వైభవంగా వాసవీమాత జయంతి
నిజామాబాద్నాగారం: నగరంలో శనివారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి కన్యాకాపరమేశ్వరిమాత జయంతిని వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆర్యవైశ్య పట్టణ సంఘంలో కన్యాకాపరమేశ్వరి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో డోలారోహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణగుప్తా కుటుంబ సమేతంగా హాజరై, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అమ్మ ఆశీర్వాదం ఉంటే అన్ని ఉన్నట్టే అని, అమ్మ ఆశీర్వాదంతో రామరాజ్య స్థాపన కూడా జరుగుతుందన్నారు. తాను ఎల్లప్పుడూ ఇందూర్ ప్రజలకు అండగా ఉంటానన్నారు. నిరుపేద ఆర్యవైశ్యులకు తన ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవలు అందిస్తానని అన్నారు. అనంతరం ఆర్యవైశ్యులలో నిరుపేద వృద్దులకు, వికలాంగులకు నెలవారీ పెన్షన్ కింద తన ట్రస్ట్ ద్వారా నెలకు రూ.200 ఇస్తానని హామీ ఇస్తూ మొదటి నెలగా లబ్దిదారులకు పెన్షన్ ఇచ్చారు. అనంతరం ధన్పాల్ కుటుంబాన్ని వాసవి ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. దొంతుల కాశీవిశ్వనాథంగుప్తా, కొండ నరేంధర్ గుప్తా, పెండ్యాల శ్రీనివాస్ గుప్తా, పాల్తి రవి కుమార్ గుప్తా, గాలి శ్రీనివాస్ గుప్తా, కొండ వీరశేఖర్ గుప్తా, ఆగమయ్య, ఎంసాని రవి, గజవాడ శ్రీనివాస్, ఇల్లెందుల ప్రభాకర్ పాల్గొన్నారు.
సిరికొండ: మండలంలోని తాళ్లరామడుగు రామాలయం ఆవరణలో శనివారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి మాత జయంతి నిర్వహించారు. ఈసందర్భంగా భక్తులకు వాసవి మాత చిత్ర పటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. ఆర్య వైశ్య సంఘం మండలాధ్యక్షుడు మురళి, రామాలయ కమిటీ చైర్మన్ పురుషోత్తం, బూస రాజు, బచ్చు మారుతి పాల్గొన్నారు.
ధర్పల్లి: మండల కేంద్రంలోవాసవి మాత జయంతి వేడుకలను ఆర్యవైశ్యులు శనివారం ఘనంగా జరుపుకున్నారు. మహిళలు అమ్మవారికి పల్లకీసేవ, పారాయణం, కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య సభ్యులు నూకల రాజయ్య, రాజశేఖర్, గంగాధర్, సిద్దేశ్వర, ప్రవీణ్, రాములు తదితరులు పాల్గొన్నారు.
మోపాల్: మండలంలోని కులాస్పూర్ గ్రామంలో ఆర్యవైశ్యులు వాసవీమాతా జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా వాసవీమాతాకు మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.