పెద్దపల్లిరూరల్/గోదావరిఖనిటౌన్/సుల్తానాబాద్(పెద్దపల్లి)/రామగిరి(మంథని): జిల్లాలోని యువ ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో సుమా రు 12వేల మందికి పైగా కొత్తగా ఓటర్లు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో చాలామంది సోమవారం ఆయా ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. తొలిసారి ఓటువేయడం ఆనందంగా, సంతోషంగా ఉందని వెల్లడించారు. అయితే, అవి నీతి రహిత పాలన అందించడం, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం, కొత్త ప్రాజెక్టులు తేవడంలో చొరవ చూపే నాయకుడికే తమ ఓటు వేశామని వెల్లడించారు. ఇంకా ఎవరేమంటున్నారంటే..
Comments
Please login to add a commentAdd a comment