మంచిర్యాలక్రైం: జిల్లాలో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. మంచిర్యాలలో సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ కేంద్రం వద్ద వరుసలో ఉన్న ఓటర్ల వద్ద ఓటర్ స్లిప్ ఎన్నికల సిబ్బంది తీసుకుని టోకెన్లు అందజేశారు. టొకెన్లు తీసుకున్న వారికి మాత్రమే ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. దీంతో సాయంత్రం 5గంటల వరకు ఓటింగ్ సాగింది. నాలుగు గంటల తర్వాత ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన వారిని వెనక్కి పంపించారు. దీంతో ఓటు వేయకుండా సుమారు వంద మంది ఓటర్లు జిల్లా కేంద్రంలోని మజీద్వాడలో 190, 191వ పోలింగ్ కేంద్రాల్లో వెనుదిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment