లాడుతూ, వైద్య సేవలు అందుతున్న వైనంపై ఆరా తీశారు. ఎన్ని మలేరియా కేసులు ఉన్నాయో రికార్డులు పరిశీలించి వైద్యాధికారులతో మాట్లాడారు. అనంతరం ల్యాబ్ తనిఖీ చేశారు. ప్రతిరోజూ నిర్వహిస్తున్న జ్వరనిర్ధారణ పరీక్షలు, వాటి నివేదికలపై అడిగి తెలుసుకున్నారు. రోజువారీ నివేదికలను ఎప్పటికప్పుడు జిల్లా మలేరియా నివారణా కార్యాలయానికి తెలియజేయాలన్నారు. ఏ ప్రాంతంలో జ్వరాలు ప్రబలయో తెలుసుకుని సంబంధిత వైద్యాధికారులను క్షేత్రస్థాయికి పంపించి నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం కుశిమి పీహెచ్సీని సందర్శించారు. కార్యక్రమంలో ప్రాంతీయ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, దోనుబాయి పీహెచ్సీ వైద్యాధికారి భానుప్రతాప్, ఏఎంఓ సూర్యనారాయణ, కన్సల్టెంట్ శ్రీకాంత్, సబ్యూనిట్ ఆఫీసర్ మోహనరావు, తదితరులు పాల్గొన్నారు. -
బండి.. కొత్త చట్టమండీ!
శ్రీకాకుళం క్రైమ్ : మైనర్లు ప్రాణాలు తీస్తున్నారు. నిర్లక్ష్యంగా బైక్ డ్రైవింగ్ చేస్తూ నిండు ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారు. బైక్ నడిపేందుకు వయసు, అనుమతి లేకపోయినా రయ్మంటూ పోనిస్తూ పా దచారులు, వాహనదారులను వణికిస్తున్నారు. వీరికి తోడు మందు బాబులు కూడా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. జిల్లాలో ఈ మధ్య జరిగిన ఎన్నో రోడ్డు ప్రమాదాలే ఇందుకు సాక్షి. ఇకపై వీరి ఆగడాలు సాగకుండా జూన్ 1 నుంచి కొత్త వాహన చట్టాన్ని అమలులోకి తీసుకురానున్నారు. సవరించిన చట్టం (కొత్త చట్టం) ప్రకారం.. ● ప్రస్తుతం ఉండే వాహన చట్టం ప్రకారం మైనర్లకు వాహనాలిచ్చి ప్రమాదాలకు గురైతే రూ. వెయ్యి జరిమానా, నేరం నిరూపితమయ్యే వరకు జువైనల్ కోర్టుకు బాలుడు ప్రతి శుక్రవారం హాజరయ్యే ప్రక్రియ ఉండేది. బాధితుల తరఫు వారు, బాలుడి తరఫు వారు మాట్లాడుకునేదాన్ని బట్టి ఉండేది. ● కానీ కొత్తగా సవరించిన చట్టం ప్రకారం మైనర్లకు వాహనాలు ఇస్తే ఆ బండి ఎవరి పేరున ఉంటే(తల్లిదండ్రులకు గానీ సంరక్షకులకు గానీ) రూ. 25 వేలు జరిమానాతో పాటు మూడేళ్లు జైలు శిక్ష విధిస్తారు. ● మద్యం సేవించి వాహనాలు నడిపేవారికి గతంలో రూ. 2 వేలు జరిమానా, ఆరు నెలలు జైలు శిక్ష ఉండేది. కొత్త చట్టం ప్రకారం రూ. 10 వేలు జరిమానాతోపాటు ఆరు నెలల జైలు శిక్ష ఉంటుందని ఎస్పీ జీఆర్ రాధిక తెలిపారు. నియమాలు పాటించాల్సిందే.. రోడ్డు నియమ నిబంధనలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, జిల్లాలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాల్సిందేనని ఎస్పీ తెలిపారు. లేకుంటే భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రాణం చాలా విలువైందని, కొద్దిపాటి నిర్లక్ష్యం వహించినా కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగుల్చుతుందన్నారు. లైసెన్సు ఉంటేనే వాహనాలను నడపాలని, ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు సంకేతాలను పాటించాలని, సెల్ఫోన్ డ్రైవింగ్, మద్యం తాగి వాహనాలు నడపరాదని, కార్లలో సీట్బెల్టు తప్పనిసరని ఎస్పీ సూచించారు. జూన్ 1 నుంచి అమల్లోకి కొత్త వాహన చట్టం మైనర్లకు వాహనాలిస్తే జైలే మందుబాబులకు భారీగా జరిమానాలు డ్రంక్ అండ్ డ్రైవ్ 2023లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 150 నమోదయ్యాయి. 2023 సెప్టెంబరు నుంచి చట్టాలపై భయం ఉండాలని ఈ కేసులకు ఎఫ్ఐఆర్ వేయడం మొదలుపెట్టారు. 2024 జనవరి నుంచి ఇప్పటివరకు 243 కేసులకు ఎఫ్ఐఆర్ వేశారు. మైనర్లకు సంబంధించి.. ప్రమాదాల్లో 2022లో ఒకటి, 2023లో 07, 2024లో ఒకటి కేసులు నమోదైనట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. -
కీలకం
విత్తన ఎంపికే ఆమదాలవలస రూరల్: ఖరీఫ్ సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది. రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు. అయితే ఖ రీఫ్లో విత్తనాల ఎంపికే అన్నింటి కంటే కీలకమని వ్యవసాయ శాఖాధికారులు అంటున్నారు. ఏ రకం వేస్తే తెగుళ్లను, వాతావరణ పరిస్థితులను తట్టుకుని అధిక దిగుబడులు ఇస్తుందో తెలుసుకుని సాగు చేయాలని సూచిస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో దాదాపు 5 నెలల కాలపరిమితిలో పంట సాగు చేస్తే ధాన్యం దిగుబడులు చేతికి వ స్తాయి. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే రైతులకు అందుబాటులోకి రైతు భరోసా కేంద్రాలను తీసుకువచ్చి వాటి ద్వారా రైతులకు విశిష్ట సేవలను అందిస్తోంది. వ్యవసాయాన్ని పండగలా చేసుకునే విధంగా ప్రభుత్వం రైతులకు అనేక సంక్షేమ పథకాలతో పాటు రైతు లకు కావాల్సిన విత్తనాలను సరఫరా చేస్తోంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఏ రకం విత్తనాలు కావాలో ముందుగానే ఆర్డర్ చేసుకోవడం వల్ల ప్రతి రైతుకు సకాలంలో విత్తనాలు అందుతున్నాయి. ఇలాంటి సమయంలో రైతులకు నచ్చిన విత్తనాలను ఎంపిక చేసుకునేందుకు శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు పలు సూచనలు చేస్తున్నారు. జిల్లాలోని 30 మండలాల పరిధిలో 1.78 లక్షల హెక్టార్లల్లో వరి సాగవుతోంది. జిల్లాలో ఇప్పటికే 656 రైతు భరోసా కేంద్రాల ద్వారా 35,009 క్వింటాళ్ల విత్తనాలను రైతులకు సబ్సిడీపై అందజేసేందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు పూర్తి చేసింది. రైతులు తగిన విత్తనాలను ఎంపిక చేసుకుని సాగు చేసుకుంటే అధిక దిగుబడులు సాధించగలరని మండల వ్యవసాయాధికారి మెట్ట మోహనరావు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. గత మూడేళ్లుగా రైతులు వరిసాగు చేసి ప్రయోగాత్మకంగా వాటి ఫలితాలు రావడంతో వరి విత్తనాల రకాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. అందుబాటులో ఉన్న విత్తనాలు ● ఎంటీయూ 1121 శ్రీ ధృతి రకం పంటకాలం 140–142 రోజులు. ఎకరాకు 28.30 బస్తాల దిగుబడి వస్తుంది. ఆకు ముడత పురుగును తట్టుకునే రకం. ● ఎంటీయూ 7029 స్వర్ణ రకం పంటకాలం 150– 152 రోజులు. ఎకరాకు 26.50 బస్తాల దిగుబడి వచ్చినా గింజ పరిమాణం రైతులకు నచ్చడం లేదు. ● బీపీటీ 5204 సాంబమసూరి రకం పంటకాలం 143–145 రోజులు. ఎకరాకు 28.50 బస్తాల దిగుబడి వచ్చినా గింజ నాణ్యత, దిగుబడులు రైతులకు నచ్చడం లేదు. ● ఎంటీయూ 1318 రకం పంట కాలం 155–160 రోజులు. ఎకరాకు 30 బస్తాల దిగుబడి వస్తుంది. అధిక పిలకలు వేసి దిగుబడి బాగున్నప్పటికీ అప రాలు చేస్తున్న ప్రాంతానికి అనువుగా లేదు. వరి తర్వాత మొక్కజొన్న, వేరుశనగ, నువ్వులు సాగు చేస్తున్న ప్రాంత రైతులు ఆసక్తి చూపుతున్నారు. ● ఆర్జీఎల్ 2537 శ్రీకాకుళం సన్నాలు రకం 160 రోజుల్లో ఎకరాకు 30 బస్తాల దిగుబడి వస్తుంది. మధ్యస్థ సన్న గింజ రకం, 160 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతుంది. చేను ఎక్కువగా పడిపోతుంది. ● ఎంటీయూ 1224 మార్టేరు సాంబ రకం 135 రోజుల్లో ఎకరాకు 26 నుంచి 28 బస్తాల దిగుబడి వస్తుంది. పంట చేను పడిపోదు. బియ్యం పారదర్శకంగా ఉండి అన్నానికి అనుకూలం. ● బీపీటీ 3291 సోనామసూరి రకం 135 నుంచి 140 రోజుల్లో ఎకరాకు 25 బస్తాల దిగుబడి వస్తుంది. గింజ సన్నంగా ఉండి, అన్నానికి బాగుంటుంది. ● ఎంటీయూ 1061 ఇంద్ర రకం పంట కాలం 150 రోజులు. ఎకరాకు 30 బస్తాల దిగుబడి వస్తుంది. సన్న గింజగా ఉండి తెలుపు రంగులో ఉంటుంది. చేను పడిపోదు. 10 రోజుల వరకు ముంపును, కొద్దిపాటి చౌడును తట్టుకుంటుంది. అన్నానికి అనుకూలం. ● ఎంటీయూ 1064 అమర రకం 150 రోజుల్లో ఎకరాకు 25 బస్తాల దిగుబడి వస్తుంది. చేను పడిపోదు. గింజ రాలదు. సన్న రకం గింజ. ముంపును బాగా తట్టుకుంటుంది. సబ్సిడీపై రైతులకు వరి విత్తనాలు 656 రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీకి చర్యలు రైతులకు అందుబాటులో పలు రకాల వరి విత్తనాలు జిల్లాలో వరి విస్తీర్ణం 1.78 లక్షల హెక్టార్లు అందుబాటులో ఉన్న వరి విత్తనాలు 35,009 క్వింటాళ్లు -
ఆదిత్యుని సన్నిధిలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్
అరసవల్లి: సూర్యక్షేత్రం అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామిని రాష్ట్ర అటవీ, ఇంధన, సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరభ్కుమార్ ప్రసాద్ కుటుంబసమేతంగా బుధవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ సంప్రదాయం ప్రకారం ఆలయ సూపరింటెండెంట్ కృష్ణమాచార్యులు, అర్చకులు ఇప్పిలి రంజిత్ శర్మలు గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. ఆలయ విశిష్టతను వివరిస్తూ.. నీరబ్ కుమార్ కుటుంబ సభ్యుల గోత్రనామాలతో విశేష పూజ లు చేయించారు. అనంతరం వేదాశీర్వచనాన్ని అందజేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అ నంతరం శ్రీకూర్మనాథుడిని దర్శించుకున్నారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కంచిలి: మండలంలోని బూరగాం గ్రామం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులు బుధవారం ఫిర్యాదు చేయడంతో పోలీసులు వివరాలు తెలిపారు. బూ రగాం గ్రామానికి చెందిన బుడ్డ మోహిని గ్రామాల్లో తిరుగుతూ వివిధ రకాల పప్పులు అమ్ముకొని జీవనం గడుపుతుండేది. ఎప్పటి లాగే మంగళవారం ఇంటినుంచి బయలుదేరి జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న కోళ్లు తీసుకెళ్లే వాహన డ్రైవర్తో మాట్లాడుతుండగా, ఇచ్ఛాపురం నుంచి పలాస వైపు వెళ్లే అశోక్ లేలాండ్ మినీ వ్యాన్ అతివేగంగా వచ్చి, ఆగి ఉన్న కోళ్ల వాహనాన్ని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆగి ఉన్న వాహనం కదిలి బూర గాం గ్రామానికి చెందిన బుడ్డ మోహినిని ఢీకొట్టడంతో ఆమె తలకు, ఛాతీకి తీవ్రగాయాలయ్యాయి. ఆమెతోపాటు ప్రమాదానికి కారణమైన వాహనంలో ప్రయాణిస్తున్న కాకినాడ దగ్గరలో గల పెద్దాపురం మండలం గోరంట్ల గ్రామానికి చెందిన డ్రైవర్ కలగ నానికి స్వల్ప గాయాలవ్వగా, పక్కన ఉన్న మరోవ్యక్తి నాయుడు జయ బాబుకు కాళ్లు విరిగాయి. దీంతో వీరిని హుటాహుటిన సోంపేట ప్రభుత్వా స్పత్రిలో చేర్పించారు. తీవ్రగాయాలపాలైన మోహినిని అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం జెమ్స్కు తరలించారు. మోహిని సోద రుడు బుడ్డ గణేష్ ఫిర్యాదు మేరకు కంచిలి ఎస్ఐ వి.రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బెజ్జిపురంలో చోరీ ఎచ్చెర్ల: లావేరు మండలంలోని బెజ్జిపురం గ్రామంలో పదహారున్నర తులాల బంగారు వస్తువులు, రూ.17 వేలు నగదు చోరీ చేశారు. వివరాల్లోకి వెళితే బెజ్జిపురం గ్రామానికి చెందిన తాళ్లాబత్తుల సూరిబాబు తన కుటుంబంతో కలిసి ఎస్.కోటలోని కూతురి ఇంటికి సోమవారం వెళ్లి తిరిగి బుధవారం వచ్చారు. ఇంటి తలుపు తీసి చూడగా ఇంటి వెనుక డోర్ తీసి ఉంది. పైన ఉన్న రూము డోర్ కూడా తీసి ఉండటంతో పాటు చెక్క బీరువా పగలగొట్టి ఉంది. అందులో ఉన్న బంగారు వస్తువులు, నగదు కనిపించకపోవడంతో సూరిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లావేరు ఎస్ఐ సీహెచ్ స్వామినాయుడు కేసు నమోదు చేశారు. విజ్ఞానం పెంపొందించుకోవాలి శ్రీకాకుళం అర్బన్: చదువుతో పాటు విద్యార్థులకు విజ్ఞానం కూడా అవసరమని జిల్లా గ్రంథాలయ కార్యదర్శి బి.కుమార్రాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా బుధవారం విద్యార్థులకు సమాజం అంటే ఏమిటి, సమాజంలో ఎలా వ్యవహరించాలో రిసోర్స్ పర్సన్ తిరుపతిరావు విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు సులభంగా గణితం చేయటంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ డిప్యూటీ లైబ్రేరియన్ వీవీజీఎస్ శంకరరావు, అసిస్టెంట్ లైబ్రేరియన్ పీవీ భాస్కరరాజా, విద్యార్థులు పాల్గొన్నారు. -
మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి
టెక్కలి: విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని సంఘం అధ్య క్షుడు ఎల్.రామకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం టెక్కలి సమీపంలో సంఘ సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 20 ఏళ్లుగా నుంచి మీటర్ రీడర్లుగా పనిచేస్తున్నా కనీసం ఉద్యోగ భద్రత లేకుండా పోయిందన్నారు. సంస్థకు ఆదాయాన్నిచ్చే విభాగంలో కాంట్రాక్టర్ల వద్ద విధులు నిర్వర్తిస్తున్న మీటర్ రీడర్ల సమస్యలపై గతంలో యాజమాన్యం హామీలిచ్చినప్పటికీ వాటిని అమలు చేయలేదన్నారు. కేంద్రం తీసుకువచ్చిన స్మార్ట్ మీటర్ల విధానంతో మీటర్ రీడర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సంఘం ప్రతినిధులు ఆర్.కుమారస్వామి, వి.ప్రసాద్, పి.శ్రీనివాసరావు, సీహెచ్.అప్పలనాయుడు, తులసీదాస్, ఎం.కృష్ణ, కె.శంకరరావు పాల్గొన్నారు. -
స్ట్రాంగ్ రూమ్ల భద్రతపై సమీక్ష
ఎచ్చెర్ల క్యాంపస్: స్థానిక శివానీ ఇంజినీరింగ్ కాలేజ్లో జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్లను ఎస్పీ జీఆర్ రాధిక బుధవారం పరిశీలించి, కళాశాలలో కౌంటింగ్ రోజు భత్రత ఏర్పాట్లపై సమీక్షించారు. కౌంటింగ్కు ప్రణాళిక ప్రకారం భద్రత ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఏజెంట్లు, పోటీ చేసిన అభ్యర్థుల ప్రవేశ మార్గాలు, వాహనాల పార్కింగ్, మూడంచెల భద్రత పర్యవేక్షించారు. ట్రాఫి క్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవటం, జనాలు గుమిగూడకుండా ప్రత్యేక దృష్టి పెట్ట డం వంటి అంశాలపై చర్చించారు. కౌంటింగ్ ప్రక్రియ ఎన్నికలు సంఘం మార్గదర్శకాల మేర కు జరగాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ జి.ప్రేమ్కాజల్, డీఎస్పీలు వై.శృతి, ఎల్.శేషాద్రి నాయుడు పాల్గొన్నారు. 31న పాసింజర్ రైలు రద్దు కాశీబుగ్గ: పలాస నుంచి విశాఖపట్నం, విశాఖపట్నం నుంచి పలాసకు జిల్లా మీదుగా నడిచే పాసింజర్ రైలు(07471/07470) ఈ నెల 31వ తేదీన రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే చీఫ్ పాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ మేనేజర్ డీఆర్ పాల్ భువనేశ్వర్ రైల్సదన్ నుంచి సమాచారాన్ని అ న్ని రైలు నిలయాలకు చేరవేశారు. పూండి–నౌ పడ అప్లైన్లో ఉన్న బ్రిడ్జి నంబర్లు 1221/1222 వద్ద మరమ్మతులు చేపడుతున్న సందర్భంగా నిలిపివేస్తున్నామని, అదేవిధంగా రైలు నంబర్ 06090 సంత్రగచి–తెంబరావ స్పెషల్ ఎక్స్ప్రెస్ 31వ తేదీ మూడున్నర గంట లు ఆలస్యంగా నడుస్తుందని, 20896 భువనేశ్వర్–రామేశ్వర్ ఎక్స్ప్రెస్ 31వ తేదీ గంట సమ యం ఆలస్యంగా నడుస్తుందని, 06222 ముజాఫర్–మైసూర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలు 30వ తేదీ గంటంపావు ఆలస్యంగా నడుస్తుందని తెలిపా రు. 29వ తేదీన 06104 డిబ్రుఘర్–న్యూనాగర్కోల్ స్పెషల్ రైలు నాలుగు గంటలు ఆలస్యంగా నడిచిందని తెలిపారు. రైలు రద్దుతో పాటు సమయాల్లో మార్పులను గమనించి జిల్లా ప్రయాణికులు సహకరించాలని కోరారు. -
జూన్ 29న జాతీయ లోక్ అదాలత్
శ్రీకాకుళం పాతబస్టాండ్: జాతీయ లోక్ అదాలత్ను జూన్ 29న నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యా యమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షుడు జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. జిల్లా కోర్టులోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 29న జరగబోయే జా తీయ లోక్ అదాలత్లో ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ చేయాలని సూచించారు. మార్చి 16న జరిగిన జాతీయ లోక్ అదాలత్లో పోలీసు సిబ్బంది ఎక్కు వ సంఖ్యలో కేసులు రాజీ చేశారని, అదే స్ఫూర్తితో జూన్ 29న జరిగే జాతీయ లోక్ అదాలత్లో కూడా ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ చేయడానికి కృషి చేయాలని ఆయన కోరారు. పోలీసులు వ్యక్తిగత శ్రద్ధ వహించి కక్షిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లాలోని అదనపు జిల్లా న్యాయమూర్తులు పి.భా స్కరరావు, మహేంద్ర ఫణికుమార్, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఆర్.సన్యాసినాయుడు, అడిషనల్ ఎస్పీ ఉమామహేశ్వరరావు, డిసిఆర్బి సీఐ సోమశేఖర్, పబ్లిక్ ప్రా సిక్యూటర్లు తంగి శివప్రసాద్, సుశీల ఉషా కిరణ్, ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు. -
మద్యం బెల్ట్ దుకాణదారులకు హెచ్చరిక
రణస్థలం: జూన్ నెల 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో మద్యం బెల్ట్ దుకాణదారులు అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ డి.గంగాధరరావు తెలిపారు. మండల కేంద్రంలోని రణస్థలం ఎస్ఈబీ కార్యాలయాన్ని అయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా గతంలో బెల్ట్ షాపుల దుకాణదారులపై నమోదు చేసిన బైండోవర్ కేసులు, సీజ్ చేసిన వాహనాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ రికార్డులు పరిశీలించి తగు సూచనలు చేశారు. ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా జూన్ నెలలో 3, 4, 5వ తేదీల్లో మూడు రోజుల పాటు మద్యం విక్రయాలు నిలిపివేస్తున్నామని, బెల్టుషాపుల్లో మద్యం విక్రయాలు జరగకుండా చూసుకోవాలని తెలిపారు. ఆ సమయంలో మద్యం విక్రయిస్తూ దొరికితే కేసు నమోదు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఎస్ఈబీ ఎస్ఐలు ఎం.రవిప్రసాద్, నాగలక్ష్మి, సిబ్బంది ఉన్నారు. -
దళారులను నమ్మి మోసపోవద్దు
● ఈపీడీసీఎల్ హెచ్ఆర్ సీజీఎం రామకృష్ణ విశాఖ సిటీ: విద్యుత్ శాఖలో ఉద్యోగాలిప్పిస్తామని నకిలీ నియామక పత్రాలను అందిస్తున్న మోసగాళ్లను నిరుద్యోగులు నమ్మొద్దని ఈపీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్(హెచ్ఆర్) ఎం.రామకృష్ణ ఓ ప్రకటనలో సూచించారు. ఏపీఈపీడీసీఎల్లో ప్రస్తుతం ఎలాంటి నియామక ప్రక్రియ చేపట్టడం లేదని తేల్చి చెప్పారు. ఉద్యోగ నియామకాలు చేపడితే ఉద్యోగ ప్రకటన సంస్థ వెబ్సైట్, ప్రముఖ తెలుగు, ఆంగ్ల దిన పత్రికల్లో ప్రకటనలు ఇస్తామన్నారు. ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా పారదర్శకంగా నియామకాలు చేపడతామన్నారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికపై సబ్ స్టేషన్లను నిర్వహించేందుకు కాంట్రాక్టర్లతో సంస్థ ఒప్పందం కుదుర్చుకుంటోందని, అందులో పనిచేసే సిబ్బందితో కానీ, వారి నియామక ప్రక్రియతో కానీ ఏపీఈపీడీసీఎల్కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సంస్థ పేరుతో నియామక పత్రాలు అందించేందుకు కాంట్రాక్టర్లకు కూడా అనుమతి లేదన్నారు. అయినప్పటికీ నిరుద్యోగులకు విద్యుత్ సబ్ స్టేషన్లలో కాంట్రాక్టు ప్రాతిపదికపై పనిచేసే షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులకు నకిలీ నియామక పత్రాలు ఇచ్చి మోసగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వివరించారు. ఇలాంటి నకిలీ నియామకాలను నమ్మి మోసపోవద్దన్నారు. ఏపీఈపీడీసీఎల్లో ఉద్యోగ నియామకాల కోసం www. ap easternpower. com వెబ్సైట్లో గానీ, ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలోని హెచ్ఆర్ డిపార్ట్మెంట్ సీజీఎంను సంప్రదించవచ్చని తెలిపారు. -
జూన్ మొదటి వారంలో భారీ మొక్కలు నాటే కార్యక్రమం
శ్రీకాకుళం అర్బన్: జూన్ మొదటి వారంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక ఉద్య మంలా చేపడతామని శ్రీకాకుళం జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రత్నాల వెంకట వర ప్రసాద్ చెప్పా రు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వివిధ అనుబంధ శాఖల సహకారంతో స్వచ్ఛంద సంస్థలు సంపూర్ణ సహకారాన్ని తీసుకొని పెద్ద ఎత్తున మొ క్కలు నాటుతామని స్పష్టం చేశారు. ప్రాణవాయువును ఇచ్చే మొక్కలు నాటి వేసవి తాపాన్ని కొంతవరకు నివారించవచ్చు అని అన్నారు. మొక్కలు నా టే కార్యక్రమాన్ని అన్ని స్వచ్ఛంద సంస్థలు విధిగా చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతకన్నా ముందు స్టార్ వాకర్స్ క్లబ్ కో–ఆర్డినేటర్ ఎస్.జోగి నాయుడు సారథ్యంలో వివిధ స్వచ్ఛంద సంస్థలు, నడక సంఘాల నాయకులు రత్నాల వెంకట వర ప్రసాద్ను ఘనంగా సత్కరించి సమాజానికి వారు అందించే సేవలను కొనియాడారు. కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు జి.ఇందిరా ప్రసాద్, పీజీ గుప్తా, గుడ్ల సత్యనారాయణ, బెవర వెంకట రవి శంకర్, బత్తుల దేవీప్రసాద్, ఎం.మల్లిబాబు, జి.లక్ష్మి, గురు ఆనందరావు, గుడ్ల జగ్గారావు, జి. వాసుదేవరావు, డాక్టర్ జి.నారాయణరావు, వై. మోహన్, సాయిరామ్, నాగేశ్వర ఈశ్వరరావు పాల్గొన్నారు.
Pagination
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- మార్క్ వుడ్ రాకాసి బౌన్సర్.. పాక్ బ్యాటర్ వణికిపోయాడు..!
- ‘నన్ను టార్గెట్ చేస్తున్నారు’.. డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు
- ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- T20 World Cup 2024: పసికూనల సమరం.. గట్టెక్కిన నమీబియా
- రూ. 200 కోట్ల మోసం కేసులో నిమ్మగడ్డ వాణి అరెస్టు
- తొలి ఫలితం కొవ్వూరు, నరసాపురం
- ఉదయం పరేడ్ గ్రౌండ్స్లో.. సాయంత్రం ట్యాంక్బండ్పై..
- సాధికారతతో పెరిగిన మహిళా ఓటింగ్
- ఆర్వో శ్రీలేఖపై ఈసీ వేటు
- Israel-Hamas war: ఇజ్రాయెల్ దాడుల్లో 53 మంది మృతి
Advertisement