● పోలింగ్ తగ్గడంతో టెన్షన్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో అభ్యర్థులు తమకు వచ్చే ఓట్లపై ఆరా తీస్తున్నారు. అసెంబ్లీ ఎన్ని కల కంటే భిన్నంగా లోక్సభ పోలింగ్ సరళి ఉండడంతో అభ్యర్థులు ఓట్లు ఎటు పడ్డాయోనని లెక్కలు తీస్తున్నారు. పోలింగ్ బూత్ల వా రీగా లెక్కలు వేస్తున్నారు. ఓటింగ్ తీరు, పట్ట ణాలు, గ్రామాలు, సింగరేణి ప్రాంతాల్లో ఎవరికి ఎలా ఓట్లు వేసి ఉంటారనేది అంచనాలు వేస్తున్నారు. పోలింగ్ ఏజెంట్లతోపాటు తమ నాయకులు, అనుచరగణం నుంచి వివరాలు సేకరిస్తున్నారు. గెలుస్తామా? ఓడుతామా? అంటూ విశ్లేషించుకుంటున్నారు. పెద్దపల్లి లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 68.23శాతం ఓట్లు పోల్ అయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఏడు సెగ్మెంట్లలోనూ ఓటింగ్ తగ్గింది. దీంతో తగ్గిన పోలింగ్ శాతం ఎవరికి మేలు చేస్తుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. యువత, మహిళ, గ్రామీణ, పట్టణ, కార్మిక ఓటర్ల ఓట్లు ఎటు పడ్డాయని అభ్యర్థులు వివరాలు తీసుకుంటున్నారు.
రెండు పార్టీల మధ్యే పోటీ?
లోక్సభ పరిధిలో మొత్తం 42మంది అభ్యర్థులు బరిలో దిగగా, ఇందులో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీ సుకుని విజయం కోసం శ్రమించాయి. పోలింగ్ సరళిని బట్టి ప్రధానంగా రెండు జాతీయ పా ర్టీల మధ్యే ప్రధాన పోటీ నెలకొన్నట్లుగా రాజ కీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో ఎవరిది పై చేయి అవుతుందోనని అభ్యర్థులతోపాటు సామాన్య ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. ఫలితాలు జూన్ 4న వెల్లడి నేపథ్యంలో అప్పటి వరకు వేచి చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment