-
వందో ఆస్కార్కి నాలుగు వేల కోట్లు!
ఆస్కార్ శతాబ్ది ఉత్సవాల (ఆస్కార్ అవార్డుల వందో వేడుక) సన్నాహాలు మొదలయ్యాయి. 2028లో జరగనున్న ఈ వేడుకల కోసం ఆస్కార్ నిర్వాహకులు ఇప్పట్నుంచే ప్రణాళికలు వేస్తుండటం హాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ‘ఆస్కార్ 100’ పేరిట ఈ వేడుకలు జరగనున్నట్లుగా రోమ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆస్కార్ ప్రతినిధులు వెల్లడించారు. ‘‘ఆస్కార్ 100’ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నాం.ఇందుకోసం 500 మిలియన్ డాలర్ల క్యాంపైన్ (దాదాపు రూ. నాలుగు వేల కోట్లు)ను లక్ష్యంగా పెట్టుకున్నాం. గత ఏడాదిన్నరలో ఇప్పటికే ‘ఆస్కార్ 100’ కోసం వంద మిలియన్ డాలర్లను సేకరించాం. ‘ఆస్కార్ 100’ ఈవెంట్ను వినూత్నంగా ప్లాన్ చేస్తున్నాం. ఈ వేడుకల సందర్భంలోనే మరో వంద సంత్సరాల పాటు ఆస్కార్ అవార్డు వేడుకలను ఎలా నిర్వహించాలనే విషయాలను చర్చించుకుని, ఓ అవగాహనకు రావాలనుకుంటున్నాం’’ అని ఆస్కార్ కమిటీ ప్రస్తుత సీఈవో బిల్ క్రామోర్ చెప్పుకొచ్చారు. ఇక 97వ ఆస్కార్ అవార్డుల వేడుకలు వచ్చే ఏడాది మార్చి 2న జరగనున్న విషయం తెలిసిందే. -
నా భర్త అలా ఉంటే చాలు.. ఇంకేం అక్కర్లేదు: కృతి సనన్
ఒంటరిగా ఉన్న హీరోయిన్లు చాలామంది గత కొన్నాళ్లలో పెళ్లి చేసేసుకుంటున్నారు. ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసి, వివాహ బంధంలోకి అడుగుపెట్టేస్తున్నారు. మరికొందరు అందుకు తగ్గ ప్రిపరేషన్స్ చేసుకుంటున్నారు. అలా ఇప్పుడు కృతి సనన్ కూడా పెళ్లికి రెడీ అయిపోయినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే కాబోయే భర్త ఎలా ఉండాలో హింట్స్ కూడా ఇచ్చేస్తోంది. ఈ మధ్య ఈమె లండన్కి చెందిన కబీర్ బహియాతో అనే వ్యాపారవేత్తతో కలిసి కనిపించడంతో ఈమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ముఖానికి సర్జరీ చేసుకుని షాకిచ్చిన యువ నటి.. ఫొటో వైరల్)'ఏ విషయంలోనైనా మనం ఆశ పెట్టుకుంటే ఒత్తిడితో ఇబ్బంది పడతాం. అందుకే నేను ఎలాంటి ఆశ పెట్టుకోను. ఏం జరిగినా సరే తీసుకోవడానికి రెడీగా ఉంటాను. ఇకపోతే నాకు కాబోయే భర్త నాతో నిజాయతీగా ఉండాలి. నన్ను నవ్వించాలి. నన్ను, నా పనిని గౌరవించాలి. నాతో ఎక్కువ టైమ్ గడపాలి. అన్నింటికి ముఖ్యమైంది నన్ను బాగా చూసుకోవాలి. అలా అని నాతో సరితూగాలనే కోరిక అయితే లేదు' అని కృతి సనన్.. కాబోయే వాడి గురించి చెప్పుకొచ్చింది.కృతి చెప్పిన దానిబట్టి చూస్తుంటే త్వరలో పెళ్లి చేసుకునేలా కనిపిస్తుంది. మరి లండన్ వ్యాపారవేత్తతో ఏడడుగులు వేస్తుందా? లేదంటే ఈమె మనసులో మరెవరైనా ఉన్నారా అనేది క్లారిటీ రావాలి. ఇక సినిమాల విషయానికొస్తే.. 'ది క్రూ' మూవీతో ఈ మధ్య హిట్ కొట్టింది. ప్రస్తుతం హీరోయిన్ కమ్ నిర్మాతగా 'దో పత్తీ' మూవీ చేస్తోంది. (ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్కి హైకోర్టు నుంచి నోటీసులు.. కారణం ఏంటంటే?) -
ముఖానికి సర్జరీ చేసుకుని షాకిచ్చిన యువ నటి.. ఫొటో వైరల్
సినిమా నటులు సర్జరీ చేసుకోవడం అనేది ఇండస్ట్రీలో అప్పుడప్పుడు వినిపించే మాట. చాలామంది హీరోహీరోయిన్లు అందంగా కనిపించేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వీళ్ల గురించి అప్పుడప్పుడు వార్తలు వస్తుంటాయి తప్పితే వాళ్లంతట వాళ్లుగా మాత్రం చెప్పరు. కానీ టాన్స్జెండర్ నటి మాత్రం ఇప్పుడు తన ముఖానికి సర్జరీ చేసుకున్నానని చెప్పి షాకిచ్చింది.త్రినేత్ర హల్దర్ గుమ్మరాజు.. తెలుగు/బెంగాలీకి చెందిన కుటుంబంలో బెంగళూరులో పుట్టింది. దాదాపు 20 ఏళ్ల వరకు అబ్బాయిలానే జీవించింది. అయితే ఎంబీబీఎస్ చేస్తున్న సమయంలో తనలో అమ్మాయి లక్షణాలు ఉన్నాయని గ్రహించిన త్రినేత్ర.. 2018లో ట్రాన్స్ జెండర్గా మారింది. పేరుని త్రినేత్రగా మార్చుకుంది. తర్వాత ఏడాది థాయ్లాండ్ వెళ్లి ఆపరేషన్ చేయించుకుంది. అయితే ఈమెకు కుటుంబ పూర్తిగా అండగా నిలిచింది.(ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్కి హైకోర్టు నుంచి నోటీసులు.. కారణం ఏంటంటే?)దీంతో ఓ వైపు కోర్సు పూర్తి చేసి డాక్టర్ అయింది. మరోవైపు తనలాంటి ట్రాన్స్జెండర్స్కి అవగాహన కల్పించడం కోసం యూట్యబర్గా మారింది. అలా కంటెంట్ క్రియేటర్గా కాస్త గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది ఓటీటీలో రిలీజైన 'మేడ్ ఇన్ హెవెన్ 2' వెబ్ సిరీస్తో నటిగా మారింది. 'రెయిన్ బో రిస్తా' అనే మరో సిరీస్లో కూడా నటించింది.అయితే టాన్స్జెండర్గా మారినప్పటికీ ఇంకా మనసులో ఎక్కడో వెలితిగా ఉంది. దీంతో ఇప్పుడు అమ్మాయిలా కనిపించేందుకు ముఖానికి.. ఏప్రిల్ 8న సర్జరీ చేసుకున్నట్లు త్రినేత్ర చెప్పుకొచ్చింది. ఈ విషయాన్నే ఇన్ స్టాలో పోస్ట్గా పెట్టింది. ఈ క్రమంలోనే ఈమెని మెచ్చుకుంటూ పలువురు కామెంట్స్ పెడుతున్నారు.(ఇదీ చదవండి: రీల్ విలన్తో టాలీవుడ్ హీరోయిన్ రిలేషన్.. ఇక మిగిలింది పెళ్లే?) View this post on Instagram A post shared by Trinetra Haldar Gummaraju (@trintrin) -
తెలుగులో ఒకే ఒక్క సినిమా.. హీరోయిన్ను గుర్తుపట్టారా?
సినిమా ఇండస్ట్రీలో అలా వచ్చి ఇలా వెళ్లిపోయే జనాలే ఎక్కువ. హీరోయిన్లయితే సక్సెస్ రేటు లేకపోతే ఎక్కువరోజులు నెట్టుకురాలేరు. హిట్టు అనే ఆక్సిజన్ అందితేనే ఫిల్మీదునియాలో వారికంటూ స్థానం ఉంటుంది. పైన కనిపిస్తున్న బ్యూటీ పేరు అంతర మాలి. ఈ రోజు (మే 11న) తన పుట్టినరోజు.. ఈ సందర్భంగా తన జర్నీని ఓసారి చూసేద్దాం..ఆయన కూతురే అంతరబాలీవుడ్లోని ఫేమస్ ఫోటోగ్రాఫర్ జగదీశ్ మాలి కూతురే ఆంతర మాలి! 35 ఏళ్లపాటు ఇండస్ట్రీలో ఉన్న ఆయన తర్వాత కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడ్డాడు. ఒకానొక సమయంలో అంతర తండ్రిని వదిలేయడంతో.. ఆయన ముంబై వీధుల్లో రోడ్డుపై దయనీయ స్థితిలో కనిపించాడని వార్తలు వచ్చాయి. అయితే సమయానికి ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకోకపోవడం వల్లే అలా జరిగిందని, తాను ప్రెగ్నెంట్గా ఉండటం వల్లే తండ్రిని చూసుకోలేకపోయానని నటి వివరణ ఇచ్చింది.ఫస్ట్ సినిమా బోల్తాఅంతర విషయానికి వస్తే 1998లో ధూండ్తే రేహ్ జావోగే మూవీతో తన సినీజర్నీ మొదలైంది. కానీ తొలి సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ మరుసటి ఏడాది రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ప్రేమకథ అనే తెలుగు సినిమాలో హీరోయిన్గా నటించింది. తర్వాత వర్మ డైరెక్షన్లోనే పలు చిత్రాలు చేసింది.ఎక్కువ ఫ్లాప్స్రోడ్, కంపెనీ, డర్నా మర్నా హై, నాచ్, మిస్టర్ యా మిసెస్ వంటి మూవీస్లో మెరిసింది. చాలావరకు ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్గానే నిలిచాయి. 2009లో జీక్యూ మ్యాగజైన్ ఎడిటర్ చె కురియన్ను పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత .. అండ్ వన్స్ ఎగైన్ (2010) అనే ఒకే ఒక్క సినిమా చేసి ఇండస్ట్రీకి గుడ్బై చెప్పేసింది.చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
సినిమాలకు హీరో గుడ్బై.. నాలుగురోజులే ఉండే కూతురు.. తనకోసం అన్నీ చేస్తా!
ఇమ్రాన్ ఖాన్.. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా, తర్వాత హీరోగా హిందీలో సినిమాలు చేసిన ఈయన తర్వాత ఉన్నట్లుండి గ్లామర్ ప్రపంచానికి గుడ్బై చెప్పేశాడు. 2015లో కట్టి బట్టి అనే మూవీలో చివరిసారిగా కనిపించాడు. అతడికి ఏడాదిన్నర వయసున్నప్పుడు పేరెంట్స్ విడాకులు తీసుకున్నారు. తర్వాత తల్లి రాజ్ జుట్షి అనే నటుడిని రెండో పెళ్లి చేసుకుంది. కానీ ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. 2006లోనే విడాకులు తీసుకున్నారు.ప్రేమ పెళ్లిపెద్దయ్యాక ఇమ్రాన్ పరిస్థితి కూడా అదే అయ్యింది. అవంతిక అనే అమ్మాయిని ప్రేమించి 2011లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2014లో ఓ పాప పుట్టింది. ఆమెకు ఇమారా మాలిక్ అని నామకరణం చేశారు. ఏమైందో ఏమో కానీ తర్వాత భార్యాభర్తల మధ్య బంధం బలహీనం కాసాగింది. 2019లో అవంతిక తన కూతుర్ని తీసుకుని భర్త ఇంటి నుంచి వెళ్లిపోయింది. అలా విడివిడిగా జీవించిన ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.ఏదైనా చేస్తాతాజాగా ఇమ్రాన్ ఖాన్ తన కూతురి గురించి మాట్లాడాడు. 'నా బిడ్డ ఇమారా కోసం నేను ఏదైనా చేస్తాను. తనను చూసుకునేందుకు ఏ మనిషినీ పెట్టుకోలేదు. నేనే తనకు వంట చేసి పెడతాను. స్కూల్లో డ్రాప్ చేస్తాను. బడి అయిపోగానే తీసుకొస్తాను. నిద్రపుచ్చుతాను. మళ్లీ సినిమాల్లో ప్రయత్నించడం కంటే నా కూతుర్ని బాధ్యతగా, జాగ్రత్తగా చూసుకోవడమే బాగుంది.వారంలో నాలుగు రోజులుమరీ ముఖ్యంగా తను పెద్దయ్యాక.. మా నాన్న చిన్నప్పుడు నన్నిలా చూసుకున్నాడు, నాకోసం ఈ పని చేశాడు, తనే స్కూలు దగ్గర దిగబెట్టేవాడు అని చెప్పుకోవడానికి జ్ఞాపకాలను కూడబెడుతున్నాను. తన కస్టడీని ఇద్దరం తీసుకున్నాం. వారంలో నాలుగు రోజులు నా దగ్గర, తర్వాతి రోజులు నా మాజీ భార్య దగ్గర ఉంటుంది' అని చెప్పుకొచ్చాడు.చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
స్టార్ హీరోయిన్కి హైకోర్టు నుంచి నోటీసులు.. కారణం ఏంటంటే?
కొన్నిసార్లు ఊహించని విధంగా చిక్కులు ఎదురవుతుంటాయి. అలా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్కి మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఓ విషయంలో చిన్న పదం ఉపయోగించినందుకుగానూ ఈ పరిస్థితి ఎదురైంది. ఇప్పుడీ విషయం కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంతకీ అసలేం జరిగింది?(ఇదీ చదవండి: చిక్కుల్లో హీరో శింబు.. కమల్ హాసన్ మూవీలో నటించడానికి వీల్లేదంటూ..)బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కరీనా కపూర్ ఒకరు. స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లయింది. ఈ క్రమంలోనే తన ప్రెగ్నెన్సీ అనుభవాలతో 'కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్' పేరుతో ఓ పుస్తకం రాసింది. అయితే ఈ బుక్ టైటిల్లో 'బైబిల్' పదాన్ని ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ లాయర్ క్రిస్టోఫర్ ఆంథోని కోర్టుని ఆశ్రయించారు. జస్టిస్ గురుపాల్ సింగ్ అహ్లువాలియా నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ కరీనాకు నోటీసు జారీ చేసింది. ఆ పదం వాడటానికి గల కారణమేంటని ప్రశ్నించింది.కరీనా కపూర్పై కేసు కూడా నమోదు చేయాలని క్రిస్టోపర్ పిటిషన్ వేశారు. ఈ పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. బుక్ టైటిల్లోని 'బైబిల్' పదం వల్ల క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసినట్లు అవుతుందని ఆంథోనీ తన పిటీషన్లో పేర్కొన్నారు. క్రైస్తవులకు బైబిల్ అనేది పవిత్ర గ్రంథం అని, కరీనా కపూర్ తన ప్రెగ్నెన్సీని బైబిల్తో పోల్చడం సరికాదు అని ఆయన చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: వైఎస్సార్సీపీ అభ్యర్థి కోసం ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్.. ఇదెక్కడి క్రేజ్ రా మావ) -
అక్కను రౌడీలా వేధించా.. సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తోంది
ఎంత గొడవపడ్డా సరే అక్కాచెల్లెళ్లు వెంటనే కలిసిపోతారు. అయితే వారి మధ్య పోట్లాటలు ఎప్పుడూ ఉండనే ఉంటాయి. ఒకరు హైపర్ అయిపోతే మరొకరేమో అన్నింటినీ ఓపికగా భరిస్తూ ఉంటారు. బాలీవుడ్ నటి రత్న పాఠక్ షా మొదటి రకం. తన సోదరిని ఎమోషనల్గా టార్చర్ పెట్టిందట! ఈ విషయాన్ని ఆవిడే స్వయంగా వెల్లడించింది.రౌడీలా ప్రవర్తించా'సుప్రియ అక్క, నేను చిన్నగా ఉన్నప్పుడు తెగ పోట్లాడుకునేవాళ్లం. తనకు నేను మంచి చెల్లినైతే కాదు. ఒక రౌడీలా ప్రవర్తించేదాన్ని. ఏది పడితే అది అనేసి బాధపెట్టేదాన్ని. అది గుర్తు చేసుకుంటే సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తుంది. తన మనసును బాధపెట్టినందుకు ఆమెకు సారీ చెప్పాను. తను నన్ను క్షమించిందనే అనుకుంటున్నాను. ప్రస్తుతం మేము బాగానే ఉన్నాం' అని తెలిపింది.అందంగా లేనేమోననిసినీ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు నేనంత అందంగా లేనేమోనని భయపడేదాన్ని. నా పళ్లు, పెదాలు బాగోవని.. అలాగే నా కళ్లు కూడా అంత పెద్దవి కావని ఫీలయ్యేదాన్ని. కానీ సుప్రితకు అందమైన కళ్లుండేవి. అలా అని తను నాకన్నా అందంగా ఉందని నేనేమీ ఈర్ష్య పడేదాన్ని కాదు. నా ప్రవర్తన, క్రమశిక్షణ, టాలెంట్పై ఫోకస్ పెట్టేదాన్ని' అని చెప్పుకొచ్చింది. కాగా రత్న పాఠక్ 2023లో వచ్చిన ధక్ ధక్ అనే సినిమాలో చివరిసారిగా నటించింది. సుప్రియ పాఠక్.. సత్యప్రేమ్కీ కథ చిత్రంలో మెరిసింది.చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ సినిమా -
హోటల్లో రూమ్ కావాలని వెళ్లిన నటికి చేదు అనుభవం
మరాఠీ నటి ప్రణిత్ హట్టే లింగ వివక్షకు గురైంది. మరాఠీ సీరియల్ "కర్భారి లేభరి"తో ఆమెకు మంచి గుర్తింపు దక్కింది. ట్రాన్స్జెండర్ అనే కారణంతో ఒక హోటల్ నిర్వాహకులు లోనికి అనుమతి ఇవ్వలేదు. దీంతో ఒక వీడియో ద్వారా తను ఎదుర్కొన్న అనుభవాన్ని ఆమె షేర్ చేసింది.కొద్దిరోజుల క్రితం ఒక ఈవెంట్ కోసం ప్రణిత్ హట్టే నాసిక్ వెళ్లినట్లు చెప్పింది. ఈ క్రమంలో ఆన్లైన్ ద్వారా ముందుగానే పూజా ఇంటర్నేషనల్ అనే హోటల్లో రూమ్ను బుక్ చేసుకున్నట్లు తెలిపింది. ముందుగా గదిని బుక్ చేసుకున్నప్పటికీ, హోటల్ వారు తనకు అనుమతి లేదంటూ నిరాకరించినట్లు తెలిపింది. ఇదే విషయాన్ని తాజాగా ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వీడియో ద్వారా తెలిపింది. తనను అవమానించారని ఆవేదన చెందింది. తను ఒక ట్రాన్స్జెండర్ అనే కారణంగా గదిని ఇచ్చేందుకు నిరాకరించారని పేర్కొంది. ఇలాంటి జనరేషన్లో ఇంకా లింగ వివక్ష చూపించడం ఏంటి అంటూ ఆమె ప్రశ్నించింది.ఈ సంఘటనలో నెటిజన్లు కూడా తమ ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. హోటల్పై చర్య తీసుకోవాలని పిలుపునిచ్చారు. తన ప్రాథమిక హక్కులు, గౌరవాన్ని ఉల్లంఘించినందుకు హోటల్పై కేసు నమోదు చేయాలని కొందురు కోరుతున్నారు. మరికొందరు 2024లో ఇటువంటి వివక్ష ఆమోదయోగ్యం కాదని ఎత్తి చూపారు. View this post on Instagram A post shared by Pranit Hatte (@h_pranit_official) -
నాకు విడాకులిస్తున్నావా? అని భార్యను అడిగా: నటుడు
సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్, నటుడు ఆయుశ్ శర్మ కామన్ ఫ్రెండ్స్ ద్వారా 2011లో కలిశారు. మొదట ఫ్రెండ్సయ్యారు. తర్వాత లవ్ బర్డ్స్ అయ్యారు. 2014లో భార్యాభర్తలయ్యారు. అనంతరం అహిల్(కుమారుడు), అయత్ (కూతురు)లకు పేరెంట్స్ అయ్యారు. అయితే 2019లో వీరిద్దరూ విడిపోతున్నట్లు రూమర్స్ వచ్చాయి.దోస తిని వచ్చేలోపుఆ పుకార్లను పటాపంచలు చేస్తూ వీరిద్దరి మధ్య బంధం ఏ యేటికాయేడు మరింత స్ట్రాంగ్ అవుతూ వస్తోంది. తాజాగా ఆయుశ్ అప్పటి విడాకుల రూమర్స్ గురించి స్పందించాడు. నా లైఫ్ గురించి పుకార్లు రాసేంత ఇంట్రస్ట్ ఎవరికీ ఉండేది కాదు. కానీ ఓసారి చిన్న సంఘటన జరిగింది. నేను నా బాబును బయటకు తీసుకెళ్లి దోస తినిపించి వస్తున్నాను. విడాకులు తీసుకుంటున్నారా?క్షణాల్లో కొందరు ఫోటోగ్రాఫర్లు నా ముందు జమగూడి అర్పిత, మీరు విడాకులు తీసుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఆ ప్రశ్న విని షాకయ్యాను. ఇంటికెళ్లాక అర్పిత, నేను దీని గురించి మాట్లాడుకుని నవ్వుకున్నాం. ఏంటి? నాకు విడాకులిస్తున్నావంటగా? అని అర్పితను ఆటపట్టించాను' అని ఆయుశ్ చెప్పుకొచ్చాడు.చదవండి: బుల్లితెర నటి ఇంట సెలబ్రేషన్స్.. బాబు ఊయల ఫంక్షన్ -
రొమాంటిక్ సీన్స్.. ఒళ్లంతా దద్దుర్లు వచ్చేశాయి: టాలీవుడ్ హీరోయిన్
శృంగార సన్నివేశాలు చేసేసిన తర్వాత వాటి గురించి మాట్లాడటానికి చాలామంది ఇష్టపడరు. కానీ ఈ మధ్య మాత్రం పలువురు హీరోయిన్లు ఆయా సీన్స్ గురించి ఓపెన్గా మాట్లాడుతున్నారు. మొన్నామధ్య సోనాక్షి సిన్హా, దివ్య పిళ్లై ఇలా మాట్లాడారు. ఇప్పుడు యువ హీరోయిన్ శృతి శర్మ కూడా రొమాంటిక్ సీన్స్ వల్ల వచ్చిన కష్టనష్టాల్ని బయటపెట్టింది.బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ.. రీసెంట్గా 'హీరామండి' సిరీస్తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు. స్వాత్రంత్ర్యం రాకముందు పాకిస్థాన్లోని హీరామండి అనే వేశ్యవాటికని స్ఫూర్తిగా తీసుకుని ఈ సిరీస్ తీశాడు. ఇందులో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితీ రావ్ హైదరీ తదితరులు నటించారు. 'ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ' హీరోయిన్ శృతి శర్మ కూడా ఈ సిరీస్లో సైమా అనే పాత్ర చేసింది. నటిగా తన అనుభవాల్ని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: టాలీవుడ్లో అది చాలా కష్టం.. అసౌకర్యంగా అనిపిస్తుంది: సంయుక్త)'ఈ సిరీస్లో రజత్ కౌల్తో కొన్ని రొమాంటిక్ సీన్స్ చేశాను. ఇందులో ఇద్దరం చాలా సహజంగా నటించాం. ఇలాంటి సన్నివేశాలు ఇప్పటివరకు చేయలేదు. అయితే ఇవి చేస్తున్నప్పుడు నా శరీరంపై దద్దుర్లు వచ్చాయి. దుమ్ము, ధూళి ఉన్నప్పటికీ ఓ రోజంతా కష్టపడి ఈ సీన్స్ పూర్తి చేశాం. ప్రతిదీ ఫెర్ఫెక్ట్గా వచ్చేవరకు షూటింగ్ జరిగింది. అందుకే వెబ్ సిరీసులో ఈ సీన్లు చాలా అద్భుతంగా అనిపించాయి' అని శృతి శర్మ చెప్పింది.అయితే సైమా పాత్ర చేయడం పట్ల సంతోషంగానే ఉన్నానని, భన్సాలీ ఊహించుకున్న రోల్ కోసం బాగానే కష్టపడ్డానని శృతి శర్మ చెప్పింది. ఇకపోతే నెట్ఫ్లిక్స్లో తెలుగులోనూ స్ట్రీమింగ్ 'హీరామండి' వెబ్ సిరీస్లో ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్నాయి. అయితే కంటెంట్ కాస్త ల్యాగ్ ఉండటంతో తెలుగోళ్లకు పెద్దగా నచ్చలేదు కానీ హిందీ ఆడియెన్స్ మాత్రం బాగానే చూస్తున్నారు.(ఇదీ చదవండి:పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరో.. అమ్మాయి ఎవరంటే?) -
తండ్రి మరణించిన 10 రోజులకే పనిలో.. సాయం చేస్తానన్న హీరో
ఇంటి పెద్ద దిక్కు మరణిస్తే ఆ కుటుంబ పరిస్థితి ఎంతో దయనీయంగా మారుతుంది. సంపాదనతో ఫ్యామిలీని పోషించే మనిషి లేకుంటే అంతా తలకిందులవుతుంది. చాలా సందర్భాల్లో పిల్లలు బడి మానేసే దుస్థితి ఏర్పడుతుంది. వయసుకు మించిన పని చేయడానికీ వెనుకాడరు. ఇటీవల ఢిల్లీలో జస్ప్రీత్ అనే పిల్లవాడు తన తండ్రిని కోల్పోవడంతో ఆయనలాగే చపాతీలు చేసే పనిలోకి దిగాడు. పదేళ్ల వయసులోనే కుటుంబ బాధ్యతను భుజాన వేసుకున్నాడు. చేయూతనిచ్చేందుకు రెడీతల్లి పంజాబ్లోని గ్రామంలో ఉండగా జస్ప్రీత్ తన సోదరితో కలిసి వాళ్ల ఆంటీ ఇంట్లో ఉంటున్నాడు. ఓ ఫుడ్ వ్లాగర్ ఇతడి పరిస్థితి సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు. దీంతో ఆనంద్ మహీంద్రా, ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్, బీజేపీ లీడర్ రాజీవ్ బాబ్బర్ తనకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. తాజాగా బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తనకు చేయూతనిచ్చేందుకు రెడీ అయ్యాడు.సెల్యూట్ ఈ పదేళ్ల బాలుడు చిరునవ్వుతో కష్టాలను దాటేందుకు ప్రయత్నిస్తున్నాడు. తండ్రి చనిపోయిన పది రోజులకే ఆయన పనిని చేసేందుకు రంగంలోకి దిగిన అతడి గుండెధైర్యానికి సెల్యూట్ చేస్తున్నాను. అతడికి లేదా అతడి సోదరికి మంచి విద్య అందించేందుకు సాయం చేయాలనుకుంటున్నాను. అతడు ఎక్కడుంటాడో తెలిస్తే చెప్పండి అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. ఇది చూసిన జనాలు అర్జున్ది ఎంత గొప్ప మనసు అని కొనియాడుతున్నారు.చదవండి: రూ.15 లక్షల విలువైన జ్యువెలరీ.. తల్లికి రైతుబిడ్డ గిఫ్ట్! -
నవ్వుతారేమో అనుకున్నా: లాపతా లేడీస్ ప్రతిభ ఇంట్రస్టింగ్ జర్నీ
బాలీవుడ్ దర్శకురాలు కిరణ్రావు (బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ మాజీ భార్య) దర్శకత్వంలో వచ్చిన లాపతా లేడీస్ ఓటీటీలో మంచి ఆదరణ సంపాదించుకుంది. కుటుంబం, వైవాహిక వ్యవస్థలో మహిళల స్థితిగతులు, అమ్మాయిల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా జరిగే బాల్య వివాహాలు, అమ్మాయిల తెగవును పట్టి ఇచ్చిన సినిమా ఇది. ముఖ్యంగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన ప్రతిభా రాంటా తన అధ్బుతమైన నటనతో ఆకట్టుకుంది. సిమ్లా టూ బాలీవుడ్ ప్రతిభ రాంటా ఇంట్రస్టింగ్ జర్నీ ఒక సారి చూద్దాం.ఖుర్బాన్ హువా టీవీ సీరియల్తో వెలుగులోకి వచ్చింది ప్రతిభా రాంటా. ఆ తరువాత వెబ్ సిరీస్ చేస్తుండగా కిరణ్ రావు దృష్టిలో పడింది. అలాలాపతా లేడీస్లో అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని తానేమిటో నిరూపించుకుంది. బాలీవుడ్కి పరిచయం అయిన కొత్త ముఖాల్లో ప్రతిభ రాంటా. నిజంగా తన యాక్టింగ్ ప్రతిభ, ఒకదాని తర్వాత ఒకటి తన ఆన్-స్క్రీన్ పెర్ఫార్మెన్స్తో, ముఖ్యంగా లాపతా లేడీస్ 'జయ' పాత్రలో సత్తా చాటింది. ఇటీవల విడుదలైన వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్లో 'వహీదా' (సంజీదా షేక్) కుమార్తె 'షామా' పాత్రను పోషించింది. 24 ఏళ్ల వయసులో చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అయితే ఈ ప్రయాం అంత సాఫీగా సాగలేదు.ఎవరీ ప్రతిభా రాంటాసందేశనా రాంటా,, రాజేశ్ రాంటా దంపతుల కుమార్తె ప్రతిభా రాంటా. సిమ్లాలో పెరిగింది. చిన్నప్పటి నుంచీ డాన్స్ అంటే ఇష్టం. డాన్స్లో గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసింది. అలా నటించాలనే ఆసక్తి పెరిగింది. ఆ మాటే ఇంట్లో చెబితే యాక్టింగ్ అంటే ఏంటి? అని అడిగారట. ఎందుకంటే కుటుంబంలో చాలా మంది ఉపాధ్యాయులు, అందుకే వారికి నటన గురించి ఏమీ తెలియదట. ఇంజనీర్, డాక్టర్ లేదా మరేదైనా ఇతర ప్రొఫెషనల్గా ప్రతిభను చూడాలని ఆశించారు. దీంతో యాక్టింగ్లో చేరడం చాలా కష్టమేమో , తనను చూసి నవ్వుతారేమో అనిపించిందని ఒక ఇంటర్య్వూలో వెల్లడించింది.పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత, ప్రతిభ ఎలాగోలా తన తల్లిదండ్రులను ఒప్పించి ఉన్నత చదువుకోసం ముంబైకి చేరింది. ఆడిషన్లు ఇవ్వడం మొదలు పెట్టింది. అందాల పోటీలో పాల్గొంది. 2018లో మిస్ ముంబై టైటిల్ను గెలుచుకుంది. నిస్సందే 2018 మిస్ ముంబై అందాల పోటీల్లో మిస్ ముంబై కిరీటం గెలుచుకుంది. దీంతో కేవలం ఆరు నెలలకే ‘ఖుర్బాన్ హువా’ టీవీ సీరియల్ 'చాహత్' పాత్రలో తొలి ఆఫర్ వచ్చింది. తరువాత,ఆధా ఇష్క్ అనే వెబ్ షోలో కూడా కనిపించింది. View this post on Instagram A post shared by Pratibha Rantta (@pratibha_ranta)ఇక లాపతా లేడీస్ ఆఫర్ గురించి మాట్లాడుతూ మొదట్లో కాస్త భయమేసిందని, అయితే సినిమాలో ‘జయ’ కథ ఒక విధంగా నిజ జీవితానికి సరిగ్గా సరిపోతుందని, అందుకే ఆ పాత్రలో పూర్తిగా లీనమైపోయానని చెప్పుకొచ్చింది. మొత్తానికి తన జర్నీ అంతా ఒక మ్యాజిక్లా సాగిపోయిందని వెల్లడించింది మెరిసే కళ్లతో. -
ఆ స్టార్ హీరో అమ్మాయిలను ఫూల్ చేస్తాడు.. జన్మలో పెళ్లి చేసుకోడు!
బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సల్మాన్ ఖాన్ హీరోయిన్లతో నడిపిన ప్రేమాయణాలకు లెక్కే లేదు. ఎంతోమంది ముద్దుగుమ్మలను బుట్టలో వేసుకున్న ఇతడు వారితో జీవితాన్ని కొనసాగించాలని మాత్రం ఎన్నడూ ఆలోచించలేదు. అందుకే ఇప్పటికీ సింగిల్గానే ఉన్నాడు. అయితే సల్మాన్ పెళ్లి చేసుకోడన్న విషయం తనకెప్పుడో తెలుసంటున్నాడు నటుడు మిథున్ చక్రవర్తి. తాజాగా ఓ షోలో సల్మాన్ తుంటరితనాన్ని వెల్లడించాడు.ఒక్క నిమిషం కూడాసల్మాన్ నన్ను ఎంతగానో అభిమానిస్తాడు. ఎక్కువ ప్రేమను పంచుతాడు. మేము కలిసున్నప్పుడైతే నా వెంటే తిరుగుతాడు. ఒక్క నిమిషం కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండలేడు. నేను పడుకున్నా సరే నిద్రలో నుంచి లేపి మరీ కబుర్లు చెప్తుంటాడు. ఓసారి సెయింట్ పీటర్స్బర్గ్లో రాత్రి రెండు గంటలకు షూటింగ్ ఉంది. నేను ఆ విషయం మర్చిపోయి గదిలో గడియ పెట్టి నిద్రపోయాను. సడన్గా కళ్లు తెరిచేసరికి అతడు నా ఎదురుగా నిలబడి నవ్వుతున్నాడు. అతడు లోపలకు ఎలా వచ్చాడో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నువ్వేం మనిషివిరా బాబూ అనుకుని లేచాను.పెళ్లి చేసుకోడుతనలో ఆ తుంటరితనం ఎక్కువగా ఉండేది. అతడు ఎప్పటికీ పెళ్లి చేసుకోడు.. అమ్మాయిలందరినీ ఫూల్ చేస్తాడు. నాకింకా పెళ్లవలేదు, తెలుసా అంటూ అమ్మాయిలతో మాట కలుపుతాడు. వాళ్లేమో.. ఇంత హ్యాండ్సమ్ సూపర్ స్టార్ను పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ప్రేమలో పడతారు. కానీ అతడు ఎన్నటికీ పెళ్లిపీటలెక్కడని నేను గ్యారెంటీ ఇస్తాను' అని మిథున్ చెప్పుకొచ్చాడు. -
20 ఏళ్లకే పెళ్లి.. 'బిగ్బాస్' స్టార్ షాకింగ్ నిర్ణయం
ప్రముఖ సింగర్ పెళ్లికి రెడీ అయ్యాడు. అది కూడా కేవలం 20 ఏళ్ల వయసులోనే చేసుకోనుండటంతో అందరూ షాక్ అవుతున్నారు. స్వతహాగా తజికిస్థాన్ సింగర్ అయిన అబ్దు రోజిక్.. హిందీలో బిగ్బాస్-16 షోలో పాల్గొని పాపులరిటీ సంపాదించాడు. తనదైన పాటలు, కామెడీ టైమింగ్తో బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు తను కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నట్లు చెప్పి అందరూ అవాక్కయ్యేలా చేశాడు.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరో.. అమ్మాయి ఎవరంటే?)20 ఏళ్ల అబ్దు రజాక్.. షార్జాకు చెందిన అమీరాతో జూలై 7న నిఖా(ముస్లిం పద్ధతిలో పెళ్లి) చేసుకోనున్నాడు. ఈమె అబ్దు కంటే ఏడాది చిన్నది. అయితే వీళ్లిద్దరిది ప్రేమ వివాహం అని తెలుస్తోంది. ఇతడు పెట్టిన ఇన్ స్టా వీడియో చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఇంతకీ వీడియో, క్యాప్షన్లో ఏముందంటే?'ప్రేమ కంటే విలువైనది నా జీవితంలో ఇంకేది లేదు. పెళ్లికి రెడీ అయ్యాను. జీవితంలో ఇదో కొత్త ప్రయాణం. ఎంతో ఎగ్జైట్మెంట్తో ఎదురుచూస్తున్నాను. నాది ప్రేమ పెళ్లి. అయితే ఈ ప్రేమ నాకు అంత సులభంగా దక్కలేదు. చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఇంతవరకు వచ్చాను. లవ్ జర్నీ నాకు కాస్త సవాలుగానే అనిపించింది. అమీరా-నేను ఒకరిని ఒకరు ఇష్టపడ్డాం. అయితే ఇలా జరుగుతుందని మాత్రం ఎప్పుడూ ఊహించలేదు. జూలై 7వ తేదీని సేవ్ చేసుకోండి' అని అబ్దు తన సంతోషాన్ని పంచుకున్నాడు. (ఇదీ చదవండి: టాలీవుడ్లో అది చాలా కష్టం.. అసౌకర్యంగా అనిపిస్తుంది: సంయుక్త) View this post on Instagram A post shared by Abduroziq Official (@abdu_rozik) -
షూటింగ్కు ఆటోలో వెళ్లిన స్టార్ హీరోయిన్.. ఎందుకంటే?
ఇటీవల ఎక్కువగా వార్తల్లో ఉండే నిలిచిన హీరోయిన్ శృతిహాసన్. స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఆమె.. ఇటీవల తన బాయ్ఫ్రెండ్తో బ్రేకప్ చేసుకున్నట్లు వార్తలు వైరలయ్యాయి. అయితే ఈ విషయంపై శృతిహాసన్ ఇప్పటి వరకూ స్పందించలేదు. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు కోలీవుడ్ భామ. కాకపోతే ఆమె చేసిన పనికి నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అదేంటో చూసేద్దాం.అసలు విషయానికొస్తే శృతి హాసన్ ప్రస్తుతం ముంబాయిలో ఉంటున్నారు. అక్కడే ఓ మూవీ షూటింగ్లో పాల్గొంటున్నారు. అయితే షూటింగ్కు బయలుదేరిన ఆమె ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. అది ఎంతసేపటికీ క్లియర్ కాకపోవడంతో.. షూటింగ్కు ఆలస్యం అవుతుందని శృతిహాసన్ తాను వెళుతున్న కారును పక్కన నిలిపేసి ఆటో ఎక్కి వెళ్లిపోయారు.ఆమె ఆటోలో వెళుతున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. శృతిహాసన్ ఏ చిత్రం షూటింగ్లో పాల్గొంటున్నారో తెలియదు గానీ ఆమె వృత్తి ధర్మానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో ఇలాంటి ఘటనే ఆ మధ్య నటుడు అమితాబ్ బచ్చన్ విషయంలోనూ జరిగింది. ఆయన ఇదే విధంగా కారులో వెళ్తూ ట్రాఫిక్లో చిక్కుకోవడంతో కారు దిగి వేరే వ్యక్తి బైక్లో షూటింగ్ స్పాట్కు వెళ్లడం విశేషం. -
సికందర్తో జోడీ
సికందర్తో జోడీ కట్టారు హీరోయిన్ రష్మికా మందన్నా. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో రూపొందనున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘సికందర్’. సాజిద్ నడియాడ్ వాలా ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా రష్మికా మందన్నా నటించనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.‘‘కొంతకాలంగా నా నెక్ట్స్ మూవీ ఏంటని అడుగుతున్నారు. ‘సికందర్’లో నటించనున్నాను. ఈ విషయాన్ని సర్ప్రైజ్గా ఫీలవుతారని అనుకుంటున్నాను. ‘సికందర్’లో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను’’ అని రష్మికా మందన్నా పేర్కొన్నారు. ఇది ఆమె కెరీర్లో 25వ చిత్రమని తెలుస్తోంది. ఇక ‘సికందర్’ వచ్చే ఏడాది రంజాన్కి రిలీజ్ కానుంది. -
హీరోయిన్తో స్టార్ క్రికెటర్ డ్యాన్స్.. నువ్వు ఆల్రౌండరయ్యా సామీ! (ఫోటోలు)
-
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ '12th ఫెయిల్'తో హీరో విక్రాంత్ మాస్సే పేరు మార్మోగిపోయింది. అతడి సహజ నటనకు జనం ఫిదా అయిపోయారు. ప్రస్తుతం అతడి చేతిలో ఐదు సినిమాలున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా అతడు క్యాబ్ డ్రైవర్తో గొడవపడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో క్యాబ్ డ్రైవర్ మాట్లాడుతూ.. నా పేరు ఆశిష్. నేనొక క్యాబ్ డ్రైవర్ను. ఓ ప్రయాణికుడిని ఎక్కించుకుని అతడు చెప్పిన లొకేషన్లో దిగబెట్టాను. ఈ నాటకాలు నా దగ్గర కాదుకానీ అతడు నాకు డబ్బులివ్వనంటున్నాడు. పైగా తిడుతున్నాడంటూ ఫోన్ కెమెరాను విక్రాంత్ వైపు తిప్పాడు. దీంతో నటుడు కెమెరాను తన చేతులతో కవర్ చేసేందుకు ప్రయత్నించాడు. కెమెరా ఎందుకు ఆన్ చేశావు? బెదిరిస్తున్నావా? అయినా ఫోన్ యాప్లో సడన్గా డబ్బు ఎందుకు ఎక్కువ చూపిస్తుంది. ఇలాంటి నాటకాలు నా దగ్గర నడవవు అని వాదులాటకు దిగాడు. అది నా తప్పా?ఆ క్యాబ్ డ్రైవర్.. యాప్లో డబ్బు ఎక్కువ చూపిస్తే అది నా తప్పా? మాకన్నా మీరే ఎక్కువ సంపాదిస్తుంటారు. ఎందుకిలా గొడవ చేస్తున్నారు అని ప్రశ్నించాడు. అతడి సమాధానంతో చిర్రెత్తిపోయిన విక్రాంత్.. ఎంత డబ్బు సంపాదిస్తే ఏంటి? అయినా అది కష్టార్జితంతో కూడబెట్టింది అని బదులిచ్చాడు. ఇది చూసిన జనాలు.. నటుడిని వెనకేసుకొస్తున్నారు. ఈ మధ్య ఓలా, ఉబర్ వంటి సంస్థలు ఇలాగే మోసం చేస్తున్నాయి.తప్పే లేదుగమ్య స్థానానికి చేరిన తర్వాత అంతకుముందు సూచించిన అమౌంట్ కంటే ఎక్కువ డబ్బు అడుగుతున్నాయి. విక్రాంత్ గొడవపడటంలో తప్పే లేదు అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. ఇదంతా కొత్త సినిమా కోసం ప్రమోషనల్ స్టంట్.. స్క్రిప్ట్ బాగా రాశారు అని సెటైర్లు వేస్తున్నారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood)చదవండి: తల దించుకున్నా, అందుకే పెళ్లి విషయం దాచా! -
బతకడానికి కేవలం 30 శాతమే ఛాన్స్: స్టార్ హీరోయిన్
మురారి, ఇంద్ర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ముద్దుగుమ్మ సోనాలి బింద్రే. టాలీవుడ్లో హిట్ చిత్రాలు చేసిన బాలీవుడ్ భామ.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. అయితే 2018లో క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఇటీవల ది బ్రోకెన్ న్యూస్ సీజన్-2 వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సోనాలి క్యాన్సర్ నిర్ధారణ తర్వాత తన కుటుంబం తీవ్రమైన ఒత్తిడికి గురైందని తెలిపింది.సోనాలి మాట్లాడుతూ.. 'ముఖ్యంగా 2018లో క్యాన్సర్ నిర్ధారణ అయింది. ఆ వార్త నా కుటుంబాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. మాకు షాకింగ్గా అనిపించింది. ఇది జరిగినప్పుడు నేను రియాల్టీ షో చేస్తున్నా. ఆ సమయంలో నాకు ఆరోగ్యం సరిగ్గా లేదని తెలుసు. డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు ఏదైనా చిన్న ప్రాబ్లమ్ మాత్రమే ఉంటుందని అనుకున్నా. కానీ పరీక్షలు చేశాక అసలు విషయం తెలిసింది. ఆ సమయంలో డాక్టర్, నా భర్త గోల్డీ బెహ్ల్ మొహాలు ఒక్కసారిగా మారిపోయాయి. అప్పటికే స్టేజ్ -4 క్యాన్సర్తో ఉన్నట్లు తెలిసింది. కేవలం 30 శాతం బతికే అవకాశం ఉందని డాక్టర్ చెప్పారు. దీంతో డాక్టర్పై నా భర్త కోపం ప్రదర్శించాడు. కానీ ఆ తర్వాత కీమోథెరపీ చేయించుకున్నా. అది చాలా కఠినమైన చికిత్స. నా జుట్టు రాలడం లాంటి తీవ్రమైన సమస్య ఎదుర్కొన్నా' అని తెలిపింది. -
హీరోయిన్తో బ్రేకప్! మరో బ్యూటీతో హీరో పార్టీ!
సినిమా ఇండస్ట్రీలో ప్రేమాయణాలు, బ్రేకప్పులు సర్వసాధారణమైపోయాయి. కొన్ని జంటలైతే పెళ్లి పీటలెక్కడం ఖాయమనుకునే సమయానికి అనూహ్యంగా విడిపోవడానికే మొగ్గుచూపుతున్నాయి. ఇటీవలి కాలంలో బాలీవుడ్ లవ్ బర్డ్స్ అనన్య పాండే- ఆదిత్య రాయ్ కపూర్ బ్రేకప్ చెప్పుకున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. హీరోయిన్తో పార్టీ !దీనిపై అటు అనన్య, ఇటు ఆదిత్య ఎవరూ స్పందించనేలేదు. ఇంతలో ఆదిత్య రాయ్ కపూర్ మరో హీరోయిన్తో పార్టీ చేసుకున్నాడంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సారా అలీ ఖాన్తో అతడు పార్టీలో పాల్గొన్నాడు. వీరిద్దరూ మెట్రో ఇన్ ఢిల్లీ అనే సినిమా సెట్స్లో డైరెక్టర్ అనురాగ్ బసు బర్త్డే సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. అది సహజమే..ఒక సినిమాలో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నప్పుడు ఆ మాత్రం స్నేహం, సాన్నిహిత్యం ఉండటం సహజమే అని అభిమానులు వెనకేసుకొస్తున్నారు. కొందరు మాత్రం బ్రేకప్ అయిన బాధ లేకుండా ఆదిత్య మరో హీరోయిన్తో ఇంత చనువుగా ఉండటం ఏమీ బాలేదని కామెంట్లు చేస్తున్నారు. #SaraAliKhan and #AdityaRoyKapur celebrating #AnuragBasu sir's bday on the sets of #MetroInDino 🥹💕 pic.twitter.com/pab1vBwa68— sakt` (@SarTikFied) May 8, 2024 -
పెళ్లి ఫోటోలు డిలీట్.. ఎయిర్పోర్ట్లో మెరిసిన స్టార్ కపుల్!
బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్లో దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ జంట ఒకరు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. దీపికా ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ఈ దంపతులు ప్రకటించారు. త్వరలోనే ఈ జంట తమ మొదటి బిడ్డను జీవితంలోకి ఆహ్వానించనున్నారు.అయితే తాజాగా రణ్వీర్ సింగ్ తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా నుంచి తొలగించారు. దీంతో వీరిద్దరిపై మరోసారి రూమర్స్ మొదలయ్యాయి. అయితే తాజాగా ఈ జంట ముంబయి ఎయిర్పోర్ట్లో మెరిసింది. రణవీర్తో కలిసి తిరిగివచ్చిన దీపికా జంటగా కనిపించారు. అయితే పెళ్లి ఫోటోలు డిలీట్ చేయడంపై ఇప్పటివరకు రణ్వీర్ సింగ్ స్పందించలేదు. దీపికా ఈ ఏడాది సెప్టెంబరులో తమ బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలుస్తోంది.దీపికా సినిమాల విషయానికొస్తే రణవీర్ సింగ్, అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్, కరీనా కపూర్, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్లతో కలిసి సింఘమ్ ఎగైన్లో కనిపించనుంది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీలతో కల్కి 2898 ఏడీ చిత్రంలో నటించింది. మరోవైపు రణవీర్ సింగ్, కియారా అద్వానీ జంటగా డాన్- 3 చిత్రంలో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
హీరోయిన్ జాన్వీ కపూర్.. తిరుపతిలో పెళ్లి చేసుకోనుందా?
హీరోయిన్ జాన్వీ కపూర్ ఫుల్ ఫామ్లో ఉంది. హిందీలో మీడియం బడ్జెట్ మూవీస్ చేస్తున్న ఈ భామ.. తెలుగులో ఎన్టీఆర్ 'దేవర', రామ్ చరణ్ 16వ సినిమాలో చేస్తోంది. అలానే ప్రేమ విషయంలో ఎక్కడా తగ్గట్లేదు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనవడు శిఖర్తో రిలేషన్లో ఉంది. ఈ విషయాన్ని ఎక్కడ దాచలేదు. పలుమార్లు బయట కనిపించారు. కొన్నాళ్ల ముందు జంటగా తిరుపతి దర్శనం కూడా చేసుకున్నారు. తాజాగా వీళ్ల పెళ్లి గురించి ఓ న్యూస్ బయటకొచ్చింది.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్ ఫోన్ హ్యాక్.. బాధతో ఇన్ స్టాలో పోస్ట్)'జాన్వీ కపూర్ పెళ్లి తిరుపతిలో జరగనుంది. బంగారు రంగు చీర కట్టుకోనుంది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా నాతో చెప్పింది' అని ఇన్ స్టాలో ఓ నెటిజన్స్ పోస్ట్ పెట్టాడు. ఇతడు జాన్వీ ఫ్రెండ్ కావడంతో నిజమేనేమో అని అందరూ అనుకున్నారు. అయితే ఈ పోస్ట్కి రిప్లై ఇచ్చిన జాన్వీ.. 'ఏదైనా రాస్తారా' అని ఫైర్ అయింది. పలువురు నెటిజన్లు మాత్రం జాన్వీ పెళ్లిపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 'మీకు తెలియకుండానే మీ పెళ్లి చేసేస్తున్నారు', 'పెళ్లి చేసుకునే వరకు మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు' అని రాసుకొస్తున్నారు.ఇకపోతే మహారాష్ట్ర మాజీ సీఎం సుశీష్ కుమార్ షిండే మనవడు అయిన శిఖర్.. ముంబయిలో బిజినెస్ చేస్తున్నాడు. కొన్నాళ్ల నుంచి జాన్వీ కపూర్తో రిలేషన్లో ఉన్నాడు. అతడితో బాండింగ్ గురించి జాన్వీ కూడా పలుమార్లు బయటపెట్టింది. అయితే ఇప్పుడు పెళ్లి గురించి గోల ఎక్కువైంది. అయితే జాన్వీ కెరీర్ పరంగా చూస్తే ఇప్పట్లో అయితే పెళ్లి చేసుకోకపోవచ్చనిపిస్తోంది.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరో కూతురి ప్రేమ పెళ్లి.. తేదీ ఫిక్స్!) -
థ్యాంక్స్ టూ మనీష్ మల్హోత్రా.. సమ్మర్ 2024 స్పెషల్ డిజైన్స్ (ఫొటోలు)
-
యూనిసెఫ్ భారత జాతీయ అంబాసిడర్గా కరీనా : భావోద్వేగం
2014 నుండి యూనిసెఫ్ ఇండియాతో అనుబంధం కలిగి ఉంది బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్. ఇద్దరు బిడ్డల తల్లిగా బాల్య అభివృద్ధి, ఆరోగ్యం, విద్య మరియు లింగ సమానత్వం కోసం ప్రతి పిల్లల హక్కును పెంపొందించడంలో సంస్థకు మద్దతు ఇస్తుంది. తాజాగా యునిసెఫ్ భారత జాతీయ అంబాసిడర్గా కరీనా కపూర్ ఎంపికైంది. ఈ సందర్బంగా ఆమె భావోద్వేగానికి లోనైంది.కరీనా కపూర్ అనగానే రంగుల ప్రపంచం కళ్ల ముందు ఆవిష్కారం అవుతుంది.అయితే ఈ అందాల నటికి మరో ప్రపంచం కూడా తెలుసు.స్త్రీ సాధికారత నుంచి మెన్స్ట్రువల్ హైజీన్ వరకు ఎన్నో అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటోంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలకు వెళుతోంది. పేదింటి బిడ్డలతో మాట్లాడుతోంది.తాజాగా యూనిసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా నియామకం అయిన కరీనా కపూర్లో ఫ్యాషన్ డిజైనర్, రైటర్, మోటివేషనల్ స్పీకర్, సోషల్ యాక్టివిస్ట్ ఉన్నారు...ఉత్తమనటిగా సుపరిచితమైన కరీనా కపూర్ సృజనాత్మకమైన డిజైనర్ కూడా. క్లాతింగ్ రిటైలర్ ‘గ్లోబస్’తో కలిసి పనిచేసింది. న్యూట్రిషనిస్ట్ రుజుత దివాకర్తో కలిసి తీసుకు వచ్చిన ‘డోంట్ లూజ్ యువర్ మైండ్, లూజ్ యువర్ వెయిట్’ పుస్తకం అమ్మకాల్లో రికార్డ్ సృష్టించింది. కరీనా కపూర్ వాయిస్తో ఈ పుస్తకం ఆడియో బుక్గా రావడం మరో విశేషం. ‘ది స్టైల్ డైరీ ఆఫ్ బాలీవుడ్ దివా’ పేరుతో తన జ్ఞాపకాల పుస్తకాన్ని తీసుకువచ్చింది. అదితి షా బీమ్జానీతో కలసి ప్రెగ్నెన్సీపై రాసిన పుస్తకం కమర్షియల్గా సక్సెస్ అయింది. రుజుత దివాకర్తో కలిసి న్యూట్రిషన్కు సంబంధించి ‘ది ఇండియన్ ఫుడ్ విజ్డమ్ అండ్ ది ఆర్ట్ ఆఫ్ ఈటింగ్ రైట్’ డాక్యుమెంటరీపై పనిచేసింది. ఉమెన్ ఎంపవర్మెంట్పై వచ్చిన ‘గర్ల్ రైజింగ్’ అనే డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్కు వాయిస్–వోవర్ ఇచ్చింది.ఒకవైపు సినిమాల్లో బిజిగా ఉన్నప్పటికీ... పిల్లల విద్య, మహిళల భద్రతకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది. మహిళలపై హింసను నిరో«ధించడానికి ఎన్డీ టీవి ప్రారంభించిన శక్తి క్యాంపెయిన్కు అంబాసిడర్గా పనిచేసింది. 2014 నుంచి బాలికల విద్యకు సంబంధించి యూనిసెఫ్తో కలిసి పనిచేయడం మొదలుపెట్టింది. రాజస్థాన్, మహారాష్ట్రలోని పాఠశాలలకు వెళ్లి అక్కడి విద్యార్థులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకునేది. జాల్నా జిల్లాలో కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయం నిర్వహించిన నిధుల సేకరణ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంది.నిరుపేద పిల్లల చదువు కోసం షర్మిలా ఠాగుర్తో కలిసి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. చైల్డ్–ఫ్రెండ్లీ స్కూల్ అండ్ సిస్టమ్స్ (సీఎఫ్ఎస్ఎస్) యాకేజీని లాంచ్ చేసింది. చత్తీస్ఘడ్లో చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ వీక్ çసందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో బాగా చదివే పిల్లలు, పాఠాలు బాగా చెప్పే టీచర్లకు పురస్కారాలు అందజేసింది. మెన్స్ట్రువల్ హైజీన్పై యూనిసెఫ్ లక్నోలో నిర్వహించిన సమావేశంలో ప్రసంగించింది. ‘నవజాత శిశువులను కాపాడుకుందాం’ పేరుతో కరీనా రాసిన వ్యాసానికి మంచి స్పందన వచ్చింది. నవజాత శిశువులు, తల్లుల క్వాలిటీ హెల్త్ కేర్కు సంబంధించి ‘ఎవ్రీ చైల్డ్ అలైవ్’ అనే క్యాంపెయిన్ను నిర్వహించింది. మదర్స్ డే సందర్భంగా యూనిసెఫ్ దిల్లీలో నిర్వహించిన సమావేశంలో కరీనా ప్రధాన వక్త.ప్రకృతి వైపరీత్య బాధితుల కోసం, ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థల కోసం నిధుల సేకరణ కార్యక్రమాల్లో పాల్గొంది కరీన. పిల్లల రోగనిరోధక శక్తి పెరుగుదలకు సంబంధించిన అంశాలపై పనిచేసే స్వస్థ్ ఇమ్యునైజేషన్ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేసింది.తాజా విషయానికి వస్తే.. ‘నేషనల్ అంబాసిడర్గా యూనిసెఫ్తో నా అనుబంధం కొనసాగడం గౌరవంగా భావిస్తున్నాను. పిల్లల చదువు, హక్కుల కోసం నా గొంతు వినిపిస్తాను’ అంటుంది కరీనా కపూర్.‘కరీనా కపూర్ ఎక్స్లెంట్ కమ్యూనికేటర్’ అని కితాబు ఇచ్చింది యూనిసెఫ్. చిన్న విజయం చాలు... పెద్ద సంతోషానికిసోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ‘నేను ఎలా సాధించానంటే’లాంటి స్టోరీలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రేస్ మొదలైంది. ఆ రేస్లో భాగంగా యువతరం ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఈ రేసులో మెంటల్ హెల్త్ అనేది వెనక్కి వెళ్లిపోయింది. రేస్ అనేది శాంతి, సంతోషాల కోసం ఉండాలి. విద్యార్థులు తమ మానసిక శాంతిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. చిన్న విజయాన్ని కూడా పెద్ద విజయంగా భావించుకోవాలి. ‘ఇదీ ఒక విజయమేనా!’ అనుకున్నప్పుడు అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తి నుంచి అశాంతి జనిస్తుంది –కరీనా కపూర్ -
లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
ప్రముఖ బాలీవుడ్ నటి మోనా సింగ్ ఖరీదైన కారును కొనుగోలు చేసింది. త్రీ ఇడియట్స్, లాల్ సింగ్ చద్దా సినిమాలతో పాటు పలు సీరియల్స్, వెబ్ సిరీస్ల్లో మోనా సింగ్ నటించింది. సెలబ్రిటీలు ఎక్కువగా ఇష్టపడే మెర్సిడెజ్ బెంజ్ కారును సొంతం చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి.కాగా.. ఇటీవలే మేడ్ ఇన్ హెవెన్ సీజన్- 2లో మోనా సింగ్ కనిపించింది. బాలీవుడ్లో సీరియల్స్తో గుర్తింపు తెచ్చుకున్న భామ సినిమాల్లోనూ ఛాన్సులు కొట్టేసింది. ఆమె కొనుగోలు చేసి కారు విలువ దాదాపు కోటి రూపాయలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
నియోజకవర్గానికో హబ్..
No Headline
No Headline
పాలమూరు సమగ్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
పూర్తిస్థాయిలో వలసల నివారణకు కృషి..
అహంకారానికి,ఆత్మగౌరవానికి మధ్య పోరు..
No Headline
పార్లమెంట్లో ప్రజల గొంతుకనవుతా..
కేంద్ర నిధులతోనే అనేక అభివృద్ధి పనులు..
ఓటింగ్ శాతం పెరుగుతుందా ?..తగ్గుతుందా ?
తప్పక చదవండి
- AP: నేడు 13 జిల్లాలకు భారీ వర్ష సూచన
- నాడు చెప్పుతో కొట్టి.. నేడు ‘కాపు’ కాస్తానంటూ కాకమ్మ కబుర్లు!
- అమ్మా... నా పేరు గుర్తుందా?
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- చట్టం మీ బాబు చుట్టమా రామోజీ?
- ఇక మాటల్లేవ్!
- ‘ఏబీవీ’ అవినీతి నిజం
- ‘ప్లేఆఫ్స్’కు కోల్కతా
- వందో ఆస్కార్కి నాలుగు వేల కోట్లు!
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
Advertisement