-
ఖైదీల నుంచి కోట్లలో వసూళ్లకు పాల్పడ్డారు
న్యూఢిల్లీ: జైలులో విలాసవంతమైన జీవితం గడిపేందుకు సుకేశ్ చంద్ర శేఖర్ వంటి హై ప్రొఫైల్ ఖైదీల నుంచి ఢిల్లీ జైళ్ల శాఖ మాజీ మంత్రి సత్యేందర్ జైన్, ఆ శాఖ మాజీ డీజీ సందీప్ గోయెల్ కోట్లలో వసూళ్లకు పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. ఈ మేరకు వారిపై కేసు నమోదుకు అనుమతివ్వాల్సిందిగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాను కోరింది. సత్యేందర్ జైన్తోపాటు జైలు అధికారి రాజ్కుమార్లపై కేసు నమోదు కోసం లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు, సస్పెండైన ఐపీఎస్ అధికారి గోయెల్, రిటైర్డు ఐఏఎస్ ముకేశ్ ప్రసాద్లపై చర్యలకు కేంద్ర హోం శాఖకు వినతి పంపినట్లు సీబీఐ వివరించింది. వసూళ్లకు పాల్పడిన ఆరోపణలతో గత ఏడాది గోయెల్ను కేంద్ర హోం శాఖ సస్పెండ్ చేసింది. జైలులో విలాసవంతమైన జీవితం గడిపేందుకు మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ 2018–21 సంవత్సరాల మధ్య సుమారు రూ.12.50 కోట్లను వేర్వేరు మార్గాల్లో వీరికి ముట్టజెప్పినట్లు తమకు సమాచారం ఉందని సీబీఐ అంటోంది. -
తీహార్ జైలులో కార్ల విడిభాగాల యూనిట్
తీహార్: దేశంలోనే మొట్ట మొదటిసారిగా తీహార్ జైలులో ఖైదీలకు ఉపాధి అవకాశాలు కల్పించేం దుకు అధికారులు చర్యలు తీసుకొంటున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో కార్ల విడిభాగాల తయారీ యూనిట్ను శుక్రవారం ఢిల్లీ జైళ్ల విభాగం డెరైక్టర్ జనరల్ అలోక్ వర్మ తీహార్ జైలు నంబర్-2లో ప్రారంభించారు. జైలులోని ఖైదీలకు శిక్షణతోపాటు, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఇది దోహదపడుతుంది. దీర్ఘకాలిక లేదా స్వల్పకాలికంగా ఇందులో ఖైదీలు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. పనిచేసే కాలంలో వేతనాలను కూడా చెల్లిస్తారు. ఇక్కడ పనిచేసిన అనుభవం జైలు శిక్షాకాలం పూర్తయిన తర్వాత స్వయం ఉపాధి పొందడానికి దోహదపడుతోందని జైళ్ల విభాగం డీఐజీ, పీఆర్వో ముఖేశ్ ప్రసాద్ తెలిపారు. అ కార్ల విడిభాగాల తయారీ యూనిట్ మిందా ఫరుక్వా ఎలక్ట్రిక్ ప్రైవేట్ లిమిటెడ్(ఎంఈఈ) నిర్వహిస్తోంది. స్పార్క్ ఇండియా, అశోక్ మిందా గ్రూప్ ఆఫ్ ఇండియా, జపాన్కు చెందిన ఫరుక్వా జాయింట్ వెంచర్తో ఈ యూనిట్ నడుస్తుంది. ఇందులో వైర్ హార్నెస్ ఉత్పత్తులు, ముఖ్యమైన విడిభాగాలను తయారీతో పాటు మార్కెటింగ్ సౌకర్యం కూడా ఉంది. ఈ మేరకు మార్చి 30న తీహార్ జైలు అధికారులు, ఎంఎఫ్ఈ అధికారులు మారుతీ సుజీకి ఇండియా లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకొన్నారు. ఈ కార్ల తయారీ యూనిట్లో ఎంఎఫ్ఈ సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో ఖైదీలు పనిచేస్తారు. అత్యధికంగా వేతనాలు కూడా అందజేస్తారు. జైలు శిక్ష పూర్తయిన తర్వాత ఖైదీలు జీవితంలో స్థిరపడడానికి ఈ పని అనుభవం తోడ్పడుతుందని, బయట కూడా మంచి అవకాశాలు లభిస్తాయని జైలు అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఖైదీలకు ఉపాధి కల్పించడం ద్వారా సమాజానికి సానుకూల సందేశాన్ని పంపిస్తున్నామని పీఆర్వో ప్రసాద్ అన్నారు. స్పార్క్ మిందా గ్రూప్ చీఫ్ మార్కెటింగ్ అధికారి ఎన్ కే తనేజా మాట్లాడుతూ ఈ కార్ల తయారీ యూనిట్ను తీహార్ జైలులో సేవాదృక్పథంలో స్థాపించామని, ఎలాంటి లాభాపేక్ష లేదని అన్నారు. శిక్షపూర్తి అయిన ఖైదీలతోపాటు వారి కుటుంబాలు, బాధితులకు కూడా మేలు చేకూర్చాలనే ఉద్దేశంతో యూనిటను చేపట్టామని అన్నారు. పలు జైళ్లలో ఇలాంటి కార్యక్రమాలను విస్తరించడానికి చర్యలు తీసుకొంటున్నామని అన్నారు. ఎంఎఫ్ఈ పర్యవేక్షణలో ఖైదీలు పనిచేస్తారని చెప్పారు. మిషనరీ, ముడిసరుకు, నాణ్యత ప్రమాణాలను ఎంఎఫ్ఈ పర్యవేక్షిస్తుందన్నారు. ప్రస్తుతం ఈ యూనిట్లో 30 నుంచి 35 మంది ఖైదీలకు అవకాశం కల్పిస్తున్నామని, భవిష్యత్లో ఈ సంఖ్యను పెంచుతామని జైళ్ల డీఐజీ చెప్పారు. కార్యక్రమంలో స్పార్క్ ముండా చైర్పర్సన్, ఎంఎఫ్ఈ అధ్యక్షుడు మెయిన్షీ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఓటెత్తిన జనం!
వెనుదిరిగిన ఓటర్లు
సీపీ సుడిగాలి పర్యటన
ఓటేసిన ప్రముఖులు
● ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం ● ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ● జిల్లాలో 66.53శాతం ఓటింగ్ నమోదు ● అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తగ్గిన ఓటింగ్
లెక్కలేస్తున్న అభ్యర్థులు
సంతోషంగా ఉంది
ప్రశాంత వాతావరణంలో పోలింగ్
తొలిసారి ఓటేసిన యువత
ఓటేసిన ట్రాన్స్జెండర్లు
తప్పక చదవండి
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
- అందుకే నాకు పిల్లలు వద్దు: నిఖిల్ కామత్ సంచలన వ్యాఖ్యలు
- ధాన్యం తడవకుండా.. కాపాడే మంచె!
- గాజాలో ఆగని దాడులు.. భారతీయుడి మృతి
- అందుకే విడిపోతున్నాం.. జీవీ ప్రకాష్-సైంధవిల ప్రకటన
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
- నగరం బాట పట్టిన ఆంధ్రా ఓటర్లు.. దారులన్నీ రద్దీ!
- Today Horoscope: ఈ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది
- Lok Sabha Election 2024: నేడు వారణాసిలో మోదీ నామినేషన్
- పచ్చ ముఠాల విధ్వంస కాండ
Advertisement