-
డెలివరీ అయిన మూడోరోజే అనసూయ అలా చేసింది!
సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోల్ అయ్యే యాంకర్.. అనసూయ భరద్వాజ్. ఆంటీ అన్న ఒక్క పదంతో నెటిజన్లు ఈమెను ఆటాడుకుంటారు. తన డ్రెస్సింగ్ను, మాటల్ని.. అన్నింటినీ విమర్శించడమే పనిగా పెట్టుకుంటారు. ప్రతిదాన్ని భూతద్దంలో వెతికి మరీ ఆమెను ట్రోల్ చేస్తుంటారు. అయితే ఎవరెన్ని చేసినా ఆమెను దెబ్బతీయలేరంటున్నాడు సినీ రచయిత బెజవాడ ప్రసన్న కుమార్. ఈయన జబర్దస్త్ కామెడీ షోకి సైతం స్క్రిప్ట్ రైటర్గా వ్యవహరించాడు. అర్ధరాత్రి వరకు.. తాజాగా అతడు అనసూయ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. 'అలీ టాకీస్ అనే షో చేసినప్పుడు అనసూయ ఎపిసోడ్ షూట్ అవగానే రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు రిహార్సల్స్ చేసేది. ఆమెకు పనిపట్ల అంతటి అంకితభావం ఉంది. ఓసారి ఓ టీవీ ఛానల్ వాళ్లు నా డైరెక్షన్లో కొత్త షో చేద్దామన్నారు. అనసూయను యాంకర్గా అనుకున్నారు. ఆమె కూడా ఒప్పుకుంది. టెస్ట్ షూట్ చేద్దామన్నారు. అందుకోసం డేట్ ఫిక్స్ చేసుకున్నాం. డెలివరీ అయిన మూడో రోజే.. సరిగ్గా షూటింగ్కు రెండు రోజుల ముందు ఆమె డెలివరీ అయింది. ఒకరోజు ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంది. రెండో రోజు జిమ్కు వెళ్లింది. మూడో రోజు సెట్కు వచ్చింది. అరగంటకోసారి బిడ్డకు పాలు పడుతూ యాంకరింగ్ చేసింది. అందరం ఆశ్చర్యపోయాం.. ఆ రోజు షూటింగ్కు వచ్చినందుకుగానూ ఇంతవరకు డబ్బులు అడగలేదు. టెస్ట్ షూటే కదా నేను రాలేను, ఇంకెవర్నైనా చూసుకో అని మాట వరసకు కూడా అనలేదు. అందరూ ఊరికే తనను విమర్శిస్తుంటారు. కానీ తనంత టఫ్ అమ్మాయి ఇండస్ట్రీలో ఎవరూ లేరు. పైకి చూడటానికి గ్లామర్గా కనిపిస్తుంది కానీ దాని వెనక ఆ అమ్మాయి పడ్డ కష్టాలు ఎవరికీ తెలియదు' అని చెప్పుకొచ్చాడు ప్రసన్న కుమార్. చదవండి: ప్రియుడిని పెళ్లాడిన రకుల్.. మరోసారి.. -
Anasuya Bharadwaj: అనసూయ దీపావళి సంబరాలు (ఫోటోలు)
-
అలాంటి వాళ్లు ‘ఆంటీ’ అంటే నాకు ఇష్టమే : అనసూయ
అనసూయ భరద్వాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. బుల్లితెరపై యాంకర్గా కెరీర్ని ప్రారంభించి.. వెండితెరపై దూసుకెళ్తోంది. నిడివిని పట్టించుకోకుండా.. విభిన్నమైన పాత్రలను పోషిస్తూ.. టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా రంగస్థలం’లోని రంగమ్మత్త క్యారెక్టర్ అనసూయకు మంచి గుర్తింపుని తేవడంతో పాటు వరుస సినిమా అవకాశాలు వచ్చేలా చేసింది. అయితే అనసూయ మాత్రం సినిమా ఎంపిక విషయంలో ఆచుతూచి వ్యవహరిస్తోంది. కేవలం డబ్బు కోసమే కాకుండా..గుర్తింపు వచ్చే పాత్ర ఉంటేనే సినిమాలు ఒప్పుకుంటుంది. అందుకే మన దర్శకులు అనసూయ కోసం ప్రత్యేక పాత్రలను క్రియేట్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన పెదకాపు చిత్రంలోనూ.. అనసూయ మంచి పాత్ర పోషించింది. ప్రస్తుతం పుష్ప 2తో పాటు పలు సినిమాల్లోనూ నటిస్తోంది. కెరీర్ పరంగా ఇలా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటుంది అనసూయ. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా తన సోషల్ మీడియా ఖాతాల్లో వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది. ఆమె షేర్ చేసే కొన్ని ఫోటోలు, వీడియోలు కాంట్రవర్సీకి దారి తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆమె పెట్టే పోస్ట్లను కొంతమంది నెటిజన్స్ ట్రోల్ చేస్తుంటారు. అందులో ముఖ్యంగా ‘ఆంటీ’అనే పదాన్ని వాడుతూ నెగెటివ్ కామెంట్స్ చేస్తుంటారు. ‘ఆంటీ’ అనే పదం వింటే తనకు ఎందుకు కోపం వస్తుందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించింది అనసూయ. ఆంటీ అనే పదం తప్పు కాదు కానీ.. ఎదైన అంశంపై నేను స్పందిస్తే చాలు.. ‘ఇంట్లో ఉండి పిల్లలను చూసుకోవచ్చు కదా ఆంటీ ’అని కామెంట్స్ పెడతారు. ‘ఆంటి అనే పదం తప్పు కాదు.. కానీ చాలామంది ఇప్పుడు ఈ పదాన్ని వల్గర్గానే వాడుతున్నారు. చిన్న పిల్లలు, తెలిసిన వాళ్ళు వచ్చి ఆంటీ అని ముద్దుగా పిలుస్తారు. అలా వాళ్లు ఆంటీ అని పిలిస్తే నాకు ఇష్టమే. కానీ నా కంటే పెద్దవాళ్లు, తెలియని వాళ్లు ‘ఆంటీ’ అని మరో అర్థం వచ్చేలా పిలిస్తారు. అందుకే నాకు ఆ పదం నచ్చదు. ఆంటీ అంటే ఇంగ్లీష్ లో పిన్ని అని అర్థం. అమ్మ తర్వాత అమ్మ లాంటి వాళ్ళని పిలవడానికి ఈ పదాన్ని వాడతారు. కానీ ఇప్పుడు ఆ పదాన్ని కొంతమంది వల్గర్గా వాడుతున్నారు. వాళ్లే భవిష్యత్తులో రేపిస్టులు అవుతారు నేను చిన్నప్పుడు చాలా మందిని ఆంటీ అనే పిలిచాను. ఇప్పటికీ కొంతమంది తెలిసిన వాళ్లను అలానే పిలుస్తాను. ఆంటీ అని పిలవడం వాళ్లకు నచ్చకపోతే.. నేను పిలవడమే మానేస్తాను. అలా పిలిస్తే..వాళ్లు హర్ట్ అవుతారని నేను అర్థం చేసుకోగలను. నాకు ఆంటీ అని పిలిపించుకోవడం ఇష్టం లేదని చెప్పిన తర్వాత..మళ్లీ మళ్లీ ఎందుకు అనాలి? పైశాచిక ఆనందం కోసం ఎదుటివాళ్లను హర్ట్ చేయాలా? నా మీద కామెంట్స్ చేసిన వాళ్లను ఈ జన్మలో ఎప్పుడో ఒక్కసారైనా ఎదురెదురుగా చూసే అవకాశం వస్తుందో లేదో నాకు తెలియదు. పైగా నేను ఎలా ఉంటానో అతనికి తెలియదు. ఇలా ఫేస్ టు ఫేస్ పరిచయం లేని వ్యక్తిపైనే ఇంత అయిష్టాన్ని పెంచుకుంటే.. చుట్టుపక్కల ఉన్న మహిళలను ఇంకెలా చూస్తారు? ఇలాంటి వాళ్లే భవిష్యత్తులో రేపిస్టులుగా మారుతారు’అని అనసూయ చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Rajesh Manne Official (@rajeshmanne1) -
Anchor Anasuya HD Photos: తెల్ల చీరలో యాంకర్ అనసూయ స్టన్నింగ్ లుక్స్
-
ఐదు రోజులుగా ఆ సమస్యతో బాధపడుతున్న అనసూయ!
ఎవరేం అనుకున్నా ఐ డోంట్ కేర్ అంటూ తనకు నచ్చినట్లుగా ముందుకు సాగుతుంది యాంకర్ అనసూయ భరద్వాజ్. తన మనసులో ఉన్న మాటను నిస్సంకోచంగా బయటపెడుతుంది. ఎటువంటి విమర్శలనైనా లైట్ తీసుకుంటుంది. ఒకవేళ కోపమొస్తే సోషల్ మీడియా వేదికగా కౌంటరిస్తుంది. కానీ ఏ తాటాకు చప్పుళ్లకు ఆమె భయపడదు. అయితే తాజాగా ఆమె అస్వస్థతకు లోనైనట్లు తెలుస్తోంది. ఐదు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నానంటూ అనసూయ ట్విటర్(ఎక్స్)లో చెప్పుకొచ్చింది. 'ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాను. అందుకే సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉన్నాను. ఈ సమయంలో చాలా విషయాలు గుర్తించాను. నిర్దయగా వ్యవహరించడం, సాటి మనుషుల పట్ల జాలి లేకపోవడం.. వేధింపులు.. ఇలా చాలా గమనించాను. అసలు మనం ఎటువైపు వెళ్తున్నాం..' అని ఆమె ట్వీట్ చేసింది. 'ఇప్పుడు స్టార్స్గా వెలుగొందుతున్నవారందరూ తమ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నవారే! ఎటువంటి పీఆర్ ప్రమోషన్స్ లేకుండా అద్భుత విజయాలు అందుకుని వారు ఈ స్థాయికి చేరుకున్నారు. వారి ప్రయాణాన్ని గౌరవించండి. అంతేకానీ వారి అభిమానులం అని చెప్పుకుని మరొకర్ని కించపరచొద్దు. విమర్శించడం మంచిదే.. కానీ అది గౌరవప్రదంగా ఉండాలి. బహిరంగంగా బూతుపదాలు, అడ్డగోలుగా మాట్లాడటాన్ని తగ్గించండి. బాధ్యతగా వ్యవహరించండి' అని చెప్పుకొచ్చింది అనసూయ. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్గా మారింది. It’s good to see such hard core admiration.. really.. its good to have differences in options.. its okay to criticise.. but it should be done with die respect.. please don’t normalise the horrible uncivilised language.. that too so out in the open.. let it be constructive..🙏🏻 — Anasuya Bharadwaj (@anusuyakhasba) September 16, 2023 View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
అనసూయ బాధని అర్థం చేసుకున్న ఆ వ్యక్తి!
యాంకర్ అనసూయ ఉన్నట్టుండి ఏడ్చేసింది. తన ఇన్ స్టాలో రీసెంట్గా ఆ వీడియో పోస్ట్ చేసింది. దీంతో అందరూ ఆమెకి ఏమైందా అనుకున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ వల్ల బాధపడిందేమో అనుకున్నారు. కానీ కారణం అది కాదని, ఆ నెగిటివిటీకి తాను బాధపడే రకం కాదని చెప్పుకొచ్చింది. అయితే అనసూయ ఏం చెప్పాలనకుందనేది ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఆమె మనసు అర్థం చేసుకున్నాడు. ఓ లెటర్ రాశాడు. ఆ వ్యక్తి లెటర్ అనసూయ ఏడుపు వీడియో పోస్ట్ చేయగానే చాలామంది ఆమెపై కౌంటర్స్ వేశారు. ఎందుకంటే సమయం సందర్భం లేకుండా దీన్ని పోస్ట్ చేయడం ఒకటైతే, ఆ కారణంతో ఏడవలేదు, ట్రోల్స్ రీజన్ కాదని ఏదేదో చెప్పుకొచ్చింది. అయితే ఈమె వీడియో సారాంశాన్ని అర్థం చేసుకున్న ఓ అభిమాని, ఆమెకు ఓ లెటర్ రాశాడు. ఇప్పుడు దాన్ని అనసూయ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. తాను చెప్పాలనుకున్నది ఈ మేటరే అని పేర్కొంది. (ఇదీ చదవండి: బ్రేకప్స్ గురించి బయటపెట్టిన యాంకర్ రష్మీ) లెటర్లో ఏముంది? 'సోషల్ మీడియా మెల్లగా మన జీవితాల్ని ఆక్రమించేసింది, తన గుప్పిట్లోకి మనల్ని లాగేసకుంది. అనసూయ ముఖ్యమైన పాయింట్ లేవనెత్తింది. ఫొటోల్లో సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తున్నాం. కానీ మనం బాధల్లో బతుకుతున్నాం కదా? హ్యాపీగా ఉన్నామని చూపించుకుంటూ ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నాం. సైకియాట్రిస్ట్లు ఇదే చెబుతున్నారు. సంతోషంగా ఉండటానికి బదులు అలా చూపించుకునే వరకు వచ్చాం' 'ఆ వీడియోలో మనం ఓ విషయం గమనించొచ్చు. ఫెర్ఫెక్షన్ అనేది బూటకం. ఒత్తిడికి కారణం అదే. అనుభవం అనేది వయసుతో రాదు. ఎదుర్కొన్న పరిస్థితులు, తగిలిన దెబ్బలతో వస్తుంది. అందరి పట్ల దయతో ఉండండి. వారి జీవితాల్లో ఎలాంటి బాధ అనుభవిస్తున్నారో మనకు తెలీదు అని అనసూయ చెప్పింది. ట్రోలింగ్ వల్ల బాధపడతారు. ఓ మాట అనేటప్పుడు ఇవి ఆలోచించాలి. అంటున్నది నిజమేనా? ఎదుటివాళ్లు బాధపడతారా? మనకు జాలి దయ లేవా? అనేవి గుర్తుపెట్టుకోవాలి' అని లెటర్లో రాసుంది. ఇదంతా చూస్తుంటే.. సోషల్ మీడియా ట్రోలింగ్ గురించే అని అనసూయ బాధపడుతుందని అర్థమవుతోంది. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 కొత్త సినిమాలు) -
Anasuya Bharadwaj : అనసూయని ఎత్తుకున్న భర్త.. మామిడితోటలో అలా! (ఫోటోలు)
-
భర్తతో బీచ్లో మరోసారి ఘాటు అందాలతో రెచ్చిపోయిన యాంకర్ అనసూయ (ఫొటోలు)
-
బికినీలో అనసూయ రచ్చ.. భర్తతో కలిసి బీచ్లో వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
Anchor Anasuya : స్విమ్మింగ్ పూల్లో ఫ్యామిలీతో అనసూయ, మొదటిసారి బికినీలో (ఫొటోలు)
-
Anchor Anasuya: కుటుంబ సభ్యులతో కలిసి యాంకర్ అనసూయ పుట్టినరోజు వేడుకలు (ఫొటోలు)
-
మీ పెంపకం ఎలాంటిదోనన్న అనసూయ.. ఈ లొల్లేందన్న రాహుల్
హీరోలకు అభిమానులు రక్షణ కవచం వంటివారు. తమ అభిమాన హీరోను పల్లెత్తు మాట అన్నా అస్సలు సహించలేరు. అలాంటిది ఏకంగా కించపరిస్తే ఊరుకుంటారా? పట్టపగలే చుక్కలు చూపిస్తారు. యాంకర్, నటి అనసూయ విషయంలో ఇదే జరిగింది. ఎందుకోగానీ ఎప్పటినుంచో అనసూయకు, విజయ్ దేవరకొండ అంటే పడదు. గతంలో ఈ హీరో స్టేజీపైనే బూతు డైలాగ్ చెప్పాడని విమర్శించినందుకు ఫ్యాన్స్ అనసూయనే తిట్టిపోశారు. ఇటీవల డైరెక్ట్గా విజయ్ దేవరకొండ పేరును ప్రస్తావించకపోయినప్పటికీ అతడు ఖుషి సినిమా పోస్టర్లో పేరుకు ముందు The అని పెట్టుకోవడంపై సెటైర్లు వేసింది. పైత్యం.. అంటకుండా చూసుకుందాం అంటూ ట్వీట్ చేసింది. ఇంకేముంది, ఆ మాట ఎవరిని ఉద్దేశించి అందో అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు అభిమానులు. మా రౌడీ హీరో మీద నీకెందుకంత ఒళ్లు మంట ఆంటీ.. అంటూ మళ్లీ ఆమెను ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. అటు అనసూయ కూడా ఎక్కడా తగ్గకుండా వీలు దొరికినప్పుడల్లా రివర్స్ కౌంటర్ ఇస్తూ వస్తోంది. తనపై బూతుల వర్షం కురిపిస్తున్నవారిని ఉద్దేశిస్తూ తాజాగా ఓ ట్వీట్ వేసింది అనసూయ. 'నువ్వు నన్ను తిడితే నీ కంపు నోరు తప్పవుతుంది కానీ నేనెలా తప్పవుతాను? నా పెంపకం గర్వించదగ్గది.. నా అభిప్రాయాన్ని ధైర్యంగా గౌరవపూర్వకంగా చెప్పటం నేర్పింది. మీ పెంపకం ఎలాంటిదో మీరే అర్థం చేసుకోండి' అని రాసుకొచ్చింది. దీనిపై కమెడియన్ రాహుల్ రామకృష్ణ స్పందిస్తూ 'ఇలా అడుగుతున్నందుకు దయచేసి నన్ను క్షమించగలరు, ఇంతకీ ఇక్కడ జరుగుతున్న లొల్లి ఏంటో తెలుసుకోవచ్చా?' అని అడిగాడు. దీనికి నెటిజన్లు.. 'అనసూయ వర్సెస్ విజయ్ ఫ్యాన్స్ వార్ జరుగుతోంది', 'ఎప్పుడు చూడూ లైమ్ లైట్ కోసం హంగామా అనిపిస్తోంది, బేకార్ ముచ్చట్లు బేకార్ పంచాయితీలు.. అందరూ ఆమెను ఆంటీ అనడం మేడమ్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం', 'విజయ్ The అన్న పదం ఖుషీ పోస్టర్లో వాడినందుకు అనసూయకు కోపమొచ్చింది నోటికొచ్చినట్లు వాగింది, చివరికి ఫ్యాన్స్ చేతిలో చీవాట్లు తింటోంది' అని కామెంట్లతో క్లారిటీ ఇస్తున్నారు. Pardon me for being uninformed but I’m curious to know what this is all about 🧐 — Rahul Ramakrishna (@eyrahul) May 10, 2023 చదవండి: భార్యను దూరం పెట్టిన పూరీ జగన్నాథ్? క్లారిటీ ఇదే! -
మళ్లీ రెచ్చిపోయిన అనసూయ.. విజయ్ను టార్గెట్ చేసిందా?
యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓవైపు యాంకర్గా కొనసాగుతూనే మరోవైపు సినిమాల్లోనూ రాణిస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే అనసూయ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా షేర్ చేస్తుంటుంది. అయితే అవి కొన్నిసార్లు కాంట్రవర్సీలకు కారణం అవుతుంటాయి. తాజాగా విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ అనసూయ చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదంగా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. విజయ్ దేవరకొండ, సమంత జంటగా ఖుషీ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ను షేర్ చేస్తూ ఓ పోస్టర్ను వదిలారు. ఇందులో ది విజయ్ దేవరకొండ అని రాసి ఉంది. (సాధారణంగా యూనిక్ విషయాలకు, వస్తువుల గురించి మెన్షన్ చేసేటప్పుడు ది అని వాడుతుంటాం). ఈ పోస్టర్పై పరోక్షంగా స్పందించిన అనసూయ ట్వీట్ చేస్తూ.. ఇప్పుడే ఒకటి చూశాను.. ‘The’నా?? బాబోయ్.. పైత్యం.. ఏం చేస్తాం.. అంటకుండా చూసుకుందాం" అంటూ ఎవరి పేరు మెన్షన్ చేయకుండానే అనాల్సిందంతా అనేసింది. ఈ క్రమంలో విజయ్ను కావాలనే టార్గెట్ చేసిందంటూ రౌడీ ఫ్యాన్స్ అనసూయపై ఫైర్ అవుతున్నారు. ఆంటీ అంటూ అనసూయను తెగ ట్రోల్ చేస్తున్నారు. దీనిపై రియాక్ట్ అయిన అనసూయ.. భలే రియాక్ట్ అయ్యారు దొంగ.. ఊప్స్.. బంగారుకొండలంతా నేను అనేది నిజమని నిరూపిస్తున్నారు అంటూ మరో ట్వీట్ చేసింది. గతంలో అర్జున్ రెడ్డి, లైగర్ సినిమాల విషయంలోనూ అనసూయ, విజయ్ ఫ్యాన్స్కు మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. Ippude okati chusanu.. “The” na?? Babooooiii!!! Paityam.. enchestam.. antakunda chuskundam 🙊 — Anasuya Bharadwaj (@anusuyakhasba) May 5, 2023 Bhale react autunnarra donga..oops.. bangarukondalanta.. ekkado akkada nenu nijam anedi prove chestune unnanduku thanks ra abbailu 🤭😊😇 — Anasuya Bharadwaj (@anusuyakhasba) May 5, 2023 -
'విమానం'లో అనసూయ లుక్ అదిరిందిగా.. రంగమ్మత్తలా ఉందే!
బుల్లితెరపై స్టార్ యాంకర్గా కంటిన్యూ అవుతూనే సినిమాల్లోనూ రాణిస్తుంది అనసూయ భరద్వాజ్. ఓవైపు బుల్లితెరపై అలరిస్తూనే, వెండితెరపై కూడా సత్తా చాటుతుంది. ఇప్పటికే పలు చిత్రాల్లో లీడ్ రోల్ పోషిస్తూ నటిగా తనని తాను ప్రూవ్ చేసుకుంది. తాజాగా మరో విభిన్నమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమె కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం విమానం. నేడు(సోమవారం)మేడే సందర్భంగా అనసూయ లుక్ను రివీల్ చేశారు మేకర్స్. ఇది రంగస్థలంలో ఆమె చేసిన రంగమ్మత్త పాత్రను గుర్తుచేస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. చదవండి: షాకింగ్ న్యూస్ చెప్పిన స్టార్ హీరో.. ట్వీట్ వైరల్ సంతోష్ కట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా అనసూయ భరద్వాజ్, మీరా జాస్మిన్,సముద్రఖని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జూన్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
ఎంగేజ్మెంట్ శారీలో మురిసిపోతున్న అనసూయ.. ఫోటోలు వైరల్
బుల్లితెరపై యాంకర్ అనసూయ భరద్వాజ్ క్రేజ్ గురించిన తెలిసిందే. గ్లామరస్ యాంకర్గా అనసూయకు పేరుంది. ఓవైపు బుల్లితెరపై అలరిస్తూనే, వెండితెరపై కూడా సత్తా చాటుతుంది. ఇప్పటికే పలు చిత్రాల్లో లీడ్ రోల్ పోషిస్తూ నటిగా తనని తాను ప్రూవ్ చేసుకుంది.ప్రస్తుతం టీవీ షోలతో పోలిస్తే సినిమాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. వరుస మూవీ ఆఫర్లతో బిజీబిజీగా ఉంటోంది. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే అనసూయ తనకు సంబంధించిన పలు విషయాలను షేర్ చేస్తుంటుంది. తాజాగా తన పెళ్లినాటి మధుర ఙ్ఞాపకాలను షేర్ చేసుకుంది. గులాబీ రంగు చీరలో మెరిసిపోయిన అనసూయ.. ఇది 15ఏళ్ల క్రితం నాటి తన ఎంగేజ్మెంట్ శారీ అంటూ మురిసిపోయింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసుకుంది. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
ఇప్పుడు ఆంటీ అంటే కోపం రావడం లేదు: యాంకర్ అనసూయ
యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బుల్లితెరపై స్టార్ యాంకర్గా కంటిన్యూ అవుతూనే సినిమాల్లోనూ రాణిస్తుంది.సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అనసూయ తరచూ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్తో నిత్యం టచ్లో ఉంటుంది. అయితే ఈమధ్య కాలంలో ఆమెపై ట్రోలింగ్ ఎక్కువైంది. ఆంటీ అంటూ కొందరు నెటిజన్లు ఓ రేంజ్లో ఆడేసుకుంటున్నారు. అలా ట్రోల్స్ చేసిన వాళ్లపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా అరెస్ట్ వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం ఇన్స్టాగ్రామ్ నెటిజన్లతో కాసేపు ముచ్చటించిన అనసూయ వాళ్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఇందులో భాగంగా ఓ నెటిజన్.. అక్కా.. మిమ్మల్ని ఎవరన్నా ఆంటీ అంటే ఎందుకు అంత కోపం వస్తుంది అని అడిగారు. దీనికి అనసూయ సమాధానమిస్తూ..ఎందుకంటే వాళ్ళ అర్దాలు వేరే ఉంటాయి కాబట్టి. అయినా ఇప్పుడు కోపం రావట్లేదు. అది వాళ్ళ కర్మకే వదిలేస్తున్నా. అలాంటి వాళ్ళని కరెక్ట్ చేయడం కంటే కూడా నాకు అంతకంటే ముఖ్యమైన పనులు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చింది. ఒక త్వరలోనే మరో క్రేజీ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ చేస్తానని చెప్పి క్యూరియాసిటీని పెంచింది. -
అనసూయ ఏం చేసినా అలానే పిలుస్తున్నారే
-
నేను అదే మొత్తుకుంటున్నా.. నిజ జీవితంలో అలా కాదు అని!
బుల్లితెరపై యాంకర్గా, వెండితెరపై నటిగా రాణిస్తోంది అనసూయ భరద్వాజ్. ఇద్దరు పిల్లల తల్లైనా కూడా ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తోంది. అయితే ఆమధ్య అనసూయ ఆంటీ వివాదంలో చిక్కుక్కున్న విషయం తెలిసిందే! వీలైనంతవరకు తనను విమర్శించినవారికి గట్టి సమాధానం ఇస్తూ పోయింది అనసూయ. ఇకపోతే కథ నచ్చితే ఎలాంటి పాత్రయినా చేస్తుందీ యాంకర్. లేడీ విలన్ టైప్ క్యారెక్టర్లను కూడా అవలీలగా నటించేస్తుంది. అయితే ఆ పాత్రను చూసి తమ క్యారెక్టర్లు డిసైడ్ చేయకండంటూ షారుక్ మాట్లాడిన వీడియోను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేసింది అనసూయ. అందులో పఠాన్ హీరో షారుక్ మాట్లాడుతూ.. 'డర్, బాజీగర్లో నేను నెగెటివ్ రోల్స్ చేశాను. జాన్ అబ్రహం కూడా చాలా నెగెటివ్ రోల్స్ చేశాడు. అలా అని మేమంతా చెడ్డవాళ్లం కాదు. కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే ఆయా పాత్రలు పోషిస్తాము' అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను అనసూయ షేర్ చేస్తూ 'ఎప్పటినుంచో నేనూ అదే చెప్తున్నా.. మేము ప్రతికూల పాత్రల్లో నటిస్తామే తప్ప రియల్ లైఫ్లో అలా ఉండము' అని రాసుకొచ్చింది. చదవండి: కోలీవుడ్ ఎంట్రీకి రెడీ అయిన జాన్వీ కపూర్ కె.విశ్వనాథ్ చివరి క్షణాల్లో జరిగిందిదే.. -
వారి వల్లే అనసూయ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిందా?
టాలీవుడ్ ప్రేక్షకులకు అనసూయ భరద్వాజ్ గురించి పరిచయం అక్కర్లేదు. బుల్లి తెరపై అందాలు ఆరబోస్తూ, అద్భుతమైన వ్యాఖ్యానంతో అలరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును, అభిమానులను సంపాదించుకుంది. యాంకరింగ్తో పాటు సినిమాల్లోనూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకుంది. రంగస్థలం మూవీలో ఆమె పోషించిన రంగమ్మత్ర పాత్రకు ఎంతటి ఆదరణ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే క్రేజ్ ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. చదవండి: మహేశ్ సినిమాకు హాలీవుడ్ ఏజెన్సీతో ఒప్పందం చేసుకున్నా: రాజమౌళి దీంతో ఆమె వెండితెరపై నటిగా ఫుల్ బిజీ అయిపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో చిన్న సినిమాలు, భారీ బడ్జెట్లో చిత్రాలతో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రీసెంట్లో ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమెకు మరోసారి జబర్దస్త్ షో వీడటంపై ప్రశ్న ఎదురైందట. ఇక దీనికి ఆమె స్పందిస్తూ ఈ షో నుంచి బయటకు రావడానికి రకరక కారణాలున్నాయని చెప్పినట్లు తెలుస్తోంది. అందులో తన పిల్లలు కూడా ఉన్నారని ఆమె పేర్కొందట. చదవండి: అల్లు అర్జున్కు దుబాయ్ ప్రభుత్వం అరుదైన గౌరవం ప్రస్తుతం నటిగా తాను ఫుల్ బిజీగా ఉన్నానని, ఇటూ షూటింగ్, అటూ షోలు చేస్తు ఇంట్లో పిల్లలకు సమయం ఇవ్వలేకపోతున్నానని చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే జబర్దస్త్ మానేయాల్సి వచ్చిందని అనసూయ పేర్కొంది. కాగా ప్రస్తుతం అనసూయ పుష్ప2, కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాలతో పాటు గురజాడ అప్పారావు నాటకం ‘కన్యాశుల్కం’ నవల ఆధారంగా తెరెకెక్కితోన్న కన్యాశుల్కం అనే వెబ్సిరీస్లోనూ నటిస్తోంది. అలాగే సందీప్ కిషన్ తాజా చిత్రం మైఖేల్లో కూడా ఓ కీలక పాత్ర చేసింది. ఇది పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. -
మరో పాన్ ఇండియా చిత్రంలో అనసూయ... పోస్టర్ అవుట్
యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఓవైపు స్టార్ యాంకర్గా కొనసాగుతూనే, మరోవైపు వరుస సినిమాలతో సత్తా చాటుతోంది. రంగస్థలం, పుష్ప సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ తాజాగా మరో పాన్ ఇండియా సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా మైఖేల్ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈయనతో పాటు అనసూయ కూడా ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. మ్యాడ్ ఆఫ్ క్వీన్ అంటూ పవర్ ఫుల్ గెటప్లో అనసూయ కనిపిస్తుంది. మరి ఈ సినిమా అనసూయ కెరీర్కు ఎంతవరకు ప్లస్ అవుతుందన్నది చూడాల్సి ఉంది. -
యాంకర్ అనసూయకు బాహుబలి కాజాతో సత్కారం
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): టీవీ యాంకర్, సినీనటి అనసూయ భరద్వాజ్కు శనివారం సురుచి పీఆర్వో వర్మ బాహుబలి కాజా అందించి సత్కరించారు. పెద్దాపురంలో షోరూమ్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమెకు కాకినాడలోని ఒక హోటల్లో ఈ కాజా అందించినట్టు ఆయన వివరించారు. జిల్లాకు ప్రముఖులెవ్వరు వచ్చినా బాహుబలి కాజా అందివ్వడం సురుచి సంప్రదాయమన్నారు. కాగా స్టార్ యాంకర్గా కొనసాగుతూనే సినిమాల్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటుంది అనసూయ. రంగస్థలంతో విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ బ్యూటీ ‘థ్యాంక్యూ బ్రదర్’, ‘ఖిలాడీ’, ‘పుష్ప’ సహా ఎన్నో చిత్రాల్లో నటించి సత్తాచాటింది. చివరగా దర్జా చిత్రంలో కనిపించింది. -
శ్రీకాళహస్తిలో యాంకర్ అనసూయ పూజలు.. ఫోటోలు వైరల్
-
క్రిస్మస్ సెలబ్రేషన్స్లో స్టార్స్ సందడి.. బ్యూటీల తళుకులు-మెరుపులు
► క్రిస్మస్ సెలబ్రేషన్స్లో కాజల్ సిస్టర్స్ ► యంగ్ లుక్తో మెరిసిపోతున్న మీరా జాస్మిన్ ► యాంకర్ నిఖిల్ క్రిస్మస్ పార్టీలో టాలీవుడ్ సెలబ్రిటీలు ► అందంతో కేక పుట్టిస్తోన్న హీరోయిన్ శ్రీలీల ► భర్తతో కాజల్ క్యూట్ ఫోటో View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Meera Jasmine (@meerajasmine) View this post on Instagram A post shared by Gautam Kitchlu (@kitchlug) View this post on Instagram A post shared by Are Syamala (@syamalaofficial) View this post on Instagram A post shared by Are Syamala (@syamalaofficial) View this post on Instagram A post shared by Mehaboob Dil Se (@mehaboobdilse) View this post on Instagram A post shared by Ariaana & Viviana Manchu (@ariviviofficial) View this post on Instagram A post shared by Shilpa Reddy (@shilpareddy.official) View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) View this post on Instagram A post shared by Viranica Manchu (@viranica) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by Nikhiluuuuuuuuu (@nikhilvijayendrasimha) View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
సుడిగాలి సుధీర్పై అనసూయ కాంట్రవర్సీ కామెంట్స్.. ఫ్యాన్స్ ట్రోలింగ్
బుల్లితెరపై యాంకర్ అనసూయ భరద్వాజ్ క్రేజ్ గురించిన తెలిసిందే. తనదైన యాంకరింగ్, అందం, గ్లామర్తో హీరోయన్లకు సమానమైన ఫ్యాన్ బేస్ను సంపాదించుకుంది. బుల్లితెరపై అలరిస్తూనే, వెండితెరపై కూడా సత్తా చాటుతుంది. ఇప్పటికే పలు చిత్రాల్లో లీడ్ రోల్ పోషిస్తూ నటిగా తనని తాను ప్రూవ్ చేసుకుంది. ప్రస్తుతం టీవీ షోలతో పోలిస్తే సినిమాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. వరుస మూవీ ఆఫర్లతో బిజీబిజీగా ఉంటోంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ కార్యక్రమంలో సుడిగాలి సుధీర్పై అనసూయ చేసిన కామెంట్స్ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్గా నిలిచాయి. ఇంతకీ ఏం జరిగిందంటే.. సుధీర్తో వర్క్ చేయడం ఎలా ఉంది? అని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా.. అనసూయ కాస్త సీరియస్గానే ఆన్సర్ ఇచ్చింది. ''సుధీర్ నా జూనియర్. నేను సీనియర్ని అని మర్చిపోయారా? నాతో కలిసి పనిచేయడం ఎలా ఉందో సుధీర్ని అడగండి. అతడు నా నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పాడు. నేను కూడా అతన్నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా'' అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడీ కామెంట్స్పై అనసూయను ట్రోల్ చేస్తున్నారు సుధీర్ ఫ్యాన్స్. 'రెండు, మూడు సినిమాలు చేసేసరికి ఇంత ఓవర్ యాక్షన్ అవరసరమా? సుధీర్ గురించి అడిగితే ఒక్క మాట చెప్పలేవా? అయినా స్టార్ హీరోలతో కూడా అనసూయతో పనిచేయడం ఎలా ఉంది అని వాళ్లనే అడగండి అని చెప్తావ్ కదా' అంటూ విమర్శిస్తున్నారు. 🙄🙄 ee lekkana pedda hero movies lo mother characters cheysey vallani aa hero tho cheyadam ela undi ani adagoddu annatlu #anasuyabharadwaj #Anasuya #Aunty pic.twitter.com/VmQ1P8ojGr — Idly_Vishwanatham (@Idly_Baba) December 14, 2022 -
మత్తు కళ్లతో మలైక.. మతిపోగొడుతున్న అనసూయ
సోషల్ హల్చల్: ► క్యూట్ లుక్స్తో మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి ► మత్తు కళ్లలో ఫిదా చేస్తున్న మలైకా అరోరా ► పరికిణిలో సాంప్రదాయబద్దంగా నటి హిమజ ► వింటర్లో వైన్ గ్లాసుతో డిజైనర్ కోమల్ పాండే ► వైట్ డ్రెస్లో మెరిసిపోతున్న యాంకర్ అనసూయ ► ప్రియుడిని పెళ్లాడిన కేరింత బ్యూటీ సుకృతి View this post on Instagram A post shared by Khanna Jewellers (@khannajewellerskj) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Lahari Shari (@lahari_shari) View this post on Instagram A post shared by Meenakshii Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) View this post on Instagram A post shared by Aditi Bhatia 🎭 (@aditi_bhatia4) View this post on Instagram A post shared by Komal Pandey (@komalpandeyofficial) View this post on Instagram A post shared by Sukrithi Ambati (@itsmesukrithi)
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- అంతర్జాతీయ ప్రమాణాలతో ఖమ్మం మార్కెట్ ఆధునీకరణ
- రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి రాయితీ
- Lok Sabha Election 2024: అభిజిత్ గంగోపాధ్యాయ్కు ఈసీ నోటీసులు
- రుణమాఫీపై నేడు నిర్ణయం
- ఏడేళ్ల తర్వాత సవాల్ చేస్తారా?
- Delhi liquor scam: నిందితుల జాబితాలో ఆప్, కేజ్రీవాల్
- వివాదాస్పదులైతే పక్కకే..
- Lok Sabha Election 2024: యువ పిడికిలి..దీప్సితా ధర్
- Centre for the Study of Developing Societies: ఒపీనియన్లు వేరువేరయా!
- కేసీఆర్ను ఢీకొట్టలేక కవితను జైలుకు పంపారు
Advertisement