-
కారుతో ఢీ కొట్టి.. మృతదేహంతో 18 కిలోమీటర్లు..
ఆత్మకూరు: ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తిని కారుతో ఢీకొన్నాడు. ఎగిరి కారుపై పడి మృతిచెందిన యువకుడిని అలాగే 15 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాడు. అటుగా వెళుతున్న వాహనదారులు కారు పైభాగంలో మృతదేహం ఉండటాన్ని గుర్తించి అప్రమత్తం చేయడంతో కారును రోడ్డుపక్కన ఆపి ఉడాయించాడు. సంచలనం రేకెత్తించిన ఈ ఘటన అనంతపురం జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూడేరు మండలం చోళసముద్రం గ్రామానికి చెందిన జెన్నే ఎర్రిస్వామి (35)కి ఆత్మకూరు మండలం సిద్ధరామపురం గ్రామానికి చెందిన మంజులతో వివాహమైంది. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. ట్రాక్టర్ మెకానిక్గా జీవనం సాగిస్తున్న ఎర్రిస్వామి ఆదివారం ద్విచక్ర వాహనంపై అత్తారింటికి వచ్చాడు. రాత్రి ద్విచక్ర వాహనంపై అనంతపురానికి బయలుదేరాడు. జాతీయ రహదారిపై వై.కొత్తపల్లి వద్దకు చేరుకోగా.. ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన ఇన్నోవా కారు ఢీకొంది. దీంతో ఎర్రిస్వామి కారు పైభాగంపై పడి మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ కారును ఆపకుండా నిర్లక్ష్యంగా ముందుకు దూసుకెళ్లాడు. దాదాపు 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత బెళుగుప్ప మండలం హనిమిరెడ్డిపల్లి వద్ద వాహన చోదకులు కారు పైభాగంపై మృతదేహం ఉండటాన్ని గుర్తించి.. కారు డ్రైవర్కు చెప్పారు. దీంతో కారును రోడ్డు పక్కన ఆపి, టాప్పై పడి ఉన్న మృతదేహాన్ని గమనించి అక్కడి నుంచి ఉడాయించాడు. గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
తండ్రీ కొడుకుల దెబ్బ.. చంద్రబాబు అబ్బా
తనకు ఎదురేలేదని విర్రవీగిన ఆయనకు పెద్దాయన గట్టిదెబ్బే కొట్టారు. దారుణ ఓటమి రుచిచూపించారు. అయితే, అలాంటి వ్యక్తి ఆకస్మిక మరణంతో మళ్లీ తెరమీదికి వచ్చిన ఆయన.. ప్రజలను బురిడీ కొట్టించి మళ్లీ గద్దెనెక్కారు. నమ్మి ఓట్లేసిన పాపానికి నరకం చూపించారు. ఆయన చేతిలో దారుణంగా మోసపోయిన జనం.. తమను అక్కున చేర్చుకున్న పెద్దాయన కుమారుడికి పట్టం కట్టారు. ఆ పెద్దాయన, ఆయన కుమారుడు మరెవరో కాదు దివంగత నేత వైఎస్సార్, ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి. సాక్షి ప్రతినిధి, అనంతపురం: వైఎస్ రాజశేఖర రెడ్డి చేతిలో 2004,2009లో ఘోర పరాభవం మూటగట్టుకున్న చంద్రబాబును.. ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి కూడా మట్టి కరిపించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బాబుకు చుక్కలు చూపించారు. గతంలో జరిగిన నాలుగు ఎన్నికల ఫలితాల సరళిని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 14 నియోజకవర్గాలున్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైఎస్ కుటుంబ విశ్వసనీయతకే జనం పట్టం కట్టినట్లు తెలిసిపోతుంది. మాట ఇస్తే దాన్ని నెరవేర్చే వరకూ వెనకడుగు వేయని తత్వం, తమ అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకుంటారన్న నమ్మకం ప్రజల్లో బలంగా నాటుకుపోవడంతోనే ఇది సాధ్యమైంది. తమకు జిల్లా కంచుకోట అని బాకాలు ఊదే టీడీపీ నాయకుల మాటలను జనం నమ్మడం లేదు. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో.. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర తనదనీ, మూడు దఫాలు ముఖ్యమంత్రి అయ్యానని చెప్పుకునే చంద్రబాబు.. తండ్రీతనయుల చేతిలో దారుణంగా ఓడిపోవడం చరిత్రలో ఒక విచిత్రం. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అధినేతగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి అనంతపురం జిల్లాలో సంపూర్ణ ఆధిపత్యం సాధించారు. టీడీపీని పరాభవం బాట పట్టించారు. జిల్లా ప్రజల సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు హంద్రీనీవా సుజల స్రవంతి పథకానికి శ్రీకారం చుట్టడం, తన హయాంలోనే ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి చేయడంతోనే ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారని రాజకీయ విశ్లేషకులు చెబుతారు. 2019లో సునామీ సృష్టించిన జగన్ ఉమ్మడి అనంతపురం జిల్లావ్యాప్తంగా 2019లో రాజకీయ పెను తుఫాను సంభవించిందంటే ఆశ్చర్యం కలగకమానదు. ఆ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ సీపీ ప్రభంజనం సృష్టించింది. ఫ్యాను ధాటికి సైకిల్ గల్లంతైంది. జనహితమే లక్ష్యంగా బరిలోకి దిగిన జగన్ సైన్యం టీడీపీ అభ్యర్థులను మట్టి కరిపించింది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు దఫాలు బాబును కోలుకోలేని దెబ్బతీయగా.. 2019లో జగన్ ఏకంగా చంద్రబాబును రాజకీయంగా వెంటిలేటర్పై పడుకోబెట్టినంత పనిచేశారు. ఇక అప్పట్లో గెలిచిన ఇద్దరు టీడీపీ అభ్యర్థులు కూడా అత్తెసరు మెజారీ్టతో గట్టెక్కడం గమనార్హం. పాతకథ పునరావృతమే..! 2019 ఫలితాలు ఈ ఎన్నికల్లోనూ పునరావృతమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో పారీ్టకి పనిచేసిన వారిని కాదని డబ్బున్న వారికి టికెట్లు ఇవ్వడంతో టీడీపీలో అసమ్మతి జ్వాలలు రగులుతూనే ఉన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. టీడీపీ కేడర్ కూడా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంది. అభ్యర్థుల ఎంపిక తమ పారీ్టకి గుదిబండలా తయారైందని నాయకులు వాపోతున్నారు. ముఖ్యంగా మొన్నటిదాకా తీవ్రంగా విమర్శించిన గుమ్మనూరు జయరామ్కు చంద్రబాబు టికెట్ ఇవ్వడంతో కేవలం డబ్బు కోసమే సీటు కేటాయించారన్న విమర్శలు ఆ పార్టీ నేతల నుంచే వెల్లువెత్తుతున్నాయి. కళ్యాణదుర్గం, అనంతపురం, పుట్టపర్తి వంటి నియోజకవర్గాల్లోనూ డబ్బున్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వడంతో ద్వితీయ శ్రేణి నాయకులు రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ టీడీపీకి భంగపాటు తప్పదని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
మేమంతా సిద్ధం@డే4: సీఎం జగన్కు గ్రామగ్రామాన సాదర స్వాగతం
CM YS Jagan Memantha Siddam Bus Yatra 2024 Updates బెంగళూరు జాతీయ రహదారిపై దారి పొడవునా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్రకు ఆత్మీయ స్వాగతం పలికిన జనం పామిడి వద్ద జాతీయ రహదారిపై జనాలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన ముఖ్యమంత్రి జగన్ బస్సుయాత్ర తుగ్గలి నుండి గుత్తి వరకు దారిపొడుగునా స్వాగతం పలికిన ప్రజలు గుత్తి గాంధీ సర్కిల్లో జనసునామీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సుయాత్రకు వెల్లువలా తరలి వచ్చిన ప్రజలు అన్నీ మారుతున్నాయి.. సీఎం జగన్ ట్వీట్ మన గ్రామంలో వ్యవసాయం మారింది, వైద్యం మారింది, స్కూళ్లు మారాయి గతానికి భిన్నంగా అన్నీ మారుతున్నాయి పేదోళ్ల బతుకులు మారాలంటే జరుగుతున్న ఈ మార్పులు కొనసాగడం చాలా అవసరం. ఈ ఎన్నికల్లో మనం వేసే ఓటు జరుగుతున్న ఈ మార్పుని కొనసాగించడం కోసం వేస్తున్నామని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి మన గ్రామంలో వ్యవసాయం మారింది, వైద్యం మారింది, స్కూళ్లు మారాయి. గతానికి భిన్నంగా అన్నీ మారుతున్నాయి. పేదోళ్ల బతుకులు మారాలంటే జరుగుతున్న ఈ మార్పులు కొనసాగడం చాలా అవసరం. ఈ ఎన్నికల్లో మనం వేసే ఓటు జరుగుతున్న ఈ మార్పుని కొనసాగించడం కోసం వేస్తున్నామని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి.… pic.twitter.com/mU7uuNtwOT — YS Jagan Mohan Reddy (@ysjagan) March 30, 2024 అనంతపురం జిల్లాలోకి ప్రవేశించిన బస్సు యాత్ర అనంతపురం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కర్నూలు జిల్లా పర్యటన ముగించుకుని నేరుగా అనంతపురం జిల్లాలోకి బస్సు యాత్ర సీఎం జగన్. గుంతకల్లు నియోజకవర్గం బసినేపల్లిలో సీఎం జగన్కు ఘనస్వాగతం సీఎంకు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొనసాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర కాసేపట్లో అనంతపురంలోకి ప్రవేశించినున్న మేమంతా సిద్ధం యాత్ర గుత్తి శివారులో భోజన విరామం విరామం అనంతరం కొనసాగనున్న ఎన్నికల ప్రచార యాత్ర దారి పొడవునా ఆత్మీయ స్వాగతం కోసం పలు గ్రామాల ప్రజల ఏర్పాట్లు సాయంత్రం ధర్మవరం నియోజకవర్గ పరిధిలో ముగియనున్న యాత్ర జగనన్న మీ బిడ్డ.. ఆప్యాయత ఇలాగే ఉంటుంది మరి! తుగ్గలిలో ముగిసిన సీఎం జగన్ ముఖాముఖి కార్యక్రమం తుగ్గలి పరిధిలో జరిగిన అభివృద్ధిన వివరించిన సీఎం జగన్ ప్రజల నుంచి సలహాలు సూచనలు స్వీకరించిన సీఎం జగన్ తమకు చేకూరిన లబ్ధి గురించి చెప్పి సంతోషించిన గ్రామస్తులు సీఎం జగన్కు పలు వినతులు చేసిన ప్రజలు ముఖాముఖి ముగియడంతో మళ్లీ మొదలైన మేమంతా సిద్ధం యాత్ర తుగ్గలిలో ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి.. తుగ్గలిలో సీఎం జగన్ మాట్లాడుతూ.. దేశంలో రూ.3వేలు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆరోగ్యశ్రీని రూ.25లక్షలకు పెంచాం. గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడాను గమనించండి. మన ప్రభుత్వం ఎన్నో మార్పులు జరిగాయి. సంక్షేమం మీ ఇంటి వద్దకే వచ్చింది. మీ బిడ్డ పాలనలో నేరుగా మీ ఖాతాల్లోకి డబ్బు చేరింది. ఎక్కడా కూడా లంచాలు, వివక్ష లేకుండా సాయం అందించం జరిగింది. ఓటు వేయని వారికి కూడా అర్హత ఉంటే సాయం అందించాం. తుగ్గలిలో 1748 ఇళ్లు ఉన్న సచివాలయ పరిధిలో అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేశాం. 58 నెలల కాలంలో గ్రామాల్లో అభివృద్ధి జరిగింది. తుగ్గలి, రతన పరిధిలో 10వేల మంది జనాభా. తుగ్గలి, రాతన పరిధిలో 95 శాతం ఇళ్లకు బటన్ నొక్కి నిదులు జమ చేశాం. 1748లో 1666 ఇళ్లకు 29 కోట్ల 65లక్షల రూపాయలు అందజేశాం. రాతనలో 26కోట్లు. గతంలో ఏ పథకం కావాలన్నా లంచాలు అడిగే పాలన చూశారు. మీ బిడ్డ పాలనలో ప్రతీ ఇంటి తలుపు తగ్టి సంక్షేమం అందించాం. రైతన్నకు పెట్టుబడి సాయం అందిస్తున్నాం. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు అండగా ఉంటున్నాం. ఆర్బీకేలను ఏర్పాటు చేశాం. కార్పొరేటుకు ధీటుగా స్కూల్స్ను తీర్చిదిద్దాం. వైద్య రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. అమ్మఒడి పథకం కింద.. తుగ్గలి.. రెండు కోట్ల 91 లక్షలు రాతన.. రెండు కోట్ల 57 లక్షలు వైఎస్సార్ చేయూత.. తుగ్గలి.. రెండు కోట్ల 30 లక్షలు రాతన.. రెండు కోట్ల 19 లక్షలు జగనన్న విద్యాదీవెన.. రెండున్నర కోట్లు. తుగ్గలికి.. కోటీ 16 లక్షలు రాతన.. కోటీ 26 లక్షలు జగనన్న వసతి దీవెన.. తుగ్గలికి.. 51 లక్షలు రాతన.. 54 లక్షలు వైఎస్సార్ ఆసరా.. 2 కోట్ల 60 లక్షలు తుగ్గలి.. కోటి 95లక్షలు రాతన.. 65 లక్షలు సున్నా వడ్డీ.. తుగ్గలి..15 లక్షలు రాతన.. 60 లక్షలు ఇళ్లకు సంబంధించి.. తుగ్గలికి.. 66 రాతన.. 122 పెన్షన్లు.. తుగ్గలి.. ఏడు కోట్ల 58 లక్షలు. రాతన.. ఏడు కోట్ల 54 లక్షలు. రైతు భరోసా.. తుగ్గలి.. ఆరు కోట్ల 15 లక్షలు రాతన.. ఐదు కోట్ల 49 లక్షలు తుగ్గలి చేరుకున్న సీఎం జగన్ ప్రారంభమైన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం జగనన్న.. మేమంతా సిద్ధం: తుగ్గలి ప్రజలు మేమంతా సిద్ధం అంటూ నినాదాలు చేస్తున్నారు కర్నూలు జిల్లా తుగ్గలి వాసులు అభివృద్ధి - సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుపరిపాలన అందించారని.. వచ్చే ఎన్నికల్లో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఖాయమంటున్నారు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు అనైతికం అని.. 2014 లో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదో చంద్రబాబు నాయుడు చెప్పాలని నిలదీస్తున్నారు తుగ్గలి సీఎం జగన్ ముఖాముఖి వేదిక వద్ద.. సంబురంగా నృత్యాలు చేస్తున్న మహిళా లబ్ధిదారులు వైఎస్సార్సీపీ నేతలతో సుదీర్ఘంగా సీఎం జగన్ చర్చలు పత్తికొండ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ను కలిసిన వైఎస్సార్సీపీ నేతలు పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం, కళ్యాణదుర్గం సహా కర్నూలు జిల్లా నేతలు సుమారు 1 గంటా 30 నిమిషాలకు పైగా నేతలు, కార్యకర్తలతో గడిపిన సీఎం జగన్ పలువురు పార్టీ నేతలను, సీనియర్ కార్యకర్తలను పేరుపేరునా పలకరిస్తూ... యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న సీఎం జగన్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసిన సీఎం జగన్ కొనసాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర ప్రచార రథం దిగి మార్గమధ్యలో ప్రజల్ని కలుస్తున్న సీఎం జగన్ రతనలో ప్రజలతో మమేకమవుతున్న సీఎం జగన్ కాసేపట్లో తుగ్గలి చేరుకోనున్న సీఎం జగన్ తుగ్గలి ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి రతనలో.. కర్నూలు జిల్లా రతనకు చేరుకున్న సీఎం జగన్ ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు తుగ్గలి మండలం రాతన గ్రామంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురుచూస్తున్న గ్రామ ప్రజలు, జగనన్నకు స్వాగతం పలికేందుకు గజమాల, రోడ్లపై బంతిపూల బాట వేసిన గ్రామ ప్రజలు పత్తికొండ నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర కాసేపట్లో తుగ్గలి చేరుకోనున్న సీఎం జగన్ తుగ్గలి ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి నేడు అనంతలోకి సీఎం జగన్ బస్సు యాత్ర అనంతపురంలోకి నేడు ప్రవేశించనున్న సీఎం జగన్ బస్సు యాత్ర అనంతపురం జిల్లా సిద్ధమా? అంటూ ట్వీట్ చేసిన సీఎం జగన్ అనంతపురం జిల్లా సిద్ధమా…?#MemanthaSiddham — YS Jagan Mohan Reddy (@ysjagan) March 30, 2024 తుగ్గలి సీఎం జగన్ ముఖాముఖి వేదిక వద్ద.. సంబురంగా నృత్యాలు చేస్తున్న మహిళా లబ్ధిదారులు మేమంతా సిద్ధంలోనూ చేరికలు ఎన్నికల వేళ అధికార పార్టీలో చేరుతున్న ప్రతిపక్ష నేతలు సీఎం జగన్ బస్సు యాత్రలో కొనసాగుతున్న చేరికల పర్వం తాజాగా పత్తికొండలో సీఎం జగన్ సమక్షంలో YSRCPలో చేరిన కళ్యాణదుర్గం టీడీపీ ఇన్చార్జ్ ఉమామహేశ్వర నాయుడు నాలుగో రోజు సీఎం జగన్ బస్సు యాత్ర నేడు అనంతపురంలోకి ప్రవేశించనున్న బస్సు యాత్ర కాసేపట్లో పత్తికొండ నుంచి ప్రారంభం పత్తికొండ బస శిబిరం వద్దకు భారీగా చేరుకుంటున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు పత్తికొండ నుంచి తుగ్గలి చేరుకోనున్న సీఎం జగన్ తుగ్గలి ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి సీఎం జగన్ ప్రచార రథానికి అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్న జనం కాసేపట్లో పత్తికొండ నుంచి ప్రారంభం కానున్న సీఎం జగన్ బస్సు యాత్ర బైపాస్లో బస చేసిన ప్రాంతం నుంచి మొదలుకానున్న సీఎం జగన్ బస్సు యాత్ర రతన మీదుగా తుగ్గలి, గజరాంపల్లి, జొన్నగిరి, గుత్తి, పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్, రాప్తాడు, ఆకుతోటపల్లి, కృష్ణంరెడ్డిపల్లి వద్ద ముగింపు మధ్యలో తుగ్గలిలో సీఎం జగన్ పబ్లిక్ ఇంటెరాక్షన్ రాత్రి ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని సంజీవపురంలో బస ఇదీ చదవండి: మోసగాళ్ల తోక కత్తిరించే స్టార్క్యాంపెయినర్లు మీరే తుగ్గలిలో ప్రజలు, మేధావులతో సీఎం జగన్ ముఖాముఖి మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా తుగ్గలిలో పబ్లిక్ ఇంటెరాక్షన్ ప్రజలు, మేధావులతో ముఖాముఖి కానున్న సీఎం జగన్ వైఎస్సార్సీపీ గత 58 నెలలో పాలనలో తుగ్గలికి చేకూరిన లబ్ధిని సీఎం జగన్ వివరించే ఛాన్స్ మంచి కొనసాగాలంటే మళ్లీ ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలని తుగ్గలి ప్రజలను కోరనున్న సీఎం జగన్ ముఖాముఖిలో పలువురు లబ్ధిదారులకు మాట్లాడే అవకాశం Memantha Siddham Yatra, Day -4. పత్తికొండలోని KGN ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. తుగ్గలి గ్రామస్తులతో జగనన్న ముఖాముఖి.. ఉదయం 11:30 గంటలకు గుత్తి రోడ్డు షో...#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/lk6U3u2OIo — YSR Congress Party (@YSRCParty) March 30, 2024 నేడు అనంతలోకి ప్రవేశించనున్న మేమంతా సిద్ధం ఇవాళ(మార్చి 30) నాలుగో రోజుకి చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్ర కర్నూలు, అనంతపురం జిల్లాలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం పత్తికొండ నుంచి బయలుదేరనున్న ప్రచార రథం రతన మీదుగా తుగ్గలి చేరిక జొన్నగిరి, గుత్తి మీదుగా ప్రయాణించి గుత్తి శివారులో భోజనవిరామం తీసుకుంటారు. పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్, రాప్తాడు బైపాస్ , ఆకుతోటపల్లి , సంజీవపురం శివారు వరకు యాత్ర సంజీవపురం శివారులో సీఎం జగన్ రాత్రి బస మొత్తం 102 కిలోమీటర్ల దూరం కొనసాగనున్న యాత్ర మోసగాళ్లను నమ్మొద్దు: ఎమ్మిగనూరు సభలో సీఎం జగన్ వారి తోకలు కత్తిరించేలా మీరే స్టార్ క్యాంపెయినర్లు కావాలి ఎమ్మిగనూరు సభలో ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపు మీ బిడ్డ మంచి చేసి ఉంటే ఆ మంచిని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి ఆడబిడ్డల కష్టాలు కళ్లారా చూశా.. అందుకే విప్లవాత్మక పథకాలు దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు 50% నామినేటెడ్ పదవులు పిల్లల బంగారు భవిష్యత్ కోసం విద్యారంగంలో సంస్కరణలు అన్ని వర్గాల వారికి మంచి చేసిన ప్రభుత్వానికి రాఖీ కట్టండి మళ్లీ ఆ ముగ్గురు మోసాలు చేసేందుకు కూటమిగా వస్తున్నారు వ్యవసాయం దండగన్న బాబు ఓవైపు.. భూమి పుత్రుడైన మీ బిడ్డ మరోవైపు పేదల తల రాతలు మార్చే ఈ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయండి కర్నూలు మేమంతా సిద్ధం సక్సెస్ మూడో రోజు కర్నూలు పార్లమెంట్ స్థానం పరిధిలో సాగిన మేమంతా సిద్ధం యాత్ర దారిపొడువునా సీఎం జగన్కు సాదర స్వాగతం పలికిన పలు గ్రామాల ప్రజలు ఎమ్మిగనూరు బహిరంగ సభకు పోటెత్తిన జనం కర్నూలు సిద్ధం యాత్ర సూపర్ సక్సెస్ అంటూ వైఎస్సార్సీపీ పోస్టు కర్నూల్ జిల్లాలో జరిగిన మేమంతా సిద్ధం యాత్రలో జననేతను చూసేందుకు పోటెత్తిన జనం. Memantha Siddham Yatra | Day -3 | Highlights #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/bNDJWV0KqD — YSR Congress Party (@YSRCParty) March 29, 2024 -
అనంతపురం టీడీపీలో అసమ్మతి జ్వాలలు (ఫొటోలు)
-
టీడీపీలో టికెట్ మంటలు.. భగ్గుమన్న అసంతృప్తి
సాక్షి, అనంతపురం: టీడీపీ టికెట్ల కేటాయింపుపై అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అనంతపురం అర్బన్ టికెట్ను దగ్గుబాటి ప్రసాద్కు కేటాయించగా.. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరికి చంద్రబాబు మొండిచేయి చూపారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రభాకర్ చౌదరి వర్గీయులు నిరసనకు దిగారు. ప్రభాకర్ చౌదరి వర్గీయులు.. చంద్రబాబు ఫ్లెక్సీలు చించేసి దహనం చేశారు. చంద్రబాబు, లోకేష్లకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు నినాదాలు చేశారు. చంద్రబాబు కోట్ల రూపాయలు డబ్బు తీసుకుని టికెట్లు కేటాయించారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఏజెన్సీ నేతలకు చంద్రబాబు హ్యాండ్ ఏజెన్సీ నేతలకు చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు. రా కదలిరా బహిరంగ సభలో దన్ను దొర పేరు ప్రకటించిన చంద్రబాబు.. చివరి నిమిషంలో సీటు బీజేపీకి కేటాయించారు. టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న దన్ను దొర.. రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. నక్సల్స్ కాల్పుల్లో మృతిచెందిన కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోము కుటుంబ సభ్యులకు చంద్రబాబు వెన్నపోటు పొడిచారు. సివేరు సోము కుమారుడు అబ్రహం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు కిడారి శ్రవణ్ దూరంగా ఉంటున్నారు. -
రాప్తాడులో చంద్రబాబుకు చేదు అనుభవం
సాక్షి, అనంతపురం: రాప్తాడులో చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. జనం లేక చంద్రబాబు సభ వెలవెల బోయింది. సభా ప్రాంగణం ఖాళీగా ఉండటంతో చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు మాట్లాడుతుండగానే జనం వెళ్లిపోయారు. కాగా, కుప్పంలోనే కాదు పలమనేరులోనూ చంద్రబాబు చెప్పిందే చెప్పి రొటీన్ ప్రసంగంతో ప్రజలకు బోర్ కొట్టించారు. తన గంట ప్రసంగంలో అనువుగాని హామీలు వందల్లోనే గుప్పించారు. ఈ మాటలు వివీ వినీ జనం అక్కడనుంచి మెల్లగా జారుకోవడం కనిపించింది. ఆయన పదేపదే చేతులెత్తండి..గట్టిగా చప్పట్లు కొట్టండి.. అంటున్నా జనం నుంచి పెద్దగా స్పందన రాలేదు. మరో వైపు, రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ‘సిద్ధం’ సభలకు లభించిన విశేష స్పందన, సభలకు హాజరైన అశేష జనవాహినిని పత్రికలు, టీవీలలో చూసిన చంద్రబాబుకు భయం పట్టుకుంది. ‘మేమంతా సిద్ధం’ సీఎం జగన్ బస్సు యాత్రకు కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు -
నేటి తరానికి ఆదర్శమూర్తి లలితమ్మ
దేశం కోసం యుద్ధంలో పోరాడే సైనికుడిని రణభూమికి పంపించే తల్లి ఎంత గొప్పదో.. అభివృద్ధికి బాటలు వేస్తూ ప్రజాసేవ చేసే రాజకీయాల్లోకి పంపించడం కూడా అంతే గొప్పది. కొడుకు రాజకీయాల్లోకి వెళ్తానంటే అడ్డుపడే తల్లిదండ్రులు ఎంతో మంది ఉంటారు. కానీ.. తన కుమారులందరినీ ప్రజాసేవకు అంకితం చేసింది ఆ మాతృమూర్తి. ప్రజాభిమానం కలలు కంటే వచ్చేది కాదని.. బతికినన్ని రోజులు జనాన్ని ఇంటివాళ్లుగా భావించాలని చెబుతూ వారిని ప్రజాప్రతినిధులుగా మార్చింది. ఉగ్గుపాలతోనే కొడుకులకు ప్రజాసేవ నేర్పించిన ఆ తల్లి.. ఇప్పుడు కానరాని లోకాలకు వెళ్లిపోయింది. దేవుడు ఆత్మకు మాత్రమే బాధ్యత వహిస్తాడు. కానీ అమ్మ ఆత్మకూ, శరీరానికీ బాధ్యత వహిస్తుంది. అందుకే.. తన పిల్లలపై జీవితాంతం నిస్వార్థమైన ప్రేమను కురిపిస్తూనే ఉంటుంది. తన పిల్లలు ఉన్నత స్థానాల్లో స్థిరపడి సిరిసంపదలతో సుఖంగా ఉండాలని కోరుకుంటుంది. అయితే.. మాతృమూర్తులంతా ఒకేలా ఆలోచించరు. కేవలం తాము.. తమ కుటుంబం అని కాకుండా.. దేశం కోసం పరితపించే తల్లులు ఎందరో ఉన్నారు. వారి వల్లే ఎంతోమంది సైనికులుగా సరిహద్దుల్లో కాపలా కాస్తూ మనం నిర్భయంగా జీవించేలా ధైర్యాన్నిస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ అమ్మ పేరు ఎల్లారెడ్డిగారి లలితమ్మ. ఈ తల్లి కూడా తన పిల్లలను దేశ సేవకే అంకితం చేయాలని భావించారు. తండ్రి వారసత్వంగా కొడుకులందరినీ ప్రజాసేవలో తరలించేలా చేశారు. ఒకరూ ఇద్దరూ కాదు.. ఏకంగా తన ఐదుగురు కొడుకులను ప్రజాప్రతినిధులుగా మార్చిన ఆమె... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, ఒక టీటీడీ బోర్డు మెంబర్ను ఇచ్చారు. బతికున్నంత కాలం కుమారులకు రాజకీయ దిశానిర్దేశం చేసిన లలితమ్మ.. 91 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మంలం కొనకొండ్ల గ్రామానికి చెందిన ఎల్లారెడ్డిగారి భీమిరెడ్డితో కర్నూలు జిల్లాలోని బద్నాల గ్రామానికి చెందిన లలితమ్మకు 12 ఏళ్ల వయసులో వివాహం జరిగింది. వీరికి ఆరుగురు కుమారులు, ఒక కుమార్తె. తొలి నుంచీ రాజకీయాలపై ఆసక్తి ఉన్న భీమిరెడ్డి 1983లో తెలుగుదేశం పార్టీలో చేరి ఉరవకొండ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత రెండేళ్లకే భీమారెడ్డి కన్నుమూశారు. ఆ తర్వాత కుమారులను రాజకీయాల్లోకి తీసుకువచ్చిన లలితమ్మ.. వారికి దిశానిర్దేశం చేయడం ప్రారంభించారు. ప్రజాభిమానం అనేది కలలు కంటే వచ్చేది కాదని.. ఎప్పటికీ ప్రజలను ఇంటివాళ్లుగానే భావించాలని తొలి నుంచీ వారికి చెప్పుకుంటూ వచ్చారు. ప్రజాసేవలో అనుసరించాల్సిన విధానాలతోపాటు ఎన్నికల వ్యూహాలపై కుమారులకు సలహాలు ఇచ్చేవారు. అమ్మ మాట ప్రకారమే నడుచుకున్న లలితమ్మ కొడుకులు ఇప్పుడు ఉన్నత స్థానంలో నిలిచి ప్రజాసేవలో తరిస్తున్నారు. భీమిరెడ్డి-లలితమ్మ కుమారుల్లో జయరామిరెడ్డి ఇప్పటికే మృతిచెందగా.. కూతురు వరలక్ష్మి గుంతకల్లులో నివాసముంటున్నారు. ఇక మొదటి కొడుకు సీతారామిరెడ్డి ప్రస్తుతం టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేస్తుండగా.. శివరామిరెడ్డి అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇక వెంకట్రామిరెడ్డి గుంతకల్లు, సాయిప్రసాద్రెడ్డి ఆదోని, బాలనాగిరెడ్డి మంత్రాలయం ఎమ్మెల్యేలుగా ప్రజా సేవ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు అంటే ప్రభుత్వం ఇచ్చే పథకాలు చేరవేయడమే కాదు.. తమకున్నంతలో చేయూతనిచ్చి ఆదుకోవాలని లలితమ్మ చెప్పిన మాటలను ఇప్పటికీ పాటిస్తారు ఆమె కుమారులు. అందుకే పేదల పెళ్లిళ్లకు తాళిబొట్లు, కొత్త బట్టలు అందించడం, ఆర్థిక స్థోమత లేని వారిని చదివించడం వంటి సేవా కార్యక్రమాలను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. తండ్రి, కుమారులతో కలిపి ఒకే ఇంటి నుంచి ఏకంగా ఆరుగురు రాష్ట్రానికి సేవలందించడం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. తండ్రి చనిపోయినా.. ఆ లోటు లేకుండా పిల్లలను పెంచి పెద్దచేసి వారిని ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దిన లలితమ్మ.. నేటి తరానికి ఆదర్శమూర్తిగా నిలుస్తున్నారు. -
నిరూపిస్తే రాసిస్తా.. చంద్రబాబుకు ఎమ్మెల్యే తోపుదుర్తి సవాల్
సాక్షి, అనంతపురం: తనకు రూ.500 కోట్ల ఆస్తులున్నట్లు నిరూపిస్తే మీకే రాసిస్తానంటూ చంద్రబాబుకు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సవాల్ విసిరారు. ‘‘మీరు ఎక్కడ సంతకం చేయమంటే అక్కడ సంతకం చేస్తా.. నాకు ఉన్నాయని చెప్తున్న 500 కోట్లు మీరే రాప్తాడు నియోజకవర్గం ప్రజలకు పంచండి’’ అని చెప్పారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనంటూ తోపుదుర్తి మండిపడ్డారు. ‘‘రాప్తాడు టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత అవినీతి చంద్రబాబుకు కనిపించలేదా?. పరిటాల కుటుంబీకుల అక్రమాస్తులపై చంద్రబాబు ఎందుకు మాట్లాడరు?. చంద్రబాబు దిగజారి ఆరోపణలు చేస్తున్నారు. కియా ఫ్యాక్టరీ చంద్రబాబు వల్ల రాలేదు. వైఎస్సార్, నరేంద్ర మోదీ కృషి ఫలితంగా కియా ఫ్యాక్టరీ ఏర్పడింది. హంద్రీనీవా ప్రాజెక్టులో భాగంగా గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మించిన ఘనత వైఎస్సార్దే. పెనుకొండ ప్రాంతంలో వైఎస్సార్ నీటి వసతి కల్పించారు కనుకే కియా ఫ్యాక్టరీ వచ్చింది’’ అని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అన్నారు. ఇదీ చదవండి: ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్.. కేడర్కు గూస్ బంప్స్ -
అనంతపురంలో రెచ్చిపోయిన టిడిపి శ్రేణులు
-
CM Jagan: రాప్తాడు ‘సిద్ధం’ సభ హైలైట్స్
సాక్షి, అనంతపురం జిల్లా: రాయలసీమలోనే కాదు.. ఏపీలోనే కనివిని ఎరుగని రీతిలో జరిగిన రాప్తాడు సిద్ధం సభ జరిగింది. సభ సముద్రాన్ని తలపించింది. సభకు లక్షలాదిగా జగన్ దండు తరలివచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగం సింహనాదంలా కొనసాగింది. సీఎం జగన్ స్పీచ్కు జనం యుద్ధ నినాదాన్ని మోగించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ టార్గెట్ 175 ఫిక్స్ చేసిన సీఎం జగన్.. ఎంత మంది జత కట్టినా.. ఎన్ని పొత్తులు పెట్టుకున్నా.. ప్రజలతోనే తన పొత్తు అని స్పష్టం చేశారు. ప్రజలే స్టార్ క్యాంపెనర్లుగా సీఎం జగన్ ప్రకటించారు. లబ్దిదారులే తనకు ఓటు వేయిస్తారని ప్రకటించిన సీఎం జగన్.. ఫ్యాన్ ఇంట్లో ఉండాలని, సైకిల్ బైట ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్లోనే ఉండాలంటూ జగన్ పొలిటికల్ పంచ్లు విసిరారు. ఎన్నికలు ముగిసే వరకు కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ►మేనిఫెస్టోలో 99 శాతం హామీలు పూర్తి చేశామని సగర్వంగా ప్రకటించిన సీఎం జగన్ ►పరిపాలనలో ఎక్కడా తగ్గలేదు. మరి ఒక్క సీటు కూడా ఎలా తగ్గుతుందని సీఎం జగన్ భరోసా ►భీమిలి, దెందులూరు సభలకు మించి రాప్తాడులో సిద్ధం సభ సక్సెస్తో వైఎస్సార్సీపీ కేడర్లో జోష్ ►ప్రతిపక్షాల కుట్రలను ఎండగట్టిన సీఎం జగన్ ►ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా సూటిగా, స్పష్టంగా ఎన్నికల నినాదాన్ని సవివరంగా సోదహారణంగా వివరించిన సీఎం జగన్ ఇదీ చదవండి: రాప్తాడు ‘సిద్ధం’ సభలో సీఎం జగన్ పంచ్లు -
Watch Live: రాష్ట్ర చరిత్రలోనే భారీ బహిరంగ సభ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగంలో ముఖ్యాంశాలు రాప్తాడులో వైసీపీ సిద్ధం సభ జనసముద్రంలా కనిపిస్తోంది పెత్తందారులతో మన యుద్ధం జరగబోతుంది 2024లో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరగబోతోంది పెత్తందార్లతో యుద్ధానికి మీరు సిద్ధమేనా? విశ్వసనీయతకు వంచనకు మధ్య యుద్ధం జరుగుతోంది పక్క రాష్ట్రాల్లో ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేసేవాళ్లు అవసరమా? చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా? ప్రజల మంచి కోసం చంద్రబాబు చేసిన మంచి పని ఒక్కటైనా ఉందా? చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో రైతులకు గుర్తుకువచ్చే పథకం ఒక్కటైనా ఉందా? చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్కరికైనా సామాజిక న్యాయం గుర్తుకొస్తుందా? మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 10 శాతమైనా అమలు చేశారా? 1995, 1999, 2014 టీడీపీ మేనిఫెస్టోలో 10 శాతమైనా అమలు చేశారా? మళ్లీ అబద్దాలు, మోసాలతో చంద్రబాబు వస్తున్నారు రంగురంగుల మేనిఫెస్టోలతో మళ్లీ మోసం చేయడానికి బాబు వస్తున్నాడు చంద్రబాబు చేసేవన్నీ మోసాలే, చెప్పేవన్నీ అబద్ధాలే అబద్ధాలు చెప్పేటప్పుడు భావదారిద్ర్యం ఎందుకు అనేది చంద్రబాబు సిద్ధాంతం 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఏ ప్రాంతానికైనా న్యాయం చేశారా? చంద్రబాబు అబద్ధాలను నమ్మొద్దని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి గత ఎన్నికల్లో ప్రజలు టీడీపీని 23 సీట్లకే పరిమితం చేశారు గత ఎన్నికల్లో అందరూ చొక్కాలు మడతపెట్టి చంద్రబాబు కుర్చీని మడతేసి వాళ్ల సీట్లను తగ్గించారు చంద్రబాబును మళ్లీ ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పనైనా గుర్తొస్తుందా? కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు బాబు మార్క్ ఎక్కడైనా ఉందా? 57 నెలల పాలనలో చిత్తశుద్ధితో పాలన అందించాం 57 నెలల పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం 57 నెలల పాలనలో జరిగిన మంచిని ప్రజలందరికీ వివరించండి ప్రతీ ఇంట్లో జరిగిన మంచిని ప్రతీ ఒక్కరికీ వివరించండి చేసినవి చెప్పాలి, వాటి కొనసాగింపు ఎంత అవసరమో చెప్పాలి ప్రతి అవ్వా, తాత ముఖంలో చిరునవ్వులు చూశాం ప్రతి అక్క, చెల్లెమ్మకు ఎంతో మేలు చేశాం రైతులకు రైతు భరోసా తీసుకొచ్చి ఇచ్చాం రైతన్నకు పగటిపూట 9 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇచ్చాం మనం పెడుతున్న అన్నాన్ని, గిన్నెని చంద్రబాబు లాక్కుంటారు వైఎస్ఆర్ సీపీ పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు ఎన్నో పథకాలు గుర్తొస్తాయి 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం మనది ప్రతీ అక్కచెల్లెమ్మ ఫోన్ లో దిశ యాప్ తీసుకొచ్చాం చంద్రబాబు మోసాలను ప్రతీ రైతన్నకు వివరించాలి సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వమే మళ్లీ రావాలి ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్ లోనే ఉండాలి గతంలో ఎన్నడూ చూడని విధంగా నాడు-నేడుతో మార్పులు తెచ్చాం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చాం పేద విద్యార్ధులకు ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తెచ్చాం కేవలం కొందరికే పెన్షన్ ఇచ్చే రోజులు రాకూడదంటే మళ్లీ వైసీపీ ప్రభుత్వం రావాలి వాళ్లంతా మనకు స్టార్ క్యాంపెయినర్లుగా మారాలి సైకిల్ గుర్తుకు ఓటు వేయడమంటే ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం రద్దు చేయడమే YSRCP మార్క్ ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో కనిపిస్తోంది ప్రజలు ఒక్కసారి అధికారం ఇస్తేనే ఇవన్నీ చేశాం ప్రజలు మళ్లీ ఆశీర్వదిస్తే మరిన్ని మంచి పనులు చేస్తాం లంచాలకు తావులేకుండా పేదల ఖాతాల్లోకి నగదు బదిలీ జరుగుతోంది 57 నెలల్లోనే 2 లక్షల 13 వేల ఉద్యోగాలు ఇచ్చాం ఇందులో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చాం చంద్రబాబుకు ఓటు వేయడమంటే సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఓటు వేయడమే మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను అమలు చేశాం 3 సార్లు సీఎం అయిన చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేయలేదు అసలు చంద్రబాబుకు ప్రజలు ఎందుకు ఓటు వేయాలి? సైకిల్ తొయ్యడానికి ప్యాకేజీ స్టార్ ఎందుకు? విద్యాదీవెన, వసతి దీవెనతో విద్యార్ధులకు అండగా నిలిచాం పెత్తందారుల పిల్లలతో మన పిల్లలు పోటీ పడాలంటే మళ్లీ మన ప్రభుత్వమే రావాలి మన పిల్లలు ప్రపంచ స్థాయికి ఎదిగేలా విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చాం పెన్షన్ కొనసాగాలంటే మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వమే రావాలి మీ అన్న ప్రభుత్వమే సంక్షేమ పథకాలను కొనసాగించగలదు జరుగుతున్న మంచి కొనసాగాలంటే మన ప్రభుత్వమే రావాలి వైఎస్ఆర్ సీపీ పేరు చెబితే సంక్షేమ పథకాలు గుర్తొస్తాయి కోవిడ్ కష్టకాలంలోనూ అందించిన సేవలు గుర్తొస్తాయి లంచాలకు తావు లేకుండా నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో డబ్బు వేశాం మీ బిడ్డ 125 సార్లు బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నిధులు జమ చేశాం రూ.2.55 లక్షల కోట్ల రూపాయలు నేరుగా ఖాతాల్లో వేశాం వైఎస్ఆర్ సీపీ మార్క్ ప్రతీ ఇంట్లోనూ కనిపిస్తోంది మళ్లీ అవకాశమిస్తే ఇంకెంత మంచి జరుగుతుందో ఆలోచించమని చెప్పండి 75 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవుల్లో ప్రాధాన్యతనిచ్చాం కేవలం 57 నెలల కాలంలో 2 లక్షల 13 వేల ఉద్యోగాలు ఇచ్చాం నిరుపేద వర్గాలకు 80 శాతం ఉద్యోగాలు ఇచ్చాం మేనిఫెస్టోను మీ బిడ్డ మాదిరిగా అమలు చేసిన వారెవరైనా ఉన్నారా? చంద్రబాబుకు ప్రజలు ఎందుకు ఓటేయాలి? జగన్ కు జనబలం లేకుంటే చంద్రబాబుకు పొత్తులెందుకు? తన నడక కోసం అటో కర్ర ఇటో కర్ర ఎందుకు? సైకిల్ ను తొయ్యడానికి ప్యాకేజ్ స్టార్ ఎందుకు? ప్రజల కోసం 125 సార్లు నేను బటన్ నొక్కాను మళ్లీ ఫ్యాన్ కు ఓటేస్తే చంద్రముఖి బెడద ఇక మీకుండదు సైకిల్ కు ఓటేస్తే పేదల రక్తం తాగేందుకు చంద్రముఖి వస్తుంది పేదవాడి బతుకును మార్చేందుకు మనం యుద్దం చేస్తున్నాం చంద్రబాబు పెత్తందారుల తరపున సంసిద్ధం అంటున్నారు టీడీపీ దేనికి సంసిద్ధమని అడుగుతున్నా ?? దుష్టచతుష్టయం బాణాలకు తల వంచేందుకు ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు, అర్జునుడికి తోడు కృష్ణుడి రూపంలో ప్రజలున్నారు వైఎస్ఆర్ సీపీ మీ అందరి పార్టీ మాకు ఏ పార్టీతోనూ పొత్తు లేదు.. ప్రజలతోనే మా పొత్తు గతంలో లంచాలు పిండుతూ తన వారికే చంద్రబాబు పథకాలిచ్చుకున్నాడు పార్టీలో ప్రతి కార్యకర్తకూ మీ అన్న జగన్ తోడుగా ఉంటాడు నాయకుడంటే ప్రతీ కార్యకర్తా కాలర్ ఎగరేసేలా ఉండాలి వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కి 175 అసెంబ్లీ స్థానాలు వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 25కి 25 ఎంపీ స్థానాలు 650 హామీలిచ్చి 10 శాతం కూడా చంద్రబాబు అమలు చేయలేదు మేనిఫెస్టోలో వైఎస్ఆర్ సీపీ 99 శాతం హామీలు అమలు చేసింది ఎల్లోమీడియా దుష్ప్రచారాలను తిప్పి కొట్టేందుకు మీరు సిద్ధమా? మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరు సిద్ధమా? ఈ ఎన్నికల తర్వాత టీడీపీ రూపురేఖలు ఎక్కడా కనిపించవు ఎల్లో మీడియా చీకటి రాతలు తిప్పి కొట్టేందుకు మీరు సిద్ధమా? పెత్తందారులంతా తోడేళ్లుగా ఏకమవుతున్నారు ఈ ఎన్నికలు చాలా కీలకం పొరపాటు జరిగితే పేదవాడి బతుకు అతలాకుతలమవుతుంది సమర భేరి మోగిద్దాం... సమర నినాదం వినిపిద్దాం -
భీమిలి, దెందులూరును మించిపోయేలా రాప్తాడు ‘సిద్ధం’
సాక్షి, అనంతపురం: సిద్ధం సభకు సర్వం సిద్ధం అయింది. అనంతపురం జిల్లా రాప్తాడులో రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ జరగనుంది. రాయలసీమ జిల్లాల నుంచి లక్షలాది మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో హాజరుకానున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ... సిద్ధం సభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే భీమిలి, దెందులూరు బహిరంగ సభలు విజయవంతం అయ్యాయి. రేపు అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభ జరగనుంది. రాప్తాడు సమీపంలోని బైపాస్ రోడ్డు వద్ద సుమారు 250 ఎకరాల మైదానం లో సిద్ధం సభ కోసం ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరుకానున్నారు. లక్షలాది మంది వచ్చే సిద్ధం సభ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. రాప్తాడు బైపాస్ వద్ద బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. పరిసర ప్రాంతాల్లో 16 చోట్ల వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలను విధించారు పోలీసులు. బెంగళూరు నుంచి వచ్చే భారీ వాహనాలు కళ్యాణ దుర్గం మీదుగా మళ్లిస్తారు. అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్లే భారీ వాహనాలను ధర్మవరం మీదుగా మళ్లిస్తారు. ఈ ఆంక్షలు భారీ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. సాధారణ ప్రయాణికుల వాహనాలు యథావిధిగా రాప్తాడు హైవే పై వెళ్లవచ్చు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిద్ధం సభకు పెద్ద సంఖ్యలో జనం వస్తారని... ఆ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీఎం ప్రొగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. రాప్తాడు సిద్ధం సభ నుంచి సీఎం జగన్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీలో సీఎం జగన్ పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని.. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప్రభంజనం మరోసారి ఖాయమని ఎమ్మెల్యే తోపుదుర్తి పేర్కొన్నారు. -
అభివృద్ధికి కేరాఫ్ గా అనంతపురంజిల్లా
-
టీడీపీలో తగ్గుతున్న ప్రాధాన్యం.. పెరుగుతున్న ప్రత్యర్ధులు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటోంది. ఫ్యాక్షనిస్టుగా, మాజీ నక్సలైటుగా జిల్లాలో దశాబ్దకాలం పాటు పరిటాల రవి రాజకీయాలను శాసించారు. ఆయన మరణానంతరం టీడీపీ గడ్డు కాలం ఎదుర్కొంటోంది. సొంత పార్టీలోనే గ్రూపులు, అధిష్టానం ఆడుతున్న డ్రామాలు వెరసి పరిటాల సునీత, తనయుడు పరిటాల శ్రీరామ్ రాజకీయ భవిష్యత్కు ప్రతిబంధకాలయ్యాయి. మరోవైపు తల్లీ కొడుకుల మధ్యే ఎన్నికల్లో పోటీ ఎవరు చేయాలనే మీమాంస వీరిని ఇరకాటంలో పెడుతోంది. పరిటాల కుటుంబం ప్రభ తగ్గింది పరిటాల రవి మరణానంతరం ఆయన భార్య పరిటాల సునీత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో గెలిచి మంత్రి అయ్యారు. మంత్రిగా ఉండి కూడా ఆమె ఎలాంటి అభివృద్ధీ చేయకపోవడంతో జిల్లాలో క్రమంగా పరిటాల కుటుంబ పరపతి తగ్గింది. పరిటాల శ్రీరామ్ వ్యవహారశైలి కూడా జనానికి ఆ కుటుంబాన్ని దూరం చేసింది. 2019లో సునీత పోటీ చేయకుండా పరిటాల శ్రీరామ్ రాప్తాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి తోపుదుర్తి ప్రకాష్రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. దీంతో జిల్లాలో పరిటాల ప్రభ పూర్తిగా మసకబారింది. ప్రభావం లేదని గుర్తించిన అధిష్టానం ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబ ప్రభావం ఏమాత్రమూ లేదనడానికి తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరే కారణం. ‘మీ కుటుంబానికి ఒక్కటే సీటు.. ఇష్టమైతే రండి లేదంటే పోండి’ అన్నట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. దీంతో రాప్తాడు, ధర్మవరం రెండు నియోజకవర్గాల్లోనూ పోటీ చేయాలని భావించిన సునీత, శ్రీరామ్ల ఆశలు అడియాసలయ్యాయి. మరోవైపు సునీత ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఒక్క టికెట్ అయితే సరిపోతుందని చంద్రబాబు తన అనుకూల మీడియాలో లీకులు ఇప్పించారు. అధిష్టానం దెబ్బతో తల్లీ తనయులు కుదలేయ్యారు. పోటీలో తల్లా.. కొడుకా? రానున్న ఎన్నికల్లో ఎవరు పోటీయాలనే దానిపై తల్లీకొడుకు తేల్చుకోలేక పోతున్నారు. 2019లో పోటీచేసి ఓడిపోయిన శ్రీరామ్.. మళ్లీ తనకే టికెట్ కావాలని తల్లిమీద ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. కొడుకై తే ఓడిపోతాడని, తానే పోటీ చేస్తానని సునీత భావిస్తున్నట్టు తెలుస్తోంది. శ్రీరామ్కు టికెట్ ఇవ్వకపోతే ఒప్పుకోడు.. ఇస్తే ఓడిపోయే పరిస్థితులున్నాయి. దీంతో సునీత తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారని, పైగా రాప్తాడులో గతంలోలాగా కేడర్ సహకరించే పరిస్థితి లేదని టీడీపీ నాయకులు చెబుతున్నారు. గ్రూపులు వెంటాడుతున్నాయి పరిటాల కుటుంబానికి రాజకీయ ప్రత్యర్థులు ఎక్కువయ్యారు. ధర్మవరంలో వరదాపురం సూరికి, పరిటాల కుటుంబానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇక పయ్యావుల కేశవ్కు పరిటాల కుటుంబంతో పొసగదు. ప్రభాకర్ చౌదరికి అస్సలే పడదు. ఇలా ఉమ్మడి అనంతపురం జిల్లాలో చెప్పుకుంటూ వెళితే ఏ ఒక్క నాయకుడూ పరిటాల కుటుంబంతో అనుకూలంగా లేకపోవడం కూడా వీరికి మైనస్గా మారింది. పరిటాల పతనమే తమ లక్ష్యమంటూ ప్రత్యర్థులు పావులు కదుపుతున్నారు. -
బండారు శ్రావణికి మొండిచేయేనా?
తెలుగుదేశం పార్టీలో దళిత నేతల పరిస్థితి దయనీయంగా మారింది. ఎమ్మెల్యే సీటు అడిగితే అవమానాలు ఎదురవుతున్నాయి. అనంతపురం జిల్లాలో ఓ దళిత మహిళా నేతను తెలుగుదేశం పార్టీ అవమానించటమే దీనికి నిదర్శనం.మొన్నటిదాకా నియోజకవర్గ బాధ్యతలన్నీ మీవేనని చెప్పి.. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించి.. ఇప్పుడు ఆమె ఎవరో తెలీదన్నట్లుగా పార్టీ పెద్దలు వ్యవహరించటం పచ్చ పార్టీ లో దుమారం రేపుతోంది. అంతే కాదు పలువురు దళిత మాజీ మంత్రుల పరిస్థితి కూడా అగమ్య గోచరంగా తయారైంది. రాజకీయ నేత పేరు బండారు శ్రావణి.. అనంతపురం జిల్లా శింగనమల ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం లో రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు ..ఓటమి తర్వాత కూడా శింగనమల టీడీపీ ఇంఛార్జి గా ఈ మహిళా దళితనేత బాధ్యతలు నిర్వహించారు. ఈమె నుంచి టీడీపీ పెద్దలు కోట్ల రూపాయలు లబ్ధి పొందినట్లు ఆ పార్టీ లోనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి బండారు శ్రావణి పోటీకి సిద్ధం అవుతున్నారు. ఈ తరుణంలో దళిత మహిళా నేతను అవమానించేలా టీడీపీ పెద్దలు ఈ మధ్యనే ఓ ప్రకటన విడుదల చేశారు. అసలు బండారు శ్రావణి శింగనమల టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి కాదని టీడీపీ జోనల్ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మీడియా సమావేశం లో పేర్కొన్నారు. ఇక్కడ పార్టీ వ్యవహారాలన్నీ టూమెన్ కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసానాయుడు చూసుకుంటారని స్పష్టం చేశారు. చంద్రబాబు చేయించిన ఈ ప్రకటనతో దళిత నేతలు రగిలిపోతున్నారు. ఎస్సీ రిజర్వ్ డ్ స్థానం లో పెత్తనం అంతా అగ్రవర్ణాలకు చెందిన నేతలకు ఎందుకు అప్పగించారో చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నియోజకవర్గ ఇంచార్జి పదవి.. టిక్కెట్ ఎవరికి ఇవ్వాలనే విషయంలో దళితులకు ప్రాధాన్యత ఇవ్వకుండా పెత్తందార్లకు ఇవ్వడం దారుణమని టీడీపీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. టీడీపీ అధిష్టానం తాజా ప్రకటన తో బండారు శ్రావణి ఆత్మరక్షణలో పడ్డారు. తన భవితవ్యం ఏమిటో చంద్రబాబు వద్దే తేల్చుకునేందుకు సిద్ధం అవుతున్నారు. తెలుగుదేశం పార్టీలో దళిత నేతలు పార్టీ అధినేత చంద్రబాబు తీరుపై రగిలిపోతున్నట్టు సమాచారం. పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నేతలకు సీట్లు అడిగితే సీటివ్వకపోగా, అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా.. అవమానాలకు గురిచేస్తున్నారని వారు మదనపడుతున్నారు. దళిత మాజీ మంత్రులతో కాళ్లు మొక్కించుకుని చంద్రబాబు దళితులను హీనాతి హీనంగా చూస్తున్నారని టీడీపీలోని దళిత నేతలంతా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మాజీ మంత్రి కొత్తపల్లి జవహార్ ఎన్నికల్లో తన సీటు కోసం చంద్రబాబు కాళ్లు పట్టుకుని వేడుకోవాల్సి వచ్చిన విషయం తెలిసిందే. చంద్రబాబుతో మాట్లాడటానికి ఎన్ని సార్లు అపాయింట్మెంట్ కోరినా జవహర్కి దక్కలేదు. చివరికి ఇటీవల విజయవాడ వచ్చిన చంద్రబాబుకి ఎయిర్పోర్ట్లో ఎదురు వెళ్లి కాళ్లకి మొక్కారు జవహర్ . చంద్రబాబు కేబినెట్లో పనిచేసిన మరో దళిత మంత్రి రావెల కిశోర్ బాబు కూడా ఇటీవల టిడిపిలో దళిత నేతలకు జరుగుతున్న అవమానాలపై ఆగ్రహించారు. చంద్రబాబు, ఆయన సామాజికవర్గం నేతలు కొందరు దళితుల మీద పెత్తనం చేస్తున్నారని చివరాఖరికి చంద్రబాబు కేవలం తన సామాజికవర్గ నేతలకే మద్దతిస్తారని మండిపడ్డ విషయం తెలిసిందే. కాళ్లు మొక్కినా తమకు సీట్లు రావడం లేదని ఆవేదన చెందారు. చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేసిన పీతల సుజాత పరిస్థితి కూడా అంతే. పీతల సుజాత చింతలపూడి సీటు ఆశిస్తున్నారు. గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈమెకు ఇప్పుడు చింతలపూడి సీటు రాకుండా ఇక్కడ కూడా టిడిపి పెత్తందారులే అడ్డుపడుతున్నారని ఆమె వర్గీయులు రగిలిపోతున్నారు. దళితులకు ఎందుకు రాజకీయాలని ఓపెన్గానే చెప్పిన చింతమనేని ప్రభాకర్ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి తన చెప్పు చేతుల్లో ఉండేవాళ్లే కావాలని పట్టుబడుతున్నట్టు సమాచారం. . పీతల సుజాత తన మాట విననందుకే టిక్కెట్ రాకుండా చింతమనేని అడ్డుకున్నాడట. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది టిడిపి దళితనేతల పరిస్థితి ఆ పార్టీలో దయనీయంగా మారింది. వాడుకోవడం వదిలించుకోవడం చంద్రబాబు నైజమనే విషయం తెలిసినా సరే ఆ పార్టీలో కొనసాగడం వల్లనే తమకు ఈనాడు ఈ దుస్థితి వచ్చిందని వారు ఆవేదన చెందుతున్నట్టు తెలుస్తోంది. -
ఎంపీగానా.. వద్దుబాబోయ్! అనంతపురం టీడీపీలో అభ్యర్థుల వెనకడుగు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: తాము చెప్పిందే వేదం... చేసిందే చట్టం... అన్నరీతిలో సాగుతోంది టీడీపీలో అభ్యర్థుల ఎంపిక విధానం. తండ్రీకొడుకులు వేర్వేరు జాబితాలు సిద్ధం చేసుకోవడంతో వారి మధ్య సయోధ్య నడవక... మరోవైపు ఎక్కడ జాబితా ప్రకటించేస్తే అసమ్మతి నేతలు బయటకు వెళ్లిపోతారోనన్న భయంతో ఎక్కడా అభ్యర్థులను ఖరారు చేయకుండా సాగదీత ధోరణి అవలంబిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అయితే పరిస్థితి రోజు రోజుకూ దయనీయంగా తయారవుతోంది. పార్టీ జిల్లా అధ్యక్షులకే తాము కోరుకున్న చోట టికెట్ దొరికే అవకాశం లేకపోవడంతో అయోమయ పరిస్థితి నెలకొంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో అధిష్టానం అనుసరిస్తున్న వైఖరి వారిలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఎంపీగానే వెళ్లాలని అధిష్టానం హుకుం అనంతపురం జిల్లాకు కాలవ శ్రీనివాసులు, శ్రీసత్యసాయి జిల్లాకు బి.కె.పార్థసారథి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరికీ అసెంబ్లీ టికెట్లు లేవని పరోక్షంగా పార్టీ అధిష్టానం సంకేతాలిచ్చింది. ఎమ్మెల్యేలుగా గెలిచే అవకాశం లేనందున ఎంపీలుగా పోటీ చేయాలని వారికి సూచించినట్లు తెలుస్తోంది. ఇందుకు ఇద్దరూ ససేమిరా అంటున్నారు. రెండు రోజుల క్రితం కాలవ శ్రీనివాసులు తాను రాయదుర్గం నుంచే అసెంబ్లీకి పోటీ చేస్తానని కార్యకర్తల సమావేశంలో బహిరంగంగా ప్రకటించారు. అయితే ఆయన ఎట్టిపరిస్థితుల్లోనూ ఎంపీగానే వెళ్లాలని నారా లోకేశ్ తన సన్నిహితుల వద్ద తెగేసి చెప్పినట్టు తెలిసింది. బీకే పార్థసారథి కూడా ఎంపీగా వెళ్లడానికి సుముఖంగా లేరు. మూడు దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉంటే ఇప్పుడు పెనుకొండ టికెట్ ఇవ్వకుండా ఎంపీగా వెళ్లమనడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఉరవకొండకు చంద్రబాబు వచ్చినప్పుడు కూడా టికెట్ గురించి ప్రస్తావించగా.. ఆయన దాటవేసినట్టు తెలుస్తోంది. టికెట్లు ప్రకటించేస్తే వెళ్లిపోతారేమో.. ఇప్పటికిప్పుడు టికెట్లు ఖరారు చేసేస్తే అసమ్మతి నేతలంతా పార్టీని వదిలి వెళ్లిపోతారేమోననే ఆందోళనతోనే అధినేత చంద్రబాబు సాగదీత ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు దాదాపు ఖరారై... ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తుండగా ఇప్పటికీ టీడీపీలో అభ్యర్థులెవరో తేలకపోవడం విశేషం. తాడిపత్రి, హిందూపురం, ఉరవకొండ మినహా.. మిగతా 11 సెగ్మెంట్లలోనూ అభ్యర్థి ఎవరన్నది తెలియని పరిస్థితి నెలకొంది. అనంతపురం అర్బన్ టికెట్ పొత్తులో భాగంగా జనసేనకు ఇవ్వొచ్చుననే ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు ఎన్నికల వ్యయం కోసం ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రులకు చంద్రబాబు, లోకేశ్లు గాలం వేస్తున్నట్టు తెలుస్తోంది. -
వసూళ్లు ‘కాలువై’ పారాయి
సాక్షి ప్రతినిధి, అనంతపురం: తెలుగుదేశం పార్టీకి తీరని శాపంలా పరిణమించిన అంతర్గత విభేదాలు ఒక వైపు..కీలక నేత వసూళ్ల పర్వం మరోవైపు పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ నేత..జిల్లాలో పలు నియోజకవర్గాల నాయకుల నుంచి చేపడుతున్న వసూళ్లు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. ‘మీకు టికెట్ ఇప్పిస్తాను, ముందు కొంత సొమ్ము తీసుకురండి’ అంటూ చెప్పిన మాటలు నమ్మి రూ.50 లక్షల నుంచి కోటి రూపా యల వరకూ ఇచ్చిన వారు కొందరు, మరి కొంత మంది దగ్గర ‘కోటి రూపాయలుంటే ఇవ్వు తర్వాత చూద్దాం’ అంటూ చేబదుళ్ల రూపంలో ఇచ్చిన వాళ్లు కొందరు..ఇలా పలువురు డబ్బులిచ్చి ఇప్పుడు టికెట్ వచ్చే అవకాశమూ లేక, డబ్బులూ వెనక్కు రాక ఆందోళనలో ఉండిపోయారు. డబ్బు అడిగితే.. టూమెన్ కమిటీ శింగనమలకు చెందిన ఓ మహిళా నేత ముఖ్యనేతకు అప్పు అనుకుని కోటి రూపాయలు ఇచ్చారు. కొద్దిరోజులకు తిరిగి డబ్బు అడగ్గానే సదరు నేత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈ నియోజకవర్గంలో ద్విసభ్య కమిటీని వేశారు. దీంతో ఆ మహిళా నేత తన వర్గం నాయకుల దగ్గర తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. తాను అప్పుగా ఇచ్చానని, తిరిగి డబ్బు అడిగినందుకు తనను నియోజకవర్గంలో టికెట్కు దూరం చేశారని చెబుతున్నారు. టూమెన్ కమిటీ ఎవర్ని ఎంపిక చేస్తే వారినుంచి తిరిగి డబ్బు తీసుకునేందుకు రెడీ అవుతున్నారని శింగనమల టీడీపీ నాయకులు చెబుతున్నారు. టూమెన్ కమిటీలో ఉన్న ఒకరు రియల్ ఎస్టేట్లో చాలామందికి డబ్బు ఎగ్గొట్టినట్టు మహిళా నేత వర్గానికి సంబంధించిన ద్వితీయ శ్రేణి నాయకులు చెబుతున్నారు. పలు నియోజకవర్గాల్లో భారీగా దందా.. ఒక్క శింగనమల నియోజకవర్గమే కాదు..పార్టీ పదవిని అడ్డం పెట్టుకుని పలు నియోజకవర్గాల్లో వసూళ్లు చేసినట్టు తెలుగుదేశం నాయకులే వాపోతున్నారు. గుంతకల్లు, కళ్యాణదుర్గం, అనంతపురం వంటి నియోజకవర్గాల్లో కొంతమంది నుంచి రూ.30 లక్షల నుంచి రెండు కోట్ల రూపాయల వరకూ వసూళ్లు చేసినట్టు తెలిసింది. దీంతో పాటు పలువురికి ఎంపీ టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చి వసూళ్లు చేసినట్టు కూడా చర్చ జరుగుతోంది. అధిష్టానాన్ని ఒప్పించి మీకు ఎలాగైనా ఎంపీ టికెట్ ఇప్పిస్తానని సుమారు ఏడెనిమిది మందికి హామీ ఇచ్చారన్న చర్చ ఇప్పుడు టీడీపీ వర్గాల్లో ఊపందుకుంది. మాకు టికెట్ ఇప్పించకపోతే అసలు విషయం బయటకు చెబుతామని కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. ఇప్పటికే పార్టీలో వర్గ రాజకీయాలు ప్రోత్సహిస్తూ భారీ నష్టం చేకూరుస్తున్న నేతకు చాలామంది వ్యతిరేక వర్గం తయారైంది. టికెట్లు ప్రకటించే సమయంలో పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో నంటూ కేడర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. -
అక్కచెల్లెమ్మలే నా స్టార్ క్యాంపెయినర్లు
సాక్షి, అనంతపురం (ఉరవకొండ) : ‘ప్రజలకు ఏ మంచీ చేయని వారికి, ప్రజలను మోసం చేసిన వారికి ఇంత మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. ప్రతి పేద ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించిన మీ బిడ్డకు, మంచి చేసిన మీ బిడ్డకు ఎలాంటి స్టార్ క్యాంపెయినర్లు లేరు. అయితే మీ బిడ్డ వాళ్లెవరినీ నమ్ముకోలేదు. వీళ్లందరి కంటే ఎక్కువగా నాకు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని గట్టిగా చెబుతున్నాను. మీ బిడ్డ ప్రభుత్వంలో మంచి జరిగిన ఇళ్లలోని అక్కచెల్లెమ్మలే నా స్టార్ క్యాంపెయినర్లు’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో మంగళవారం ఆయన వైఎస్సార్ ఆసరా పథకం కింద నాలుగవ విడత నిధుల విడుదల సభలో మాట్లాడారు. ‘జెండాలు జత కట్టడమే వారి అజెండా.. జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ అజెండా’ అని తెలిపారు. వారందరికీ భిన్నంగా తనకున్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు దేశ చరిత్రలోనే కాదు.. రాజకీయ చరిత్రలో ఎవరికి ఉండరన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీరే మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లుగా నిలవాలని కోరారు. జరుగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో మీ బిడ్డకు మీరే సైనికుల్లా నిలవాలన్నారు. మనం వేసే ఓటు.. నొక్కే బటన్ ఎందుకు నొక్కుతున్నామో మనసులో పెట్టుకోవాలని చెప్పారు. మీరు వేసే ఓటు ఒక్క జగన్ను ముఖ్యమంత్రిని చేసుకోవడమే కాదు.. పేద కుటుంబాలు పేదరికం నుంచి బయట పడేందుకనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. జగన్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటేనే అది జరుగుతుందని మనసులో పెట్టుకోవాలని చెప్పారు. వారికి మంచి చేసిన చరిత్రే లేదు ‘చంద్రబాబుకు, ఆయన ఎల్లో మీడియాకు, ఆయన గజదొంగల ముఠాకు మంచి చేసిన చరిత్ర లేదు. చెడు మాత్రమే చేసిన చరిత్ర వారిది. ఎప్పుడూ మోసాలే. చంద్రబాబుకు తోడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, వీరందరికీ ఒక దత్తపుత్రుడు తోడు. ఇటువంటి వారికి రోజూ సమాధానం ఇచ్చుకోవాల్సి వస్తోంది. నిజంగా ఇది కలికాలమే’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఏ మంచి చేయకపోయినా, ఏ పథకాలు అమలు చేయకపోయినా చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లు చాలా మంది ఉన్నారని, చంద్రబాబును భుజాన ఎత్తుకుని మోసే పెద్ద ముఠా ఉందని చెప్పారు. వాళ్లందరూ పక్క రాష్ట్రంలో ఉంటారన్నారు. ‘పక్క రాష్ట్రంలో పరి్మనెంట్ రెసిడెంట్గా ఉన్న చంద్రబాబు దత్తపుత్రుడు, చంద్రబాబు వదిన, మరో స్టార్ క్యాంపెయినర్, పక్క పార్టీలోకి వెళ్లిన మరో స్టార్ క్యాంపెయినర్, ముగ్గురు మీడియా అధిపతులు పొరుగు రాష్ట్రంలో ఉంటారు. అక్కడ ఉన్న మీడియా అధిపతులు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5.. వీళ్లందరూ చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లే. వీరు కాకుండా రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘమంతా కూడా.. ఆయన్ను జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతున్నారు. ఇంకొంత మంది స్టార్ క్యాంపెయినర్లు కూడా చంద్రబాబుకు తో డుగా ఉన్నారు. బీజేపీలో తాత్కాలికంగా తలదాచుకున్న పసుపు కమలాలు.. ఇంకొంత మంది స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారు. అమరావతిలో బాబు భూములకు బినామీలు ఉన్నట్లు.. మనుషుల్లో, ఇతర పార్టీల్లో రకరకాల రూపాల్లో బినామీలుగా చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లుగా కనిపిస్తారు. టీవీల్లో విశ్లేషకుల పేరుతో కనిపిస్తారు. మే«దావుల పేరుతో వేదికల్లో కనిపిస్తారు. వీళ్లందరూ బాబు కోసం పని చేస్తారు. కారణం దోచు కోవడం, పంచుకోవడంలో వీళ్లందరూ కూడా భాగస్వాములే కాబట్టి’ అని సీఎం జగన్ నిప్పులు చెరిగారు. బీసీ రెసిడెన్షియల్ స్కూల్కు రూ.33 కోట్లు జీడిపల్లి రిజర్వాయర్కు సంబంధించి ఆర్ఆండ్ఆర్ ప్యాకేజీ ఇచ్చే పనులు వేగవంతం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. ఉరవకొండ నియోజకవర్గంలో కొత్తగా బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు రూ.33 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. -
అనంతపురం జిల్లా విడపనకల్లు వద్ద వాహనాల తనిఖీలు
-
Anantapur: పరిటాల సునీతకు గట్టి షాక్
సాక్షి ప్రతినిధి, అనంతపురం: తమ కుటుంబానికి రెండుచోట్ల ఎమ్మెల్యే టికెట్లు వస్తున్నట్టు ప్రచారం చేసుకున్న పరిటాల సునీతకు గట్టి షాక్ తగిలింది. 2009, 2014 ఎన్నికల్లో రాప్తాడు నుంచి గెలిచిన సునీత 2019లో ఓటమి పాలైన విషయం విదితమే. నాలుగోసారి కూడా రాప్తాడు నుంచి టీడీపీ తరఫున సునీత పోటీ చేస్తారని భావిస్తూ వచ్చిన ఆమె అనుచరుల్లో ధీమా సన్నగిల్లుతోంది. రోజుకో సమీకరణంతో టికెట్ ఎక్కడిస్తారో నమ్మకం లేకుండాపోయింది. మొన్నటివరకు రాప్తాడుతోపాటు ధర్మవరం టికెట్ తమకే అని పరిటాల కుటుంబం చెప్పుకుంది. ఇప్పుడు అందులో ఒక టికెట్పై ఆశలు వదులుకోవాల్సి వస్తుండటంతో కలవరం మొదలైంది. రాప్తాడు నుంచి తెరపైకి రియల్టర్ అనంతపురం జిల్లాకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి రాప్తాడు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీకి దిగుతున్నారనే ప్రచారం తెరమీదకు వచ్చింది. ఈ సీటు కోసం ఆయన భారీ మొత్తంలో పార్టీ ఫండ్ ఇచ్చేందుకు అధిష్టానంతో డీల్ కుదుర్చుకున్నట్టు తెలిసింది. ఈ నెల 18 లేదా 19న ఆయన పార్టీ అధిష్టానాన్ని కలవనున్నట్టు చెబుతున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో బంధువర్గం ఉండటంతోపాటు బాగా డబ్బు ఖర్చు చేయగలిగిన సామర్థ్యం ఉండటంతో అధిష్టానం ఆయనవైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. రాప్తాడు ఇవ్వకపోతే ధర్మవరం? రాప్తాడు నియోజకవర్గంలో సునీతకు టికెట్ ఇవ్వని పక్షంలో ధర్మవరం పంపించాలనే యోచనలో టీడీపీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తనకు ధర్మవరం టికెట్ కావాలని సునీత కుమారుడు శ్రీరామ్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. తాజా పరిణామాలతో శ్రీరామ్కు టికెట్ ఇచ్చే పరిస్థితి లేకపోగా.. తల్లి సునీతకు ధర్మవరం టికెట్ ఇవ్వొచ్చని అంటున్నారు. రాప్తాడులో సునీతకు అనుకూల పరిస్థితులు లేవని, కొత్త అభ్యర్థి అయితే బావుంటుందని కూడా ఆలోచిస్తున్నారు. సునీతకు నియోజకవర్గంలో అనుకూలంగా లేదనే ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ ఇప్పటికే మొదలుపెట్టింది. సూరిని తీసుకుంటే పరిస్థితి ఏమిటి? చంద్రబాబు ఎక్కడున్నా తగవులు పెట్టి తన్నుకునేలా చేస్తారనే విమర్శ ఉంది. ధర్మవరం నియోజకవర్గంలో వరదాపురం సూరికే టికెట్ ఇవ్వాలని ఆలోచిసూ్తనే సునీతకు కూడా ఇస్తామని లీకులిస్తున్నారు. ఒకవేళ ధర్మవరం నియోజకవర్గానికి సూరిని నియమిస్తే సునీతను పెనుకొండకైనా పంపించాలని మరో వాదన వినిపిస్తోంది. ఉదయం లేచినప్పటి నుంచి చంద్రబాబు జపం చేసే పరిటాల సునీతకు స్థానచలనం చేస్తే ఏళ్ల తరబడి నమ్మకంతో ఉన్న మన పరిస్థితి ఏమిటన్న ఆందోళన కేడర్లో మొదలైంది. కొంప ముంచుతున్న నాన్చుడు ధోరణి చంద్రబాబు చివరివరకూ నాన్చుడు ధోరణి అవలంభిస్తుండటంతో టికెట్ ఆశిస్తున్న నాయకులు మానసికంగా కుంగిపోతున్నారు. ఎన్నికల ముహూర్తం ముంచుకొస్తున్నా.. ఎక్కడ ఏ అభ్యర్థో తేల్చకపోవడంతో ఉమ్మడి అనంతపురం జిల్లా మొత్తం గందరగోళంగా ఉంది. 2019లో చంద్రబాబును నమ్ముకుని రూ.కోట్లు ఖర్చు చేశామని, ఇప్పుడు కూడా ఆయన్ని నమ్ముకుంటే మునుగుతామో తేలుతామో అర్థం కావడం లేదని సీనియర్ నాయకులు వాపోయారు. -
ప్రపంచ స్థాయికి ‘నాసిన్’ కీర్తి
సాక్షి, పుట్టపర్తి: అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటైన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రపంచస్థాయి సంస్థ ‘నాసిన్’ అకాడమీని నెలకొల్పినందుకు ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధన్యవాదాలు తెలియచేశారు. మంగళవారం శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ (నాసిన్) అకాడమీ ప్రారంభోత్సవంలో సీఎం జగన్ ప్రధానితో కలసి పాల్గొన్నారు. ‘నాసిన్’ను తీసుకొచ్చే గొప్ప ప్రయత్నం చేయడమే కాకుండా పట్టుబట్టి సాధించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు సందర్భాలలో ఇక్కడికి రావడం మన కళ్లెదుటే కనిపించిన వాస్తవమన్నారు. ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థ మన రాష్ట్రం పేరు, కీర్తి ప్రతిష్టలను దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ప్రతిబింబిస్తూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అన్నింటిని అనుసంధానించే గొప్ప సంస్థగా నిలవాలని ఆకాంక్షించారు. -
అనంతపురంలో ఎడ్ల, గుర్రం పందాలు (ఫొటోలు)
-
‘స్టాంప్ పేపర్పై సంతకం పెడుతున్నా.. దమ్ముంటే నా సవాల్ స్వీకరించండి’
సాక్షి, అనంతపురం: తనపై వచ్చిన ఆరోపణలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఘాటుగా స్పందించారు. రాప్తాడు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పరిటాల సునీత జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. కొడిమి జగనన్న కాలనీలో కార్మికులను కిడ్నాప్ చేశారంటూ తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి.. అనంతపురం ఆర్అండ్బి అతిథి గృహంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాప్తాడు నియోజకవర్గం కొడిమి జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం కోసం శాన్వి - లోటస్ సంస్థల మధ్య ఒప్పందం జరిగిందని ఆయన వివరించారు. పేదలకు ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి అయ్యేలా తాను చర్యలు తీసుకున్నానని చెప్పారు. శాన్వి సంస్థ నుంచి 55 లక్షల రూపాయలు అడ్వాన్స్ గా తీసుకున్న లోటస్ సంస్థ ప్రతినిధులు పనులు చేయకుండా వెళ్లిపోయారని తెలిపారు. శాన్వి సంస్థ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు పోలీసులు కలకత్తా కార్మికులను అదుపులోకి తీసుకున్నారని.. దీనిపై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్, సీపీఐ నేత రామకృష్ణ, ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే తోపుదుర్తి మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన స్పష్టం చేశారు. తనకు రెండు వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు ఉన్నాయని చంద్రబాబు ఆరోపించారని.. 500 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని ఏబీఎన్ - ఆంధ్రజ్యోతిలో కథనాలు వచ్చాయని.. తనకు 50 కోట్లు ఇస్తే తన ఆస్తులు రాసిస్తానని ఆయన మీడియా ఎదుట వంద రూపాయల స్టాంప్ పేపర్ పై సంతకం చేసి సవాల్ విసిరారు. -
గుంతకల్లులో బడుగు, బలహీనవర్గాల విజయ యాత్ర
అనంతపురం: అనంతపురం జిల్లా గుంతకల్లులో బడుగు, బలహీన వర్గాల ప్రజలు విజయ యాత్ర చేశారు. వైఎస్సార్సీపీ మంగళవారం ఇక్కడ నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండదండలతో తాము సాధించిన సాధికారతను ప్రదర్శించారు. గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ యాత్ర పట్టణంలో పండగ వాతావరణాన్ని నింపింది. వేలాదిగా తరలివచ్చిన ప్రజల సాధికార నినాదంతో గుంతకల్లు హోరెత్తింది. పట్టణ ప్రధాన వీధులన్నీ జనంతో నిండిపోయాయి. యువత కేరింతలతో ఉత్సాహంగా యాత్రలో పాల్గొన్నారు. పట్టణ ప్రజలు యాత్రకు పూల వర్షంతో స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సభ వేలాది ప్రజలతో జనసంద్రంలా కనిపించింది. సభ ఆద్యంతం ‘జై జగన్.. జైజై జగన్’, ‘గిరగరా తిరగాలి ఫ్యాన్’ అంటూ నేతలతో కలిసి నినాదాలు చేశారు. అణగారినవర్గాల కోసం పాటుపడుతున్న సీఎం జగన్ : ఎంపీ సురేష్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం అణగారిన వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్నారని ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. నేడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సాధికారత సాధించి, తలెత్తుకొని తిరుగుతున్నారంటే అది సీఎం జగన్ చేసిన మేలు వల్లేనని అన్నారు. సంక్షేమంలో, అన్ని పదవుల్లో అగ్రస్థానం ఈ వర్గాలకే కేటాయించారని తెలిపారు. అణగారిన వర్గాలను అభివృద్ధి చేసి, సామాజిక న్యాయాన్ని సాధించిన సీఎం జగన్ ఆదర్శనీయుడని, ఈరోజు దేశమంతా మన రాష్ట్రం వైపు చూస్తోందని తెలిపారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, ఏనాడూ పేదల గురించి ఆలోచించలేదని అన్నారు. చంద్రబాబుకు అవకాశం ఇస్తే మరోమారు నట్టేట ముంచుతారని, ఆయన్ని నమ్మవద్దని చెప్పారు. రాష్ట్రానికి దిక్సూచిలా ఉన్న సీఎం వైఎస్ జగన్ను వచ్చే ఎన్నికల్లోనూ ఆశీర్వదించి, మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇది విజయ యాత్ర: ఎల్రక్టానిక్ మీడియా సలహాదారు, సినీ నటుడు అలీ నేడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు రాష్ట్రంలో విజయయాత్ర చేస్తున్నారని, ఇదంతా సీఎం వైఎస్ జగన్ చలవేనని ప్రభుత్వ ఎల్రక్టానిక్ మీడియా సలహాదారు, సినీ నటుడు అలీ చెప్పారు. మనల్ని ఇంత అభివృద్ధిలోకి తీసుకొచ్చి న సీఎం వైఎస్ జగన్కు మనం ఇచ్చే గిఫ్ట్ ‘వై నాట్ 175’ అని అన్నారు. గత ఎన్నికల్లో గుంతకల్లు ప్రజలు 50 వేల మెజార్టీతో వెంకటరామిరెడ్డిని గెలిపించారని, ఈసారి లక్ష మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్ వెంటే నడుద్దాం: మాజీ మంత్రి ఎం. శంకరనారాయణ 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా సామాజిక న్యాయం సాధించిన సీఎం వైఎస్ జగన్ ఒక్కరేనని మాజీ మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే ఎం. శంకరనారాయణ చెప్పారు. మనందరినీ అభివృద్ధిలోకి తెచ్చి , సమాజంలో గౌరవ స్థానం కల్పిస్తున్న సీఎం వైఎస్ జగన్ వెంటే నడుద్దామని పిలుపునిచ్చారు. చంద్రబాబు బడుగు, బలహీన వర్గాలను కేవలం ఓటుబ్యాంకుగా ఉపయోగించుకున్నారని చెప్పారు. అదే వర్గాలను సీఎం జగన్ ఉన్నత స్థితికి తీసుకువెళ్తున్నారని తెలిపారు. వెనుకబడిన వర్గాలకు గౌరవం పెరిగింది: ఎంపీ తలారి రంగయ్య వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చి న ప్రాధాన్యతతో రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు గౌరవం పెరిగిందని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య అన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అత్యున్నత స్థానాల్లో కూర్చోబెట్టారని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలోనూ రూ. 1,500 కోట్ల అభివృద్ధి జరిగిందని అన్నారు. ఇంతటి మేలు చేసిన వైఎస్ జగన్ను వచ్చే ఎన్నికల్లోనూ ఆశీర్వదించాలని కోరారు. -
ఉరవకొండలో ఉరిమిన ఉత్సాహం
అనంతపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు కల్పించిన సముచిత స్థానాన్ని తెలియజేసేందుకు చేపట్టిన ‘సామాజిక సాధికార బస్సు యాత్ర’ జైత్రయాత్రలా సాగుతోంది. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన బస్సుయాత్రకు బడుగు, బలహీన వర్గాల ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. సభా వేదిక ఏర్పాటుచేసిన పాత బస్టాండ్ ప్రాంతమంతా జన సంద్రమైంది. నియోజకవర్గ నలుమూలల నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలు తరలివచ్చి బస్సుయాత్రకు బ్రహ్మరథం పట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం వస్తుందని వక్తలు పేర్కొనడంతో పెద్దఎత్తున హర్షధ్వానాలు చేశారు. ఆత్మగౌరవం నిలబెట్టిన వైఎస్సార్సీపీకి అండగా ఉందాం: హఫీజ్ఖాన్ ఓట్ల కోసం రాజకీయాలు చేసే వాళ్లు వద్దని.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఆత్మగౌరవం నిలబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉందామని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ పిలుపునిచ్చారు. 2014 ఎన్నికలకు ముందు 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పేద వర్గాలను వంచించారన్నారు. ఆయన హయాంలో కనీసం ఆరు హామీలు కచ్చితంగా అమలు జరిగాయని ఎవరైనా నిరూపిస్తే లక్ష రూపాయలు బహుమానం ఇస్తానన్నారు. పేద వర్గాలను ఎప్పుడూ బానిసలుగా చూసిన చంద్రబాబుకు, ఆ వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న జగనన్నకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. జగనన్న అవసరం మనకు ఉందని, ఆయన్ను ఎప్పటికీ మరచిపోవద్దని హఫీజ్ఖాన్ చెప్పారు. మోసగాళ్ల వైపు చూడొద్దు: తలారి రంగయ్య రా.. కదలిరా అంటూ తెలుగుదేశం పార్టీ పిలుపునిస్తోందని, అయితే.. ఇప్పటికే వచ్చి తాము (బడుగు, బలహీనవర్గాలు) ఇక్కడ కూర్చున్నామని, ఇంకెవరు వస్తారు.. ఎక్కడికి కదులుతారు అని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య ఎద్దేవా చేశారు. మోసగాళ్ల వైపు చూడొద్దని, సింహం లాంటి జగన్కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రాజ్యసభ మొదలుకుని స్థానిక సంస్థల వరకు జగనన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేశారని ఆయన గుర్తుచేశారు. కలలో కూడా ఎవరూ ఊహించని విధంగా ఆయా వర్గాల అభివృద్ధికి బాటలు వేసిన జగనన్నను ఎలా మరచిపోగలమన్నారు. బలమైన వర్గాలుగా మార్చిన ఘనత జగన్దే : మాజీమంత్రి శంకరనారాయణ రాష్ట్రంలో బలహీన వర్గాలను బలమైన వర్గాలుగా మార్చిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని మాజీమంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ స్థాయిలో ఏ ముఖ్యమంత్రీ సామాజిక సాధికారతకు కృషిచేయలేదన్నారు. 70 శాతం బలహీన వర్గాల వారే పదవుల్లో ఉన్నారన్నారు. చంద్రబాబు బలహీన వర్గాలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారని విమర్శించారు. సాధికారత కోసం జగన్ తపన : వై.విశ్వేశ్వరరెడ్డి అట్టడుగు వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లోని పేదల సాధికారత కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరితపించారని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఆయా వర్గాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు. పెత్తందారుల వద్ద చేతులు కట్టుకుని నిలబడే పరిస్థితి నుంచి ఆత్మగౌరవంగా నిలబడే స్థాయికి తెచ్చారని ఆయన కొనియాడారు. వచ్చే ఎన్నికల కురుక్షేత్రంలో పేదలు, పెత్తందారుల మధ్య పోటీ ఉంటుందని, పేద వర్గాలే గెలుస్తాయని విశ్వేశ్వరరెడ్డి ధీమా వ్యక్తంచేశారు. ఈనాడు ఫొటోగ్రాఫర్కు జనం మందలింపు.. ఇక ఉరవకొండలో ఆదివారం జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర సభ ముగిసిన తర్వాత ఖాళీ కుర్చీల ఫొటోలు తీస్తున్న ఈనాడు ఫొటోగ్రాఫర్ను జనం మందలించారు. ఈ సభకు నియోజకవర్గ నలుమూలల నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలు భారీసంఖ్యలో తరలివచ్చారు. సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అయితే.. సభ ముగిసి జనం వెళ్లిపోయిన తర్వాత అక్కడ ఖాళీగా కన్పించిన కుర్చీలను ఈనాడు ఫొటోగ్రాఫర్ ఫొటోలు తీస్తుండగా అక్కడున్న కొందరు దీనిని గమనించారు. సభ ముగిసిపోయిన తర్వాత ఎందుకు ఫొటోలు తీస్తున్నావంటూ ప్రశ్నించారు. ఇందుకు అతను దురుసుగా ప్రవర్తించడంతో జనం మందలించారు. దుష్ప్రచారం చేసేందుకు ఇలాంటి కుయుక్తులు మంచివి కాదని హితవు పలికారు. దీంతో ఫొటోగ్రాఫర్ అక్కడి నుంచి జారుకున్నాడు.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
నియోజకవర్గానికో హబ్..
No Headline
No Headline
పాలమూరు సమగ్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
పూర్తిస్థాయిలో వలసల నివారణకు కృషి..
అహంకారానికి,ఆత్మగౌరవానికి మధ్య పోరు..
No Headline
పార్లమెంట్లో ప్రజల గొంతుకనవుతా..
కేంద్ర నిధులతోనే అనేక అభివృద్ధి పనులు..
ఓటింగ్ శాతం పెరుగుతుందా ?..తగ్గుతుందా ?
తప్పక చదవండి
- AP: నేడు 13 జిల్లాలకు భారీ వర్ష సూచన
- నాడు చెప్పుతో కొట్టి.. నేడు ‘కాపు’ కాస్తానంటూ కాకమ్మ కబుర్లు!
- Weekly Horoscope: ఈ రాశి వారికి జీవితాశయం నెరవేరి ఉత్సాహంగా గడుపుతారు
- అమ్మా... నా పేరు గుర్తుందా?
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- చట్టం మీ బాబు చుట్టమా రామోజీ?
- అఫ్గాన్లో ఆకస్మిక వరదలు.. 300 మందికి పైగా మృతి
- ‘ప్లేఆఫ్స్’కు కోల్కతా
- AP: వ్యవసాయం పండగ
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
Advertisement