-
Disney India: రిలయన్స్ చేతికే డిస్నీ..
భారత వ్యాపార ప్రపంచంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన వయోకామ్ మీడియా- వాల్ట్ డిస్నీల మధ్య విలీన ఒప్పందం జరిగింది. తర్వలోనే రూ.70,352 కోట్ల విలువైన జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. ఈ వెంచర్లో రిలయన్స్ మీడియా యూనిట్ దాని అనుబంధ సంస్థలు విలీన సంస్థలో కనీసం 61 శాతం వాటాను కలిగి ఉండగా... మిగిలిన వాటా డిస్నీదేనని తెలుస్తోంది. ఈ మీడియా వెంచర్కు ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ ఛైర్పర్సన్గా, వాల్ట్ డిస్నీ మాజీ ఎగ్జిక్యూటివ్ ఉదయ్ శంకర్ వైస్ ఛైర్మన్గా వ్యవహరించనున్నాయి. ఈ ఒప్పందానికి నియత్రణ సంస్థలు, వాటాదారుల నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. ఈ ఏడాది చివరి నాటికి లేదంటే 2025 ప్రారంభం నాటికి విలీన ప్రక్రియ ముగియనుంది. విలీనానంతర స్టార్ ఇండియా నుంచి ఎనిమిది భాషల్లో 70 ఛానళ్లు, రిలయన్స్కు చెందిన వయాకామ్ 18 నుంచి 38 ఛానళ్లు కలిపి మొత్తం 120 టెలివిజన్ ఛానళ్లు ఒకే గొడుకు కిందకు రానున్నాయి. ఇవి కాకుండా డిస్నీ హాట్స్టార్, జియోసినిమా పేరుతో రెండు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లు ఉండనున్నాయి. -
‘జీ’కి మరో ఎదురు దెబ్బ.. న్యాయ పోరాటం చేయనున్న సోనీ
భారత్లో అంతర్జాతీయ క్రికెట్ ప్రసారాల విషయంలో జీ - డిస్నీ హాట్ స్టార్ మధ్య 1.4 బిలియన్ల డాలర్ల సబ్ లైసెన్సింగ్ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం నుంచి జీ బయటకు వచ్చింది. దీంతో న్యాయ పోరాటం చేసేందుకు డిస్నీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇప్పటికే డిస్నీ మాతృసంస్థ సోనీ గ్రూప్ సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రంలో దావా వేసింది. ఇప్పటికే నిబంధనలు ఉల్లంఘించినందుకు సోనీకి తొలి విడతగా జీ గ్రూప్ 200 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. కానీ చెల్లించడంలో జీ విఫలమైంది.ఒప్పందాన్ని కొనసాగించలేమని తెలిపింది. దీంతో జీపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సోనీ గ్రూప్ ఉపక్రమించింది. కాగా, ఈ పరిణామాలపై జీ గ్రూప్, సోనీ గ్రూప్లు అధికారికంగా స్పందించాల్సి ఉంటుంది. -
Reliance-Disney: త్వరలో రిలయన్స్–డిస్నీ స్టార్ ఇండియా విలీనం
న్యూఢిల్లీ: దేశీయంగా మీడియా రంగంలో కన్సాలిడేషన్కు తెరతీస్తూ డిస్నీ–స్టార్ ఇండియాను విలీనం చేసుకునే దిశగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మెగా ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించిన నాన్–బైండింగ్ టర్మ్ షీటుపై సంతకాల కోసం లండన్లో జరిగిన భేటీలో డిస్నీ ప్రతినిధి కెవిన్ మేయర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి అత్యంత సన్నిహితుడైన మనోజ్ మోదీ తదితరులు పాల్గొన్నారు. ఒప్పందం కుదరడంతో వ్యాపార విలువ మదింపు తదితర ప్రక్రియలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం 45–60 రోజుల గడువు విధించుకున్నారు. అవసరమైతే దీన్ని పొడిగించే అవకాశం ఉంది. జనవరి ఆఖరు నాటికి ఈ డీల్ను పూర్తి చేయాలని రిలయన్స్ ఆసక్తిగా ఉన్నప్పటికీ ఫిబ్రవరి ఆఖరు నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ డీల్ పూర్తిగా స్టాక్, నగదు రూపంలో ఉండగలదని వివరించాయి. ఇరు సంస్థలు టర్మ్ షీటుపై చాలాకాలంగా కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రతిపాదన ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్లో భాగమైన వయాకామ్18, స్టార్ ఇండియా కార్యకలాపాలను విలీనం చేస్తారు. విలీన సంస్థలో రిలయన్స్కు 51 శాతం, డిస్నీకి 49 శాతం వాటాలు ఉండనున్నాయి. ఇందులో స్టార్ ఇండియాకు చెందిన 77 చానల్స్, వయాకామ్18కి చెందిన 38 చానల్స్ కలిపి మొత్తం 115 చానల్స్ ఉంటాయి. వీటితో పాటు డిస్నీ ప్లస్ హాట్స్టార్, జియో సినిమా అనే రెండు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లు కూడా భాగమవుతాయి. జీ ఎంటర్టైన్మెంట్, కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ (గతంలో సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా) విలీన ప్రక్రియ జరుగుతుండగా కొత్తగా రిలయన్స్, డిస్నీ–స్టార్ డీల్ కూడా కుదిరితే దేశీయంగా మీడియా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో కన్సాలిడేషన్ జరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
ఇరవై సార్లు పెళ్లి చేసుకున్నా: అవికా గోర్
‘‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్ మొదలుకొని ఇప్పటివరకూ నేను ఆన్ స్క్రీన్పై కనీసం ఇరవై సార్లు పెళ్లి చేసుకుని ఉంటా. అయితే ఇది బోర్ కొట్టలేదు. పెళ్లి కూతురిలా ముస్తాబవడం నాకు చాలా ఇష్టం. మరోసారి ‘వధువు’లో పెళ్లి కూతురిగా నటించాను. థ్రిల్లర్ జానర్లో రూపొందిన ఈ సిరీస్ ఆసక్తిగా సాగుతుంది’’ అని హీరోయిన్ అవికా గోర్ అన్నారు. నందు, అలీ రెజా, అవికా గోర్ కీలక పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘వధువు’. పోలూరు కృష్ణ దర్శకత్వంలో శ్రీకాంత్ మెహతా, మహేంద్ర సోని నిర్మించిన ‘వధువు’ ఈ నెల 8 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా అవికా గోర్ మాట్లాడుతూ–‘‘బెంగాలీ సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్ ‘ఇందు’ను తెలుగులోకి ‘వధువు’గా తీసుకొస్తున్నాం. ఇలాంటి స్క్రిప్ట్లో నేను ఇప్పటిదాకా నటించలేదు. నాకు టీవీ సీరియల్స్ చేసిన అనుభవం ఉంది. బుల్లితెర ప్రేక్షకులకు ఎలాంటి కంటెంట్ ఇష్టమో.. అది ‘వధువు’లో ఉంటుంది. ఇక చిన్నప్పుడే నటిగా మారడం వల్ల నా పర్సనల్ లైఫ్కు టైమ్ కోల్పోయినా... నటిగా నేను ప్రతి రోజూ ఒక కొత్త పాత్రలో కనిపించగలుగుతున్నాను.. ప్రతి రోజూ ఒక కొత్త లైఫ్ చూస్తున్నాను. నిర్మాతగా ‘పాప్ కార్న్’ సినిమా తీయడం గర్వంగా ఉంది. ఎలాంటి హంగామా లేకుండా ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా నా పెళ్లి చేసుకోవాలనుంది. ప్రస్తుతం తెలుగులో ఆది సాయికుమార్ హీరోగా రూపొందుతున్న ఒక సినిమా చేస్తున్నా. అలాగే హిందీలో కొన్ని ప్రాజెక్ట్స్లో నటిస్తున్నాను’’ అన్నారు. -
ప్రపంచకప్ క్రికెట్ను ఎంతమంది చూశారంటే..
భారతదేశంలో క్రికెట్కు ఉన్న క్రేజ్ చాలాఎక్కువ. గల్లీలో క్రికెట్ ఆడే చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఇండియా మ్యాచ్ వస్తుందంటే టీవీలకు అతుక్కుపోతారు. అదీ ఫైనల్ మ్యాచ్ అంటే మరీ ఎక్కువ. అందులోనూ వరల్డ్కప్ ఫైనల్స్ అంటే చెప్పనక్కర్లేదు. ఇటీవల ఉత్కంఠభరితంగా జరిగిన తుదిపోరులో భారత ఆటగాళ్లు పరాజయం పొందిన విషయం తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు రికార్డుస్థాయిలో ఈసారి వరల్డ్కప్ టోర్నమెంట్ను వీక్షించినట్లు తెలిసింది. ఏకంగా 51.8 కోట్ల మంది భారతీయులు ఇటీవల జరిగిన ప్రపంచకప్ టోర్నమెంట్ను తిలకించినట్లు డిస్నీ సంస్థ తెలిపింది. ఐసీసీ ఆధ్యర్యంలో 48 రోజుల పాటు జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ టోర్నమెంట్ను 51.8 కోట్ల మంది భారతీయులు వీక్షించారని డిస్నీ చెప్పింది. హాట్స్టార్ స్ట్రీమింగ్ యాప్ ద్వారా 5.9 కోట్ల మంది ఫైనల్ మ్యాచ్ను చూసి రికార్డు నెలకొల్పినట్లు కంపెనీ వివరించింది. 2024 నుంచి 2027 వరకు భారతదేశంలో జరిగే అన్ని ఐసీసీ టోర్నమెంట్లను ప్రసారం చేయడానికి దాదాపు రూ.25 వేల కోట్లు చెల్లించి డిజిటల్, స్ట్రీమింగ్ హక్కులను కంపెనీ కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఇదీ చదవండి: 15 ఏళ్ల బాలుడు.. రూ.100 కోట్ల కంపెనీ.. ఎలా సాధ్యమైందంటే.. పన్నెండేళ్ల తర్వాత భారత్లో ఆడిన ఐసీసీ ఫైనల్ టోర్నమెంట్ను 51.8 కోట్ల మంది చూసినట్లు బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రిసెర్చ్ కౌన్సిల్ ఇండియా(బీఏఆర్సీ) నిర్ధారించింది. దాదాపు 42,200 కోట్ల నిమిషాల టీవీ స్క్రీన్ టైం నమోదైందని బీఏఆర్సీ తెలిపింది. కేవలం భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ను 13 కోట్ల మంది, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ను 8 కోట్ల మంది, ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ను 7.5 కోట్ల మంది వీక్షించారని వివరించింది. -
ICC World Cup 2023: 3.5 కోట్ల వీక్షకులు! డిస్నీ హాట్స్టార్ రికార్డు
భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన వరల్డ్కప్ మ్యాచ్ మొబైల్ స్ట్రీమింగ్లో కొత్త రికార్డు సృష్టించింది. ఒకదశలో మ్యాచ్ను ఒకేసారి గరిష్టంగా 3.5 కోట్ల మంది వీక్షకులు చూసినట్లు డిస్నీ హాట్స్టార్ ప్రకటించింది. ఈ ఏడాది చెన్నై, గుజరాత్ మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్ను 3.2 కోట్ల మంది ఏకసమయంలో చూడగా... ఇప్పుడు ఆ రికార్డును తాజా ప్రపంచకప్ మ్యాచ్ బద్దలు కొట్టింది. -
Disney: డిస్నీ కొనుగోలుకు బ్లాక్స్టోన్తో చర్చలు!
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్స్టోన్.. భారతదేశంలోని వాల్ట్డిస్నీ స్ట్రీమింగ్, టెలివిజన్ కార్యకలాపాలను కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతుందని రాయిటర్స్ నివేదిక తెలిపింది. వాల్ట్ డిస్నీ ఇండియాలోని తన కార్యకలాపాలను విక్రయించేందుకు గతంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్అంబానీతోపాటు ఇతర సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపింది. అయితే భారత మార్కెట్పై ఆసక్తి ఉన్న బ్లాక్స్టోన్.. డిస్నీ కొనుగోలుకు సిద్ధం అవుతుదని నివేదిక తెలుపుతుంది. ఒకవేళ బ్లాక్స్టోన్తో ఈ ఒప్పందం కుదరకపోయినా డిస్నీ భారతదేశంలో తన డిజిటల్, టీవీ వ్యాపారాన్ని విక్రయించడానికి ఇతర మార్గాలను అన్వేషిస్తున్నట్లు సమాచారం. ఇంకా బ్లాక్స్టోన్, డిస్నీ ఈ విషయంపై అధికారికంగా స్పందించలేదు. డిస్నీ సబ్స్క్రైబర్ అట్రిషన్ను ప్రభావం చేసేలా ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా స్మార్ట్ఫోన్లో ఉచిత క్రికెట్ కంటెంట్ను అందించడంతో ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవాలని యోచిస్తుంది. -
వరల్డ్ కప్ వీక్షకులకు వొడాఫోన్ ఐడియా ప్రత్యేక ఆఫర్లు!
ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్ వరల్డ్ కప్ వీక్షకుల కోసం వొడాఫోన్ ఐడియా ప్రత్యేక ఆఫర్ను ప్రవేశపెట్టింది. ప్రపంచ కప్ సీజన్లో అదనపు డేటా, లాంగ్ వాలిడిటీ రీఛార్జ్లపై ఇన్స్టంట్ డిస్కౌంట్లు, మరిన్నింటితో సహా కొత్త ఆఫర్లను ప్రారంభించింది. ఇవి వొడాఫోన్ ఐడియా (Vi) యాప్లో అందుబాటులో ఉంటాయి . డిస్నీ+ హాట్స్టార్ సబ్స్కిప్షన్ రూ. 839 హీరో అన్లిమిటెడ్ ప్యాక్తోపాటు డిస్నీ+ హాట్స్టార్ సబ్స్కిప్షన్ను 3 నెలలపాటు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అందిస్తోంది. డబుల్ డేటా ఆఫర్లలో భాగంగా, వీఐ రూ. 181 డేటా ప్యాక్పై డబుల్ డేటా ఆఫర్ను అందిస్తోంది. ఇందులో ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా రోజూ 2 జీబీ (1GB+1GB) డేటా లభిస్తుంది. ఇక రూ. 418 డేటా ప్యాక్పై రూ. 30 తగ్గింపును అందిస్తోంది. ఇందులో 56 రోజుల పాటు 100 జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చు. వీఐ యాప్లో కూపన్ కోడ్ల ద్వారా, వెబ్ పోర్టల్లో ఫ్యాన్కోడ్ల ద్వారా దీర్ఘకాలిక వాలిడిటీ రీఛార్జ్లపై రూ. 75 వరకు తక్షణ తగ్గింపుతోపాటు రూ.999 ప్లాన్పై 30 శాతం తగ్గింపును కస్టమర్లకు అందిస్తోంది. కాగా ఎయిర్టెల్, రిలయన్స్ జియో కూడా క్రికెట్ వరల్డ్ కప్ లక్ష్యంగా తమ కస్టమర్లకు ప్రత్యేక డేటా ప్యాక్లు, ప్లాన్లను ప్రారంభించాయి. -
దెబ్బ మీద దెబ్బ : అమ్మకానికి డిస్నీ.. కొనుగోలు రేసులో ఎవరెవరున్నారంటే?
అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా దిగ్గజం ది వాల్ట్ డిస్నీ కంపెనీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్లో వాల్ట్ డిస్నీకి సంబంధించిన ఆస్తుల్ని అమ్మేందుకు సిద్ధమైనట్లు పలునివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో భాగంగా బిలియనీర్ గౌతమ్ అదానీ, మీడియా మొఘల్, సన్ నెట్ గ్రూప్ అధినేత కళా నిధి మారన్తో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఇందులో భాగంగా భారత్లో నిర్వహించే కార్యకలాపాలలో కొంత భాగాన్ని విక్రయించడం లేదా, స్పోర్ట్స్ రైట్స్, లోకల్ స్ట్రీమింగ్ సర్వీస్ డిస్నీ ప్లస్ హాట్స్టార్తో సహా ఇతర ఆస్తుల్ని కలిపే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తేలింది. ముఖేష్ అంబానీతో చర్చలు ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ సైతం ఆస్తుల అమ్మే అంశంపై చర్చలు ఇప్పటికే జరిగాయని బ్లూమ్బెర్గ్ గతంలో నివేదించింది. తద్వారా భారత్లో డిస్నీ తన వ్యాపారాన్ని అమ్మేడం లేదంటే జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఐపీఎల్ దెబ్బ.. ఆపై హెచ్బీఓ కాంట్రాక్ట్ సైతం జూలైలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ స్ట్రీమింగ్ హక్కులను వయాకామ్ 18 మీడియా దక్కించుకున్న తరువాత ఆస్తుల అమ్మకం తెరపైకి వచ్చింది. దీనికితోడు వార్నర్ బ్రదర్స్కు చెందిన హెచ్బీఓ కాంట్రాక్టును సైతం రిలయన్స్కు చెందిన వయాకామ్ 18 దక్కించుకోవడం కూడా ప్రభావం చూపింది. అప్పటి నుంచి డిస్నీ హాట్స్టార్కు సబ్స్క్రైబర్లు తగ్గుతున్నారు. దీంతో ఆస్తుల్ని అమ్మేందుకు మొగ్గుచూపింది. అదానీ వర్సెస్ మారన్ ఆస్తులు,స్టాక్స్ను కొనుగోలు చేసేందుకు కళానిధి మారన్ సుమఖత వ్యక్తం చేస్తుండగా.. అదానీ సైతం తన మీడియా సంస్థ న్యూ ఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ను (ఎన్డీటీవీ)ని విస్తరించడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం, క్రయ,విక్రయ అంశంపై ఎలాంటి అధికారిక ప్రకటనలు వెలుగులోకి రాలేదు. త్వరలో దీనిపై స్పష్టత రానుంది. చదవండి👉 అప్పుడు ‘మెగాస్టారే’, ఇప్పుడు కరువైన పలకరింపులు.. జీవితం భారమై.. -
ఇదే జరిగితే 'డిస్నీ ఇండియా' ముఖేష్ అంబానీ చేతికి!
Disney India: అమెరికన్ ఎంటర్టైన్మెంట్ సంస్థ 'డిస్నీ' (Disney) ఇండియన్ మార్కెట్లో తన వ్యాపారానికి సంబంధించిన ఒక సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇదే జరిగితే భారతదేశంలో డిస్నీ ఒక ప్రముఖ కంపెనీ సొంతమయ్యే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ముందు వరుసలో రిలయన్స్.. నివేదికల ప్రకారం.. డిస్నీ ఇండియాను ముఖేష్ అంబానీ నేతృత్వంలో రిలయన్స్ కొనుగోలు చేయనున్నట్లు.. ఈ వరుసలో ఇదే ముందు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డిజిటల్ స్ట్రీమింగ్ రంగంలో అడుగుపెట్టిన రిలయన్స్ డిస్నీని సొంతం చేసుకుంటే మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. భారతదేశంలో సరైన కొనుగోలుదారు లభిస్తే.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్, స్పోర్ట్స్ వంటి వాటిని ఒకేసారి విక్రయించే అవకాశం ఉంది. ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ IPLకి సంబంధించి స్ట్రీమింగ్ రైట్స్ కోల్పోయింది. ఈ హక్కులను రిలయన్స్కు చెందిన వయాకామ్ 18 సొంతం చేసుకుంది. దీంతో భారతదేశంలో ఈ బిజినెస్ మరింత డెవలప్ చేయడానికి కంపెనీ అన్ని విధాలుగా సన్నద్ధమవుతోంది. ఇదీ చదవండి: వినాయక చవితి బిజినెస్ ఇన్ని కోట్లా? విగ్రహాల ఖర్చే.. డిస్నీ ఇండియా వ్యాపారానికి సమందించిన చర్చలు ఇప్పటికే జరుపుతున్నట్లు బ్లూమ్ బర్గ్ వెల్లడించింది. కాగా ఈ చర్చలు డీల్ వరకు వెళ్లే అవకాశం లేదని కొందరు భావిస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించకపోవడం గమనార్హం. అంతే కాకుండా ప్రస్తుతం ఐపీఎల్ స్ట్రీమింగ్తో జియో టీవీకి సబ్స్క్రైబర్స్ సంఖ్య భారీగా పెరిగింది. ఈ సమయంలో డిస్నీ ఇండియాను రిలయన్స్ సొంతం చేసుకుంటే.. ఈ రంగంలో కూడా అగ్రగామిగా నిలిచే అవకాశం ఉంది. -
నెట్ఫ్లిక్స్ బాటలో డిస్నీ+ హాట్స్టార్ - అదే జరిగితే..
Disney Hotstar Limit Account Sharing: ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ భారతదేశంలో పాస్వర్డ్ షేరింగ్ను ముగించినట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో 'డిస్నీ+ హాట్స్టార్' (Disney+ Hotstar) కూడా ఇదే బాటలో పయనించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, డిస్నీ+ హాట్స్టార్ దాని ప్రీమియం వినియోగదారులలో పాస్వర్డ్ షేరింగ్ను పరిమితం చేయడానికి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే వినియోగదారులు కేవలం నాలుగు పరికరాల నుంచి మాత్రమే లాగిన్ చేయడానికి అనుమతించే కొత్త విధానాన్ని అమలు చేయాలని సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం. ఇదే అమలులోకి వస్తే స్ట్రీమింగ్ దిగ్గజం పాస్వర్డ్ షేరింగ్ వినియోగదారులకు కష్టతరమవుతుంది. పాస్వర్డ్ షేరింగ్ విధానానికి నెట్ఫ్లిక్స్ మంగళం పాడింది. ఇప్పటికే 100 కంటే ఎక్కువ దేశాల్లో ఇది అమలులో ఉంది. ప్రస్తుతం మనదేశంలో ప్రీమియం డిస్నీ+ హాట్స్టార్ ద్వారా గరిష్టంగా 10 పరికరాలలో లాగిన్లను అనుమతిస్తుంది. కానీ దీనికి త్వరలోనే స్వస్తి చెప్పనుంది. కొత్త రూల్స్ ఈ ఏడాది చివరి నాటికి అమలయ్యే అవకాశం ఉంది. (ఇదీ చదవండి: ఆలోచన చెప్పగానే అమ్మతో చీవాట్లు.. నేడు నెలకు రూ.4.5 కోట్లు టర్నోవర్!) కొత్త రూల్స్ అమలులోకి వచ్చిన తరువాత వినియోగదారులు సొంత సభ్యత్వాన్ని పొందాల్సి ఉండవచ్చు. అయితే రానున్న కొత్త మార్పులు చౌకైన ప్లాన్లకు కూడా వర్తిస్తాయా? లేదా అనేది తెలియాల్సి ఉంది. కాగా ఇప్పటికే అధిక ప్రజాదరణ పొందిన డిస్నీ+ హాట్స్టార్ 2022 మార్చి నుంచి 2023 మార్చి వరకు 38 శాతం వీక్షకులను కలిగి ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కొత్త రూల్స్ అమలులోకి వచ్చిన తరువాత వినియోగదారుల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుస్కోవడానికి ఇంకా కొంతకాలం వేచి ఉండాల్సిందే. -
కంటెంట్ సెన్సార్: ఓటీటీలకు కేంద్రం ప్రతిపాదన!
ఓటీటీల్లో ప్రసారమయ్యే కంటెంట్లో అశ్లీలత, హింస లేకుండా కచ్చితంగా స్వీయ సెన్సార్ చేసుకోవాలని నెట్ఫ్లిక్స్, డిస్నీ వంటి స్ట్రీమింగ్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. రాయిటర్స్ కథనం ప్రకారం.. కేంద్ర సమాచార, బ్రాడ్కాస్టింగ్ శాఖ జూన్ 20న నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ఓటీటీ సంస్థలకు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓటీటీ సంస్థలు కూడా తమ అభ్యంతరాలను తెలియజేశారు. ఫలితంగా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మీటింగ్ రికార్డ్స్, ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది. ఓటీటీల్లో ప్రసారమవుతున్న అసభ్యకరమైన, అశ్లీల కంటెంట్పై ప్రజలు, పౌర సంఘాలు, ప్రజాప్రతినిధులు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను కేంద్ర సమాచార, బ్రాడ్కాస్టింగ్ శాఖ ఆయా స్ట్రీమింగ్ సంస్థల ముందుంచింది. వీటిలో ప్రసారయ్యే ప్రముఖ సినీ తారలు నటించిన కంటెంట్ కూడా అసభ్యకర, అశ్లీల, హింసను, మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉందంటూ సమాజం నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సంబంధించి సెన్సార్ పకడ్బంధీగా ఉంటుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెన్సార్ బోర్డ్ విడుదల సినిమాలను చూసి సర్టిఫికెట్ జారీ చేస్తుంది. కానీ ఓటీటీలలో ప్రసారయ్యే కంటెంట్కు అలాంటి వ్యవస్థ లేదు. ఓటీటీ ప్రసారాలను సమీక్షించేందుకు గాను స్వతంత్ర ప్యానెల్ను ఏర్పాటు చేసుకునే విషయాన్ని ఆలోచించాలని మీటింగ్ సందర్భంగా శాఖ ప్రతినిధులు ఇండస్ట్రీ వర్గాలను కోరినట్లు తెలిసింది. కాగా నెట్ఫ్లిక్స్, అమెజాన్ సంస్థలు భారత్లో అత్యంత ఆదరణ సంపాదించుకున్నాయి. దేశ స్ట్రీమింగ్ మార్కెట్ 2027 నాటికి 7 బిలియన్ డాలర్ల విలువను చేరుకుంటుందని అంచనా. ఇదీ చదవండి: సినీ ప్రేక్షకులకు గుడ్న్యూస్! సోషల్ మీడియా దెబ్బకు దిగొచ్చిన మల్టీప్లెక్స్! -
డిస్నీ క్యారెక్టర్లుగా హాలీవుడ్ సెలబ్రిటీస్ వైరల్ ఫొటోస్
-
డిస్నీ ఉద్యోగులకు మరో షాక్, మొత్తంగా 7 వేల మంది ఇంటికే!
సాక్షి, ముంబై: ఎంటర్టైన్మెంట్ దిగ్గజం డిస్నీ మరోసారి ఉద్యోగులకు చేదువార్త చెప్పింది. మూడో రౌండ్ తొలగింపులను షురూ చేసింది. ఈ నిర్ణయం అంతటా 2,500 మంది ఉద్యోగులపై ప్రభావం చూపుతుందని మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఖర్చులను తగ్గించే చర్యలో భాగంగా, కంపెనీ ఈ వారం తన స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్ల నుండి డజన్ల కొద్దీ టైటిల్స్ను తొలగిస్తోంది. నివేదిక ప్రకారం, తీవ్రంగా దెబ్బతిన్న టెలివిజన్ విభాగం, రెండో రౌండ్ ఉద్యోగాల కోతకు నిర్ణయించింది. ఉద్యోగుల తొలగింపులు,ఇతర వ్యయ-తగ్గింపు చర్యల ద్వారా 5.5 బిలియన్ డాలర్లను ఆదా చేయాలనే ప్రణాళికలను ఫిబ్రవరిలో ప్రకటించింది. (వార్నీ.. రేఖలా మారిపోయిన అమితాబ్, అందంగా సల్మాన్ ఖాన్) 🚨 Disney Started 3rd Round of Layoffs, 2500 Employees Expected to Lose their Jobs Reliance’s JioMart also Fired 1000 Employees, More Layoffs In the Next Few Weeks Very Difficult Times for Affected Employees — Ravisutanjani (@Ravisutanjani) May 23, 2023 కాగా డిస్నీ సీఈవో బాబ్ ఇగెర్ మూడు రౌండ్ల తొలగింపులను ప్రకటించిన సంగతి తెలిసిందే. మొదటి రౌండ్ లేఆఫ్స్ మార్చిలోనే షురూ అయ్యాయి. రెండో రౌండ్లో ఏప్రిల్లో 4వేల మంది ఉద్యోగులను తొలగించింది. మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 7,000 మంది కార్మికులకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అక్టోబరు 1 నాటికి, డిస్నీకి 220,000 మంది ఉద్యోగులు ఉన్నారు . (ఫేస్బుక్ మెటాకు భారీ షాక్: ఏకంగా 10వేల కోట్ల జరిమానా) మరిన్ని ఇంట్రస్టింగ్ అప్డేట్స్, తాజా వార్తల కోసం చదవండి: సాక్షి,బిజినెస్ -
మరో నాలుగు రోజులే: ఉద్యోగులకు ఈమెయిల్ బాంబు!
సాక్షి,ముంబై: ప్రముఖ ఎంటర్టైన్మెంట్ సంస్థ వాల్డ్ డిస్నీ 7వేల ఉద్యోగాలను తీసివేయనుంది. డిస్నీ ఎంటర్టైన్మెంట్, పార్క్స్ విభాగాల ఉద్యోగులు ప్రభావితం కానున్నారు. 'రాబోయే నాలుగు రోజుల్లో' ఉద్యోగులకు గుడ్బై చెప్పనుంది. ఈ మేరకు డిస్నీసీఈవో బాబ్ ఇగర్ మార్చి 27న ఉద్యోగులకు ఇమెయిల్లో తెలియజేశారు. 5.5 బిలియన్ డాలర్ల మేర ఖర్చుల ఆదా, స్ట్రీమింగ్ వ్యాపారాన్ని లాభదాయకంగా మార్చడానికి తమ కంపెనీలోని 7 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సంస్థ సీఈవో బాబ్ ఇగర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవలి డిస్నీసబ్స్క్రైబర్ల సంఖ్య భారీగా పడిపోయింది. అటు గత మూడు నెలల్లో డిస్నీ+కు ఒక శాతం కస్టమర్లు క్షీణించారు. దీనికి తోడు సంస్థ నష్టాలు కూడా పెరిగిపోవడంతో కొత్త నియామకాలను ఆపివేయడంతోపాటు 3.6 శాతం ఉద్యోగాలపై వేటు వేసేందుకు నిర్ణయించింది. JUST IN Disney $DIS CEO Bob Iger sent this email to Disney employees today letting them know the company has begun its round of 7000 layoffs announced in February pic.twitter.com/ZqV7Z3iqXA — StockMKTNewz - Evan (@StockMKTNewz) March 27, 2023 -
మేనేజర్లకు ఆదేశాలు..ఉద్యోగుల్లో క్షణ క్షణం.. భయం.. భయం!
ప్రముఖ ఎంటర్టైన్మెంట్ దిగ్గజం డిస్నీ భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగించునుంది. ఇందులో భాగంగా తొలగించాల్సిన ఉద్యోగుల జాబితాను సిద్ధం చేయాలని మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసినట్ల బిజినెస్ ఇన్సైడర్ రిపోర్ట్ తెలిపింది. ఉద్యోగులకు తొలగింపుపై డిస్నీ స్పందించింది. ఏప్రిల్ నెలలో 4 వేల మందిని ఫైర్ చేస్తున్నట్లు తెలిపినట్లు బిజినెస్ ఇన్సైడర్ తన కథనంలో పేర్కొంది. సంస్థ పునర్నిర్మాణం, కంటెంట్ను తగ్గించడంతో పాటు ఉద్యోగుల జీతంలోనూ కోత పెట్టేందుకు కంపెనీ యోచిస్తున్నది. ‘ఇది కఠినమైన నిర్ణయమే. ఉద్యోగుల తొలగింపులతో 5.5 బిలియన్ల డాలర్లను ఆదా చేసుకోవడం ద్వారా స్ట్రీమింగ్ బిజినెస్ను మరింత లాభదాయకంగా మర్చుకోవచ్చు. పునర్వ్యవస్థీకరణ మరింత ఖర్చుతో కూడుకుంది. మా వ్యాపారాలను మరింత సమర్ధవంతంగా, ఆర్ధిక సవాళ్లతో కూడిన వాతావరణంలో కార్యకాలాపాలు నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నాము. కాబట్టే 5.5 బిలియన్ల ఖర్చును ఆదా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని సీఈవో బాబ్ ఇగర్ చెప్పారు. ఇక లేఆఫ్స్పై డిస్నీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్నీ రంగాల్లో నెలకొన్న ఆర్ధిక అనిశ్చితి కారణంగా తొలగింపులు తమని ఏ విధంగా ఇబ్బంది పెడతాయోనని క్షణమొక యుగంలా గడుపుతున్నారు. -
డిస్నీ ప్లస్ హాట్స్టార్ యూజర్లకు షాక్: ఏప్రిల్ ఫూల్ కాదు నిజం!
సాక్షి, ముంబై: ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్ డిస్నీ+ హాట్ స్టార్ యూజర్లకు షాక్. డిస్నీ+హాట్స్టార్ హెచ్బీవోతో డీల్ను ముగించుకుంది. ఫలితంగా హెచ్బీవో కంటెంట్ డిస్నీ+ హాట్స్టార్లో ఇకపై అందుబాటులో ఉండదు. ఈ విషయాన్ని సంస్థ స్వయంగా ట్విటర్ ద్వారా ధృవీకరించింది. డిస్నీ సీఈవో బాబ్ ఇగెర్ కంపెనీలో ఖర్చుల తగ్గింపు పునర్నిర్మాణాన్ని ప్రకటించిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. తాజా నిర్ణయంతో 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' ,'ది సక్సెషన్' వంటి షోలను ఏప్రిల్ ఒకటి తరువాత అభిమానులు చూడలేరు. మార్చి 31 తరువాతనుంచి బడిస్నీ+ హాట్స్టార్లో హెచ్బీవో కంటెంట్ అందుబాటులో ఉండదు. కానీ ప్రధాన ప్రపంచ క్రీడా కార్యక్రమాలతోపాటు కంటెంట్ లైబ్రరీలో 100,000 గంటల టీవీ షోలు, సినిమాలను 10 భాషల్లో ఆస్వాదించవచ్చు అని ప్రకటించింది. మరోవైపు ఈ ప్రకటన తర్వాత డిస్నీ+ హాట్స్టార్ చందాదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సబ్స్క్రిప్షన్ డబ్బును రీఫండ్ చేయమని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. ఐపీఎల్ లేదు, ఎఫ్1 లేదు. ఇపుడు హెచ్బీవో లేదు. ఇక వార్షిక చందా కోసం ఎందుకు చెల్లించినట్టు అంటూ ఒక యూజర్ మండిపడ్డారు. Hi! Starting 31st March, HBO content will be unavailable on Disney+ Hotstar. You can continue enjoying Disney+ Hotstar’s vast library of content spanning over 100,000 hours of TV Shows and Movies in 10 languages and coverage of major global sporting events. — Disney+HS_helps (@hotstar_helps) March 7, 2023 ఏప్రిల్ 1 నుండి కనిపించని షోల జాబితా బాలర్స్ బ్రదర్స్ బ్యాండ్ క్యాచ్ అండ్ కిల్ కర్బ్ యువర్ ఎంత్ ఆంట్రేజ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ మార్ ఆఫ్ ఈస్ట్టౌన్ మైండ్ ఓవర్ మర్డర్ ఒబామా సీన్స్ ఫ్రమ్ ఏ మ్యారేజ్ షాక్ సక్సెషన్ ద బేబీ ది నెవర్స్ ది సోప్రానోస్ ది టైమ్ ట్రావెలర్స్ వైఫ్ అండర్ కరెంట్ వాచ్ మెన్ వీ వోన్ దిస్ సిటీ కాగాహెచ్బీవో పలు బ్లాక్బస్టర్ షోలను నిర్మించింది. దశాబ్దాల తర్వాత కూడా వాటికి ఆదరణ తగ్గలేదు. 'ది ఫ్లైట్ అటెండెంట్', 'ప్రెట్టీ లిటిల్ లియర్స్: ఒరిజినల్ సిన్'తో సహా అనేక హెచ్బీవో మాక్స్ ఒరిజినల్లు ఇప్పటికే అమెజాన్లో అందుబాటులో ఉన్న నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియాలో హెచ్బీవో కంటెంట్ను ప్రసారం చేసే అవకాశం కూడా ఉందని పలువురు భావిస్తున్నారు. 2015లోహెచ్బీవ కంటెంట్ కోసం స్టార్ ఇండియా భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఏప్రిల్, 2020లో, వాల్ట్ డిస్నీ కంపెనీ 20 సెంచరీ స్టూడియోస్ను కొనుగోలు అనంతరం దానిపేరును డిస్నీ+ హాట్స్టార్గా మార్చిన సంగతి తెలిసిందే. -
భారత్ - ఆస్ట్రేలియాల మధ్య టెస్ట్ .. ఆగ్రహంలో క్రికెట్ లవర్స్
భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ సమయంలో క్రికెట్ లవర్స్ అసహనానికి గురయ్యారు. అందుకు స్ట్రీమింగ్ సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్ సేవల్లో అంతరాయమే కారణమని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం డిస్నీప్లస్ హాట్ స్టార్ సేవలు డౌన్ అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా ఇతర ఆన్ లైన్ సర్వీసుల్లో ఏర్పడిన అంతరాయాలు, వాటికి పరిష్కార మార్గాలు చూపే డౌన్డిటెక్టర్ సంస్థ 500 మందికిపై యూజర్లు ఈ అంతరాయంపై ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. వినియోగదారులు లాగిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తలెత్తిన ఎర్రర్ మెసేజ్ స్క్రీన్షాట్లను ట్విటర్లో షేర్ చేసినట్లు నివేదించింది. డౌన్డిటెక్టర్లోని అవుట్టేజ్ మ్యాప్ ప్రకారం..ఢిల్లీ, జైపూర్, లక్నో, కోల్కతా, నాగ్పూర్, హైదరాబాద్, ముంబై, చండీగఢ్ల నుంచి యూజర్లు ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయి.ఈ సాంకేతిక సమస్యలపై డిస్నీప్లస్ హాట్స్టార్ యాజమాన్యం స్పందించింది. మా యాప్లు, వెబ్ సేవల్లో ఊహించని విధంగా సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొంది. సమస్యను పరిష్కరించేలా ఐటీ నిపుణుల బృందం పనిచేస్తుందని, త్వరలో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. -
Disney layoffs: 7వేల మందిని తొలగించిన డిస్నీ.. కారణం ఇదే..
ప్రపంచవ్యాప్తంగా అన్ని కంపెనీలను ఆర్థిక మాంద్య భయాలు పడీస్తున్నాయి. ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు చాలా కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగించుకుంటున్నాయి. లేఆఫ్స్ బాట పట్టిన యూఎస్ టెక్ కంపెనీల సరసన ప్రముఖ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ డిస్నీ నిలిచింది. 7 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తాజాగా తెలిపింది. గతేడాది సీఈఓ బాబ్ ఇగర్ తిరిగి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన తీసుకున్న సంచలన నిర్ణయం ఇది. ‘‘ఇది తేలిగ్గా తీసుకున్న నిర్ణయం కాదు.. ప్రపంచవ్యాప్తంగా అంకిత భావంతో పనిచేస్తున్నప్రతిభావంతులైన మా ఉద్యోగులపై నాకు గౌరవం, అభిమానం ఉన్నాయి’’ అని త్రైమాసిక ఫలితాల వెల్లడి అనంతరం తనతో మాట్లాడిన విశ్లేషకులతో సీఈఓ బాబ్ ఇగర్ ఇలా వ్యాఖ్యానించారు. 2021 వార్షిక నివేదిక ప్రకారం.. ఆ ఏడాది నవంబర్ 2 నాటికి డిస్నీ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా 1.90 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 80 శాతం మంది శాశ్వత ఉద్యోగులు. తగ్గిపోయిన సబ్స్క్రైబర్లు డిస్నీ ప్లస్కు సబ్స్క్రైబర్ల సంఖ్య ఇటీవల గణనీయంగా తగ్గిపోయింది. అంతకు ముందు త్రైమాసికంతో పోల్చుకుంటే గతేడాది డిసెంబర్ 31 నాటికి చందాదారుల సంఖ్య 1 శాతం తగ్గి 168.1 మిలియన్లకు పడిపోయింది. దీంతో కాస్ట్ కటింగ్పై దృష్టి పెట్టిన యాజమాన్యం 7వేల మందిని తొలగించేందుకు సిద్ధమైంది. అయితే గడిచిన త్రైమాసికంలో విశ్లేషకులు ఊహించినదాని కంటే మెరుగ్గా డిస్నీ గ్రూప్ 23.5 బిలియన్ డాలర్ల ఆదాయం నమోదు చేసింది. (ఇదీ చదవండి: మేనేజర్లు అయితే ఏంటీ.. పనిచేయకపోతే రాజీనామా చేయండి: జుకర్బర్గ్) -
ఐటీలో మొదలై అక్కడి వరకు.. ఉద్యోగులపై వేటుకు రెడీగా ఉన్న ప్రముఖ ఓటీటీ సంస్థ!
అంతర్జాతీయ పరిస్థితులు, ఆర్థిక మాంద్యం భయాలు, ఆశించిన ఫలితాలు అందుకోవడంలో విఫలం.. ఇవన్నీ కలిసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీలను కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో ఇప్పటికే వరుసగా ఒకదాని తర్వాత మరొకటి కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. ఇప్పటికే ట్విట్టర్, మెటా లాంటి దిగ్గజ సంస్థలు తొలగింపులను ప్రకటించగా తాజాగా స్టీమింగ్ దిగ్గజం డిస్నీ ఉద్యోగాలను తగ్గించే మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై కంపెనీ సీఈఓ మాట్లాడుతూ.. ప్రస్తుతం కంపెనీ ఖర్చలను తగ్గించే పనిలో ఉన్నాం. ఆ ప్రక్రియపైనే మా సిబ్బంది పని చేస్తున్నారు. ఇటీవల ఆశించిన ఫలితాలు పొందలేకపోయాం, పైగా అంతర్జాతీయంగా పరిణామాలు కూడా తిరోగమనంవైపు సూచిస్తున్నాయి. అందుకే మేము కొంత సిబ్బంది తగ్గించాలని అనుకుంటున్నాం, అయితే ఆ సంఖ్యను ఇప్పుడే చెప్పలేమని తెలిపారు. ఉద్యోగులపై వేటు మాత్రమే కాకుండా వ్యాపార పర్యటనలను పరిమితం చేయాలని ఆయన సంస్థలోని ముఖ్య అధికారులను కోరారు. అవసరమైన ప్రయాణాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాలంటే ప్రస్తుతం కఠినమైన, అసౌకర్య నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం డిస్నీలో దాదాపు 190,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వసూళ్ల పరంగా డిస్నీ ఇటీవల పెద్దగా రాణించలేదు. నివేదికల ప్రకారం, కంపెనీ షేర్లు బాగా పడిపోయాయి, కొత్తగా వచ్చిన ఫలితాలను చూస్తే 52 వారాల కనిష్టానికి చేరాయి. గతంలో, వార్నర్ బ్రదర్స్, నెట్ఫ్లిక్స్తో సహా స్ట్రీమింగ్ కంపెనీలు ఈ సంవత్సరం వాల్యుయేషన్స్ మందగించడంతో తమ వర్క్ఫోర్స్ను తగ్గించుకున్నాయి. ప్రస్తుతం డిస్నీ కూడా తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించే ప్లాన్ ఉన్నప్పటికీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. చదవండి: ఫోన్పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా! -
జానీ డెప్కు క్షమాపణ కోరుతూ రూ.2355 కోట్లు ఆఫర్!
'పైరేట్స్ ఆఫ్ కరేబియన్' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు హాలీవుడ్ స్టార్ జానీ డెప్. కెరీర్ సజావుగా సాగుతుందనుకున్న సమయంలో అతడి భార్య అంబర్ హెరాల్డ్తో విబేధాలు రావడం, విడాకులు తీసుకోవడం, ఆ తర్వాత జుగుప్సాకర రీతిలో ఆరోపణలు చేసుకుంటూ కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. ఈ కేసులో చివరాఖరకు జానీ విజయం సాధించాడు. అయితే అంబర్ ఆరోపణలు చేసిన సమయంలో హాలీవుడ్లోని డిస్నీ వంటి బడా నిర్మాణ సంస్థలు జానీతో సినిమా చేసేందుకు నిరాకరించాయి. ఇప్పుడు అతడు కోర్టులో నిర్దోషి అని నిరూపితమవడంతో తిరిగి జానీతో కలిసి పని చేసేందుకు సమాయత్తమవుతున్నాయి. అయితే దానికంటే ముందు డిస్నీ అతడికి క్షమాపణ కోరుతూ లేఖ పంపించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, కరేబియన్ ఫ్రాంచైజీలో నటించాలంటూ రూ.2,355 కోట్లు(301 మిలియన్ డాలర్స్) ఆఫర్ చేసినట్లు సమాచారం. కాగా కరేబియన్ ఆఫ్ పైరేట్స్లోని ఐదు భాగాల్లో జాక్ స్పారోగా జానీనే నటించాడు. మరి జానీ వారిని క్షమిస్తాడా? నెక్స్ట్ పార్ట్లో అతడు ఉన్నాడా? లేదా? అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే! జానీ- అంబర్ కేసు విషయానికి వస్తే.. 2015లో జానీ డెప్, అంబర్హర్డ్ల వివాహం జరిగింది. కానీ, ఏడాదికే మనస్పర్థలు రావడంతో 2017లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ ఒకరి మీద తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. 2018లో అంబర్ సెక్సువల్ వయొలెన్స్ ఆర్టికల్ రాయగా.. అది తన పరువుకు భంగం కలిగించేలా ఉందంటూ 2019 ఫిబ్రవరిలో జానీ కోర్టుకెక్కాడు ఇందుకుగానూ 50 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని కోరాడు. ప్రతిగా 2020 ఆగస్టులో తానూ గృహ హింసను ఎదుర్కొన్నానంటూ అంబర్ హెరాల్డ్ 100 మిలియన్ డాలర్లకు కౌంటర్ దావా వేసింది. ఈ దావాల్లో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం జానీకి అనుకూలంగా తీర్పునిచ్చింది. చదవండి: ఒకేసారి రిపీట్ కానున్న 10 జంటలు.. ప్రేమ వివాహానికి రెడీ అవుతున్న హీరో రామ్, త్వరలో ప్రకటన?! -
డబ్బులు ఖర్చుపెట్టి ప్రజలు తెగ వాడేస్తున్న పాపులర్ 10 యాప్స్ ఇవే..!
సోషల్ మీడియా వచ్చేశాక ప్రపంచంలో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగిపోతుంది. ఇబ్బడి ముబ్బడిగా కొత్త కొత్త యాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఏదో ఒక సినిమాలో చెప్పినట్లు యాప్లు ఇప్పుడు స్మార్ట్ఫోన్ వినియోగదారుల జీవితాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. చాలామంది వాటిని వినియోగించుకోవడంతో పాటు డబ్బు కూడా ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ‘సెన్సార్ టవర్’ నివేదిక ప్రకారం.. డబ్బులు చెల్లించి మరి ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్న ప్రపంచంలోనే పాపులర్ యాప్ల గురించి ఒక నివేదిక విడుదల చేసింది. ”ఆపిల్ యాప్ స్టోర్లోని టాప్ 100 నాన్-గేమ్ సబ్స్క్రిప్షన్ యాప్లు.. 2021లో 13.5 బిలియన్(లక్ష కోట్లకు పైగా) డాలర్లు ఆర్జించాయి” అని ఈ నివేదిక పేర్కొంది. వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్లోని టాప్ 100 సబ్స్క్రిప్షన్ యాప్ల కోసం $4.8 బిలియన్లు ఖర్చు చేశారు. ఈ టాప్ 10 యాప్ల జాబితాలో డేటింగ్ యాప్లు, ఓటీటీ కంటెంట్ స్ట్రీమింగ్ యాప్లు.. కొన్ని గూగుల్ యాప్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. స్మార్ట్ఫోన్ వినియోగదారులు అత్యధికంగా డబ్బు ఖర్చు చేసి వినియోగించే టాప్ 10 యాప్ల ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గూగుల్ వన్ టెక్ దిగ్గజం గూగుల్ అపరిమిత క్లౌడ్ స్టోరేజ్ సేవలను అందించేందుకు గూగుల్ వన్(Google One) యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే గూగుల్ ప్లే స్టోర్లో 10 కోట్ల డౌన్లోడ్ ను కలిగి ఉన్న ఈ యాప్ ద్వారా క్లౌడ్ స్టోరేజ్ సేవలను పొందాలంటే వినియోగదారుడు కొత్త మొత్తం రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే, 15 జీబీ స్టోరేజ్ వరకు వినియోగదారుడు ఎటువంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. కేవలం 15జీబీ స్టోరేజి పరిమితిని మించి ఉంటే మాత్రమే గూగుల్ వన్ సభ్యత్వాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. డిస్నీ+ 2021లో చాలా మంది వ్యక్తులు ఎక్కువగా డబ్బులు చెల్లించి వాడిన యాప్గా డిస్నీ+ నిలిచింది. వారి టీవి స్క్రీన్లపై వినోదం కోసం దీన్ని ఎక్కువగా చూశారు. డిస్నీ+ వంటి ఓటీటీ యాప్ల కోసం ప్రజలు చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారు. యూట్యూబ్ ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన యాప్లలో యూట్యూబ్ ఒకటిగా నిలిచింది. అయితే, ఇందులో వచ్చే ప్రకటనలు రాకుండా ఉండటానికి యూట్యూబ్ ప్రీమియం కోసం కొత్త మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. హెచ్బీఓ మాక్స్ హెచ్బీఓ.. ప్రీమియం ఓటీటీ కంటెంట్ ప్లాట్ఫారమ్ యాప్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. ఇందులో వచ్చే వీడియోల కోసం స్మార్ట్ఫోన్ వినియోగదారులు ఎక్కువగా ఖర్చు చేస్తారు. టిండర్ ప్రముఖ డేటింగ్ యాప్ టిండర్ వినియోగదారులు ఎక్కువ డబ్బు ఖర్చు చేసిన టాప్ 10 యాప్ల జాబితాలో ఐదవ స్థానంలో ఉంది. పండోరా పాడ్ కాస్ట్ లు, మ్యూజిక్ స్ట్రీమింగ్ వంటి ఇతర ఆడియో కంటెంట్ కోసం ప్రజలు ఎక్కువగా దీనిని వినియోగిస్తారు. యూరప్, అమెరికాలో స్మార్ట్ ఫోన్ యూజర్లు ఎక్కువగా ఉపయోగించే ఒక పాపులర్ యాప్. ట్విచ్ గేమర్స్లో అత్యంత ప్రజాదరణ పొందిన యాప్ ట్విచ్. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్లాట్ఫారమ్ చాలా అభివృద్ధి చెందింది. ఈఎస్పీఎన్ అమెరికాలో ఈఎస్పీఎన్ స్పోర్ట్స్ కంటెంట్కు ప్రధాన యాప్గా ఉంది. క్రీడల పరంగా ఈ యాప్ ఆధిపత్యం చెలాయిస్తోంది. చాలా మంది క్రీడల కోసం ఈ యాప్ను చూస్తున్నారు. బంబుల్ టిండర్ తరువాత డేటింగ్ యాప్లలో బంబుల్ అత్యంత ప్రజాదరణ పొందింది. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎక్కువ డబ్బు ఖర్చు చేసిన తొమ్మిదవ యాప్గా ఇది నిలిచింది. హులు ఈ ప్లాట్ఫారమ్లలో వినోదాన్ని కోరుకునే వినియోగదారులు బాగా ఇష్టపడే యాప్ హులు. ఓటీటీ జాబితాలో అందరికంటే ఎక్కువగా చూసే యాప్గా ఇది ఉంది. (చదవండి: రష్యా-ఉక్రెయిన్ ఎఫెక్ట్.. కేంద్రానికి లక్ష కోట్ల నష్టం..!) -
Hotstar: డిస్నీ ఫ్లస్కు భారత్లో భారీ దెబ్బ
Disney Plus Hotstar lost subscribers: స్ట్రీమింగ్ సర్వీస్ కంపెనీ ‘డిస్నీ ఫ్లస్’ (Disney+) సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఏడాది కాలంలో ఏకంగా 60 శాతం సబ్ స్క్రయిబింగ్ రేట్తో సంచలనం సృష్టించింది. అక్టోబర్ 2నాటికి మొత్తం 118.1 మిలియన్ల సబ్స్క్రయిబర్ల మార్క్ను చేరుకున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే.. మూడు నెలల వ్యవధిలో 2.1 మిలియన్ సబ్స్క్రయిబర్లను మాత్రమే చేర్చుకుని స్వల్ఫ తగ్గుదలతోనే 118.1 మిలియన్ ఫీట్ సాధించడం విశేషం. ఇక ఈ వ్యవధిలోనే భారత్లో మాత్రం డిస్నీ ఫ్లస్కు భారీ దెబ్బ పడింది. ఇండియన్ వెర్షన్ సర్వీస్ ‘డిస్నీ ఫ్లస్ హాట్స్టార్’ సబ్ స్క్రయిబర్స్ను భారీగా కోల్పోయింది. ఏకంగా 20 లక్షల మంది సబ్స్క్రయిబర్లు దూరమైనట్లు గణాంకాలు చెప్తున్నాయి. కానీ, అమెరికా, ఇతర ఇంటర్నేషనల్ మార్కెట్లో మాత్రం డిస్నీ ఫ్లస్కు భారీగా సబ్ స్క్రయిబర్లు పెరగడం విశేషం. కొత్తగా ప్రారంభించిన ‘స్ట్రీమింగ్ వార్స్’కు విపరీతమైన ఆదరణ లభిస్తోంది ఇప్పుడు. గత మూడు నెలల వ్యవధిలో యూఎస్, యూరప్లలో డిస్నీ ఫ్లస్కు 40 లక్షల కొత్త సబ్ స్క్రయిబర్లు చేరడం గమనార్హం. వివిధ రకాల సర్వీసులతో ‘డిస్నీ ఫ్లస్’ను రెండేళ్ల క్రితం ప్రారంభించిన విషయం తెలిసిందే. చదవండి: ప్లాస్టిక్ నుంచి పెట్రోల్..అందుబాటులో ఎప్పుడంటే ? -
క్రికెట్ ప్రియులకు జియో బంపర్ ఆఫర్!
క్రికెట్ ప్రియులకు రిలయన్స్ జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది. త్వరలో ఐపీఎల్ 2021 సెప్టెంబర్ 19 నుంచి తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో రిలయన్స్ జియో 5 సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. డిస్నీ+ హాట్ స్టార్ కంటెంట్ లైబ్రరీ కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ అందించే కొత్త ఐదు ప్రీపెయిడ్ ప్లాన్లను జియో ప్రారంభించింది. ఇప్పటి వరకు, జియో డిస్నీ+ హాట్ స్టార్ విఐపి సబ్ స్క్రిప్షన్ కింద లైవ్ స్పోర్ట్స్, హాట్ స్టార్ స్పెషల్స్, మూవీలు, టివి షోలకు యాక్సెస్ లభించేది. ఈ కొత్త రిలయన్స్ జియో ప్లాన్ డిస్నీ+ హాట్ స్టార్ కింద పైన పేర్కొన్న ప్రయోజనాలతో పాటు డిస్నీ+ ఒరిజినల్స్, డిస్నీ, మార్వెల్, స్టార్ వార్స్, నేషనల్ జియోగ్రాఫిక్, హెచ్ బీఓ, ఎఫ్ఎక్స్, షోటైమ్, ఇతర అంతర్జాతీయ కంటెంట్ కొత్త లైబ్రరీ ఆస్వాదించవచ్చు. ఈ ప్లాన్ ధరలు వరుసగా రూ.499(వాలిడిటీ 28 రోజులు), రూ.666(వాలిడిటీ 56 రోజులు), రూ.888 (వాలిడిటీ 84 రోజులు), రూ.2,599(వాలిడిటీ 365 రోజులు)గా ఉన్నాయి. రూ.499 రిచార్జ్ ప్లాన్ కింద జుకు 3జిబి డేటాను అందిస్తుండగా, మిగిలిన మూడు ప్లాన్స్ కింద రోజుకు 2 జీబీ డేటా లభిస్తాయి. (చదవండి: ఐపీఎల్ టీం... ఇప్పుడు మరింత కాస్ట్లీ గురు!) అలాగే, ఇంకా రోజుకు 1.5 జీబీ డేటా అదనంగా కావాలంటే డేటా యాడ్-ఆన్ ప్లాన్ రూ.549ను రిచార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 56 రోజుల వాలిడిటీని కలిగి ఉంటుంది. రూ.549 యాడ్-ఆన్ ప్లాన్ మినహా అన్ని కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు అపరిమిత వాయిస్, ఎస్ఎమ్ఎస్ బెనిఫిట్స్ లభిస్తాయి. -
350 కోట్ల నష్టం!.. ఆ ప్రొడక్షన్ హౌజ్కు నటి గుడ్బై?
హాలీవుడ్ నటి స్కార్లెట్ జొహాన్సన్-డిస్నీల మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. ‘బ్లాక్ విడో’ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ కాకుండా.. ఓటీటీ(డిస్నీ ఫ్లస్ హాట్స్టార్)లో రిలీజ్ చేయడంతో ఈ వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో ఒప్పంద ఉల్లంఘన ద్వారా డిస్నీ తనకు భారీ ఆర్థిక నష్టం కలిగించిందంటూ ఆమె కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. సుమారు 50 మిలియన్ల డాలర్లు(సుమారు 350 కోట్ల రూపాయల)నష్టం వాటిల్లిందంటూ లాస్ ఏంజెల్స్ కోర్టులో దావా వేసింది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో స్కార్లెట్ ‘నటాషా రోమనాఫ్’(బ్లాక్ విడో) క్యారెక్టర్ పోషించిన విషయం తెలిసిందే. అవెంజర్స్ ఎండ్గేమ్లో ముగిసిన ఈ పాత్రను.. ‘బ్లాక్ విడో’ సిరీస్ పేరుతో ప్రత్యేకంగా కొనసాగించాలని మార్వెల్ నిర్ణయించుకుంది. అయితే ఈ సిరీస్లో మొదటి సినిమా ‘బ్లాక్ విడో’ను ఓటీటీలో రిలీజ్ చేయడాన్ని డిస్నీ సమర్థించుకుంటోంది. ప్రస్తుతం ఈ కేసు నడుస్తుండగా.. భవిష్యత్తులో మార్వెల్ సినిమాల్లో స్కార్లెట్ నటించడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ తరుణంలో మరో కీలక అప్డేట్ బయటకు వచ్చింది. సూపర్ హీరో చిత్రాల విషయంలో మార్వెల్కు, డీసీ(డిటెక్టివ్ కామిక్స్)కు మధ్య ఎప్పటి నుంచో పోటీ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్కార్లెట్ను తమ వైపు లాగాలని డీసీ ప్రయత్నాలు ప్రారంభించింది. సాధారణంగా మార్వెల్ నుంచి బయటకు వచ్చిన నటులకు డీసీ గాలం వేయడం ఎప్పటి నుంచో నడుస్తున్నదే. దర్శకుడు జేమ్స్ గన్ను ఇలాగే దొరకబుచ్చుకుంది డీసీ. ఇక ప్రస్తుతం హాలీవుడ్ ఆగ్రతార అయిన స్కార్లెట్తో డీల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది డిటెక్టివ్ కామిక్స్. అయితే ఏ రోల్ కోసం డీసీ సంప్రదించింది? ఏం ఆఫర్ చేసింది? అందుకు స్కార్లెట్ అంగీకరించిందా? లేదా? అనే విషయాలపై స్పష్టత రావడానికి కొంత సమయం పట్టొచ్చు. చదవండి: హీరో నిఖిల్కు సజ్జనార్ సన్మానం
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ లండన్ పర్యటన
వ్యక్తి దుర్మరణం
కొనసాగిన ఈ – కంటెంట్ జనరేషన్పై శిక్షణ
‘నన్నయ’ వర్సిటీ అభివృద్ధికి ‘న్యూయోమ్’ సహకారం
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
భూతదయకు ప్రా‘ధాన్యం’
రెండు బైక్లు ఢీకొని వ్యక్తి మృతి
అబ్బుర పర్చిన డాగ్ షో
సమ్మర్లో చదివేద్దాం
వాహనం ఢీకొని వ్యక్తి మృతి
తప్పక చదవండి
- అనంతలో ఘోర ప్రమాదం: పెళ్లి షాపింగ్ చేసి తిరిగొస్తుండగా..
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- అలాంటి సీన్స్ నా వల్ల కాదు.. కొందరు దర్శకులు కావాలనే..
- నేడు ఈఏపీ సెట్ ఫలితాలు
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- Delhi liquor scam: నిందితుల జాబితాలో ఆప్, కేజ్రీవాల్
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
- త్వరలో గ్రూప్–4 ఎంపిక జాబితా
- బుల్లితెర నటి కేసులో ట్విస్ట్.. ప్రియుడు సూసైడ్!
Advertisement