ప్రధాన వార్తలు

జైలు నుంచి సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని విడుదల
గుంటూరు: సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు జైలు నుంచి విడుదలయ్యారు. గుంటూరు జైలు నుంచి సోమవారం సాయంత్రం( జూన్ 16) ఆయన విడుదలయ్యారు. సాక్షి ఛానెల్ డిబేట్లో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అక్రమ కేసు బనాయించిన గుంటూరు తుళ్లూరు పోలీసులు.. కొమ్మినేనిని అరెస్టు చేశారు. అయితే ఈ అరెస్టుపై శుక్రవారం(జూన్ 13) విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. కొమ్మినేనిని వెంటనే విడుదల చేయాలంటూ బెయిల్ మంజూరు చేసింది. కాగా, కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అక్రమమంటూ దాఖలైన పిటిషన్ను జస్టిస్ పీకే మిశ్రా, జస్టిన్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం గత శుక్రవారం విచారణ జరిపింది. ‘‘టీవీ డిబేట్లో నవ్వినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా?. అలాగైతే కేసుల విచారణ సందర్భంగా మేమూ నవ్వుతుంటాం. వాక్ స్వాతంత్రాన్ని రక్షించాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. విశ్లేషకుడి వ్యాఖ్యలతో కొమ్మినేనికి ఏం సంబంధం?. ఆయన్ని వెంటనే విడుదల చేయండి’ అని సృష్టం చేసిన ద్విసభ్య ధర్మాసనం.. బెయిల్ను మంజూరు చేసింది.

సాఫ్ట్వేర్ ఇంజినీర్లూ.. ఆ జమానా ముగిసింది!
సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఒకప్పుడు మంచి డిమాండ్ ఉండేది. వారిని నియమించుకునేందుకు మల్టీ నేషనల్ కంపెనీలు భారీ జీతాలు, ఆకట్టుకునే సౌకర్యాలతో వెంటపడేవి. ఇప్పుడా జమానా ముగిసింది. టెక్ పరిశ్రమలో జీతాల పెరుగుదల, పెద్దమొత్తం నియామక ప్రక్రియలు తగ్గుతున్నాయి. 2025లో సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ ఉద్యోగాలు అనేక మార్పులను ఎదుర్కొంటున్నాయి. ఇవి ఆటోమేషన్, కొత్త వేతన ధోరణులు, కార్యాలయంలో మారుతున్న దృక్పథాలను ప్రతిబింబిస్తున్నాయి. ఏఐ రాకతో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో మార్పులుసాఫ్ట్వేర్ ఇంజినీర్ల ముఖ్యమైన పని అయిన కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అంటే కోడ్ రాయడాన్ని కృత్రిమ మేధస్సు (AI) పూర్తిగా మార్చుతోంది. గిట్హబ్ కోపైలట్, కర్సర్చాట్ వంటి టూల్స్ ద్వారా ఎటువంటి అధునాతన కోడింగ్ నైపుణ్యాలు లేకుండానే ప్రోగ్రామింగ్ చేయడం సాధ్యమవుతోంది. అంటే సాధారణ టెక్ట్స్ ప్రాంప్ట్ ఇస్తే చాలు ఎలాంటి కోడ్ అయినా చిటికెలో వచ్చేస్తోంది. దీన్నే "వైబ్ కోడింగ్" అని పిలుస్తున్నారు.పెరుగుతున్న సైలెంట్ లేఆఫ్స్ సిలికాన్ వ్యాలీకి చెందిన టాప్ సంస్థల దగ్గర నుంచి భారతీయ ఐటీ కంపెనీల వరకూ అన్నీ ఉద్యోగుల సంఖ్యను క్రమంగా తగ్గించుకుంటున్నాయి. కంపెనీలు గతంలో లాగా ఒకేసారి పెద్ద సంఖ్యలో జాబ్లకు కోతలు పెట్టడం లేదు. బదులుగా ‘సైలెంట్ లేఆఫ్స్’ విధానాన్ని అమలు చేస్తున్నాయి. అంటే ఉద్యోగులకు అనువైన వాతావరణాన్ని కల్పించి వారితో స్వచ్ఛందంగా రాజీనామా చేయించడం ద్వారా వదిలించుకుంటున్నాయి. ఆ స్థాయిలో జీతాల పెరుగుదల లేదుటెక్ రంగంలో వేతనాలు ఇంకా ఎక్కువగానే ఉన్నప్పటికీ, గతంలో మాదిరిగా తక్కువ కాలంలోనే వేగంగా వేతనాలు పెరిగినట్లు ఇప్పుడు పెరగడం లేదు. ఒక ఉద్యోగాన్ని విడిచి మరొక ఉద్యోగం పొందడం ద్వారా ఎక్కువ జీతం పొందే అవకాశాలు తగ్గిపోయాయి. అయితే ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ వంటి హై-డిమాండ్ నైపుణ్యాలు ఉన్నవారు ఇంకా గణనీయమైన వేతనాలను పొందుతున్నారు. వ్యూహాత్మక దృక్పథం అవసరం కొత్త ఉద్యోగానికి మారడం అనుకున్నంత మంచిది కాకపోవచ్చు. ఇప్పుడు ఉద్యోగం మారడానికి ముందుగా స్థిరత, ప్రయోజనాలు, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. 2025లో ఆటోమేషన్, వేతన ధోరణులు, ఉద్యోగ మార్పులను అర్థం చేసుకున్న వారు మాత్రమే ఏఐ నైపుణ్యం, డిజిటల్ అనుసంధానం, ప్రత్యేక నైపుణ్యాలను పెంచుకుంటూ విజయవంతం అవ్వగలరు.👉 ఇది చదివారా? ఈ టెక్ దిగ్గజంలో తొలగింపులు

యాంకర్ లైవ్ న్యూస్ చదువుతుండగా టీవీ ఛానెల్పై వైమానిక దాడి
తెహ్రాన్: ఇరాన్పై ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం కురిపిస్తోంది. తాజాగా ప్రభుత్వ మీడియా సంస్థను టార్గెట్ చేసింది. యాంకర్ న్యూస్ చదువుతుండగానే స్టూడియోపై క్షిపణితో దాడి చేసింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇరాన్లో ఇజ్రాయెల్ ఆర్మీ వైమానికంగా ఆధిపత్యం సంపాదించిందని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఆ ప్రకటన తర్వాత ఇరుదేశాల మధ్య వైరం తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో, ఇజ్రాయెల్ క్షిపణి ఓ ఇరాన్ ప్రభుత్వ టీవీ ఛానెల్పై దాడికి దిగింది. స్టూడియోలో యాంకర్ సహర్ ఇమామీ న్యూస్ బులిటెన్ చదువుతున్నారు. అదే సమయంలో ఇజ్రాయెల్ క్షిపణి ప్రయోగించడంతో టీవీ ఛానెల్ కార్యాలయం దద్దరిల్లింది. స్టూడియో కంపించడంతో యాంకర్ సహర్ ఇమామీ భయభ్రాంతులతో బయటకు పరుగులు తీశారు. ఇజ్రాయెల్, ఈ యుద్ధంలో తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించే దిశగా వేగంగా ముందుకు సాగుతున్నామని ప్రకటించింది. అయితే రెండు దేశాల్లోనూ ప్రజలు తీవ్ర భయాందోళనల మధ్య సురక్షిత స్థలాలకు పరుగెడుతున్నారు. ఈ ఘర్షణ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.Israeli Air Force bombed Iran’s State TV headquarters live on air !Moments before the strike, they issued a evacuation warnings also TV headquarters is now completely destroyed..it’s a massive hit on Tehran’s media narrative stronghold. pic.twitter.com/Pu8xiAFcyG— Major Surendra Poonia (@MajorPoonia) June 16, 2025

‘ఐపీఎల్ ఫ్లడ్లైట్లను హ్యాక్ చేశాం’
న్యూఢిల్లీ: భారత్లో ఏం జరిగినా అది తామే చేశామని పదే పదే చెప్పుకుంటూ మళ్లీ అభాసుపాలయ్యారు పాకిస్తాన్ రక్షణమంత్రి ఖవాజా అసిఫ్. గతంలో భారత రక్షణ వ్యవస్థలోని కీలక సమాచారాన్ని హ్యాక్ చేశామని చెప్పుకున్న ఖవాజా అసిఫ్.. ఈసారి ఐపీఎల్ మీద పడ్డారు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ ఎడిషన్లో ఫ్లడ్లైట్లను కూడా ఒకానొక సందర్భంలో హ్యాక్ చేశామని పాక్ అసెంబ్లీ(పార్లమెంట్) సాక్షిగా డబ్బా కొట్టుకున్నారు. మే 8వ తేదీన పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో భాగంగా ఫ్లడ్లైట్లను తమ దేశానికే చెందిన హ్యాకర్లు హ్యాక్ చేశారన్నారు. అసలు పాకిస్తాన్లో ఇంత టెక్నాలజీ ఉందా అనే భారతే ఆశ్చర్యపోతుందంటూ ఏదో చెప్పే యత్నం చేశారు. దీనిపై నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు. ‘మీరు హ్యాక్ చేయడానికి ఫ్లడ్లైట్లు ఏమీ వైఫై కనెక్షన్ మీద నడవలేదు. కట్టుదిట్టమైన ఎలక్రికల్ సిస్టమ్లో నడిచాయి. ఇప్పుడు పాకిస్తాన్లో సైబర్ సబ్జెక్ట్ఃను ఏమైనా ప్రవేశపెట్టారా? అని సెటైర్ వేయగా, ‘మీరు స్కూలింగ్ ఎక్కడ చదివారో.. సైన్స్ అండ్ టెక్నాలజీని భలే చెబుతున్నారు’ అంటూ మరో నెటిజన్ రిప్లై ఇచ్చాడు‘ఈసారి ఒక పని చేయండి.. ఫ్లడ్లైట్లను కాదు.. స్కోరు బోర్డును హ్యాక్ చేయండి’ అంటూ మరొక యూజర్ వ్యంగ్యంగా రాసుకొచ్చాడు. ఇలా పాకిస్తాన్ రక్షణమంత్రిపై సెటైర్ల వర్షం కురుస్తోంది. పాకిస్తాన్ రక్షణమంత్రి ఖవాజా అసిఫ్ ఇలా దొరికిపోవడం తొలిసారి కాదు.. గతంలో ఆపరేషన్ సింధూర్ సందర్భంగా తాము భారత్ జెట్ విమానాలను కూల్చివేశామని, దానికి సోషల్ మీడియానే సాక్షి అంటూ AI క్రియేట్ చేసిన వీడియోలు గురించి మాట్లాడారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి నోరెళ్ల బెట్టారు ఖవాజా అసిఫ్.Pakistan Defence Minister: Our Cyber warriors did Wonder during this War with India - We Switched off FLOOD LIGHTS during IPL Match pic.twitter.com/k4eMe0uCMA— Megh Updates 🚨™ (@MeghUpdates) June 14, 2025

మారుమూల గ్రామాల్లోని యువతకు టెక్ శిక్షణ.. నెక్స్ట్ వేవ్ & ఎన్ఎస్డిసి కృషితో కొత్త అధ్యాయం
ఉత్తరప్రదేశ్ బాగ్పత్ జిల్లాలోని ఛప్రాలి అనే గ్రామంలో యువతకు కొత్త భవిష్యత్తు చూపిస్తూ ఒక పెనుమార్చు తెచ్చే విద్యా కార్యక్రమం మొదలైంది. నెక్స్ట్ వేవ్, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NSDC) కలసి గ్రామీణ ఉత్తరప్రదేశ్లో టెక్ స్కిల్స్ నేర్పే ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించాయి. కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ అఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంట్రప్రైన్యూర్షిప్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో గ్రామీణ మహిళా యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.ఈ కార్యక్రమాన్ని చప్పాలిలోని చౌదరి చరణ్ సింగ్ ప్రభుత్వ మహావిద్యాలయంలో కేంద్ర మంత్రి శ్రీ జయంత్ చౌదరి గారు ప్రారంభించారు. అక్కడే “ఫ్యూచర్ స్కిల్ ల్యాబ్” పేరుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్కిల్ ఇండియా సెంటర్లో ఆధునిక టెక్నాలజీలపై ప్రాక్టికల్ శిక్షణ ఇస్తున్నారు. అక్కడి యువతలో మార్చు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అక్కడ జాయిన్ అయిన విద్యార్థుల్లో చాలా మంది కంప్యూటర్ ఎప్పుడూ వాడలేదు. మొదటి రోజు ల్యాప్ టాప్ ఆన్ చేయడం, కీబోర్డ్ ఎలా వాడాలో నేర్పించారు. ఇప్పుడు చూస్తే వారు వెబ్ యాప్స్ రూపొందించడం మొదలు పెట్టి టెక్ రంగంలో కెరీర్ దిశగా అడుగులు వేస్తున్నారు.ఇక్కడ గమనించాల్సిన ఒక గొప్ప విషయం ఈ విద్యార్థుల పరిస్థితులు. వీళ్లంతా రైతు కుటుంబాల నుంచి వచ్చారు. ఉదయం 4 గంటలకే లేచి ఇంటి పనులు, పొలంలో పనులు పూర్తి చేసి, 5నుంచి 10 కిలోమీటర్లు నడిచి స్కిల్ సెంటర్కు వస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు క్లాసులు అటెండ్ అవుతారు. తర్వాత మళ్లీ ఇంటికి వెళ్లి వంట పనులు, ఇల్లు చూసుకోవాలి. అయినా 4.0 టెక్నాలజీస్ ను పట్టుదలతో నేర్చుకుంటున్నారు.ఒకప్పుడు బిడియంగా ఉంటూ ఎవరితోనైనా మాట్లాడాలంటే ఇబ్బంది పడే స్వాతి ఖోకర్ ఇప్పుడు కెరీర్ వైపు ధైర్యంగా ముందుకు అడుగులేస్తోంది. తండ్రిని కోల్పోయిన తర్వాత కుటుంబ బాధ్యతను తన భుజాలపై వేసుకుంది. ప్రస్తుతం కోడింగ్ నేర్చుకుంటూ, తాను మాత్రమే కాదు, తన వయసు అమ్మాయిలందరికీ ఆదర్శంగా మారింది.నెక్స్ట్ వేవ్ సీఈవో రాహుల్ అత్తులూరి మాట్లాడుతూ, “లక్షలాది మంది విద్యార్థులకు టెక్నాలజీ స్కిల్స్ నేర్పించడమే మా లక్ష్యం. వాళ్లు చక్కగా స్కిల్స్ నేర్చుకుని, మంచి కెరీర్ నిర్మించుకోవాలి. తమ కుటుంబాలు, దేశానికి ఉపయోగపడేలా ఎదగాలి. ఈ రోజు టెక్నాలజీలకే కాదు, రేపటి భవిష్యత్తుకి కూడా సిద్ధంగా ఉండేలా మేము తయారుచేస్తున్నాం” అన్నారు.మొదట్లో వాళ్ళ పిల్లలు నేర్చుకోగలరా అని ఈ ప్రోగ్రాం పట్ల సందేహంగా ఉన్నతల్లిదండ్రులే ఇప్పుడు పెద్ద ఎత్తులో మద్దతు ఇస్తున్నారు. తమ పిల్లలు కోడ్ రాయటం, వెబ్ యాప్లు రూపొందించటం, నేర్చుకున్న విషయాల గురించి ధైర్యంగా మాట్లాడటం చూసి వాళ్ల నమ్మకాలే మారిపోయాయి. ఈ స్కిల్ సెంటర్ పై చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే తదుపరి బ్యాచ్లో చేర్చుకోమని 25 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.చౌదరి చరణ్ సింగ్ ప్రభుత్వ మహావిద్యాలయం ప్రిన్సిపాల్ డా. ప్రతీత్ దహియాకు ఇది ఒక పెద్ద లక్ష్యానికి మొదటి అడుగులాగా కనిపిస్తోంది. “ఈ కళాశాల భారత రత్న చౌదరి చరణ్ సింగ్ గారి పేరు మీద ఉంది,” అని చెప్పారు. “ఆయన ఎప్పుడూ దేశం అభివృద్ధి బాటలో సాగాలంటే అది గ్రామాల నుంచి జరగాలి” అని చెప్పేవారు. గ్రామీణ పిల్లలకు టెక్నాలజీ స్కిల్స్ ఉండాలన్నది ఆయన కల. ఇప్పుడు ఆ కల నిజమవుతుండడం ఆనందంగా ఉంది.”గ్రామీణ భారతంలో పాత పద్ధతుల విద్యపై ఆదరణ తగ్గుతూ, స్కిల్స్తో కూడిన ప్రాక్టికల్ లెర్నింగ్ పట్ల ఆసక్తి పెరుగుతోంది. ఆ మార్పునే ఈ ప్రోగ్రామ్ ప్రతిబింబిస్తోంది. నెక్స్ట్ వేవ్ లెర్నింగ్ ప్లాట్ ఫామ్ విద్యార్థులకు కోడింగ్ మాత్రమే కాకుండా, కమ్యూనికేషన్, టీం వర్క్, సమస్యల పరిష్కారం, ప్రాజెక్ట్ ప్రాక్టీస్ ఇలా ఇండస్ట్రీ కి అవసరమైన అనేక నైపుణ్యాలు నేర్పిస్తోంది. భాష సమస్యను ఎదుర్కొంటున్న విద్యార్థులకు మెంటర్లు ఏఐ టూల్స్ ద్వారా వర్ణాక్యులర్ సపోర్ట్ ఇవ్వడమూ ఓ పెద్ద ముందడుగు.కేవలం 6 నెలల్లోనే ముగ్గురు విద్యార్థులు ఉద్యోగాలు పొందడం వల్ల, గ్రామీణ యువతలో ఎంత వేగంగా టాలెంట్ వెలికి తీయవచ్చో స్పష్టమవుతోంది. మొదట్లో కేవలం 30 మంది విద్యార్థులతో ప్రారంభమైన ప్రోగ్రాం, ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాలనంతా తాకుతోంది. NSDC, స్థానిక నేతల మద్దతుతో నగరాల్లో మాత్రమే ఉండే అవకాశాల్ని గ్రామీణ యువతకు అందించేందుకు నెక్స్ట్ వేవ్ వేగంగా ముందుకెళ్తోంది. అవకాశం దరిచేరదు అనిపించిన గ్రామాల్లో ఇప్పుడు కొత్త ఉద్యమం మొదలైంది. ఈ కార్యక్రమం కేవలం శిక్షణ ఇవ్వడం మాత్రమే కాదు, విద్యార్థులలో, కుటుంబాల్లో, గ్రామీణ భారత్ భవిష్యత్తు నిర్మాణం చేయగలదు అన్న విశ్వాసాన్ని మళ్లీ చేకూర్చడం దీని అసలైన లక్ష్యం.NxtWave Institute of Advanced Technologiesకపిల్ కావురి హబ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ, తెలంగాణ, 500032

రవిచంద్రన్ అశ్విన్పై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు..
టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్లో దిండిగల్ డ్రాగన్స్కు సారథ్యం వహిస్తున్న అశ్విన్.. బాల్ ట్యాంపరింగ్ పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అశ్విన్ బంతి స్వరూపాన్ని మర్చేందుకు ప్రయత్నించాడని మధురై పాంథర్స్ జట్టు ఫిర్యాదు చేసింది.టీఎన్పీఎల్ 2025 సీజన్లో భాగంగా జూన్ 14న దిండిగల్ డ్రాగన్స్, మధురై పాంథర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో మధురైను 9 వికెట్ల తేడాతో దిండిగల్ ఓడించింది. ఈ మ్యాచ్లో అశ్విన్ బాల్ టాంపరింగ్ పాల్పడ్డారని మధురై పాంథర్స్ సీఈవో డి. పూజ టీఎన్పీఎల్ నిర్వాహకులకు లేఖ రాశారు."ఇటీవల దిండిగల్ డ్రాగ్సన్స్తో జరిగిన మ్యాచ్లో బాల్ ట్యాంపరింగ్ జరిగింది. ఈ మ్యాచ్లో అశ్విన్, అతడి సహచరులు రసాయనాల్లో ముంచిన టవళ్లతో బంతిని పదే పదే తుడిచారు. మేము అలా చేయవద్దని హెచ్చరించినప్పటికి మా మాట వినలేదు. అలా చేయడంతో బంతి బరువుగా మారింది. ట్యాంపరింగ్ కారణంగా బ్యాటర్ బంతిని కొట్టినప్పుడు లోహ ధ్వని విన్పించింది. ప్రస్తుతం ఇదే విషయంపై మా సాంకేతిక బృందం పనిచేస్తోంది. ఇందుకు సంబంధించిన ఆధారాలను టీఎన్పీఎల్కు సమర్పిస్తాము" అని లేఖలో పేర్కొంది.ఈ వివాదంపై టీఎన్పీఎల్ సీఈవో ప్రసన్న కన్నన్ స్పందించారు. "దిండిగల్ డ్రాగన్స్ బాల్ ట్యాంపరింగ్ చేసిందన్న ఫిర్యాదు మాకు అందింది. ఆ ఫిర్యాదును మేము స్వీకరించాము. వారు చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని కోరాము. ఆరోపణలలో ఏదైనా నిజం ఉందని అనిపిస్తే స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా తగిన ఆధారాలు లేకుండా ఓ ఆటగాడు లేదా ఏదైన ఫ్రాంఛైజీపై ఆరోపణలు చేయడం సరికాదు.మధురై సరైన ఆధారాలు అందించకపోతే ఆంక్షలను ఎదుర్కొక తప్పదు. ఈ టోర్నీలో ఏ ఫ్రాంచైజీ అయినా టీఎన్పీఎల్ అందించిన టవల్స్ను మాత్రమే ఉపయెగించి బంతి తడిని పోగట్టాలి. సిక్స్ కొట్టిన లేదా అవుట్ అయినా, ఓవర్ పూర్తి అయిన తర్వాత ప్రతీ సారి అంపైర్లు బంతిని చెక్ చేస్తారు. అయితే ఈమ్యాచ్ సమయంలో బంతిలో వారికి ఎటువంటి సమస్య కనిపించలేదని కన్నన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.చదవండి: IND vs ENG; 'అతడేమి తప్పు చేశాడని ఇంగ్లండ్ టూర్కు ఎంపిక చేయలేదు'

‘రేవంత్ నీ ఉడత ఊపులకు భయపడను’
సాక్షి,హైదరాబాద్: ఈ-కారు కేసు.. లొట్టపీసు కేసు. సీఎం రేవంత్ నీ ఉడత ఊపులకు భయపడను. దమ్ముంటే అసెంబ్లీ సాక్షిగా తీర్మానం పెట్టు. రేవంత్ జైలుకు వెళ్లాడు కాబట్టి మమ్మల్ని జైలుకి పెట్టాలనుకుంటున్నారు’ అంటూ కేటీఆర్ మండిపడ్డారు. ఫార్ములా ఈకార్ రేసు కేసులో ఇవాళ కేసీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది. విచారణ అనంతరం,తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘ఫార్ములా ఈ కార్ రేస్ ముమ్మాటికీ లొట్టపీసు కేసే. ఈయన లొట్టపీసు ముఖ్యమంత్రే. నాలుగు గోడల మధ్య కాదు, నాలుగు కోట్ల ప్రజల ముందు చర్చిద్దాం అని అసెంబ్లీలో చర్చ పెట్టుమని అడిగాను. ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో తెలిపొద్ది అని చెప్పాను. నువ్వు ముందుకు రా? నేను తప్పు చేయలేదు అని లై డిటెక్టర్ సిద్దం కావాలని డిమాండ్ చేశాను.కానీ రాలేదు.ఉదయం 10 గంటల నుంచి అడిగిందే అడుగుడు. అటు తిప్పి ఇటు తిప్పి అడుగుతున్నారు. ఫార్ములా ఈ రేస్ విషయంలో అవినీతి జరగలేదు. సీఎం రేవంత్ పంపిన పశ్నలే వీళ్లు అడుగుతున్నారు. వీళ్లకు పరిపాలన చేతకాదు. దద్దమ్మ రాజకీయంతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.తెలంగాణ సాధించిన నేత కేసీఆర్, హరీష్ రావును కూడా జైల్లో పెట్టాలని చూస్తున్నారు. అడ్డంగా నోట్ల కట్టలతో దొరికిన వ్యక్తి నెల రోజులు జైల్లో ఉన్నాడు. కాబట్టి మమ్మల్ని కూడా జైల్లో పెట్టాలని చూస్తున్నారు. చేయని తప్పుకు కేసిఆర్, హరీష్ రావును కాళేశ్వరం కేసులో జైల్లో పెట్టాలని చూస్తున్నాడు. నన్ను కూడా ఈ తుపెల్ కేసుతో జైల్లో పెట్టాలని చూస్తున్నారు. మా ఆర్ఎస్ ప్రవీణ్ కూడా తుపెల్ కేసు అన్నారు. నాపై 14 కేసులు పెట్టారు. 14000 కేసులు పెట్టుకో. ఎవ్వడు భయపడడు.అందరూ కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ను చిత్తు చిత్తుగా ఓడించాలి. ఈనెల 21న కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభించి ఆరేళ్లు సంబరాలు చేసుకుందాం. కాళేశ్వరం గొప్పతనం జనానికి చెప్పాలి’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు.

'తండ్రి నుంచి చాలా నేర్చుకుంటున్నారు'.. జయం రవి భార్య ఎమోషనల్ పోస్ట్!
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి పేరు గత కొద్దికాలంగా ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం తన భార్య ఆర్తితో విడాకులకు సిద్దమవడమే. గతేడాది సోషల్ మీడియా వేదికగా తాము విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత భార్య, భర్తలిద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం అప్పట్లో మరింత హాట్ టాపిక్గా మారింది. ఆ తర్వాత వీరి మధ్యలో సింగర్ కెన్నీషా పేరు రావడంతో విడాకుల వ్యవహారం కాస్తా వివాదానికి దారితీసింది. అంతేకాకుండా మూడో వ్యక్తి ప్రమేయం వల్లే తాము విడిపోతున్నామంటూ ఆర్తి ఆరోపించింది. ప్రస్తుతం విడాకుల పంచాయతీ మాత్రం కోర్టులో పెండింగ్లో ఉంది.అయితే ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా జయం రవి భార్య ఆర్తి చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. తన తండ్రి కృష్ణమూర్తి విజయ్కుమార్తో ఆమె కుమారులు సరదాగా ఆడుకుంటున్న వీడియోను పంచుకుంది. ఆయన తనకు ఎంత అండగా నిలిచారో నాకు మాత్రమే తెలుసన్నారు. ఎలాంటి షరతులు లేకుండా ప్రేమించడన్ని తన పిల్లలు కూడా ఆయన నుంచి నేర్చుకుంటారని రాసుకొచ్చింది. తనను మొదట ప్రేమించిన వ్యక్తి తన తండ్రేనని ఆర్తి ఎమోషనల్ పోస్ట్ చేసింది.ఆర్తి రవి తన తండ్రిన గురించి రాస్తూ.. 'తనను మొదట ప్రేమించిన వ్యక్తి నా తండ్రి. నన్ను మొదట ప్రేమించిన వ్యక్తి ప్రేమ ఇప్పటికీ అలాగే ఉంది. ఈ రోజు కొన్ని పదాలు వినడానికి మనసుకు చాలా బరువుగా ఉన్నాయి. కానీ వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తా. నా చుట్టూ చాలా అనిశ్చితిగా అనిపించినప్పుడు నేను ఎలా బయటపడాలో కూడా నాకు తెలియని రోజులు ఉన్నాయి. ఇప్పుడు మీరు నాతోనే ఉన్నారు.. కానీ ఏమి చేయాలో మీరు అడగలేదు. ప్రశాంతంగా, స్థిరంగా, బలంగా ఉన్నారు. తన తండ్రి ప్రేమను తాను తేలికగా తీసుకుంటున్నానని.. అయితే తన పిల్లలు మాత్రం ఆయన ప్రేమను చూసి చాలా నేర్చుకుంటున్నారు. షరతులు లేకుండా ప్రేమించబడటం ఎలా ఉంటుందో మిమ్మల్ని చూస్తే చాలు. మీరు నన్ను మాత్రమే కాదు.. నా పిల్లలను కూడా అలానే పెంచుతున్నారంటూ ' ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది.అంతేకాకుండా జీవితంలో తన అనుభవాలు తనను ఎలా మార్చాయో కూడా ఆర్తి ప్రస్తావించింది. జీవితంలో మళ్లీ తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నా.. ఇప్పుడు నేను మీ దృష్టిలో ఒకప్పుడు మీరు వదిలేసిన అమ్మాయిని కాదని నాకు తెలుసు. జీవితం నన్ను ఎవరూ ఊహించని విధంగా పరీక్షించింది. నేను వాగ్దానం చేస్తున్నా.. మళ్లీ మీ చిన్న అమ్మాయిగా తిరిగి వస్తా అంటూ పోస్ట్ చేసింది. కాగా.. దాదాపు 15 ఏళ్ల తర్వాత రవి తన భార్య ఆర్తి నుండి విడిపోతున్నట్లు గతేడాది ప్రకటించారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు సంతానం ఉన్నారు. View this post on Instagram A post shared by Aarti Ravi (@aarti.ravi)

విశ్వాస్ కుమార్ రమేష్ నిజంగా మృత్యుంజయుడే.. మరో వీడియోలో
గాంధీ నగర్: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృత్యుంజయుడిగా నిలిచిన ఏకైక వ్యక్తి విశ్వాస్ కుమార్ రమేష్కు చెందిన మరో వీడియో వైరల్గా మారింది. తాజాగా, వెలుగులోకి వచ్చిన వీడియోలో బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్ బిల్డింగ్ను ఎయిరిండియా విమానం ఢీకొట్టడంతో అగ్నికిలలు ఎగిసిపడున్నాయి. ఆ ప్రాంతాన్ని పొగ కమ్మేసింది. ఏదో అద్భుతం జరిగినట్లుగా అగ్నికోళం బద్దలైనప్పుడు మంటలు ఏ విధంగా ఎగిసిపడతాయో.. ఆ విధంగా మంటలు ఎగిసిపడుతున్నా 11ఏ సీటులో కూర్చున్న రమేష్, బీజే మెడికల్ కాలేజ్ క్యాంపస్ నుండి బయటకు వస్తూ కనిపిస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. అక్కడ ఉన్న ఒక వ్యక్తి అతన్ని గమనించి, అతని చెయ్యి పట్టుకుని ప్రమాదం స్థలం నుంచి దూరంగా తీసుకెళ్లాడు.ఏప్రిల్ 12న అహ్మదాబాద్లోని బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్ బిల్డింగ్ను ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్లైనర్ ఢీకొట్టింది. ఈపెను విషాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 242మందిలో మృత్యుంజయుడు ఒక్కడే సురక్షితంగా బయటపడ్డాడు.తాజా సమాచారం మేరకు ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మంది, మెడికల్ కాలేజీ క్యాంపస్ బాధితులతో కలుపుకొని మొత్తం 270 మంది మరణించినట్లు తెలుస్తోంది.ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడతో మృతదేహాల్ని గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయి. బాధితుల కుటుంబ సభ్యుల డీఎన్ఏల ఆధారంగా మృతదేహాల్ని గుర్తిస్తున్నారు. Unbelievable! New video of lone survivor, Viswashkumar Ramesh has emerged, showing him walking out from the crash site.He is seen wearing a white t-shirt and holding his phone in left hand.#AirIndia #AhmedabadPlaneCrash pic.twitter.com/xV83t2yjGX— Ishani K (@IshaniKrishnaa) June 16, 2025

Air India: ఇంక ముందుకు వెళ్లడం మంచిది కాదు!
సాక్షి, న్యూఢిల్లీ: మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది!. మార్గం మధ్యలో ఈ విషయాన్ని పసిగట్టిన పైలట్.. వెంటనే అప్రమత్తం అయ్యారు. విమానాన్ని గమ్యస్థానానికి తీసుకురాకుండానే వెనక్కి తీసుకెళ్లి హాంకాంగ్లోనే ల్యాండ్ చేశారు. దీంతో పెను ప్రమాదమే తప్పింది. ఢిల్లీకి చెందిన ఎయిరిండియా విమానం ఏఐ 315 బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ ప్రయాణికులతో(ఎంత మంది అనేది తెలియాల్సి ఉంది) ఈ ఉదయం హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరింది. అయితే 90 నిమిషాల ప్రయాణం తర్వాత.. విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్ గుర్తించారు. 🇮🇳🇭🇰🛫🛬🇭🇰Air India 315 requested to stay closer to Hong Kong citing technical reasons before deciding to return to HKIA."We don't want to continue further". 🔊 via https://t.co/E8ftHE3i9y📽️ via @flightradar24 https://t.co/XJjqSO9Lll pic.twitter.com/qWq3iXuVRW— Aaron Busch (@tripperhead) June 16, 2025ఇంకా ముందుకు వెళ్లడం కుదరదు అని చెబుతూ.. వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. చివరకు అక్కడే(హాంకాంగ్ ఎయిర్పోర్టులో) ల్యాండ్ చేశారు. విమానంలో హాంకాంగ్ నుంచి ఢిల్లీకి సుమారు 6గంటల ప్రయాణం పడుతుంది. పైలట్ మాటలకు సంబంధించిన ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. 🇮🇳 🇭🇰 🛫 🛬 🇭🇰 Air India 315 from Hong Kong to Delhi diverted back to Hong Kong after takeoff on Monday.The plane departed 3hrs and 26 minutes delayed, then returned to Hong Kong roughly an hour after takeoff. The flight was on a 7 year old Boeing 787-8 Dreamliner. pic.twitter.com/kTNvlcfMFV— Aaron Busch (@tripperhead) June 16, 2025ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం టెక్నికల్ టీం సమస్యను గుర్తించే పనిలో ఉంది. ఈ ఘటనపైగానీ, విమానాన్ని రీషెడ్యూల్ చేయడంపైనగానీ ఎయిరిండియా ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం భారత్లో ఎయిరిండియాతో పాటు ఇండిగో విమానయాన సంస్థ బోయింగ్ 787 విమానాలను ఉపయోగిస్తోంది. 2025 గణాంకాల ప్రకారం.. ఎయిరిండియా 33 డ్రీమ్లైనర్ విమానాల్ని ఉపయోగిస్తోంది. అయితే జూన్ 12న జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఎయిరిండియా విమానయాన సంస్థ వరుస ఘటనలతో వార్తల్లో నిలుస్తోంది. ఆ కంపెనీ బోయింగ్ డ్రీమ్లైనర్ విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు బయటపడుతున్నాయి. అలాగే బాంబు బూచీ నేపథ్యంలోనే పలు విమానాల రాకపోకల్లో అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యాలతో.. అన్ని బోయింగ్ విమానాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిర్ణయించింది.
యాంకర్ లైవ్ న్యూస్ చదువుతుండగా టీవీ ఛానెల్పై వైమానిక దాడి
ఆ హీరోతో పెళ్లి వార్తలు.. బొమ్మరిల్లు హీరోయిన్ రియాక్షన్!
ఇదిగో ఈ ఖర్చులే జేబులు ఖాళీ చేసేది!
టాలీవుడ్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం
పేర్నినానికి అరెస్టు వారెంట్ జారీ అంటూ తప్పుడు ప్రచారం..
ఇంగ్లండ్ టూర్కు ముంబై జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మాజీ మంత్రి హరీష్రావుకు అస్వస్థత
దిగ్వేష్ సింగ్ అద్భుతం.. ఐదు బంతుల్లో ఐదు వికెట్లు! వీడియో వైరల్
‘మరో పదేళ్లు కాంగ్రెస్దే అధికారం’
'నా తమ్ముడి మరణానికి కారణం అదే'.. రూమర్స్పై రాహుల్ దేవ్!
విమానం కూలిపోలేదు కావాలనే కూల్చేశారు!!
డ్యాన్స్ మాస్టర్ కోసం వెళ్లిన రోజా, మీనా, రంభ, దేవయాని (ఫోటోలు)
అఖిల్తో పెళ్లి క్యాన్సిల్.. శ్రీయ భూపాల్ ఎవరు? ఇప్పుడేం చేస్తోంది?
AI-171 విమానం నుంచి చివరి సందేశం ఇదే!
రామ్ చరణ్-ఉపాసన వెడ్డింగ్ యానివర్సరీ స్పెషల్ (ఫొటోలు)
‘స్కై లవ్స్ హర్’.. ఇక కనిపించదు.. ఎయిర్ హోస్టెస్ విషాదాంతం
నేనే రెండు కోట్లిస్తా.. నా తండ్రిని ప్రాణాలతో తెస్తారా?
ఏపీలో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి.. ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
‘తండ్రి’కి వందనం
కానీ.. ప్రపంచంలో ఎవరి మీద ఎవరు దాడి చేస్తున్నా చూస్తూ ఎంజాయ్ చేస్తాం అంతేగా సార్!
బీజేపీలోకి స్వప్న?
'కాంతార' చుట్టూ మరణాలు.. రిషబ్కు అర్చకుల సూచన
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 3.64% పెంపు
విజయవాడలో వెడ్డింగ్ రిసెప్షన్లో చరణ్ దంపతులు (ఫొటోలు)
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ విజేతగా సౌతాఫ్రికా..
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. ధనలాభం
తక్కువ మార్కులకే మంచి ర్యాంకులు
బతికుండగానే శ్మశానవాటికకు..
అమెరికా వ్యాప్తంగా ట్రంప్ వ్యతిరేక ప్రదర్శనలు
యాంకర్ లైవ్ న్యూస్ చదువుతుండగా టీవీ ఛానెల్పై వైమానిక దాడి
ఆ హీరోతో పెళ్లి వార్తలు.. బొమ్మరిల్లు హీరోయిన్ రియాక్షన్!
ఇదిగో ఈ ఖర్చులే జేబులు ఖాళీ చేసేది!
టాలీవుడ్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం
పేర్నినానికి అరెస్టు వారెంట్ జారీ అంటూ తప్పుడు ప్రచారం..
ఇంగ్లండ్ టూర్కు ముంబై జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మాజీ మంత్రి హరీష్రావుకు అస్వస్థత
దిగ్వేష్ సింగ్ అద్భుతం.. ఐదు బంతుల్లో ఐదు వికెట్లు! వీడియో వైరల్
‘మరో పదేళ్లు కాంగ్రెస్దే అధికారం’
'నా తమ్ముడి మరణానికి కారణం అదే'.. రూమర్స్పై రాహుల్ దేవ్!
విమానం కూలిపోలేదు కావాలనే కూల్చేశారు!!
అఖిల్తో పెళ్లి క్యాన్సిల్.. శ్రీయ భూపాల్ ఎవరు? ఇప్పుడేం చేస్తోంది?
AI-171 విమానం నుంచి చివరి సందేశం ఇదే!
‘స్కై లవ్స్ హర్’.. ఇక కనిపించదు.. ఎయిర్ హోస్టెస్ విషాదాంతం
నేనే రెండు కోట్లిస్తా.. నా తండ్రిని ప్రాణాలతో తెస్తారా?
‘తండ్రి’కి వందనం
కానీ.. ప్రపంచంలో ఎవరి మీద ఎవరు దాడి చేస్తున్నా చూస్తూ ఎంజాయ్ చేస్తాం అంతేగా సార్!
బీజేపీలోకి స్వప్న?
'కాంతార' చుట్టూ మరణాలు.. రిషబ్కు అర్చకుల సూచన
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 3.64% పెంపు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ విజేతగా సౌతాఫ్రికా..
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. ధనలాభం
తక్కువ మార్కులకే మంచి ర్యాంకులు
బతికుండగానే శ్మశానవాటికకు..
అమెరికా వ్యాప్తంగా ట్రంప్ వ్యతిరేక ప్రదర్శనలు
వివాదంలో డీఎస్పీ సతీమణి.. పార్టీ ఇలా కూడా చేసుకుంటారా?
వచ్చే ఎన్నికల్లో నేను.. నా కోడలు పోటీచేస్తాం
‘నాలుగు రోజులైంది.. నా భార్యను నాకు అప్పగించండి సార్’
WTC ఛాంపియన్ దక్షిణాఫ్రికాకు ప్రైజ్మనీ ఎన్ని కోట్లంటే?
సినిమా

'ఎప్పటికీ నయం కానీ గాయం'.. ఎయిరిండియా సిబ్బందిపై నటి ప్రశంసలు!
అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాదం తర్వాత బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత తొలిసారి ఎయిరిండియా ఫ్లైట్లో ప్రయాణిస్తున్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ విషాదం తర్వాత కూడా ప్రయాణికుల కోసం చిరునవ్వుతో పలకరిస్తున్న ఎయిరిండియా క్యాబిన్ సిబ్బందిపై ఆమె ప్రశంసలు కురిపించారు. విమాన ప్రమాదం తర్వాత సిబ్బంది, ప్రయాణీకులలో నెలకొన్న భయం, మానసిక స్థితి గురించి ప్రస్తావించింది.రవీనా ఇన్స్టాలో రాస్తూ.. 'కొన్ని ప్రారంభాలు అన్ని అడ్డంకులను తట్టుకుని నిలవాలి. ప్రస్తుతం ఎయిరిండియా సిబ్బంది బాధలో ఉన్నప్పటికీ కొత్త సంకల్పం కోసం చిరునవ్వులతో ప్రయాణికులను స్వాగతిస్తున్నారు. ప్రయాణీకులు, సిబ్బంది మధ్య ఏదో తెలియని బంధం ఏర్పరుచుకున్నారు. ఈ విషాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు సంతాపం. ఇది ఎప్పటికీ నయం కాని గాయం. కానీ ఎయిరిండియా ఎల్లప్పుడూ ఇలాంటి వాటిని అధిగమించి మళ్లీ బలంగా నిలబడాలనేదే వారి సంకల్పం' అంటూ ఫ్లైట్లో తాను దిగిన ఫోటోలను కూడా పంచుకుంది. బాధలోనూ తమ సంస్థ కోసం సిబ్బంది కష్టపడుతున్న తీరుపై రవీనా టాండన్ ప్రశంసలు కురిపించారు. కాగా.. జూన్ 12న జరిగిన విమాన ప్రమాదంలో 241 మంది మరణించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Raveena Tandon (@officialraveenatandon)

ఓటీటీలో క్రేజీ సిరీస్.. ఇప్పుడు రెండో సీజన్ రెడీ
ఇప్పుడంటే వెబ్ సిరీసుల హవా కాస్త తగ్గింది. లాక్ డౌన్ టైంలో మాత్రం పలు హిందీ సిరీసులు తెగ క్రేజ్ సొంతం చేసుకున్నాయి. వాటిలో ఒకటి 'స్పెషల్ ఓపీఎస్'. 2020 మార్చిలో తొలి సీజన్ రిలీజ్ కాగా.. మధ్యలో 1.5 పేరుతో ఓ నాలుగు ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. వ్యూయర్స్ని ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఐదేళ్ల విరామం తర్వాత రెండో సీజన్ని సిద్ధం చేశారు. స్ట్రీమింగ్ డేట్ ప్రకటించడంతో పాటు ట్రైలర్ని కూడా విడుదల చేశారు.(ఇదీ చదవండి: 'కన్నప్ప' చూసిన రజినీకాంత్.. విష్ణుతో ఏం చెప్పారంటే?)కేకే మేనన్, కరణ్ థాకర్, వినయ్ పాఠక్, విపుల్ గుప్త తదితరులు కీలక పాత్రలు పోషించిన తొలి సీజన్కి నీరజ్ పాండే, శివమ్ నాయర్ దర్శకత్వం వహించారు. స్పై యాక్షన్ జానర్లో దీన్ని తెరకెక్కించారు. ఇప్పుడు రెండో భాగానికి నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తూనే నిర్మాతగానూ వ్యవహరించారు. హిమ్మత్ సింగ్, అతని టీమ్ ఈసారి.. 'ఏఐ', 'సైబర్ క్రైమ్' నుంచి భారత్కు ఎదురయ్యే సవాళ్లతో పోరాటం చేయనుంది. అందుకు తగ్గట్లే ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉంది. సిరీస్పై అంచనాలు పెంచుతోంది. జూలై 11 నుంచి హాట్స్టార్లో సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.రెండో సీజన్ కోసం ఇప్పటికే ఉన్నవాళ్లతో పాటు కొత్తగా పలువురు నటీనటులు చేరారు. అందులో సయామీఖేర్, ప్రకాశ్ రాజ్ తదితరులు ఉన్నారు. గతంలో వచ్చిన వాటితో పోలిస్తే ఈసారి మరింత థ్రిల్ పంచేలా సిరీస్ని తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. ఇకపోతే ఈ వారం దాదాపు 22కి పైగా సినిమాలు-వెబ్ సిరీసులు పలు ఓటీటీల్లోకి రాబోతున్నాయి. వీటిలో స్ట్రెయిట్ తెలుగు మూవీస్ లేవు. కానీ పలు డబ్బింగ్, పరభాషా చిత్రాలు ఉండటం విశేషం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 22 సినిమాలు రిలీజ్)

Plane Crash: జీవితాల్ని నిలబెట్టిన విషాదం.. విడాకులు రద్దు
అహ్మదాబాద్ విమాన ప్రమాదం బాధిత కుటుంబాలను శోకసంద్రంలోకి నెట్టేసింది. జీవితం శాశ్వతం కాదని, మరణం ఎప్పుడు, ఎటువైపు నుంచి వస్తుందనేది చెప్పలేమని సమస్త ప్రజానీకానికి గుర్తు చేసింది. భూమిపై ఉన్నన్ని రోజులు గొడవలు తగ్గించి ప్రశాంతంగా, అయినవారితో సంతోషంగా గడపమని సందేశాన్ని పంపింది. విమాన ప్రమాదం అనే విషాదం కొందరి జీవితాల్లో మార్పు తెచ్చిందంటోంది సింగర్, నటి రాగేశ్వరి. విడాకులకు సిద్ధమైన వారు కూడా మనసు మార్చుకుని కలిసిపోయారని చెప్తోంది. సడన్గా ఎందుకీ మార్పు?మీకో విషయం తెలుసా? విమాన ప్రమాదం (Ahmedabad Air India Plane Crash) తర్వాత చాలామంది వారి కుటుంబాలకు ఫోన్ చేసి యోగక్షేమాలు అడుగుతున్నారు, కాసేపు మాట్లాడుతున్నారు. నాకు తెలిసిన రెండు జంటలు విడాకుల వరకు వెళ్లగా.. ఇప్పుడు కలిసిపోయారు. సడన్గా వారిద్దరి కుటుంబాలు అహంకారాన్ని పక్కనపెట్టేశాయి. సమస్యలను పరిష్కరించుకున్నారు. అకస్మాత్తుగా ఎందుకింత మార్పు వచ్చింది? విపత్తులు వచ్చినప్పుడే మనకు జీవితం విలువ తెలిసొస్తుందని సైకాలజిస్టులు అంటున్నారు.ప్రమాదాలే గుర్తు చేస్తాయిఎన్నో అపజయాలను చవిచూస్తే తప్ప విజయం అందదు. కొన్ని ఒడిదుడుకులను అధిగమిస్తే కానీ పైకి వెళ్లలేరు. ఇలాంటి విషాదాలు మనల్ని ఒక్కసారిగా ఆపేస్తాయి. జీవితంలో మనకు ఏది ముఖ్యమనేది గుర్తు చేస్తాయి. కాబట్టి ఇప్పుడైనా మీ కుటుంబానికి కాస్త సమయం కేటాయించండి. నువ్వెలాంటి బట్టలు వేసుకున్నావు? ఎలా కనిపిస్తున్నావు? ఏం మాట్లాడావు? అనేది జనాలు గుర్తుపెట్టుకోరు. కానీ ఎదుటివారితో ఎలా ప్రవర్తిస్తున్నావు? కుటుంబాన్ని ప్రేమించండివారిని ఎంత స్పెషల్గా చూస్తున్నావనేదే గుర్తుపెట్టుకుంటారు. మీ కుటుంబం ఎంత విలువైనదో గ్రహించండి. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. భూమిపై ఉన్నన్నాళ్లూ మనం పీల్చుకునే ఊపిరి, పొందే ప్రేమ మాత్రమే శాశ్వతం. కాబట్టి వీలైతే క్షమించండి, సున్నితంగా మాట్లాడండి, ప్రేమగా ఉండండి అని చెప్పుకొచ్చింది. రాగేశ్వరి లూంబ్.. ఆంఖెన్, మై ఖిలాడీ తు అనారీ, దిల్ కిత్నా నడాన్ హై వంటి పలు చిత్రాల్లో నటించింది. దునియా, ప్యార్ కా రంగ్, సచ్ కా సాత్ వంటి ఎన్నో పాటలు పాడింది.విమానయానం విషాదం..అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం జూన్ 12న మెడికల్ కాలేజీపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఓ వ్యక్తి తప్ప అందరూ సజీవ సమాధి అయ్యారు. అలాగే మెడికల్ కాలేజీ క్యాంటీన్లో భోజనం చేస్తున్న పలువురు మృతి చెందగా కొందరికి తీవ్రగాయాలయ్యాయి. View this post on Instagram A post shared by Raageshwari 🌏 (@raageshwariworld)చదవండి: ప్రభాస్.. ఇద్దరు హీరోయిన్లు కావాలన్నాడు: మారుతి

వాట్సాప్ వాడని డైరెక్టర్.. రాజమౌళి ప్రశంసలు!
టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ప్రస్తుతం కుబేరా మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. కోలీవుడ్ స్టార్ ధనుశ్, అక్కినేని నాగార్జున కీలక పాత్రల్లో తెరెకెక్కించిన ఈ సినిమా జూన్ 20న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శేఖర కమ్ములపై ప్రశంసలు కురిపించారు.తాను నమ్మే సిద్ధాంతాలకు.. చేసే సినిమాలకు ఎలాంటి సంబంధం ఉండదని రాజమౌళి అన్నారు. కానీ శేఖర్ కమ్ముల తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తారని తెలిపారు. శేఖర్ చాలా సాప్ట్గా ఉంటారని.. తన సిద్ధాంతాలకు ఏది అడ్డొచ్చినా కొంచెం కూడా ఆయన కాంప్రమైజ్ అవ్వరని వెల్లడించారు. తాను నమ్మినా సిద్ధాంతాలపైనే సినిమాలు తీస్తారని... అందుకే ఆయనంటే ఎంతో గౌరవమని కొనియాడారు. మీరు వాట్సాప్ వాడుతారా అని శేఖర్ కమ్ములను రాజమౌళి అడగ్గా.. తాను ఉపయోగించనని ఆయన సమాధానమిస్తారు.ఈ కార్యక్రమంలో కుబేర ట్రైలర్ను కూడా రాజమౌళి విడుదల చేశారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మించారు.
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

రుతురాజ్ గైక్వాడ్తో కలిసి ఆడనున్న పాక్ ఓపెనర్..
పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్ 2025-26లో యార్క్షైర్ క్రికెట్ క్లబ్ తరపున రెండు మ్యాచ్లు ఆడేందుకు షఫీక్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. అదేవిధంగా వైటాలిటీ టీ20 బ్లాస్ట్లో కూడా యార్క్షైర్ తరపున నాలుగు మ్యాచ్లు ఆడనున్నాడు.ఈ విషయాన్ని షఫీక్ ధ్రువీకరించాడు. "యార్క్షైర్ క్రికెట్ క్లబ్తో ఒప్పందం కుదుర్చుకువడం చాలా సంతోషంగా ఉంది. నాటింగ్హామ్షైర్తో జరిగే బిగ్ మ్యాచ్కు ముందు యార్క్షైర్ జట్టులో చేరేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నాను. హెడింగ్లీ వంటి అద్బతమైన వాతవారణం ఉన్న మైదానంలో ఆడేందుకు ఎల్లప్పుడూ నేను ఇష్టపడతాను. నాకు ఈ అవకాశం కల్పించిన యార్క్షైర్కు ధన్యవాదాలు" అని షఫీక్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.కాగా ఇదే యార్క్షైర్ క్రికెట్ క్లబ్కు టీమిండియా ఓపెనర్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ప్రాతినిథ్యం వహించనున్నాడు. రాబోయే కౌంటీ సీజన్లో గైక్వాడ్, షఫీక్ కలిసి ఒకే జట్టుకు ఆడనున్నారు. కాగా షఫీక్ 2021లో బంగ్లాదేశ్పై తన టెస్టు కెరీర్ను ఘనంగా ఆరంభించాడు. తన డెబ్యూ టెస్టులో రెండు ఇన్నింగ్స్లోనూ హాఫ్ సెంచరీలు చేసి ఆకట్టకున్నాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా, శ్రీలంకలపై కూడా మెరుగైన ప్రదర్శన చేశాడు. కానీ 2024లో మాత్రం ఈ పాక్ ఓపెనర్ పేలవ ఫామ్తో సతమతమయ్యాడు. గతేడాది 6 టెస్టులు ఆడి కేవలం 178 పరుగులు చేశాడు. ఈ క్రమంలో తన ఫామ్ను తిరిగి అందుకునేందుకు యార్క్షైర్తో జతకట్టాడు. ఓవరాల్గా తన టెస్టు కెరీర్లో షఫీక్.. 1504 పరుగులు చేశాడు.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్తో తొలి టెస్టు.. టీమిండియాకు గుడ్ న్యూస్

రేపటి నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కొత్త సైకిల్ ప్రారంభం
డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్ గత శనివారం జరిగిన ఫైనల్తో ముగిసింది. తుది పోరులో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను మట్టికరిపించి ఛాంపియన్గా అవతరించింది. తద్వారా డబ్ల్యూటీసీ ప్రారంభమైన సీజన్ నుంచి వరుసగా మూడు సీజన్లలో మూడు కొత్త ఛాంపియన్ జట్లు అవతరించినట్లైంది.అరంగేట్రం ఎడిషన్ ఫైనల్లో (2019-21) న్యూజిలాండ్ భారత్ను ఓడించి విజేతగా నిలిచింది. రెండో ఎడిషన్ ఫైనల్లో (2021-23) ఆస్ట్రేలియా భారత్ను ఓడించి విజేతగా అవతరించింది. తాజాగా జరిగిన మూడో ఎడిషన్లో (2023-25) సౌతాఫ్రికా ఆసీస్ను చిత్తు చేసి టెస్ట్ ఛాంపియన్షిప్ను చేజిక్కించుకుంది. తొలి రెండు ఎడిషన్లలో ఫైనల్స్కు చేరిన భారత్ తాజాగా ముగిసిన సీజన్లో మూడో స్థానంతో సరిపెట్టుకుంది.రేపటి నుంచి కొత్త సైకిల్ ప్రారంభంవరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కొత్త సైకిల్ (2025-27) రేపటి నుంచి (జూన్ 17) జరుగబోయే శ్రీలంక, బంగ్లాదేశ్ సిరీస్తో ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో శ్రీలంక బంగ్లాదేశ్కు రెండు టెస్ట్లకు ఆతిథ్యమివ్వనుంది. తొలి టెస్ట్ జూన్ 17 నుంచి 21 వరకు గాలే వేదికగా జరుగనుంది. రెండో టెస్ట్ జూన్ 25 నుంచి 29 వరకు కొలొంబోలో జరుగనుంది.ఈ మధ్యలోనే భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కూడా ప్రారంభం కానుంది. జూన్ 20 నుంచి ఇరు జట్ల మధ్య హెడింగ్లేలో తొలి మ్యాచ్ జరుగనుంది.ఈ సైకిల్లో మొత్తం 71 మ్యాచ్లు2025-27 డబ్ల్యూటీసీ ఎడిషన్లో మొత్తం 71 మ్యాచ్లు (9 జట్ల మధ్య) జరుగనున్నాయి. ఇందులో తాజా ఎడిషన్ రన్నరప్ ఆస్ట్రేలియా అత్యధికంగా 22 మ్యాచ్లు ఆడనుంది. ఆసీస్ తర్వాత ఇంగ్లండ్ (21) రెండో అత్యధిక మ్యాచ్లు ఆడుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్ సౌతాఫ్రికా రానున్న ఎడిషన్లో కేవలం 14 మ్యాచ్లు ఆడుతుంది. భారత్ 18, న్యూజిలాండ్ 16, వెస్టిండీస్ 14, పాకిస్తాన్ 13, బంగ్లాదేశ్, శ్రీలంక తలో 12 మ్యాచ్లు ఆడనున్నాయి. ఈ సైకిల్లో భారత్ ఆడబోయే మ్యాచ్లు..స్వదేశంలోవెస్టిండీస్తో (2)సౌతాఫ్రికాతో (2)ఆస్ట్రేలియాతో (5)ప్రత్యర్ధి దేశంలోఇంగ్లండ్తో (5)శ్రీలంకతో (2)న్యూజిలాండ్తో (2)

ఇంగ్లండ్తో తొలి టెస్టు.. టీమిండియాకు గుడ్ న్యూస్
లీడ్స్ వేదికగా జూన్ 20న ఇంగ్లండ్తో ప్రారంభం కానున్న తొలి టెస్టుకు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా స్వదేశానికి వచ్చేసిన హెడ్ కోచ్ గౌతం గంభీర్.. తిరిగి మంగళవారం భారత జట్టుతో కలవనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏఎన్ఐ వర్గాల సమాచారం ప్రకారం.. గంభీర్ సోమవారం(జూన్ 16) లండన్కు బయలుదేరినట్లు తెలుస్తోంది. కాగా ఈ సిరీస్ కోసం గంభీర్ జూన్ 5న భారత జట్టుతో పాటు ఇంగ్లండ్కు పయనమయ్యాడు. అతడి నేతృత్వంలో భారత జట్టు నాలుగు రోజుల ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గోంది.అయితే తన తల్లి గుండెపోటుతో అస్పత్రిలో చేరడంతో గౌతీ ఉన్నపళంగా జూన్ 11న స్వదేశానికి వచ్చేశాడు. ఇప్పుడు అతడి తల్లి ఆరోగ్యం మెరుగుపడడంతో గంభీర్ తిరిగి ఇంగ్లండ్కు పయనమైనట్లు తెలుస్తోంది. ఇక గంభీర్ లేకపోవడంతో భారత జట్టు తమ ప్రాక్టీస్ను బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వీవీయస్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో కొనసాగించింది.క్రిక్ బజ్రిపోర్ట్స్ ప్రకారం.. టీమిండియా సన్నాహాలను లక్ష్మణ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. లక్ష్మణ్ భారత జట్టుతో కాకుండా తన వ్యక్తిగత పనుల మీద ఇంగ్లండ్కు వెళ్లాడు. కానీ గంభీర్ ఉన్నపళంగా స్వదేశానికి వెళ్లిపోవడంతో లక్ష్మణ్ లౌసాన్ నుండి లండన్కు వచ్చినట్లు క్రిక్బజ్ తమ రిపోర్ట్లో పేర్కొంది.ఇక తొలి టెస్టుకు గిల్ సారథ్యంలోని భారత జట్టు అన్నివిధాల సిద్దమైంది. ఈ టెస్టుకు ముందు ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్లో భారత సీనియర్, భారత-ఎ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో రాహుల్, గిల్, శార్ధూల్ ఠాకూర్ వంటి మెరుగ్గా రాణించారు. కాగా ఈ సిరీస్ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27లో భాగంగా జరగనుంది.ఇంగ్లండ్తో సిరీస్కు భారత జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్,వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, శార్దూల్ సింగ్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, ప్రసిధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్చదవండి: IND vs ENG: ఇంగ్లండ్తో తొలి టెస్టుకు భారత జట్టు ఇదే! యువ సంచలనానికి నో ఛాన్స్?

వన్డే వరల్డ్కప్ ఫిక్చర్స్ విడుదల.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే..?
మహిళల వన్డే వరల్డ్కప్ ఫిక్చర్స్ను ఐసీసీ ఇవాళ (జూన్ 16) విడుదల చేసింది. ఈ మెగా టోర్నీ ఈ ఏడాది సెప్టెంబర్ 30-నవంబర్ 2 మధ్యలో భారత్, శ్రీలంక వేదికగా జరుగనుంది. ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్లో జరుగనుంది. ఈ టోర్నీలో పాకిస్తాన్, శ్రీలంక ఆడే మ్యాచ్లకు శ్రీలంక ఆతిథ్యమివ్వనుంది. భారత్-శ్రీలంక మ్యాచ్ మాత్రం భారత్లోనే జరుగనుంది.టోర్నీ ఆరంభ మ్యాచ్లో (సెప్టెంబర్ 30) టీమిండియా శ్రీలంకతో బెంగళూరు వేదికగా తలపడనుంది. అక్టోబర్ 29న తొలి సెమీఫైనల్ (గౌహతి లేదా కొలొంబో (పాక్ క్వాలిఫై అయితే)), 30న రెండో సెమీఫైనల్ (బెంగళూరు) జరుగనున్నాయి. నవంబర్ 2న ఫైనల్ (బెంగళూరు లేదా కొలొంబో) జరుగుతుంది. మహిళల వన్డే వరల్డ్కప్ 12 ఏళ్ల తర్వాత భారత్లో జరుగుతుంది.భారత్లోని చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు), ఏసీఏ స్టేడియం (గౌహతి), హోల్కర్ స్టేడియం (ఇండోర్), ఏసీఏ-వీడిసీఏ స్టేడియంలో (విశాఖపట్నం) మ్యాచ్లు జరుగుతాయి. శ్రీలంకలో ప్రేమదాస స్టేడియంలో (కొలంబో) మ్యాచ్లు జరుగుతాయి.ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు (భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్) పాల్గొంటాయి. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుంది. 2022లో న్యూజిలాండ్లో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా ఇంగ్లండ్ను ఓడించి ఏడోసారి ఛాంపియన్గా అవతరించింది. ఈ టోర్నీలో అత్యంత విజయంవంతమైన జట్టు ఆస్ట్రేలియానే.పాకిస్తాన్ మ్యాచ్లు కొలొంబోలో ఎందుకు..?ఈ టోర్నీలో పాకిస్తాన్ ఆడే మ్యాచ్లు కొలొంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగనున్నాయి. పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సమయంలో జరిగిన ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ భారత్లో పర్యటించదు. ఆ టోర్నీ పాకిస్తాన్లో జరగాల్సి ఉండగా.. భద్రతా కారణాల రిత్యా టీమిండియా ఆ దేశంలో అడుగుపెట్టలేదు.భారత్ ఆడాల్సిన మ్యాచ్లు హైబ్రిడ్ పద్దతి ప్రకారం దుబాయ్లో జరిగాయి. వరల్డ్కప్ మ్యాచ్ల కోసం పాకిస్తాన్ కూడా భారత్లో ఆడదని అప్పుడే ఒప్పందం చేసుకున్నారు.🚨 SCHEDULE OF WOMEN's ODI WORLD CUP 2025 🚨 pic.twitter.com/n1nB6iYi14— Johns. (@CricCrazyJohns) June 16, 2025భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే..?ఈ మెగా టోర్నీలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 5న కొలొంబోలో జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. గ్రూప్ దశతో భారత్ మొత్తం ఆరు మ్యాచ్లు ఆడనుంది. దాని షెడ్యూల్ కింది విధంగా ఉంది.మంగళవారం, సెప్టెంబర్ 30—భారత్ vs శ్రీలంక—బెంగళూరు—మధ్యాహ్నం 3ఆదివారం, అక్టోబర్ 5—భారత్ vs పాకిస్తాన్—కొలంబో—మధ్యాహ్నం 3గురువారం, అక్టోబర్ 9—భారత్ vs దక్షిణాఫ్రికా—వైజాగ్—మధ్యాహ్నం 3ఆదివారం, అక్టోబర్ 19—భారత్ vs ఇంగ్లాండ్—ఇండోర్—మధ్యాహ్నం 3గురువారం, అక్టోబర్ 23—భారత్ vs న్యూజిలాండ్—గౌహతి—మధ్యాహ్నం 3ఆదివారం, అక్టోబర్ 26—భారత్ vs బంగ్లాదేశ్—బెంగళూరు—మధ్యాహ్నం 3
బిజినెస్

యువతకు బెస్ట్ పెట్టుబడి మార్గాలు
పెట్టుబడి విషయానికి వస్తే యువతకు, వయసుపైబడిన వారికి మధ్య ఉన్న తేడా ఇన్వెస్మెంట్లను ముందుగా ప్రారంభించడం. యువతకు దీర్ఘకాలంలో ఇది ఎంతో కలిసొస్తుంది. 40-45 ఏళ్లు దాటిన వారితో సమానంగా యువత ఏదైనా పథకంలో పెట్టుబడి పెట్టి ఒకే సమయంలో ఉపసంహరించుకుంటే కచ్చితంగా యువతకు ఎంతో లాభం చేకూరుతుంది. అయితే ఎలాంటి పథకాల్లో పెట్టుబడి ప్రారంభించాలో స్పష్టత ఉండడంలేదు. యువకులు క్రమశిక్షణతో, ఆర్థిక నిపుణుల సలహాతో మంచి పథకంలో పెట్టుబడి ప్రారంభిస్తే ఆకర్షణీయ రాబడిని అందుకోవచ్చు. మార్కెట్లోని కొన్ని పథకాల గురించి తెలుసుకుందాం.పొదుపు ఖాతాలు, డిపాజిట్ సర్టిఫికెట్లు (సీడీలు)పొదుపు ఖాతా అనేది డబ్బును నిర్వహించేందుకు సరళమైన, అత్యంత రిస్క్ లేని మార్గం. అయితే ఇందులో వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ ఈ ఖాతాలు సురక్షితమైనవి. మరోవైపు సీడీలు మీ డబ్బును నిర్ణీత కాలానికి (6 నెలలు లేదా ఒక సంవత్సరం) లాక్ చేస్తాయి. అందుకు కొంత అధిక మొత్తంలో రాబడిని అందిస్తాయి.స్టాక్ మార్కెట్స్టాక్స్లో పెట్టుబడి పెట్టడం ఆకర్షణీయంగా, ఆసక్తికరంగా ఉంటుంది. మంచి కంపెనీని ఎంచుకొని పెట్టుబడి కొనసాగిస్తే కాలక్రమేణా అధిక రాబడిని అందించగలవు. అయితే ఇవి అస్థిరంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. వీటిలో రిస్క్ అధికంగా ఉంటుందని మరిచిపోకూడదు.ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్), మ్యూచువల్ ఫండ్స్ఈటీఎఫ్లు, మ్యూచువల్ ఫండ్ స్టాక్స్లో నిర్ణీత షార్ట్టర్మ్లో ఒడిదొడుకులు ఉన్నప్పటికీ లాంగ్టర్మ్లో మంచి రాబడిని అందిస్తాయి. అయితే ఇందుకు పెట్టుబడులను కొనసాగించాల్సి ఉంటుంది. ఈటీఎఫ్లు(కొన్ని స్టాక్స్ కలిపి ఉన్న ఫండ్) మార్కెట్లో నేరుగా లైవ్లో ట్రేడవుతాయి. మ్యూచువల్ ఫండ్స్ కూడా సెక్టార్ వారీగా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి. వాటిని నిత్యం ఫండ్ మేనేజర్ నిర్వహిస్తుంటారు.బాండ్స్బాండ్లు అంటే కాలానుగుణ వడ్డీ చెల్లింపుల కోసం కంపెనీలు లేదా ప్రభుత్వాలకు ఇచ్చే రుణాలు. ఇవి స్టాక్స్ కంటే సురక్షితమైనవి. కానీ, తక్కువ రాబడిని అందిస్తాయి.రియల్ ఎస్టేట్ (ఆర్ఈఐటీ)రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు (ఆర్ఈఐటీలు) యువ పెట్టుబడిదారులను భౌతిక ఆస్తిని కొనుగోలు చేయకుండానే రియల్ ఎస్టేట్ పెట్టుబడుల నుంచి డివిడెండ్ సంపాదించడానికి వీలు కల్పిస్తాయి. వీటిని చాలా బ్రోకరేజీ ఖాతాల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోను వైవిధ్యపరచడానికి ఇది మంచి మార్గాన్ని అందిస్తుంది.ఇదీ చదవండి: హోర్ముజ్ జలసంధి మూసివేత..?విద్య, నైపుణ్యాలువిద్య, సర్టిఫికేషన్లు లేదా అధిక ఆదాయాన్ని సమకూర్చే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం (కోడింగ్, డిజైన్ వంటివి) కోసం పెట్టుబడి పెట్టడం అన్నింటికంటే మంచి ఇన్వెస్ట్మెంట్. దీన్ని ఎంత త్వరగా ప్రారంభిస్తే కెరియర్లో అంత ప్రయోజనం పొందుతారు.

ఉద్యోగాల కోతకు ఏఐ సాకు!
కృత్రిమమేధకు ఆదరణ పెరుగుతున్న కొద్దీ సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో గుబులు అధికమవుతోంది. తమ ఉద్యోగాల స్థానంలో ఏఐ పాగా వేస్తుందని చాలామంది జంకుతున్నారు. ఇదే అదనుగా కొన్ని కంపెనీలు కాస్ట్ కటింగ్, పునర్వ్యవస్థీకరణ పేరుతో ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. సాఫ్ట్వేర్ డెవలపర్ల స్థానాన్ని ఏఐ భర్తీ చేస్తుందని చెబుతూ కొన్ని కంపెనీల వ్యవస్థాపకులు, సీఈఓలు తమ మోడళ్ల అమ్మకాలను పెంచుకోవడానికి ఎక్కువగా ప్రచారం చేస్తున్నట్లు ఏఐ కోడింగ్ ప్లాట్ఫామ్ విండ్సర్ఫ్ వ్యవస్థాపక బృందం సభ్యుడు అన్షుల్ రామచంద్రన్ తెలిపారు.‘ఏఐ ప్రభావం పెరుగుతోందని చెబుతున్నవారిలో చాలా మంది ఎలాగైనా కొందరు ఉద్యోగులను తొలగించాలని కోరుకుంటున్నారు. అందుకు ఏఐను సాకుగా వాడుతున్నారు. ఇలాంటి వ్యక్తుల్లో కొందరు సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ కోసం ప్రత్యేకంగా ఏఐ నమూనాలను రూపొందిస్తున్నారు. మరిన్ని మోడళ్లను విక్రయించడానికి ఇది వ్యాపార వ్యూహంగా పని చేస్తుంది. డెవలపర్ అడాప్షన్, ఎంటర్ప్రైజ్ పార్ట్నర్షిప్ పరంగా అమెరికా తర్వాత భారత్ రెండో అతిపెద్ద మార్కెట్గా అవతరిస్తోంది. భారత్లో 1.7 కోట్ల మంది డెవలపర్లు ఉన్నారు’ అని చెప్పారు.ఇదీ చదవండి: హోర్ముజ్ జలసంధి మూసివేత..?‘వాస్తవంగా కృత్రిమ మేధను అందిపుచ్చుకోవడానికి భారత్కు సరిపడా శక్తి ఉంది. భారత్లో జీపీయూ క్లస్టర్లను నిర్మించడంపై చురుగ్గా ముందుకెళ్తున్నాం. ఇప్పటికే భారత్లోని ప్రముఖ ఐటీ కంపెనీలతో వివిధ స్థాయిల్లో కలిసి పనిచేస్తున్నాం. ఇండియన్ ఐటీ కంపెనీలు తమ అంతర్జాతీయ సహచరుల కంటే వేగంగా కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నాయి. అయితే ఈ కంపెనీలు ఇప్పటికే టెక్నాలజీని వివిధ విభాగాల్లో వైవిధ్యపరిచాయి’ అని రామచంద్రన్ తెలిపారు.

కోతల రాయుళ్లకు వాతలు తప్పవు!
ఐటీఆర్ 1, ఐటీఆర్ 4లలో కొన్ని మార్పులు చేశారు. ఈ మార్పులన్నీ మీరు ఐటీఆర్ దాఖలు చేసే 2024–25 ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తాయి. ఈ మార్పుల ప్రకారం క్లెయిం చేసే ప్రతి డిడక్షన్కి సంబంధించిన పూర్తి వివరాలు అప్లోడ్ చేయాలి. ఇన్నాళ్లు డిడక్షన్ ఎంతో రాసిస్తే వదిలేసేవారు. ఇక నుంచి పూర్తి వివరాలు ఇవ్వాల్సిందే. దీని ప్రకారం ఒక్కొక్క డిడక్షన్, దానికి సంబంధించిన కాగితాలు/వివరాలు ఏమిటో తెలుసుకుందాం. మీ దగ్గర పూర్తి వివరాలు లేనిదే ఫారం నింపలేరు. ఇంటి అద్దె అలవెన్సు.. బేసిక్ జీతం. ఇంటి అద్దె అలవెన్సు ఎంత చేతికి వచ్చింది. మీరు అద్దె ఎంత చెల్లించారు. అద్దె ఎవరికి ఇచ్చారు. ఎలా ఇచ్చారు. అంటే నగదా..? బ్యాంకు ద్వారానా..? రశీదులు మొదలైనవి.80 సీ.. ఇంతకుముందే తెలుసుకున్నాము. ఈ సెక్షన్ క్రింద ఎన్నో అంశాలున్నాయి. ముఖ్యంగా పాలసీ నెంబరు చెప్పాలి. అలాగే మిగతా ఇన్వెస్ట్మెంట్లకు, డాక్యుమెంటు ఐడెంటిఫికేషన్ నెంబరు రాయాలి. మిగతా వాటి గురించి ఇక్కడ ప్రస్తావించలేదు కానీ క్లెయిం చేసే ముందు కాగితాలు సిద్ధంగా పెట్టుకోవాలి. చెల్లింపు తేదీలు, అది ఏ సంవత్సరానికి సంబంధించినదో చాలా ముఖ్యం. ఈ సెక్షన్లో డిడక్షన్లు చెల్లింపు జరిగిన సంవత్సరంలోనే బెనిఫిట్ ఇస్తారు.80 డీ.. ఇది మెడికల్ ఇన్సూరెన్స్కి సంబంధించినది. ఇన్సూరెన్స్ కంపెనీ పేరు, పాలసీ నెంబరు వివరాలు ఇవ్వాలి. 80 ఈ... ఇది విద్యా రుణానికి సంబంధించినది. ఏ బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారు..? లోన్ అకౌంటు నెంబరు.., మంజూరు తేది .. ఎంత రుణం తీసుకున్నారు.. ఇంకా ఎంత రుణం చెల్లించాలి .. ఇలా వివరాలన్నీ తెలియపరచాలి. 80 ఈఈ... ఇంటి కోసం రుణం తీసుకుంటే కొన్ని షరతులకు లోబడి రూ.50,000 డిడక్షన్ ఇస్తారు. ఈ రుణానికి సంబంధించి బ్యాంకు, లోన్ అకౌంటు నెంబరు, మంజూరు లెటర్ తేదీ, ఎంత రుణం తీసుకున్నారు..? ఇంకా ఎంత రుణం మిగిలి ఉంది. ఇవన్నీ వివరాలు చెప్పాలి. 80 ఈఈబీ... ఇది ఎలక్ట్రిక్ వెహికల్ లోన్కి సంబంధించినది. బ్యాంకు పేరు ఏమిటి..? లోన్ అకౌంటు నెంబరు, లోన్ ఎంత, వెహికల్ రిజి్రస్టేషన్ నెంబరు, లోన్ మొత్తం ఎంత..? మొదలైన వివరాలు ఇవ్వాలి.80 డీడీబీ... ఇది కొన్ని నిర్దేశిత జబ్బుల ట్రీట్మెంట్కి సంబంధించినది. ఆ నిర్దేశిత జాబితాలోంచి ఏ జబ్బు వచ్చింది? దానికైన ఖర్చు.., హాస్పిటల్కి చెల్లించిన మొత్తం ఎంత? తదితర పూర్తి వివరాలు తెలిపాలి. ఈ మార్పులతో అన్ని విషయాలు సేకరిస్తున్నారన్నమాట. ఒకప్పుడు మన మీద అభిమానం, నమ్మకం, మంచి విశ్వాసంతో మొత్తాన్ని తెలియజేయమనేవారు. దీనిని ఆసరా తీసుకుని అన్ని సెక్షన్ల ప్రకారం అర్హత ఉన్నంత క్లెయిమ్ల కోసం జనాలు ఎగబడుతున్నారు. అద్దె ఇంట్లో లేకుండా అద్దె క్లెయిమ్ చేసే ఉద్యోగస్తులు ఎందరో ఉన్నారు. భార్యభర్తలు ఒకే ఇంట్లో ఉంటూ ఇద్దరూ విడిగా వారి వారి అస్సెస్మెంట్లలో హెచ్ఆర్ఏ క్లెయింలు చేసే ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్స్’ ఎంతోమంది ఉన్నారు. ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప ఊరట.. తులం ఎంతంటే..ఒక్క హెచ్ఆర్ఏ విషయంలోనే డిపార్ట్మెంట్ వారు విశ్వరూపాన్ని ప్రదర్శిస్తే కొంప కొల్లేరు అయిపోతుంది. అలాగే దొంగ స్కూల్ ఫీజుల రశీదులు .. పిల్లలు లేని వారు కూడా దొంగ రశీదులు పెడుతున్నారు. జీవిత బీమా చెల్లించకపోయినా ప్రీమియంలు చెల్లించినట్లు రాయడం, లేని చెల్లింపులు, లేని ఇన్వెస్ట్మెంట్లు, లేని అంగవైకల్యం దొంగ పత్రాలు సృష్టించి తద్వారా క్లెయిమ్లు పొందడం లాంటివి చేసేవారున్నారు. డిపార్ట్మెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉందని తిట్టి, ప్రచారం చేసి డిపార్ట్మెంట్ వారి మీద అపవాదాలు వేసి, పిడివాదన చేసి, వాదనలు, ప్రతివాదనలు చేసి, పన్నుభారం తగ్గించుకునే కోతరాయుళ్లకి వాతలు తప్పవు.కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్యట్యాక్సేషన్ నిపుణులు

బంగారం ధరల్లో స్వల్ప ఊరట.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) సోమవారం కాస్తా ఊరటనిచ్చింది. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.93,050 (22 క్యారెట్స్), రూ.1,01,510 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. క్రితం రోజు ముగింపు ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.150, రూ.170 తగ్గింది.చెన్నైలో సోమవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.150, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.170 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.93,050 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.1,01,510 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.150 దిగి రూ.93,200కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.170 తగ్గి రూ.1,01,660 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు సోమవారం తగ్గినట్లుగానే వెండి ధరలు(Silver Price) కూడా వినియోగదారులకు కొంత ఊరట కల్పించాయి. క్రితం ముగింపు ధరలతో పోలిస్తే కేజీ వెండి ధరపై రూ.100 తగ్గింది. దాంతో కేజీ వెండి రేటు రూ.1,19,900 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
ఫ్యామిలీ

Dr Asima Chatterjee: సైన్స్ కాంగ్రెస్ తొలి అధ్యక్షురాలు
భారతీయ విశ్వవిద్యాలయాల నుంచి డాక్టర్ ఆఫ్ సైన్స్ పట్టా అందుకున్న మహిళ, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జనరల్ ప్రెసిడెంట్గా వ్యవహరించిన స్త్రీమూర్తి, మహిళా శాస్త్రవేత్తగా రాజ్యసభ సభ్యులు కావడం వంటి ప్రత్యేకతలు అసీమా చటర్జీ (Dr Asima Chatterjee) (1917– 2006) సొంతం. ప్రకృతి ఉత్పత్తులైన అల్కలాయిడ్స్, కామెరిన్స్, టెర్పనాయిడ్స్ విషయంలోఆమె కృషి విశేషమైనది. భారతీయ ఔషధ మొక్కలకు సంబంధించి వి.విశ్వాస్ గ్రంథానికి చాలా రకాలుగా అదనపు సమాచారాన్ని జోడించి ‘ట్రీటైస్ ఆన్ మెడిసినల్ ప్లాంట్స్’ను ఆరు భాగాల గ్రంథంగా వెలువరించారు.అసీమా చటర్జీ 1917 సెప్టెంబరు 23న బెంగాల్ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. 1944లో పి.కె. బోస్ సారథ్యంలో కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి తొలి భారతీయ మహిళగా డీఎస్సీ పొందారు. వృక్ష ఉత్పత్తులకు సంబంధించి, సేంద్రియ రసాయనాలపై అధ్యయ నమే ఆవిడ పరిశోధన. ఆ సిద్ధాంత గ్రంథాన్ని నోబెల్ బహుమతి గ్రహీత ఎ.ఆర్. టాడ్ పరీక్షించి గొప్పగా అభినందించారు. ఆమె భర్త వరదానంద చటర్జీ భౌతిక రసాయనశాస్త్రంలో దిట్ట.1947లో ఆమె అమెరికా వెళ్లి నాలుగేళ్లలో ముగ్గురు వేరు వేరు విశ్వవిద్యాలయాల ఆచార్యుల దగ్గర పరిశోధన చేశారు. ఇందులో నోబెల్ బహుమతి గ్రహీత పాల్ కారర్ ఒకరు. 1950లో భారతదేశానికి తిరిగి వచ్చి కలకత్తా విశ్వవిద్యాలయంలో ఉద్యోగ జీవితాన్ని కొనసాగించారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తూ ఈ విజ్ఞాన శాస్త్ర మహా సభలకు ప్రధాన కార్యదర్శిగా, కోశాధికారిగా, 1975లో ప్రధాన అధ్యక్షులుగా వ్యవహరించారు. భారతీయ ఔషధ మొక్కలు, ఆయుర్వేదానికి సంబంధించి సాల్ట్ లేక్ (కలకత్తా)లో, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రీజనల్ రీసర్చి ఇన్స్టిట్యూట్ రావడానికి కృషి చేశారు. మూర్ఛవ్యాధికి విరుగుడుగా ఆయుష్ –56, అలాగే మలేరియాను నిర్మూలించేందుకు ఔషధాలను తయారు చేశారు. అసీమా పొందిన ఎన్నో గౌరవాలు, పురస్కారాలలో 1975లో లభించిన పద్మ విభూషణ్ ఒకటి.ప్రజావళిలో శాస్త్రీయ అభినివేశం లేకపోతే ఫలితం శూన్యమని ఆమె నమ్మే వారు. శాస్త్ర సాంకేతిక అభివృద్ధి పట్టణాల వద్దే ఆగిపోతే మంచిది కాదనీ, గ్రామ సీమలలోనూ అది వ్యాప్తి కావాలనీ అనేవారు. రాజ్యసభ సభ్యురాలిగా 1982 నుంచి 8 ఏళ్ల పాటు సేవలు అందించారు. విజ్ఞానమాతకు ఆభరణంగా భాసి ల్లిన అసీమా చటర్జీ 2006 నవంబర్ 22న తన 89వ యేట కన్ను మూశారు.– డా.నాగసూరి వేణుగోపాల్ఆకాశవాణి మాజీ ఉన్నతాధికారి

మాన్సూన్లో మోటార్ రైడ్స్..!
వర్షాలు మబ్బుల్లోంచి కురిసే మధుర గీతాల్లా వినిపిస్తున్న ఈ మాన్సూన్ సీజన్కు నగర యువత నుంచి ప్రత్యేక స్వాగతం లభిస్తోంది. సాధారణంగా జూన్ రెండో వారం నుంచి మొదలయ్యే ఈ సీజన్, ఈసారి కాస్త ముందస్తుగానే ప్రారంభమైంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈసారి తక్కువ ఉష్ణోగ్రతలతో, ఎక్కువ మోస్తరు వర్షపాతం నమోదవుతుందనే ఊహతో యువతలో ప్రకృతిని ఆస్వాదించే ఆసక్తి భారీగానే పెరిగింది. నగరవాసులు ముఖ్యంగా యువత ఈ చల్లని మబ్బులు, మత్తెక్కించే వర్షపు వాసన, హత్తుకునే పచ్చటి ప్రకృతి దృశ్యాలు అన్నింటినీ ఆస్వాదించేందుకు గ్రూప్ రైడ్స్, ఔటింగ్స్, నేచర్ ట్రిప్లతో సందడి చేస్తున్నారు. సోషల్ మీడియా యుగంలో ప్రతి చినుకూ శీర్షికే..!! రీల్స్, స్టోరీస్, వ్లాగ్స్..ఇవన్నీ మాన్సూన్ థీమ్తో నిండిపోతున్నాయి. వర్షపు నీటిలో కళ్లకు తక్కువ కనిపించే పొగమంచు, డ్రోన్లతో తీసిన పచ్చటి దృశ్యాలు వీరిని ఆహ్లాదపరిచేలా ఉంటున్నాయి. మాన్సూన్ కేవలం వర్షపు చినుకుల సంగతి మాత్రమే కాదు.. ఇది ఒక మూడ్, ఒక ఉల్లాసం, రిలాక్సేషన్. పని ఒత్తిడి నుంచి కొన్ని గంటలు బయటపడేందుకు ఇదో సువర్ణావకాశం. హైదరాబాద్ యువత దీన్ని అందుకుంటోంది. ప్రకృతిని హత్తుకునేలా, జీవితాన్ని మరొక కోణంలో చూసేలా మాన్సూన్ సీజన్ మనల్ని ప్రేరేపిస్తోంది. హైదరాబాద్ శివార్లలోని అనంతగిరి హిల్స్, సంఘీ టెంపుల్ పరిసర ప్రాంతాలు, శామీర్పేట్ లేక్ వంటి ప్రాంతాలు డ్రైవ్ డెస్టినేషన్లుగా మారాయి. వారం చివరి రోజుల్లో ఈ ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్య రెండింతలు పెరిగింది. శివార్లలో ఇప్పుడిప్పుడే మొలకలొస్తున్న పొలాలు, మబ్బుల్లో నలుగుచేసే కిరణాలు, మోస్తరు జల్లుల్లో సాగే డ్రైవ్లు.. ఇవన్నీ యువత హృదయాలను తాకుతున్నాయి. వీకెండ్స్లో అయితే ఇంకొంచెం దూరమైనప్పటికీ నాగార్జున సాగర్, లక్నవరం వంటి ప్రాంతాలకు సైతం షార్ట్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారు. వనాలవైపు పయనం.. సిటీ రైడింగ్కి అలసిన వారు మృగవాని పార్కులకు, అనుమతి ఉన్న శివార్ల అడవులకు, ఫారెస్ట్ ట్రెయిల్స్కు వెళ్లే ట్రెండ్ బాగా పెరిగింది. నగరం నుంచి మంచిర్యాల కవ్వల సర్వాయ్ ఫారెస్ట్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, భాన్సువాడ గ్రీన్ కవర్ వంటి ప్రాంతాలు ఈ లిస్ట్లో చేరిపోతున్నాయి. ఇవన్నీ పచ్చదనంతో కళకళలాడుతున్న ప్రదేశాలుగా పేరుగాంచుతున్నాయి. ఇక్కడ వన్యప్రాణులను పరిశీలిస్తూ, వాన జల్లుల్లో నడకలు వేసేలా యూత్ ట్రెక్కింగ్ ప్లాన్ చేసుకుంటున్నారు. నగరంలో మాన్సూన్ మ్యాజిక్.. నగరం వదిలి వెళ్లలేని వారు కూడా తక్కువ సమయంలో ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, కేబీఆర్ పార్క్, దుమ్ముగూడ చెరువు వంటి ప్రదేశాలకు వెళుతున్నారు. ప్రత్యేకించి ప్రకృతి ప్రేమికులు, యువత, విద్యార్థులు, ఫొటోగ్రాఫర్స్ ఈ వర్షపు సీజన్ను కలర్ఫుల్గా మార్చేస్తున్నారు. ఇక నెక్లెస్ రోడ్డుపై సైక్లింగ్, బంజారాహిల్స్ కెఫేలో రేయిన్ వ్యూ టేబుల్స్, టెర్రస్ కాఫీ డేట్లు, రోడ్డు పక్కన స్వీట్కార్న్ బండ్లు, షావర్మ స్టాల్స్.. ఇవన్నీ మాన్సూన్ ఎక్స్పీరియన్స్. ఈ వర్షాల సీజన్కి సోషల్ మీడియా జనరేషన్ తమదైన హ్యాష్ట్యాగ్లు తయారుచేస్తోంది. హ్యాష్ రేయిన్రైడ్, హ్యాష్ మాన్సూన్మూడ్, హ్యాష్ చినుకులు క్రానికల్స్ లాంటి క్యాప్షన్లతో యువత సోషల్ మీడియాను మాన్సూన్ డైరీగా మార్చేస్తోంది. మాన్సూన్ ఏక కాలంలో రిలీఫ్, రొమాన్స్, రిఫ్రెష్మెంట్ తీసుకురావడమే కాదు, జీవితం కొంత నెమ్మదిగా, ప్రశాంతంగా సాగేలా చేస్తుంది. (చదవండి: 62 ఏళ్ల వయసులో నలుగురికీ స్ఫూర్తిగా..! ఏకంగా 136 సార్లు..)

సగమైన సముద్రం
తుంగభద్ర నది ప్రవహిస్తోంది. దూరంగా మంత్రాలయ రాఘవేంద్ర స్వామి అష్టోత్తరం వీనుల విందుగా వినిపిస్తూ ఉంది. నది ఒడ్డున కూర్చుని ఉన్న గురువుతో శిష్యుడు ‘‘స్వార్థం అంటే ఏమిటి?’’ అని అడిగాడు. ‘‘స్వార్థం అంటే తన గురించి మాత్రమే శ్రద్ధ వహించడం. ఇతరులను పట్టించుకోకుండా తన ప్రయోజనం, ఆనందం లేదా సంక్షేమం గురించి మాత్రమే ఆలోచించడం’’ అని బదులిచ్చాడు గురువు. ‘‘దాని పర్యవసానాలు ఏమిటి?’’ అని మళ్ళీ ప్రశ్నించాడు శిష్యుడు. ‘‘స్వార్థం ఎంత పనైనా చేయిస్తుంది. దానికి అంతమనేది లేదు. నీకు అర్థమయ్యే రీతిలో ఒక ΄కతకథ చెబుతాను విను.‘‘ఒక పెద్ద సామ్రాజ్యంలోని రాజ్యాలలో వర్షాలు లేక తీవ్రమైన కరువు ఏర్పడింది. ఏమి చేయాలో తెలియని చక్రవర్తి ఆస్థాన పండితులను పిలిచి చర్చించాడు. తపస్సు చేసి దైవానుగ్రహం పొందటమే శరణ్యమని వారు సలహా ఇచ్చారు. రాజ్యాల శ్రేయస్సు కోసం అడవులకెళ్ళి ఘోర తపస్సు ప్రారంభించాడు. చక్రవర్తి తపస్సుకి దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. ఇదీ చదవండి: Today recipes : బ్రెడ్తో ఇన్ని వెరైటీలు ఎపుడైనా ట్రై చేశారా?తన సామ్రాజ్యంలో మంచివానలు కురవాలని, నీటికరువు ఉండకూడదని కోరాడు చక్రవర్తి. ఎందుకైనా మంచిదని తన సామ్రాజ్యానికి ఆనుకుని ఉన్న సముద్రాన్ని కూడా మంచినీళ్ళుగా మార్చివేయమని అడిగాడు. ‘‘ఆలోచించే అడుగుతున్నావా?’’ అని దేవుడు రాజును ప్రశ్నించాడు.‘‘వృథాగా ఉన్న సముద్రం నీళ్ళు మంచినీళ్ళుగా మారితే మా సామ్రాజ్యంలోని ప్రజలు తరతరాలు నీటి ఎద్దడి లేకుండా సుఖపడతారు కదా. చరిత్రలో నా పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది కదా’’ అని దేవుణ్ణి ఒప్పించాడు.చదవండి: ‘మై లవ్..’గర్ల్ఫ్రెండ్ కోసం ఒంటరిగా కుమిలి కుమిలి : వైరల్ వీడియో‘‘సరే, నీ ఇష్టం’’ అని చక్రవర్తి కోరినట్లే చేశాడు దేవుడు. వెంటనే మంచి వర్షాలు కురిశాయి. పరమానంద భరితుడయ్యాడు చక్రవర్తి. కొన్నాళ్ళు గడిచాయి. ఉప్పునీళ్ళ సముద్రం మంచి నీళ్ళుగా మారాక పరిస్థితి ఎలా ఉందో చూద్దామని చక్రవర్తి సముద్రం దగ్గరకు వెళ్ళాడు. సముద్రం సగమై ఉంది. ఆశ్చర్యపోయాడు. అలలు సైతం నీరసంగా పడి లేస్తున్నాయి. చక్రవర్తి గుండె తరుక్కుపోయింది. కారణమేమిటని తన సిబ్బందిని అడిగాడు. ఏ రాజ్యానికి ఆ రాజ్యం రాజులు అవసరం ఉన్నా లేకున్నా సముద్రం నీళ్ళని తమ రాజ్యాల వైపుకు మళ్ళించుకున్నారని చెప్పారు. ‘సముద్రాన్ని కూడా సగం చేసింది కదా మనిషి స్వార్థం’ అని తల పట్టుకున్నాడు చక్రవర్తి. ఇంకొన్నాళ్ళు గడిస్తే సముద్రం పూర్తిగా మాయమై పర్యావరణ సమస్య వస్తుందని గుర్తించాడు. వెంటనే తపస్సు ప్రారంభించడంతో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. చేసిన తప్పునకు క్షమాపణలు కోరి సముద్రాన్ని ఉప్పునీళ్ళగా మార్చమని ప్రాధేయపడ్డాడు’’ అని స్వార్థం గురించి వివరించాడు గురువు. స్వార్థం మనిషిని ఎంత నీచానికైనా దిగజారుస్తుందని అర్థం చేసుకున్నాడు శిష్యుడు.– ఆర్.సి.కృష్ణస్వామి రాజు

62 ఏళ్ల వయసులో నలుగురికీ స్ఫూర్తిగా..! ఏకంగా 136 సార్లు..
సమాజం మనకు ఏమి ఇచ్చింది అని ఆలోచించేవారే ఎక్కువ మంది ఉంటారు. కానీ సమాజానికి నేను ఏమిచ్చాను అని ఆలోచించే వారు కొందరే ఉంటారు. ఆ కొందరిలో ఒక్కడే యోగేష్ రాజ్ శ్రీవాస్తవ. పదో, ఇరవైయ్యో కాదు.. ఏకంగా 136 సార్లు రక్తదానం చేసి పరోక్షంగా అనేక మంది ప్రణాలను కాపాడారు. 62 సంవత్సరాల వయసులో కూడా ప్రతి ఆరు నెలలకూ ఓసారి ఇప్పటికీ రక్తదానం చేస్తూనే ఉన్నారు. కేవలం రక్తదానమే కాదు తాను మృతి చెందిన అనంతరం తన శరీరంలో పనికొచ్చే అన్ని అవయవాలు ఇండియన్ ఆర్మీకి దానం చేశారు. నగరంలోని డీడీ కాలనీలో నివాసం ఉండే యోగేష్ రాజ్ శ్రీవాస్తవ 1983లో వివేకవరి్ధని కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న సమయంలో అక్టోబర్ 2, మహాత్మాగాంధీ, లాల్బహదూర్ శాస్త్రీ జయంతి సందర్భంగా ఎన్ఎస్ఎస్ వారు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో మొదటి సారి రక్తదానం చేశారు. ఇక అప్పటి నుండి ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూనే ఉన్నారు. 60 సంవత్సరాలు దాటిన తరువాత ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇప్పటికీ తన రక్తాన్ని దానం చేస్తున్నారు. రెడ్క్రాస్ సొసైటీకి, నగరంలో ఏ ఆస్పత్రి నుండి ఫోన్ వచ్చినా వెళ్లి రక్తదానం చేస్తుంటాడు. యోగేష్ది ఓ నెగెటివ్ కావడంతో రక్తదానం చేసిన ప్రతిసారీ మీరు ఒకరి ప్రాణాలు కాపాడారు అని వైద్యులు అంటుంటే అందులో కలిగే ఆనందం ఎక్కడా దొరకదని ఆయన అంటున్నారు. ఈయన రక్తదానం చెయ్యడమే కాకుండా రక్తదానంపై అవగాహన కల్పిస్తూ ప్రజల్లో చైతన్యం నిపుతుంటారు. ప్రముఖుల నుంచి అభినందనలు.. ఇన్నిసార్లు రక్తదానం చేసిన యోగేష్ను ఎంతో మంది రాజకీయ ప్రముఖులు, సీని ప్రముఖులు అభినందించారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి గవర్నర్ చేతుల మీదుగా అవార్డులు తీసుకున్నారు. ఒక వేదికపై ప్రముఖ హీరో రాంచరణ్ మేము సినిమాల్లో హీరోలమైతే యోగేష్ రాజ్ శ్రీవాస్తవ్ నిజ జీవితంలో హీరో అని అందరిముందూ పొగడడం ఎంతో ఆనందం కలిగించిందని ఆయన తెలిపారు. పలు అవార్డులు, రికార్డులు.. యోగేష్కు జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, 16వ ఫిలిప్స్ గాడ్ఫ్రే బ్రేవరీ అవార్డు, క్యాలిఫోర్నియా యూనివర్సిటీ వారు ఫిలాసఫీ ఆఫ్ హ్యూమానిటీ డాక్టరేట్, 17 బంగారు, వెండి, 14 మెరిట్ సర్టిఫికెట్స్, రాజీవ్గాంధీ సమైక్యతా అవార్డు, లయన్ ఇంటర్నేషనల్ అవార్డు, స్వేచ్ఛా భారత్ పురస్కార్తో పాటు ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. (చదవండి: Plane Crash Victims : ఆ భయం నుంచి బయటపడటం అంత ఈజీ కాదట..!)
ఫొటోలు
అంతర్జాతీయం

ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య కొనసాగుతున్న దాడులు.. అణు శాస్త్రవేత్తలు మృతి
టెహ్రాన్: ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య ఆదివారం తెల్లవారుజామున భీకర దాడులు చోటుచేసుకున్నాయి. ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) తాజాగా ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం, అణు ప్రాజెక్టుపై విస్తృత దాడులు చేశాయి. ఇరాన్ ప్రభుత్వ అణ్వాయుధ ప్రాజెక్టుకు సంబంధించిన టెహ్రాన్లోని లక్ష్యాలపై విస్తృతమైన దాడులను పూర్తి చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు ప్రకటించాయి. తమ లక్ష్యాలలో ఇరాన్ దాచిపెట్టిన అణు ఆర్కైవ్ ప్రదేశం కూడా ఉందని ఐడీఎఫ్ తెలిపింది.ఇజ్రాయెల్ తమ దేశంపై జరిపిన దాడిలో టెహ్రాన్లోని షహ్రాన్ చమురు డిపోను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ తెలిపింది. ఇజ్రాయెల్ దాడిలో అగ్నిప్రమాదం సంభవించిన తర్వాత, ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రమైన సౌత్ పార్స్ క్షేత్రంలో ఉత్పత్తిని ఇరాన్ పాక్షికంగా నిలిపివేసింది. ఇజ్రాయెల్ నగరాలపై ఇరాన్ దాడులను ప్రారంభించిన తర్వాత జెరూసలేం- టెల్ అవీవ్ అంతటా వైమానిక దాడి సైరన్లు మోగించారు. ఇరాన్ సైన్యం ఇజ్రాయెల్ ఇంధన మౌలిక సదుపాయాలను, ఫైటర్ జెట్ ఇంధన ఉత్పత్తికి సౌకర్యాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది.ఇజ్రాయెల్ సైన్యం ‘రైజింగ్ లయన్’ ప్రారంభించి, ఇరాన్ అణు, సైనిక స్థావరాలపై దాడి చేసిన తర్వాత ఈ కొత్త దాడులు చోటుచేసుకున్నాయి. ఇజ్రాయెల్ తాము జరిపిన దాడుల్లో ఇరాన్ అణు కార్యక్రమానికి చెందిన జనరల్స్, సీనియర్ శాస్త్రవేత్తలు, నిపుణులు మృతిచెందారని పేర్కొంది. తాజా దాడులకు ముందు ఇరాన్ ఐక్యరాజ్యసమితి రాయబారి మాట్లాడుతూ ఈ దాడుల్లో 78 మంది మృతిచెందారని, 320 మందికి పైగా జనం గాయపడ్డారని చెప్పారు. ఇజ్రాయెల్ మనుగడకు ఇరాన్ నుండి ఎదురవుతున్న ముప్పును తిప్పికొట్టడానికే ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ఈ ముప్పు తప్పేవరకూ ఎన్ని రోజులైనా ఈ ఆపరేషన్ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: ఇరాన్ అణు కేంద్రాలకు భారీ నష్టం.. శాటిలైట్ చిత్రాలలో..

దుబాయ్: 67 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం..
దుబాయ్: అరబ్ దేశం దుబాయ్లో ఘోర అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ‘టైగర్ టవర్’గా పేరొందిన 67 అంతస్తుల ‘మెరీనా పినాకిల్’ భవనంలో అర్ధరాత్రి పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. సహాయక బృందాలు.. 3,820 మంది నివాసితులను సురక్షితంగా బయటకు తరలించాయి. ఇక, ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాధితులకు తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేశారు.వివరాల ప్రకారం.. దుబాయ్లో ‘మెరీనా పినాకిల్’ భవనంలో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. దాదాపు 6 గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు స్థానిక మీడియా తెలిపింది. అగ్ని ప్రమాదం నేపథ్యంలో సహాయక బృందాలు 764 ఫ్లాట్ల నుంచి 3,820 మంది నివాసితులను సురక్షితంగా బయటకు తరలించాయి.A massive fire broke out at the 67-story Marina Pinnacle (also known as Tiger Tower) in Dubai Marina on June 13, 2025, starting around PM. Dubai Civil Defense teams evacuated 3,820 residents from 764 apartments, with no reported injuries or casualties. The fire, which began… pic.twitter.com/OOsWDHj6pu— EternalChaos (@EternalChaos158) June 14, 2025 ఇక, అగ్ని ప్రమాదం కారణంగా ప్రమాదస్థలిలో అంబులెన్సులు, వైద్యసిబ్బందిని మోహరించారు. ఎటువంటి ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాధితులకు తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేశారు. మెరీనా పినాకిల్లో మంటలు చెలరేగడం ఇదే మొదటిసారి కాదు. 2015లోనూ 47వ అంతస్తులో మంటలు చెలరేగి.. 48వ అంతస్తుకు వ్యాపించాయి. సహాయక సిబ్బంది మంటలార్పారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడయాలో వైరల్గా మారాయి. 🚨 BREAKING: Scenes from Dubai, As Projectile from Yemen hits a Marina Pinnacle Tower or Tiger Tower in Dubai Marina. This is a first inclident during the ongoing Iran Israel war in UAE pic.twitter.com/eVxPrJ6Wyu— True Pulse Global (@truepulseglobal) June 14, 2025

ఇరాన్ అణు కేంద్రాలకు భారీ నష్టం.. శాటిలైట్ చిత్రాలలో..
టెహ్రాన్: ఇజ్రాయెల్ వరుస దాడులతో ఇరాన్ అణు కేంద్రాలకు భారీ నష్టం వాటిల్లింది. దీనిని ఉపగ్రహ ఛాయా చిత్రాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ ఉపగ్రహ చిత్రాలను మాక్సర్ విడుదల చేసింది. ఇరాన్ ప్రపంచ హెచ్చరికలను ధిక్కరించి, అణ్వాయుధ కార్యక్రమాన్ని కొనసాగిస్తోందని ఇజ్రాయెల్ చాలా కాలంగా ఆరోపిస్తోంది.ఇరాన్లో భారీస్థాయిలో అణు బాంబులను ఉత్పత్తి చేయగల యురేనియం నిల్వలు ఉన్నాయని ఇజ్రాయెల్ పేర్కొంది. అయితే ఇరాన్ మాత్రం తన అణు కార్యక్రమం పౌర ప్రయోజనాల కోసమేనని చెబుతోంది. తాజాగా విడుదలైన హై-రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాలు ఇరాన్లోని ముఖ్య అణు కేంద్రానికి వాటిల్లిన నష్టాన్ని చూపిస్తున్నాయి. అలాగే దీనికి ముందున్న స్థితిని కూడా సరిపోల్చాయి. యూఎన్ అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ) తెలిపిన వివరాల ప్రకారం ఇజ్రాయెల్ ఆపరేషన్లో నటాంజ్, ఫోర్డోలోని ఇరాన్ భూగర్భ యురేనియం కేంద్రాలు, ఇస్ఫహాన్లోని యురేనియం తరలింపు కేంద్రంపై దాడులు జరిగాయి.ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించిన యూఎస్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ (ఐఎస్ఐఎస్)నివేదిక ప్రకారం అణు కేంద్రంలో విద్యుత్ సరఫరాకు విస్తృతమైన నష్టం వాటిల్లింది. టెహ్రాన్కు ఆగ్నేయంగా 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న నటాంజ్లోని అణు కేంద్రంలో సమృద్ధిగా యురేనియం నిల్వలు ఉన్నాయి. అలాగే ఫోర్డోలోని అణు కేంద్రం టెహ్రాన్కు నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి స్వల్పంగా నష్టం వాటిల్లిందని ఇరాన్ పేర్కొంది.ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ తమ పోరాటం 46 ఏళ్లుగా సాగుతున్న నియంతృత్వంపై జరుగుతున్న దాడి అని అన్నారు. ఇరాన్ విముక్తి దినం దగ్గర పడిందని, అది జరిగినప్పుడు, ఇరు దేశాల ప్రజల మధ్య స్నేహం మరోసారి వర్ధిల్లుతుందన్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఇరాన్ పాలనను ఇజ్రాయెల్ అనుమతించబోదన్నారు. ఇరాన్ తనదగ్గరున్న ఆయుధాలను, అణ్వాయుధాలను ఉగ్రవాదులను అందించాలని యోచిస్తోందని నెతన్యాహు ఆరోపించారు. అదేగనుక జరిగితే అణు ఉగ్రవాదానికి తెరలేస్తుందని, అప్పుడు అది యూరప్ నగరాలకు, చివరికి అమెరికాకు ముప్పు తెచ్చిపెడుతుందని ఆయన హెచ్చరించారు.ఇది కూడా చదవండి: Air India crash: విమానంలో ‘11ఏ’ సురక్షితమా? రమేష్ని అదే కాపాడిందా?

సోదాలు, అరెస్టులకు తాత్కాలిక విరామం
వాషింగ్టన్: అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరి మార్చుకున్నారు. వలసదారులందరినీ ఇప్పటికిప్పుడు ఉన్నపళంగా బయటకు తరిమేస్తే తలెత్తే ఇబ్బందుమిటో అనుభవంలోకి వస్తున్నాయి. కార్మిక శక్తి ఒక్కసారిగా తగ్గిపోతే పరిశ్రమలు నష్టాల్లోకి జారుకొనే ప్రమాదం పొంచి ఉంది. అందుకే సోదాలు, అరెస్టులు తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు సమాచారం. వ్యవసాయ క్షేత్రాలు, వ్యవసాయ సంబంధిత పరిశ్రమలు, హోటళ్లు, రెస్టారెంట్లలో సోదాలు నిలిపివేయాలని ట్రంప్ ప్రభుత్వం తాజాగా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ)కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మాంసం ప్యాకింగ్ ప్లాంట్లతోపాటు చేపల పెంపకం కేంద్రాల్లోనూ సోదాలు నిలిపివేయాలని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు గురువారం రాత్రి ఐసీఈ అధికారులకు అధికారికంగా ఈ–మెయిల్ పంపించినట్లు సమాచారం. ముగ్గురు ప్రభుత్వ అధికారులు ఈ విషయం ధ్రువీకరించారు. వ్యవసాయ సంబంధిత పరిశ్రమలు, హోటళ్లు, రెస్టారెంట్లలో మానవ అక్రమ రవాణా, మనీ లాండరింగ్, మాదక ద్రవ్యాల వ్యాపారం జరుగుతున్నట్లు సమాచారం వస్తే సోదాలు కొనసాగించవచ్చని, అరెస్టులు చేయొచ్చని ప్రభుత్వం తేల్చిచెప్పింది.
జాతీయం

లక్నో: తప్పిన ఘోర విమాన ప్రమాదం
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం ఘటన మరువక ముందే.. వరుస ఉదంతాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. తాజాగా లక్నో ఎయిర్పోర్టులో ఘోర విమాన ప్రమాదం తృటిలో తప్పింది. విమానం టైర్ భాగం నుంచి నిప్పు కణికలు ఎగసి పడ్డాయి. అయితే సిబ్బంది సకాలంలో స్పందించడంతో 250 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సౌదీ ఎయిర్లైన్స్కు చెందిన విమానం హజ్ యాత్రికులతో జెడ్డా నుంచి బయల్దేరి ఆదివారం ఉదయం లక్నో ఎయిర్పోర్టుకు చేరుకుంది. అయితే.. ల్యాడింగ్ సమయంలో ల్యాండింగ్ గేర్ నుంచి నిప్పు కణికలు ఎగసి పడడం సిబ్బంది గమనించారు. విమానం ట్యాక్సీ వేకి చేరుకోగానే.. ప్రయాణికులందరినీ దించేశారు. #BREAKİNG लखनऊ एयरपोर्ट पर बड़ा हादसा टला सऊदी से आए विमान में तकनीकी खराबी लखनऊ एयरपोर्ट पर लैंडिंग के वक्त खराबी लैंडिंग के वक्त विमान के पहिए से निकली चिंगारी#LUCKNOW #LucknowAirport #SV3112 #JeddahToLucknow #planecrash #flightaccident #SaudiArabia pic.twitter.com/GALwi6Q78g— Ritika Rajora (Tv100 News) (@Rrajora07) June 16, 2025ఎడమ టైర్ వద్ద ల్యాండింగ్ గేర్ నుంచి మంటలు వస్తున్నట్లు గుర్తించారు. ఆ వెంటనే ఆర్పేశారు. ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదని.. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.జూన్ 12వ తేదీన అహ్మబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి లండన్ బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన క్షణాల్లోనే కుప్పకూలి పేలిపోయింది. విమానంలోని 241 మందితో పాటు కింద జనావాసాలపై కూలడంతో మరో 33 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్నే నివ్వెర పోయేలా చేసింది. ఈ ఘటనపై హైలెవల్ కమిటీతో భారత ప్రభుత్వం విచారణ జరిపిస్తోంది.

‘స్మార్ట్ సిటీ’ చీటింగ్: 70 వేలమంది నుంచి రూ. 2,700 కోట్లు సేకరించి..
జైపూర్: రాజస్థాన్లో ‘స్మార్ట్ సిటీ’ పేరిట భారీ మోసం చోటుచేసుకుంది. సుభాష్ బిజ్రానీ, రణవీర్ బిజ్రానీ అనే సోదరులు వారి భాగస్వాములతో కలసి, సుమారు 70,000 మంది నుంచి రూ. 2,676 కోట్లను సేకరించి, మోసానికి పాల్పడ్డారు. సికార్ జిల్లాకు చెందిన వీరు ‘నెక్సా ఎవర్గ్రీన్’ అనే కంపెనీని స్థాపించారు. ‘ధోలేరా స్మార్ట్ సిటీ’లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి, వేలమందిని మోసం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.తొలుత వీరు ‘ధోలేరా స్మార్ట్ సిటీ’ పేరుతో ప్రాజక్టు చిత్రాలను రూపొందించి, పెట్టుబడిదారులను ఆకట్టుకున్నారు. ఈ పథకంలోని ప్రతీ స్థాయిలో మంచి ఆదాయం, కమిషన్లు, ఇతర బహుమతులను ఉంటాయని నమ్మబలికారు. వినియోగదారులు తమ పెట్టుబడుల విషయంలో కొన్ని స్థాయిలు దాటిన తరువాత వారికి ల్యాప్టాప్లు, బైక్లు, కార్లు తదితర రివార్డులు అందిస్తామని తెలిపారు. పెట్టుబడిదారులకు ప్రత్యేక ఐడీ ఇచ్చి, ఈ పథకంలో మరింతమందిని చేర్చుకోగలిగితే, అదనపు కమిషన్లు కూడా ఇస్తామని సుభాష్ బిజ్రానీ, రణవీర్ బిజ్రానీలు హామీ ఇచ్చారు.ఈ ప్రాజెక్టు కోసం రణ్వీర్ బిజారాణి 2014లో ధోలేరాలో భూమిని కొనుగోలు చేశాడు. తరువాత అతని సోదరుడు సుభాష్ బిజ్రానీ ఈ పథకంలో రూ. 30 లక్షల పెట్టుబడి పెట్టాడు. ఆ తర్వాత వారిద్దరూ ‘నెక్సా ఎవర్గ్రీన్’ను స్థాపించి, దానిని 2021లో అహ్మదాబాద్లో రిజిస్టర్ చేయించారు. తమ కంపెనీ ప్రభుత్వ భాగస్వామ్యంతో ‘ధోలేరా స్మార్ట్ సిటీ' ప్రాజెక్టు చేపట్టిందని అందరికీ చెప్పారు. దీనిని ప్రపంచ స్థాయి నగరంగా మార్చబోతున్నామని వివరించారు. ఈ నేపధ్యంలో 70 వేల మందికి పైగా జనం వీరి పెట్టుబడి పథకాలలో చేరగా, సుమారు రూ.2,676 కోట్లు ఈ సోదరుల ఖాతాలో జమ అయ్యాయి.ఈ మొత్తంతో వారు రాజస్థాన్లో లగ్జరీ కార్లు, గనులు, హోటళ్ళు, అహ్మదాబాద్లో ఫ్లాట్లు, గోవాలో 25 రిసార్ట్లను కొనుగోలు చేశారు. వారు రూ.250 కోట్ల నగదు ఖర్చు చేసి, మిగిలిన మొత్తాన్ని 27 షెల్ కంపెనీలకు బదిలీ చేశారు. ఇంతలో వీరు మోసాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వచ్చిన దరిమిలా, ఈ ఇద్దరు సోదరులు తమ కార్యాలయాలన్నింటినీ మూసివేసి పరారయ్యారు. దీనిపై రాజస్థాన్లోని జోధ్పూర్లోని పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. ‘నెక్సా ఎవర్గ్రీన్’కు చెందిన మనీలాండరింగ్పై దర్యాప్తు చేపట్టిన, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జైపూర్, సికార్, జున్జును, అహ్మదాబాద్లోని 25 ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది. కాగా ధోలేరా స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ అనేది కేంద్రం, గుజరాత్ సంయుక్తంగా చేపడుతున్న ప్రాజెక్ట్. ఇది భారతదేశంలోని మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు. దీనిలో అంతర్జాతీయ విమానాశ్రయం, బహుళజాతి కంపెనీల కార్యాలయాలను నిర్మిస్తున్నారు. దీనిని 2042 నాటికి పూర్తిచేయాలని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఇది కూడా చదవండి: Air India plane crash: భార్య చెప్పిందని.. ప్రమాదం నుంచి తప్పించుకున్న వైద్యుడు

‘శ్రీహరి కోట’కు బాంబు బెదిరింపు.. ముమ్మర తనిఖీలు
శ్రీహరి కోట: ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరి కోట అంతరిక్ష కేంద్రం ‘షార్’కు ఈరోజు (సోమవారం) ఉదయం బాంబు బెదిరింపు వచ్చింది. తమిళానాడు కంమాండ్ కంట్రోల్కు ఈ బెదిరింపు ఫోను కాల్ అందింది. ఈ నేపధ్యంలో అంతరిక్ష కేంద్రంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు.ఇటీవల భారత్ , పాక్ మధ్య దాడులు జరిగిన సమయంలో దేశంలోని ప్రముఖ ఆలయాలు, పర్యాటక కేంద్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే పోర్టులు ఎయిర్ పోర్టులపై కూడా దాడులు జరిగే అవకాశం ఉందన్న అనుమానంతో ఆయా ప్రాంతాల్లో భద్రతను మరింతగా పెంచారు. ఇదే సమయంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చెందిన శ్రీహరి కోట రాకెట్ ప్రయోగ కేంద్రం ‘షార్’ వద్ద భద్రతా దళాలును మొహరించారు. ఇది కూడా చదవండి: పాక్ ముస్లిం లీగ్.. జైరామ్ రమేష్ ఒక్కటే: బీజేపీ ఘాటు విమర్శ

Air India plane crash: భార్య చెప్పిందని.. ప్రమాదం నుంచి తప్పించుకున్న వైద్యుడు
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్న గుజరాత్కు చెందిన ఒక వైద్యుడు తన భార్య, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు చెబుతున్నాడు. ఇంటిలోనివారి మాట కాదని, ఒకవేళ అతను ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానంలో ప్రయాణించి ఉంటే, ఇప్పుడు మన మధ్య ఉండేవాడు కాదు.ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని 241 మంది మృతిచెందారు. గుజరాత్కు చెందిన డాక్టర్ ఉమాంగ్ పటేల్ తన భార్య, కుమారులతో పాటు మే 24న గుజరాత్లోని మహిసాగర్కు వచ్చారు. భారతదేశంలో తన కుటుంబాన్ని ఉంచి, జూన్ 12న బ్రిటన్లోని నార్తాంప్టన్కు తిరిగి వెళ్లాలని ఆయన అనుకున్నారు.‘నేను జూన్ 12న ఒక్కడినే లండన్ వెళ్లవలసి ఉంది. అయితే జూన్ 9న నాకు తీవ్ర జ్వరం వచ్చింది. మరుసటి రోజు ఉదయానికి జ్వరం మరింతగా పెరిగింది. నా ఆరోగ్యంపై ఆందోళన చెందిన నా భార్య.. జూన్ 12న బుక్ చేసుకున్న విమానం టికెట్ను రద్దు చేసుకుని, ఆరోగ్యం కుదుటపడేవరకూ ఇక్కడే ఉండమని కోరింది. దీంతో నేను విమానం టిక్కెట్ రద్దు చేసుకున్నాను. తరువాత జూన్ 15కి తిరిగి టికెట్ బుక్ చేసుకున్నాను. ఇప్పుడు విమాన ప్రమాద వార్త వినగానే దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆ దేవుడే నన్ను కాపాడాడు. విమాన ప్రమాదంలో మరణించినవారికి భగవంతుడు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అని డాక్టర్ ఉమాంగ్ పటేల్ అన్నారు. ఆయన గత ఐదేళ్లుగా నార్తాంప్టన్లో నివాసం ఉంటున్నారు.ఇది కూడా చదవండి: పాక్ ముస్లిం లీగ్.. జైరామ్ రమేష్ ఒక్కటే: బీజేపీ ఘాటు విమర్శ
ఎన్ఆర్ఐ

‘వీసా’ భయాలతో భారతీయ విద్యార్థులు ఏం చేస్తున్నారంటే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వరుస నిర్ణయాలతో విదేశీ విద్యార్థులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉన్నవాళ్లను సొంత దేశాలకు పంపించేయడం.. కొత్త వాళ్లను అమెరికాలో అడుగుపెట్టనివ్వకుండా కఠిన ఆంక్షల దిశగా అడుగులేస్తున్నారాయన. ఈ క్రమంలో వీసాల కోసం ప్రయత్నిస్తున్న భారతీయ విద్యార్థులు(Indian Students) అప్రమత్తం అయ్యారు. కొందరు తాము చేసిన పోస్టులు తొలగిస్తుండగా.. మరికొందరు ఏకంగా సోషల్ మీడియా అకౌంట్లను డిలీట్ చేస్తున్నారు. విదేశీ విద్యార్థులకు వీసాలు(American Visas) మంజూరు చేయడానికి ముందు వారి సోషల్ మీడియా ఖాతాలను తనిఖీలు చేసే పనిలో అమెరికా అధికార యంత్రాంగం ఉంది. ఇందుకోసం అర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని ఉపయోగిస్తోంది. పాలస్తీనా మద్దతుదారుల దగ్గరి నుంచి.. యూఎస్ క్యాంపస్లలో జరిగిన వివిధ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులను ఈ సాంకేతికత ఉపయోగించే బయటకు పంపించేసింది. ఈ క్రమంలో.. అతిగా ఉన్న పోస్టులు చూస్తే చిక్కుల్లో పడతామనే భావనతో అలాంటి వాటిని భారతీయ విద్యార్థులు డిలీట్ చేస్తున్నారు. ఫేస్బుక్, ఎక్స్, లింక్డిన, టిక్టాక్ ఇలా ఇతర ఫ్లాట్ఫారమ్లన్నింటిని జల్లెడ పడుతున్నారు. వాటిల్లో తమ యాక్టివిటీ( పోస్టులు చేయడంతో పాటు లైకులు, షేర్లు, కామెంట్లు.. వగైరా)ని తొలగిస్తున్నారు. కొందరైతే ఏకంగా అకౌంట్నే తొలగిస్తున్నట్లు సమాచారం.అభిప్రాయాల దగ్గరి నుంచి పొలిటికల్ జోక్స్ దాకా వేటిని తమ టైం లైన్లో ఉంచడం లేదు. అమెరికా అధికారులు వాటిని చూస్తే వీసాలు రిజెక్ట్ అవుతాయని భయపడుతున్నారు. అయితే ఇలా హఠాత్తుగా అకౌంట్లనూ తొలగించడమూ మంచిది కాదనే అభిప్రాయాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

టీఏడీ కార్య నిర్వహక బోర్డు ఎన్నిక
కోపెన్హాగన్: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ డెన్మార్క్(Telangana Association of Denmark)(టీఏడీ) 2025–2027 సంవత్సరానికి గాను కొత్తగా కార్యనిర్వాహక బోర్డును ఎన్నుకుంది. ఈ సందర్భంగా బోర్డు సభ్యులకు టీఏడీ అభినందనలు తెలియజేసింది. 2025–2027 కాలానికి ఎన్నికైన కార్యనిర్వాహక బోర్డు సభ్యుల జాబితాను, వారి హోదాను టీఏడీ అధికారికంగా ప్రకటించింది. టీఏడీలోని సభ్యులు అంకితభావంతో బాధ్యతాయుతంగా సమాజానికి సేవ చేయడానికి, బోర్డుకు ప్రాతినిధ్యం వహించడానికి ఎంపిక అయ్యారని టీఏడీ తెలిపింది. త్వరలో నిర్వహించబోయే ప్రమాణ స్వీకారోత్సవంలో ఈ సభ్యులు అధికారికంగా తమ బాధ్యతలు చేపట్టనున్నారు. బోర్డుకు ఎంపికైన సభ్యులు, వారి హోదాలు ఇలా ఉన్నాయి.1. ఉపేందర్ గిలకథుల (అధ్యక్షులు) 2. సురేందర్ కేసాని (ఉపాధ్యక్షులు) 3. విజయ్ మోహన్ గోపి (కార్యదర్శి)4. ఈశ్వర్ ఎమ్మడి (కోశాధికారి), 5. పవన్ కుమార్ పబ్బా (టెక్నికల్ మేనేజర్) 6. సతీష్ సామ (విదేశీ వ్యవహారాల మేనేజర్), 7. రాజ్ కుమార్ కలువల (అసెట్ మేనేజర్), 8. రమేష్ వనపర్తి (పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్)9. సులక్షణ చౌదరి కోర్వా (ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు), 10. సాయ గౌడ్ పడాల (ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు), 11. సాయికృష్ణా రెడ్డి మిల్కా (ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు),12. మహేష్ ఆలేటి (ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు), 13. దయానంద్ గౌడ్ పడాల (ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు), 14. వాసుదేవ్ గౌడ్ బిక్కి (ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు), 15. అఖిల్ కర్నాటి (ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు), 16. గోకుల్ దేసు (ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు), 17. రాజేశ్వర్ నీరడి (ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు), 18. శరణ్ యాల్కా ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు)

NRI News : వెన్నుపోటు దినం యూకేలో ఎన్ఆర్ఐల నిరసన
జూన్ 4 వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా వైస్సార్సీపీ యూకే కమిటీ ఆధ్వర్యంలో UK లోని ఈస్ట్ లండన్ మరియు లెస్టర్ నుంచి నిరసన తెలియజేసారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, అనేక సంక్షేమ పథకాలనుతుంగలోకి వైనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మలిరెడ్డి కిషోర్ రెడ్డి , చల్లా మధుసూదన్ యాదవ్ , ప్రణయ్ గడిమే ఆనంద్ అక్కిదాసు, రామిరెడ్డి జయచంద్రా రెడ్డి , చలపతి గుర్రం,యశ్వంత్ గరికపాటి,సాయి ప్రదీప్ పాల్గన్నారు.ఒకరికి ముగ్గురు చొప్పున( చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పురందరేశ్వరి ) చెప్పిన అబద్దాన్ని పదే పదే చెప్పి ప్రజలను మోసం చేసి అధికారాన్ని చేపట్టిన ఏపీ సీఎం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఆర్థిక విద్వంసానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!

బాబు పాలన చూస్తుంటే మా కడుపు తరుక్కుపోతుంది : ఎన్ఆర్ఐలు
సిడ్నీ: ఏపీలో కొనసాగుతున్న రాక్షస పాలనతో ప్రజలు పడుతున్న బాధలను చూస్తుంటే తమ కడుపు తరుక్కుపోతుందని ఆస్ట్రేలియా ఎన్నారైలు తెలిపారు. రాష్ట్ర ప్రజల జీవితాలను చూసి చలించిపోతున్నామన్న ఎన్ఆర్ఐలు.. మరో నాలుగేళ్లు ఈ రాక్షస పాలనలో బాధలు పడడం వారి దురదృష్టమని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా డైవర్షన్ రాజకీయాలతో కూటమి నేతలు కాలయాపన చేస్తున్నారని ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ కూడా సాధించలేదని వారు తెలిపారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి, వీరం రెడ్డి శ్రీధర్ రెడ్డి , హరి ఎడనపర్తి, దూడల లోక కిరణ్ రెడ్డి, కృష్ణ చైతన్య కామరాజు, బుర్ర ముక్కు రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
క్రైమ్

విద్యుదాఘాతానికి నలుగురు బలి
కోరుట్ల: రాష్ట్రంలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందారు. హైదరాబాద్లో ఇద్దరు, జగిత్యాల జిల్లాలో ఇద్దరు మరణించగా, ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా.. కోరుట్ల–మెట్పల్లి జాతీయ రహదారి వెంట ఉన్న బాలాజీ కళా ఆర్ట్స్లో గణపతి విగ్రహాలు తయారు చేస్తారు. షెడ్లో తయారు చేసిన ఓ గణపతి విగ్రహానికి రంగులు వేసేందుకు మరో షెడ్కు తరలించడానికి ఆదివారం మధ్యాహ్నం 3.45 గంటల సమయంలో క్రేన్తో ఏర్పాట్లు చేసుకున్నారు. యజమాని అల్వాల వినోద్, ఆయన తమ్ముడు అల్వాల నితిన్ 8 మంది వర్కర్లతో కలిసి విగ్రహాన్ని ట్రాలీపై జాతీయ రహదారిపైకి తెచ్చారు. విగ్రహం దాదాపు 12 ఫీట్ల ఎత్తు ఉండటంతో కిరీటం భాగం పైన ఉన్న 33 కేవీ విద్యుత్ తీగలకు తగిలింది. విగ్రహం తడిగా ఉండటంతో విగ్రహాన్ని పట్టుకుని ఉన్న పది మంది విద్యుత్ షాక్కు గురయ్యారు. కరెంట్ తీగల్లో మంటలు చెలరేగి విగ్రహం కిరీటం కాలిపోయింది. ఏడుగురు షాక్తో విగ్రహానికి అతుక్కుపోయారు. మరో ముగ్గురు కింద పడిపోయారు. గమనించిన చుట్టుపక్కల వారు విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వడంతోపాటు వారు కరెంటు తీగలను పక్కకు తప్పించారు. బాధితులను కోరుట్ల ప్రభుత్వాసుపత్రికి.. అక్కడి నుంచి జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో యజమాని అల్వాల వినోద్ (32), వర్కర్ వెల్లుట్ల సాయికుమార్ (23) మృతిచెందారు. ఎనిమిది మంది చికిత్స పొందుతున్నారు. ప్రమాద స్థలాన్ని ఎస్పీ అశోక్కుమార్ సందర్శించారు. నిద్రలోనే తెల్లారిన బతుకులు నాగోలు: నిద్రిస్తున్న వారిపై విద్యుత్ తీగలు తెగిపడిపోవ డంతో ఇద్దరు సజీవ దహనమైన ఘటన హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎల్బీనగర్ పోలీసుల కథనం ప్రకారం.. ఎల్బీనగర్లోని సాగర్ రింగ్ రోడ్డు చౌరస్తా సమీపంలోని బాబాయ్ హోటల్ సమీపంలో రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద ఫుట్పాత్పై ఇద్దరు గుర్తు తెలియ ని యాచకులు నిద్రిస్తున్నారు. వారితోపాటు ఓ శునకం కూడా ఉంది. ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వాహ నం విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టడంతో 11 కేవీ హైటెన్షన్ వైరు తెగి నిద్రిస్తున్న వారిపై పడింది.ఇద్దరు యాచకులతోపాటు పక్కనే ఉన్న శునకం సజీవ దహనమైంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్ధితి పరిశీ లించారు. 11కేవీ విద్యుత్ తీగ వారిపై పడిపోవడంతో మంటల్లో కాలిపోయి వారి బట్టలు, దుప్పట్లు వారి శరీరాలకు అంటుకున్నాయి. గుర్తించలేని విధంగా మృతదేహాలున్నాయి. మృతులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ఫాదర్స్డే రోజున నాన్న లేడాయే...
నెహ్రూసెంటర్: భర్త మరణం భార్యకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. వివాహ వార్షికోత్సవం తర్వాత రోజే విద్యుత్ ప్రమాదరూపంలో మృత్యువాత పడడంతో ఆ కుటుంబ విషాదంలో మునిగిపోయింది. మరోచోట కరెంట్ షాక్తో వ్యక్తి తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన ఆయా ఘటనలకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. డోర్నకల్ మండలంలో అసిస్టెంట్ లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్న క్రాంతికుమార్ (32) ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేస్తూ శనివారం విద్యుత్ ప్రమాదానికి గురయ్యాడు. జిల్లా కేంద్రంలోని జీజీహెచ్కు తీసుకురాగా అప్పటికే మృతిచెందాడు. క్రాంతికుమార్ మృతితో భార్య, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా విలపించారు.సంతోషం.. మరునాడే విషాదంమృతుడు క్రాంతికుమార్ దంపతులు శుక్రవారం పెళ్లిరోజు వేడుకలను సంబురంగా జరుపుకున్నారు. భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపిన కాంత్రి మరుసటి రోజే మృతిచెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. తమను సంతోషంగా చూసుకుంటాడనుకున్న భర్త మృతితో భార్య రోదనలు మిన్నంటాయి.ఫాదర్స్డే రోజున నాన్న లేడాయే...క్రాంతికుమార్కు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. నేడు అందరూ ఫాదర్స్ డే జరుపుకుంటుండగా చిన్నారులకు మాత్రం కన్నతండ్రి దూరమైన పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. ఆ చిన్నారులు తమ తండ్రి చనిపోయిన విషయాన్ని సైతం తెలుసుకునే వయస్సులో లేకపోవడం కలిచివేస్తుంది.ఇనుగుర్తిలో ఘటన...జిల్లాలో ఒకే రోజు రెండు వేర్వేరు చోట్ల విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. డోర్నకల్లో జరిగిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇనుగుర్తి శివారు వీరారెడ్డిపల్లిలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అదే గ్రామానికి చెందిన బూర్గుల అంబేడ్కర్కు తీవ్ర గాయాలయ్యాయి. జీజీహెచ్కు తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్లో ఆస్పత్రికి తరలించారు.

ఆస్తినంతా ప్రియురాలికి ఇచ్చాడు
కర్ణాటక: వారం రోజుల క్రితం జిల్లా కేంద్రం క్రిష్ణగిరి సమీపంలో నిద్రిస్తున్న భర్తపై పెట్రోలు పోసి నిప్పంటించి హత్య చేసిన కేసులో భార్య కారణాలను వెల్లడించింది. తిమ్మాపురం గ్రామానికి చెందిన కూలికార్మికుడు రంగస్వామి (47) నిద్రపోతుండగా భార్య కవిత (44) పెట్రోలు పోసి తగలబెట్టడంతో చనిపోయాడు.పోలీసులు ఆమెను అరెస్టు చేసి విచారించారు. తమకు పెళ్లి జరిగి 22 ఏళ్లు అయ్యిందని, ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారని, తమకు ఆస్తి, డబ్బు, నగలు అన్నీ ఉన్నాయని, కుటుంబంతో బాగానే ఉన్నామని తెలిపింది.అయితే భర్త కూలి పని చేసే చోట మరో మహిళ మంజులతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిపింది. ఇంట్లో ఉన్న నగలు మంజులకు అందజేశాడు. ఆస్తిని విక్రయించి ఆమెకు ముట్టజెప్పాడని తెలిపింది. రోజూ తాగి వచ్చి అందంగా లేవని నన్ను దూషించేవాడని, దీంతో హత్య చేశానని చెప్పింది. కాగా తండ్రి మరణించి, తల్లి జైలుకెళ్లి ముగ్గురు పిల్లలు బోరుమని విలపించారు.

ఐదో అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య
సనత్నగర్(హైదరాబాద్): ఎర్రగడ్డ జనప్రియా అపార్ట్మెంట్ ఐదో అంతస్తు నుంచి ఓ మహిళ దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. కుటుంబ కలహాలతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం..ఏలూరు జిల్లా అడ్డగిద్దల మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన రాజు, కొక్కిణి శ్రావణి (30) దంపతులు. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు నడుస్తుండడంతో మానసికంగా కుంగిపోయింది. ఈ క్రమంలో గత ఆరు నెలల క్రితం శ్రావణిని ఎర్రగడ్డ జనప్రియా అపార్ట్మెంట్స్లో ఉండే తల్లిదండ్రులు శ్రీనివాస్, దుర్గాలు తమ వద్దకు తీసుకువచ్చారు. గత ఆరు నెలలుగా తల్లిదండ్రులతో కలిసి ఉంటూ స్థానికంగా హౌస్ కీపింగ్ పనులు చేస్తుంది. మూడు రోజుల క్రితం వీరు ఊరిలో ఉన్న అల్లుడు రాజు వద్దకు వెళ్లి తమ కూతురు కాపురం నిలబెట్టాలనే ఉద్దేశంతో ఒప్పించి అతనిని కూడా ఇక్కడికి తీసుకువచ్చారు. అయితే భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ జరగడంతో మనస్తాపం చెందిన శ్రావణి శనివారం ఉదయం 8.30 గంటలకు జనప్రియా అపార్ట్మెంట్స్ ఐదో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని శ్రావణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాల వల్లనే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.