Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Senior Journalist Kommineni Srinivasa Rao Released From Jail1
జైలు నుంచి సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని విడుదల

గుంటూరు: సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు జైలు నుంచి విడుదలయ్యారు. గుంటూరు జైలు నుంచి సోమవారం సాయంత్రం( జూన్‌ 16) ఆయన విడుదలయ్యారు. సాక్షి ఛానెల్‌ డిబేట్‌లో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అక్రమ కేసు బనాయించిన గుంటూరు తుళ్లూరు పోలీసులు.. కొమ్మినేనిని అరెస్టు చేశారు. అయితే ఈ అరెస్టుపై శుక్రవారం(జూన్‌ 13) విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. కొమ్మినేనిని వెంటనే విడుదల చేయాలంటూ బెయిల్‌ మంజూరు చేసింది. కాగా, కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్‌ అక్రమమంటూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్‌ పీకే మిశ్రా, జస్టిన్‌ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం గత శుక్రవారం విచారణ జరిపింది. ‘‘టీవీ డిబేట్‌లో నవ్వినంత మాత్రాన అరెస్ట్‌ చేస్తారా?. అలాగైతే కేసుల విచారణ సందర్భంగా మేమూ నవ్వుతుంటాం. వాక్ స్వాతంత్రాన్ని రక్షించాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. విశ్లేషకుడి వ్యాఖ్యలతో కొమ్మినేనికి ఏం సంబంధం?. ఆయన్ని వెంటనే విడుదల చేయండి’ అని సృష్టం చేసిన ద్విసభ్య ధర్మాసనం.. బెయిల్‌ను మంజూరు చేసింది.

Changing Landscape of Tech Jobs What Software Engineers Need to Know in 20252
సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లూ.. ఆ జమానా ముగిసింది!

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు ఒకప్పుడు మంచి డిమాండ్‌ ఉండేది. వారిని నియమించుకునేందుకు మల్టీ నేషనల్‌ కంపెనీలు భారీ జీతాలు, ఆకట్టుకునే సౌకర్యాలతో వెంటపడేవి. ఇప్పుడా జమానా ముగిసింది. టెక్ పరిశ్రమలో జీతాల పెరుగుదల, పెద్దమొత్తం నియామక ప్రక్రియలు తగ్గుతున్నాయి. 2025లో సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఉద్యోగాలు అనేక మార్పులను ఎదుర్కొంటున్నాయి. ఇవి ఆటోమేషన్, కొత్త వేతన ధోరణులు, కార్యాలయంలో మారుతున్న దృక్పథాలను ప్రతిబింబిస్తున్నాయి. ఏఐ రాకతో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో మార్పులుసాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల ముఖ్యమైన పని అయిన కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ అంటే కోడ్ రాయడాన్ని కృత్రిమ మేధస్సు (AI) పూర్తిగా మార్చుతోంది. గిట్‌హబ్‌ కోపైలట్‌, కర్సర్‌చాట్‌ వంటి టూల్స్ ద్వారా ఎటువంటి అధునాతన కోడింగ్ నైపుణ్యాలు లేకుండానే ప్రోగ్రామింగ్ చేయడం సాధ్యమవుతోంది. అంటే సాధారణ టెక్ట్స్‌ ప్రాంప్ట్‌ ఇస్తే చాలు ఎలాంటి కోడ్‌ అయినా చిటికెలో వచ్చేస్తోంది. దీన్నే "వైబ్ కోడింగ్" అని పిలుస్తున్నారు.పెరుగుతున్న సైలెంట్ లేఆఫ్స్ సిలికాన్‌ వ్యాలీకి చెందిన టాప్‌ సంస్థల దగ్గర నుంచి భారతీయ ఐటీ కంపెనీల వరకూ అన్నీ ఉద్యోగుల సంఖ్యను క్రమంగా తగ్గించుకుంటున్నాయి. కంపెనీలు గతంలో లాగా ఒకేసారి పెద్ద సంఖ్యలో జాబ్‌లకు కోతలు పెట్టడం లేదు. బదులుగా ‘సైలెంట్ లేఆఫ్స్’ విధానాన్ని అమలు చేస్తున్నాయి. అంటే ఉద్యోగులకు అనువైన వాతావరణాన్ని కల్పించి వారితో స్వచ్ఛందంగా రాజీనామా చేయించడం ద్వారా వదిలించుకుంటున్నాయి. ఆ స్థాయిలో జీతాల పెరుగుదల లేదుటెక్ రంగంలో వేతనాలు ఇంకా ఎక్కువగానే ఉన్నప్పటికీ, గతంలో మాదిరిగా తక్కువ కాలంలోనే వేగంగా వేతనాలు పెరిగినట్లు ఇప్పుడు పెరగడం లేదు. ఒక ఉద్యోగాన్ని విడిచి మరొక ఉద్యోగం పొందడం ద్వారా ఎక్కువ జీతం పొందే అవకాశాలు తగ్గిపోయాయి. అయితే ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ వంటి హై-డిమాండ్ నైపుణ్యాలు ఉన్నవారు ఇంకా గణనీయమైన వేతనాలను పొందుతున్నారు. వ్యూహాత్మక దృక్పథం అవసరం కొత్త ఉద్యోగానికి మారడం అనుకున్నంత మంచిది కాకపోవచ్చు. ఇప్పుడు ఉద్యోగం మారడానికి ముందుగా స్థిరత, ప్రయోజనాలు, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. 2025లో ఆటోమేషన్, వేతన ధోరణులు, ఉద్యోగ మార్పులను అర్థం చేసుకున్న వారు మాత్రమే ఏఐ నైపుణ్యం, డిజిటల్ అనుసంధానం, ప్రత్యేక నైపుణ్యాలను పెంచుకుంటూ విజయవంతం అవ్వగలరు.👉 ఇది చదివారా? ఈ టెక్‌ దిగ్గజంలో తొలగింపులు

Iran state TV hit in Israeli attack on Tehran, live broadcast abruptly stopped3
యాంకర్‌ లైవ్‌ న్యూస్‌ చదువుతుండగా టీవీ ఛానెల్‌పై వైమానిక దాడి

తెహ్రాన్‌: ఇరాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం కురిపిస్తోంది. తాజాగా ప్రభుత్వ మీడియా సంస్థను టార్గెట్‌ చేసింది. యాంకర్‌ న్యూస్‌ చదువుతుండగానే స్టూడియోపై క్షిపణితో దాడి చేసింది. ఆ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇరాన్‌లో ఇజ్రాయెల్ ఆర్మీ వైమానికంగా ఆధిపత్యం సంపాదించిందని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఆ ప్రకటన తర్వాత ఇరుదేశాల మధ్య వైరం తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో, ఇజ్రాయెల్ క్షిపణి ఓ ఇరాన్ ప్రభుత్వ టీవీ ఛానెల్‌పై దాడికి దిగింది. స్టూడియోలో యాంకర్‌ సహర్ ఇమామీ న్యూస్‌ బులిటెన్‌ చదువుతున్నారు. అదే సమయంలో ఇజ్రాయెల్‌ క్షిపణి ప్రయోగించడంతో టీవీ ఛానెల్‌ కార్యాలయం దద్దరిల్లింది. స్టూడియో కంపించడంతో యాంకర్ సహర్ ఇమామీ భయభ్రాంతులతో బయటకు పరుగులు తీశారు. ఇజ్రాయెల్, ఈ యుద్ధంలో తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించే దిశగా వేగంగా ముందుకు సాగుతున్నామని ప్రకటించింది. అయితే రెండు దేశాల్లోనూ ప్రజలు తీవ్ర భయాందోళనల మధ్య సురక్షిత స్థలాలకు పరుగెడుతున్నారు. ఈ ఘర్షణ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.Israeli Air Force bombed Iran’s State TV headquarters live on air !Moments before the strike, they issued a evacuation warnings also TV headquarters is now completely destroyed..it’s a massive hit on Tehran’s media narrative stronghold. pic.twitter.com/Pu8xiAFcyG— Major Surendra Poonia (@MajorPoonia) June 16, 2025

Pak Defence Ministers Bizarre Claim Goes Viral4
‘ఐపీఎల్‌ ఫ్లడ్‌లైట్లను హ్యాక్‌ చేశాం’

న్యూఢిల్లీ: భారత్‌లో ఏం జరిగినా అది తామే చేశామని పదే పదే చెప్పుకుంటూ మళ్లీ అభాసుపాలయ్యారు పాకిస్తాన్‌ రక్షణమంత్రి ఖవాజా అసిఫ్‌. గతంలో భారత రక్షణ వ్యవస్థలోని కీలక సమాచారాన్ని హ్యాక్‌ చేశామని చెప్పుకున్న ఖవాజా అసిఫ్‌.. ఈసారి ఐపీఎల్‌ మీద పడ్డారు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌ ఎడిషన్‌లో ఫ్లడ్‌లైట్లను కూడా ఒకానొక సందర్భంలో హ్యాక్‌ చేశామని పాక్‌ అసెంబ్లీ(పార్లమెంట్‌) సాక్షిగా డబ్బా కొట్టుకున్నారు. మే 8వ తేదీన పంజాబ్‌ కింగ్స్‌- ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో భాగంగా ఫ్లడ్‌లైట్లను తమ దేశానికే చెందిన హ్యాకర్లు హ్యాక్‌ చేశారన్నారు. అసలు పాకిస్తాన్‌లో ఇంత టెక్నాలజీ ఉందా అనే భారతే ఆశ్చర్యపోతుందంటూ ఏదో చెప్పే యత్నం చేశారు. దీనిపై నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు. ‘మీరు హ్యాక్‌ చేయడానికి ఫ్లడ్‌లైట్లు ఏమీ వైఫై కనెక్షన్‌ మీద నడవలేదు. కట్టుదిట్టమైన ఎలక్రికల్‌ సిస్టమ్‌లో నడిచాయి. ఇప్పుడు పాకిస్తాన్‌లో సైబర్‌ సబ్జెక్ట్‌ఃను ఏమైనా ప్రవేశపెట్టారా? అని సెటైర్‌ వేయగా, ‘మీరు స్కూలింగ్‌ ఎక్కడ చదివారో.. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీని భలే చెబుతున్నారు’ అంటూ మరో నెటిజన్‌ రిప్లై ఇచ్చాడు‘ఈసారి ఒక పని చేయండి.. ఫ్లడ్‌లైట్లను కాదు.. స్కోరు బోర్డును హ్యాక్‌ చేయండి’ అంటూ మరొక యూజర్‌ వ్యంగ్యంగా రాసుకొచ్చాడు. ఇలా పాకిస్తాన్‌ రక్షణమంత్రిపై సెటైర్ల వర్షం కురుస్తోంది. పాకిస్తాన్‌ రక్షణమంత్రి ఖవాజా అసిఫ్‌ ఇలా దొరికిపోవడం తొలిసారి కాదు.. గతంలో ఆపరేషన్‌ సింధూర్‌ సందర్భంగా తాము భారత్‌ జెట్‌ విమానాలను కూల్చివేశామని, దానికి సోషల్‌ మీడియానే సాక్షి అంటూ AI క్రియేట్‌ చేసిన వీడియోలు గురించి మాట్లాడారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి నోరెళ్ల బెట్టారు ఖవాజా అసిఫ్‌.Pakistan Defence Minister: Our Cyber warriors did Wonder during this War with India - We Switched off FLOOD LIGHTS during IPL Match pic.twitter.com/k4eMe0uCMA— Megh Updates 🚨™ (@MeghUpdates) June 14, 2025

Tech skills for youth in remote villages A new chapter with the efforts of NxtWave NSDC5
మారుమూల గ్రామాల్లోని యువతకు టెక్‌ శిక్షణ.. నెక్స్ట్‌ వేవ్‌ & ఎన్‌ఎస్‌డిసి కృషితో కొత్త అధ్యాయం

ఉత్తరప్రదేశ్ బాగ్‌పత్ జిల్లాలోని ఛప్రాలి అనే గ్రామంలో యువతకు కొత్త భవిష్యత్తు చూపిస్తూ ఒక పెనుమార్చు తెచ్చే విద్యా కార్యక్రమం మొదలైంది. నెక్స్ట్‌ వేవ్‌, నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC) కలసి గ్రామీణ ఉత్తరప్రదేశ్‌లో టెక్ స్కిల్స్ నేర్పే ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించాయి. కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ అఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్‌ ఆంట్రప్రైన్యూర్‌షిప్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో గ్రామీణ మహిళా యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.ఈ కార్యక్రమాన్ని చప్పాలిలోని చౌదరి చరణ్ సింగ్ ప్రభుత్వ మహావిద్యాలయంలో కేంద్ర మంత్రి శ్రీ జయంత్ చౌదరి గారు ప్రారంభించారు. అక్కడే “ఫ్యూచర్ స్కిల్ ల్యాబ్” పేరుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్కిల్ ఇండియా సెంటర్లో ఆధునిక టెక్నాలజీలపై ప్రాక్టికల్ శిక్షణ ఇస్తున్నారు. అక్కడి యువతలో మార్చు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అక్కడ జాయిన్ అయిన విద్యార్థుల్లో చాలా మంది కంప్యూటర్ ఎప్పుడూ వాడలేదు. మొదటి రోజు ల్యాప్ టాప్ ఆన్ చేయడం, కీబోర్డ్ ఎలా వాడాలో నేర్పించారు. ఇప్పుడు చూస్తే వారు వెబ్ యాప్స్ రూపొందించడం మొదలు పెట్టి టెక్ రంగంలో కెరీర్ దిశగా అడుగులు వేస్తున్నారు.ఇక్కడ గమనించాల్సిన ఒక గొప్ప విషయం ఈ విద్యార్థుల పరిస్థితులు. వీళ్లంతా రైతు కుటుంబాల నుంచి వచ్చారు. ఉదయం 4 గంటలకే లేచి ఇంటి పనులు, పొలంలో పనులు పూర్తి చేసి, 5నుంచి 10 కిలోమీటర్లు నడిచి స్కిల్ సెంటర్‌కు వస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు క్లాసులు అటెండ్ అవుతారు. తర్వాత మళ్లీ ఇంటికి వెళ్లి వంట పనులు, ఇల్లు చూసుకోవాలి. అయినా 4.0 టెక్నాలజీస్ ను పట్టుదలతో నేర్చుకుంటున్నారు.ఒకప్పుడు బిడియంగా ఉంటూ ఎవరితోనైనా మాట్లాడాలంటే ఇబ్బంది పడే స్వాతి ఖోకర్ ఇప్పుడు కెరీర్ వైపు ధైర్యంగా ముందుకు అడుగులేస్తోంది. తండ్రిని కోల్పోయిన తర్వాత కుటుంబ బాధ్యతను తన భుజాలపై వేసుకుంది. ప్రస్తుతం కోడింగ్ నేర్చుకుంటూ, తాను మాత్రమే కాదు, తన వయసు అమ్మాయిలందరికీ ఆదర్శంగా మారింది.నెక్స్ట్‌ వేవ్‌ సీఈవో రాహుల్ అత్తులూరి మాట్లాడుతూ, “లక్షలాది మంది విద్యార్థులకు టెక్నాలజీ స్కిల్స్ నేర్పించడమే మా లక్ష్యం. వాళ్లు చక్కగా స్కిల్స్ నేర్చుకుని, మంచి కెరీర్ నిర్మించుకోవాలి. తమ కుటుంబాలు, దేశానికి ఉపయోగపడేలా ఎదగాలి. ఈ రోజు టెక్నాలజీలకే కాదు, రేపటి భవిష్యత్తుకి కూడా సిద్ధంగా ఉండేలా మేము తయారుచేస్తున్నాం” అన్నారు.మొదట్లో వాళ్ళ పిల్లలు నేర్చుకోగలరా అని ఈ ప్రోగ్రాం పట్ల సందేహంగా ఉన్నతల్లిదండ్రులే ఇప్పుడు పెద్ద ఎత్తులో మద్దతు ఇస్తున్నారు. తమ పిల్లలు కోడ్ రాయటం, వెబ్ యాప్‌లు రూపొందించటం, నేర్చుకున్న విషయాల గురించి ధైర్యంగా మాట్లాడటం చూసి వాళ్ల నమ్మకాలే మారిపోయాయి. ఈ స్కిల్ సెంటర్ పై చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే తదుపరి బ్యాచ్‌లో చేర్చుకోమని 25 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.చౌదరి చరణ్ సింగ్ ప్రభుత్వ మహావిద్యాలయం ప్రిన్సిపాల్ డా. ప్రతీత్ దహియాకు ఇది ఒక పెద్ద లక్ష్యానికి మొదటి అడుగులాగా కనిపిస్తోంది. “ఈ కళాశాల భారత రత్న చౌదరి చరణ్ సింగ్ గారి పేరు మీద ఉంది,” అని చెప్పారు. “ఆయన ఎప్పుడూ దేశం అభివృద్ధి బాటలో సాగాలంటే అది గ్రామాల నుంచి జరగాలి” అని చెప్పేవారు. గ్రామీణ పిల్లలకు టెక్నాలజీ స్కిల్స్ ఉండాలన్నది ఆయన కల. ఇప్పుడు ఆ కల నిజమవుతుండడం ఆనందంగా ఉంది.”గ్రామీణ భారతంలో పాత పద్ధతుల విద్యపై ఆదరణ తగ్గుతూ, స్కిల్స్‌తో కూడిన ప్రాక్టికల్ లెర్నింగ్ పట్ల ఆసక్తి పెరుగుతోంది. ఆ మార్పునే ఈ ప్రోగ్రామ్ ప్రతిబింబిస్తోంది. నెక్స్ట్‌ వేవ్‌ లెర్నింగ్ ప్లాట్ ఫామ్ విద్యార్థులకు కోడింగ్ మాత్రమే కాకుండా, కమ్యూనికేషన్, టీం వర్క్, సమస్యల పరిష్కారం, ప్రాజెక్ట్ ప్రాక్టీస్ ఇలా ఇండస్ట్రీ కి అవసరమైన అనేక నైపుణ్యాలు నేర్పిస్తోంది. భాష సమస్యను ఎదుర్కొంటున్న విద్యార్థులకు మెంటర్లు ఏఐ టూల్స్ ద్వారా వర్ణాక్యులర్ సపోర్ట్ ఇవ్వడమూ ఓ పెద్ద ముందడుగు.కేవలం 6 నెలల్లోనే ముగ్గురు విద్యార్థులు ఉద్యోగాలు పొందడం వల్ల, గ్రామీణ యువతలో ఎంత వేగంగా టాలెంట్ వెలికి తీయవచ్చో స్పష్టమవుతోంది. మొదట్లో కేవలం 30 మంది విద్యార్థులతో ప్రారంభమైన ప్రోగ్రాం, ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాలనంతా తాకుతోంది. NSDC, స్థానిక నేతల మద్దతుతో నగరాల్లో మాత్రమే ఉండే అవకాశాల్ని గ్రామీణ యువతకు అందించేందుకు నెక్స్ట్‌ వేవ్ వేగంగా ముందుకెళ్తోంది. అవకాశం దరిచేరదు అనిపించిన గ్రామాల్లో ఇప్పుడు కొత్త ఉద్యమం మొదలైంది. ఈ కార్యక్రమం కేవలం శిక్షణ ఇవ్వడం మాత్రమే కాదు, విద్యార్థులలో, కుటుంబాల్లో, గ్రామీణ భారత్ భవిష్యత్తు నిర్మాణం చేయగలదు అన్న విశ్వాసాన్ని మళ్లీ చేకూర్చడం దీని అసలైన లక్ష్యం.NxtWave Institute of Advanced Technologiesకపిల్‌ కావురి హబ్‌, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, నానక్‌రామ్‌గూడ, తెలంగాణ, 500032

 Dindigul Dragons captain Ashwin accused of ball tampering by Madurai Panthers6
ర‌విచంద్ర‌న్ అశ్విన్‌పై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు..

టీమిండియా మాజీ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ బాల్ ట్యాంప‌రింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. త‌మిళ‌నాడు ప్రీమియ‌ర్ లీగ్‌లో దిండిగల్ డ్రాగన్స్‌కు సారథ్యం వహిస్తున్న అశ్విన్‌.. బాల్ ట్యాంపరింగ్ పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అశ్విన్ బంతి స్వ‌రూపాన్ని మ‌ర్చేందుకు ప్ర‌య‌త్నించాడ‌ని మ‌ధురై పాంథ‌ర్స్ జ‌ట్టు ఫిర్యాదు చేసింది.టీఎన్‌పీఎల్ 2025 సీజన్‌లో భాగంగా జూన్ 14న దిండిగల్ డ్రాగన్స్‌, మ‌ధురై పాంథ‌ర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మధురైను 9 వి​కెట్ల తేడాతో దిండిగల్ ఓడించింది. ఈ మ్యాచ్‌లో అశ్విన్ బాల్ టాంపరింగ్ పాల్పడ్డారని మ‌ధురై పాంథ‌ర్స్ సీఈవో డి. పూజ టీఎన్‌పీఎల్ నిర్వాహ‌కుల‌కు లేఖ రాశారు."ఇటీవల దిండిగల్ డ్రాగ్సన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అశ్విన్, అతడి సహచరులు ర‌సాయ‌నాల్లో ముంచిన ట‌వ‌ళ్ల‌తో బంతిని ప‌దే ప‌దే తుడిచారు. మేము అలా చేయవద్దని హెచ్చరించినప్పటికి మా మాట వినలేదు. అలా చేయడంతో బంతి బరువుగా మారింది. ట్యాంప‌రింగ్ కార‌ణంగా బ్యాట‌ర్ బంతిని కొట్టిన‌ప్పుడు లోహ ధ్వని విన్పించింది. ప్రస్తుతం ఇదే విషయంపై మా సాంకేతిక బృందం పనిచేస్తోంది. ఇందుకు సంబంధించిన ఆధారాలను టీఎన్‌పీఎల్‌కు సమర్పిస్తాము" అని లేఖలో పేర్కొంది.ఈ వివాదంపై టీఎన్‌పీఎల్ సీఈవో ప్ర‌సన్న క‌న్న‌న్ స్పందించారు. "దిండిగల్ డ్రాగన్స్ బాల్ ట్యాంపరింగ్ చేసిందన్న ఫిర్యాదు మాకు అందింది. ఆ ఫిర్యాదును మేము స్వీకరించాము. వారు చేసిన ఆరోప‌ణ‌ల‌కు సంబంధించిన ఆధారాల‌ను స‌మ‌ర్పించాల‌ని కోరాము. ఆరోపణలలో ఏదైనా నిజం ఉందని అనిపిస్తే స్వ‌తంత్ర క‌మిటీని ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా త‌గిన ఆధారాలు లేకుండా ఓ ఆట‌గాడు లేదా ఏదైన ఫ్రాంఛైజీపై ఆరోప‌ణ‌లు చేయ‌డం సరికాదు.మధురై సరైన ఆధారాలు అందించకపోతే ఆంక్షలను ఎదుర్కొక తప్పదు. ఈ టోర్నీలో ఏ ఫ్రాంచైజీ అయినా టీఎన్‌పీఎల్ అందించిన ట‌వ‌ల్స్‌ను మాత్ర‌మే ఉప‌యెగించి బంతి త‌డిని పోగ‌ట్టాలి. సిక్స్ కొట్టిన లేదా అవుట్ అయినా, ఓవ‌ర్ పూర్తి అయిన త‌ర్వాత ప్ర‌తీ సారి అంపైర్‌లు బంతిని చెక్ చేస్తారు. అయితే ఈమ్యాచ్ స‌మ‌యంలో బంతిలో వారికి ఎటువంటి స‌మ‌స్య క‌నిపించ‌లేద‌ని క‌న్న‌న్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.చదవండి: IND vs ENG; 'అత‌డేమి త‌ప్పు చేశాడని ఇంగ్లండ్ టూర్‌కు ఎంపిక చేయ‌లేదు'

Ktr Slams Revanth Reddy Over Acb Investigation On Formula E Car Race Case7
‘రేవంత్‌ నీ ఉడత ఊపులకు భయపడను’

సాక్షి,హైదరాబాద్‌: ఈ-కారు కేసు.. లొట్టపీసు కేసు. సీఎం రేవంత్‌ నీ ఉడత ఊపులకు భయపడను. దమ్ముంటే అసెంబ్లీ సాక్షిగా తీర్మానం పెట్టు. రేవంత్‌ జైలుకు వెళ్లాడు కాబట్టి మమ్మల్ని జైలుకి పెట్టాలనుకుంటున్నారు’ అంటూ కేటీఆర్‌ మండిపడ్డారు. ఫార్ములా ఈకార్‌ రేసు కేసులో ఇవాళ కేసీఆర్‌ ఏసీబీ విచారణ ముగిసింది. విచారణ అనంతరం,తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ‘ఫార్ములా ఈ కార్ రేస్ ముమ్మాటికీ లొట్టపీసు కేసే. ఈయన లొట్టపీసు ముఖ్యమంత్రే. నాలుగు గోడల మధ్య కాదు, నాలుగు కోట్ల ప్రజల ముందు చర్చిద్దాం అని అసెంబ్లీలో చర్చ పెట్టుమని అడిగాను. ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో తెలిపొద్ది అని చెప్పాను. నువ్వు ముందుకు రా? నేను తప్పు చేయలేదు అని లై డిటెక్టర్ సిద్దం కావాలని డిమాండ్ చేశాను.కానీ రాలేదు.ఉదయం 10 గంటల నుంచి అడిగిందే అడుగుడు. అటు తిప్పి ఇటు తిప్పి అడుగుతున్నారు. ఫార్ములా ఈ రేస్ విషయంలో అవినీతి జరగలేదు. సీఎం రేవంత్‌ పంపిన పశ్నలే వీళ్లు అడుగుతున్నారు. వీళ్లకు పరిపాలన చేతకాదు. దద్దమ్మ రాజకీయంతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.తెలంగాణ సాధించిన నేత కేసీఆర్, హరీష్ రావును కూడా జైల్లో పెట్టాలని చూస్తున్నారు. అడ్డంగా నోట్ల కట్టలతో దొరికిన వ్యక్తి నెల రోజులు జైల్లో ఉన్నాడు. కాబట్టి మమ్మల్ని కూడా జైల్లో పెట్టాలని చూస్తున్నారు. చేయని తప్పుకు కేసిఆర్, హరీష్ రావును కాళేశ్వరం కేసులో జైల్లో పెట్టాలని చూస్తున్నాడు. నన్ను కూడా ఈ తుపెల్ కేసుతో జైల్లో పెట్టాలని చూస్తున్నారు. మా ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కూడా తుపెల్ కేసు అన్నారు. నాపై 14 కేసులు పెట్టారు. 14000 కేసులు పెట్టుకో. ఎవ్వడు భయపడడు.అందరూ కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చిత్తు చిత్తుగా ఓడించాలి. ఈనెల 21న కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభించి ఆరేళ్లు సంబరాలు చేసుకుందాం. కాళేశ్వరం గొప్పతనం జనానికి చెప్పాలి’ అని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

Ravi Mohan estranged wife Aarti Ravi penned a sweet note for her father8
'తండ్రి నుంచి చాలా నేర్చుకుంటున్నారు'.. జయం రవి భార్య ఎమోషనల్ పోస్ట్!

కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి పేరు గత కొద్దికాలంగా ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం తన భార్య ఆర్తితో విడాకులకు సిద్దమవడమే. గతేడాది సోషల్ మీడియా వేదికగా తాము విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత భార్య, భర్తలిద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం అప్పట్లో మరింత హాట్‌ టాపిక్‌గా మారింది. ఆ తర్వాత వీరి మధ్యలో సింగర్ కెన్నీషా పేరు రావడంతో విడాకుల వ్యవహారం కాస్తా వివాదానికి దారితీసింది. అంతేకాకుండా మూడో వ్యక్తి ప్రమేయం వల్లే తాము విడిపోతున్నామంటూ ఆర్తి ఆరోపించింది. ప్రస్తుతం విడాకుల పంచాయతీ మాత్రం కోర్టులో పెండింగ్‌లో ఉంది.అయితే ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా జయం రవి భార్య ఆర్తి చేసిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. తన తండ్రి కృష్ణమూర్తి విజయ్‌కుమార్‌తో ఆమె కుమారులు సరదాగా ఆడుకుంటున్న వీడియోను పంచుకుంది. ఆయన తనకు ఎంత అండగా నిలిచారో నాకు మాత్రమే తెలుసన్నారు. ఎలాంటి షరతులు లేకుండా ప్రేమించడన్ని తన పిల్లలు కూడా ఆయన నుంచి నేర్చుకుంటారని రాసుకొచ్చింది. తనను మొదట ప్రేమించిన వ్యక్తి తన తండ్రేనని ఆర్తి ఎమోషనల్‌ పోస్ట్ చేసింది.ఆర్తి రవి తన తండ్రిన గురించి రాస్తూ.. 'తనను మొదట ప్రేమించిన వ్యక్తి నా తండ్రి. నన్ను మొదట ప్రేమించిన వ్యక్తి ప్రేమ ఇప్పటికీ అలాగే ఉంది. ఈ రోజు కొన్ని పదాలు వినడానికి మనసుకు చాలా బరువుగా ఉన్నాయి. కానీ వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తా. నా చుట్టూ చాలా అనిశ్చితిగా అనిపించినప్పుడు నేను ఎలా బయటపడాలో కూడా నాకు తెలియని రోజులు ఉన్నాయి. ఇప్పుడు మీరు నాతోనే ఉన్నారు.. కానీ ఏమి చేయాలో మీరు అడగలేదు. ప్రశాంతంగా, స్థిరంగా, బలంగా ఉన్నారు. తన తండ్రి ప్రేమను తాను తేలికగా తీసుకుంటున్నానని.. ‍అయితే తన పిల్లలు మాత్రం ఆయన ప్రేమను చూసి చాలా నేర్చుకుంటున్నారు. షరతులు లేకుండా ప్రేమించబడటం ఎలా ఉంటుందో మిమ్మల్ని చూస్తే చాలు. మీరు నన్ను మాత్రమే కాదు.. నా పిల్లలను కూడా అలానే పెంచుతున్నారంటూ ' ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది.అంతేకాకుండా జీవితంలో తన అనుభవాలు తనను ఎలా మార్చాయో కూడా ఆర్తి ప్రస్తావించింది. జీవితంలో మళ్లీ తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నా.. ఇప్పుడు నేను మీ దృష్టిలో ఒకప్పుడు మీరు వదిలేసిన అమ్మాయిని కాదని నాకు తెలుసు. జీవితం నన్ను ఎవరూ ఊహించని విధంగా పరీక్షించింది. నేను వాగ్దానం చేస్తున్నా.. మళ్లీ మీ చిన్న అమ్మాయిగా తిరిగి వస్తా అంటూ పోస్ట్ చేసింది. కాగా.. దాదాపు 15 ఏళ్ల తర్వాత రవి తన భార్య ఆర్తి నుండి విడిపోతున్నట్లు గతేడాది ప్రకటించారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు సంతానం ఉన్నారు. View this post on Instagram A post shared by Aarti Ravi (@aarti.ravi)

New Video Shows Lone Survivor Walking Out Of Air India incident 9
విశ్వాస్ కుమార్ రమేష్ నిజంగా మృత్యుంజయుడే‌.. మరో వీడియోలో

గాంధీ నగర్‌: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృత్యుంజయుడిగా నిలిచిన ఏకైక వ్యక్తి విశ్వాస్ కుమార్ రమేష్‌కు చెందిన మరో వీడియో వైరల్‌గా మారింది. తాజాగా, వెలుగులోకి వచ్చిన వీడియోలో బీజే మెడికల్‌ కాలేజీ క్యాంపస్‌ బిల్డింగ్‌ను ఎయిరిండియా విమానం ఢీకొట్టడంతో అగ్నికిలలు ఎగిసిపడున్నాయి. ఆ ప్రాంతాన్ని పొగ కమ్మేసింది. ఏదో అద్భుతం జరిగినట్లుగా అగ్నికోళం బద్దలైనప్పుడు మంటలు ఏ విధంగా ఎగిసిపడతాయో.. ఆ విధంగా మంటలు ఎగిసిపడుతున్నా 11ఏ సీటులో కూర్చున్న రమేష్, బీజే మెడికల్ కాలేజ్ క్యాంపస్ నుండి బయటకు వస్తూ కనిపిస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. అక్కడ ఉన్న ఒక వ్యక్తి అతన్ని గమనించి, అతని చెయ్యి పట్టుకుని ప్రమాదం స్థలం నుంచి దూరంగా తీసుకెళ్లాడు.ఏప్రిల్‌ 12న అహ్మదాబాద్‌లోని బీజే మెడికల్‌ కాలేజీ క్యాంపస్‌ బిల్డింగ్‌ను ఎయిరిండియా బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్‌ ఢీకొట్టింది. ఈపెను విషాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 242మందిలో మృత్యుంజయుడు ఒక్కడే సురక్షితంగా బయటపడ్డాడు.తాజా సమాచారం మేరకు ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మంది, మెడికల్‌ కాలేజీ క్యాంపస్‌ బాధితులతో కలుపుకొని మొత్తం 270 మంది మరణించినట్లు తెలుస్తోంది.ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడతో మృతదేహాల్ని గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయి. బాధితుల కుటుంబ సభ్యుల డీఎన్‌ఏల ఆధారంగా మృతదేహాల్ని గుర్తిస్తున్నారు. Unbelievable! New video of lone survivor, Viswashkumar Ramesh has emerged, showing him walking out from the crash site.He is seen wearing a white t-shirt and holding his phone in left hand.#AirIndia #AhmedabadPlaneCrash pic.twitter.com/xV83t2yjGX— Ishani K (@IshaniKrishnaa) June 16, 2025

Delhi bound Air India flight Returns From Hong Kong Due To This Reason, Details10
Air India: ఇంక ముందుకు వెళ్లడం మంచిది కాదు!

సాక్షి, న్యూఢిల్లీ: మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది!. మార్గం మధ్యలో ఈ విషయాన్ని పసిగట్టిన పైలట్‌.. వెంటనే అప్రమత్తం అయ్యారు. విమానాన్ని గమ్యస్థానానికి తీసుకురాకుండానే వెనక్కి తీసుకెళ్లి హాంకాంగ్‌లోనే ల్యాండ్‌ చేశారు. దీంతో పెను ప్రమాదమే తప్పింది. ఢిల్లీకి చెందిన ఎయిరిండియా విమానం ఏఐ 315 బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌ ప్రయాణికులతో(ఎంత మంది అనేది తెలియాల్సి ఉంది) ఈ ఉదయం హాంకాంగ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టు నుంచి బయల్దేరింది. అయితే 90 నిమిషాల ప్రయాణం తర్వాత.. విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్‌ గుర్తించారు. 🇮🇳🇭🇰🛫🛬🇭🇰Air India 315 requested to stay closer to Hong Kong citing technical reasons before deciding to return to HKIA."We don't want to continue further". 🔊 via https://t.co/E8ftHE3i9y📽️ via @flightradar24 https://t.co/XJjqSO9Lll pic.twitter.com/qWq3iXuVRW— Aaron Busch (@tripperhead) June 16, 2025ఇంకా ముందుకు వెళ్లడం కుదరదు అని చెబుతూ.. వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. చివరకు అక్కడే(హాంకాంగ్‌ ఎయిర్‌పోర్టులో) ల్యాండ్‌ చేశారు. విమానంలో హాంకాంగ్‌ నుంచి ఢిల్లీకి సుమారు 6గంటల ప్రయాణం పడుతుంది. పైలట్‌ మాటలకు సంబంధించిన ఆడియో ఒకటి వైరల్‌ అవుతోంది. 🇮🇳 🇭🇰 🛫 🛬 🇭🇰 Air India 315 from Hong Kong to Delhi diverted back to Hong Kong after takeoff on Monday.The plane departed 3hrs and 26 minutes delayed, then returned to Hong Kong roughly an hour after takeoff. The flight was on a 7 year old Boeing 787-8 Dreamliner. pic.twitter.com/kTNvlcfMFV— Aaron Busch (@tripperhead) June 16, 2025ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం టెక్నికల్‌ టీం సమస్యను గుర్తించే పనిలో ఉంది. ఈ ఘటనపైగానీ, విమానాన్ని రీషెడ్యూల్‌ చేయడంపైనగానీ ఎయిరిండియా ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం భారత్‌లో ఎయిరిండియాతో పాటు ఇండిగో విమానయాన సంస్థ బోయింగ్‌ 787 విమానాలను ఉపయోగిస్తోంది. 2025 గణాంకాల ప్రకారం.. ఎయిరిండియా 33 డ్రీమ్‌లైనర్‌ విమానాల్ని ఉపయోగిస్తోంది. అయితే జూన్‌ 12న జరిగిన అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం తర్వాత ఎయిరిండియా విమానయాన సంస్థ వరుస ఘటనలతో వార్తల్లో నిలుస్తోంది. ఆ కంపెనీ బోయింగ్‌ డ్రీమ్‌లైనర్‌ విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు బయటపడుతున్నాయి. అలాగే బాంబు బూచీ నేపథ్యంలోనే పలు విమానాల రాకపోకల్లో అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యాలతో.. అన్ని బోయింగ్‌ విమానాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ నిర్ణయించింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement