ఓటేసిన ట్రాన్స్‌జెండర్లు | - | Sakshi
Sakshi News home page

ఓటేసిన ట్రాన్స్‌జెండర్లు

Published Tue, May 14 2024 10:45 AM | Last Updated on Tue, May 14 2024 10:45 AM

ఓటేసి

గోదావరిఖని: రామగుండం నియోజకవర్గంలోని టాన్స్‌జెండర్లు సోమవారం తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. స్థానిక మనోచైతన్యలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో పలువురు ట్రాన్స్‌జెండర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.

ఢిల్లీ నుంచి వచ్చి..

ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): ఖాజీపల్లి గ్రామాని కి చెందిన ఐఎఫ్‌ఎస్‌ అధి కారి బయ్యపు సందీప్‌ కు మార్‌ పెద్దపల్లి పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఢిల్లీ నుంచి విమానంలో వచా్చారు. సమీప పోలింగ్‌ కేంద్రంలో సోమవారం తన ఓటుహక్కు వినియోగించుకున్నారు.

ఓటు కోసం అమెరికా నుంచి..

రామగిరి(మంథని): ప న్నూర్‌ గ్రామానికి చెందిన సింగరేణి కార్మికుడు చిందం సమ్మయ్య చిన్నకూతు రు చిందం కావ్య అమెరికాలోని పెన్సుల్వేనియా గ ణన్‌ యూనివర్సిటీలో చ దుకుంటోంది. ఎన్నికల్లో తన ఓటుహక్కు వినియోగించుకునేందుకు స్వగ్రామం వచ్చి సోమ వారం ఓటుహక్కు వినియోగించుకుంది.

అప్పుడు 41రోజులు.. ఇప్పుడు 22 రోజులు

సాక్షి, పెద్దపల్లి: ఎన్నికల్లో పోలింగ్‌ పక్రియ ఒక ఎత్తయితే.. ఆ తర్వాత ఫలితాలు వెంటనే వెలువడే అవకాశం లేకపోవడంతో సార్వత్రిక ఎన్నికల్లో సుదీర్ఘకాలం పాటు నిరీక్షించాల్సి రావడం మరో ఎత్తవుతోంది. ఎన్నికల పక్రియ ముగియగానే ఫలితాల కోసం అభ్యర్థులతోపాటు, ఓటర్లు ఎంతో ఆసక్తిగా చూస్తారు. విజేతలు ఎవరో, పరాజితులు ఎవరో తెలిసే ఆ రోజు రాజకీయ పార్టీలకు, నాయకులకు అగ్నిపరీక్షగా నిలుస్తుంది. 2014 సార్వత్రిక ఎన్నికలు నిర్వహించిన తర్వాత 16 రోజులకు ఫలితాలు వెల్లడికాగా, 2019లో పోలింగ్‌ తర్వాత 41రోజులకు ప్రకటించారు. ఈసారి 22 రోజుల తర్వాత.. జూన్‌ 4వ తేదీ వరకు ఫలితాల కోసం ఎదరు చూడాల్సిన పరిస్థితి ఎదురు కావడం గమన్హారం.

No comments yet. Be the first to comment!
Add a comment
ఓటేసిన ట్రాన్స్‌జెండర్లు 1
1/2

ఓటేసిన ట్రాన్స్‌జెండర్లు

ఓటేసిన ట్రాన్స్‌జెండర్లు 2
2/2

ఓటేసిన ట్రాన్స్‌జెండర్లు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement