-
డిఫాల్ట్ బెయిల్ పొందడం నిందితుడి హక్కు
న్యూఢిల్లీ: కేసులో విచారణ ప్రారంభించకుండా నిందితుడిని కస్టడీలో సుదీర్ఘకాలం ఎలా కొనసాగిస్తారని ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా చేయడం నిందితుడి స్వేచ్ఛను హరించడమే అవుతుందని తేలి్చచెప్పింది. అనుబంధ చార్జిïÙట్లు దాఖలు చేస్తూ నిందితులకు డిఫాల్ట్ బెయిల్ లభించకుండా చేయడం సమంజసం కాదని పేర్కొంది. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అనుచరుడైన ప్రేమ్ ప్రకాశ్ నివాసంలో 2022 ఆగస్టులో ఈడీ సోదాలు చేసింది. రెండు ఏకే–47 తుపాకులు, 60 బల్లెట్లు లభించాయి. దీంతో అతడిపై ఆయుధాల చట్టంతోపాటు మనీ లాండరింగ్ నేరం కింద ఈడీ కేసులు నమోదు చేసింది. అప్పటి నుంచి నిందితుడి ఈడీ కస్టడీలోనే ఉంటున్నాడు. అతడికి బెయిల్ లభించకుండా ఈడీ ఇప్పటిదాకా కోర్టులో నాలుగు అనుబంధ చార్జిïÙట్లు దాఖలు చేసింది. తనకు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ ప్రేమ్ప్రకాశ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. డిఫాల్ట్ బెయిల్ పొందడం నిందితుడి హక్కు అని స్పష్టం చేసింది. అతడిని ఎందుకు కస్టడీలో కొనసాగిస్తున్నారనో చెప్పాలని ఈడీని ప్రశ్నించింది. విచారణను ఏప్రిల్ 29కు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ధర్మాసనం స్పషీ్టకరణ -
హిందూ కార్యకర్త పూజారికి బెయిల్
హుబ్బళ్లి: మూడు దశాబ్దాల క్రితం నాటి రామాలయ ఉద్యమ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న హిందూ కార్యకర్త శ్రీకాంత్ పూజారి శనివారం బెయిల్పై విడుదలయ్యాడు. పెండింగ్ కేసులను పరిష్కరిస్తున్న క్రమంలో 2023 డిసెంబర్లో పూజారి కేసు బయటకు వచి్చంది. 1992లో రామాలయం ఉద్యమంలో పాలుపంచుకున్న అతడిపై అక్రమ మద్యం విక్రయం తదితర 16 కేసులు పెండింగ్లో ఉన్నట్లు గుర్తించారు. రెండు పోలీస్ స్టేషన్లలో అతడిపై రౌడీషీట్ కూడా ఉంది. పోలీసులు తనను మార్కెట్కు వెళదామంటూ తీసుకొచి్చ, కటకటాల వెనుక పడేసినట్లు పూజారి ఆరోపించాడు. తనపై ఎటువంటి కేసులు లేవన్నాడు. బెయిల్పై తన విడుదలకు సహకరించిన హిందూ సంస్థలకు రుణపడి ఉంటానని అన్నాడు. రామాలయం కోసం పోరాడిన తను తిరిగి అయోధ్యకే వెళతానని చెప్పాడు. -
సుప్రీంకోర్టులో సెతల్వాద్కు ఊరట
న్యూఢిల్లీ: గుజరాత్లో 2002 గోధ్రా ఘర్షణల తర్వాత సాక్ష్యాలను తారుమారు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్కు ఊరట లభించింది. సుప్రీంకోర్టు బుధవారం సెతల్వాద్కు సాధారణ బెయిల్ మంజూరు చేసింది. తీస్తా సెతల్వాద్కు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరిస్తూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను త్రిసభ్య బెంచ్ తోసిపుచ్చింది. గోధ్రా హింసాకాండ కేసుల్లో అమాయకుల్ని ఇరికించడానికి సాక్ష్యాలను తారుమారు చేశారని తీస్తా సెతల్వాద్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో సెతల్వాద్పై చార్జిషీటు నమోదు కావడంతో ఆమెను మళ్లీ కస్టడీలోకి తీసుకొని విచారించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ‘‘తీస్తా సెతల్వాద్ ఇప్పటికే తన పాస్పోర్టును సెషన్స్ కోర్టుకు సమర్పించారు. ఆమె సాక్షులను ఎవరినీ ప్రభావితం చేయడానికి వీల్లేదు. వారికి దూరంగా ఉండాలి’’ అని సుప్రీం బెంచ్ ఆదేశించింది. ఈ కేసులో తీస్తా సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారని పోలీసులు భావిస్తే నేరుగా సుప్రీంను ఆశ్రయించవచ్చునని తెలిపింది. -
రామ్పూర్ ప్రత్యేక కోర్టులో జయప్రద
బరేలి: ఉత్తరప్రదేశ్లోని రామ్పూర్ ప్రత్యేక కోర్టుకు సినీనటి, బీజేపీ నాయకురాలు జయప్రద హాజరయ్యారు. 2019నాటి ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో ఆమె కోర్టు ఎదుట గత మూడున్నరేళ్లుగా గైర్హాజర్ కావడంతో గత నెలలో కోర్టు నాన్బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. బుధవారం ఆమె కోర్టులో హాజరుకావడంతో న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. ‘‘మాజీ ఎంపీ , బీజేపీ నాయకురాలు జయప్రద కోర్టు ఎదుట హాజరై బెయిల్ దరఖాస్తును సమర్పించారు. దీంతో కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది’’ అని ప్రభుత్వం తరఫున లాయర్ తెలిపారు. స్థానిక అధికారుల అనుమతి లేకుండా 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో జయప్రద ఎన్నికల ర్యాలీ నిర్వహించడంతో రెండు వేర్వేరు పోలీసు స్టేషన్లలో ఆమె రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. -
ఆర్యన్కు బెయిల్: ‘సినిమా అప్పుడే అయిపోలేదు’
ముంబై: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కుమారుడి ఆర్యన్ ఖాన్కి బాంబే హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ 20 రోజులకు పైగా జైలు జీవితం గడిపాడు. మూడు సార్లు బెయిల్ తిరస్కరించిన కోర్టు.. నేడు ఆర్యన్కి ఊరట కలిగించింది. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆర్యన్ కేసులో కీలకంగా వ్యవహరించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై ఎన్సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ గత కొన్ని రోజులుగా సంచలన ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్యన్కు బెయిల్ వచ్చిన సందర్భంగా నవాబ్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. (చదవండి: ఎట్టకేలకు ఆర్యన్ ఖాన్కు బెయిల్) ఆర్యన్కు బెయిల్ వచ్చిన విషయం తెలిసిన వెంటనే నవాబ్ మాలిక్ ట్వీట్ చేశారు. అది కూడా షారుక్ ఖాన్ ఓం శాంతి ఓం సినిమాలోని ఫేమస్ డైలాగ్ ‘పిక్చర్ అభీ బాకీ హై మేరా దోస్త్’(సినిమా అప్పుడే అయిపోలేదు మిత్రమా) అంటూ ట్వీట్ చేశారు. ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖడేని ఉద్దేశించే నవాబ్ మాలిక్ ఇలా ట్వీట్ చేశారని నెటిజనులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరలవుతోంది. (చదవండి: ఆర్యన్ఖాన్ నవ యవ్వనంలో ఉన్న బాధితుడు.. నిందితుడు కాదు) पिक्चर अभी बाकी है मेरे दोस्त — Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) October 28, 2021 సింగిల్ బెంచ్ జస్టిస్ ఎన్వీ సంబ్రే.. ఆర్యన్తో పాటు ఆర్భాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలకు కూడా బెయిల్ మంజూరు చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ సంబ్రే ‘‘మూడు అభ్యర్ధనలు అనుమతించాను. రేపు సాయంత్రంలోగా నేను వివరణాత్మక ఉత్తర్వులను జారీ చేస్తాను’’ అని తెలిపారు. చదవండి: ఆయన ఉండి ఉంటే: సీఎంకు నటి క్రాంతి వాంఖడే బహిరంగ లేఖ -
అత్యాచారం: టీచర్ ఒత్తిడి వల్లే అలా చెప్పాను
ముంబై: బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మైనర్ల మధ్య ఏకాభిప్రాయంతో జరిగే శృంగారం గురించి చట్టంలో అస్పష్టంగా ఉందని తెలిపింది. ఈ మేరకు గతంలో ఈ తరహా కేసులో 19 ఏళ్ల యువకుడికి విధించిన 10 సంవత్సరాల కఠిన కారగార శిక్షను నిలిపివేస్తూ.. తీర్పు వెల్లడించింది. అంతేకాక నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. సదరు కుర్రాడు తన ఇంట్లో ఉంటున్న మైనర్ బాలికపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ.. మూడు సంవత్సరాల క్రితం కేసు నమోదయ్యింది. ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. బాధితురాలైన మైనర్ బాలిక చదువుకోవడం కోసం తమకు బంధువులు అయిన నిందితుడి ఇంట్లో ఉండేది. ఈ క్రమంలో 2017 సెప్టెంబర్లో బాధితురాలు తన కజిన్ తనను అసభ్యకరరీతిలో తాకడాని.. అప్పటి నుంచి తనకు కడుపులో నొప్పి వస్తుందని స్నేహితురాలితో చెప్పింది. స్నేహితురాలు ఈ విషయాన్ని క్లాస్ టీచర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె సదరు బాలికను పిలిచి.. విషయం ఏంటని ఆరా తీయగా.. కజిన్ తనపై అత్యాచారం చేశాడని తెలిపింది. టీచర్ ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లింది. దాంతో 2018, మార్చి 3న సదరు యువకుడిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఎలాంటి బాహ్య గాయాలు లేవని తెలిసింది. ఆ తర్వాత నిందితుడికి దిగువ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. దాంతో అతడు హై కోర్టును ఆశ్రయించాడు. బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశాడు. ఇక దీని విచారణ సందర్భంగా కోర్టు మైనర్ బాలిక స్టేట్మెంట్ని రికార్డు చేసింది. ఈ సందర్బంగా బాలిక సంచలన విషయాలు వెల్లడించింది. తమ ఇద్దరి ఏకాభిప్రాయంతోనే లైంగిక చర్య జరిగిందని.. ఇలా నాలుగైదు సార్లు తమ మధ్య చోటు చేసుకుందని తెలిపింది. టీచర్ బలవంతం మీదనే తాను అలా చెప్పానని పేర్కొంది. సాక్ష్యాలను పరిశీలించిన జస్టిస్ షిండే.. ‘‘మైనర్ల మధ్య ఏకాభిప్రాయంతో జరిగిన శృంగారం గురించి చట్ట పరంగా అస్పష్టంగా ఉంది. మైనర్ల అనుమతిని పరిగణలోకి తీసుకోలేం. ఇక ఈ కేసులో వెల్లడైన వాస్తవాలు విలక్షణమైనవి. ఈ కేసులో బాధితురాలు, నిందితుడు ఇద్దరు ఒకే కప్పు కింద ఉంటున్నారు.. పైగా విద్యార్థులు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. బాధితురాలు తన స్టేట్మెంట్ని వెనక్కి తీసుకున్న విషయాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. వీటన్నింటిని పరిశీలించిన తర్వాత అతడికి బెయిల్ మంజూరు చేస్తున్నాం. బాధితుడు దాన్ని దుర్వినియోగం చేయకూడదు’’ అని కోర్టు సూచించింది. అంతేకాక అతడికి విధించిన శిక్షను నిలుపదల చేస్తూ.. తీర్పు వెల్లడించింది. చదవండి: న్యాయాన్యాయాల విచికిత్స ‘పోక్సో’ చట్టం కింద అది నేరం కాదు -
జగ్గారెడ్డికి బెయిల్ మంజూరు..!
-
జగ్గారెడ్డికి బెయిల్ ..!
సాక్షి, హైదరాబాద్ : మానవ అక్రమ రవాణా కేసులో ఇటీవల అరెస్ట్యిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి బెయిల్ మంజూరైంది. సికింద్రాబాద్ కోర్టు ఆయనకు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం చంచల్గూడ జైలులో ఉన్న ఆయన నేడు సాయంత్రం విడుదలైయే అవకాశం ఉంది. 2004లో నకిలీ పత్రాలు, పాస్పోర్ట్తో మానవ అక్రమ రవాణా చేసిన కేసులో అరెస్ట్అయిన జగ్గారెడ్డిపై టాస్క్ఫోర్స్ పోలీసులు ఎనిమిది సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జగ్గారెడ్డి అరెస్ట్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయనకు ఒకవేళ బెయిల్ రాకపోయినట్లయితే చివరకి మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు, ఆయన సతీమని నిర్మలను పార్టీ అభ్యర్థిగా ప్రకటించాలని కూడా అధిష్టానం చర్చించింది. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డికి బెయిల్ రావడంతో ఆయన అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ ఏవిధంగా నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తిగా మారింది. -
హిమాచల్ సీఎంకు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్కు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి వీరభద్రసింగ్తో పాటు, ఆయన భార్యకు సీబీఐ కోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు, అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే వీరభద్రసింగ్ పాస్పోర్టును కోర్టులో సమర్పించాలని సూచించింది. కేసు తదుపరి విచారణ జూలై 27వ తేదీకి వాయిదా పడింది.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
పరిపూర్ణం.. కోన సంబరం
ఉపాధికి మెండైన పాలి‘టెక్నిక్’
● ఢిల్లీ రోడ్డు ప్రమాదంలో చౌడేపల్లె యువకుడు మృతి ● ఒక్కగానొక్క కుమారుడి మృతితో కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు ● దుఃఖంలోనూ అవయవదానానికి అంగీకారం
షోకాజ్ నోటీసులను ఉపసంహరించండి
ట్రాన్స్కో వర్క్ ఆర్డర్లు పూర్తి చేయాలి
కౌంటింగ్పై అవగాహన తప్పనిసరి
● మగబిడ్డకు జన్మనిచ్చిన గంటలోపే బాలింత మృతి ● వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్న కుటుంబ సభ్యులు ● ఆస్పత్రి వద్ద ధర్నా.. పోలీసులకు ఫిర్యాదు
న్యాయమూర్తులకు ముగిసిన శిక్షణ
● మరో పదిరోజుల్లో ఓట్ల లెక్కింపు ● ఎన్నికల ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ ● జూన్ 4వ తేదీన తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
వైభవం.. వసంతోత్సవం
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: బీజేడీకి సవాల్!
- హింస పన్నాగంతోనే అధికారుల బదిలీ
- Lok Sabha Election 2024: మహిళా ఎంపీలు 9 మందే!
- ఆ పచ్చ ‘సీఐ’ పై చర్యలేవి?
- Lok Sabha Election 2024: లోక్సభ బరిలో ప్యాడ్ ఉమన్
- జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్
- మేడిగడ్డ కింద అగాధం!
- మళ్లీ సుర్రుమన్న ‘సూరీడు’
- ఎరువులు, విత్తనాల సరఫరాలో సమస్య రావొద్దు
- బాచుపల్లిలో దారుణం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ను హత్య చేసిన భర్త
Advertisement