-
ఇకపై రూ.1 లక్ష విత్డ్రా చేసుకోవచ్చు.. పీఎఫ్లో కీలక మార్పు
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ( EPFO ) చందాదారుల నగదు ఉపసంహరణ విషయంలో కీలక మార్పులు చేసింది. వైద్య ఖర్చుల కోసం చేసే 68జే క్లెయిమ్ల అర్హత పరిమితిని రూ. 50,000 నుంచి రూ.1 లక్షకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈపీఎఫ్వో కొత్త మార్పు ప్రకారం.. చందాదారులు తమ వ్యక్తిగత లేదా కుటుంబ సభ్యుల వైద్య చికిత్స ఖర్చుల కోసం ఇకపై రూ.1 లక్ష వరకూ ఉపసంహరించుకోవచ్చు. నెల అంతకంటే ఎక్కువ రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నా, ఆపరేషన్లు చేయించుకున్నా క్లెయిమ్ చేయొచ్చు. పక్షవాతం, టీబీ, క్షయ, క్యాన్సర్, గుండె సంబంధిత చికిత్స కోసం కూడా నగదు విత్డ్రాకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. లక్ష పరిమితికి లోబడి ఉద్యోగుల ఆరు నెలల బేసిక్ వేతనంతోపాటు డీఏ లేదా ఈపీఎఫ్లో ఉద్యోగి వాటా వడ్డీతో సహా ఏది తక్కువైతే అంత వరకూ మాత్రమే ఉపసంహరించుకోవడానికి క్లెయిమ్ చేయడానికి వీలుంటుంది. ఇందు కోసం ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్లు లేకుండా సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించి దరఖాస్తు చేసుకోవచ్చు. -
ప్రభుత్వానికి, సంస్థలకు భారం తప్పదా..!
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) గరిష్ఠ వేతన పరిమితిని పెంచాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 2014లో పెంచిన ఈ పరిమితిని ఇప్పటి మర్చలేదని, ఈసారైనా దీన్ని పెంచాలని ఎప్పటినుంచో ప్రభుత్వానికి డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఈపీఎఫ్వో వేతన పరిమితి పెంపు ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఈమేరకు కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. మీడియా సంస్థల్లో వెలువడిన కథనాల ప్రకారం ఒకవేళ గరిష్ఠంగా రూ.21000 పెంచితే మాత్రం ప్రభుత్వంపై అదనంగా ఆర్థిక భారం పడనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దాంతోపాటు ప్రైవేట్ సంస్థలపై కూడా ఆ భారం తప్పదని చెబుతున్నారు. పీఎఫ్ నిబంధనల ప్రకారం.. వేతననంలో 12 శాతం పీఎఫ్ కట్ అవుతుంది. మరో 12 శాతం ఉద్యోగం కల్పించిన యాజమాన్యం జమ చేయాలి. అందులో 8.33 శాతం పెన్షన్కు కేటాయిస్తారు. మిగిలిన మొత్తం పీఎఫ్లో జమ చేస్తారు. గతంలో ఈపీఎఫ్ఓ గరిష్ఠ వేతన పరిమితి రూ.15000గా ఉండేదాన్ని ప్రస్తుతం రూ.21వేలు చేస్తూ వార్తలు, ప్రతిపాదనలు వస్తున్న నేపథ్యంలో అటు ప్రభుత్వానికి, ఇటు సంస్థలకు భారం పడనుందనే వాదనలు వస్తున్నాయి. ఇదీ చదవండి: ఐటీ జాబ్ కోసం వేచిచూస్తున్నారా.. టెకీలకు శుభవార్త -
ఉద్యోగులకు శుభవార్త.. ఈఎస్ఐ వేతన పరిమితి పెంపు
సాక్షి, హైదరాబాద్: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) పరిధిలోని చందాదారులకు కేంద్రం శుభవార్త చెప్పంది. ఈఎస్ఐ గరిష్ట వేతన పరిమితి 2016కు ముందు రూ.15 వేలు ఉండగా.. కేంద్ర ప్రభుత్వం దీన్ని రూ.21 వేలకు పెంచింది. ఈ తరహాలోనే ఈపీఎఫ్ఓ కూడా వేతన పరిమితిని రూ.21 వేలకు పెంచే యోచనలో ఉందని ప్రాథమిక సమాచారం. ఉద్యోగుల గరిష్ట వేతన పరిమితిని రూ.21 వేలకు పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కార్మిక సంఘాలు, అనుబంధ సంస్థలు ఇందుకోసం గత కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో వేతన పరిమితి పెంపుతో జరిగే పరిణామాలపై కేంద్ర కార్మిక శాఖ ప్రాథమిక కసరత్తుకు ఉపక్రమించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈపీఎఫ్ చందాదారుడి గరిష్ట వేతన పరిమితి రూ.15 వేలుగా ఉంది. 2014కు ముందు ఇది రూ.6,500 కాగా.. అప్పటి ప్రభుత్వం ఈ పరిమితిని రూ.15 వేల వద్ద ఫిక్స్ చేసింది. ఈపీఎఫ్ఓ ఫార్ములా ప్రకారం ఒక ఉద్యోగికి భవిష్యనిధి చందా కింద 12 శాతం యాజమాన్యం చెల్లిస్తుండగా, మరో 12 శాతం ఉద్యోగి వేతనం నుంచి చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని (పెన్షన్ మినహా) ఉద్యోగి పదవీ విరమణ సమయంలో వడ్డీతో సహా ఈపీఎఫ్ఓ తిరిగి ఇచ్చేస్తుంది. ఉద్యోగికి లాభం..యాజమాన్యాలపై భారం చందాదారుడి గరిష్ట వేతన పరిమితి పెంపుతో ఉద్యోగికి లాభం కలగనుండగా.. అధిక చెల్లింపుల భారం యాజమాన్యాలపై పడనుంది. ప్రస్తుత ఫార్ములా ప్రకారం ఉద్యోగి గరిష్ట వేతన పరిమితి రూ.15 వేలు కాగా అందులో 12 శాతాన్ని (రూ.1800) యాజమాన్యం సదరు ఉద్యోగి ఈపీఎఫ్ఓ ఖాతాకు బదిలీ చేస్తుంది. ఇందులో నుంచి 8.33 శాతం(రూ.1250) పెన్షన్ ఖాతాకు బదిలీ అవుతుండగా... మిగతా 3.67 శాతం (రూ.550) మొత్తం భవిష్యనిధి ఖాతాలో జమ అవుతుంది. దీనికి సమానంగా ఉద్యోగి వేతనం నుంచి 12 శాతం (రూ.1800) భవిష్యనిధి ఖాతాలో జమ చేస్తారు. తాజాగా ఉద్యోగి వేతన పరిమితి రూ.21 వేలకు పెంచితే ఇందులోని 12 శాతం (రూ.2520) యాజమాన్యం చెల్లించాల్సి వస్తుంది. ఈ లెక్కన ఉద్యోగి పెన్షన్ ఖాతాలో రూ.1790, భవిష్య నిధి ఖాతాలో రూ.730 జమ అవుతాయి. దీనికి సమానంగా ఉద్యోగి వేతనం నుంచి రూ.2520 భవిష్యనిధి ఖాతాలో జమ చేస్తారు. ప్రస్తుతం ఈఎస్ఐ చట్టం కింద చందాదారుడి గరిష్ట వేతన పరిమితి రూ.21 వేలుగా ఉంది. రూ.21 వేలు దాటిన వారు ఈఎస్ఐ పరిధిలోకి రారు. ఈఎస్ఐ గరిష్ట వేతన పరిమితి 2016కు ముందు రూ.15 వేలు ఉండగా.. కేంద్ర ప్రభుత్వం దీన్ని రూ.21 వేలకు పెంచింది. ఈ తరహాలోనే ఈపీఎఫ్ఓ కూడా వేతన పరిమితిని రూ.21 వేలకు పెంచే యోచనలో ఉందని ప్రాథమిక సమాచారం. కాగా ఇందుకు సంబంధించి ఈపీఎఫ్ఓ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. -
ఉద్యోగులకు శుభవార్త.. మారిన ఈపీఎఫ్ఓ రూల్స్..అవేంటో తెలుసా?
ఏప్రిల్ 1 నుంచి 2024-25 కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ అభివృద్ధి నినాదంతో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశ పెట్టారు.అయితే ఆ బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో పలు ఆర్ధిక పరమైన అంశాల్లో చేసిన మార్పులు ప్రకటించారు. ఆ మార్పులు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. సేవింగ్ స్కీమ్స్ (ఎన్పీఎస్ అండ్ ఈపీఎఫ్ఓ), ఇన్ కమ్ ట్యాక్స్, ఫాస్టాగ్లు ఇలా మీ ఆర్థిక స్థితిని ప్రభావితం చేసే పలు అంశాలు ఉన్నాయి. కాబట్టి వాటి గురించి ముందే తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని ఆర్ధిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఈపీఎఫ్ రూల్స్ ఏప్రిల్ 1 నుంచి ఈపీఎఫ్ఓలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ రూల్స్తో ఉద్యోగులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారే సమయంలో ఈపీఎఫ్ఓ ట్రాన్స్ఫర్ వంటి విషయాల్లో మరింత సులభతరం అయ్యింది. ఈపీఎఫ్ఓ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఉద్యోగులు స్వయంగా డాక్యుమెంట్లు అందజేయడం, సంతకాలు చేసే పనిలేకుండా మ్యాన్యువల్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే ఈ బదిలీపై పూర్తి సమాచారం ఈపీఎఫ్ఓ నుంచి రావాల్సి ఉంది. ఉద్యోగం మారినపుడు అకౌంట్ బ్యాలెన్స్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తారా? లేక సదరు అకౌంట్ వడ్డీ కూడా జమ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఎన్పీఎస్: టూ ఫ్యాక్టర్ అథంటికేషన్ ఏప్రిల్ 1, 2024 నుండి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ(pfrda) ప్రభుత్వ రంగ సంస్థ పదవి విరమణ అనంతరం లబ్ధిదారులు నెలవారి పెన్షన్ను అందించేందుకు సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ (cra) పేరుతో వెబ్ అప్లికేషన్ను అందుబాటులోకి తెచ్చింది. అయితే, రోజురోజుకి పెరిగిపోతున్న టెక్నాలజీ వినియోగంతో సైబర్ నేరాల నుంచి రక్షణ పొందేలా పెన్షన్ దారులకోసం పీఎఫ్ఆర్డీఏ ఆథార్ నెంబర్తో టూ ఫ్యాక్టర్ అథంటికేషన్ను అందుబాటులోకి తెచ్చింది. లీవ్ ఎన్క్యాష్మెంట్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనల్లో లీవ్ ఎన్క్యాష్మెంట్ పన్ను మినహాయింపు అంశం తెరపైకి వచ్చింది. 2022 వరకు లీవ్ ఎన్క్యాష్మెంట్ పన్ను మినహాయింపు రూ.3 లక్షలకు ఉండేది. ఇప్పుడు దానిని రూ.25లక్షలకు పెంచుతున్నట్లు ప్రతిపాదించారు. పదవీ విరమణ చెందుతున్న ప్రభుత్వేతర సంస్థల్లోని ఉద్యోగుల లీవ్ ఎన్ క్యాష్ మెంట్పై పన్ను మినహాయింపును రూ.25 లక్షలకు పెంచడంతో వేతన జీవులకు ఏడాదికి రూ.20 వేల వరకు లబ్ధి చేకూరనుంది. -
EPFO ఖాతాలో బ్యాంక్ ఖాతా వివరాలను ఎలా అప్ డేట్ చేయాలి
-
ఈపీఎఫ్వో కిందకు 15.62 లక్షల సభ్యులు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో)లో 15.62 లక్షల మంది సభ్యులు డిసెంబర్ నెలలో చేరారు. 2023 నవంబర్ నెలతో పోలిస్తే సభ్యుల చేరికలో 12 శాతం వృద్ధి నమోదైంది. అదే 2022 డిసెంబర్ నెల చేరికలతో పోలిస్తే 4.62 శాతం వృద్ధి కనిపించింది. ఉపాధి అవకాశాల పెరుగుదల, ఉద్యోగుల ప్రయోజనాలపై పెరుగుతున్న అవగాహన, మరిన్ని సంస్థలకు చేరువ అయ్యేందుకు ఈపీఎఫ్వో చేపడుతున్న కార్యక్రమాలు సభ్యుల పెరుగుదలకు సాయపడుతున్నట్టు కేంద్ర కారి్మక శాఖ ప్రకటించింది. 8.41 లక్షల మంది ఈపీఎఫ్వో కింద మొదటిసారి నమోదు అయ్యారు. అంటే తొలిసారి వీరు సంఘటిత రంగంలో ఉపాధి పొందినట్టు తెలుస్తోంది. 2023 నవంబర్తో పోలిస్తే కొత్త సభ్యుల పెరుగుదల 14 శాతంగా ఉంది. పైగా డిసెంబర్ నెలకు సంబంధించిన నికర కొత్త సభ్యుల్లో 57 శాతం మంది 18–25 వయసులోని వారే కావడం గమనార్హం. మిగిలిన సభ్యులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారడం ద్వారా తమ ఈపీఎఫ్ ఖాతాను బదిలీ చేసుకున్నారు. 2.09 లక్షల మంది మహిళలు.. 8.41 లక్షల కొత్త సభ్యుల్లో 2.09 లక్షల మంది మహిళలు ఉన్నారు. 2023 నవంబర్ నెలతో పోలిస్తే 7.57 శాతం అధికం. రాష్ట్రాల వారీగా చూస్తే.. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, హర్యానా రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది చేరారు. డిసెంబర్ నెలకు సంబంధించి కొత్త చేరికల్లో 58.33 శాతం ఈ రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. ఇందులో మహారాష్ట్ర వాటా 21.63 శాతంగా ఉంది. ఐరన్ అండ్ స్టీల్, బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్, జనరల్ ఇన్సూరెన్స్ రంగాలు ఎక్కువ మందికి అవకాశం కల్పించాయి. -
ఈపీఎఫ్ఓ, పీఎంఓ డేటా లీకేజీ కలకలం?.. అప్రమత్తమైన కేంద్రం
దేశంలో డేటా లీకేజీ కలకలం రేపుతోంది. ప్రధాని కార్యాలయం (పీఎంఓ), ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ)ల డేటాబేస్ నుంచి డేటా లీకైనట్లు తెలుస్తోంది. ఈ డేటా లీకేజీపై స్పష్టత ఇవ్వాలని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (CERT-In) కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. డేటా లీకేజీపై సమాచారం ఉంది. కానీ వాస్తవమా? కాదా? అని తెలుసుకునేందుకు రివ్యూ జరుపుతున్నాం. సీఈఆర్టీ.ఇన్ ఇచ్చే రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. డేటా లీకేజీ అంటూ వస్తున్న నివేదికలను పరిశీలిస్తున్నట్లు కేంద్రానికి చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణులు తెలిపారు. ‘డేటా లీకేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. అయితే, సైబర్ నేరస్తులు ఒక సర్వర్ ను యాక్సిస్ చేసినట్లు కొన్ని వాదనలు వినిపిస్తున్నాయని, అందుకు తగ్గ ఆధారాలు లేవు’ అని స్పష్టం చేశారు. గ్లోబల్ సాఫ్ట్వేర్, కోడ్ రిపోజిటరీ గిత్ హబ్లో చైనీస్ సైబర్ ఏజెన్సీలకు చెందిన కొన్ని పత్రాలు లీక్ అయ్యాయని, ఈ డాక్యుమెంట్లలో ఈపీఎఫ్ఓ, ఇండియన్ పీఎంఓ, ఇతర పబ్లిక్ నుండి డేటా ఉందని సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ఎక్స్ లో పలు పోస్ట్ లు వెలుగులోకి వచ్చాయి. అయితే, ఈ డేటా లీకేజీ అంశంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. భారత్ లక్ష్యంగా గత ఏడాది నవంబర్ లో విడుదల చేసిన నివేదిక ప్రకారం..ఇటీవల కాలంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, తాజ్ హోటల్స్, ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్ వంటి సంస్థలపై సైబర్ దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయి. దీంతో పాటు ఐటీ, బిజినెస్ ఔట్ సోర్సింగ్ సంస్థలతో సహా పలు సర్వీసులు అందించే సంస్థలపై అత్యధికంగా సైబర్ దాడులు జరిగినట్లు నివేదికలు హైలెట్ చేశాయి. సింగపూర్ కు చెందిన సైబర్ ఫిర్మా 2023 నివేదిక సైతం ప్రపంచ వ్యాప్తంగా జరిగే సైబర్ దాడులు భారత్ ను లక్ష్యంగా చేసుకుని 13.7శాతం ఉందని, ఆ తర్వాత అమెరికా, ఇండో నేషియా,చైనా దేశాలు ఉన్నట్లు తేలింది. -
బిగ్ న్యూస్.. ఊహించినదాని కంటే ఎక్కువగా పీఎఫ్ వడ్డీ రేటు
వేతన జీవులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) బిగ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ నిధులపై వడ్డీ రేటును ఊహించిదానికి మించి పెంచింది. ఈపీఎఫ్వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) 2023-24లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాలకు 8.25 శాతం వడ్డీ రేటును నిర్ణయించినట్లు వార్తా సంస్థ పీటీఐ తాజాగా నివేదించింది. గత సంవత్సరం మార్చి 28న ఈపీఎఫ్వో 2022-23 కోసం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాలకు 8.15 శాతం వడ్డీ రేటును ప్రకటించింది. అంతకుముందు 2022 ఆర్థిక సంవత్సరంలో 8.10 శాతం వడ్డీ జమ చేసింది. "ఈరోజు జరిగిన ఈపీఎఫ్వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 235వ సమావేశం 2023-24లో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును సిఫార్సు చేసింది. దేశ శ్రామిక శక్తికి సామాజిక భద్రతను పటిష్టం చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ హామీని నెరవేర్చడానికి ఈ చర్య ఒక మందడుగు” అని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో వెల్లడించారు. ఈపీఎఫ్వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు ఆర్థిక మంత్రిత్వ శాఖతో సంప్రదించిన తర్వాత ప్రతి సంవత్సరం ఈపీఎఫ్ వడ్డీ రేటును సమీక్షిస్తారు. సీబీటీ సిఫార్సు చేసిన రేటును పరిగణనలోకి తీసుకున్న తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తుది వడ్డీ రేటును తెలియజేస్తుంది. The 235th meeting of Central Board of Trustees, EPFO, today has recommended 8.25 per cent as rate of interest on Employees' Provident Fund deposits for 2023-24. The move is a step towards fulfilling PM Shri @narendramodi ji’s guarantee of strengthening social security for… pic.twitter.com/z8OzHrdz1P — Bhupender Yadav (@byadavbjp) February 10, 2024 -
ఈపీఎఫ్ఓ వడ్డీ రేటుపై త్వరలో నిర్ణయం - ఇదే జరిగితే పదేళ్లలో..
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అకౌంట్లో ఉన్న డబ్బుపై ఇచ్చే వడ్డీ రేటుపైన కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సుమారు 8% వడ్డీ రేటును ప్రతిపాదించే అవకాశం ఉందని సమాచారం. 2022-23లో ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు 8.15 శాతం, 2022-21 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేటు 8.10 శాతం ఉండేది. ప్రస్తుతం ఇది 8 శాతానికి తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం మీద ప్రస్తతానికి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. పెట్టుబడులపై రాబడిని మెరుగుపరిచేందుకు స్టాక్స్లో పెట్టుబడిని ప్రస్తుత 10% నుంచి 15%కి పెంచడానికి EPFO బోర్డు నుంచి ఆమోదం పొందాలని కూడా యోచిస్తోంది. ప్రభుత్వం ఎన్నికల సంవత్సరం కావడంతో, ప్రావిడెంట్ ఫండ్ (PF) డిపాజిట్లపై స్థిరమైన రాబడి రేటును అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు, ఎటువంటి ఎదురుదెబ్బలు రాకుండా ఉండేందుకు ప్రస్తుతం ఉన్న రేట్లకు అనుగుణంగా చూసే అవకాశం ఉందని EPFO బోర్డు సభ్యుడు వెల్లడించారు. 2013-14 నుంచి 2022-23 వరకు ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్లు 8 శాతానికి రాలేదు. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం వడ్డీ రేటు 8 శాతంగా నిర్ణయిస్తే.. గత పది సంవత్సరాలకంటే తక్కువ వడ్డీ రేటు ఇదే అవుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి. ఇదీ చదవండి: సెల్ఫ్ డ్రైవింగ్ కారు తయారు చేసిన రైతు బిడ్డ, ముచ్చటపడ్డారు కానీ రిజెక్ట్! -
EPFO Update: ఆ 12 అంకెల నంబర్ మిస్ అయిందా?
నేటి జాబ్ మార్కెట్ చాలా వైవిధ్యంగా మారిపోయింది. ఉద్యోగులు కొత్త అవకాశాలను వెతుకుంటున్న తరుణంలో కంపెనీలు మారడం సాధారణమైపోయింది. ఈ మార్పుల మధ్య ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఒక మూలస్తంభంగా నిలుస్తుంది. ఉద్యోగుల వృత్తిపరమైన ప్రయాణాల్లో ఆర్థిక భద్రతకు భరోసా ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆధార్ నంబర్ మాదిరిగానే ఈపీఎఫ్వో వ్యవస్థలో 12 అంకెల యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) అనేది చాలా కీలకమైనది. ఉద్యోగులు కంపెనీలు మారినప్పుడల్లా ఈ నంబర్ మారదు. ఒకసారి ఈపీఎఫ్వో చేరినప్పుడు దీన్ని కేటాయిస్తారు. ఈపీఎఫ్ సంబంధిత అన్ని అంశాలకు ఈ యూఏఎస్ అవసరం ఉంటుంది. అయితే కంపెనీలు మారినప్పుడు కొంత ఉద్యోగులు ఈ యూఏఎన్ నంబర్ను మరిచిపోతుంటారు. ఈపీఎఫ్కు సంబంధించి ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్నప్పుడు ఈ నంబర్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలో మరిచిపోయిన యూఏఎన్ నంబర్ను ఆన్లైన్లోనే సులభంగా పొందే అవకాశాన్ని ఈపీఎఫ్వో కల్పించింది. యూఏఎన్ ఇలా పొందండి.. ఈపీఎఫ్వో అధికారిక వెబ్సైట్ (https://www.epfindia.gov.in/site_en/index.php)ను సందర్శించండి సర్వీసెస్ ట్యాబ్ కింద "ఫర్ ఎంప్లాయీస్" (For Employees) విభాగానికి వెళ్లి, "మెంబర్ UAN/ఆన్లైన్ సర్వీస్ (OCS/OTCP)" ఎంచుకోండి. తర్వాత ఓపెన్ అయ్యే కొత్త పేజీలో కుడి వైపున ఉన్న ముఖ్యమైన లింక్ల కింద "నో యువర్ UAN"ని క్లిక్ చేయండి. ఇక్కడ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, క్యాప్చా అందించి ఆపై రిక్వెస్ట్ OTPని క్లిక్ చేయండి. మీ మొబైల్కి వచ్చిన OTPని ధ్రువీకరించండి. తర్వాతి పేజీలో మీ పేరు, పుట్టిన తేదీ, మెంబర్ ఐడీ, ఆధార్ లేదా పాన్ నంబర్, క్యాప్చా నమోదు చేసి "షో మై UAN"పై క్లిక్ చేయండి. మీ UAN నంబర్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వస్తుంది. -
ఈపీఎఫ్వోలో 13.95 లక్షల మంది చేరిక
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) 2023 నవంబర్ నెలలో 13.95 లక్షల మంది సభ్యులను చేర్చుకుంది. ఇందులో 7.36 లక్షల మంది మొదటిసారి ఈపీఎఫ్వో కింద నమోదు చేసుకున్నారు. కొత్త సభ్యుల్లో 1.94 లక్షల మంది మహిళలు కావడం గమనించొచ్చు. నవంబర్లో మొత్తం మహిళా సభ్యుల చేరిక 2.80 లక్షలుగా (20 శాతం) ఉంది. సంఘటిత రంగంలో మహిళల భాగస్వామ్యం పెరుగుతున్నట్టు ఇది తెలియజేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నాటికి నికర సభ్యుల చేరిక, గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు ఎక్కువగా ఉన్నట్టు కేంద్ర కారి్మక శాఖ విడుదల చేసిన పేరోల్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నూతన సభ్యుల్లో 18–25 ఏళ్ల నుంచి చేరిన వారు 57.30 శాతం ఉన్నారు. 10.67 లక్షల మంది ఒక సంస్థలో మానేసి, మరో సంస్థకు తమ ఖాతాలను బదిలీ చేసుకున్నారు. నవంబర్లో మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల నుంచి 58.81 శాతం చేరారు. ఇందులో మహారాష్ట్ర వాటాయే 21.60 శాతంగా ఉంది. -
EPFO Update: భారీగా పెరిగిన ఉద్యోగులు
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో సభ్యులు భారీగా పెరిగారు. 2023 నవంబర్లో నికరంగా 13.95 లక్షల మంది సభ్యులను చేర్చుకున్నట్లు ఈపీఎఫ్వో తాజాగా విడుదల చేసిన తాత్కాలిక పేరోల్ డేటా ద్వారా వెల్లడించింది. ఇది మునుపటి ఏడాదిఇదే కాలంలో చేరికల కంటే ఎక్కువని తెలుస్తోంది. 7.36 లక్షల మంది కొత్తవారు 2023 నవంబర్లో దాదాపు 7.36 లక్షల మంది కొత్త సభ్యులు నమోదు చేసుకున్నారని ఈపీఎఫ్వో డేటా సూచిస్తోంది. కొత్తగా చేరిన సభ్యులలో 18-25 సంవత్సరాల వయస్సు గలవారు 57.30 శాతం మంది ఉన్నారు. అంటే పెద్ద సంఖ్యలో శ్రామిక శక్తి సంఘటిత రంగంలో ప్రవేశించింది. సుమారు 10.67 లక్షల మంది సభ్యులు నిష్క్రమించినా మళ్లీ ఈపీఎఫ్వోలో చేరినట్లు పేరోల్ డేటా ప్రతిబింబిస్తోంది. 1.94 లక్షల మంది మహిళలు జెండర్వారీగా పేరోల్ డేటాను పరిశీలిస్తే 2023 నవంబర్లో చేరిన మొత్తం 7.36 లక్షల మంది కొత్త సభ్యులలో దాదాపు 1.94 లక్షల మంది మహిళలు ఉన్నారు. అలాగే ఆ నెలలో నికరంగా మహిళా సభ్యుల చేరిక దాదాపు 2.80 లక్షలకు చేరుకుంది. నికర చందాదారుల చేరికలో నికర మహిళా సభ్యుల శాతం 20.05 శాతంగా ఉంది. ఇది 2023 సెప్టెంబరు కంటే అధికం. సంఘటిత రంగ శ్రామిక శక్తిలో మహిళా ఉద్యోగుల భాగస్వామ్యాన్ని ఇది తెలియజేస్తోంది. -
ఆధార్ కార్డు ఆధారం కాదు - లిస్ట్ నుంచి తొలగించిన ఈపీఎఫ్ఓ
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. ఇకపై పుట్టిన తేదీకి రుజువుగా ఆధార్ కార్డుని పరిగణించబోమని తెలిసింది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ధ్రువీకరించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం. ఈపీఎఫ్ఓ ఇటీవల అధికారికంగా విడుదల చేసిన సర్క్యులర్లో ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని ఖాతాదారులు తప్పకుండా గమనించాలి. ఇప్పటికే పలు న్యాయస్థానాల్లో ఆధార్ కార్డుని జనన ధ్రువీకరణ పత్రంగా పరిగణించబోమని ప్రకటించడంతో.. ఈపీఎఫ్ఓ సంస్థ కూడా ఇదే బాటలో అడుగులు వేస్తూ ఎట్టకేలకు ధ్రువీవీకరించింది. EPFO కోసం పుట్టిన తేదీకి రుజువుగా చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్స్ ఏదైనా గుర్తింపు పొందిన ప్రభుత్వ బోర్డు లేదా యూనివర్సిటీ జారీ చేసిన మార్క్షీట్ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ (SLC) స్కూల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ (TC) SSC సర్టిఫికేట్ (పేరు, పుట్టిన తేదీ ఉంటుంది) పాన్ కార్డ్ కేంద్ర/రాష్ట్ర పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ప్రభుత్వం జారీ చేసిన డొమిసైల్ సర్టిఫికేట్ పాస్పోర్ట్ ప్రభుత్వ పెన్షన్ ఐడీ సివిల్ సర్జన్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్ ఇదీ చదవండి: ఉద్యోగులకు షాకిచ్చిన సుందర్ పిచాయ్ - మరిన్ని లేఆప్స్ పక్కా! పైన తెలిపిన డాక్యుమెంట్స్ ఈపీఎఫ్ఓలో పుట్టిన తేదీ కరెక్షన్ కోసం సమర్పించవచ్చు. వీటిలో పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు మ్యాచ్ అయ్యేలా ఉండాలి. అయితే ఆధార్ అనేది కేవలం గుర్తింపు కార్డు మాత్రమే. కాబట్టి దీనిని పుట్టిన తేదీ నిర్దారణ కోసం పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు. -
EPFO Update: గడువు పొడిగించిన ఈపీఎఫ్వో
అధిక వేతనాలపై పెన్షన్ కోసం ఆప్షన్ల ధ్రువీకరణ కోసం ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) గడువును మరోసారి పొడిగించింది. పెన్షన్ కోసం ఉద్యోగులు సమర్పించిన లక్షలాది దరఖాస్తులు యాజమాన్యాల దగ్గర పెండింగ్ ఉండటంతో గడువు పొడిగించే ప్రతిపాదనను ఈపీఎఫ్వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆమోదించింది. అధిక వేతనాలపై పెన్షన్ కోసం ఆప్షన్ లేదా జాయింట్ ఆప్షన్ల ధ్రువీకరణ కోసం దరఖాస్తులను సమర్పించడానికి ఈపీఎఫ్వో గతంలో ఆన్లైన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. 2022 నవంబర్ 4 నాటి సుప్రీం కోర్ట్ ఆర్డర్కు అనుగుణంగా అర్హులైన పెన్షనర్లు/సభ్యుల కోసం 2023 ఫిబ్రవరి 26న ఈ సదుపాయాన్ని ప్రారంభించింది. 2023 మే 3 వరకు మాత్రమే ఇది అందుబాటులో ఉండగా ఉద్యోగుల అభ్యర్థన మేరకు గడువును మరో నాలుగు నెలలు అంటే 2023 జూన్ 26 వరకు పొడిగించింది. ఆ తర్వాత 2023 జూలై 11 వరకు 15 రోజుల అవకాశం ఇచ్చింది. 2023 జూలై 11 నాటికి ఆప్షన్/జాయింట్ ఆప్షన్ల ధ్రువీకరణ కోసం పెన్షనర్లు/సభ్యుల నుంచి 17.49 లక్షల దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుదారు పెన్షనర్లు/సభ్యుల వేతన వివరాలను అప్లోడ్ చేయడానికి వ్యవధిని పొడిగించాలని ఎంప్లాయర్స్ & ఎంప్లాయర్స్ అసోసియేషన్ల నుంచి అభ్యర్థనలు రావడంతో యజమానులకు వేతన వివరాలను ఆన్లైన్లో సమర్పించడానికి 2023 సెప్టెంబరు 30 వరకు సమయం ఇచ్చింది. ఇది మళ్లీ 2023 డిసెంబర్ 31కి జరిగింది. ఆ తర్వాత కూడా ఆప్షన్/జాయింట్ ఆప్షన్ల ధ్రువీకరణ కోసం 3.6 లక్షల కంటే ఎక్కువ దరఖాస్తులు ప్రాసెసింగ్ కోసం యజమాన్యాల వద్ద ఇంకా పెండింగ్లో ఉన్నాయి. దీంతో ఈ మిగిలిన దరఖాస్తులను ప్రాసెస్ చేయడం కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మరో సారి సమయాన్ని పొడిగించే ప్రతిపాదనను ఆమోదించింది. 2024 మే 31 లోపు యాజమాన్యాలు తమ ఉద్యోగుల వేతన వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. -
కోవిడ్ అడ్వాన్స్లకు ఈపీఎఫ్ఓ చెక్
సాక్షి, హైదరాబాద్: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) కోవిడ్–19 అడ్వాన్స్ మంజూరును నిలిపివేసింది. ప్రస్తుతం కోవిడ్–19 పరిస్థితులు పూర్తిగా సద్దుమణగడం, ఉద్యోగావకాశాలు పెరిగిన నేపథ్యంలో కోవిడ్–19 కారణంగా భవిష్యనిధి నుంచి నగదు ఉపసంహరణ అవకాశాన్ని ఈపీఎఫ్ఓ రద్దు చేసింది. ఇకపై భవిష్యనిధి నుంచి సాధారణ కారణాలతో నగదు ఉపసంహరించుకునే అవకాశాన్ని మాత్రం కొనసాగిస్తోంది. కోవిడ్–19 ప్రభావంతో 2020 మార్చిలో లాక్డౌన్ ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర కాలంలో పలుమార్లు వివిధ కంపెనీలు లాక్డౌన్ పాటించాల్సిరావడం, ఫలితంగా తయారీ రంగంతో పాటు పలు కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. దీంతో ఉద్యోగులు ఒక్కసారిగా ఉపాధి కోల్పోవడంతో వారి ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు ఈపీఎఫ్ఓ కోవిడ్–19 అడ్వాన్స్ల విడుదలకు నిర్ణయించింది. ఇందులో భాగంగా 2020 ఏప్రిల్ నెల నుంచి ప్రారంభించిన ఈ ఉపసంహరణ ప్రక్రియతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2.25 కోట్ల మంది ఖాతాదారులు రూ.50 కోట్ల మేర భవిష్య నిధిని ఉపసంహరించుకున్నారు. నిధి మెరుగుపడేలా.. దాదాపు మూడున్నరేళ్ల పాటు కోవిడ్–19 ఆడ్వాన్స్ విడుదలకు ఈపీఎఫ్ఓ అవకాశం కల్పించింది. ఈ కాలంలో ఖాతాదారులు దాదాపు మూడుసార్లు నిధి నుంచి అర్హత మేరకు ఉపసంహరించుకున్నారు. మూలవేతనం నుంచి దాదాపు 3 రెట్ల నగదును ఉపసంహరించుకునేలా వెసులుబాటు ఉండడంతో దాదాపు 2.25 కోట్ల మంది ఈమేరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా 7.25 కోట్ల మంది ఈపీఎఫ్ఓలో చందాదారులుగా ఉన్నారు. మారిన పరిస్థితుల దృష్ట్యా తాజాగా కోవిడ్–19 అడ్వాన్స్ ఉపసంహరణను ఈపీఎఫ్ఓ నిలిపివేసింది. భవిష్యత్ అవసరాల కోసం, పదవీ విరమణ పొందిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా చందాదారులు జీవించేందుకు వినియోగించుకోవాల్సిన ఈపీఎఫ్ నిధి నుంచి ఉపసంహరణ ప్రక్రియను ఇలాగే కొనసాగిస్తే చివరి నాటికి ఇబ్బందులు తలెత్తుతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఉపసంహరణల ప్రక్రియకు కాస్త బ్రేక్ వేస్తూ సాధారణ పద్ధతిలో మాత్రమే నిధిని వెనక్కు తీసుకునే అవకాశాలను కల్పించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. దీంతో ఇప్పటివరకు ఉపసంహరణలతో తగ్గిన నిధిని తిరిగి మెరుగుపర్చే దిశగా ఈపీఎఫ్ఓ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. -
అలెర్ట్, కోవిడ్-19 అడ్వాన్స్ విత్డ్రాపై ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం?!
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) మనీ విత్ డ్రాపై కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 వ్యాప్తి సమయంలో చందాదారుల ఆరోగ్య అవసరాల్ని తీర్చేలా కోవిడ్ అడ్వాన్స్ అనే ఆప్షన్ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఆ ఆప్షన్ను ఈపీఎఫ్ఓ త్వరలో తొలగించనుంది. దీంతో కోవిడ్ అడ్వాన్స్ పేరుతో రిటైర్మెంట్ సేవింగ్ ఫండ్ను ఉపసంహరించుకోవడం అసాధ్యం. వారం రోజుల క్రితం రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్ఓ ఉన్నతస్థాయి అధికారుల సమావేశం జరిగింది. అనంతరం ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్ని సంబంధిత అధికారులు అనధికారికంగా వెల్లడించారు. కోవిడ్ అడ్వాన్స్ పేరుతో ఇందులో ప్రముఖంగా భారత్లో తొలిసారి కరోనా విజృంభణ మొదలైన సమయంలో ఈపీఎఫ్ఓ మనీ విత్ డ్రాలో మార్పులు చేసింది. చేసిన మార్పులకు అనుగుణంగా చందారులు కరోనా చికిత్సతో పాటు సంబంధిత అనారోగ్య సమస్యలకు చికిత్స పొందేందుకు వీలుగా కోవిడ్ అడ్వాన్స్ ఆప్షన్ ద్వారా ఈపీఎఫ్ఓ అకౌంట్లో ఉన్న కొంత మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు. అవసరాల్ని తీర్చుకోవచ్చు. ప్రాణాల్ని కాపాడింది ఈ నిర్ణయం సబ్స్క్రైబర్లు కోవిడ్ ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు సహాయ పడింది. పలువురు కోవిడ్కు చికిత్స చేయించుకుని ప్రాణాల్ని కాపాడుకోగలిగారు. అయితే సుమారు ఏడెనిమిది నెలల క్రితం కోవిడ్-19పై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) విధించిన పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. డబ్ల్యూహెచ్ఓ నిర్ణయంతో ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ప్రకటనతో ఈపీఎఫ్ఓ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో రీటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ నుంచి కోవిడ్ అడ్వాన్స్ తీసుకునే సదుపాయన్ని తొలగించనుంది. దీనికి సంబంధించి ఇంకా అధికారిక నోటిఫికేషన్ విడుదల కానప్పటికీ, సాఫ్ట్వేర్లో నాన్ రిఫండబుల్ కోవిడ్ అడ్వాన్స్ నిబంధనను నిలిపివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, తద్వారా చందాదారులు ఇకపై దరఖాస్తు చేసుకోలేరని అధికారి తెలిపారు. ఈ పని ఎప్పుడో చేయాల్సింది కాగా, కొవిడ్ అడ్వాన్స్ పేరుతో తీసుకున్న నగదుతో అనవసరైమన కొనుగోళ్లు, ఇతర అవసరాలకు వినియోగించుకునే వారికి ఈపీఎఫ్ఓ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపునుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకోవాల్సి ఉండేదని, ఇప్పటికే ఆలస్యం అయిందని అంటున్నారు. రిటైర్మెంట్ పొదుపు నుంచి కోవిడ్ అడ్వాన్స్ పేరుతో తీసుకున్న నగదును ఆరోగ్యం కోసం కాకుండా ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నారని తెలిసినప్పటికీ కోవిడ్ ఉపసంహరణను ముగించడానికి వారికి ఇంత సమయం పట్టిందని ఆర్థికవేత్త కేఆర్ శ్యామ్ సుందర్ తెలిపారు. ఏ ఏడాది ఎంత విత్డ్రా చేశారంటే ఈపీఎఫ్ 2020-21లో 6.92 మిలియన్ల మంది చందాదారులకు రూ .17,106.17 కోట్లు, 2021-22 లో 9.16 మిలియన్ల లబ్ధిదారులకు రూ .19,126.29 కోట్లు, 2022-2023లో 6.20 మిలియన్ల మంది లబ్ధిదారులకు రూ .11,843.23 కోట్ల నగదను అందించింది. 4 రోజుల్లో 6లక్షలు విత్డ్రా మార్చి 28, 2020 నుండి కోవిడ్ అడ్వాన్స్ నిబంధన అమల్లోకి వచ్చింది. 2020 ఆర్థిక సంవత్సరం చివరి వరకు (మార్చి 31, 2020) నాలుగు రోజుల్లో 33 మంది లబ్ధిదారులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారు. 6 లక్షల్ని విత్ డ్రా చేసుకున్నారు. కోవిడ్ అడ్వాన్స్ రూ.48,075 కోట్లు 2022-23 ఈపీఎఫ్ఓ విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం.. 2020-21 నుండి మూడు ఆర్థిక సంవత్సరాల్లో 22 మిలియన్లకు పైగా చందాదారులు కోవిడ్ అడ్వాన్స్ పొందారు. ఈ మొత్తం విలువ రూ .48,075.75 కోట్లు. -
అక్టోబర్లో భారీగా ఉపాధి
న్యూఢిల్లీ: ఈ ఏడాది అక్టోబర్లో భారీగా ఉపాధి కల్పన నమోదైంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) నిర్వహిస్తున్న ఈపీఎఫ్ పథకంలో 15.29 లక్షల మంది సభ్యులుగా చేరారు. క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 18.2 శాతం మందికి అదనంగా ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి. అక్టోబర్ నెలకు సంబంధించి పేరోల్ గణాంకాలను కేంద్ర కారి్మక శాఖ బుధవారం విడుదల చేసింది. 7.72 లక్షల మంది కొత్త సభ్యులు నికరంగా చేరినట్టు తెలుస్తోంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు ఇందులో 6 శాతం వృద్ధి నమోదైంది. నికర సభ్యుల చేరిక 15.29 లక్షలుగా ఉంది. కొత్తగా చేరిన వారిలో 58.60 శాతం మంది 18–25 ఏళ్ల వయసులోని వారు. అంటే సంఘటిత రంగంలో వీరంతా మొదటిసారి ఉపాధి పొందిన వారని తెలుస్తోంది. ఇక 11.10 లక్షల మంది ఒక సంస్థలో మానేసి మరో సంస్థలో చేరారు. వీరు ఆన్లైన్లో తమ ఈపీఎఫ్లను బదిలీ చేసుకున్నారు. ఈపీఎఫ్వో నుంచి వైదొలగిన సభ్యుల సంఖ్య గడిచిన 12 నెలల్లోనే తక్కువగా ఉంది. మహిళా సభ్యులు 3 లక్షలు: 7.72 లక్షల కొత్త సభ్యుల్లో 2.04 లక్షల మంది మహిళలు ఉన్నారు. అక్టోబర్ నెలకు నికరంగా చేరిన మహిళా సభ్యుల సంఖ్య 3.03 లక్షలుగా ఉంది. క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలో పోల్చి చూస్తే 15 శాతం వృద్ధి కనిపించింది. రాష్ట్రాల వారీగా చూస్తే అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 22 శాతం మంది సభ్యులు చేరారు. హోటళ్లు, టీ విక్రయ కేంద్రాలు, ట్రేడింగ్, షాపులు, కెమికల్స్ కంపెనీలు, జీవత బీమా సంస్థల్లో ఎక్కువ మందికి ఉపాధి లభించింది. -
సుప్రీం కోర్టు తీర్పు.. ఈపీఎఫ్ఓ మార్పులు
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తమ ‘తరచూ అడిగే ప్రశ్నావళి’ (FAQ)లో మార్పులు చేసింది. గత ఏడాది నవంబర్లో వచ్చిన సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి అధిక పెన్షన్ అమలుపై సవరించిన ఎఫ్ఏక్యూ సెట్ను విడుదల చేసింది. పెన్షన్ బకాయిలను చందాదారులకు చెల్లిస్తారా లేదా అధిక చందా డిమాండ్కు సర్దుబాటు చేస్తారా అన్న ప్రశ్నకు సవరించిన ఎఫ్ఏక్యూలలో ఈపీఎఫ్ఓ బదులిచ్చింది. పెన్షన్ బకాయిలను ప్రస్తుత పద్ధతిలోనే టీడీఎస్కు సంబంధించిన ఆదాయపు పన్ను నియామళిని అనుసరించి చెల్లించనున్నట్లు పేర్కొంది. మరోవైపు పింఛను లెక్కింపు సూత్రాన్ని, అలాగే ఉద్యోగుల పింఛను పథకం-1995 కింద అధిక పింఛను కోసం ఉమ్మడి దరఖాస్తు సందర్భంలో అవసరమైన ధ్రువపత్రాల జాబితాను ఈపీఎఫ్వో నూతన ఎఫ్ఏక్యూలలో మరోసారి స్పష్టం చేసింది. అధిక పెన్షన్కు సంబంధించిన వివరాలను దరఖాస్తుదారులకు తెలియజేయడానికి గత జూన్లో కూడా ఈపీఎఫ్ఓ ఇలాంటి ఎఫ్ఏక్యూ సెట్ను జారీ చేసింది. ఇదీ చదవండి: విశాఖ నుంచి బ్యాంకాక్కి నేరుగా ఫ్లైట్ సర్వీస్ అయితే అధిక పెన్షన్ను ఈపీఎఫ్ఓ ఎప్పటి నుంచి అమలు చేస్తుందనేదానిపై స్పష్టత లేదు. ఈ అధిక పెన్షన్ ప్రక్రియ ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన దశలో ఉంది. వచ్చే జనవరి నాటికి కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా అధిక పెన్షన్ కోసం 17.49 లక్షల దరఖాస్తులు వచ్చాయి. -
ఈపీఎఫ్వోలో కొత్తగా 17 లక్షల మంది
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ సెపె్టంబర్ నెలలో 17.21 లక్షల మంది కొత్త సభ్యులను చేర్చుకుంది. ఆగస్ట్లో కొత్త సభ్యులతో పోలిస్తే నికరంగా 21,745 మంది పెరిగినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ నెల పేరోల్ గణాంకాలను కేంద్ర కారి్మక శాఖ సోమవారం విడుదల చేసింది. క్రితం ఏడాది సెపె్టంబర్ నెలలో కొత్త సభ్యుల గణాంకాలతో పోల్చి చూసినా కానీ, 38,262 మంది నికరంగా పెరిగారు. సెప్టెంబర్ నెలలో 8.92 లక్షల మంది తమ పేర్లను మెదటిసారి ఈపీఎఫ్వో కింద నమోదు చేసుకున్నారు. సుమారు 11.93 లక్షల మంది సభ్యులు ఒక సంస్థలో మానేసి, మరో సంస్థలో చేరారు. వీరు తమ ఈపీఎఫ్ ఖాతాను పాత సంస్థ నుంచి కొత్త సంస్థకు బదిలీ చేసుకున్నారు. కొత్త సభ్యుల్లో 59 శాతం మంది వయసు 18–25 ఏళ్లలోపు ఉంది. అంటే కొత్త సభ్యుల్లో అధిక శాతం మంది ఉద్యోగ మార్కెట్లోకి కొత్తగా ప్రవేశించిన వారని తెలుస్తోంది. ఇక ఈపీఎఫ్వో నుంచి వైదొలిగిన సభ్యుల సంఖ్య సెపె్టంబర్లో 3.64 లక్షలుగా ఉంది. ఆగస్ట్ నెలతో పోల్చి చూసినప్పుడు 12.17 శాతం తగ్గింది. 2023 జూన్ నుంచి నెలవారీగా సభ్యుల వైదొలగడం తగ్గుతూ వస్తోంది. 35 శాతం మహిళలు కొత్తగా చేరిన 8.92 లక్షల మంది సభ్యుల్లో మహిళలు 3.30 లక్షలుగా ఉన్నారు. ఇందులో 2.26 లక్షల మంది మహిళలు మొదటి సారి ఈపీఎఫ్వో కిందకు వచ్చిన వారు కావడం గమనార్హం. సెపె్టంబర్లో అత్యధికంగా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, హర్యానా రాష్ట్రాల నుంచి కొత్త సభ్యులు నమోదయ్యారు. ఈ రాష్ట్రాల నుంచి 57.42 శాతం మంది సభ్యులుగా ఉన్నారు. నికర సభ్యుల చేరికలో మహారాష్ట్ర వాటాయే 20.42 శాతంగా ఉంది. చక్కెర పరిశ్రమలు, కొరియర్ సేవలు, ఐరన్ అండ్ స్టీల్, ఆస్పత్రులు, ట్రావెల్ ఏజెన్సీల్లో ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. 2018 ఏప్రిల్ నుంచి ప్రతి నెలా ఈపీఎఫ్వో గణాంకాలను విడుదల చేస్తుండడం గమనార్హం. -
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త!
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో జమ చేస్తోంది. ఇప్పటికే పలువురు ఈపీఎఫ్ఓ ఖాతాదారులు వడ్డీని పొందారు. ఈపీఎఫ్ అకౌంట్లో ఉన్న నిల్వలపై 8.15 శాతం వడ్డీ చెల్లిస్తున్న విషయం తెలిసిందే. ఈపీఎఓ ఖాతాలో వడ్డీ జమైందో లేదో అని తెలుసుకునేందుకు ఖాతాదారులు ఈపీఎఫ్ఓ వెబ్సైట్ లేదా ఉమాంగ్ యాప్ ద్వారా వారి పాస్బుక్ను ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్ని ఆన్లైన్లో ఎలా చెక్ చేయాలంటే? ♦ https://www.epfindia.gov.in/ site_en/For_Employees.php ఈపీఎఫ్ఓ పోర్టల్లో లాగిన్ అవ్వండి ♦ హోమ్పేజీలో 'సర్వీస్' పై క్లిక్ చేసి, 'ఫర్ ఎంప్లాయిస్' అనే ఆప్షన్ని ఎంచుకోండి ♦ ఆపై 'మెంబర్ పాస్బుక్' లింక్పై క్లిక్ చేయండి. మీకు అక్కడ మరో పేజీ ఓపెన్ అవుతుంది. ♦ మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN), పాస్వర్డ్, క్యాప్చా ఉపయోగించి అకౌంట్లో లాగిన్ అవ్వండి. ♦ అనంతరం మీరు మీ ఖాతా వివరాలను ఎంటర్ చేసి ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ఉమాంగ్ యాప్లో ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలంటే ♦ ఉమాంగ్ యాప్ను ఓపెన్ చేసి మీ మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వాలి. ఇందుకోసం ఓటీపీ లేదా ఎంపీఐఎన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ♦ లాగిన్ చేసిన తర్వాత ఈపీఎఫ్ని సెలక్ట్ చేసుకోవాలి. ♦ కాన్ వ్యూ పాస్బుక్పై క్లిక్ చేయాలి. ♦ ఆ తర్వాత మీ యూఏఎన్ని ఎంటర్ చేసి గెట్ ఓటీపీపై క్లిక్ చేయండి ♦ ఓటీపీని ఎంటర్ చేయండి ♦ ఇప్పుడు మీరు మీ ఈపీఎఫ్ఓ ఖాతా వివరాలను చూడవచ్చు. మెంబర్ ఐడిని సెలక్ట్ చేసుకుని ఇ-పాస్బుక్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎస్ఎంఎస్ ద్వారా ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్ని చెక్ చేయండి మీరు మీ యూఏఎన్ని ఉపయోగించి ఎస్ఎంఎస్ ద్వారా ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్ని చెక్ చేసుకోవచ్చు. ఖాతా బ్యాలెన్స్ వివరాలను తెలుసుకునేందుకు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి "EPFOHO UAN ENG"ని 7738299899కి పంపండి. వెంటనే మీకు మీ ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్ ఎంత ఉందో మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. 40ఏళ్లలో తొలిసారి తగ్గిన వడ్డీరేట్లు ఈపీఎఫ్ వడ్డీరేట్లను ఖాతాదారుల అకౌంట్లలోకి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ (సీబీటీ) జమ చేస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కోసం సీబీటీ ప్రతి ఏడాది ఆదాయం, నిర్వహణ ఖర్చులను పరిగణలోకి తీసుకుని ఓ బడ్జెట్ను తయారు చేస్తుంది. ఆ బడ్జెట్కు అనుగుణంగా ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు వడ్డీ ఎంత ఇవ్వాలనేది కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. ♦తాజా సమాచారం ప్రకారం, కోవిడ్ కారణంగా ఈపీఎఫ్ఓ 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.1శాతానికి తగ్గించింది. 40ఏళ్ల తర్వాత ఇదే అత్యల్పం. అయితే నాలుగు దశాబ్దాల తర్వాత కోవిడ్ కారణంగా వడ్డీని తగ్గిస్తూ వచ్చింది. ♦గత ఆర్థిక సంవత్సరం 2021-22తో పోలిస్తే 13.22శాతం పెరుగుదలతో 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓకి 1.39 కోట్ల మంది కొత్త ఖాతాదారులు వచ్చి చేరారు. -
పీఎఫ్ పేరుతో మోసం - కోట్ల రూపాయలు కోల్పోయిన వృద్ధ జంట
టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో.. సైబర్ మోసాలు కూడా అంతే వేగంగా డెవలప్ అవుతున్నాయి. ఇలాంటి మోసాలకు సంబంధించిన సంఘటనలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో సంఘటన ఇప్పుడు తెరమీదకు వచ్చింది. ఇందులో బాధితులు ఏకంగా రూ. 4.32 కోట్లు మోసపోయినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ముంబైకి చెందిన 70 ఏళ్ల వ్యక్తి ఓ సంస్థలో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యారు. అతని భార్యకు ఒక గుర్తు తెలియని వ్యక్తి ఎంప్లాయిస్ ప్రాఫిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుంచి ఫోన్ చేస్తున్నట్లు నమ్మించి.. ఆమె భర్తకు సంబంధించిన చాలా వివరాలను వెల్లడించి, మీ భర్త పీఎఫ్ ఖాతాలో 20 సంవత్సరాలకు కంపెనీ రూ. 4 లక్షలు డిపాజిట్ చేసినట్లు తెలిపింది. కంపెనీ డిపాజిట్ చేసిన డబ్బు ఇప్పుడు రూ. 11 కోట్లుకు మెచ్యూర్ అయిందని, ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి టీడీఎస్, జీఎస్టీ, ఇన్కమ్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుందని తెలిపాడు. కాలర్ చెప్పినట్లుగా వృద్ద మహిళ పలుమార్లు రూ. 4.32 కోట్లు వారి ఖాతలో జమచేసింది. ఇదీ చదవండి: రిలయన్స్ బోర్డులోకి అంబానీ వారసులు - ఆమోదం తెలిపిన షేర్ హోల్డర్స్ ఎన్ని రోజులకు డబ్బు రాకపోవడం మాత్రమే కాకుండా.. ఇంకా డబ్బు డిపాజిట్ చేయాలని డిమాండ్ చేయడం, ఐటీ శాఖకు సమాచారం అందిస్తామని బెదిరించడం కూడా స్టార్ట్ చేశారు. చివరికి మోసపోయినట్లు గ్రహించిన ఈ వృద్ధ జంట జరిగిన విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదీ చదవండి: యువతనుద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి - ఇలా చేయాల్సిందే అంటూ.. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని, గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఎక్కువ డబ్బు వస్తుందని అత్యాశ చూపితే ఎవరూ మోసపోవద్దని, బ్యాంకులకు సంబంధించిన వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
ఈపీఎఫ్వో కిందకు 16.99 లక్షల మంది
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) నిర్వహించే సామాజిక భద్రత పథకం కిందకు ఆగస్ట్ మాసంలో 16.99 లక్షల మంది కొత్త సభ్యులు నికరంగా వచ్చి చేరారు. కేంద్ర కారి్మక శాఖ ఆగస్ట్ నెల ఈపీఎఫ్వో పేరోల్ గణాంకాలను విడుదల చేసింది. ఆగస్ట్లో 3,210 సంస్థలు మొదటి సారి ఈపీఎఫ్వోలో రిజిస్టర్ చేసుకున్నాయి. సుమారు 11.88 లక్షల మంది సభ్యులు ఒక సంస్థలో మానేసి, మరో సంస్థలో చేరడం ద్వారా ఈపీఎఫ్లో కిందకు మళ్లీ వచ్చి చేరారు. కొత్త సభ్యుల్లో 18–25 ఏళ్ల వయసువారు 58.36 శాతంగా ఉన్నారు. మొదటిసారి ఉద్యోగంలో చేరిన వారే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. మొదటిసారి చేరిన చేరిన మహిళలు 2.44 లక్షల మంది ఉన్నారు. నికరంగా చేరిన మహిళా సభ్యుల సంఖ్య 3.43 లక్షలుగా ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, హర్యానా, గుజరాత్ నుంచి నికర సభ్యుల చేరిక అధికంగా ఉంది. ఈ రాష్ట్రాల నుంచి 9.96 లక్షల మంది ఆగస్ట్లో ఈపీఎఫ్వో కిందకు వచ్చారు. వ్యాపార దుకాణాలు, భవన నిర్మాణం, ఇంజనీరింగ్ కాంట్రాక్టు సేవలు, టెక్స్టైల్స్లో ఎక్కువ మందికి ఉపాధి లభించింది. 39.87 మంది సభ్యులు నైపుణ్య సేవలకు సంబంధించి ఉన్నారు. -
పీఎఫ్ విత్డ్రా చేస్తున్నారా.. ట్యాక్స్ రూల్స్ తెలుసా?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అనేది దేశంలో వేతనాలు పొందే ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన పదవీ విరమణ నిధి. ఇందులో ఉద్యోగులు తమ ప్రాథమిక జీతంలో 12 శాతం వాటాను జమ చేస్తూ ఉంటారు. యాజమాన్యాలు కూడా అదే మొత్తాన్ని ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తుంటాయి. ఇలా పోగైన మొత్తాన్ని ఉద్యోగ విరమణ తర్వాత, వడ్డీతో పాటు ఉపసంహరించుకోవచ్చు. అయితే, ఇతర ఆదాయాల మాదిరిగానే ఈపీఎఫ్ ఉపసంహరణలు కొన్ని పరిస్థితులలో పన్నుకు లోబడి ఉంటాయి. ఈపీఫ్ విత్డ్రా షరతులు ఈపీఎఫ్వో సభ్యులు తమ ఖాతాలోని మొత్తాన్ని సాధారణంగా ఉద్యోగ విరమణ తర్వాత పూర్తిగా డ్రా చేసుకోవచ్చు. ఉద్యోగ విరమణకు ఒక సంవత్సరం ముందు అయితే పీఎఫ్ ఖాతాలోని 90 శాతం నిధులను విత్డ్రా చేసుకోవచ్చు. ఇక నిరుద్యోగం విషయంలో అయితే ఉద్యోగం కోల్పోయిన ఒక నెల తర్వాత 75 శాతం, రెండు నెలల తర్వాత పీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఆర్థిక అత్యవసర పరిస్థితులు, ఇతర అవసరాల నిమిత్తం తమ పీఎఫ్ నిధులను ఉపయోగించుకునేందుకు ఈ నియమాలు సౌలభ్యాన్ని అందిస్తాయి. పన్నులేమైనా ఉంటాయా? ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాల్లో జమ చేసే మొత్తంపై సాధారణంగా ఎలాంటి పన్ను ఉండదు. అయితే, మునుపటి సంవత్సరాల్లో జమ చేసిన మొత్తాలపై సెక్షన్ 80C కింద తగ్గింపులను క్లెయిమ్ చేయవచ్చు. అటువంటి సందర్భాలలో, సెక్షన్ 80C గతంలో క్లెయిమ్ చేయకుంటే అదనపు పన్ను వర్తించవచ్చు. ఐదు సంవత్సరాల నిరంతర సర్వీసు పూర్తవ్వని ఉద్యోగులు ఎక్కువ మొత్తంలో పీఎఫ్ నిధులను ఉపసంహరించుకుంటే మూలం వద్ద పన్ను (TDS) మినహాయిస్తారు. అదే ఉపసంహరణ మొత్తం రూ.50,000 కంటే తక్కువ ఉంటే టీడీఎస్ ఉండదు. ఇక ఐదేళ్ల నిరంతర సర్వీసు తర్వాత చేసే ఈపీఎఫ్ ఉపసంహరణలకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఉద్యోగి ఒకటి కంటే కంపెనీల్లో పనిచేసిన సందర్భంలో ఈ ఐదేళ్ల నిరంతర సర్వీసుకు ఉద్యోగి పూర్వ కంపెనీలోని సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకుంటారు. -
అధిక పెన్షన్ కోసం సంస్థలకు గడువు పెంపు
న్యూఢిల్లీ: అధిక పెన్షన్ కోరుకుంటూ దరఖాస్తు చేసుకున్న ఉద్యోగుల తరఫున, వేతన వివరాలను అప్లోడ్ చేసేందుకు గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించినట్టు ఈపీఎఫ్వో ప్రకటించింది. ఈ గడువు సెపె్టంబర్ 30తో ముగియనుండగా, సంస్థల యాజమాన్యాలు, యాజమాన్య సంఘాలు చేసిన వినతి మేరకు ఈపీఎఫ్వో ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా సెపె్టంబర్ 29 నాటికి 5.52 లక్షల పెన్షన్ దరఖాస్తులు యాజమాన్యాల వద్ద పెండింగ్లో ఉన్నట్టు ఈపీఎఫ్వో తెలిపింది. అధిక పెన్షన్ కోసం ఈపీఎఫ్వో దరఖాస్తులు ఆహా్వనించగా.. జూలై 11 నాటికి మొత్తం 17.49 లక్షల దరఖాస్తులు వ్యాలిడేషన్ ఆఫ్ ఆప్షన్/జాయింట్ ఆప్షన్ కోసం వచి్చనట్టు ఈపీఎఫ్వో ప్రకటించింది. ఈ దరఖాస్తుదారులకు సంబంధించి వేతన వివరాలను సంస్థలు అప్లోడ్ చేసి, తమవైపు ఆమోదం తెలియజేస్తే అప్పుడు వాటిని ఈపీఎఫ్వో ప్రాసెస్ చేయడానికి వీలుంటుంది. -
ఈపీఎఫ్వోలో 18.75 లక్షల మంది కొత్త సభ్యులు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థలో జూలై నెలలో అత్యధికంగా 18.75 లక్షల మంది సభ్యులుగా చేరారు. 2018 ఏప్రిల్ నుంచి ఈపీఎఫ్వో నెలవారీ పేరోల్ గణాంకాలను విడుదల చేస్తుండగా, ఒక నెలలో ఈ స్థాయిలో సభ్యుల చేరిక ఇదే మొదటిసారి. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర కారి్మక శాఖ బుధవారం విడుదల చేసింది. కొత్త సభ్యుల్లో 10.27 లక్షల మంది మొదటిసారి ఈపీఎఫ్వో పరిధిలోకి వచి్చనవారు కాగా, మిగిలిన వారు ఒక చోట ఉద్యోగం మానివేసి.. మరో సంస్థ తరఫున తాజాగా నమోదు చేసుకున్నారు. కొత్త సభ్యుల్లో 18–25 ఏళ్ల వయసువారే 58 శాతానికి పైగా ఉన్నారు. వీరంతా మొదటిసారి సంఘటిత రంగంలో ఉపాధి పొందినట్టు తెలుస్తోంది. ఇక జూలైలో ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చిన వారిలో 3.86 లక్షల మంది మహిళలు ఉన్నారు. వీరిలో నికరంగా 2.75 లక్షల మంది మొదటిసారి పేర్లు నమోదు చేసుకున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, హర్యానా రాష్ట్రాల నుంచి నికర సభ్యుల చేరిక అధికంగా నమోదైంది. ఈ రాష్ట్రాలే 58.78 శాతం వాటా ఆక్రమిస్తున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల నుంచి జూలైలో 11.02 లక్షల మంది ఈపీఎఫ్వోలో చేరారు. ఈఎస్ఐ కిందకు 19.88 లక్షల మంది ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) నిర్వహించే సామాజిక భద్రతా పథకం ఈఎస్ఐ కిందకు జూలై నెలలో 19.88 లక్షల మంది సభ్యులు వచ్చి చేరారు. కొత్తగా 28,870 సంస్థలు ఈఎస్ఐసీ కింద నమోదు చేసుకున్నాయి. కొత్త సభ్యుల్లో 25 ఏళ్లలోపు వారు 9.54 లక్షలుగా ఉన్నారు. మహిళా సభ్యులు 3.82 లక్షలుగా ఉన్నట్టు పేరోల్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే, 52 మంది ట్రాన్స్జెండర్లు కూడా ఈఎస్ఐ కింద నమోదు చేసుకున్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
ఎస్డీఎల్సీఈ ఏడీగా గోపీనాఽథ్
మండల సర్వసభ్య సమావేశం బహిష్కరణ
హామీల అమలుపై నోరువిప్పని ఎమ్మెల్యే ‘దొంతి’
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
భూగర్భ జలాలు పెంపొందించుకోవాలి
మరో 22 డివిజన్లు!
ఏఆర్ఓలు స్ట్రాంగ్రూంలను పరిశీలించాలి
మలివాల్ వాంగ్మూలం నమోదు
తాడిపత్రి పల్లెల్లో భయం.. భయం
తప్పక చదవండి
- రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోంది: కేజ్రీవాల్
- ఇంటికి 100 మీటర్ల దూరంలో.. 26 ఏళ్ల పాటు చెరలో
- రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
- మలివాల్ వాంగ్మూలం నమోదు
- Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
- బీపీతో హార్ట్ఎటాక్
- నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
- ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
- మీ దగ్గర ఏదైనా సమాచారం ఉందా?
- బ్యారేజీలకు తక్షణ మరమ్మతులు
Advertisement