-
‘నవాల్నీ’ మృతదేహం అతని తల్లికి అప్పగింత
మాస్కో: ఇటీవల రష్యాలోని ఆర్కిటిక్ పీనల్ కాలనీ జైలులో వివాదస్పద స్థితిలో మృతి చెందన రష్యా ప్రతిపక్షనేత, అధ్యక్షుడు పుతిన్ రాజకీయ ప్రత్యర్థి అలెక్సీ నావల్ని మృత దేహాన్ని ఎట్టకేలకు అతని తల్లికి అప్పగించారు. అలెక్సీ నావల్ని మరణించిన వారం రోజులకు ఆయన మృతదేహాన్ని తన తల్లికి అప్పగించారు. ‘అలెక్సీ మృతదేహాన్ని అతని తల్లికి అప్పగించారు. ఆయన మృతదేహాన్ని తన తల్లికి అప్పగించాలని కోరిన మీ అందరికీ చాలా ధన్యవాదాలు’ అని నవల్నీ ప్రతినిధి కిరా యార్మిష్ తెలిపారు. Alexey's body was handed over to his mother. Many thanks to all those who demanded this with us. Lyudmila Ivanovna is still in Salekhard. The funeral is still pending. We do not know if the authorities will interfere to carry it out as the family wants and as Alexey deserves. We… — Кира Ярмыш (@Kira_Yarmysh) February 24, 2024 ఇటీవల.. నావల్ని మృతదేహాన్ని రహస్యంగా ఖననం చేయాలని, ఎలాంటి అంతిమయాత్ర నిర్వహించడానికి వీలు లేదని తమపై రష్యా ప్రభుత్వం ఒత్తిడి తీసుకువచ్చిందని నావల్ని తల్లి లియుడ్మిలా ఆవేదన వ్యక్తం చేశారు. పుతిన్ను తీవ్రంగా విమర్శించే ప్రతిపక్ష నేతగా పేరున్న జైలులో ఉన్న రష్యా ప్రతిపక్ష పార్టీ నేత అలెక్సీ నావల్నీ(47) జైలులోనే మృతి చెందారు. ఈ విషయాన్ని యమాలో నెనెట్స్ ప్రాంత జైలు సర్వీసు డిపార్ట్మెంట్ వెల్లడించింది. నావల్నీ పలు రాజకీయ ప్రేరేపిత కేసుల్లో దోషిగా తేలడంతో 2021 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. చదవండి: నవాల్నీ మృతదేహం అప్పగింత కోసం తల్లి ఆవేదన -
కనీసం చివరిచూపు చూసుకోనివ్వండి
మాస్కో: రష్యా మారుమూల జైలులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విపక్ష నేత, హక్కుల ఉద్యమకారుడు అలెక్సీ నవాల్నీ పార్థివదేహాన్ని వెంటనే అప్పగించాలని ఆయన తల్లి ఆవేదనతో ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. చనిపోయాక మృతదేహాన్ని వేరే చోటుకు తరలించామంటూ తల్లి, నవాల్నీ న్యాయవాదులను అటూ ఇటూ తిప్పుతూ అధికారులు తిప్పలు పెడుతున్నారు. మృతదేహాన్ని స్వా«దీనం చేసుకుని ల్యాబ్ పరీక్షలు చేయిస్తేగానీ విషప్రయోగం జరిగిందా లేదా అనేది తెలియని పరిస్థితి. అందుకే కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించట్లేరనే వాదన వినిపిస్తోంది. మాస్కోకు 1,900 కిలోమీటర్ల దూరంలోని ఆర్కిటిక్ ధృవ సమీపంలో మంచుమయ మారుమూల కారాగారంలో శుక్రవారం నవాల్నీ మరణించిన విషయం తెల్సిందే. విషయం తెల్సి నవాల్నీ తల్లితో కలిసి న్యాయవాది కిరా యామిష్క్ ఆ జైలుకెళ్లారు. అక్కడ మృతదేహం లేదు. దర్యాప్తులో భాగంగా సలేఖర్డ్ సిటీకి తరలించామని అధికారులు చెప్పారు. తీరా అక్కడి సిటీ మార్చురీకి వెళ్తే మూసేసి ఉంది. ఇక్కడికి తీసుకురాలేదని అక్కడి అధికారులు చెప్పారు. ‘మరణానికి కారణాన్ని రష్యా ప్రభుత్వం ఇంతవరకు వెల్లడించలేదు. మృతదేహాన్ని అయినా అప్పగించాలి’ అని లాయర్ డిమాండ్చేశారు. -
మణికొండలో కలకలం.. కారులో మృతదేహం
సాక్షి, హైదరాబాద్: మణికొండలో కారులో మృతదేహం కలకలం రేపుతోంది. మారుతి వ్యాన్లో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే 100 ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్ సీటు వెనుక లో మృతదేహం లభ్యం కావడంతో హత్యా? ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? అనే సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. కారు నంబర్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. స్థానికంగా ఉన్న సీసీ టీవీ ఫూటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. -
మృతుడిని గుర్తించి, నిందితులను పట్టించి.. ఏఐ మరో అద్భుతం!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో ఉత్తర ఢిల్లీ పోలీసులు హత్య కేసును చేధించారు. మృతదేహాన్ని గుర్తించేందుకు, హత్య కేసుతో ప్రమేయం ఉన్న నిందితులను అరెస్టు చేసేందుకు పోలీసులకు ఏఐ సహకరించింది. సాధారణంగా హత్య కేసులలో మృతుని గుర్తింపునకు పోలీసులు ఆ మృతుల ఛాయాచిత్రాలను వార్తాపత్రికలలో ప్రచురింపజేస్తుంటారు. ఇటువంటి సందర్భంలో మృతుల ముఖాలు స్పష్టంగా కనిపించవు. అయితే ఉత్తర ఢిల్లీ పోలీసులు తొలిసారిగా ఏఐ సాయంతో మృతుని ముఖం స్పష్టంగా కనిపించేలా ఫొటోను తీయడంలో విజయం సాధించారు. వివరాల్లోకి వెళితే జనవరి 10న గీతా కాలనీ ఫ్లై ఓవర్ కింద ఓ యువకుని మృతదేహాన్ని ఢిల్లీ పోలీసులు గుర్తించారు. పోస్ట్మార్టం అనంతరం వచిన నివేదికలో.. గొంతు నులిమి ఆ యువకుడిని హత్య చేసినట్లు వెల్లడయ్యింది. మృతదేహాన్ని గుర్తించేందుకు పోలీసులకు ఎటువంటి గుర్తింపు కార్డు లభించలేదు. దీంతో మృతుడిని గుర్తించడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. ఈ నేపధ్యంలో ఉత్తర ఢిల్లీ పోలీసులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం తీసుకున్నారు. కొద్దిపాటి కసరత్తు తర్వాత మృతునికి సంబంధించిన స్పష్టమైన ఫొటో వెలికివచ్చింది. కళ్లు తెరచి ఉన్నప్పుడు మృతుని ముఖం ఎలా ఉంటుందనేది గుర్తిస్తూ, ఫొటో రూపొందించారు. దీనితో పోస్టర్లు వేయించిన పోలీసులు వాటిని వివిధ ప్రాంతాల్లోని గోడలపై అతికించారు. అలాగే వివిధ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేశారు. దీంతో పోలీసుల కృషి ఫలించింది. ఢిల్లీ పోలీసులకు వచ్చిన ఒక కాల్లో.. ఆ మృతదేహం తన అన్నయ్య హితేంద్ర ఫోటోనేనని ఒక వ్యక్తి తెలిపాడు. ఈ నేపధ్యంలో పోలీసులు హితేంద్ర ప్రొఫైల్ను పరిశీలించారు. అతని సన్నిహితులను విచారించి, కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసుల విచారణలో హితేంద్ర.. ముగ్గురు యువకులతో ఏదో విషయమై గొడవ పడ్డాడని, వారు హితేంద్ర గొంతుకోసి ఆ మృతదేహాన్ని గీతా కాలనీ ఫ్లైఓవర్ కింద పారవేశారని తేలింది. ఆధారాలు దాచిపెట్టడంలో ఓ మహిళ కూడా వీరికి సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ముగ్గురు నిందితులతోపాటు ఆ మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
HYD : ఓఆర్ఆర్ వద్ద మూటలో మృతదేహం కలకలం
హైదరాబాద్: ఔటర్ రింగు రోడ్డు వద్ద మూటలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా ఆది భట్ల పరిధి బ్రహ్మణపల్లి సమీపంలో వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. గోనె సంచిలో మృతదేహాన్ని మూటకట్టి ఓఆర్ఆర్ పైనుంచి దుండగులు పడేశారు. గోనె సంచి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీస్ లు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
Suchana Seth: బ్యాగులో మద్యం బాటిళ్లున్నాయ్!
బెంగళూరు: గోవాలో నాలుగేళ్ల కొడుకు చంపి, మృతదేహం ఉంచిన సూట్ కేసును బెంగళూరుకు తీసుకువచ్చిన సీఈవో సూచనా సేథ్ గురించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 12 గంటలపాటు కొడుకు మృతదేహంతో కారులో ప్రయాణించిన సమయంలో ఆమె ఎలా ప్రవర్తించిందనే విషయాన్ని క్యాబ్ డ్రైవర్ రేజాన్ డిసౌజా వెల్లడించాడు. ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉన్నట్లు డిసౌజా తెలిపాడు. జనవరి 7వ తేదీన అర్ధరాత్రి 12.30 సమయంలో గోవాలోని కండోలిమ్లో ఉన్న ‘సోల్ బన్యాన్ గ్రాండ్’అనే సర్వీస్ అపార్టుమెంట్ నుంచి డిసౌజాకు కాల్ వచ్చింది. ఒక మహిళను అర్జంటుగా బెంగళూరుకు తీసుకెళ్లాల్సి ఉందనేది కాల్ సారాంశం. వెంటనే డిసౌజా కారుతో అక్కడికి వెళ్లాడు. ఒంటి గంటకు సూచనా సేథ్ బయటకు వచ్చింది. డిసౌజా ఆమెను రిసెప్షన్ దగ్గర రిసీవ్ చేసుకున్నాడు. ఆమెతోపాటు ఉన్న నల్ల రంగు బ్యాగు చాలా బరువుగా ఉంది. బ్యాగు గురించి ఆ సమయంలో డిసౌజాకు ఎటువంటి అనుమానం రాలేదు. ‘మద్యం బాటిళ్లు గానీ ఉన్నాయా మేడం, బ్యాగు బరువుగా ఉంది’అని అడిగా. అందుకామె, అవును, మద్యం బాటిళ్లున్నాయి అని సమాధానమిచ్చిందని డిసౌజా తెలిపాడు. ప్రయాణం మొత్తమ్మీద దాదాపుగా వాళ్లిద్దరూ మాట్లాడుకోలేదు. గోవా–కర్ణాటక సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్ జామ్తో 4 గంటలు లేటయింది. అయినా కూడా సూచన ఎటువంటి అసహనం కానీ, భయపడ్డట్లుగానీ కనిపించలేదని డిసౌజా చెప్పాడు. ‘ఆమె ఎవరికీ ఫోన్ చేయలేదు. ఆమెకు కూడా ఫోన్ కాల్స్ రాలేదు’అని తెలిపాడు. ‘ట్రాఫిక్ జామ్ క్లియర్ అయ్యేందుకు ఆలస్యమవుతుంది మేడం. అర్జంటు అన్నారు కదా, యూ–టర్న్ తీసుకుని ఎయిర్ పోర్టుకు పోనివ్వమంటారా? అని అడిగా. అయితే, ఆమె ఎయిర్పోర్టుకు వద్దు, ట్రాఫిక్ క్లియర్ అయ్యాకే వెళ్దామని బదులిచ్చింది. అర్జంటుగా వెళ్లాలంటూనే, ట్రాఫిక్ సమస్య ఉన్నా సమస్య లేదనడం వింతగా అన్పించింది. కర్ణాటక సరిహద్దులు దాటగానే గోవా పోలీసుల నుంచి ఫోనొచ్చింది. కారులో ఉన్న మహిళతోపాటు బాబు ఉన్నాడా అని అడిగారు. ఆమె ఇచ్చిన అడ్రస్, ఇతర వివరాలన్నీ ఫేక్ అని చెప్పారు. దగ్గర్లోని పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లాలని సూచించారు. నేరుగా పోలీస్ స్టేషన్లావరణలో కారును ఆపడంతో, సూచన ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? అని అడిగింది. పోలీసులు మీతో మాట్లాడుతామన్నారు’అని ఆమెకు చెప్పినట్లు వివరించాడు. ‘పోలీసులు కారు సోదా చేసి, బ్యాగులో చిన్నారి మృతదేహాన్ని కనుగొన్నారు’అని డిసౌజా చెప్పాడు. -
వారం రోజులుగా ఇంట్లో శవం పెట్టుకొని...
హైదరాబాద్: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి చింతల్లో చనిపోయిన మహిళ మృతదేహం వారం రోజులుగా ఇంట్లోనే ఉంది. కుటుంబసభ్యులు మృతదేహంకి అంత్యక్రియలు చేయలేదు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ఇంట్లో మహిళ (40) చనిపోయి వారం రోజులు అయింది. కుళ్లిపోయి పురుగులు పట్టినా.. అదే ఇంట్లో కుటుంబీకులు సాధారణ జీవనం గడుపుతున్నారు. ఆ ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన వస్తుండడంతో పక్కింటివారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కుటుంబీకుల మతిస్థిమితం సరిగ్గా లేకనే విషయం బయటకు రాలేదని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు -
వాట్సాప్ స్టేటస్గా గర్ల్ ఫ్రెండ్ డెడ్బాడీ ఫొటో!
చెన్నై: గర్ల్ ఫ్రెండ్ను గొంతు పిసికి చంపేసిన ఓ యువకుడు, ఆమె మృతదేహం ఫొటోను తీసి వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నాడు. మృతురాలి స్నేహితులు గుర్తు పట్టి, పోలీసులను అప్రమత్తం చేయడంతో అతగాడు దొరికిపోయాడు. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. కేరళలోని కొల్లంకు చెందిన ఫౌసియా(20) చైన్నైలోని ఓ హాస్టల్లో ఉంటూ క్రోంపేట్లోని కాలేజీలో నర్సింగ్ చదువుతోంది. ఆషిక్(20)అనే యువకుడితో అయిదేళ్లుగా సన్నిహితంగా ఉంటోంది. మైనర్గా ఉన్నప్పుడే ఫౌసియా గర్భవతి అయింది. ఆషిక్పై పోక్సో కేసు నమోదు కావడంతో జైలుకు వెళ్లాడు. ఫౌసియా పుట్టిన బిడ్డను దత్తతకిచ్చింది. జైలు నుంచి విడుదలయ్యాక ఆషిక్, ఫౌసియా సంబంధం తిరిగి కొనసాగుతోంది. శుక్రవారం చెన్నై వచ్చిన ఆషిక్ హోటల్లో రూం బుక్ చేసి, ఫౌసియాను వెంట తీసుకెళ్లాడు. అదే రోజు సాయంత్రం, మృతదేహం ఫొటోను తన వాట్సాప్ స్టేటస్లో పెట్టాడు. ఫౌసియా స్నేహితులు ఆ ఫొటోను గుర్తించి, పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వెంటనే వెళ్లి హోటల్ రూంలో చూడగా ఫౌసియా మృతదేహం కనిపించింది. పరారీలో ఉన్న ఆషిక్ను సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పట్టుకున్నారు. తనకు మరో యువతితో సంబంధముందని అనుమానిస్తూ మాట్లాడటంతో కోపం పట్టలేక ఫౌసియాను టీ షర్టుతో గొంతుకు బిగించి, చంపేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. -
చంపితే ఎలా ఉంటుందో చూసేందుకు... నిజంగానే మర్డర్ చేసింది!
ఆమె పేరు జుంగ్ యూ జుంగ్. వయసు 23 ఏళ్లు. ఉండేది దక్షిణ కొరియాలోని బుసాన్లో. నేరాలు, ఘోరాలంటే మహా పిచ్చి. ఎంతగా అంటే, టీవీల్లో రియల్ క్రైమ్ స్టోరీలను విపరీతంగా చూసేది. క్రైం నవలలు కూడా తెగ చదివేది. వాటి స్ఫూర్తితో, హత్య చేస్తే ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి నిజంగానే ఘోరానికి తెగబడింది. హత్య ఎలా చేయాలో, శవాన్ని ఎలా మాయం చేయాలో తెలుసుకునేందుకు ఇంటర్నెట్లో నెలల పాటు సెర్చ్ చేసి మరీ రంగంలోకి దిగింది. ముక్కూ మొహం తెలియని ఓ అమాయక టీచర్ను విచక్షణారహితంగా పదేపదే పొడిచి పొట్టన పెట్టుకుంది! చివరికి శవా న్ని మాయం చేసే క్రమంలో అద్దెకు తీసుకున్న ట్యాక్సీ డ్రైవర్ పోలీసులకు ఉప్పందించడంతో కటకటాల పాలైంది! నేరాల సంఖ్య తక్కువగా ఉండే దక్షిణ కొరియా లో ఈ ఉదంతం సంచలనం సృష్టించింది... విద్యార్థి తల్లిగా నమ్మించి... జుంగ్ ఓ నిరుద్యోగి. తాతతో కలిసి నివసించేది. చేసేందుకు పనేమీ లేకపోవడంతో క్రైం ప్రోగ్రాంలు, సంబంధిత రియాల్టీ షోలకు, క్రైం నవలలకు బానిసగా మారింది. హత్యానుభవం ఎలా ఉంటుందో చూడాలని నిర్ణయించుకున్నాక సంబంధిత సమాచారం కోసం ఇంటర్నెట్లో వెదికింది. అనంతరం తగిన వ్యక్తి కోసం ట్యూటరింగ్ యాప్ల్లో నెలల పాటు వేట సాగించింది. హోం ట్యూషన్లు చెబుతారా అంటూ కనీసం 50 మందిని సంప్రదించింది. చివరికి గత మే నెలలో ఒక 26 ఏళ్ల మహిళను ఎంచుకుంది. తనను తాను ఓ హైస్కూలు స్టూడెంట్ తల్లిగా పరిచయం చేసుకుంది. తన బిడ్డకు ఇంగ్లిష్ పాఠాలు చెప్పాలంటూ నమ్మించింది. అందుకామె సమ్మతించాక ఆన్లైన్లో ఆర్డర్ చేసి స్కూల్ యూనిఫాం కూడా తెప్పించుకుంది! అది వేసుకుని ట్యూటర్ ఇంటికి వెళ్లింది. ఆమె తలుపు తీసి లోనికి రానివ్వడమే ఆలస్యం, వెంట తీసుకెళ్లిన కత్తితో పదేపదే దాడికి దిగింది. ఏకంగా 100 సార్లకు పైగా పొడిచింది! చనిపోయిన తర్వాత కూడా దాడి ఆపలేదట! ఆ తర్వాత తాపీగా మృతదేహాన్ని ముక్కలుగా నరికింది. వాటిని సూట్కేస్లో కుక్కి, ఓ ట్యాక్సీలో తీసుకెళ్లి దూరంలో నది దగ్గర పడేసి చేతులు దులుపుకుంది. రక్తమోడుతున్న సూట్కేసును ఓ అమ్మాయి అడవిలో పడేసిందంటూ ట్యాక్సీ డ్రైవర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. జుంగ్ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు యావజ్జీవ ఖైదు విధించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కన్నీళ్లకే కన్నీళ్లొచ్చె: సోదరి మృతదేహాన్ని నడుముకు కట్టుకుని..
ఉత్తరప్రదేశ్లో హృదయాలను కలచివేసే ఉదంతం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ఔరయ్య జిల్లాలో ఆరోగ్య సేవల పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందనేది మరోమారు వెల్లడయ్యింది. నవీన్ బస్తీ వెస్ట్లో నివాసం ఉంటున్న ప్రబల్ ప్రతాప్ సింగ్ కుమార్తె అంజలి (20) పొరపాటున వేడి నీటితో నిండిన బకెట్లోని వాటర్ హీటర్ను ముట్టుకుని విద్యుదాఘానికి గురై, అపస్మారక స్థితికి చేరుకుంది. ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సీహెచ్సీకి తరలించారు. అక్కడి వైద్యులు అంజలి చనిపోయిందని నిర్ధారించారు. అంజలి మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు అందుబాటులో ఎలాంటి వాహనం లేదు. దీంతో మృతురాలి సోదరుడు సాహసం చేశాడు. ఆ మృతదేహాన్ని బైక్పై ఉంచి, దానిని చున్నీతో తన నడుముకు కట్టుకుని, వెనుకగా మరో సోదరిని కూర్చోబెట్టుకుని బైక్ను ఇంటివైపు నడిపాడు. ఇందుకు 15 నిముషాల సమయం పట్టింది. దీనిని గమనించి కూడా ఆసుపత్రి సిబ్బంది తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరించారు. ఈ ఉదంతం గురించి సీహెచ్సీ సూపరింటెండెంట్ మాట్లాడుతూ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వాహనం కావాలని తమను అడిగితే, ఏర్పాటు చేసేవారమని తెలిపారు. కాగా జిల్లాలో రెండు అంబులెన్సులు మాత్రమే ఉన్నాయి. అవి ఔరయ్య ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకునేందుకు రెండున్నర గంటలు పడుతుందని స్థానికులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: హిమాలయాలు క్యాన్సిల్.. ప్రచారం షురూ: ఉమాభారతి యూటర్న్! -
కూతురు సాయంతో భర్తను చంపేసింది
సిరిసిల్ల క్రైం: మద్యానికి బానిసైన ఇంటిపెద్ద, వివాహేతర సంబంధాలకు అలవాటుపడి.. ఇంట్లోవారిని కొట్టడం, దుర్భాషలాడటంతో భరించలేకపోయిన భార్య, కూతురు కలిసి అతన్ని పాశవికంగా హత్య చేశారు. సిరిసిల్లలో వారం క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణం శివనగర్కు చెందిన లేచర్ల ప్రకాశ్రావు (44) జల్సాలకు అలవాటు పడటంతోపాటు, ఇంట్లో వారిపై తరచూ భౌతిక దాడులకు దిగేవాడు. వేధింపులు తాళలేని భార్య స్వప్న, కుమార్తె ఉషశ్రీ ఎలాగైనా అతడి అడ్డు తొలగించుకోవాలని, ఇందుకు చంపడమే మార్గమని అనుకున్నారు. ప్లాన్ ప్రకారం ఈ నెల 1న రాత్రి ప్రకాశ్రావు మెడపై కూరగాయలు కోసే కత్తితో భార్య దాడి చేయగా, కూతురు తండ్రి ముఖం మీద దిండుతో ఒత్తిపట్టి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని గొడ్డలితో ముక్కలు చేసేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నం విఫలంకావడంతో మృతదేహాన్ని ఎలాగైనా మాయం చేయాలన్న ఆలోచనతో ఇంట్లోనే గుంత తవ్వి పాతిపెడదామనుకున్నారు. కానీ అలా చేస్తే శవం నుంచి వాసన వచ్చి బయటకు విషయం తెలుస్తుందని భావించారు. తదుపరి పెట్రోలు పోసి కాల్చేసే ప్రయత్నం చేసినా మృతదేహం పూర్తిగా కాలిపోలేదు. దీంతో స్వప్న ఈనెల 3న తన తమ్ముడితో మరింత పెట్రోలు తెప్పించి శవానికి నిప్పటించారు. మంటలు ఎగిసిపడడంతో బయటకు తెలుస్తుందని నీళ్లు, దుప్పట్లతో మంటలు ఆరి్పవేశారు. ఇలా కుదరదని నిర్ణయించుకుని ఎట్టకేలకు హత్యను కాస్తా ఆకస్మిక మృతిగా చిత్రించి దహన సంస్కారాలు చేయాలని ప్రణాళిక చేశారు. దీనిలో భాగంగా ఈనెల 4న నిందితురాలు తన చిన్నాన్నను వేకువజామున పిలిపించుకుని జరిగిన విషయాన్ని వివరించింది. ఈక్రమంలో ప్రకాశ్రావు నిద్రలో చనిపోయినట్లు కథ సృష్టించి దహనసంస్కారాలు చేసేందుకు దగ్గరి బంధువులకు సమాచారం అందించారు. చివరిచూపునకు కొద్ది మంది బంధువులు రాగానే హుటాహుటిన విద్యానగర్లోని వైకుంఠధామంలో దహన సంస్కారాలు పూర్తిచేశారు. ఇలా వెలుగులోకి.. ప్రకాశ్రావు నిద్రలో మృతిచెందాడని బంధువులకు సమాచారం ఇచ్చిన నిందితులు, బంధువులందరూ వచ్చే వరకు ఎదురుచూడకుండా దహన సంస్కారాలు పూర్తి చేయడంతో మృతిపై పలువురికి అనుమానం వచ్చింది. ఈక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ మృతుడి ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉంది. ఇంట్లోంచి దుర్వాసన వచ్చింది. దీంతో ప్రకాశ్రావు మృతిపై అనుమానం ఉందని సిరిసిల్ల టౌన్పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన టౌన్ సీఐ ఉపేందర్ హత్య ఉదంతాన్ని ఛేదించారు. నిందితులు స్వప్న, ఉషశ్రీని రిమాండ్కు తరలించగా, హత్యకు సహకరించిన మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు సీఐ వెల్లడించారు. ప్రకాశ్రావు (ఫైల్) -
స్వగ్రామానికి తెలుగు విద్యార్థి మృతదేహం
జి.కొండూరు: కొలంబియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తెలుగు విద్యార్థి బేతపూడి సుధీర్కుమార్ మృతదేహం స్వగ్రామమైన ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరుకు సోమవారం ఉదయం చేరింది. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ కృషి, రాష్ట్ర ప్రభుత్వం చొరవతో బాధిత తల్లిదండ్రులకు కుమారుడి చివరిచూపు దక్కింది. జి.కొండూరుకు చెందిన బేతపూడి దేవదాసు కుమారుడు సుదీర్కుమార్ అలియాస్ జోషీ (34) ఎంఎస్ చదివేందుకు 2018లో స్పెయిన్ వెళ్లాడు. అనేక కారణాలతో ఎంఎస్ పూర్తి చేయలేకపోయాడు. అక్కడే ఉంటూ పార్ట్టైమ్ ఉద్యోగం చేస్తూ చదువు కొనసాగిస్తున్నాడు. గతనెల 15వ తేదీన తన స్నేహితురాలైన తోటి విద్యార్థి జెస్సికా జన్మదిన వేడుకల నిమిత్తం కొలంబియా వెళ్లాడు. 19వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో మృతుడి తల్లిదండ్రులు బేతపూడి కేథరీన్, దేవదాసు తమ కుమారుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని తమ కుమారుడి ఆఖరి చూపు క ల్పించాలని వారు అభ్యర్థించారు. దీనిపై స్పందించిన స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీ) ద్వారా కొలంబియాలోని ఇండియన్ ఎంబసీతో సంప్రదింపులు జరిపి, జి.కొండూరు తరలించి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. బంధువులు, కుటుంబ సభ్యుల చివరిచూపు అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. తమ కుమారుడి చివరిచూపును కల్పించిన ఎమ్మెల్యేకు, రాష్ట్ర ప్రభుత్వానికి తామెప్పుడూ రుణపడి ఉంటామని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. -
రహస్యంగా మృతదేహం పూడ్చివేత
నల్లగొండ క్రైం : దుండగులు అర్ధరాత్రి ఓ మృతదేహానికి రహస్యంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన నీలగిరి మున్సిపాలిటీ పరిధి చందనపల్లి శివారు చెత్త డంపింగ్ యార్డు సమీపంలో పానగల్ ఉదయ సముద్రం రిజర్వాయర్ ఎగువ ప్రాంతంలో జరిగింది. విశ్వసనీయ వర్గాల కథనం మేరకు వివరాలు ఇలా.. గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి 11:30 గంటలకు కారులో నలుగురు, మూడు బైక్లపై మరో ఆరుగురు వ్యక్తులు చందనపల్లి చెత్తడంపింగ్ యార్డు సమీపంలోని పానగల్ ఉదయ సముద్రం రిజర్వాయర్ ఎగువ ప్రాంతానికి వచ్చారు. వాహనాలను అక్కడే నిలిపి తమ వెంట తెచ్చుకున్న పలుగు, పారలతో సుమారు 4 నుంచి 5 ఫీట్ల పొడవులో గొయ్యి తీశారు. ప్యాకెట్లలో తీసుకొచ్చిన ఉప్పు గొయ్యిలో పోశారు. అనంతరం బ్యాగులో కుక్కి కారులో తీసుకొచ్చిన మృతదేహాన్ని బయటికి తీశారు. ఇద్దరు వ్యక్తులు సదరు మృతదేహం కాళ్లు ఒకరు, చేతులు మరొకరు పట్టుకుని గోతిలో పెట్టి పూడ్చిపెట్టారు. ఈ క్రమంలో వెంట వచ్చిన ఒకరు పెద్ద పెట్టున రోదించగా మిగతా వారు అతడిని వారించారు. అంతిమ సంస్కారాలు ముగిసిన తర్వాత అందరూ ఆయా వాహనాల్లో అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిసింది. ఆ.. మృతదేహం ఎవరిది? గుర్తుతెలియని వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేసిన మృతదేహం ఎవరిదనేది చందనపల్లి గ్రామంలో చర్చ జరుగుతోంది. గొయ్యి పొడవు 4 నుంచి 5 ఫీట్ల లోపే ఉండడంతో ఆ మృతదేహం 6 నుంచి ఏడేళ్ల లోపు వారిదే ఉంటుందని తెలుస్తోంది. మృతదేహం ఆడ, మగ అనేది స్పష్టత లేదని అర్ధరాత్రి చాటుగా గమనించిన వారు పేర్కొంటున్నారు. ఏదైనా అనారోగ్యంతో మృతిచెందితే నిర్భయంగా అంత్యక్రియలు చేస్తారు. మహిళలు ఎవరు లేకుండా, అర్ధరాత్రి బ్యాగులో మృతదేహాన్ని తీసుకొచ్చి ఖననం చేయడంతో ఎక్కడో హత్య చేసి ఇక్కడికి తీసుకొచ్చి పూడ్చిపెట్టారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శనివారం అష్టమి కావడంతో నరబలి ఇచ్చిన తర్వాత గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని తీసుకొచ్చి పూడ్చిపెట్టారనే అనుమానాలు లేకపోలేదు. అర్ధరాత్రి అంతిమ సంస్కారాల తంతును గమనించిన కొందరు చందనపల్లి గ్రామస్తులకు విషయం తెలపడంతో చర్చనీయాంశంగా మారింది. -
అంతరిక్షంలో వ్యోమగామి చనిపోతే మృతదేహం భూమికి ఎలా చేరుతుంది?
భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ‘గగన్యాన్’ ద్వారా త్వరలో మానవులను అంతరిక్షంలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. చంద్రయాన్-3 విజయం, ఆదిత్య ఎల్-1 విజయవంతమైన తర్వాత ముగ్గురు భారతీయ వ్యోమగాములు గగన్యాన్ సాయంతో భూమికున్న దిగువ కక్ష్యలోకి వెళ్లనున్నారు. ఈ వ్యోమగాములు మూడు రోజుల పాటు నిర్ణీత కక్ష్యలో ఉంటారు. ఆ తర్వాత క్షేమంగా భూమికి తిరిగి రానున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కూడా హ్యూమన్ స్పేస్ మిషన్ కోసం సన్నద్ధమవుతోంది. మృతదేహాలు ఏమవుతాయి? అనేక ప్రైవేట్ సంస్థలు కూడా అంతరిక్ష పర్యాటక దిశగా పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు ప్రపంచం నలుమూలల నుంచి 600 మందికి పైగా ప్రజలను అంతరిక్షంలోకి పంపారు. 1961లో తొలిసారిగా సోవియట్ యూనియన్కు చెందిన వ్యోమగామి యూరి గగారిన్ అంతరిక్ష యాత్రకు వెళ్లారు. అంతరిక్షంలో ప్రయాణించిన వారిలో ఎక్కువ మంది వ్యోమగాములే ఉన్నారు. అయితే ఇటీవల కొంత మంది సామాన్యులు కూడా స్పేస్ టూరిజం కింద అంతరిక్షయానం చేశారు. అయితే అంతరిక్ష యాత్రకు వెళ్లినవారిలో ఎవరైనా అంతరిక్షంలోనే మరణించారా? అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది. అదే జరిగితే వారి మృతదేహాలను భూమికి ఎలా తీసుకువచ్చారు? అనే ప్రశ్నకూడా మదిలో మెదులుతుంది. అత్యధిక ప్రమాదాలు ఎక్కడ జరుగుతాయి? అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు 188 మంది అంతరిక్ష విమానాల్లో మరణించారు. 1980ల నుంచి ఇలాంటి ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. స్పేస్ ఫ్లైట్తో కూడిన చాలా ప్రమాదాలు భూమిపైన లేదా అంతరిక్షంగా పరిగణించే పాయింట్ను చేరుకోవడానికి ముందుగానే సంభవించాయి. ఈ పరిమితిని కర్మన్ లైన్ అంటారు. ఇది సముద్ర మట్టానికి 100 కిలోమీటర్లు అంటే 62 మైళ్ల ఎత్తులో ఉంది. అంతరిక్షంలో స్పేస్ క్రాఫ్ట్ తప్పిపోయిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అంతరిక్షంలో ప్రమాదానికి గురైన వ్యోమనౌకలోని బాధితులు సాధారణంగా భూమిపైన పడిపోతారు. ముగ్గురు వ్యోమగాములు మృతి చెందినప్పుడు.. అంతరిక్షంలో ఒకే ఒక్క ప్రమాదం 1971లో జరిగింది. సాల్యూట్-1 అంతరిక్ష కేంద్రం నుండి తిరిగి వస్తున్నప్పుడు సోయుజ్-11 క్యాప్సూల్ ఒత్తిడి తగ్గింది. ఫలితంగా వ్యోమగాములు జార్జి డోబ్రోవోల్స్కీ, వ్లాడిస్లావ్ వోల్కోవ్, విక్టర్ పట్సాయేవ్ మరణించారు. క్యాప్సూల్ భూమిపైకి దిగుతూనే సముద్రంలో పడిపోయింది. అనంతరం క్యాప్సూల్ నుంచి ముగ్గురు వ్యోమగాముల మృతదేహాలను వెలికి తీశారు. అంతరిక్షంలో వ్యోమగాములు మరణించిన ఒకేఒక్క ఉదంతం ఇది. బహిరంగపరచగానికి సోవియట్ యూనియన్ నిరాకరణ 1960 సంవత్సరపు ‘ది లాస్ట్ కాస్మోనాట్స్’ సిద్ధాంతం ప్రకారం యూరి గగారిన్ అంతరిక్ష ప్రయాణంలో విజయవంతమైన ప్రయత్నానికి ముందు, సోవియట్ యూనియన్ రహస్యంగా ఇటువంటి అనేక ప్రయత్నాలు చేసింది. అలాంటి ఒక ప్రయత్నంలో అంతరిక్షంలో ఒక ప్రమాదం జరిగింది. అందులో కొంతమంది వ్యోమగాములు మరణించారు. అయితే సోవియట్ యూనియన్ విషయాన్ని బహిరంగపరచడానికి నిరాకరించింది. ది లాస్ట్ కాస్మోనాట్స్ థియరీ నిజమా అబద్ధమా అనేది ఇప్పటి వరకు రుజువు కాలేదు. ఈ సిద్ధాంతం సరైనదని రుజువు చేయగల అటువంటి ఆధారాలు ఇప్పటి వరకు తెరపైకి రాలేదు. జంతువులను పంపినప్పుడు ఏమి జరిగింది? మానవులను అంతరిక్షంలోకి పంపే ముందు సోవియట్, అమెరికన్ ఏజెన్సీలు 1950లలో అంతరిక్ష నౌకలో జంతువులను సజీవంగా ఉంచడానికి ప్రయత్నం చేశాయి. ఈ ప్రయత్నంలో భాగంగా అమెరికా వి-2 బ్లోసమ్ రాకెట్లో ఆల్బర్ట్ ఫస్ట్ అనే కోతిని పంపింది. సోవియట్ యూనియన్ స్పుత్నిక్-2 ఉపగ్రహంతో లైకా అనే కుక్కను పంపింది. ఈ రెండు జంతువులు కూడా అంతరిక్షంలో మరణించాయి. తదుపరి ప్రయత్నాలలో కూడా కొన్ని జంతువులు అంతరిక్షంలో చనిపోయాయి. ఈ జంతువులన్నీ క్యాప్సూల్లోనే చనిపోయాయి. ఆ క్యాప్సూల్స్ భూమికి తిరిగి వచ్చాయి. వాటి మృతదేహాలు తిరిగి లభ్యమయ్యాయి. ఇప్పటివరకు అంతరిక్షంలో ఏ జంతువు కూడా గల్లంతైన సంఘటన ఎదురుకాలేదు. ఇది కూడా చదవండి: తొలి ఐఎఎస్ సెలక్షన్ ఎలా జరిగింది? మొదటి ఐఎఎస్ అధికారితో ఠాగూర్కున్న సంబంధం ఏమిటి? -
ఎవరైనా అంతరిక్షంలో మరణిస్తే!.శరీరం ఏమవుతుంది? ఏం చేస్తారు?
అంతరిక్ష పరిశోధనలు 60 ఏళ్ల కిత్రం నుంచే ప్రారంభమయ్యాయి. ఆ పరిశోధనల్లో భాగంగా అంతరిక్షయానం చేసిన ఎంతోమంది వ్యోమగాములు ప్రాణాలతో తిరిగి వచ్చే సమయంలో రాకెట్లో సాంకేతిక లోపం కారణంగానో మరేదైన కారణం వల్లనే చనిపోవడం జరిగింది. ఇలా ఇప్పటి వరకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. చెప్పాలంటే 1986 నుంచి 2003 వరకు నాసా స్పేస్కి సంబంధించి 14 మంది అంటే..1971లో సోయజ్ 11 మిషన్లో ముగ్గురు, 1976లో అపోలా1 లాంచ్ ప్యాడ్ అగ్నిప్రమాదంలో ముగ్గురు వ్యోమగాములు చొప్పున చనిపోయారు. దీనిని బట్టి చూస్తే అంతరిక్షయానం ఎంత క్లిష్టంగా ఉంటుందో తెలుస్తోంది. అయినప్పటికి 2025 కల్లా చంద్రుడిపైకి, వచ్చే దశాబ్దం కల్లా అంగారకుడిపైకి వ్యోమగాములను పంపే సాహసం చేస్తుండటం విశేషం. ఒకరకంగా చెప్పాలంటే వాణిజ్యపరమైన అంతరిక్షయానం నిత్యకృత్యంగా మారింది. ఈ దృష్ట్యా అందరి మదిలో మెదిలే ప్రశ్న ఒకవేళ అంతిరిక్షంలోకి వెళ్లాక చనిపోతే ఏమవుతుంది?.. ఆ టైంలో మిగతా సిబ్బంది ఏం చేయాలి?.శరీరం ఏమవుతుంది. ఎలా ఖననం చేస్తారు వంటివి ఎదురవుతాయి. చంద్రుడు లేదా మార్స్పై మరణం సంభవిస్తే.. నిజానికి వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లేముందే స్పేస్ మెడికల్ వైద్యులు అన్నిరకాల పరీక్షలు నిర్వహిస్తారు. వాళ్లు పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉన్నారని నిర్థారించాకే స్పేస్లోకి వెళ్లేందుకు అనుమతిస్తారు. తీరా అక్కడకి వెళ్లే సమయంలో భూమి కక్ష్య మిషన్లో ఎవరైన మరణిస్తే..కొన్ని గంట వ్యవధిలో క్యాప్సూల్(రాకెట్లో విడిపోగల భాగం) నుంచి భూమిపైకి తిరిగి పంపించవచ్చు. ఇలాంటిదే చంద్రుని పైకి వెళ్లే క్రమంలో జరిగితే సిబ్బంది కొద్దిరోజుల వ్యవధిలో మృతదేహంతో భూమికి తిరిగి రాగాలరు. ఇక్కడ సమస్య చనిపోవడం, ఆ మృతదేహాన్ని సంరక్షించటం అనేవి ప్రధాన సమస్య కావంటోంది నాసా. అదే సమయంలో అక్కడ ఉన్న ఇతర సిబ్బందికి సురక్షితంగా భూమిపైకి తిరిగి రావడం అనేదే ప్రధాన సవాలు అని చెబుతోంది నాసా. అంగారక గ్రహానికి 300 మిలియన్ మైళ్ల ప్రయాణంలో వ్యోమగామి చనిపోతే గనుక తిరిగి వెళ్లడం కుదరని పని ఎందుకంటే..రాకెట్ మిషన్ ట్రిప్ ముగిసే వరకు ఆగాల్సిందే. తిరిగి రావడానికి కొన్ని ఏళ్ల సమయం పడుతుందని పేర్కొంది. ఇలాగో సిబ్బంది మృతదేహాన్ని ప్రత్యేక గదిలో లేదా ప్రత్యేకమైన బాడీ బ్యాగ్లో భద్రపరచాలి. అలాగే అంతరిక్ష వాహనం లోపల స్థిరమైన ఉష్ణోగ్రత, తేమ మృతదేహాన్ని రక్షించడానికి ఉపకరిస్తుంది కూడా. ఇవన్నీ కేవలం అంతరిక్ష కేంద్రం లేదా అంతరిక్షంలోకి వెళ్లే క్రమంలో ఏర్పడిన ఒత్తిడి కారణంగా చనిపోతే మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతాయని నొక్కి చెబుతోంది నాసా. ఎవ్వరూ కూడా స్పేస్సూట్ రక్షణ లేకుండా అంతరిక్షంలోకి అడుగుపెట్టడం అనేది అసాధ్యం. ఆ వ్యక్తి తక్షణమే చనిపోతాడని చెబుతున్నారు స్పేస్ వైద్యులు. ఎందుకంటే పీడనం తక్కువగా ఉండటం, శ్వాస తీసుకోవడం కుదరక, రక్తం ఇతర ద్రవాలు ఆవిరైపోతాయని చెబుతున్నారు. పూర్తి స్థాయిలో ఆక్సిజన్ ఉండదు దీంతో రక్తం ఉడికిపోవడం మొదలవుతుందట. ఇదంతా కాదు సరిగ్గా అంతరిక్షంలోకి ల్యాండ్ అయ్యాక మరణిస్తే.. ఇలాంటి విపత్కర సమయంలో మిగతా సిబ్బంది ఆ పరిస్థితిని తట్టుకునే మానసిక స్థితితో రెడీగా ఉండాలి. మృతదేహాన్ని భూమిపైకి తెచ్చేంతవరకు ప్రత్యేకమైన బాడీ బ్యాగ్లో భద్రపర్చి.. స్పేస్ సెంటర్కి తెలిపే తక్షణ ప్రోటోకాల్ అవసరం అని పేర్కొంది. బాధిత కుటుంబాల ఆవేదనను అర్థం చేసుకుని వారికి సహాయ సహాకారాలు అందించాల్సిన బాధ్యతను స్పేస్ సెంటర్లు తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది నాసా. (చదవండి: అతనో రాజవంశస్తుడు..గే కావడంతో..ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి..) -
యాదాద్రి భువనగిరి: మృతదేహాన్ని కొరికేసిన ఎలుకలు!
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రి మార్చురీలో ఉన్న ఓ మృతదేహాన్ని ఎలుకలు కొరుక్కుతిన్నాయి. ఏపీలోని గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం బాయపాలెం గ్రామానికి చెందిన పెరికల రవికుమార్ (38) కుటుంబం 2016లో భువనగిరికి వలస వచ్చింది. రవికుమార్కు వివాహం జరగా, ఒక కుమార్తె జన్మించింది. కొంతకాలానికి ఆమె చనిపోవడంతో, రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఓ కుమారుడు ఉన్నాడు. ఏడాది క్రితం రెండో భార్య రవికుమార్ను వదిలివెళ్లింది. దీంతో ఆయన తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి పట్టణంలోని ప్రగతినగర్లో అద్దెకు ఉంటున్నాడు. డ్రైవర్గా పనిచేస్తున్న రవికుమార్ కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. తగాదా పడుతుండడంతో తల్లిదండ్రులు, పిల్లలు సమీపంలోని తెలిసిన వారి ఇంటికి వెళ్లారు. తిరిగి రాత్రి 11:30 నిమిషాలకు ఇంటికి వచ్చేసరికి రవికుమార్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మార్చురీ గదిలోని ఫ్రీజర్లో కాకుండా బయట భద్రపరిచారు. ఆ ఆనవాళ్లు చూసి.. రవికుమార్ మృతదేహాన్ని చూసేందుకు సోమవారం ఉదయం కుటుంబసభ్యులతో పాటు బంధువులు మార్చురీకి వచ్చారు. అప్పటికే మృతదేహం ముఖం, చెంపలు, నుదుటిపై ఎలుకలు కొరికిన ఆనవాళ్లు చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఎలుకలు కొరికినట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆస్పత్రి సూపరింటెండెంట్ చిన్నానాయక్ తెలిపారు. -
మొదటి భార్య ఫిర్యాదు ఏఆర్ ఎస్సై మృతదేహం వెలికితీత
నెల్లూరు: తిరుపతి జిల్లాలో ఏఆర్ ఎస్సైగా పనిచేస్తున్న త్రిపురాంతకం మోహన్ (56) ఈనెల 13వ తేదీన మృతిచెందగా రెండో భార్య కుటుంబసభ్యులు పూడ్చిపెట్టారు. అయితే మొదటి భార్య ఫిర్యాదు మేరకు మంగళవారం పూడ్చిన మృతదేహాన్ని వెలికితీయించినట్లు ఎస్సై ఆవుల వెంకటేశ్వర్లు చెప్పారు. అందిన వివరాల మేరకు.. నెల్లూరులోని హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్న మోహన్ తిరుపతి జిల్లాలో ఏఆర్ ఎస్సైగా పని చేస్తున్నాడు. మోహన్కు ఇద్దరు భార్యలు ఉన్నారు. నెల్లూరులో మొదటి భార్య, లింగసముద్రం మండలం వీఆర్ కోట గ్రామంలో రెండో భార్య నివాసం ఉంటున్నారు. ఈనెల 9న మోహన్ తన రెండో భార్య కందుకూరి పద్మావతి ఇంటికి వచ్చాడు. 13న ఆయన మృతిచెందగా మొదటి భార్య మాధవికి తెలియకుండా మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. భర్త ఇంటికి రాకపోవడం.. ఎక్కడ ఉన్నాడో ఆచూకీ తెలియక పోవడంతో ఆరా తీయగా వీఆర్ కోటలో రెండో భార్య వద్ద మృతి చెందినట్లు తెలుసుకున్నారు. ఈ విషయమై లింగసముద్రం పోలీస్స్టేషన్లో మొదటి భార్య కుమారుడు రిత్విక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. వీఆర్కోటలో తహసీల్దార్ మీరావలీ, నెల్లూరు మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు సమక్షంలో మంగళవారం పూడ్చిన మృతదేహాన్ని వెలికితీసి శవ పంచనామా నిర్వహించినట్లు ఎస్సై వివరించారు. -
భర్త దూరం.. యూట్యూబ్లో ఆ వీడియోలు చూసి..
నెల్లూరు(క్రైమ్): గోనెసంచిలో మృతదేహం కేసులో మిస్టరీ ఎట్టకేలకు వీడింది. స్నేహితుడు తనతోనే ఉండాలని, అతడి భార్య జైలుకు వెళ్లాలనే కుట్రతో ఈ హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నెల్లూరు దర్గామిట్ట పోలీస్స్టేషన్లో ఆదివారం నగర డీఎస్పీ డి.శ్రీనివాసరెడ్డి స్థానిక ఇన్స్పెక్టర్ సీహెచ్ సీతారామయ్యతో కలిసి వివరాలు వెల్లడించారు. పొదలకూరురోడ్డుకు చెందిన జహీర్ బాషా డైకస్రోడ్డులో మందుల దుకాణం నిర్వహిస్తున్నాడు. అందులో ఎ.కావ్య అలియాస్ షేక్ సమీరా పనిచేస్తోంది. ఆమెకు అప్పటికే వివాహమై భర్త నుంచి దూరంగా ఉంటోంది. కాగా జహీర్, కావ్య సన్నిహితంగా ఉండేవారు. జహీర్కు అప్పటికే అస్మా అనే యువతితో వివాహమైంది. ఎలాగైనా స్నేహితుడు తనతోనే ఉండాలని భావించిన కావ్య ఈ విషయాన్ని తన స్నేహితురాలైన వెంగళరావ్నగర్కు చెందిన కృష్ణవేణికి తెలియజేసింది. ఆమె ద్వారా యూట్యూబ్లో వశీకరణ పూజలు చేస్తామని వీడియోలు చేసిన ఏలూరు జిల్లా కలిదిండి గ్రామానికి చెందిన మణికంఠ (33) గురించి తెలుసుకుంది. గతేడాది ఇద్దరూ కలిసి అతడిని సంప్రదించారు. దీంతో మణికంఠ నెల్లూరుకు రాగా కావ్య, కృష్ణవేణి కలిశారు. హత్య చేసి.. జహీర్ తనతోనే ఉండిపోయేలా వశీకరణ చేయాలని కావ్య మణికంఠను కోరగా మందు చేసి ఇచ్చాడు. అది పనిచేయలేదని మహిళలు భావించారు. దీంతో మణికంఠను హత్య చేసి ఆ నేరాన్ని జహీర్ భార్యపై నెట్టేస్తే అతను తనతోనే ఉండిపోతాడని కావ్య పథకం రచించింది. ఈ విషయాన్ని కృష్ణవేణి, తన కుమార్తె సాయిప్రియకు తెలియజేసింది. ఈ క్రమంలో గతేడాది నవంబర్లో మణికంఠకు పాలలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చారు. అప్పటికి అతను చనిపోకపోవడంతో గొంతునులిమి హత్య చేశారు. కావ్య తన కుమార్తె చేత అస్మాపై అనుమానం వచ్చేలా సూసైడ్ నోట్ రాయించి మృతుడి జేబులో పెట్టారు. అనంతరం మృతదేహాన్ని గోనెసంచిలో పెట్టి స్కూటీపై తీసుకెళ్లి గౌతమ్నగర్ రెండో వీధిలో పడేసింది. దర్గామిట్ట ఇన్స్పెక్టర్ ఘటనా స్థలానికి చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతుడి జేబులో లభ్యమైన లేఖ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదికలో మణికంఠది హత్యేనని తేలడంతో కేసును మార్చి విభిన్న కోణాల్లో దర్యాపు చేపట్టారు. నగదు డ్రా చేసి.. మణికంఠ హత్య అనంతరం కావ్య మృతుడి ఏటీఎం కార్డు ద్వారా రూ.3.50 లక్షలను విడతల వారీగా నగదు డ్రా చేసింది. అందులో రూ.లక్ష నగదు స్నేహితురాలికి ఇచ్చి మిగిలిన నగదుతో బంగారం కొనుగోలు చేసింది. సాంకేతికత ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు మణికంఠను హత్య చేసింది కావ్య అని గుర్తించారు. ఆమెకు సాయిప్రియ, కృష్ణవేణి సహకరించారని గుర్తించి శనివారం రాత్రి వారందరినీ అరెస్ట్ చేశారు. 25 గ్రాముల బంగారు ఆభరణాలు, నాలుగు సెల్ఫోన్లు, రెండు ఏటీఎం కార్డులను స్వా«దీనం చేసుకున్నారు. హత్య కేసును ఛేదించిన పోలీసు« అధికారులను డీఎస్పీ అభినందించారు. సమావేశంలో ఎస్సై రమే‹Ùబాబు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
భర్త వస్తాడనుకుంటే మృతదేహం రావడంతో.. సొమ్మసిల్లిన నిండుగర్భిణి!
ఉత్తరప్రదేశ్లోని బాందాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అహ్మదాబాద్ నుంచి బాందాకు వస్తున్న 25 ఏళ్ల యువకుడు రైలులో మృత్యువాత పడ్డాడు. ఈ విషయం తెలియని అతని భార్య, కుటుంబసభ్యులు.. ఇక కొద్ది సేపటిలో అతను వస్తాడని ఎదురు చూస్తున్నారు. ఇంతలో వారికి అసలు విషయం తెలిసింది. దీంతో వారి ఇల్లు శోకసంద్రంగా మారిపోయింది. భర్త ఇక రాడనే సంగతి తెలుసుకున్న భార్య సొమ్మసిల్లి పడిపోయింది. ఈ ఉదంతం గురించి బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ కుమారుడు రైలులో విషప్రయోగానికి బలైపోయాడని ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారని, తదుపరి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. కమాసిన్ పోలీస్స్టేషన్ పరిధిలోని సుజర్ భాన్ అనే యువకుడు అహ్మదాబాద్లో ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నాడు. అతని కుటుంబం బాందాలో ఉంటోంది. ఆదివారం బరౌనీ-అహ్మదాబాద్ ఎక్స్ప్రెస్ ఎక్కి ఇంటికి బయలుదేరాడు. రక్తంతో కూడిన వాంతులు.. మహోబా స్టేషన్ సమీపంలోకి రైలు చేరుకోగానే ఉన్నట్టుండి అతనికి రక్తంతో కూడిన వాంతులు రావడం మొదలయ్యింది. దీనిని గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే ఈ విషయాన్ని సీఆర్పీ పోలీసులతో పాటు రైల్వే అధికారులకు తెలియజేశారు. ఇంతలోనే అతని ఆరోగ్యం విషమించింది. వెంటనే జీఆర్పీ పోలీసులు బాధితుడిని రైల్వే వైద్యుల దగ్గకు తీసుకువెళ్లారు. వారు బాధితుడిని పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారు. పోలీసులకు మృతుని జేబులో అహ్మదాబాద్ నుంచి బాందాకు రైల్ టిక్కెట్ లభ్యమయ్యింది. డాక్యుమెంట్ల ఆధారంగా మృతుడు బాందాకు చెందినవాడుగా పోలీసులు గుర్తించారు. వెంటనే వారు మృతుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలియగానే మృతుని కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. వారు తెలిపిన వివరాల ప్రకారం సూరజ్ భాన్కు ఇద్దరు పిల్లలు ఉంటేవారు. వారు మృతిచెందారు. ప్రస్తుతం అతని భార్య నిండుగర్భంతో ఉంది. కొద్దిరోజుల్లో ఆమెకు డెలివరీ జరగనుంది. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: వేలానికి 121 ఏళ్ల క్యాడ్బరీ చాక్లెట్.. నాటి తీయని వేడుకకు గుర్తుగా.. -
చివరికి.. తోపుడు బండిపై చిన్నారి మృతదేహం తరలింపు!
ఆ ఏడేళ్ల కుర్రాడు పాము కాటుకు గురయ్యాడు. దీనిని గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ బాలుడు మృతి చెందాడు. కుమారుడు మరణించాడన్న బాధలో ఉన్న అతని తండ్రికి ఊహించని విధంగా మరో సమస్య ఎదురయ్యింది. మధ్యప్రదేశ్లోని ష్యోపూర్లో మానవత్వం మంటగలిసే ఉదంతం చోటుచేసుకుంది. పాము కాటుకు గురైన బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అనంతరం ఆ బాలుడి మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు అంబులెన్స్ అందుబాటులో లేదు. మరోమార్గం లేక మృతుని కుటుంబ సభ్యులు ఆ మృతదేహాన్ని తోపుడు బండిపై పెట్టి, రెండున్నర కిలోమీటర్ల దూరంలోని తమ ఇంటికి తీసుకువెళ్లారు. ఈ సమయంలో పెద్దసంఖ్యలో జనం ఆ తోపుడుబండిని అనుసరిస్తూ వచ్చారు. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయినా అధికారులు ఈ ఉదంతంపై స్పందించక పోవడం విచారకరం. సాహిల్ శరీరంలో కదలిక? విజయ్పూర్కు చెందిన ఏడేళ్ల సాహిల్ ఖాన్ను పాము కాటువేసింది. వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించాగా, అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని రాత్రంతా పోస్టుమార్టం హౌస్లో ఉంచారు. మర్నాడు సాహిల్ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. వారికి సాహిల్ శరీరంలో కదలిక కనిపించింది. దీంతో వారు వైద్యులకు ఈ విషయాన్ని చెప్పారు. వారు పరీక్షించి, బాలుడు మృతిచెందాడని నిర్థారించారు. తరువాత వైద్యులు ఆ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుని కుటుంబ సభ్యులు అంబులెన్స్ కోసం చాలాసేపు ఎదురు చూశారు. సంబంధిత అధికారులకు ఈ విషయం గురించి చెప్పినా ఫలితం లేకపోయింది. దీంతో చేసేదేమీలేక నాలుగు చక్రాల తోపుడు బండిపై బాలుని మృతదేహాన్ని ఉంచి, ఇంటికి తరలించారు. ఈ పరిస్థితిని చూసిన స్థానికులు కంటతడిపెట్టుకున్నారు. తరువాత మృతునికి అంత్యక్రియలు నిర్వహించారు. ఇది కూడా చదవండి: భర్త చంకలో పిల్లాడు.. భార్య చేతిలో సైకిల్.. డెలివరీబాయ్ ఫ్యామిలీ వీడియో వైరల్! -
కలకలం రేపిన ‘ గోనెసంచి మూట’
నిజామాబాద్: మండల కేంద్రం శివారులోని చెరువు సమీపంలో గోనె సంచి మూట బుధవారం కలకలం రేపింది. మూటలో మృతదేహం ఉందని అనుమానించిన గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే వారు పోలీసులకు సమాచారమిచ్చారు. సీఐ రాజారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఘటన స్థలానికి హుటాహూటిన చేరుకున్నారు. గోనె సంచి మూటను తెరువగా అందులో కుక్క మృతదేహం కనిపించింది. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఎవరో కావాలనే ఇలా చేశారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. -
Aghora Puja: మృతదేహంపై కూర్చొని అఘోర పూజలు.. వీడియో వైరల్
కర్ణాటక: సూలూరు శ్మశాన వాటికలో దహన సంస్కారాలకు వచ్చిన ఓ మృతదేహంపై కూర్చొని అఘోర పూజలు చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వివరాలు.. కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రిలో మరణించిన 40 ఏళ్ల వ్యక్తి మృతదేహం అంత్యక్రియల కోసం సోమవారం సూలూర్ శ్మశాన వాటికకు తీసుకొచ్చారు. ఆ సమయంలో మృతుడి బంధువులతో పాటు 8 మంది అఘోరాలు కూడా వచ్చారు. మృతదేహాన్ని దహనం చేసేముందు అఘోర శవంపై కూర్చొని పూజలు చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో మీడియా ప్రతినిధులు శ్మశాన నిర్వాహకుడు సురేష్ను ఈ విషయంపై ప్రశ్నించారు. అయితే బంధువుల అనుమతితోనే అఘోర పూజలు చేసినట్లు చెప్పారు. ఈ విషయంపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. -
ఆమె చనిపోయి నాలుగేళ్లైంది..ఐనా మృతదేహం కించెత్తు పాడవ్వకుండా..
ఎవ్వరైన చనిపోతే వారివారి మత ఆచారాలను బట్టి అంత్యక్రియలు జరుగుతుంటాయి. ఖననం చేస్తే కొన్ని నెలల్లోనే కుళ్లిపోయి కేవలం అస్థిపంజరాలు మాత్రమే ఉంటాయి. అది అందరికీ తెలిసిందే. ఐతే ఇక్కడోక ఆఫ్రికన్ మహిళ చనిపోయి నాలుగేళ్లైంది. కొన్ని కారణాల రీత్యా ఆమె శవపేటికను వెలికి తీయగా..ఆ మహిళ మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు కుటుంబసభ్యులు, బంధువులు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే...సదరు మహిళ సిస్టర్ విల్హెల్మినా లాంకాస్టర్ ఆఫ్రికన్ అమెరికన్. ఆమె అమెరికాలో బెన్డిక్ట్ ఇన్ సిస్టర్స్ ఆఫ్ మేరి(నన్స్ ఆశ్రమం) వ్యవస్థాపకురాలు. అక్కడ ఆమె నన్గా ఎంతో సామాజిక సేవ చేసింది. అయితే ఆమె 2019లో చనిపోయింది. అక్కడే ఆ ఆశ్రమం సమీపంలో ఖననం చేశారు. ఐతే ఆ ఆశ్రమంలోని కొందరూ ఆమె సమాధి పాడవ్వడంతో ఆమె అవశేషాలను వేరోచేటికి తరలించి సమాధి కట్టించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఆమె శవపేటికను వేలికి తీశారు. అందులో ఆమె మృతదేహం చూసి ఒక్కసారిగా అవాక్యయ్యారు అక్కడున్నవారంతా. కనీసం ఎలాంటి దుర్వాసన గానీ రాకుండా తాజా మృతదేహంలా అలా చెక్కు చెదరకుండా ఉంది. వాస్తవానికి తాము ఎముకలు మాత్రమే ఉంటాయని భావించామని చెబుతున్నారు ఆమె సంబంధికులు, స్నేహితులు. కనీసం ఆమె మృతదేహం పాడవ్వకుండా ఎలాంటి లేపనాలు పూయకుండా సాధారణ మనిషి మాదిరే ఖననం చేశామని చెబుతున్నారు. పగిలిన శవపేటికలో ఓ తేలికిపాటి మెత్తని పొరలాంటి గుడ్డలో చుట్టబడి, పాడవ్వకుండా ఉన్నా ఆమె మృతదేహాన్ని చూసి ఆశ్చర్యపోయారు. దీంతో సదరు ప్రాంతంలోని ప్రజలు ఆమె మృతదేహాన్ని చూసేందుకు ఆ బెనెడిక్టైన్ ఆశ్రమానికి తండోపతండోలుగా తరలి వచ్చారు. ఆమె నెక్కు ధరించే బెల్ట్ మాదిరి క్లాత్, తలకు ధరించిన క్లాత్ మాత్రమే పాడైయినట్లు ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. నెలల తరబడి ఆమె శరీరీం పాక్షికంగా పాడైన చెక్క శవ పేటికలో ఉండి.. సూర్యరశ్మీ, వర్షాలకు ఎక్స్పోజ్ అయినా ఏ మాత్రం కుళ్లకుండా అలా ఉండటం అత్యంత విచిత్రం అంటున్నారు బంధువులు. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని మరోక చోటికి తరలించి సమాధి చేయనున్నట్లు తెలిపారు ఆమె తల్లి సిసిలియా. ఇది దేవుడి పట్ల ఆమెకి ఉన్న భక్తి విశ్వాసం, నిస్వార్థపూరిత సేవకు భగవంతుడిచ్చిన వరం కాబోలు అని ఆ నన్తో గడిపిన క్షణాలను గుర్తు తెచ్చుకున్నారు మృతురాలి తల్లి, బంధువులు. (చదవండి: US: మితిమీరిన స్వేచ్ఛ+ పతనమైన కుటుంబ వ్యవస్థ = మానసిక ఉన్మాదులు) -
కర్నూలులో దారుణం.. ఇంట్లో అట్టపెట్టెలతో భర్త మృతదేహాన్ని తగలబెట్టింది!
సాక్షి, పత్తికొండ రూరల్ (కర్నూలు): అనారోగ్యంతో చనిపోయిన భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు చేసిన ఉదంతమిది. ఈ హృదయ విదారక ఘటన కర్నూలు జిల్లా పత్తికొండలో సోమవారం చోటుచేసుకుంది. సీఐ మురళీమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. పత్తికొండలోని తేరు బజారులో మెడికల్ షాపు నిర్వహిస్తున్న హరికృష్ణప్రసాద్ (63)కు భార్య లలితమ్మతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. కన్నబిడ్డలకు ఎలాంటి లోటులేకుండా పెంచిపెద్ద చేసి ఉన్నత చదువులు చదివించారు. ఇద్దరికీ పెళ్లిళ్లు కూడా చేశారు. పెద్ద కుమారుడు దినేష్ ఎంబీబీఎస్ పూర్తి చేసి కర్నూలులోని ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తూ అక్కడే భార్యతో కాపురం ఉంటున్నారు. రెండో కుమారుడు ముఖేష్ కెనడాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. పదేళ్ల కిందట హరికృష్ణ ప్రసాద్కు పార్కిన్సస్ ప్లస్ వ్యాధి సోకింది. మరికొన్ని రోజులకు పక్షవాతంతో కాళ్లు చేతులు చచ్చుబడిపోయి మంచానికే పరిమితమయ్యాడు. కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని దయనీయ స్థితిలో ఉన్న అతనికి భార్య లలితమ్మ సపర్యలు చేస్తూ వచ్చింది. ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో మూడేళ్ల నుంచి కర్నూలులో కుమారుడు దినేష్ వద్దే దంపతులిద్దరూ ఉన్నారు. రెండు వారాల క్రితం ఇద్దరూ పత్తికొండకు చేరుకున్నారు. కాగితాలు.. చీరలు వేసి నిప్పు కాగా, సోమవారం వేకువజామున భర్త హరికృష్ణప్రసాద్కు భార్య లలితమ్మ కాలకృత్యాలు తీర్చింది. ఆ తరువాత కొద్దిసేపటికి విగతజీవిగా పడి ఉన్న భర్తను చూసి గుండె పగిలేలా రోదించింది. ఆ తరువాత తేరుకుని టెంకాయ కొట్టి.. మృతదేహంపై ఇంట్లోని పుస్తకాలు చింపి కాగితాలు, చీరలు వేసి నిప్పు పెట్టింది. ఆ తరువాత పెద్దకుమారుడు దినేష్కు వీడియో కాల్ చేసి విషయం చెప్పింది. ఆ ఇంట్లోంచి పొగలు రావడంతో పోలీసులకు సమాచారం అందజేశారు. సీఐ మురళీమోహన్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకోగా.. అప్పటికే మృతదేహం పూర్తిగా కాలిపోయింది. లలితమ్మ మానసిక పరిస్థితి సరిగా లేదని సీఐ తెలిపారు. ఇంట్లోనే మృతదేహం కాల్చిన ఘటన దావానలంలా వ్యాపించింది. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల కాలనీవాసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కంటికిరెప్పలా కాపాడుకుంటూ ఇన్నేళ్లు సపర్యలు చేసిన ఆమె భర్త మృతదేహాన్ని ఇంట్లోనే కాలి్చవేసిందంటే నమ్మలేకపోయారు. లలితమ్మ నిత్యం దైవారాధనలో ఎక్కువగా గడిపేదని కాలనీవాసులు తెలిపారు. నోట మాట రాలేదు అమ్మ ఉదయం 9.30 గంటలకు ఫోన్ చేసింది. ‘నాన్న చనిపోయాడు. ఇంట్లోనే దహన సంస్కారాలన్నీ పూర్తి చేశాను. మీరేం రాకండి’ అని చెప్పింది. ఆ మాట విని షాక్కు గురయ్యాను. వెంటనే పోలీసులకు సమాచారం అందజేసి పత్తికొండ చేరుకున్నాను. ఇంట్లోకి వెళ్లగా కాలిన నాన్న మృతదేహం చూసి నా నోట మాట రాలేదు. అమ్మ పూర్తిగా డిప్రెషన్కు గురైంది. అమ్మ దగ్గరకు వెళ్లి ఓదార్చాను. కెనడాలో ఉన్న తమ్ముడు ముఖేష్కు ఫోన్ చేశాను. వెంటనే బయల్దేరి వస్తున్నానని చెప్పాడు. – దినేష్, పెద్ద కుమారుడు చదవండి: Delhi: గాళ్ఫ్రెండ్తో గొడవ.. అందరూ చూస్తుండగానే..! -
రేబిస్తో ఉన్మాదిగా మారి చంపి తిన్నాడు!
జైపూర్: రాజస్తాన్లో ఒళ్లు జలదరించే ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఉన్మాదిగా మారిన ఓ వ్యక్తి వృద్ధురాలిని చంపి, ఆమె మాంసం తిన్నాడు. ముంబైలో ఉండే సురేంద్ర ఠాకూర్(24) ఇటీవలే తన సొంత పాలి జిల్లా సెండ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని సరధనా గ్రామానికి వచ్చాడు. పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్న అతడు శుక్రవారం పొలంలో పశువులు మేపుకుంటూ ఉన్న శాంతిదేవి(65)ని బండరాయితో మోది చంపేశాడు. అనంతరం ఆమె మాంసం తిన్నాడు. గమనించిన చుట్టుపక్కల వారు అతడిని అతికష్టమ్మీద పట్టుకుని పోలీసులకు అప్పగించారు. హత్య, నరమాంసభక్షణ నేరం కింద పోలీసులు కేసు పెట్టారు. ఠాకూర్ను ఆస్పత్రిలో చేర్పించారు. రేబిస్ వ్యాధి(హైడ్రోఫోబియా) బాధితుల్లో వ్యాధి ముదిరితే చివరి దశలో ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయని వైద్యులు తెలిపారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ప్రశాంతంగా జాతర జరుపుకోవాలి
నేరచరిత లేనివారిని బైండోవర్ చేయొద్దు
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
టమాట సీజన్ ప్రారంభం
No Headline
కూడేరులో జూనియర్ కాలేజ్ ఏర్పాటు
బాధ్యతగా విధులు నిర్వర్తించండి
ఆ ఇద్దరు టీచర్లపై విద్యాశాఖ ప్రేమ
ఆకట్టుకున్న మాక్డ్రిల్
27 నుంచి విజయవాడ రైలు రద్దు
తప్పక చదవండి
- అందుకే నా పేరుకి బ్లూ చేర్చా: ‘పుష్ప పుష్ప..’ సింగర్
- ‘బీజేపీ చేయలేని పని రాహుల్ చేస్తున్నారు’
- అంబానీల అతిథులకు కరీంనగర్ కానుకలు
- కన్హయ్యకు రూ. 52 లక్షలు? ఎవరెవరిచ్చారు?
- తెలుగు రాష్ట్రాల్లో డెత్ ట్రావెల్స్
- ఛాన్స్ వచ్చినా మోదీ బయోపిక్లో నటించను: సత్యరాజ్
- భారత సంతతి శాస్త్రవేత్తకు ‘షా’ అవార్డ్
- Daily Horoscope: ఈ రాశి వారు ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం
- మరీ ఇంత ‘పచ్చ’పాతమా!
- రాయల్స్ ముందుకు...చాలెంజర్స్ ఇంటికి...
Advertisement