-
న్యూజిలాండ్ ఆటగాడిపై బ్యాల్ టాంపరింగ్ ఆరోపణలు
న్యూజిలాండ్ బ్యాటర్ హెన్రీ నికోల్స్ బాల్ టాంపరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. కొద్ది రోజుల కిందట జరిగిన దేశవాలీ క్రికెట్ మ్యాచ్లో నికోల్స్ బాల్ టాంపరింగ్కు పాల్పడినట్లు ఆ మ్యాచ్ ఫీల్డ్ అంపైర్లు ఆరోపించారు. నికోల్స్ న్యూజిలాండ్ క్రికెట్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు వారు అభియోగాలు మోపారు. ఈ విషయంపై నికోల్స్ విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో నివేదిక ప్రకారం.. న్యూజిలాండ్ దేశవాలీ టోర్నీ అయిన ప్లంకెట్ షీల్డ్ టోర్నీలో భాగంగా క్యాంటర్బరీ, ఆక్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా నికోల్స్ హెల్మెట్తో బంతిని రుద్దినట్లు అంపైర్లు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై అంపైర్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. ఒకవేళ న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నికోల్స్ను దోషిగా తేలిస్తే, అతను కొంతకాలం పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా నిషేధం ఎదుర్కోవచ్చు. ఈ నెలాఖరులో జరిగే బంగ్లాదేశ్ పర్యటనలో నికోల్స్ న్యూజిలాండ్ టెస్టు జట్టులో చేరనున్న నేపథ్యంలో బాల్ టాంపరింగ్ ఆరోపణలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా, 31 ఏళ్ల నికోల్స్ న్యూజిలాండ్ టెస్ట్ జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్నాడు. అతను ఇప్పటివరకు 54 టెస్టులతో పాటు 72 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. తన కెరీర్లో నికోల్స్ ఓవరాల్గా 5000 పైచిలుకు పరుగులు సాధించాడు. ఇందులో 10 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. -
స్టీవ్ స్మిత్ను దారుణంగా అవమానించిన ఇంగ్లండ్ ఫ్యాన్స్
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్-2023 తొలి టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఇంగ్లండ్ అభిమానులు ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ను దారుణంగా అవమానించారు. నాలుగో రోజు ఆటలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్ను ఇంగ్లండ్ ఫ్యాన్స్ ఎగతాళి చేస్తూ రాక్షసానందం పొందారు. 2018 బాల్ టాంపరింగ్ ఇష్యూ తదనంతరం జరిగిన ఓ విషయాన్ని ప్రస్తావిస్తూ గేలి చేశారు. Atmosphere 💀pic.twitter.com/Oxt4mQ860k — Shivani (@meme_ki_diwani) June 19, 2023 బాల్ టాంపరింగ్ ఉదంతం తర్వాత స్మిత్ మీడియా ముందు ఏడుస్తూ తప్పు ఒప్పుకున్న విషయాన్ని హైలైట్ చేస్తూ ఓ పాట ద్వారా టీజ్ చేశారు. We Saw You Crying On Telly (నువ్వు టీవీలో ఏడుస్తుంటే మేము చూశాం) అంటూ స్టేడియం మొత్తం ముక్తకంఠంతో పాట పాడుతూ స్మిత్ మనసు గాయపడేలా ప్రవర్తించారు. Heartbreaking. Steve Smith has broken down delivering a message to young Aussie cricket fans. pic.twitter.com/l14AsvAhXz — cricket.com.au (@cricketcomau) March 29, 2018 స్టేడియంలో ప్రేక్షకులు ఇలా చేస్తుంటే స్మిత్ తెగ ఇబ్బంది పడ్డాడు. పైకి నవ్వుతూ ఇంకా పాడండి అంటున్నట్లు తల ఊపినప్పటికీ.. అతని ముఖంలో బాధ స్పష్టంగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. నెటిజన్లు ఇంగ్లండ్ ప్రేక్షకులు ప్రవర్తించిన తీరును తప్పుబడుతున్నారు. ఎలాంటి వ్యక్తినైనా ఈ తరహాలో ఎగతాళి చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. Steve Smith heads over to the Hollies for the first time this series….#Ashes pic.twitter.com/Hs1cRB56Lb — England's Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) June 19, 2023 ఇదిలా ఉంటే, యాషెస్ సిరీస్ తొలి టెస్ట్ రసవత్తరంగా సాగుతుంది. చివరి రోజు ఆటలో ఇంగ్లండ్ గెలవాలంటే 7 వికెట్లు, ఆసీస్ గెలవాలంటే 174 పరుగులు చేయాల్సి ఉంది. బజ్బాల్ అప్రోచ్ అని ఇంగ్లండ్ ఓవరాక్షన్ చేయకపోయుంటే ఈ మ్యాచ్లో ఆ జట్టే పైచేయి సాధించి ఉండేది. ఏదో పొడిచేద్దామని ఆ జట్టు తొలి ఇన్నింగ్స్ను మరో 2 వికెట్లు మిగిలుండగానే తొలి రోజే డిక్లేర్ చేసి చేతులు కాల్చుకుంది. ప్రస్తుతం పరిస్థితి (విజయావకాశాలు) ఫిఫ్టి-ఫిఫ్టిగా ఉంది. ఆఖరి రోజు ఆసీస్ సైతం బజ్బాల్ అంటూ ఎదురుదాడికి దిగి విజయం సాధిస్తుందా లేక ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగి విజయాన్ని సాధిస్తారా అన్నది తేలాలంటే మరో కొద్ది గంటలు వేచి చూడాల్సిందే. -
'ఆస్ట్రేలియా బాల్ టాంపరింగ్ చేసింది.. అందుకే కోహ్లి ఔటయ్యాడు'
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ సంచలన వాఖ్యలు చేశాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా బాల్ ట్యాంపరింగ్ పాల్పడందని బాసిత్ అలీ ఆరోపణలు చేశాడు. 15 ఓవర్లో ఆసీస్ బాల్ ట్యాంపరింగ్ చేసందని, కోహ్లి, పుజారాలు ఔట్ కావడానికి ఇదే కారణమని అతడు అన్నాడు. "కామెంటరీ బాక్స్లోంచి మ్యాచ్ చూస్తున్న వారికి, అంపైర్లకు ముందుగా చప్పట్లు కొట్టాలి అనుకుంటున్నాను. ఆస్ట్రేలియా కచ్చితంగా బంతి స్వరూపాన్ని మార్చేందుకు ఏదో చేసింది. ఎవరూ దాని గురించి మాట్లాడటం లేదు. బ్యాటర్లు కూడా దాన్ని పెద్దగా గమనించలేదు. బ్యాటర్లు బాల్ ను వదిలేస్తూ బౌల్డ్ అయ్యారు. అంతే తప్ప ఏం జరుగుతుందని ఆలోచించలేకపోయారు. ఈ ఆరోపణలకు నా దగ్గర ఆధారం కూడా ఉంది. భారత ఇన్నింగ్స్ 17, 18, 19 ఓవర్లు ఓసారి చూడండి. విరాట్ కోహ్లి ఔటైనప్పుడు బంతికి మెరుపు ఏవైపు ఉందో ఓ సారి గమనించండి. మిచెల్ స్టార్క్ బంతి పట్టుకున్నప్పుడు మెరుపు బంతికి బయటి ఉంది. కానీ బంతి మాత్రం లోపలకు వచ్చింది. మెరుపు బయట వైపు ఉండి బంతి ఎప్పుడూ రివర్స్ స్వింగ్ అవ్వదు. ఆసీస్ ఎదో చేసింది. అదే విధంగా జడేజా బాల్ ను ఆన్ సైడ్ ఆడుతుంటే అది పాయింట్ వైపు వెళ్తోంది. ఇది అంపైర్లకు కనిపించలేదా? ఈ చిన్న విషయాన్ని ఎవరూ గుర్తించలేకపోయారు అంటూ అలీ తన యూట్యూబ్ ఛానెల్లో విమర్శలు గుప్పించాడు. చదవండి: ఇటువంటి కమ్బ్యాక్ ఇప్పటి వరకూ చూడలేదు.. అతడొక అద్భుతం: గంగూలీ -
టిమ్ పెయిన్ సంచలన ఆరోపణలు
-
Aus Vs SA: ‘మేమే కాదు దక్షిణాఫ్రికా కూడా టాంపరింగ్ చేసింది’
Tim Paine- Ball Tampering- Sandpaper Scandal- సిడ్నీ: 2018లో కేప్టౌన్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా టెస్టు సందర్భంగా జరిగిన ‘బాల్ టాంపరింగ్’ ఉదంతం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చింది. దాంతో స్మిత్, వార్నర్, బాన్క్రాఫ్ట్లపై వేటు పడటంతో పాటు తర్వాతి మ్యాచ్నుంచి టిమ్ పెయిన్ ఆస్ట్రేలియాకు కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే నాటి ఘటనను తన పుస్తకం ‘ద పెయిడ్ ప్రైస్’లో గుర్తు చేసుకున్న పెయిన్... తామే కాదు, తర్వాతి టెస్టులో దక్షిణాఫ్రికా కూడా టాంపరింగ్ చేసిందని వ్యాఖ్యానించాడు. అయితే స్థానిక ప్రసారకర్తల సహాయంతో ఆ వీడియోను దాచేశారని అతను ఆరోపించాడు. ‘సిరీస్ నాలుగో టెస్టులో ఇది జరిగింది. దక్షిణాఫ్రికా ప్లేయర్ చేతిలో ఉన్న బంతిపై చాలా పగుళ్లు ఉన్న దృశ్యం అక్కడి భారీ స్క్రీన్పై కనిపించింది. కానీ ఆ వెంటనే దానిని తొలగించారు. మేం ఈ విషయంపై అంపైర్లతో మాట్లాడినా అసలు ఎవరూ పట్టించుకోలేదు’ అని పెయిన్ చెప్పాడు. బాల్ టాంపరింగ్ ఘటన సమయంలో తమ ముగ్గురు క్రికెటర్లకు ఎవరూ అండగా నిలవలేదని విషయాన్ని అతను అంగీకరించాడు. ‘సాధారణంగా ఇలాంటి సమయంలో తమ ఆటగాళ్లను సహచర క్రికెటర్లు ఆదుకోవాలి. మానసికంగా వారికి అండగా నిలవాలి. కానీ వారందరినీ వెలి వేసినట్లు చూశారు’ అని పెయిన్ చెప్పాడు. చదవండి: Ind Vs Pak: టీమిండియా మోసం చేసి గెలిచిందంటూ అక్కసు.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన దిగ్గజ అంపైర్ T20 WC 2022: అక్తర్, బ్రాడ్ హాగ్లు దొరికేశారు కదా..! -
డేవిడ్ వార్నర్కు భారీ ఊరట
టీ20 వరల్డ్కప్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్కు భారీ ఊరట లభించింది. 2018 బాల్ టాంపరింగ్ వివాదంలో జీవితకాల నిషేధం (కెప్టెన్సీ విషయంలో) ఎదుర్కొంటున్న అతనికి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఓ తియ్యటి కబురు చెప్పనుందని తెలుస్తుంది. సీఏ.. వార్నర్పై ఉన్న కెప్టెన్సీ నిషేధాన్ని ఎత్తివేయడంతో పాటు ఫించ్ తర్వాత ఆసీస్ పరిమిత ఓవర్ల పగ్గాలు కూడా అప్పజెప్పాలని డిసైడైనట్లు కధనాలు వినిపిస్తున్నాయి. రేపు జరుగబోయే సీఏ బోర్డు సమావేశంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశముంది. వార్నర్పై కెప్టెన్సీ బ్యాన్ ఎత్తివేయాలని అభిమానులు, ప్రస్తుత, మాజీ ఆటగాళ్ల నుంచి భారీ స్థాయిలో డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో సీఏ ఈ మేరకు నిర్ణయించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే, ఇదే బాల్ టాంపరింగ్ ఉదంతంలో వార్నర్తో పాటు నాటి ఆసీస్ సారథి స్టీవ్ స్మిత్, ఓపెనర్ కామెరాన్ బాన్క్రాఫ్ట్లపై కూడా క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ముగ్గురు ఆటగాళ్లు నేరం అంగీకరించిన నేపథ్యంలో బాన్క్రాఫ్ట్పై 9 నెలలు, స్టీవ్ స్మిత్, వార్నర్లపై ఏడాది పాటు నిషేధం పడింది. అయితే ఈ కేసులో వార్నర్ను కీలక సూత్రధారిగా పరిగణించిన సీఏ.. అతనిపై లైఫ్ టైమ్ కెప్టెన్సీ బ్యాన్ను విధించింది. -
వార్నర్ అభిమానులకు గుడ్ న్యూస్.. త్వరలోనే కెప్టెన్సీపై జీవిత కాల నిషేధం ఎత్తివేత..!
నాలుగేళ్ల కిందట జరిగిన బాల్ టాంపరింగ్ వివాదం క్రికెట్ ఆస్ట్రేలియాను ఓ కుదుపు కుదిపిన సంగతి తెలిసిందే. 2018లో దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు సందర్భంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు బాల్ ట్యాంపరింగ్ పాల్పడ్డారు. ఈ ఘటన జరగిన సమయంలో అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, కామెరూన్ బెన్ క్రాఫ్ట్పై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది కాలం పాటు నిషేదం విధించింది. ఇక నిషేధం ముగిసిన ఏడాది వరకు స్మిత్ను కెప్టెన్సీకి అనర్హుడిగా ప్రకటించారు. అదే విధంగా డేవిడ్ వార్నర్ కెప్టెన్సీపై క్రికెట్ ఆస్ట్రేలియా జీవిత కాల నిషేదం విధించింది. అయితే తాజా పరిణామాల ప్రకారం.. వార్నర్ కెప్టెన్సీపై జీవిత కాల నిషేదం ఎత్తి వేసే యోచనలో క్రికెట్ ఆస్ట్రేలియా ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాకు బెన్ హార్న్ న్యూస్ ఏజెన్సీ నివేదిక ప్రకారం.. 2018 బాల్ టాంపరింగ్ వివాదం నేపథ్యంలో వార్నర్పై విధించిన కెప్టెన్సీ నిషేదాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా పునః పరిశీలిస్తుంది. ఈ నిషేదంతో టీ20 లీగ్లలో వార్నర్ తన కెప్టెన్సీ అవకాశాలు కోల్పోతున్నాడని ఆ దేశ క్రికెట్ బోర్డు భావిస్తోంది. ముఖ్యంగా ఆ దేశ మేజర్ టోర్నీ బిగ్బాష్ లీగ్లో కూడా కేవలం ఆటగాడిగానే వార్నర్ కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో అతడిపై నిషేదం ఎత్తి వేయనున్నట్లు సమాచారం. చదవండి: IND-W Vs SL-W: రాణించిన షఫాలీ, రోడ్రిగ్స్.. శ్రీలంకపై భారత్ ఘనవిజయం -
బాల్ టాంపరింగ్కు పాల్పడిన బౌలర్..
నెదర్లాండ్ ఫాస్ట్ బౌలర్ వివియన్ కింగ్మా బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ సూపర్ లీగ్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మూడో వన్డేలో కింగ్మా బాల్ టాంపరింగ్కు పాల్పడ్డాడు. ఐసీసీ ప్రవర్తనా నియమావళి లెవల్ 3ని ఉల్లంఘించినందుకు కింగ్మాపై నాలుగు మ్యాచ్ల నిషేదాన్ని ఐసీసీ విధించింది. అంతేకాకుండా క్రమశిక్షణా రికార్డులో ఐదు డీమెరిట్ పాయింట్లు కూడా వచ్చి చేరాయి. ఏం జరిగిందంటే.. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ 31వ ఓవర్ బౌలింగ్ వేసిన కింగ్మా తన చేతి గోళ్లతో బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించాడు. కింగ్మా తన నేరాన్ని అంగీకరించడంతో నాలుగు మ్యాచ్ల నిషేధాన్ని మ్యాచ్ రిఫరీ విధించాడు. కాగా ఈ మ్యాచ్లో పది ఓవర్లు బౌలింగ్ వేసిన కింగ్మా ఒకే ఒక వికెట్ పడగొట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. నెదర్లాండ్పై ఆఫ్ఘనిస్తాన్ 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ విజయంలో బ్యాటర్లు రియాజ్ హుసాన్(50 పరుగులు), నజీబుల్లా(71 పరుగులు) అర్ధ సెంచరీలతో కీలక పాత్ర పోషించారు. చదవండి: హార్ధిక్ పాండ్యా నాన్నమ్మనూ వదలని "పుష్ప" ఫోబియా.. తగ్గేదేలే అంటున్న బామ్మ -
'ఇయాన్ చాపెల్ వ్యాఖ్యలను బాత్రూం అద్దానికి అంటించా'
Steve Smith Says Ian Chapell Coloumn Stuck On Bathroom Mirror: ఆస్ట్రేలియా సీనియర్ ఆటగాడు స్టీవ్ స్మిత్ కెరీర్లో బాల్ టాంపరింగ్ ఉదంతం ఒక చీకటికోణంలా మిగిలిపోయింది. 2018లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్లో డేవిడ్ వార్నర్, బెన్క్రాఫ్ట్లతో కలిసి స్మిత్ బాల్ టాంపరింగ్కు పాల్పడడం సంచలనంగా మారింది. ఈ అంశం అప్పట్లో తీవ్ర దుమారం రేపడంతో క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) సీరియస్గా పరిగణించింది. కెప్టెన్సీ పదవి నుంచి స్మిత్ను తొలిగించిన సీఏ అతనితో పాటు డేవిడ్ వార్నర్పై ఏడాదిపాటు నిషేధం.. బెన్క్రాఫ్ట్పై తొమ్మిది నెలల నిషేధం విధించింది. అలా 2018 నుంచి 2019 వరకు క్రికెట్కు దూరంగా ఉన్న స్మిత్ రీ ఎంట్రీలో అదరగొట్టాడు. చదవండి: WI vs SL: క్రీజులో పాతుకుపోయాడు.. తెలివైన బంతితో బోల్తా తాజాగా ఇంగ్లండ్తో యాషెస్ సిరీస్కు సిద్ధమవుతున్న ఈ ఆసీస్ ఆటగాడు మరోసారి ఆ చీకటి రోజులను గుర్తుచేసుకున్నాడు. ఆ సమయంలో ఇయాన్ చాపెల్ చేసిన వ్యాఖ్యలు తనకు ఎప్పటికి గుర్తుండిపోయాయని చెప్పుకొచ్చాడు. '' బాల్ టాంపరింగ్ ఉదంతం నాకు చీకటిరోజులు. ఈ ఉదంతంతో ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్న నేను నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాను. నాకు ఇయాన్ చాపెల్ వ్యాఖ్యలు బాగా గుర్తున్నాయి. ఒక పత్రికలో ఇయాన్ చాపెల్ తన కాలమ్లో '' బాల్ టాంపరింగ్ ఉదంతంతో ఏడాది పాటు ఆటకు దూరం కానున్న స్మిత్ .. ఏడాది తర్వాత రీ ఎంట్రీలో అతనిలో అదే బ్యాటర్ కనబడడు'' అని పేర్కొన్నాడు. ఇయాన్ చాపెల్ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్న నేను ఆ పేపర్ ముక్కను కట్చేసి నా బాత్రూం గోడకు తగిలించాను. ప్రతీరోజు రాత్రి నిద్రపోయే ముందు.. ఉదయం నిద్ర లేవగానే దానిని చూసుకునేవాడిని. ఆ వ్యాఖ్యల చదువుతూ బ్రష్ చేసేవాడిని. అయితే 2019లో రీఎంట్రీ తర్వాత యాషెస్ సిరీస్లో భాగంగా ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లోనూ సెంచరీలు సాధించాను. ఈ ఒక్క ఇన్నింగ్స్తో అటు చాపెల్కు.. విమర్శలకు ఒక విషయం చెప్పా.. అదేంటంటే.. ''నిషేధం తర్వాత నేను ఏం కోల్పోలేదు.. అది ఇంకా నా దగ్గరే ఉంది''. ఈ విషయం నాకు ఎప్పుడు గుర్తుకు వచ్చినా నేను సాధించాననే సంతోషం కలుగుతుంది'' అంటూ పేర్కొన్నాడు. చదవండి: Joshua da Silva Vs Dhananjaya de Silva: వార్నీ.. ప్రతీకారం ఇలా కూడా తీర్చుకుంటారా! ఇక ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లు ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్ టెస్టు సిరీస్ డిసెంబర్ 8 నుంచి ప్రారంభం కానుంది. ఇక సెక్స్ స్కాండల్ ఆరోపణలతో టిమ్ పైన్ అనూహ్యంగా కెప్టెన్సీ పదవికి రాజీనామా చేయడంతో పాట్ కమిన్స్కు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. ఇక స్టీవ్ స్మిత్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ఇక 2019లో జరిగిన యాషెస్ సిరీస్ను ఆస్ట్రేలియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఏడాది నిషేధం నుంచి తిరిగొచ్చిన స్టీవ్ స్మిత్ ఈ సిరీస్లో రెండు సెంచరీలు సహా మొత్తంగా 777 పరుగులు సాధించి ఆసీస్ సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. -
బాల్ టాంపరింగ్ వివాదం సద్దుమణిగినట్టే: ఆసీస్ కెప్టెన్
సిడ్నీ: క్రికెట్ ఆస్ట్రేలియాలో పెను దుమారం రేపిన బాల్ టాంపరింగ్ వివాదం ప్రస్తుతానికి సద్దుమణిగిందని ఆసీస్ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ వెల్లడించాడు. బాన్క్రాఫ్ట్తో బౌలర్లు సమావేశమై సమస్యను పరిష్కరించుకున్నారని అతను ప్రకటించాడు. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా విలేఖరులు అడిన ప్రశ్నలకు తికమక పడిన బాన్క్రాఫ్ట్.. ఒత్తిడిలో అలా మాట్లాడాడని, ఈ ఉదంతం గురించి బౌలర్లకు ముందుగానే తెలుసన్న విషయమై అతని వద్ద ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించాడు. కాగా, 2018లో వెలుగు చూసిన బాల్ టాంపరింగ్ ఉదంతం గురించి తమ బౌలర్లకు ముందే తెలుసంటూ ఆసీస్ ఆటగాడు బాన్క్రాఫ్ట్ చేసిన సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో ఆ ఘటనపై పునర్విచారణ జరిపేందుకు తాము సిద్దమని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించడంతో ఈ వివాదం మరోసారి వార్తల్లోకెక్కింది.దీంతో నాటి జట్టులో సభ్యులైన కమిన్స్, హాజిల్వుడ్, స్టార్క్లు బాన్క్రాఫ్ట్తో సమావేశమయ్యారు. అనంతరం ఈ ముగ్గురు బౌలర్లు ఆ వివాదంలో తమ పాత్ర ఏమీ లేదంటు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఈ వివాదం గురించి ఓ ఇంటర్వ్యూలో ఊహించని ప్రశ్నలు ఎదురవ్వడంతో చిరాకులో ఏదో సమాధానం చెప్పానని బాన్క్రాఫ్ట్ తమకు వివరణ ఇచ్చాడని వారు పేర్కొన్నారు. ఈ విషయమై బాన్క్రాఫ్ట్ కూడా అదే సమాధానం చెప్పాడు. బాల్ టాంపరింగ్ ఉదంతం గురించి తన దగ్గర ఎలాంటి సమాచారం లేదని తనను సంప్రదించిన సీఏ ఇంటిగ్రిటీ యూనిట్కు వివరణ ఇచ్చాడు. దీంతో ఈ వివాదానికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్లైంది. కాగా, 2018లో కేప్టౌన్ వేదికగా ఆసీస్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన టెస్టులో బాల్ టాంపరింగ్ ఉదంతం వెలుగు చూసింది. ఆ మ్యాచ్లో ఆసీస్ ఆటగాడు బాన్క్రాఫ్ట్ బంతికి సాండ్ పేపర్ రుద్దుతూ కెమెరాల కంటపడ్డాడు. దీంతో అతనితో పాటు అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్పై నిషేధం విధించారు. చదవండి: 500కు పైగా వికెట్లు తీశాను, కానీ ఏం ప్రయోజనం.. -
వాళ్లు అమాయకులంటే అస్సలు నమ్మలేం: పాక్ మాజీ కెప్టెన్
ఇస్లామాబాద్: 2018 నాటి బాల్ టాంపరింగ్ వివాదం మరోసారి క్రీడావర్గాల్లో చర్చనీయాంశమైంది. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా బౌలర్ బాన్క్రాఫ్ట్ బంతికి సాండ్ పేపర్ను రుద్దుతూ కెమెరాల కంటపడ్డ సంగతి తెలిసిందే. దీంతో, అతడితో పాటు అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్పై నిషేధం విధించారు. అది ముగిసిపోయింది కూడా. అయితే, ఇటీవల బాన్క్రాఫ్ట్ ఓ చానెల్తో మాట్లాడుతూ.. తాను బాల్ టాంపరింగ్ చేయడం తమ జట్టులోని మిగతా బౌలర్లకు కూడా తెలుసంటూ బాంబు పేల్చాడు. దీంతో అప్పటి మ్యాచ్లో ప్రధాన బౌలర్లు అయిన పాట్ కమిన్స్, హాజిల్వుడ్, నాథన్ లియోన్, మిచెల్ స్టార్క్పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తమకేమీ తెలియదంటూ ఈ నలుగురూ సంయుక్తంగా లేఖ విడుదల చేశారు. ఇక ఈ విషయంపై స్పందించిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్... ఆసీస్ బౌలర్లు అమాయకులు అంటే తాను అస్సలు నమ్మనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘‘బాల్ రివర్స్లో స్వింగ్ అవుతుంటే బౌలర్లకు దాని గురించి తెలియదని చెప్పడం అబద్ధమే అవుతుంది. రివర్స్ స్వింగ్ రాబట్టాలని వారు ముందే నిర్ణయించుకుని ఉంటారు. బంతిని పదే పదే రుద్దుతూ షైన్ చేస్తే ఈ విధంగా చేయవచ్చు. డ్రెస్సింగ్ రూంలో దీని గురించి చర్చ జరుగకుండానే ఇదంతా సాధ్యమైందంటే అస్సలు నమ్మను. నిజానికి బాన్క్రాఫ్ట్ బంతిని సాండ్ పేపర్తో రుద్దాడు ఈ విషయం తెలిసి కూడా ఊరుకున్నారు కాబట్టి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్కు కూడా శిక్ష పడింది. కానీ ఈ విషయంలో ఇతర బౌలర్లు మాత్రం తప్పించుకున్నారు. అంతా కలిసే చేసినా, కొందరు మాత్రమే శిక్ష అనుభవించారు. బంతి ఎలా తిరుగుతుంది అన్న విషయంపై బౌలర్లకు అవగాహన లేదనడం హాస్యాస్పదమే’’ అని సల్మాన్ భట్ చెప్పుకొచ్చాడు. చదవండి: ఇక్కడితో ముగించండి.. ఆసీస్ బౌలర్ల వేడుకోలు ఇండియాకు వచ్చెయ్ ప్లీజ్ .. పంత్ స్థానంలో ఆడు -
Ball Tampering:ఇక్కడితో ముగించండి.. ఆసీస్ బౌలర్ల వేడుకోలు
సిడ్నీ: క్రికెట్లో బాల్ టాంపరింగ్ ఉదంతం పెను దుమారం రేపింది. 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో భాగంగా మూడో మ్యాచ్లో బాన్క్రాఫ్ట్ బంతికి స్యాండ్ పేపర్ను రుద్దుతూ కెమెరాలకు చిక్కాడు. దాంతో ఆగ్రహించిన క్రికెట్ ఆస్ట్రేలియా... బాన్క్రాఫ్ట్పై 9 నెలలు... స్మిత్, వార్నర్లపై ఏడాది పాటు నిషేధం విధించింది. అయితే బ్యాన్క్రాఫ్ట్ తాజాగా ఒక చానెల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో ..తాను బాల్ టాంపరింగ్ చేయడం ఆసీస్ జట్టులో మిగతా బౌలర్లకు కూడా తెలుసంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో బాల్ టాంపరింగ్ ఉదంతం మరోసారి చర్చనీయాంశమైంది. బాల్ టాంపరింగ్ ఉదంతంలో మిగతా బౌలర్ల హస్తం ఉందంటూ అక్కడి మీడియా కోడై కూసింది. ఈ విషయంపై ఆసీస్ క్రీడా జర్నలిస్టులు సీఏపై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో రంగంలోకి దిగిన సీఏ బ్యాన్క్రాఫ్ట్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న సీఏ మరోమారు విచారణకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అప్పటి మ్యాచ్లో బౌలర్లుగా ఉన్న పాట్ కమిన్స్, హాజిల్వుడ్, నాథన్ లియోన్, మిచెల్ స్టార్క్లు స్పందించారు. ఆసీస్ ప్రజలను ఉద్దేశిస్తూ ఈ నలుగురు కలిసి ఒక సుధీర్ఘ లేఖను విడుదల చేశారు. ఆ లేఖ సారాంశం ఇలా ఉంది.''ఆస్ట్రేలియన్ ప్రజలారా..మా నిజాయితీపై మాకు పూర్తి నమ్మకముంది. మా సమగ్రత, వ్యక్తిత్వంపై కొందరు ఆస్ట్రేలియన్ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలు మాకు బాధ కలిగించాయి. అయినా ఈ ప్రశ్నలకు మేం వివిధ సందర్బాల్లో ఎన్నోసార్లు సమాధానాలు ఇచ్చాము. ఒకవేళ అవసరం అనుకుంటే.. మరోసారి దానిపై చర్చ పెట్టండి.. అందుకు మేం సిద్ధంగా ఉన్నాం. వాస్తవానికి ఆరోజు మ్యాచ్లో బంతి షేప్ మార్చడానికి బయటనుంచి మైదానంలోకి ఒక పదార్థం తీసుకొచ్చారన్న సంగతి మాకు తెలియదు. బాల్ టాంపరింగ్ జరిగిందని అంపైర్లు గుర్తించాకా.. మైదానంలో ఉన్న స్క్రీన్పై బంతి షేప్ మారిందంటూ చూపించిన తర్వాత మాకు మిషయం అర్థమైంది. ఆరోజు మ్యాచ్లో ఉన్న ఇద్దరు అంపైర్లు నీల్ లాంగ్, రిచర్డ్ ఇల్లింగ్వర్త్.. మంచి అనుభవం కలిగినవారు. వారిద్దరు బంతిని పరిశీలించి షేప్ మారిందని చెప్పారు. బ్యాన్క్రాఫ్ట్ అప్పటికే సాండ్పేపర్కు బంతిని రుద్దాడని మాకు తెలియదు. కానీ అతను బాల్ టాంపరింగ్ చేస్తున్నట్లు ఇతర బౌలర్లకు కూడా తెలుసని చెప్పాడు. ఇది నిజం కాదు. ఒక బౌలర్గా మా బాధ్యత బంతులు విసరడం మాత్రమే.. బంతి షేప్ మారిందంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. అవన్నీ మాకెలా తెలుస్తాయి. వార్నర్, స్మిత్, బ్యాన్క్రాఫ్ట్లు చేసింది తప్పు కాబట్టే శిక్ష అనుభవించారు. కానీ ఈ ఉదంతం నుంచి మంచి పాఠాలు నేర్చుకున్నాం. మేము ఆటను ఆడే విధానం.. మైదానంలో ప్రవర్తించే తీరును ప్రజలు మంచి దృష్టితో చూడాలి. ఇలాంటి పుకార్లు, అవాస్తవాలను నమ్మద్దొని కోరుకుంటున్నాం. ఇప్పటికే చాలా సమయం గడిచిపోయింది.. ఇక ఇది ముందుకు సాగవలసిన సమయం.'' అంటూ ముగించారు. చదవండి: వార్నర్ రిటైరైన తర్వాత బుక్ రాస్తాడని భావిస్తున్నా: బ్రాడ్ ఆసీస్ దిగ్గజ ఆటగాడు గిల్క్రిస్ట్ సంచలన వ్యాఖ్యలు View this post on Instagram A post shared by 7Cricket (@7cricket) -
వార్నర్ రిటైరైన తర్వాత బుక్ రాస్తాడని భావిస్తున్నా
లండన్: 2018లో ఆసీస్ క్రికెటర్ల బాల్ టాంపరింగ్ వివాదం అందరూ మరిచిపోతున్నారన్న దశలో దానిలో భాగస్వామిగా ఉన్న క్రికెటర్ కామెరున్ బ్యాన్క్రాఫ్ట్.. బాల్ టాంపరింగ్ విషయం మిగతా బౌలర్లకు కూడా తెలుసంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఈ వివాదం మరోసారి హాట్ టాపిక్గా మారింది. బ్యాన్క్రాఫ్ట్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న సీఏ మరోమారు విచారణకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ స్టార్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''బ్యాన్క్రాఫ్ట్ వ్యాఖ్యలతో బాల్ టాంపరింగ్ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. నేను ఆస్ట్రేలియాకు బౌలింగ్ చేసి ఉండకపోవచ్చు. కానీ ఇంగ్లండ్ తరపున బౌలింగ్ చేసేటప్పుడు ఎలాంటి అంశాలు చర్చకు వస్తాయె చెప్పాలనుకుంటున్నా. ఒకవేళ బౌలింగ్ సమయంలో నీ సీమ్లో తేడా ఉంటే అండర్సన్ సలహాలు ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. బాల్ టాంపరింగ్ జరిగిన రోజు ఆసీస్ జట్టులో ఇది కనిపించలేదు. బంతిని రివర్స్సింగ్ రాబట్టడం కోసం బ్యాన్క్రాఫ్ట్ ఆ పని చేసి ఉండొచ్చు. కానీ టెస్టుల్లో ఉపయోగించే ఎర్రబంతి పాతబడ్డాక స్వింగ్ రాబట్టడం కొంచెం కష్టమే. కానీ దానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. వాటిని ఆసీస్ ఉపయోగించుకోలేదు. ఇక బాల్ టాంపరింగ్ ఉదంతంపై డేవిడ్ వార్నర్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత బుక్ రాస్తాడని భావిస్తున్నా. ఈ విషయం నాకు వార్నర్కి దగ్గరగా ఉండే వ్యక్తి ద్వారా తెలిసింది'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్ సిరీస్ నవంబర్,డిసెంబర్లో జరగనుంది. దీనికి ముందు ఇంగ్లండ్ జట్టు కివీస్, భారత్తో టెస్టు సిరీస్లు ఆడనుంది. మరోవైపు ఆస్రేలియా విండీస్తో టెస్టు సిరీస్ ఆడనుంది. కాగా బాల్ టాంపరింగ్ ఉదంతం క్రికెట్లో పెను దుమారం రేపింది. 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో భాగంగా మూడో మ్యాచ్లో బాన్క్రాఫ్ట్ బంతికి స్యాండ్ పేపర్ను రుద్దుతూ కెమెరాలకు చిక్కాడు. దాంతో ఆగ్రహించిన క్రికెట్ ఆస్ట్రేలియా... బాన్క్రాఫ్ట్పై 9 నెలలు... స్మిత్, వార్నర్లపై ఏడాది పాటు నిషేధం విధించింది. చదవండి: Ball Tampering: మళ్లీ తెరపైకి ‘ట్యాంపరింగ్’ బాల్ ట్యాంపరింగ్ చేస్తున్నానని వారికీ తెలుసు: బ్యాన్క్రాఫ్ట్ -
Ball Tampering: మళ్లీ తెరపైకి ‘ట్యాంపరింగ్’
మెల్బోర్న్: మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియా క్రికెట్ను కుదిపేసిన ‘బాల్ ట్యాంపరింగ్’ వివాదం మరోసారి ముందుకు వచ్చింది. కేప్టౌన్లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో ట్యాంపరింగ్కు పాల్పడిన ఘటనలో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరాన్ బాన్క్రాఫ్ట్లపై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) నిషేధం విధించింది. వారి శిక్ష ముగిసి మళ్లీ మైదానంలోకి దిగడంతో అంతా ముగిసిపోయినట్లు భావించగా... బాన్క్రాఫ్ట్ తాజా వ్యాఖ్యలతో ఆ వివాదాన్ని మళ్లీ రేపాడు. ‘బాల్ ట్యాంపరింగ్ గురించి బౌలర్లకు తెలుసా’ అంటూ అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ బాన్క్రాఫ్ట్...‘దాని గురించి ప్రత్యేకంగా చెప్పాలా’ అన్నాడు. దాంతో ఇందులో ఆసీస్ బౌలర్లకు కూడా భాగం ఉందని కొత్తగా చర్చ మొదలైంది. బాన్క్రాఫ్ట్ వ్యాఖ్యలపై సీఏ వెంటనే స్పందించింది. 2018లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎవరి వద్దనైనా ఇంకా అదనపు సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని... అవసరమైతే దీనిపై పునర్విచారణ చేస్తామని కూడా ప్రకటించింది. అంతే కాకుండా అవినీతి నిరోధానికి సంబంధించిన సీఏ ప్రత్యేక బృందం (ఇంటిగ్రిటీ యూనిట్) వెంటనే బాన్క్రాఫ్ట్తో మాట్లాడింది. నాడు ఇచ్చిన వాంగ్మూలంకంటే అదనంగా ఇంకా ఏమైనా చెప్పేది ఉందా అంటూ ప్రశ్నించింది. ఆశ్చర్యమేమీ లేదు: క్లార్క్ బాన్క్రాఫ్ట్ చేసిన వ్యాఖ్యలపై కొందరు ఒక్కసారిగా ఏదో అనూహ్యం జరిగిపోయినట్లు స్పందిస్తున్నారని, అయితే ఇందులో అంతగా ఆశ్చర్యపడాల్సిందేమీ లేదని ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ వ్యాఖ్యానించాడు. ‘బంతిని ట్యాంపరింగ్ చేసిన విషయం జట్టులో ముగ్గురు ఆటగాళ్లకే తెలుసంటే ఎలా నమ్ముతాం. బంతిని షైనింగ్ చేసిన తర్వాత ఎవరైనా బౌలర్ వద్దకే విసురుతారు. వారికి ఆ తేడా అర్థం కాదా. అలాంటి ఘటన ఒక్కసారిగా ఏమీ జరిగిపోదు. దానికి ముందు ఎంతో ప్రణాళిక ఉండే ఉంటుంది. అందులో ఎవరెవరు భాగస్వాములో తెలియాలి కదా. అయితే ఆసీస్ బోర్డు ఈ విషయంలో అసలు నిజాలను దాటి పెట్టేందుకే ప్రయత్నించింది’ అని క్లార్క్ ఘాటుగా విమర్శించాడు. -
బాల్ టాంపరింగ్ వివాదంలో మరికొందరి ప్రమేయం..
మెల్బోర్న్: మూడేళ్ల కిందట జరిగిన బాల్ టాంపరింగ్ వివాదంలో రోజుకో కొత్త విషయం తెరపైకి వస్తుంది. ఆ వివాదంలో ప్రధాన సూత్రధారి అయిన బాన్క్రాఫ్ట్ ఇటీవల సంచలన విషయాలను వెల్లడించగా, తాజాగా ఆసీస్ దిగ్గజ ఆటగాడు గిల్క్రిస్ట్, డేవిడ్ వార్నర్ మేనేజర్ జేమ్స్, ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్లు చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రక్తి కట్టించాయి. ఈ విషయమై తొలుత బాన్క్రాఫ్ట్ మాట్లాడుతూ.. 2018లో సఫారీలతో జరిగిన మూడో టెస్ట్లో తాను సాండ్ పేపర్ వాడిన విషయం తమ బౌలర్లకు ముందే తెలుసని బాంబు పేల్చగా, తాజాగా ఆసీస్ లెజండరీ ఆటగాడు గిల్లీ మాట్లాడుతూ.. బాల్ టాంపరింగ్ జరిగిన విషయం బాన్క్రాఫ్ట్తో పాటు మరికొంత మందికి ముందే తెలుసని, ఆ పేర్లను బయటపెట్టేందుకు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారని వెల్లడించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. క్రికెట్ ఆస్ట్రేలియాను ఓ కుదుపునకు లోను చేసిన ఈ ఉదంతంపై వార్నర్ మేనేజర్ జేమ్స్ మాట్లాడుతూ.. నాడు జరిగిన విచారణ ఏకపక్షంగా సాగిందని, ఈ విషయమై నిషేదానికి గరైన ఆటగాళ్లు కోర్టును ఆశ్రయించి ఉంటే తప్పక కేసు గెలిచే వాళ్లని సంచలన వ్యాఖ్యలు చేశాడు. మరోవైపు ఆసీస్ మాజీ కెప్టెన్ క్లార్క్ స్పందిస్తూ.. బాల్ టాంపరింగ్ జరిగిన విషయం ఆ ముగ్గురితో పాటు ఇంకా ఎవరికైనా ముందే తెలిసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నాడు. కాగా, ఈ వివాదంలో బాన్క్రాఫ్ట్తోపాటు నాటి జట్టు కెప్టెన్ స్టీవ్స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్లు ఏడాది పాటు నిషేదానికి గురైన సంగతి తెలిసిందే. చదవండి: భారత క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా జరుగనుంది.. -
బాల్ టాంపరింగ్: ఇక్కడితో ఆగిపోయేలా లేదు
సిడ్నీ: 2018లో ఆసీస్ క్రికెటర్లు చేసిన బాల్ టాంపరింగ్ క్రికెట్లో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో భాగంగా మూడో మ్యాచ్లో బాన్క్రాఫ్ట్ బంతికి స్యాండ్ పేపర్ను రుద్దుతూ కెమెరాలకు చిక్కాడు. దాంతో ఆగ్రహించిన క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)... బాన్క్రాఫ్ట్పై 9 నెలలు... కెప్టెన్ స్మిత్, వైస్ కెప్టెన్ వార్నర్లపై ఏడాది పాటు నిషేధం విధించింది. తాజాగా బాన్క్రాఫ్ట్.. బాల్ టాంపరింగ్ విషయం స్మిత్, వార్నర్లతో పాటు మిగతా బౌలర్లకు కూడా తెలుసంటూ పెద్ద బాంబు పేల్చాడు. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) బాన్క్రాఫ్ట్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని మరోసారి విచారణకు సిద్ధమైంది. బాన్క్రాఫ్ట్ చెప్పినట్లు ఇతర బౌలర్లకు కూడా ఈ విషయం ముందుగానే తెలుసా అనే కోణంలో విచారణను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో బాల్ టాంపరింగ్ వివాదం ఇంకా ముగిసిపోలేదని..అది బాన్క్రాఫ్ట్తో ఆగిపోదని.. ఇంకా ముందుకు సాగుతుందని ఆసీస్ మాజీ బౌలింగ్ కోచ్ డేవిడ్ సాకర్ పేర్కొన్నాడు. ఆసీస్ ప్లేయర్లు బాల్ టాంపరింగ్కు పాల్పడిన సమయంలో ఆసీస్ బౌలింగ్ కోచ్గా డేవిడ్ సాకర్ ఉండడం విశేషం. డేవిడ్ సాకర్ స్పందిస్తూ.. ''ఈ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఈ వివాదం చాలా మందిని ఇరుకున పెట్టే అవకాశం ఉంది. అది నేనైనా కావొచ్చు లేదా ఇంకెవరో కావొచ్చు. బాన్క్రాఫ్ట్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని సీఏ విచారణ చేపట్టడం మంచిదే కావొచ్చు.. కానీ తప్పు చేయనివాళ్లు కూడా ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విచారణలో భాగంగా రేపు నన్ను పాయింట్ అవుట్ చేయొచ్చు.. లేదంటే ఆ సమయంలో కోచ్గా ఉన్న డారెన్ లీమన్వైపు కూడా వెళ్లొచ్చు. ఈ విచారణతో వాళ్లు(సీఏ) ఎక్కడిదాకా వెళతారో నాకు తెలియదు.. ఒక్కటి మాత్రం చెప్పగలను.. ఇది బాన్క్రాఫ్ట్తో ముగిసిపోలేదు.. ఇది ఎప్పటికి ఆగిపోదు.. ముందుకు సాగుతూనే ఉంటుంది.'' అని చెప్పుకొచ్చాడు. చదవండి: బాల్ ట్యాంపరింగ్ చేస్తున్నానని వారికీ తెలుసు అతనికి బౌలింగ్ చేస్తే.. అమ్మాయిని ఇంప్రెస్ చేసినట్లే -
బాల్ ట్యాంపరింగ్ చేస్తున్నానని వారికీ తెలుసు: బాన్క్రాఫ్ట్
లండన్: క్రికెట్లో పెను దుమారానికి కారణమైన 2018 బాల్ ట్యాంపరింగ్ వివాదంపై ఆ ఘటన ప్రధాన సూత్రధారి ఆస్ట్రేలియా క్రికెటర్ కామెరూన్ బాన్క్రాఫ్ట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నేను ఉద్దేశపూర్వకంగా బంతి ఆకారాన్ని మార్చేందుకు (బాల్ ట్యాంపరింగ్) ప్రయత్నిస్తున్నాననే విషయం అప్పటి సారథి స్మిత్, వార్నర్లతోపాటు ఇతర బౌలర్లకు కూడా తెలుసు. ఎందుకంటే నేను చేసే పని వల్ల వారికే లాభం ఎక్కువగా ఉంటుంది. జట్టులో గుర్తింపు తెచ్చుకోవడం కోసం నేను ట్యాంపరింగ్కు పూనుకున్నాను. ఆ సమయంలో నైతిక విలువలను నేను పూర్తిగా మరిచిపోయాను. ఆ తర్వాతే నాకు తెలిసింది నేను ఎంత పెద్ద తప్పు చేశానో’ అని ఇంగ్లండ్కు చెందిన ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాన్క్రాఫ్ట్ పేర్కొన్నాడు. 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో భాగంగా మూడో మ్యాచ్లో బాన్క్రాఫ్ట్ బంతికి స్యాండ్ పేపర్ను రుద్దుతూ కెమెరాలకు చిక్కాడు. దాంతో ఆగ్రహించిన క్రికెట్ ఆస్ట్రేలియా... బాన్క్రాఫ్ట్పై 9 నెలలు... స్మిత్, వార్నర్లపై ఏడాది పాటు నిషేధం విధించింది. బాన్క్రాఫ్ట్ ప్రస్తుతం ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్ షిప్లో డర్హామ్ జట్టుకు ఆడుతున్నాడు. విచారణకు సిద్ధమైన సీఏ బాల్ ట్యాంపరింగ్పై బాన్క్రాఫ్ట్ చేసిన తాజా వ్యాఖ్యలపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) విచారణకు సిద్ధమైంది. బాన్క్రాఫ్ట్ చెప్పినట్లు ఇతర బౌలర్లకు కూడా ఈ విషయం ముందుగానే తెలుసా అనే కోణంలో విచారణ ఉంటుందని సీఏ పేర్కొంది. -
బాల్ ట్యాంపరింగ్పై వార్నర్ పుస్తకం!
మెల్బోర్న్ : క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)ను కుదిపేసిన 2018 బాల్ ట్యాంపరింగ్ ఉదంతంపై డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పుస్తకం రాయనున్నట్లు అతని భార్య క్యాండిస్ వార్నర్ వెల్లడించింది. రెండేళ్ల క్రితం దక్షిణాఫ్రికా పర్యటనలో ఆసీస్ ఆటగాళ్లు స్మిత్ (అప్పటి కెప్టెన్), వార్నర్, బాన్క్రాఫ్ట్ కేప్టౌన్ టెస్టులో బాల్ ట్యాంపరింగ్కు పాల్పడి నిషేధానికి గురయ్యారు. ఈ ఉదంతం ఆటగాళ్ల కెరీర్కు మచ్చగా నిలిచింది. అయితే దీనిపై వాస్తవాల్ని వివరించేందుకు తన భర్త పుస్తకం రాస్తాడని క్యాండిస్ తెలిపింది. బంతిని ఉద్దేశపూర్వకంగా మార్చాలనే ప్రణాళిక వార్నర్దేనన్న ఆరోపణల్ని ఆమె కొట్టిపారేసింది. అది వేరొకరి ప్రమేయంతో జరిగిందని చెప్పింది. వార్నర్ మేనేజర్ జేమ్స్ ఎర్క్సిన్ కూడా పుస్తకంలోనే అన్ని విషయాలు వెల్లడవుతాయని, తప్పకుండా వార్నర్ సమీప భవిష్యత్తులో వాస్తవాలతో పుస్తకం రాస్తాడని చెప్పారు. (చదవండి : అతని ఆట నాకు ఆశ్చర్యం కలిగించింది) సరిగ్గా రెండేళ్ల క్రితం దక్షిణాఫ్రికాతో కేప్టౌన్లో జరిగిన టెస్టు మ్యాచ్లో ఆసీస్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బాన్ క్రాఫ్ట్లు బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలతో నిషేధం ఎదుర్కొన్నారు. ఈ వివాదంలో వార్నర్, స్మిత్లు ఏడాది పాటు నిషేధం ఎదుర్కోగా, బాన్ క్రాఫ్ట్పై 9 నెలల నిషేధం పడింది. (చదవండి : 'కెరీర్ మొత్తం మానసిక క్షోభకు గురయ్యా') -
మార్చాల్సిన అవసరం ఏమిటి?: వార్నర్
సిడ్నీ: అంతర్జాతీయ క్రికెట్లో బంతికి లాలాజలాన్ని(సలైవా) రుద్దడాన్ని రద్దు చేయాలనే అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్రతిపాదనను ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ వ్యతిరేకించాడు. ఎప్పట్నుంచో ఆనవాయితీగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని మార్చాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించాడు. ఈ మార్పుతో ఆటగాళ్లకు తక్కువ రిస్క్ లేదా, అసలు రిస్కే ఉండదు అనుకోవడం పొరపాటన్నాడు. బంతిని షైన్ చేయడం కోసం లాలాజలాన్ని రుద్దడం వందల ఏళ్ల నుంచి వస్తున్నదన్నాడు. ఇలా చేయడం వల్ల పూర్తిగా వైరస్ను నియంత్రించవచ్చనే విషయాన్ని మనం చెప్పలేమన్నాడు. ఈ విధానాన్ని పూర్తిగా తొలగించి కొత్త మార్పును తీసుకొస్తారని తాను అనుకోవడం లేదని వార్నర్ తెలిపాడు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బంతికి లాలాజలం రుద్దడాన్ని నిలిపివేయాలనే ఐసీసీ చూస్తోంది. అదే సమయంలో అంపైర్ల సమక్షంలో బంతిని షైన్ చేయడం కోసం కొత్త విధానాన్ని తీసుకురావడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. దీనిపై ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు వ్యతిరేకత వ్యక్తం చేశారు. పాకిస్తాన్ దిగ్గజ పేసర్ వకార్ యూనిస్, ఆశిష్ నెహ్రాలు, హర్భజన్ సింగ్లు సలైవా మార్పు వద్దన్నారు. దీనిని యథావిధిగా కొనసాగించాలని సూచించారు. మరికొంతమంది మాత్రం సలైవాను బంతిపై రుద్దడాన్ని ఆపాలని కోరుతున్నారు. (అది షేన్ వార్న్కే సాధ్యం: యూసఫ్) టెస్టుల్లో కేవలం ఆరంభ ఓవర్లలో మాత్రమే కాకుండా ఆ తర్వాత కూడా బ్యాట్స్మెన్కు, బౌలర్లకు మధ్య సమమైన పోరు జరగాలంటే బంతిని షైన్ చేయడం తప్పనిసరి. లేదంటే బ్యాట్స్మెన్ చితక్కొడతారు. తమ కెరీర్ నరకప్రాయమవుతుందని ఇటీవలే ఆసీస్ పేసర్ కమిన్స్ కూడా అభిప్రాయపడ్డాడు. టాంపరింగ్ను ఐసీసీ నిషేధించినా... మ్యాచ్ చేజారిపోతున్న దశలో చాలా మంది వేర్వేరు వస్తువులతో బంతి ఆకారాన్ని మారుస్తుంటారు. స్మిత్, వార్నర్ ఉదంతంలో స్యాండ్ పేపర్ (ఉప్పు కాగితం) వాడగా...గతంలో సీసా బిరడా, చెట్టు జిగురు, వ్యాస్లీన్, ప్యాంట్ జిప్, జెల్లీ బీన్స్, మట్టి... ఇలా కాదేది టాంపరింగ్కు అనర్హం అన్నట్లుగా ఎన్నో ఘటనలు జరిగాయి. అయితే ఇప్పుడు ఐసీసీ ఏదైనా ఒక ప్రత్యేక పదార్థాన్ని అధికారికంగా టాంపరింగ్కు వాడేలా ఎంపిక చేయాలని భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వాడుతున్న మూడు రకాల బంతులు ఎస్జీ, కూకాబుర్రా, డ్యూక్స్లన్నింటిపై ఒకే రకంగా పనిచేసేలా ఆ పదార్థం ఉండాలనేది కీలక సూచన. (ఖవాజా, షాన్ మార్ష్లను తప్పించారు..!) -
‘బాల్ టాంపరింగ్ చేసుకోవచ్చు’
దుబాయ్: సరిగ్గా రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ బాల్ టాంపరింగ్కు పాల్పడి శిక్షను అనుభవించారు. తమ పేరు, పరపతి అంతా చెడగొట్టుకున్నారు. క్రికెట్లో బాల్ టాంపరింగ్ కొత్త కాదు. వారికంటే ముందు కూడా ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. అయితే ఇకపై టాంపరింగ్ చేసినా కూడా ఎలాంటి శిక్షా ఉండకపోవచ్చు. ఉద్దేశపూర్వకంగా బంతి ఆకారాన్ని దెబ్బ తీయడాన్ని నేరంగా పరిగణిస్తోన్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తమ నిబంధనలు సడలించే అవకాశం కనిపిస్తోంది. బాల్ టాంపరింగ్ను చట్టబద్ధం చేయాలనే ప్రతిపాదన ప్రస్తుతం ఐసీసీ పరిశీలనలో ఉంది. అంపైర్ల పర్యవేక్షణలో బంతిని పాలిష్ చేసేందుకు అనుమతిస్తారు. ఇదీ కారణం... పరిమిత ఓవర్ల క్రికెట్లో తెల్ల బంతితో సమస్య కాకున్నా... టెస్టుల్లో ఎర్ర బంతితో పేసర్లు ప్రభావం చూపించాలంటే దానిని పదే పదే పాలిష్ చేయడం అవసరం. అలా చేస్తేనే ఇరు వైపులా స్వింగ్ను రాబట్టేందుకు వీలవుతుంది. ఇప్పటి వరకు నిబంధనలకు లోబడి నోటి ఉమ్ము (సలైవా)ను బౌలర్లు వాడుతున్నారు. అయితే కరోనా దెబ్బకు బంతిపై ఉమ్మి రుద్దాలంటేనే బౌలర్లు బెంబేలెత్తిపోయే పరిస్థితి ఉంది. అందులోనూ ఒకే బంతిని మైదానంలో అందరూ తీసుకోవడం అంటే కోరి ప్రమాదం తెచ్చుకున్నట్లే. ఈ నేపథ్యంలో బంతి మెరుపు కోసం ఉమ్మిని వాడకుండా ఇతర ప్రత్యామ్నాయాలు చూడాలని ఐసీసీ మెడికల్ కమిటీ సూచించింది. దాంతో బయటి వస్తువుల ద్వారా కూడా టాంపరింగ్ చేసే అవకాశం కల్పించాలని ఐసీసీ భావిస్తోంది. వచ్చే మేలో జరిగే టెక్నికల్ కమిటీ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఏం వాడొచ్చంటే... టెస్టుల్లో కేవలం ఆరంభ ఓవర్లలో మాత్రమే కాకుండా ఆ తర్వాత కూడా బ్యాట్స్మెన్కు, బౌలర్లకు మధ్య సమమైన పోరు జరగాలంటే బంతిని షైన్ చేయడం తప్పనిసరి. లేదంటే బ్యాట్స్మెన్ చితక్కొడతారు. తమ కెరీర్ నరకప్రాయమవుతుందని ఇటీవలే ఆసీస్ పేసర్ కమిన్స్ కూడా అభిప్రాయపడ్డాడు. టాంపరింగ్ను ఐసీసీ నిషేధించినా... మ్యాచ్ చేజారిపోతున్న దశలో చాలా మంది వేర్వేరు వస్తువులతో బంతి ఆకారాన్ని మారుస్తుంటారు. స్మిత్, వార్నర్ ఉదంతంలో స్యాండ్ పేపర్ (ఉప్పు కాగితం) వాడగా...గతంలో సీసా బిరడా, చెట్టు జిగురు, వ్యాస్లీన్, ప్యాంట్ జిప్, జెల్లీ బీన్స్, మట్టి... ఇలా కాదేది టాంపరింగ్కు అనర్హం అన్నట్లుగా ఎన్నో ఘటనలు జరిగాయి. అయితే ఇప్పుడు ఐసీసీ ఏదైనా ఒక ప్రత్యేక పదార్థాన్ని అధికారికంగా టాంపరింగ్కు వాడేలా ఎంపిక చేయాలని భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వాడుతున్న మూడు రకాల బంతులు ఎస్జీ, కూకాబుర్రా, డ్యూక్స్లన్నింటిపై ఒకే రకంగా పనిచేసేలా ఆ పదార్థం ఉండాలనేది కీలక సూచన. ఈ రకంగా చూస్తే బంతి మెరుపు కోసం లెదర్ మాయిశ్చరైజర్, మైనం, షూ పాలిష్ కొంత వరకు మెరుగ్గా ఫలితమిచ్చే అవకాశం ఉన్నట్లు పరిశీలనలో తేలింది. చివరకు ఐసీసీ దేన్ని ఓకే చేస్తుందనేది ఆసక్తికరం. -
పూరన్ సస్పెన్షన్
దుబాయ్: వెస్టిండీస్ వికెట్కీపర్ బ్యాట్స్మన్ నికోలస్ పూరన్పై సస్పెన్షన్ వేటు వేశారు. లక్నోలో అఫ్గానిస్తాన్తో జరిగిన మూడో వన్డేలో అతను బాల్ ట్యాంపరింగ్కు పాల్పడినట్లు తేలడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అతనిపై నాలుగు మ్యాచ్ల నిషేధాన్ని విధించింది. బంతి ఆకారాన్ని మార్చినట్లు పూరన్ అంగీకరించడంతో క్షమాపణలు కూడా కోరాడు. సస్పెన్షన్ కారణంగా విండీస్ ఆటగాడు తదుపరి నాలుగు టి20 మ్యాచ్లకు దూరమయ్యాడు. ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళిలోని లెవెల్–3 నిబంధనను అతిక్రమించడంతో ఆరి్టకల్ 2.14 ప్రకారం నాలుగు సస్పెన్షన్ పాయింట్లను విధించామని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఔను... నా వల్ల తప్పు జరిగింది. ఐసీసీ శిక్షకు నేను అర్హుడినే. భవిష్యత్తులో ఇలాంటి తప్పు పునరావృతం చేయను’ అని పూరన్ జట్టు వర్గాలను క్షమాపణలు కోరాడు. -
బాల్ ట్యాంపరింగ్కు పాల్పడి మళ్లీ కష్టాల్లోకి..
కరాచీ: సుదీర్ఘ కాలం తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టులో పునరాగమనం చేసిన షెహజాద్ అహ్మద్ మళ్లీ కష్టాల్లో పడ్డాడు. బాల్ ట్యాంపరింగ్కు పాల్పడి తిరిగి ఇబ్బందుల్ని కొనితెచ్చుకున్నాడు. క్వాయిద్ ఈ అజామ్ ట్రోఫీలో భాగంగా సెంట్రల్ పంజాబ్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్న అజామ్.. సింధ్తో జరిగిన మ్యాచ్లో బాల్ ఆకారాన్ని దెబ్బ తీసే యత్నం చేశాడు. ఇది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)దృష్టికి వెళ్లడంతో పాటు దీన్ని సీరియస్గా తీసుకోవడంతో అజామ్ కెరీర్ డైలమాలో పడింది. ‘ బాల్ ట్యాంపరింగ్కు యత్నించిన అజామ్పై విచారణ చేపట్టాం. అతనిపై నిర్ణయం తీసుకుంటాం’ అని పీసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫైసలాబాద్లో సింధ్తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో రెండో రోజు ఆటలో షెహజాద్ బంతి ఆకారాన్ని దెబ్బ తీసేందుకు యత్నించాడు. ఈ విషయాన్ని ఫీల్డ్ అంపైర్లు రిఫరీ నదీమ్ దృష్టికి తీసుకెళ్లడంతో షెహజాద్కు సమన్లు జారీ చేశారు. దీనిపై ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇలా క్రమ శిక్షణా నియమావళిని ఉల్లంఘించడం షెహజాద్ ఇది తొలిసారి కాదు. 2018లో యాంటీ డోపింగ్ రూల్స్ను అతిక్రమించి నాలుగు నెలలపాటు నిషేధానికి గురయ్యాడు. దాంతో గతేడాది జూలై 10వ తేదీన అతనిపై సస్పెన్షన్ వేటు వేసింది పీసీబీ. కాగా, ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన షెహజాద్ తీవ్రంగా నిరాశపరిచాడు. దాంతో విమర్శల పాలయ్యాడు. కాకపోతే కోచ్ మిస్బావుల్ హక్ మాత్రం షెహజాద్కు మద్దతుగా నిలవడంతో ఊరట లభించింది. అయితే ఇప్పుడు బాల్ ట్యాంపరింగ్ ఉదంతంలో చిక్కుకున్న షెహజాద్పై పీసీబీ ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో చూడాలి. -
నిషేధం తర్వాత తొలిసారి జట్టులోకి..
సిడ్నీ : యావత్ క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన బాల్ ట్యాంపరింగ్ వివాదంతో నిషేధం ఎదుర్కొని జట్టుకు దూరమైన ఆస్ట్రేలియా యువ ఆటగాడు కామెరూన్ బెన్క్రాఫ్ట్ ఎట్టకేలకు పిలుపునందుకున్నాడు. ప్రతిష్టాత్మక యాషేస్ సిరీస్ కోసం ఎంపిక చేసిన 17 మంది సభ్యులు గల జట్టులో చోటుదక్కించుకున్నాడు. బెన్క్రాఫ్ట్తో ఆసీస్ సీనియర్ ఆటగాళ్లు ఓపెనర్ డెవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్లు సైతం శిక్షను అనుభవించినప్పటికీ.. ప్రపంచకప్ టోర్నీతో వారిద్దరు అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేశారు. బెన్క్రాఫ్ట్ నిషేధం 9 నెలల్లోనే ముగిసినప్పటికీ ఆసీస్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. యాషెస్ సిరీస్ కోసం టిమ్ పెయిన్ నేతృత్వంలోని 17 మంది సభ్యుల గల జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా శుక్రవారం ప్రకటించింది. ఈ జట్టులో మిచెల్ నెసెర్ అనే అన్క్యాప్డ్ ప్లేయర్ చోటు దక్కించుకున్నాడు. ‘25 మంది ఆటగాళ్ల జాబితాను 17 మందికి కుదించడం చాలా కష్టమైన పని. ఈ సిరీస్ కోసం అద్భుతంగా సాధన చేశాం. ఇందులో 8 మంది ఆటగాళ్లు ఆస్ట్రేలియా-ఏ తరఫున గత నెలరోజులుగా ఇంగ్లండ్లో ఆడుతున్నారు. ఐసీసీ ప్రపంచకప్ టోర్నీలో ఆడిన ఆరుగురిని తీసుకున్నాం. కౌంటీ క్రికెట్ ఆడిన మరో ముగ్గురిని ఎంపిక చేశాం. తొలి టెస్ట్కు సిద్ధంగా ఉండేలా చూసుకున్నాం’ అని ఆసీస్ జాతీయ సెలక్టర్ ట్రెవర్ హోన్స్ తెలిపారు. ఇక 2018లో దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న బాల్ ట్యాంపరింగ్ వివాదం ఆసీస్ జట్టును ప్రపంచం ముందు దోషులగా నిలబెట్టింది. దీంతో ఆటగాళ్లపై క్రికెట్ ఆస్ట్రేలియా కఠిన శిక్షలు విధించడం.. శిక్షణ కాలం ముగిసి పునరాగమనం చేయడం తెలిసిందే. -
జంపా ట్యాంపరింగ్ చేశాడా?
లండన్ : ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా ట్యాంపరింగ్కు యత్నించాడా? అతను ప్రతి బంతికి జేబులో చేతులు ఎందుకు పెడ్తున్నాడు? జేబులో ఏముంది.. సాండ్ పేపరా? అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ ప్రశ్నలకు తగ్గట్టే మైదానంలో జంపా తీరు టాంపరింగ్ సందేహాలను రేకెత్తించింది. ఆదివారం భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్లో జంపా తన తొలి స్పెల్ బౌలింగ్ చేస్తున్న సమయంలో పదేపదే తన ప్యాంటు జేబులో చేతులు పెట్టి తీయడం.. బంతిని రుద్దడంతో ఈ అనుమానాలకు దారితీసింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను షేర్ చేస్తూ ఐసీసీ దృష్టి సారించాలని నెటిజన్లు కోరుతున్నారు. అయితే గతేడాది కిందట చోటుచేసుకున్న బాల్ టాంపరింగ్ ఉదంతం ఆసీస్ జట్టును ఎంతగా కుదిపేసిందో తెలిసిందే. అలాంటిది ఆ జట్టు ఆటగాళ్లు టాంపరింగ్ గురించి ఆలోచన చేస్తారని మాత్రం అనుకోలేం. (చదవండి : మావాళ్ల తరఫున సారీ స్మిత్ : కోహ్లి) Whats in the pocket Zampa??? Are Australia upto old tricks again? pic.twitter.com/MPrKlK2bs9 — Peter Shipton (@Shippy1975) June 9, 2019 అది హ్యాండ్ వార్మర్.. ఈ సందేహాలను ఆసీస్ క్యాంప్ నివృత్తి చేసింది. జంపా హ్యాండ్వార్మర్ సాధనాన్ని ఉపయోగిస్తాడని, అతని జేబులో ఉన్నది అదేనని తెలిపారు. ఈ సాధానాన్ని బిగ్బాష్ లీగ్తో పాటు.. అంతర్జాతీయ మ్యాచ్ల్లో కూడా అతను ఉపయోగిస్తాడని పేర్కొంది. చల్లని వాతావరణంలో బంతిపై పట్టుచిక్కడం కోసం దాన్ని పదేపదే ఉపయోగిస్తాడని స్పష్టం చేసింది. (చదవండి : కంగారూలను కసిగా...) ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ సైతం ఈ వ్యవహారంపై మ్యాచ్ అనంతరం స్పందించాడు. ‘ నేను ఆ ఫొటోలను చూడలేదు. కానీ అతని జేబులో హ్యాండ్ వార్మర్ ఉందని తెలుసు. ప్రతి మ్యాచ్లో జంపా దాన్ని ఉపయోగిస్తాడు. ఆ ఫొటోలను చూడలేదు కాబట్టి దానిపై ఎక్కువగా మాట్లాడలేను. కానీ వాస్తవం మాత్రం అతను హ్యాండ్ వార్మర్ను ఉపయోగించడం’ అని పేర్కొన్నాడు. గతేడాది నవంబర్లో జంపా ఇలాంటి ఆరోపణలనే ఎదుర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ సందర్భంగా ఈ తరహా ఫొటోలు, వీడియోలు సందేహాలను రేకెత్తించాయి. కానీ అప్పుడు కూడా అతను హ్యాండ్ వార్మర్ ఉపయోగిస్తాడనే స్పష్టమైంది. -
మరోసారి తండ్రి కాబోతున్న వార్నర్
సిడ్నీ : ట్యాంపరింగ్ వివాదంతో ఆటకు దూరమై 2018 సంవత్సరమంతా చేదు అనుభవాలు ఎదుర్కొన్న ఆస్ట్రేలియా క్రికెటర్ డెవిడ్ వార్నర్కు నూతన ఏడాది తీపికబురుతో ప్రారంభమైంది. మరో నాలుగు నెలల్లో నిషేధం పూర్తిచేసుకోని అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేయనున్న వార్నర్కు అంతకు ముందే శుభవార్త విన్నాడు. తను మరోసారి తండ్రికాబోతున్నట్లు తన భార్య క్యాండిక్ వార్నర్ నోట వచ్చిన తీపి కబురుతో వార్నర్ కొత్త ఏడాదిని ఘనంగా ప్రారంభించాడు. ఇక వార్నర్ తండ్రికాబోతున్నాడనే విషయాన్ని అతని భార్య క్యాండికే స్వయంగా ట్వీటర్లో పేర్కొంది. ‘ఈ ఏడాదంతా మా వెన్నంటి నిలిచిన ప్రతీ ఒక్కరికి తెలియజేసేది ఏమంటే.. 2019లో మా కుటుంబంలోని నలుగురం కాస్త ఐదుగురు కానున్నాం. అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని తాను గర్భవతిననే విషయాన్ని ట్వీట్ చేసింది. ఇక వార్నర్ ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలకు తండ్రన్న విషయం తెలిసిందే. ట్యాంపరింగ్ వివాదంతో ఆటకు దూరమైన వార్నర్.. మరో నాలుగు నెలల్లో అతనిపై పడ్డ నిషేదం పూర్తికానుంది. ఇక వార్నర్ పునరాగమం కోసం ఆసీస్ ఆటగాళ్లు, అభిమానులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. మరోవైపు నిషేధం ఎదుర్కొంటున్న స్టీవ్ స్మిత్, బాన్క్రాఫ్ట్లు ఈ ఘటనకు పూర్తి కారణం వార్నరే అని వ్యాఖ్యానించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వార్నర్ ప్రోద్భలంతోనే బాల్ట్యాంపరింగ్కు పాల్పడ్డానని బాన్క్రాప్ట్ పేర్కొనడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఇద్దరి ఆటగాళ్లపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. Being together has made us into the family we are today. We are so grateful for all the love and support everyone has shown us this year. It is with a full heart that we would like to share with you that in 2019 our family of 4 will become a family of 5. Happy new year. X pic.twitter.com/pE3EAmR611 — Candice Warner (@CandyFalzon) December 31, 2018
Pagination
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
Kalki 2898 AD : ప్రమోషన్స్కి భారీ ప్లాన్..నెల రోజుల్లో ఎన్నో సర్ప్రైజెస్!
నవీన్ పట్నాయక్పై అస్సాం సీఎం హిమంత సంచలన ట్వీట్
పిల్లలు నా పేరు చెప్పడానికి కూడా ఇష్టపడరు: శ్రీకాంత్
లెహంగాలో అదిరిపోతున్న జాన్వీ..ఆ నెక్లెస్ స్పెషాలిటీ ఏంటంటే..!
దిశ ఎఫెక్ట్: విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు
మేజర్ లీగ్ క్రికెట్కు లిస్ట్-ఏ హోదా
కాకతీయ కళాతోరణం, చార్మినార్ రాచరీక పోకడనా?: కేటీఆర్ కౌంటర్
చిరుత హీరోయిన్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. ట్రైలర్తోనే భయపెట్టేశారు!
మహిళల అశ్లీల వీడియోలు సీక్రెట్ గా రికార్డ్...
Janhvi Kapoor: మిస్టర్ అండ్ మిసెస్ మహి ప్రమోషన్స్లో జాన్వీ బిజీ బిజీ..క్రికెట్ థీమ్ నెక్లెస్..!
తప్పక చదవండి
- నవీన్ పట్నాయక్పై అస్సాం సీఎం హిమంత సంచలన ట్వీట్
- హీరామండి నటితో డేటింగ్.. స్పందించిన నటుడు..!
- ఆస్ట్రేలియాలో పర్యటించనున్న భారత-ఏ జట్టు
- అంతర్జాతీయ బర్గర్ దినోత్సవం: ఎలా తీసుకుంటే ఆరోగ్యకరమో తెలుసా..!
- స్కానింగ్ సెంటర్లో టెక్నీషియన్ వికృత చేష్టలు.. న్యూడ్ ఫొటోలు తీసి..
- కవితకు బెయిల్ ఇవ్వొద్దు. . హైకోర్టులో ఈడీ, సీబీఐ వాదనలు
- పపువా న్యూ గినియా విపత్తుపై ప్రధాని మోదీ ట్వీట్
- తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు
- ప్రజా భవన్లో ముగిసిన తనిఖీలు..
- పడిలేసిన పసిడి.. పరుగులు పెడుతున్న వెండి: నేటి కొత్త ధరలు ఇలా..
Advertisement