-
Japnit Ahuja: డిజిటల్ జెండర్ గ్యాప్ను కోడింగ్ చేసింది!
స్త్రీలు సాంకేతికంగా కూడా సాధికారిత సాధించాలనే లక్ష్యంతో వారికి ఉచితంగా కోడింగ్ పాఠాలు నేర్పుతోంది ఢిల్లీవాసి 23 ఏళ్ల జష్నిత్ అహుజా. కోడింగ్ తెలిసిన వారికి ఉద్యోగావకాశాలు అధికంగా లభిస్తాయి. ఈ రకంగా దేశంలో ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయిలకు ఆశాజ్యోతిగా మారింది జప్నిత్. ఇప్పటి వరకు 2 వేల మంది అమ్మాయిలకు ఉచితంగా డిజిటల్ పాఠాలు నేర్పింది. వంద మంది వాలంటీర్ల బృందానికి నాయకత్వం వహిస్తోంది. ఢిల్లీకి చెందిన జప్నిత్ అహుజాకు కోడింగ్ అంటే చాలా ఆసక్తి. దాంతో కోడింగ్ నేర్చుకోవడం మీదనే దృష్టిపెట్టింది. అదే సమయంలో ఆమె ఒక విషయాన్ని గుర్తించింది. అదేమంటే, కోడింగ్ రంగంలో స్త్రీలు చాలా తక్కువగా ఉన్నారనీ, ఆ ఉన్న వారిలో కూడా చాలామందికి దానిపై తగినంత పరిజ్ఞానం లేదనీ. మిగిలిన వారితో పోల్చితే కోడింగ్ తెలిసిన వాళ్లకి ఉద్యోగావకాశాలు కాసింత ఎక్కువగానే దొరుకుతాయి. అయితే ఆ రంగంలో పురుషులదే పై చేయి. దాంతో సాంకేతికపరంగా ఏమైనా ఉద్యోగాలు ఉంటే కోడింగ్లో వారే ముందుకు దూసుకుపోవడం వల్ల ఆ ఉద్యోగాలు కూడా వారే ఎక్కువగా దక్కించుకోగలుగుతున్నారు. ఇప్పటిదాకా స్త్రీలు ఎన్నో రంగాలలో పట్టుదలతో కృషి చేసి, పై చేయి సాధించగలుగుతున్నప్పుడు కోడింగ్లో మాత్రం పట్టు ఎందుకు సాధించకూడదు... అని ఆలోచించింది. అంతే... ముందు తాను ఆ రంగంలో బాగా కృషి చేసింది. పట్టుదలతో కోడింగ్ నేర్చుకుంది... ఆ రకంగా అందులో చకచకా పై మెట్టుకు చేరిపోగలిగింది. తనలాగే మరికొందరు ఆడపిల్లలకు కూడా కోడింగ్ నేర్పితేనో... అనుకుంది. అలా అనుకోవడం ఆలస్యం... ఇతర ఆమ్మాయిలను కొందరిని పోగు చేసి తనకు తెలిసిన దానిని వారికి ఉచితంగా పాఠాలు నేర్పడం ఆరంభించింది. అలా తన 16వ ఏట ఆమె ‘గో గర్ల్’ అనే సంస్థను స్థాపించింది. అయితే భాష సమస్య రాకుండా వారికి వచ్చిన స్థానిక భాషలోనే ఉచితంగా కోడింగ్ను నేర్పడం ఆమె ప్రత్యేకత. తోటి ఆడపిల్లలను సాంకేతికంగా ఎదిగేలా చేయడం కోసం ఎంచుకున్న లక్ష్యం, అందుకు ఆమె చేసిన కృషీ వృథా పోలేదు. చాలామంది అమ్మాయిలు ఆమె దగ్గర కోడింగ్ నేర్చుకుని మంచి ఉద్యోగావకాశాలను సాధించుకోగలిగారు. అలా తనకు లభించిన ప్రోత్సాహ ఉత్సాహంతో తన వయసు ఆడపిల్లలకే కాదు, తల్లి వయసు స్త్రీలకు కూడా కోడింగ్ నేర్పడం మొదలు పెట్టింది. అలా తనకు 23 ఏళ్లు వచ్చేసరికి చిన్న, పెద్ద కలిసి దాదాపు రెండు వేల మందికి పైగా ఆమె వద్ద కోడింగ్ నేర్చుకుని సాంకేతికంగా అభివృద్ధి చెంది, తమ కాళ్ల మీద తాము నిలబడగలిగారు. అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఆరవ తరగతి చదివేటప్పుడే కోడింగ్ రంగంలో సాధించిన ప్రావీణ్యం బాల మేధావిగా ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘‘చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే అమ్మానాన్న ఆఫీసులనుంచి ఇంటికి వచ్చేలోగా వారికోసం ఎదురు చూస్తూ రకరకాల వెబ్సైట్లకు రూపకల్పన చేసేదానిని. అప్పుడు నాన్న నాతో.. ‘ఈ పిచ్చి పిచ్చి వెబ్సైట్లు కాదు బేబీ... నువ్వు నాసా సైంటిస్ట్గా ఎదగాలి. తలచుకుంటే నీకదేమీ ఒక లెక్కలోనిది కాదు’ అని చెప్పిన మాట నన్ను ఎంతో ప్రభావితం చేసింది. అలా ఎయిత్ క్లాస్కు వచ్చేసరికి పెద్దయ్యాక నేను చేయవలసింది ఉద్యోగం కాదని... సాంకేతికంగా అభివృద్ధి చెందడం, దానిద్వారా నేను నేర్చుకున్న పాఠాలను పదిమందికీ చెప్పడంలోనే ఎంతో థ్రిల్ ఉందనీ అర్థమైంది. నా దగ్గర కోడింగ్ పాఠాలు నేర్చుకున్న వారే తమంతట తాము స్వచ్ఛందంగా ఇతరులకు నేర్పించడం మొదలు పెట్టారు. ఆ విధంగా ‘కోడింగ్ ఫర్ ఉమెన్ బై ఉమెన్’ కాన్సెప్ట్ మాకు బాగా ఉపకరించింది. అంతేకాదు, డిజిటల్ జెండర్ గ్యాప్ అనే వివక్షను పూడ్చాలన్న నా స్వప్నం సాకారం అయ్యేందుకు ఉపకరించింది. ఏమైనా పిల్లలు గ్యాడ్జెట్స్తో ఆడుకుంటున్నప్పుడు వాళ్లు వాటితో ఏం చేస్తున్నారో... తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలి. దానిని వారు మంచికే ఉపయోగిస్తున్నారు అని గుర్తించగలిగితే ఆ దిశగా వారిని ప్రోత్సహించడం మంచిది. నా తల్లిదండ్రులు కోడింగ్పై నాకున్న ప్యాషన్ను గుర్తించకుండా ఏవో పిచ్చి ఆటలు ఆడుతున్నాను అనుకుని దానికి అడ్డుకట్ట వేసి ఉంటే నేను ఈ స్థాయికి ఎదిగి ఉండేదానిని కాను’’ అని ఆమె చెప్పిన మాటలు ఆలోచించదగ్గవి. ∙కోడింగ్లో శిక్షణ పొందుతున్న అమ్మాయిలు -
ఆధ్యాత్మిక పర్యాటకంతో ఉపాధి
ముంబై: ఆధ్యాత్మిక పర్యాటకంతో వచ్చే 4–5 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని గ్లోబల్ టెక్నాలజీ, డిజిటల్ టాలెంట్ సొల్యూషన్స్ కంపెనీ ఎన్ఎల్బీ సరీ్వసెస్ తెలిపింది. భారత్లో ఈ రంగం 2023–30 మధ్య ఏటా 16 శాతం వృద్ధి చెందుతుందని సంస్థ సీఈవో సచిన్ అలుగ్ ఒక అంచనాగా చెప్పారు. ‘దేశీయ టూరిజంలో ఆధ్యాత్మిక పర్యాట కం వాటా ఏకంగా 60 శాతముంది. 2028 నాటికి ఈ విభాగం 60 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేయగలదు. శాశ్వత, తాత్కాలిక ఉద్యోగ అవకాశాలకు కొత్త వేదికలను సృష్టిస్తుంది. కోవిడ్ మహ మ్మారి తర్వాత యాత్రలకు వెళ్లేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 2021–22లో ఆధ్యాత్మిక చందాలు 14 శాతం అధికం అయ్యాయి. అయోధ్యలో ఇటీవల ప్రారంభించిన రామ్ మందిర్తో ఆధ్యాత్మిక పర్యాటకానికి జోష్ నింపనుంది. ఒక్క రామ్ మందిర్ రాక కారణంగా వంటవారు, ఫ్రంట్ డెస్క్ మేనేజర్, హౌజ్కీపింగ్, టూర్ గైడ్స్ వంటి సుమారు 25,000 జాబ్స్ కొత్తగా రానున్నాయి. ఆహార సేవలు, కంజ్యూమర్ గూడ్స్, ఆతిథ్యం, రవాణా, మతపర ఉత్పత్తులు, చేతివృత్తులు, వ్రస్తాలు, సరుకు రవాణా, గిడ్డంగులు, ప్యాకింగ్ తదితర విభాగాల్లో కొత్తగా వ్యాపార అవకాశాలు ఉంటాయి. దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక పర్యాటకులకు ప్రత్యేకంగా సేవలందించే కొత్త సంస్థల సంఖ్యలో 6–8 శాతం పెరుగుదల అంచనా వేస్తున్నాము’ అని వివరించారు. -
4 ఏళ్లలో భారీగా ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు
నోయిడా: దేశీయంగా ఎల్రక్టానిక్స్ పరికరాల వ్యవస్థ అభివృద్ధి చెందుతోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వచ్చే 3–4 ఏళ్లలో భారత్ చెప్పుకోతగ్గ స్థాయిలో విడిభాగాల ఎగుమతిదారుగా ఎదగగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మొబైల్ రంగానికి ప్రకటించిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకంతో అదనంగా 5 లక్షల ఉద్యోగావకాశాలు వచ్చాయని, రాబోయే అయిదేళ్లలో ఇది మరింతగా పెరుగుతుందని మంత్రి చెప్పారు. ‘దేశీయంగా డిజైన్ సామర్థ్యాలను మెరుగుపర్చుకుంటున్నాం. ఇది దేశానికి ప్రయోజనకరంగా ఉండనుంది. ఎల్రక్టానిక్స్ పరికరాల తయారీ కూడా వృద్ధి చెందుతోంది. వచ్చే 3–4 ఏళ్లలో మొబైల్ ఫోన్ల తరహాలోనే మనం విడిభాగాలను కూడా గణనీయంగా ఎగుమతి చేయబోతున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. డిక్సన్ టెక్నాలజీస్కి చెందిన నాలుగో మొబైల్ ఫోన్స్ తయారీ యూనిట్ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. డిక్సన్ అనుబంధ సంస్థ ప్యాడ్జెట్ ఎల్రక్టానిక్స్ దీన్ని రూ. 256 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసింది. ఈ ప్లాంటు వార్షిక సామ ర్ధ్యం 2.5 కోట్ల యూనిట్లు కాగా, చైనా కంపెనీ షావో మికి కోసం స్మార్ట్ఫోన్లను తయారు చేస్తారు. ఎల్రక్టానిక్స్ సంస్థల సమాఖ్య ఎల్సినా అంచనల ప్రకారం 2021–22లో దేశీయంగా మొత్తం విడిభాగాల మార్కెట్ 39 బిలియన్ డాలర్లుగా ఉండగా.. ఇందులో 68 శాతం వాటా దిగుమతులదే ఉంటోంది. -
నిరుద్యోగులకు శుభవార్త.. పండుగ సీజన్లో 5 లక్షల ఉద్యోగాలు!
పండుగ సీజన్ అనగానే వ్యాపారాలు పెరుగుతాయని అందరికి తెలుసు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ-కామర్స్ కంపెనీలు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తాయి. ఇందులో భాగంగానే ‘మీషో’ (Meesho) దాదాపు 5 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించడానికి సిద్ధమైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ఈకామ్ ఎక్స్ప్రెస్, డీటీడీసీ, ఎలాస్టిక్ రన్, లోడ్షేర్, డెలివరీ, షాడోఫ్యాక్స్, ఎక్స్ప్రెస్బీస్ వంటి మరిన్ని థర్డ్-పార్టీ లాజిస్టిక్స్ ప్రొవైడర్లతో కొలాబరేషన్ ద్వారా దాదాపు 2 లక్షల ఉద్యోగ అవకాశాలను అందించాలని మీషో భావిస్తోంది. ఇందులో దాదాపు 60 శాతం కంటే ఎక్కువ ఉద్యోగాలు టైర్ 3, 4 ప్రాంతాల్లో రానున్నట్లు సమాచారం. పండుగ సీజన్లో డిమాండ్ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కస్టమర్ల అవసరాలను తీర్చడానికి కొత్త ఉద్యోగులను నియమించుకుంటున్నట్లు ఫుల్ఫిల్మెంట్ అండ్ ఎక్స్పీరియన్ష్ సీఎక్స్ఓ సౌరభ్ పాండే అన్నారు. ఇదీ చదవండి: గూగుల్ సీఈఓ మరీ ఇంత సింపుల్గానా.. ఫిదా అవుతున్న నెటిజన్లు! మీషో సెల్లర్స్ పండుగ సీజన్లో 3 లక్షల మందికి పైగా సీజనల్ వర్కర్స్ను నియమించుకుంటారు. మీషో 80 శాతం మంది విక్రేతలు కొత్త ఉత్పత్తులను పరిచయం చేయడానికి, ఫ్యాషన్ యాక్ససరీస్, పండుగ అలంకరణ వంటి కొత్త కేటగిరీలను వెంచర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పెరిగిన డిమాండ్ను ఆర్గనైజ్ చేయడానికి మీషో అదనపు స్లోరేజ్ స్పేస్ అద్దెకు తీసుకోవడంపై ద్రుష్టి పెడుతున్నట్లు చెబుతున్నారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ సంవత్సరం పండుగ నియామకాలు గిగ్ జాబ్లలో గణనీయమైన వృద్ధిని సాధించవచ్చని అంచనా వేస్తున్నట్లు టీమ్లీజ్ తెలిపింది. బెంగుళూరు, ఢిల్లీ, ముంబై , హైదరాబాద్ వంటి టైర్-1 నగరాలతోపాటు టైర్ 3 నగరాల్లో కార్యకలాపాలను మరింత పెంచడానికి కంపెనీ సిద్ధమవుతోంది. ఇదీ చదవండి: భారత్లో ఐఫోన్ మేనియా.. ఎమ్ఆర్పీ కంటే ఎక్కువ ధరతో.. ఇప్పటికే వాల్మార్ట్ యాజమాన్యంలోని ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ఇటీవల తన సప్లై చైన్లో 1,00,000 కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తున్నట్లు తెలిపింది. పండుగ సీజన్కు ముందు, పండుగ సీజన్లో కస్టమర్ డిమాండ్ను తీర్చడానికి ఫ్లిప్కార్ట్ తన పాన్-ఇండియా సప్లై చెయిన్లో మిలియన్ల కొద్దీ సీజనల్ ఉద్యోగాలను నియమించుకోవాలని చూస్తోంది. -
Rozgar Mela: వేగవంతమైన వృద్ధి బాటలో మన ఆర్థికం
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధి బాటలో పయనిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో యువతకు భారీ స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. సోమవారం రోజ్గార్ మేళాలో ఆయన వర్చువల్గా ప్రసంగించారు. కేంద్ర పారామిలటరీ దళాలు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఢిల్లీ పోలీసు శాఖలో ఉద్యోగాలు పొందిన 51,000 మందికిపైగా యువతకు ఈ సందర్భంగా నియామక పత్రాలు అందజేశారు. ఆటోమొబైల్, ఫార్మాస్యూటికల్, పర్యాటకం, ఆహార శుద్ధి రంగాల్లో మరింత వృద్ధి నమోదవుతుందని, యువతీ యువకులకు భారీ సంఖ్యలో కొత్త ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నట్లు మోదీ తెలిపారు. మన దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా పురోగమిస్తోందని చెప్పారు. త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఖాయమని పునరుద్ఘాటించారు. అభివృద్ధి ఫలాలు సామాన్య ప్రజలకు అందుతాయని అన్నారు. అన్ని రంగాల అభివృద్ధితోనే ఆర్థిక వ్యవస్థ ముందడుగు వేస్తుందని చెప్పారు. కోట్లాది కొత్త కొలువులు దేశంలో 2030 నాటికి టూరిజం రంగంలో కొత్తగా దాదాపు 14 కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని, దేశ ఆర్థిక వ్యవస్థలో ఈ రంగం వాటా రూ.20 లక్షల కోట్లకు చేరుతుందని ప్రధాని మోదీ వివరించారు. ఫార్మాస్యూటికల్ రంగం వాటా రూ.4 లక్షల కోట్లుగా ఉందని, 2030 నాటికి ఇది రూ.10 లక్షల కోట్లకు చేరుతుందని వెల్లడించారు. ఫార్మా రంగంలో యువత అవసరం ఎంతో ఉందన్నారు. ఆటోమొబైల్ రంగంలోనూ యువ శక్తి భాగస్వామ్యం కీలకమని చెప్పారు. ఆహార శుద్ధి రంగం విలువ ప్రస్తుతం రూ.26 లక్షల కోట్లుగా ఉందని, మరో మూడున్నరేళ్లలో ఇది ఏకంగా రూ.35 లక్షల కోట్లకు చేరుతుందని స్పష్టం చేశారు. ఆహార శుద్ధి పరిశ్రమ విస్తరిస్తున్నకొద్దీ కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతూనే ఉంటుందని ఆయన అన్నారు. ఇక ‘మేడ్ ఇన్ ఇండియా’ ల్యాప్టాప్లు, కంప్యూటర్లు సుపరిపాలన, చట్టబద్ధ పాలన ఉన్న రాష్ట్రాల్లో పెట్టుబడులు వెల్లువెత్తుతాయని, అందుకు ఉత్తరప్రదేశ్ ఒక ఉదాహరణ అని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలు ఉండాలన్నారు. వేగవంతమైన అభివృద్ధి కనిపించాలన్నారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం ఉండాలన్నారు. నేరాల రేటు అధికంగా ఉన్న రాష్ట్రాలకు పెట్టుబడులు పెద్దగా రావడం లేదని, ఉద్యోగ అవకాశాలు పడిపోతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని అభిప్రాయపడ్డారు. గత తొమ్మిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వ కృషి వల్ల మార్పు కనిపిస్తోందన్నారు. గత ఏడాది రికార్డు స్థాయిలో ఎగుమతులు జరిగాయన్నారు. వస్తూత్పత్తి ఊపందుకుందని, ఉద్యోగాల సంఖ్య పెరగడంతో కుటుంబాల ఆదాయం పెరిగినట్లు మోదీ తెలిపారు. ఎల్రక్టానిక్ పరికరాల తయారీపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. మేడ్ ఇన్ ఇండియా ల్యాప్టాప్లు, వ్యక్తిగత కంప్యూటర్లు ప్రపంచ మార్కెట్లను ముంచెత్తే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. పారా మిలటరీ దళాల్లో కొత్తగా చేరిన వారిని మోదీ ‘అమృత్ రక్షకులు’గా అభివరి్ణంచారు. -
పనిమంతులకు ‘పండుగే’.. హైదరాబాద్, విజయవాడల్లో డిమాండ్
► పండుగల సీజన్ మొదలై క్రమంగా పుంజుకుంటున్న కొద్దీ వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. ముఖ్యంగా వినియోగదారులు ప్రత్యక్షంగా ప్రభావం చూపే ఈ–కామర్స్, లాజిస్టిక్స్, ఆటోమొబైల్ తదితర రంగాల్లో ఉద్యోగాలు పెరుగుతాయి. – లోహిత్ భాటియా, ప్రెసిడెంట్–వర్క్ఫోర్స్ మేనేజ్మెంట్, క్వెస్ సాక్షి, హైదరాబాద్: త్వరలో ప్రారంభం కానున్న పండుగల సీజన్ వివిధ రంగాల్లో అవకాశాలకు తలుపులు తెరుస్తూ ఉద్యోగార్థుల్లో నయాజోష్ ను నింపుతోంది. ఈ నెలాఖరులో ‘రక్షాబంధన్’తో మొదలై కొత్త ఏడాది, ఆపై కాలం వరకు సుదీర్ఘ ఫెస్టివల్ సీజన్ జోరు కొనసాగనుంది. ఈ సీజన్ను దృష్టిలో పెట్టుకుని... వివిధ వర్గాల వినియోగదారుల పండుగ మూడ్ను క్యాష్ చేసుకునేందుకు ఇప్పటికే పలు కంపెనీలు, సంస్థలు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో వివిధ రంగాల్లో సేవలందించే ఉద్యోగులకు కూడా ఒక్కసారిగా డిమాండ్ పెరిగినట్టుగా పలు అధ్యయనాలు అంచనా వేస్తున్నాయి. ఇదీ అధ్యయనం..: రాబోయే పండుగల సీజన్ను దృష్టిలో పెట్టుకుని గడిచిన ఏప్రిల్ నుంచి ఈనెల ఆగస్టు వరకు స్టాఫ్ డిమాండ్ 23 శాతం పెరిగినట్టుగా ప్రముఖ బిజినెస్ సర్వీసెస్ ప్రొవైడర్ సంస్థ క్వెస్ తాజా పరిశీలనలో వెల్లడైంది. ఈ కాలంలోనే 32 వేల ఉద్యోగాలకు డిమాండ్ ఏర్పడడంతో పాటు ఏడాది చివర్లో పండుగల సీజన్ ముగిసే దాకా ఈ– కామర్స్, లాజిస్టిక్స్, ఆటోమొబైల్స్ తదితరాల్లో ప్రతీనెల 5 వేల చొప్పున ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, రిటైల్, టెలికం తదితర రంగాలు, విభాగాల్లో అవకాశాలు పెరిగినట్లు ఈ అధ్యయనం ద్వారా తెలుస్తోంది. గతేడాది ఏప్రిల్–ఆగస్టు మధ్యకాలంతో పోల్చితే ఈ ఏడాది అదే కాలంలో ‘మాన్యుఫాక్చరింగ్, ఇండస్ట్రియల్ సెగ్మెంట్’లో 245 శాతం మేర వృత్తినిపుణుల డిమాండ్ పెరిగినట్టు ఈ నివేదిక పేర్కొంది. రిక్రూట్మెంట్ విషయానికొస్తే...దసరా, దీపావళి పండుగల సందర్భంగా అత్యధికంగా వాహనాల కొనుగోలుకు మొగ్గు నేపథ్యంలో ఆటోమొబైల్ పరిశ్రమ ముందంజలో (ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ను తట్టుకునేందుకు వీలుగా) ఉంది. ఫెస్టివల్ సీజన్ దృష్ట్యా... బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీ (బీఎఫ్ఎస్ఐ)కి సంబంధించి మ్యాన్పవర్ కోసం 27 శాతం డిమాండ్, టెలికాం రంగంలో 14 శాతం డిమాండ్ పెరిగినట్టు తెలిపింది. హైదరాబాద్ సహా మెట్రోలు, విజయవాడల్లో డిమాండ్ ఈ పండుగల సీజన్ నేపథ్యంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన వివిధ రకాల సేవలు, నూతన రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకునే విషయంలో, తదనుగుణంగా అవసరమైన ‘మ్యాన్పవర్’అందించడంలో హైదరాబాద్తో సహా బెంగళూరు, చెన్నై, ముంబై మెట్రోనగరాలతో పాటు నోయిడా, పుణె నగరాలు అత్యధిక డిమాండ్ కలిగి ఉన్నట్టు క్వెస్ పరిశీలన వెల్లడించింది. వీటికి ఏమాత్రం వెనకబడకుండా విజయవాడ, కోయంబత్తూరు, జంషెడ్పూర్, రాంఛీ వంటి నగరాల్లోని వివిధరంగాలకు చెందిన వర్క్ఫోర్స్కు మంచి ఉద్యోగ అవకాశాలున్నట్టు తెలిపింది. ఏ ఉద్యోగాలకు డిమాండ్ అధికం అంటే.. ప్రొడక్షన్ ట్రైనీ, సేల్స్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్ రిలేషన్షిప్ ఆఫీసర్, బ్రాంచ్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్, కలెక్షన్ ఆఫీసర్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, బ్రాడ్ బ్యాండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, వేర్హౌస్ అసోసియేట్ తదితర ఉద్యోగాలకు అధిక డిమాండ్ ఏర్పడింది. ఈ–కామర్స్, లాజిస్టిక్స్ ఇండస్ట్రీలో దాదాపు మూడులక్షల దాకా ఉద్యోగులకు అవకాశాలు కల్పించే అంచనాలతో ముందువరసలో నిలుస్తోంది. ఇందులో భాగంగానే వేర్హౌస్, డెలివరీ ఆపరేషన్స్ వంటివి కూడా అంతర్భాగంగా ఉంటాయి. పండుగల సీజన్ మొదలై క్రమంగా పుంజుకుంటున్న కొద్దీ వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. ముఖ్యంగా వినియోగదారులు ప్రత్యక్షంగా ప్రభావం చూపే ఈ–కామర్స్, లాజిస్టిక్స్, ఆటోమొబైల్, తదితర రంగాల్లో ఉద్యోగాలు పెరుగుతాయి. –లోహిత్ భాటియా, ప్రెసిడెంట్–వర్క్ఫోర్స్ మేనేజ్మెంట్, క్వెస్ -
ఐటీ కొలువులకు ‘వింగ్స్’
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నగరంగా విశాఖపట్నం భాసిల్లుతోంది. త్వరలో కార్యనిర్వాహక రాజధానిగా కూడా ప్రత్యేకతను సంతరించుకోనున్న విశాఖపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఐటీ హబ్గా నగరాన్ని అభివృద్ధి చేసేందుకు వడివడిగా అడుగులు ముందుకేస్తోంది. ఈ నేపథ్యంలోనే బీచ్ ఐటీ కాన్సెప్్టని ప్రమోట్ చేస్తోంది. దీంతో దిగ్గజ సంస్థలు విశాఖ వైపు ఆసక్తి కనబరుస్తున్నాయి. దీంతో ఐటీ సంస్థల్లో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించడానికి ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ సహకారంతో విశాఖలో జాబ్ ఫెయిర్ నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. జూలై 21, 22 తేదీల్లో గ్రూప్ స్నాప్ ఫెస్ట్–2023 పేరుతో జరిగే ఈ కార్యక్రమానికి దిగ్గజ ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలు హాజరుకానున్నాయి. దీనికి సంబంధించిన బ్రోచర్, వెబ్సైట్ని విశాఖలో ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీస్ (ఎపిటా), వి ఇన్ఫో టెక్నాలజీస్ ప్రతినిధులు పాల్గొన్నారు. త్వరలో దిగ్గజ సంస్థల కార్యకలాపాలు.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో దాదాపు 300కి పైగా ఐటీ కంపెనీలుండగా.. ఇందులో 80 శాతం వరకు విశాఖ కేంద్రంగానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ నెల 28న దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్.. డెవలప్మెంట్ సెంటర్ని ప్రారంభించనుంది. ఇదే బాటలో టాటా కన్సల్టెన్సీ సర్వి సెస్ (టీసీఎస్), విప్రో కూడా పయనించనున్నాయి. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో ఉన్న గ్రాడ్యుయేట్స్కు, ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలకు మధ్య బాండింగ్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తోంది. ఎపిటా, రాష్ట్ర ఐటీ విభాగం సహకారంతో వి ఇన్ఫో టెక్నాలజీస్ ఆధ్వర్యంలో గ్రూప్ స్నాప్ ఫెస్ట్–2023ని నిర్వహించనుంది. ఐటీ, ఐటీ అనుబంధ రంగ కంపెనీలకే కాకుండా.. ఫార్మా సంస్థలు, స్టార్టప్ సంస్థలకు ఏ విధమైన నైపుణ్యాలున్న మానవ వనరులు అవసరం?.. ఉద్యోగ అవకాశాలు పొందాలంటే ఎలాంటి కోర్సులు చేయాలి? టెక్నాలజీని ఎలా అందిపుచ్చుకోవాలి వంటి అంశాలను గ్రాడ్యుయేట్స్తో పాటు 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులకు వివరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ‘స్ప్రెడ్ యువర్ వింగ్స్’ అనే పేరుతో రెండు రోజుల పాటు విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన యువత నుంచి సీవీలు తీసుకొని.. అక్కడే ప్రముఖ కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి. ఎంపికైనవారికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. జాబ్ ఫెయిర్కు టెక్ మహీంద్ర, టీసీఎస్, ఎల్ అండ్ టీ, కాన్సెంట్రిక్స్, కాండ్యుయెంట్, చెగ్, డబ్ల్యూఎన్ఎస్, సెయింట్, పాత్రా, ఫ్లూయెంట్గ్రిడ్, పల్సస్ వంటి 40 వరకూ ఐటీ, అనుబంధ కంపెనీలు, పైజర్, అరబిందో వంటి 10 ఫార్మా సంస్థలు, 54 యూనివర్సిటీలు, కళాశాలలతో పాటు 10 స్టార్టప్ కంపెనీలు హాజరు కానున్నాయి. విశాఖ ఐటీలో అపార అవకాశాలు.. విశాఖ ఐటీలో అపార అవకాశాలున్నాయి. కానీ.. వాటిని ఎలా అందిపుచ్చుకోవాలన్న అంశంపై గ్రాడ్యుయేట్స్కు సందేహాలున్నాయి. ఐటీ సంస్థలకు కూడా మానవవనరుల కొరత ఉంది. వాటిని తీర్చేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తున్నాం. విశాఖ నగరంలో ఉన్న ఐటీ కంపెనీల గురించి అందరికీ తెలియజేయడం ఒక లక్ష్యం కాగా.. వాటిలో ఉపాధి అవకాశాలను ఇక్కడి యువతకు కల్పించడాన్ని మరో లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి సంస్థ 15 నిమిషాల పాటు విద్యార్థులతో అనుసంధానమవుతుంది. తమ సంస్థ గురించి తెలియజేయడమే కాకుండా.. అందులో ఉద్యోగం సాధించేందుకు ఎలాంటి అర్హతలు కావాలో అవగాహన కల్పిస్తాయి. ప్రభుత్వం బీచ్ ఐటీ విధానం తీసుకొచ్చాక విశాఖలో పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. – సాయికుమార్, సీఈవో, వి ఇన్ఫో టెక్నాలజీస్ -
యూజీ ఆనర్స్.. ఇక జాబ్ ఈజీ
గుణదల(విజయవాడ తూర్పు): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానంలో భాగంగా యూజీ ఆనర్స్ (నాలుగేళ్ల డిగ్రీ) కోర్సుకు రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు మెండుగా కనిపిస్తున్నాయి. విద్యార్థులకు దేశ, విదేశాల్లో విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రూపొందించిన యూజీ ఆనర్స్ కోర్సును ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రవేశపెట్టేందుకు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు సిద్ధమయ్యాయి. దీనిలో భాగంగా ఉన్న త విద్యా మండలి మార్గదర్శకాల ప్రకారం యూజీ ఆనర్స్ కోర్సుపై ఈ నెల మొదటి వారం నుంచే రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు పెద్ద ఎత్తున విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాయి. నాలుగేళ్ల డిగ్రీ వల్ల కలిగే ప్రయోజనాలను విద్యావేత్తలు, మేధావులు వివరిస్తున్నారు. దేశంలో ఎక్కడైనా ఉన్నత విద్య అభ్యసించవచ్చని, విదేశాల్లో సైతం ఉపాధి అవకాశాలు సులభంగా లభిస్తాయని చెబుతున్నారు. దీంతో యూజీ ఆనర్స్పై విద్యార్థులకు ఆసక్తి పెరుగుతోంది. కోర్సులు ఇలా... బీఏ ఆనర్స్ : హిస్టరీ, టూరిజం మేనేజ్మెంట్, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, స్పెషల్ ఇంగ్లిష్, స్పెషల్ తెలుగు ఒక మేజర్ సబ్జెక్ట్గా ఉంటాయి. ఈ కోర్సులోనే మైనర్ సబ్జెక్టులుగా సోషియాలజీ, ఫిలాసఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ ఉంటాయి. బీఎస్సీ ఆనర్స్: కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎల్రక్టానిక్స్, నానో టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, మాథమేటిక్స్, స్టాటిస్టిక్స్, బోటనీ, హారి్టక ల్చర్, జువాలజీ, అగ్రికల్చర్, మైక్రో బయాలజీ, బయోకెమిస్ట్రీ మేజర్ సబ్జెక్టులుగా ఉంటాయి. మైనర్ సబ్జెక్టులుగా ఫుడ్ టెక్నాలజీతోపాటు ఎంపిక చేసుకున్న కోర్సుకు ఆధారంగా మరికొన్ని సబ్జెక్టులు ఉంటాయి. బి.కాం ఆనర్స్: బి.కాం జనరల్, కంప్యూటర్ అప్లికేషన్స్, బీబీఏ జనరల్, బీబీఏ డిజిటల్ మార్కెటింగ్, బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ ఫైనాన్సియల్ సరీ్వసెస్, అకౌంట్స్ అండ్ టాక్సెస్ మేజర్ సబ్జెక్టులుగా ఉంటాయి. యూజీ ఆనర్స్ మొదటి ఏడాది పూర్తి చేస్తే సర్టిఫికెట్ ఇస్తారు. రెండో ఏడాది పూర్తి చేసిన వారికి డిప్లొమా వస్తుంది. మూడేళ్లు పూర్తి చేస్తే డిగ్రీ, నాలుగో ఏడాది ఉత్తీర్ణులైతే ఆనర్స్ పట్టా పొందుతారు. నాలుగేళ్లు ఆనర్స్ పూర్తి చేసిన తర్వాత పీజీ ఏడాది చదివితే నేరుగా పీహెచ్డీ చేసే అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగ, ఉన్నత విద్యా అవకాశాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ విద్యా విధానం విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుంది. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు, ఉద్యోగాలు పొందేందుకు అవకాశాలు లభిస్తాయి. యువత ఉన్నత భవిష్యత్తుకు నూతన కోర్సులు బంగారు బాటలు వేస్తాయి. – డాక్టర్ భాగ్యలక్ష్మి, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్, విజయవాడ -
పాలిటెక్నిక్తో.. కొలువు పక్కా!
విశాఖ విద్య: పదో తరగతి ఉత్తీర్ణత తర్వాత ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి మార్గం వేసే పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల వైపు విద్యార్థులు మొగ్గుచూపుతున్నారు. పదో తరగతి తర్వాత మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు అభ్యసిస్తే చాలు మంచి ఉద్యోగావకాశాలు తలుపు తడుతున్నాయి. అంతేకాకుండా డిప్లొమా పూర్తి చేశాక ఏపీ ఈసెట్ రాసి నేరుగా బీటెక్ సెకండియర్లో చేరే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ కోర్సులు చదివేవారికి సత్వర ఉపాధి, ఉద్యోగావకాశాలు దక్కేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2023–24 విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 34 వేల మందికి పైగా విద్యార్థులు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రాష్ట్రంలో 84 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 17 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు యాజమాన్యాల ఆధ్వర్యంలో 250కి పైగా కాలేజీలు ఉన్నాయి. పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్–2023లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా ఇటీవలే పూర్తయింది. విద్యార్థులు కళాశాలల్లో చేరికకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కోరుకున్న కాలేజీలో నచ్చిన బ్రాంచ్ ఎంచుకునేలా సాంకేతిక విద్యాశాఖాధికారులు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 26 జిల్లాల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఈ నెల 12 నుంచి సదస్సులు నిర్వహిస్తున్నారు. వీటిని ఈ నెల 24 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. పాలిటెక్నిక్తో దండిగా అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవతో రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు తరలివస్తున్నాయి. పారిశ్రామికీకరణతో భవిష్యత్తులో సాంకేతిక కోర్సులు చేసిన వారికి దండిగా ఉపాధి, ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. మూడేళ్లలోనే చేతికొచ్చే డిప్లొమా సర్టిఫికెట్తో ఉపాధి లేదా ఉద్యోగం పొందే వీలు ఉండటం.. అలాగే ఏపీ ఈసెట్ రాసి నేరుగా బీటెక్లో సెకండియర్లో చేరే అవకాశం ఉండటంతో విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సులపై ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రభుత్వ కాలేజీల బలోపేతం దిశగా.. పాలిటెక్నిక్ కోర్సులకు డిమాండ్ పెరగడంతో అధికారులు ప్రభుత్వ కాలేజీల్లో నూరు శాతం సీట్లు భర్తీ అయ్యేలా దృష్టి సారించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అర్హులకు ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో ఇస్తుండటంతో గతంలో మూత పడిన కాలేజీలను సైతం ప్రైవేట్ యాజమాన్యాలు మళ్లీ తిరిగి ప్రారంభిస్తున్నాయి. అయితే ఇలాంటి ప్రమాణాలు లేని కళాశాలల్లో విద్యార్థులు చేరకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అవగాహన సదస్సుల్లో భాగంగా కాలేజీల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ కాలేజీల్లో ఉన్న మౌలిక సౌకర్యాలు, క్యాంపస్ ప్లేస్మెంట్స్ వంటి అంశాలపై వివరిస్తున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో చదివి.. ఉన్నత స్థానాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులను సైతం సదస్సులకు ఆహ్వానించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన వసతులు.. ఉన్నత విద్య, ఉద్యోగాల పరంగా మంచి అవకాశాలు ఉండటంతో విద్యార్థులు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో మెరుగైన వసతులున్నాయి. క్యాంపస్ ప్లేస్మెంట్ల ద్వారా ఉద్యోగాలు కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. అవగాహన సదస్సుల ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. – డాక్టర్ ఎన్.చంద్రశేఖర్, అధ్యక్షుడు, ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ పాలిటెక్నిక్ టీచర్స్ అసోసియేషన్, విశాఖపట్నం -
భారీగా ఉపాధి అవకాశాలు.. ఎక్కడో తెలుసా?
ముంబై: 5జీ టెక్నాలజీ రాకతో ఉద్యోగాలకు సంబంధించి పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. దేశీ టెక్నాలజీ నిపుణులకు అపార అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసుల రంగాల్లో ఉద్యోగాల కల్పన, కొత్త నైపుణ్యాల్లో శిక్షణ తదితర అంశాలపరంగా 5జీ టెక్నాలజీ సానుకూల ప్రభావం చూపనుంది. స్టాఫింగ్ సేవల కంపెనీ టీమ్లీజ్ సర్వీసెస్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. (ఫాక్స్కాన్ రంగంలోకి: రాయిల్ ఎన్ఫీల్డ్, ఓలా ఏమైపోవాలి? ) ఉద్యోగాల కల్పన, వ్యవస్థ మీద 5జీ ప్రభావాలపై నిర్వహించిన సర్వేలో పాల్గొన్న 247 పైచిలుకు సంస్థలు అభిప్రాయాలతో ఈ నివేదిక రూపొందింది. ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద టెలికం రంగానికి రూ. 12,000 కోట్లు కేటాయించడం, ఇందులో 25 శాతం మొత్తాన్ని కొత్తగా ఉద్యోగాల కల్పన కోసం పక్కన పెట్టడం తదితర అంశాలు ఉపాధి కల్పన, నైపుణ్యాల్లో శిక్షణ విషయంలో సానుకూల ప్రభావం చూపగలవని టీమ్లీజ్ సర్వీసెస్ సీఈవో (స్టాఫింగ్ విభాగం), కార్తీక్ నారాయణ్ తెలిపారు. 5జీ సామర్ధ్యాలను పూర్తిగా వెలికితీసేందుకు, అసాధారణ స్థాయిలో ఉద్యోగాలను సృష్టించేందుకు, నవకల్పనలకు తోడ్పాటు ఇచ్చేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయన పేర్కొన్నారు. నివేదికలోని మరిన్ని విశేషాలు.. ► 5జీతో బీఎఫ్ఎస్ఐ రంగంపై 60 శాతం మేర, విద్య (48 శాతం), గేమింగ్ (48 శాతం), రిటైల్ .. ఈ–కామర్స్ 46 శాతం మేర సానుకూల ప్రభావం పడనుంది. ► 5జీ వినియోగం ప్రారంభించిన తొలి ఏడాదిలో భారీగా ఉద్యోగాల కల్పన జరగగలదని 46 శాతం మంది అభిప్రాయపడ్డారు. ► టెల్కోలు 5జీ నెట్వర్క్ను అప్గ్రేడ్ చేయడం, నెట్వర్క్ భద్రతను పెంచుకోవడం మొదలైన అంశాల వల్ల స్పెషలైజ్డ్ ఉద్యోగాల్లో నియామకాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనితో టెక్నికల్ కంటెంట్ రైటర్లు, నెట్వర్కింగ్ ఇంజినీర్లు, ఏఐ/ఎంఎల్ నిపఉణులు, యూఎక్స్ డిజైనర్లు, క్లౌడ్ కంప్యూటింగ్ ఇంజినీర్లు, సైబర్సెక్యూరిటీ స్పెషలిస్టులు, డేటా సైన్స్ .. అనలిటికల్ నిపుణులు మొదలైన వారికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతం టెలికం పరిశ్రమలో డిమాండ్–సరఫరా మధ్య 28 శాతం మేర వ్యత్యాసం ఉంది. దీంతో సమగ్ర స్థాయిలో అత్యవసరంగా కొత్త నైపుణ్యాల్లో శిక్షణ ఇప్పించాల్సి ఉంటోంది. ఇదీ చదవండి: అంబటి రాయుడు: లగ్జరీ కార్లు, ఇల్లు, బిజినెస్, నెట్వర్త్ గురించి తెలుసా? -
ఇంటర్నెట్ బిజినెస్లో అత్యధిక ఉద్యోగావకాశాలు
సాక్షి, అమరావతి: దేశంలో ఇంటర్నెట్ బిజినెస్ రంగం వేగంగా విస్తరిస్తోందని, ఈ ఏడాది ఈ రంగంలో ఉద్యోగావకాశాలు అత్యధికంగా ఉంటాయని ఇండియా స్కిల్స్ రిపోర్ట్– 2023 వెల్లడించింది. భారతదేశంలో ప్రస్తుతం 74.9 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉండగా.. వచ్చే ఐదేళ్లలో ఆ సంఖ్య 90 కోట్లకు చేరుతుందని రిపోర్ట్ స్పష్టం చేసింది. అత్యంత వేగంగా ఈ రంగం విస్తరిస్తోందని, భారతదేశం డిజిటల్ దిగ్గజంగా స్థిరపడేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇంజినీరింగ్, తయారీ రంగంలో పెట్టుబడులపై దృష్టి సారిస్తోందని, ఫార్మాస్యూటికల్ రంగం కూడా గణనీయంగా విస్తరిస్తోందని, ఈ రంగాల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపింది. ఉపాధి అర్హతలో మహిళలే ముందు గత ఆరేళ్లుగా ఉపాధి అర్హత గల యువతలో మహిళలే అత్యధికంగా ఉన్నట్లు రిపోర్ట్ తెలిపింది. 2017లో ఉపాధి అర్హతగల మహిళా వనరులు 40.88 శాతం ఉంటే 2023లో అది 52.80 శాతానికి పెరిగింది. దేశం వ్యాప్తంగా ఉపాధి అర్హత కలిగిన మహిళా వనరులుండటం విద్యలో భారతదేశం సాధించిన విజయాన్ని తెలియజేస్తోందని రిపోర్ట్ వ్యాఖ్యానించింది. దేశంలో అత్యధిక ఉపాధి నైపుణ్యాలు ఈ ఏడాది ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నట్లు రిపోర్ట్ తెలిపింది. ఈ ఏడాది ఉద్యోగావకాశాలు ఎక్కువ దేశంలో గత ఆరేళ్లతో పోల్చితే ఈ ఏడాది ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయని ఇండియా స్కిల్స్ రిపోర్ట్ అంచనావేసింది. 2017లో 40.44 శాతమే ఉద్యోగావకాశాలుండగా ఈ ఏడాది 50.3 శాతం మేరకు అది పెరిగాయని రిపోర్ట్ పేర్కొంది. కోవిడ్ సంక్షోభం కారణంగా మూడేళ్లు అంటే 2020 నుంచి 2022 వరకు దేశంలో ఉద్యోగావకాశాలు 46 శాతానికే పరిమితమయ్యాయి. గత ఆరు సంవత్సరాలుగా ఉద్యోగాలు ఎక్కువగా కల్పించిన రంగాలు.. 2017 – ఆయిల్ అండ్ గ్యాస్, స్టీల్, మినరల్స్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఆటోమోటివ్స్. 2018 – బ్యాంకింగ్,ఫైనాన్స్, సర్వీస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), రిటైల్. 2019 – బీఎఫ్ఎస్ఐ, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, మాన్యుఫ్యాక్చరింగ్. 2020 – బీఎఫ్ఎస్ఐ, ఐటీ, 2021 – బీఎఫ్ఎస్ఐ, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఐటీ, ఇంటర్నెట్ బిజినెస్. 2022 – ఇంటర్నెట్ బిజినెస్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఐటీ, ఫార్మా -
మనది ఉద్యోగాంధ్ర.. ఉపాధి అవకాశాలు పుష్కలం.. దేశంలో 4వ స్థానం
(సాక్షి, అమరావతి): ఉద్యోగాల్లేవని ఒకరోజు... అప్పులు తెచ్చేస్తున్నారంటూ మరో రోజు... ధాన్యం కొనుగోలు చేయటం లేదంటూ ఇంకోరోజు!!. వార్త ఏదైనా అబద్ధమే అజెండా. రామోజీరావుకు నిజాలతో పనిలేదు. ఆంధ్రప్రదేశ్కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా... సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను ఎవరు తప్పుబట్టినా... ‘ఈనాడు’ దృష్టిలో వాళ్లు ప్రముఖులు.. నిపుణులు.. సామాజికవేత్తలు!. రాష్ట్రంలో ఉద్యోగాలు లేవంటూ సోమవారం పతాక శీర్షికలో వండిన కథనం ఈ కోవలోనిదే. వైఎస్ జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచే ప్రయత్నంలో భాగమే. ఉద్యోగాలు, పారిశ్రామికాభివృద్ధికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తాలూకు వాస్తవాలివిగో... ఉద్యోగావకాశాల కల్పనలో దేశంలోని టాప్–5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ది నాలుగో స్థానం. ఈ మాట చెప్పింది వేరెవరో కాదు. రెండు నెలల కిందట మార్చిలో సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘ఇండియా–2023 స్కిల్ నివేదిక’. ఇది... వాస్తవం. కానీ ‘ఈనాడు’ ఏం చెబుతోందంటే... రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు లేక విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు యువత వెళ్లిపోతున్నారని, దీంతో ఊళ్లలో వృద్దులే మిగులుతారని. అది కూడా సామాజిక వేత్తలు అంటున్నారని!!. అసలేంటి చెరుకూరి రామోజీరావు కడుపుమంట? ఇక్కడి పిల్లలు విదేశాలకు వెళ్లకూడదా? అక్కడ చదవకూడదా? ఉద్యోగాలు చేయకూడదా? ఏం! గతంలో ఆంధ్రప్రదేశ్ యువత విదేశాలకు వెళ్లలేదా? పై చదువుల కోసం, ఉన్నత ఉద్యోగాల కోసం విదేశాలకు, దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లటమనేది ఇప్పుడు మొదలైందేమీ కాదుకదా? అలాగే ఇతర రాష్ట్రాల నుంచీ అవసరాన్ని బట్టి మెరుగైన వేతనాల కోసం ఇక్కడకు తగిన నైపుణ్యాలున్న వారు వస్తున్నారు కదా!!. ఇంతటి సహజమైన ప్రక్రియకు రాజకీయాలు అంటగట్టి ఇప్పటి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న ‘ఈనాడు’కు ఇంకా దిగజారడానికి ఏమైనా ఉందా? కేంద్రం ప్రభుత్వం విడుదల చేసిన ఇండియా– 2023 స్కిల్ రిపోర్ట్లో దేశంలో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నాల్గో స్థానంలో ఉందంటేనే ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పైపెచ్చు ఇదే నివేదికలో... రాష్ట్రంలో సామాజిక, పారిశ్రామిక, సాంకేతిక మౌలిక సదుపాయాలు అద్భుతంగా మెరుగయ్యాయని కేంద్రం ప్రశంసించింది. వీటివల్ల 2022 సంవత్సరంలో అత్యధిక వృద్ధి సాధించినట్లు స్పష్టం చేసింది. ఈ వాస్తవాలను వదిలేసి బురద జల్లుతున్న ‘ఈనాడు’కు చంద్రబాబు సిండ్రోమ్ ముదిరిపోయిందన్నది పచ్చి నిజం. ఏపీలో 22 నుంచి 25 సంవత్సరాల వయసున్న యువత ఉపాధి స్కోరు 64.36 శాతం ఉందని నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం... 18 నుంచి 21 సంవత్సరాలు, 26 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉపాధి వనరులు కలిగిన రాష్ట్రాల్లో టాప్ ఐదు రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. ఇక్కడ అత్యధికంగా 93.50 మంది అభ్యర్ధులు ఇంటర్న్షిప్లు పొందుతుండగా... ఇంటర్న్షిప్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ది నెంబర్–1 స్థానం. ‘‘నైపుణ్యం లేని ఉద్యోగాలకన్నా ఏదైనా టాలెంట్ పూల్ ద్వారా ఉద్యోగాలను పొందాలని యువత కోరుకుంటోంది. రాబోయే సంవత్సరాల్లో టాలెంట్తో కూడిన ఇంటర్న్షిప్ల విషయంలో ఏపీ ముందుంటుంది. బీఈ, బీటెక్, ఐటీఐ, ఎంఎస్సీ, బీసీఏ రంగాల్లో అత్యధిక అర్హత కలిగిన టాలెంట్ యువత స్కోరు 60 శాతం పైనే ఉంది.’’ అని నివేదిక తెలిపింది. ఇంకా ప్లేస్మెంట్లలో 2.6 లక్షలు, అంతకన్నా ఎక్కువగా వేతనాలు అందే రాష్ట్రాలోఏపీ మొదటి స్థానంలో ఉంది. చంద్రబాబు నాయుడి హయాంలో ప్లేస్మెంట్లు 37 వేలు మాత్రమే ఉంటే అదే ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో 2021–22లో ప్లేస్మెంట్లు 85 వేలకు చేరాయి. పైపెచ్చు రాష్రంలో చంద్రబాబు హయాంలో 2018–19లో నిరుద్యోగ రేటు 5.3 శాతం ఉండగా... ఇపుడది 4.2 శాతానికి తగ్గినట్లు స్వయంగా కేంద్ర కార్మికమంత్రిత్వ శాఖ ప్రకటించింది. బీఈఎల్ నూతన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ప్రారంభించిన దృశ్యం (ఫైల్) హెచ్ఎస్బీసీ వెళ్లిపోయిందెప్పుడు రామోజీ? ఈ వాస్తవాలను విస్మరించిన ‘ఈనాడు’... ఎప్పుడో 2015లోనే దేశం వీడి వెళ్లిపోయిన హెచ్ఎస్బీసీని పట్టుకుని ఇప్పుడే వెళ్లిపోయిందంటూ అబద్దాలను వండేసింది. ఇక ఇన్ఫోసిస్, బీఈఎల్, అమెజాన్ డీసీ, డిక్సన్, డబ్లు్యఎన్ఎస్, ర్యాండ్స్టాడ్ వంటి దిగ్గజ సంస్థలు వచ్చి రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తున్నా... వాటికి ప్రస్తావిస్తే ఒట్టు. పైపెచ్చు కంపెనీలు వెళ్లిపోతున్నాయంటూ నిస్సిగ్గుగా అబద్ధాలు!!. 2015లోనే హెచ్ఎస్బీసీ తన వ్యాపార వ్యూహంలో భాగంగా దేశంలో కార్యకలాపాలను మూసేసుకుని వెళ్లిపోతే ఇప్పుడే కొత్తగా విశాఖ నుంచి హెచ్ఎస్బీసి వెళ్లిపోయిందని... అది కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వల్లేనని ‘ఈనాడు’ రాసిందంటే జగన్ సర్కారుపై ఎంత కక్షతో వ్యవహరిస్తున్నదో అర్థంకాక మానదు. పెట్టుబడుల హబ్గా మారుతున్న ఏపీ ప్రైవేటు రంగంలో అత్యధిక ఉద్యోగాలిచ్చే సామర్థ్యం ఉన్న ఎంఎస్ఎంఈ రంగంలోనే... గడిచిన నాలుగేళ్ల రూ.24 వేల కోట్ల పెట్టుబడులతో పాటు 12.60 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. నిజానికి పారిశ్రామిక ప్రోత్సాహకాలు (ఇన్సెంటివ్లు) సమయానికిస్తేనే ఇవి బతికి బట్టకడతాయని బాబుకు తెలిసినా వీటిని పట్టించుకోలేదు. ఇన్సెంటివ్లను గాలికొదిలేశారు. బాబు నిర్లక్ష్యంతో దారుణంగా చితికిపోయిన ఈ రంగానికి వైఎస్ జగన్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిచ్చి... ప్రోత్సాహకాలను సమయానికి ఇవ్వడమే కాకుండా... అలా ఇచ్చేందుకు పటిష్ఠమైన వ్యవస్థను తీసుకొచ్చింది. అందుకే ఇన్ని ఉద్యోగాలొచ్చాయి. ఇక భారీ పరిశ్రమల్లోనైతే 85 వేల మందికి ఉపాధి లభించింది. ఐటీ రంగంలో చంద్రబాబు హయాంలో రూ. వెయ్యి కోట్ల పెట్టుబడులు, 14వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. కానీ ఈ నాలుగేళ్లలో జగన్ సార«థ్యంలో ఈ రంగంలో రూ.5,700 కోట్ల పెట్టుబడులు, 30 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఈ గణాంకాలన్నీ ఏ సామాజిక వేత్తలో, వైఎస్సార్సీపీ అభిమానులో చెబుతున్నవి కాదు. గణాంకాలన్నీ మదించి... కేంద్ర ప్రభుత్వం నివేదించినవి. ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ... విప్లవం ప్రైవేట్ రంగంలోనే కాకుండా ప్రభుత్వ రంగంలో సైతం గతంలో ఎన్నడూ లేనన్ని ఉద్యోగాలను ఈ ప్రభుత్వం కల్పించింది. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు 4 లక్షల మంది ఉన్నారు. కానీ వైఎస్ జగన్ పాలనా పగ్గాలు చేపట్టాక ఈ సంఖ్య 6 లక్షలు దాటింది. అంటే... ఉన్న ఉద్యోగాల్లో 50 శాతాన్ని అదనంగా... అది కూడా ప్రభుత్వ రంగంలో ఈ నాలుగేళ్లలోనే సాధ్యం చేసి చూపించారు. వీరికి తోడు మూడు లక్షలకు పైగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అవకాశాలొచ్చాయి. మరి ఇవన్నీ ఎవరికిచ్చారు రామోజీ? ఈ రాష్ట్ర యువతకే కదా? వేరే దేశంలోని యువతకు కాదు కదా? ఎందుకీ దిగజారుడు రాతలు!!. నిత్యం ఏదో ఒకరకంగా బురద జల్లేటపుడు... కనీసం ఆత్మసాక్షిని ప్రశ్నించుకోవాలి కదా? చంద్రబాబుపై ఉన్న ప్రేమతో ఈ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను దారుణంగా దెబ్బతీస్తున్నామనే స్పృహ లేదెందుకు? ఒక్క సచివాలయ వ్యవస్థ ద్వారానే సుమారు 1.30 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలివ్వటం... వైద్య ఆరోగ్య శాఖలో కొత్తగా 49 వేల మందికి ఉద్యోగాలు కల్పించటం... 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయటం... ఇదంతా ఈ ప్రభుత్వం రాసిన కొత్త చరిత్ర కాదా? దీన్ని మీ పత్రిక సాయంతో దాచేయగలరా? పారిశ్రామికులు ఏమంటున్నారో తెలియదా? ఈ దేశంలో నెంబర్–1 గ్రూపుగా వెలుగొందుతున్న రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ నుంచి స్టీల్ దిగ్గజం జేఎస్డబ్ల్యూ గ్రూప్ అధినేత సజ్జన్ జిందాల్, కరణ్ అదానీ, సెంచురీ ప్లై భజాంకా, శ్రీ సిమెంట్ బంగూర్... ఇలా దిగ్గజాలంతా ఇటీవలి అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు (జీఐఎస్) వేదికపై ఆంధ్రప్రదేశ్కు తామిస్తున్న ప్రాధాన్యాన్ని చెప్పకనే చెప్పారు. ఇక్కడి నాయకత్వంపై తమకున్న నమ్మకాన్ని బహిరంగంగా వ్యక్తపరిచారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ముందుకు తీసుకెళుతున్నారని సభాముఖంగా చెప్పారు. మరి ఇవన్నీ మీకు కనిపించవా రామోజీ? దిగ్గజ పారిశ్రామిక వేత్తలంతా ఇంతలా ప్రశంసిస్తుంటే పరిశ్రమలు రావటం లేదని, ఉద్యోగాలు లేవని ఎందుకీ దౌర్భాగ్యపు రాతలు? రామోజీరావు రాస్తున్నట్టుగా ఇక్కడ పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం లేకపోతే... పరిశ్రమలు తాము సంతోషంగా ఉన్నామని చెప్పకపోతే... సులభతర వాణిజ్య విధానాన్ని అవలంబించే రాష్ట్రాల్లో (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) గత మూడేళ్లుగా ఏపీ ఎందుకు నెంబర్–1గా నిలుస్తుంది? దేశంలో ఏ రాష్ట్రానికీ దక్కని ఈ హోదా మన రాష్ట్రానికే ఎందుకు దక్కుతోంది? అర నిమిషంలో తనను ముఖ్యమంత్రి ఒప్పించారంటూ... 6 నెలల్లో ఆలోచన నుంచి అనుమతులన్నీ వచ్చి, భూ కేటాయింపు పూర్తయి శంకుస్థాపన చేయగలిగామని సాక్షాత్తూ టెక్ మహీంద్రా సీఈఓ గుర్నానీ ప్రశంసించారు. ఆయన తన కుమారుడి బయో ఇథనాల్ ప్లాంటు ‘అస్సాగో’కు ఏపీనే ఎంచుకున్నారు. ఏపీలో పరిశ్రమలకు రెడ్ కార్పెట్ వేస్తున్నారని చెప్పింది ఏకంగా ఐటీసీ సీఈఓ సంజీవ్ పురి. ఏపీలో అతిపెద్ద స్పైసెస్ ప్రాసెస్ ప్లాంట్ను ఇటీవలే ఆయన ప్రారంభించారు. ఇక ఆదిత్యబిర్లా గ్రూపు వైఎస్సార్ జిల్లాలో గార్మెంట్స్ తయారీ యూనిట్కు భూమి పూజ చేసిన రెండు నెలలకే తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురంలో కాస్టిక్ సోడా యూనిట్ను ప్రారంభించింది. తమ గ్రూపు సంస్థలకు ఏపీ కీలకమని, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే సత్తా రాష్ట్రానికి ఉందని ఆ గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లాయే చెప్పారు. ‘రావాలి జగన్... కావాలి జగన్’ అనే నినాదం ఇప్పుడు ‘జగన్ వచ్చారు... అభివృద్ధి తెచ్చారు’ అనేట్లుగా మారిందనేది డిక్సన్ టెక్నాలజీస్ ప్రెసిడెంట్ పంకజ్ శర్మ ప్రశంస. ఎలక్ట్రానిక్ ఉపకరణాల ఉత్పత్తి కేంద్రానికి కొప్పర్తి ఈఎంసీలో భూమి పూజ చేశారాయన. ఇక రూ.600 కోట్లు పెట్టుబడి పెడదామనుకున్నామని, దాన్నిపుడు రూ.2,600 కోట్లకు పెంచుతున్నామని చెప్పింది సాక్షాత్తూ సెంచురీ ప్లైవుడ్ చైర్మన్ సజ్జన్ భజాంక. తమిళనాడులో యూనిట్ ఏర్పాటు చేయాలనుకున్నా... రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో వైఎస్సార్ జిల్లా బద్వేల్లో ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఆయనే చెప్పారు. తొమ్మిది రాష్ట్రాల్లో సిమెంటు ప్లాంట్లున్న శ్రీసిమెంట్... తొలిసారి ఏపీలో అడుగుపెడదామని నిర్ణయించుకున్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని శ్రీసిమెంట్ ఎండీ హరిమోహన్ బంగూర్ కలిశాకే. గుంటూరులో రూ.1,500 కోట్లతో ప్లాంటును రెండేళ్లలో పూర్తి చేస్తామని ప్రకటించింది కంపెనీ. మరి ఒక్క కంపెనీ కూడా రాలేదని... ఇప్పటికే ఉన్నవి కూడా వెళ్లిపోతున్నాయని విష ప్రచారమెందుకు? 3 కారిడార్లు ఇక్కడే... తాజాగా విశాఖపట్నంలో శంకుస్థాపన చేసిన అదానీ డేటా సెంటర్తో పాటు విజయవాడ, తిరుపతి, అనంతపురాల్లో ఏర్పాటు చేస్తున్న ఐటీ పార్కుల ద్వారా లక్షల మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. దేశ వ్యాప్తంగా 11 ఇండస్ట్రియల్ కారిడార్లు అభివృద్ధి చెందుతుంటే.. అందులో మూడు కారిడార్లు అభివృద్ధి చేస్తున్న రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే. 50 వేల ఎకరాల పారిశ్రామిక భూములు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తూ పారిశ్రామికవేత్తలకు కావాల్సిన మౌలిక వసతులన్నిటినీ కల్పిస్తోంది. రాష్ట్రంలో తిరుపతిలో రెండు, శ్రీసిటీ, కొప్పర్తిల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్న ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్లలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లోనూ యువతకు ఉపాధి అవకాశాలూ పెరుగుతున్నాయి. ఇవీ.. ‘ఈనాడు’ చెప్పని వాస్తవాలు. నాలుగేళ్లలో నాలుగు పోర్టులు రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 6 పోర్టులతో పాటు మరో నాలుగు పోర్టుల ద్వారా పారిశ్రామిక అభివృద్ధికి రాచబాట వేశారు ముఖ్యమంత్రి జగన్. దీని ద్వారా ఆయా పోర్టులు ఏర్పాటవుతున్న ప్రాంతాల్లోని స్థితిగతులు సమూలంగా మారబోతున్నాయి. వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. వీటితో పాటు 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం జరుగుతోంది. విమానాశ్రయాలను చూసుకున్నా ఇటీవలే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికీ అనుమతులు అన్నీ మంజూరయి శంకుస్థాపన రాయి పడింది. కర్నూలు, కడప విమానాశ్రయాలు అందుబాటులోకి వచ్చి విమానాల రాకపోకలు పెరుగుతున్నాయి. ఇక బల్క్ డ్రగ్ పార్క్ కోసం 17 రాష్ట్రాలు పోటీ పడితే దక్షిణ భారతదేశంలో బల్క్ డ్రగ్ పార్క్ సాధించిన ఘనత మన రాష్ట్రానికే దక్కింది. 2022వ సంవత్సరంలో అత్యధికంగా పెట్టబడులు ఆకర్షించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఇవన్నీ చెబుతున్నది కేంద్ర ప్రభుత్వ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ విభాగమైన డీపీఐటీ నివేదికలే. కాకపోతే చంద్రబాబు మైకంలో కొట్టుకుంటున్న ‘ఈనాడు’కు గానీ... ఎల్లో వైరస్ సోకిన రామోజీరావుకు గానీ... ఇవేవీ కనిపించవు. జనానికి వాస్తవాలు తెలుస్తున్నాయని, గతంలో మాదిరి తాము చెప్పిందే జనానికి తెలిసే రోజులు పోయాయనే స్పృహ ‘ఈనాడు’కు లేకపోవటమే ఎల్లో ముఠా దౌర్భాగ్యం. -
Neha Bagaria: ఉద్యోగ పర్వం..రీస్టార్ట్
ఉద్యోగం ఊరకే ఎవరూ మానెయ్యరు. సవాలక్ష కారణాలు ఉండవచ్చు. ఉద్యోగం మానేయడం ఎంత తేలికో, తిరిగి ఉద్యోగంలో చేరడం అంత కష్టం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మహిళలు తమ కెరీర్ను రీస్టార్ట్ చేయడానికి బెంగళూరు కేంద్రంగా ‘జాబ్స్ ఫర్ హర్’ ప్లాట్ఫామ్కు శ్రీకారం చుట్టింది నేహా బగరియా, ఆ ప్లాట్ఫామ్ను ‘హర్ కీ’ పేరుతో రీబ్రాండ్ చేసి రెండడుగులు ముందుకు వేసింది నేహా... రకరకాల కారణాల వల్ల ఉద్యోగాలు మానేస్తున్న మహిళలు ఎంతోమంది ఉన్నారు. కరోన కరకు కాలంలో ఉద్యోగం మానేసిన వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. అలా ఉద్యోగాలు మానేసిన వారు కెరీర్ రీస్టార్ట్ చేయడానికి తనవంతు ప్రయత్నం చేస్తోంది నేహా బగరియా. అమెరికాలోని వార్టన్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ చేసిన నేహా హెచ్ ఆర్లో ఫైనాన్స్, మార్కెటింగ్ రంగాలలో పనిచేసింది. 2010లో తన కెరీర్కు బ్రేక్ వచ్చింది. తిరిగి మూడు సంవత్సరాల తరువాత ఉద్యోగంలో చేరింది. ‘కెరీర్ రీస్టార్ట్ చేయకపోతే ఎంతో నష్టపోయేదాన్ని’ అని తనలో తాను అనుకుంది. అదే సమయంలో ఉద్యోగాలు మానేసి ఇంటికే పరిమితమైన ఎంతోమంది మహిళా ఉద్యోగులు గుర్తుకు వచ్చారు. వారు అనాసక్తతతోనో, వ్యతిరేకతతోనో ఉద్యోగాలు మానేసి ఉండరు. ఒకానొక నిర్దిష్టమైన సమయంలో తప్పనిసరి పరిస్థితులలో ఉద్యోగం మానేసి ఉంటారు. వారు తిరిగి ఉద్యోగంలో చేరాలకుంటున్నా దారి కనిపించి ఉండదు. ‘పురుషులతో పోల్చితే మహిళలకు ఉద్యోగ అవకాశాలు అనే కిటికీ చాలా చిన్నది’ అంటుంది నేహా. కొన్ని కంపెనీలు అప్పుడే కాలేజీ విద్యను పూర్తి చేసుకున్న అమ్మాయిలకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. కుటుంబ బాధ్యతల వల్ల ఉద్యోగ విధులు సరిగ్గా నిర్వహించలేరేమో అనే భయం వల్ల పెళ్లయిన మహిళలకు ఉద్యోగం ఇవ్వడానికి వెనకాడుతున్నారు. అయితే అది అపోహే అని చరిత్ర చెబుతూనే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘జాబ్స్ ఫర్ హర్’ అనే ఆన్లైన్ పోర్టల్ స్టార్ట్ చేసింది నేహా. ఉద్యోగం మానేసిన ఎంతోమంది మహిళలు తిరిగి ఉద్యోగంలో చేరడానికి ఈ ప్లాట్ఫామ్ ఎంతో ఉపయోగపడింది. కంపెనీలకు, ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న మహిళలకు మధ్య వారధిగా మారింది. ‘తమను తాము తిరిగి నిరూపించుకోవాలనే పట్టుదల చాలామంది మహిళలలో కనిపించింది’ అంటుంది నేహా. ‘జాబ్స్ ఫర్ హర్’ ద్వారా ఉద్యోగంలో చేరిన మహిళలలో ముంబైకి చెందిన శ్రీప్రియ ఒకరు. ‘వ్యక్తిగత కారణాల వల్ల ఉద్యోగం మానేసిన నేను కాస్త ఆలస్యంగా అయినా తిరిగి ఉద్యోగం చేయాలనే నిర్ణయం తీసుకున్నాను. అయితే అది అంత సులువైన విషయం కాదని తెలిసిపోయింది. ఈ పరిస్థితులలో జాబ్స్ ఫర్ హర్ చుక్కానిలా కనిపించింది’ అంటుంది శ్రీప్రియ. కొంత కాలం తరువాత... ‘జాబ్స్ ఫర్ హర్’ వెంచర్ను ‘హర్ కీ’ పేరుతో రీబ్రాండ్ చేసింది నేహా. ‘హర్ కీ’కి కలారీ క్యాపిటల్, 360 వన్ ఎసెట్... మొదలైన సంస్థలు ఫండింగ్ చేశాయి. ‘ఉద్యోగం మానేసిన మహిళలలో ఎనభై శాతం మంది తిరిగి ఉద్యోగం చేయాలనుకుంటున్నారు. అలాంటి వారికి హర్ కీ కొత్త దారి చూపుతుంది’ అంటోంది ‘360 వన్ ఎసెట్’ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నిధి గుమాన్. -
పాలిటెక్నిక్ కోర్సులకు ‘కొత్త’ ఊపు
విశాఖ విద్య: ఒకప్పుడు పాలిటెక్నిక్ అడ్మిషన్లకు తీవ్రమైన పోటీ ఉండేది. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్ కోర్సులు చేసిన వారికి కొలువు గ్యారెంటీగా దక్కేది. ఈ మూడేళ్ల కోర్సు అనంతరం ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలోకి నేరుగా ప్రవేశం పొందొచ్చు. అయితే, గత పాలకుల నిర్లక్ష్యంతో పాలిటెక్నిక్ కాలేజీలు క్రమంగా నిర్వీర్యమైపోయాయి. ఇప్పుడు మళ్లీ వీటికి కొత్త ఊపు తీసుకొచ్చేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం దృష్టిసారించింది. జీఐఎస్ ఒప్పందాలతో నయా జోష్ విశాఖపట్నం వేదికగా ఇటీవల జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023 (జీఐఎస్)లో ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో రూ.13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. దీంతో 6 లక్షల మందికి పైగా నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. పెద్దఎత్తున నెలకొల్పే పరిశ్రమలకు మానవ వనరుల అవసరం దృష్ట్యా, మూడేళ్ల కాల వ్యవధి గల పాలిటెక్నిక్ కోర్సులపై అందరి దృష్టి పడింది. దీంతో తక్కువ సమయంలోనే ఎక్కువ మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిం చేలా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. కొత్త కోర్సులకు రూపకల్పన ఎనర్జీ, ఐటీ, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఖనిజ, పెట్రో కెమికల్స్, ఫార్మాస్యూటికల్ వంటి రంగాల్లో పెద్దఎత్తున పరిశ్రమలు నెలకొల్పేందుకు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో ఒప్పందాలు జరిగాయి. రాష్ట్రంలో వీటి విస్తరణకు అనువైన పరిస్థితులు ఉండటమే ఇందుకు కారణం. ఆయా రంగాలకు అవసరమైన నిపుణులైన యువతను అందించేందుకు వీలుగా పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్త కోర్సులను ప్రారంభించాలని సాంకేతిక విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. తొలిదశలో నాలుగుచోట్ల ఈ నేపథ్యంలో.. తిరుపతి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ప్రస్తుతం నిర్వహిస్తున్న కెమికల్ సుగర్ టెక్నాలజీ స్థానంలో ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఇండస్టీ ఇంటిగ్రేటెడ్), సత్యవేడులో మెకానికల్ ఇంజనీరింగ్ స్థానంలో మెకానికల్ రిఫ్రిజరేటర్ అండ్ ఎయిర్ కండిషనర్, గన్నవరంలో కొత్తగా కంప్యూటర్ సైన్సు, గుంటూరులో గార్మెంట్ టెక్నాలజీ స్థానంలో డిజైన్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులకు అనుమతిచ్చారు. 2023–24 విద్యా సంవత్సరం నుంచే వీటిలో ప్రవేశాలు కల్పించేలా చర్యలు చేపట్టారు. దశల వారీగా రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో ఆయా ప్రాంతాల అవసరాల మేరకు సరికొత్త కోర్సుల రూపకల్పన చేసేలా సాంకేతిక విద్యాశాఖ ముందుకెళ్తోంది. 84 కాలేజీలు.. 17వేల సీట్లు.. 28 రకాల కోర్సులు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో 84 కాలేజీలు నిర్వహిస్తుండగా, వీటి పరిధిలో 17వేల వరకు సీట్లున్నాయి. వీటిలో సివిల్, మెకానికల్, ఎల్రక్టానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, మైనింగ్, కెమికల్, బయోమెడికల్, మెటలర్జి, 3డి యానిమేషన్ అండ్ గ్రాఫిక్స్, పెట్రోలియం, టెక్స్టైల్ వంటి 28 రకాల కోర్సులను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాలిటెక్నిక్ కాలేజీల బలోపేతంపై సాంకేతిక విద్యాశాఖ కార్యాచరణలోకి దిగింది. కొత్త కోర్సులు అవసరం ప్రభుత్వం మంచి ఆలోచన చేస్తోంది. పాలిటెక్నిక్లో కొత్త కోర్సుల ఆవశ్యకత ఉంది. ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. భవిష్యత్తులో ఈ రంగంలో నిపుణులు అవసరం. క్యాడ్ కామ్, పవర్ సిస్టమ్, ఎల్రక్టానిక్స్ కమ్యూనికేషన్ వంటి కోర్సులు తీసుకొస్తే ఎంతో మేలు. – డాక్టర్ ఎన్. చంద్రశేఖర్, ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ పాలిటెక్నిక్ టీచర్స్ ఆర్గనైజేషన్ (ఏఐఎఫ్పీటీఓ) అధ్యక్షులు పాలిటెక్నిక్ కాలేజీలకు మంచిరోజులు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో నైపుణ్యంతో కూడిన శిక్షణ అందించేలా సకల సౌకర్యాలున్నాయి. కొత్త కోర్సులకు సాంకేతిక విద్యాశాఖ అనుమతులిస్తోంది. పాలిటెక్నిక్ కాలేజీలకు మంచి రోజులొస్తున్నాయి. ఈసారి అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉంది. – జీవీవీ సత్యనారాయణమూర్తి, పాలీసెట్ కనీ్వనర్, ఉమ్మడి విశాఖ జిల్లా క్యాంపస్ కొలువు కొట్టా మాది విశాఖ నగరంలోని తాటిచెట్లపాలెం. తండ్రి గోదాములో కలాసీగా పనిచేస్తున్నారు. అమ్మ ఇంటిదగ్గర మిషన్ కుడుతుంది. సత్వర ఉపాధి కోసమని పాలిటెక్నిక్లో ఎలక్ట్రికల్ కోర్సు ఎంచుకున్నాను. క్యాంపస్ సెలక్షన్స్లో టాటా ప్రాజెక్టులో ఏడాదికి రూ.3.25 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించా. – ఈతకోట సియోన్, విశాఖపట్నం -
గణితంలో గర్వించేలా! స్కిల్ టాలెంట్ లో ఏపీ అదరహో
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఉద్యోగావకాశాలు విస్తృతంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉంది. ప్రతిభ కలిగిన యువతతో 65.58 శాతం స్కోరు సాధించింది. ఇక ఆంగ్లం, గణితం నైపుణ్యాల్లో అగ్రశ్రేణిలో నిలిచింది. ఇండియా స్కిల్ నివేదిక 2023లో కేంద్ర ప్రభుత్వం ఈ అంశాలను వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక, సాంకేతిక మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని తెలిపింది. 2022లో ఏపీ అత్యధిక వృద్ధి సాధించినట్లు నివేదికలో పేర్కొంది. అందులో ముఖ్యాంశాలు ఇవీ.. ♦ అత్యధికంగా ఉపాధి కల్పించే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ (72.7 శాతం) మొదటి స్థానంలో ఉండగా 69.8 శాతంతో మహారాష్ట రెండో స్థానంలో ఉంది. 68.9 శాతంతో ఢిల్లీ మూడో స్థానంలో నిలవగా 65.58 శాతంతో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచింది. రాజస్థాన్, కర్నాటక వరుసగా తరువాత స్థానాల్లో ఉన్నాయి. ♦ ఏపీలో యువత ఉపాధి అవకాశాలను పెంపొందించేలా నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పీఎం కేవీవై ద్వారా రాష్ట్రంలో నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు పెద్దఎత్తున కొనసాగుతున్నాయి. ♦ ఆంగ్లం, గణితంలో చక్కటి నైపుణ్యాలున్న తొలి ఐదు రాష్ట్రాల సరసన ఆంధ్రప్రదేశ్ చోటు సాధించింది. గణితంలో మంచి నైపుణ్యం ఉన్న యువత లభ్యతలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఇంగ్లీషు ప్రావీణ్యం కలిగిన యువత లభ్యత రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో ఉంది. ♦ ఆంధ్రప్రదేశ్లో 22 – 25 ఏళ్ల వయసున్న యువత ఉపాధి స్కోరు 64.36 శాతం ఉంది. ♦ మహిళలకు అత్యధికంగా ఉపాధి కల్పించే వనరులు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఒడిశా, ఢిల్లీలో పురుషులకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పన వనరులున్నాయి. రానున్న సంవత్సరాల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, కేరళలో ఉపాధి అవకాశాలు మరిన్ని పెరుగుతాయి. ♦ ఘజియాబాద్, తిరుపతి, కర్నూలు, మంగుళూరు తదితర పది నగరాల్లో నైపుణ్యం కలిగిన మహిళా కార్మిక వనరులు అందుబాటులో ఉన్నాయి. ♦ న్యూమరికల్ స్కిల్స్ అత్యధికంగా ఉన్న నగరాల్లో చిత్తూరు, అమలాపురం ఉన్నాయి, ♦ ఆంగ్ల భాషతోపాటు బిజినెస్ కమ్యూనికేషన్ నైపుణ్యాలున్న నగరాల్లో ముంబై, తిరుపతి, పుణే ముందు వరుసలో ఉన్నాయి. -
వొడా–ఐడియా యాప్తో మహిళలకు ఉద్యోగావకాశాలు
ముంబై: జాబ్ సెర్చ్ ప్లాట్ఫామ్ అప్నాతో కలిసి తమ యాప్ ద్వారా మహిళలకు ఉద్యోగావకాశాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు టెలికం సంస్థ వొడాఫోన్–ఐడియా (వీఐ) తెలిపింది. దీని ద్వారా టీచర్ల నుంచి టెలీకాలర్లు, రిసెప్షనిస్టుల వరకూ వేల సంఖ్యలో పార్ట్టైమ్, ఫుల్టైమ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. అలాగే, టెలీ–కాలర్లు కాద ల్చుకునే మహిళలకు రూ. 5,000 డిస్కౌంటుతో ప్లేస్మెంట్ గ్యారంటీ శిక్షణ ప్రోగ్రామ్ను కూడా అందిస్తున్నామని వివరించింది. అటు ఎన్గురుతో కలిసి 50 శాతం డిస్కౌంటుతో ఇంగ్లీష్ శిక్షణా కోర్సులనూ అందిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆఫర్లు మార్చి 14 వరకూ వీఐ యాప్లో అందుబాటులో ఉంటాయి. -
ఎయిరిండియాకు అపార అవకాశాలు
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ విమానయాన దిగ్గజం ఎయిరిండియాకు అపార అవకాశాలున్నట్లు కంపెనీ సీఈవో క్యాంప్బెల్ విల్సన్ తాజాగా పేర్కొన్నారు. వెరసి ఎయిరిండియా గ్రూప్ను అంతర్జాతీయ దిగ్గజంగా రూపుదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. ఈ బాటలో విస్తారాను కంపెనీతో అనుసంధానించే ప్రక్రియ జరుగుతున్నట్లు విలేకరుల వర్చువల్ సమావేశంలో వెల్లడించారు. ప్రస్తుతం కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) అనుమతి కోసం వేచిచూస్తున్నట్లు తెలియజేశారు. ఇదేవిధంగా ఎయిరిండియా ఎక్స్ప్రెస్, ఏఐఎక్స్ కనెక్ట్(ఎయిరేషియా ఇండియా)లను సైతం కంపెనీలో విలీనం చేసే కార్యాచరణకు ఇప్పటికే తెరతీసినట్లు తెలియజేశారు. ఎయిరిండియా గతంలో ఎన్నడూచూడని భారీ వృద్ధిని అందుకోనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఈ నెల 14న ఎయిరిండియా 70 వైడ్బాడీ మోడల్సహా 470 విమానాల కొనుగోలుకి ఆర్డర్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు నిధులను వివిధ మార్గాల ద్వారా సమీకరించనున్నట్లు విల్సన్ తెలియజేశారు. వీటిలో ఎయిర్బస్ నుంచి 250, బోయింగ్ నుంచి 220 విమానాలను పొందనుంది. ఎయిరిండియాను గతేడాది జనవరిలో టాటా గ్రూప్ సొంతం చేసుకున్న విషయం విదితమే. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మరో 370 విమానాలను కొనుగోలు చేసే ప్రణాళికలున్నట్లు వెల్లడించారు. -
నాన్ టెక్.. ఉద్యోగాలు భర్తీలో బెస్ట్
సాక్షి, అమరావతి: ఐటీ రంగంలో ఉద్యోగాల కోత పరంపర కొనసాగుతోంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను ఇటీవల తొలగించాయి. మరికొన్ని కంపెనీలు ఇదే బాటలో నడుస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా టెక్కీలు భయంభయంగా కాలం వెళ్లదీసే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే నాన్–టెక్ రంగాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. మన దేశంలో కరోనా కష్టకాలం అనంతరం నాన్–టెక్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ రంగంలో ఏకంగా 30శాతానికి పైగా ఉద్యోగాలు పెరిగినట్లు ప్రముఖ గ్లోబల్ జాబ్సైట్ ఇండీడ్ ఇటీవల తెలిపింది. నిర్మాణ, ఆర్కిటెక్చర్, ఇతర నాన్ టెక్ రంగాల్లోనూ ఉద్యోగ అవకాశాలు పెరిగినట్టు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2021, 2022 సంవత్సరాల్లో డిసెంబర్ నెలల్లో వెలువడిన ఉద్యోగ ప్రకటనలపై ‘ఇండీడ్’ నిర్వహించిన అధ్యయనంలో 2021తో పోలిస్తే 2022లో నాన్–టెక్ రంగాల్లో ఉద్యోగాల భర్తీ పెరిగినట్లు తేలింది. ఈ మేరకు ‘ఇండీడ్’ సంస్థ తమ అధ్యయనంలో గుర్తించిన పలు ఆసక్తికర అంశాలను వెల్లడించింది. ‘ఇండీడ్’ నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు ► ఆరోగ్య సంరక్షణ రంగంలో అత్యధికంగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి 30.8 శాతంపెరుగుదల నమోదైంది. డెంటిస్ట్, నర్సింగ్ సిబ్బంది, ఇతర ఉద్యోగాలు పెద్ద ఎత్తున భర్తీ అయ్యాయి. ► అనంతరం ఆహార సేవల రంగంలో 8.8 శాతం, నిర్మాణ రంగంలో 8.3 శాతం, ఆర్కిటెక్చర్ 7.2, విద్యా రంగంలో 7.1, మార్కెటింగ్ రంగంలో 6.1 శాతం చొప్పున వృద్ధి నమోదైంది. ► కరోనా కాలంలో నిర్మాణ, మార్కెటింగ్ వంటి రంగాల్లో కార్యకలాపాలు మందగించి ఉద్యోగులను తొలగించారు. కానీ కరోనా వైరస్ వ్యాప్తి తగ్గిన అనంతరం నిర్మాణ, మార్కెటింగ్ రంగాల్లో మునుపటి పరిస్థితులు నెలకొన్నాయి. ఆయా రంగాల్లో ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయి. ► నాన్–టెక్ రంగాల్లో నియామకాల్లో బెంగళూరు నగరం 16.5 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో ముంబై (8.23 శాతం), పూణే (6.33 శాతం), చెన్నై (6.1శాతం) ఉన్నాయి. అహ్మదాబాద్, కొచ్చి, కోయంబత్తూర్, జైపూర్, మొహాలీ వంటి టైర్–2 నగరాలు 6.9 శాతం వాటాను కలిగి ఉన్నాయి. -
ఇండియా అవుతోంది‘డిజిటల్’
సాక్షి, అమరావతి: భారతదేశంలో డిజిటలైజేషన్ వేగంగా జరుగుతోందని, ఇది కొత్త తరహా ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని నాబార్డు వెల్లడించింది. డిజటలైజేషన్ వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోతాయన్నది అపోహ మాత్రమేనని స్పష్టంచేసింది. ‘భవిష్యత్తులో ఇండియాలో ఉద్యోగ అవకాశాలు’ పేరిట నాబార్డు విడుదల చేసిన అధ్యయన నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. కోవిడ్ తర్వాత ఒక్కసారిగా 10 కోట్ల మందికిపైగా డిజిటలైజేషన్ వైపు అడుగులు వేశారని, భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేసింది. వివిధ రంగాల్లో డిజటలైజేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోందని తెలిపింది. 2021లో పలు స్టార్టప్లలో ప్రైవేటు ఈక్విటీ, వెంచర్ క్యాపిటలిస్టులు రూ.3.53 లక్షలకుపైగా పెట్టుబడులు పెట్టడమే దీనికి నిదర్శనమని పేర్కొంది. 2025 నాటికి దేశీయ డిజిటల్ ఎకానమీ విలువ రూ.80 లక్షల కోట్లకు చేరడమే కాకుండా 5.5 కోట్ల నుంచి 6 కోట్ల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం మూడో తరం టెక్నాలజీతో బ్యాంకింగ్, బీమా వంటి ఆర్థిక సేవలతో పాటు ఈ కామర్స్, సోషల్ మీడియా, డిజిటల్ అడ్వర్టైజింగ్, సాఫ్ట్వేర్ రంగాల్లో భారీ మార్పులు తెచ్చిందని తెలిపింది. నాలుగో తరం టెక్నాలజీ అయిన బిగ్ డేటా, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ కూడా వస్తే తయారీ రంగంతో పాటు వ్యవసాయంలో పెద్ద ఎత్తున ఆటోమేషన్ జరుగుతుందని పేర్కొంది. స్వయం ఉపాధి కోవిడ్ లాక్డౌన్తో భారీగా పెరిగిన నిరుద్యోగ సమస్యను డిజిటలైజేషన్ పరిష్కరించినట్లు నాబార్డు పేర్కొంది. 2020 జనవరి నాటికి దేశవ్యాప్తంగా ఉద్యోగుల సంఖ్య 41 కోట్లు ఉండగా కోవిడ్ దెబ్బతో 2021 జూన్ నాటికి 38.6 కోట్లకు పడిపోయిందని తెలిపింది. కోవిడ్ తర్వాత దేశీయ యువత ఆలోచన ధోరణిలో మార్పు వచ్చిందని, ఒకరి కింద పని చేయడం కాకుండా నచ్చిన సమయంలో స్వతంత్రంగా పని చేసుకునే ‘గిగ్’ విధానానికి మొగ్గు చూపుతున్నట్లు తెలిపింది. ఫుడ్ డెలివరీ సంస్థలైన జొమాటో, స్విగ్గీ వంటి సంస్థలతో పాటు ఓలా, ఉబర్ వంటి ట్రావెల్ సంస్థల్లో గిగ్ వర్కర్లుగా పనిచేయడానికి యువత మొగ్గు చూపుతున్నట్లు పేర్కొంది. ఉదాహరణకు లక్ష కోట్లకు పైగా మార్కెట్ విలువ కలిగిన జొమాటోలో ప్రత్యక్షంగా 5,000 మంది పనిచేస్తుంటే, పరోక్షంగా 3.5 లక్షల మందికి స్వయం ఉపాధి కల్పిస్తోంది. వీరంతా పని చేసిన సమయాన్ని బట్టి నెలకు రూ.10,000 నుంచి రూ. 30,000 వరకు ఆదాయం పొందుతున్నారు. అయితే, ఈ గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత లేకపోవడం ఆందోళన కలిగించే విషయమని నాబార్డు చెప్పింది. వీరికి పీఎఫ్, గ్రాట్యుటీ, అనారోగ్యానికి గురైతే సెలవులు, ఎర్న్ లీవులు వంటి సామాజిక భద్రత లేదని, ఈ సమస్యకు పరిష్కారం చూపేలా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలంది. పెరుగుతున్న ఆటోమేషన్, రోబోటిక్ విధానానికి అనుగుణంగా యువత నైపుణ్యం పెంచుకోవాలని సూచించింది. ఏటా దాదాపు 1.2 కోట్ల మంది యువత డిగ్రీలు చేత పట్టుకొని వస్తున్నారని, వీరందరికీ మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నైపుణ్యం కల్పించడం అతిపెద్ద సవాల్ అని ఆ నివేదిక పేర్కొంది. -
వేగవంత అభివృద్ధి ఉపాధిని సృష్టిస్తోంది
న్యూఢిల్లీ: మౌలిక, అనుబంధ రంగాల్లో వడివడిగా అభివృద్ధి అడుగులు పడుతుండటం వల్లే దేశంలో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు పుట్టుకొస్తున్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో కొత్తగా ఉద్యోగాలు పొందిన 71,426 మందికి శుక్రవారం నియామక పత్రాలను ప్రధాని మోదీ ఎలక్ట్రానిక్ పద్ధతిలో అందజేశారు. రోజ్గార్ మేళాలో భాగంగా శుక్రవారం ఢిల్లీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా ఎంపికైన సిబ్బందితో మోదీ కొద్దిసేపు మాట్లాడారు. ‘ నియామక ప్రక్రియలో పూర్తి పారదర్శకత, వేగం తెస్తూ కచ్చితమైన కాలవధితో రిక్రూట్మెంట్ చేస్తున్నాం. కొత్తగా వేలాది మందికి ఉద్యోగాలతో కొనసాగుతున్న ఈ రోజ్గార్ మేళానే మా ప్రభుత్వ పనితీరుకు చక్కని నిదర్శనం’ అని వ్యాఖ్యానించారు. విధిలో బాధ్యతగా మెలగండి నూతన ఉద్యోగాల్లో కొలువుదీరే సిబ్బందిని ఉద్దేశించి మోదీ కొన్ని సూచనలు చేశారు. ‘ వ్యాపారి తన వినియోగదారుడికి అత్యంత ప్రాధాన్యతనిస్తాడు. ఇదే మంత్రం మీ మదిలో ప్రతిధ్వనించాలి. ప్రజాసేవకు అంకితం కావాలి. కార్యనిర్వహణలో పౌరుడి సేవే ప్రథమ కర్తవ్యంగా ఉండాలి. ప్రజాసేవే ముఖ్యం’ అని సూచించారు. ‘ప్రతీ గ్రామం భారత్నెట్ ప్రాజెక్టులో భాగస్వామి అయిననాడు అక్కడ ఉపాధి కల్పన ఎక్కువ అవుతుంది. టెక్నాలజీని అంతగా అర్థంచేసుకోలేని వారు ఉండేచోట వారికి ఆన్లైన్ సేవలు అందిస్తూ కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు అవకాశం చిక్కుతుంది. ఇలాంటి కొత్త వ్యాపారాలు చేసేందుకు రెండో శ్రేణి, మూడో శ్రేణి పట్టణాలు అక్కడి అవకాశాలను అందిపుచ్చుకునే నిరుద్యోగ యువతకు నూతన గుర్తింపును తీసుకొస్తున్నాయి’ అని అన్నారు. ‘భవిష్యత్తులో దేశంలో వివిధ రంగాల్లో మరింతగా ఉపాధి కల్పనకు రోజ్గార్ మేళా ఒక ఉత్ప్రేరకంగా పనిచేయగలదు. దేశాభివృద్ధిలో భాగస్వాములయ్యే యువతకు సరైన ఉపాధి అవకాశాలు దక్కాలి’ అని ఈ సందర్భంగా ప్రధాని కార్యాలయం పేర్కొంది. -
ఉపాధిపై ఫోకస్.. జాతీయ, అంతర్జాతీయ సంస్థల శిక్షణతో నైపుణ్యాలకు పదును
సాక్షి, అమరావతి: వివిధ పథకాల ద్వారా పిల్లల చదువులు సాఫీగా సాగేలా సంపూర్ణ సహకారం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థుల నైపుణ్యాలకు పదును పెట్టడం ద్వారా ఉద్యోగావకాశాలు పెంపొందించేలా చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేసేలా జగనన్న విద్యా దీవెన, వసతి.. భోజనాల నిమిత్తం జగనన్న వసతి దీవెనతోపాటు ఇతర పథకాల ద్వారా తల్లిదండ్రులపై భారం పడకుండా చదువులకు తోడ్పాటు అందిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఉన్నత విద్యా సంస్థలను బలోపేతం చేసి ప్రమాణాలు పెంచేందుకు కరిక్యులమ్లో మార్పులు చేసింది. ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ కోర్సుల పాఠ్య ప్రణాళికలను బలోపేతం చేసింది. ఇతర డిగ్రీ కోర్సుల్లో పాఠ్యాంశాలను సవరించడంతో పాటు 30 శాతం నైపుణ్య కోర్సులను ప్రవేశపెట్టింది. నాలుగేళ్ల ఆనర్ డిగ్రీ కోర్సులను తెచ్చి 10 నెలల ఇంటర్న్షిప్ అమలు చేస్తుండడంతో మంచి ఫలితాలకు మార్గం ఏర్పడింది. విద్యార్థులకు 2 నెలల కమ్యూనిటీ సర్వీసు ప్రాజెక్టులను తప్పనిసరి చేశారు. దీనివల్ల విద్యార్థుల్లో సామాజిక చైతన్యంతో ఆత్మస్థైర్యం పెరిగింది. అన్ని కాలేజీల్లో బోధనా మాధ్యమంగా ఇంగ్లీషును తప్పనిసరి చేశారు. దీనికి అనుగుణంగా ద్విభాషా పాఠ్య పుస్తకాలు రూపొందించి అందించారు. తద్వారా తెలుగు మీడియం నుంచి ఇంగ్లిష్ మీడియంలోకి విద్యార్థులను సాఫీగా మార్చేందుకు సులువైంది. 25 మార్కెట్ ఓరియెంటెడ్ కోర్సులు, 67 బ్యాచులర్ వొకేషనల్ డిగ్రీ ప్రోగ్రాములకు తోడు లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా విద్యార్థులకు అదనపు నైపుణ్యాలకు వీలుగా పలు ఆన్లైన్ కోర్సులను కూడా అందుబాటులోకి తెచ్చారు. దేశంలో తొలిసారిగా క్వాలిటీ అస్యూరెన్స్ సెల్ దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం క్వాలిటీ అస్యూరెన్స్ సెల్ను ఏర్పాటు చేసింది. అన్ని కాలేజీల్లోనూ తప్పనిసరిగా మౌలిక సదుపాయాలు మెరుగుపడేలా చూడడంతో పాటు తగిన బోధనా సిబ్బంది ఉండేలా పర్యవేక్షణకు వీలైంది. మరోపక్క అన్ని కాలేజీలకు న్యాక్, ఎన్బీఏ వంటి గుర్తింపు ఉండేలా మార్గదర్శనం చేస్తోంది. పలువురు నిపుణులతో తొలిసారిగా ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ బోర్డును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏర్పాటు చేశారు. విద్యార్థులలో సృజనాత్మకతను వెలికి తీయడం, నైపుణ్యాలు పెంచే లక్ష్యంతో 553 ఎంటర్ ప్రెన్యూర్షిప్, ఇంక్యుబేషన్, స్టార్టప్ సెంటర్లను యూనివర్సిటీలు, కాలేజీల్లో ఏర్పాటు చేశారు. మైక్రోసాఫ్ట్ సంస్థ ద్వారా 1.62 లక్షల మందికి వివిధ కోర్సుల్లో రూ.32 కోట్లతో ఉచిత శిక్షణ అందించారు. ఇంటర్న్షిప్తో సత్ఫలితాలు ఉన్నత విద్యలో ఇంజనీరింగ్తోపాటు నాన్ ప్రొఫెషనల్ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులలో నాలుగేళ్ల ఆనర్ డిగ్రీని ప్రవేశపెట్టి ఇంటర్న్షిప్ తప్పనిసరి చేయడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. రెగ్యులర్ కోర్సులతోపాటు విద్యార్థులలో నైపుణ్యాల పెంపునకు మైక్రోసాఫ్ట్, సేల్స్ ఫోర్స్ çవంటి సంస్థలు సహా 20 కంపెనీల ద్వారా విద్యార్థులకు అప్ స్కిల్లింగ్ శిక్షణ అందిస్తున్నారు. పరిశ్రమలకు అవసరమైన రీతిలో మానవ వనరులను తీర్చిదిద్దడంతో అనేక కంపెనీలు మన విద్యార్థుల వైపు దృష్టి సారిస్తున్నాయి. గత మూడేళ్లుగా పెరుగుతున్న ప్లేస్మెంట్ల సంఖ్య ఇందుకు నిదర్శనం. రాష్ట్ర ఉన్నత విద్యామండలి గణాంకాల ప్రకారం 2018–19లో ప్లేస్మెంట్ల సంఖ్య 37 వేలు ఉండగా 2021–22లో ఏకంగా 85 వేలకు పెరిగింది. దీన్ని 1.20 లక్షలకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకుని కృషి చేస్తున్నారు. మంచి ప్యాకేజీలతో కొలువులు నైపుణ్యాలకు తగినట్లుగా ఆయా కంపెనీలు మంచి ప్యాకేజీలను అందిస్తున్నాయి. 2018–19లో రాష్ట్రంలో సగటు ప్యాకేజీ రూ.2.50 లక్షల వరకు ఉండగా ప్రస్తుతం రూ.5 లక్షలకు పైగా పెరిగింది. గరిష్ట ప్యాకేజీలో రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు అందుకుంటున్న విద్యార్థులు సైతం ఉన్నారు. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, క్యాప్జెమినీ తదితర సంస్థలు విద్యార్థులకు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కరోనా సమయంలోనూ రాష్ట్రంలో ప్లేస్మెంట్ల సంఖ్య గణనీయంగా పెరగడం విశేషం. పరిశ్రమలతో కాలేజీల అనుసంధానం డిగ్రీ కోర్సుల్లో విద్యార్థులకు ఇంటర్న్షిప్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం అన్ని కళాశాలలను పరిశ్రమలు, ఐటీ సంస్థలు, ప్రముఖ వాణిజ్య సంస్థలతో సహా కోర్సులతో సంబంధమున్న 27,119 సంస్థలతో అనుసంధానించింది. ఇందుకు ఉన్నత విద్యామండలి ద్వారా ప్రత్యేక పోర్టల్ను ఏర్పాటు చేసింది. దాదాపు 2.5 లక్షల మంది డిగ్రీ విద్యార్థులు ఇంటర్న్షిప్ కొనసాగిస్తున్నారు. రెగ్యులర్ కోర్సులు చేస్తూనే.. విద్యార్థులు రెగ్యులర్ కోర్సులు చేస్తూనే అదనపు నైపుణ్యాలను సంతరించుకునేలా ఉచిత ఆన్లైన్ శిక్షణలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. మైక్రోసాఫ్ట్, సేల్స్ఫోర్సు లాంటి సంస్థల ద్వారా ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులను ఉచితంగా అందిస్తోంది. ఈ కోర్సుల్లో 2.15 లక్షల మందికి ఆన్లైన్ శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా భారీ స్పందనతో 2,45,700కి చేరుకుంది. మరికొన్ని సంస్థలతో ఒప్పందాలు ఏఐసీటీఈ, నాస్కామ్, మైక్రోసాఫ్ట్, సేల్స్ఫోర్స్, ఏడబ్ల్యూఎస్, ఒరాకిల్, పాలో ఆల్టో నెట్వర్క్, యూఐపాత్, స్మార్ట్ బ్రిడ్జ్, ఎడ్యుస్కిల్స్, ఎంప్లాయ్మెంట్ ఎక్స్ప్రెస్, ఎన్ఐఐటీ ఫౌండేషన్, క్యూస్గ్రూప్, నాంది ఫౌండేషన్, క్వెస్ గ్రూప్, టీమ్ లీజ్, ది హిందూ, రైస్, లాంచ్ ప్యాడ్, సైలర్ అకాడమీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఈ సంస్థల ఉచిత నైపుణ్య కోర్సులతో పాటు ఇతర సర్టిఫికేషన్ కోర్సులు అందనున్నాయి. ఇవే కాకుండా ఐబీఎం, సిస్కో, అడోబ్, గూగుల్, బోర్డు ఇన్ఫినిటీ, ఇన్ఫోసిస్ సంస్థలతోనూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఒప్పందాలు చేసుకోనుంది. సాంకేతికను అందిపుచ్చుకునేలా.. రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ, ఉన్నత విద్యా మండలి అధునాతన సాంకేతిక అంశాల్లో విద్యార్థులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దుతున్నాయి. సేల్స్ఫోర్స్ డెవలపర్, సేల్స్ఫోర్స్ అడ్మిన్, మైక్రోసాఫ్ట్ అజూర్, ఫుల్ స్టాక్ (డాట్ నెట్), ఫుల్ స్టాక్ (పైథాన్), హెచ్ఆర్, బీఎఫ్ఎస్ఐ ఎనలిస్ట్, బిజినెస్ డెవలప్మెంట్, మెడికల్ స్క్రైబ్, వీఎం వేర్, గూగుల్ ఆండ్రాయిడ్, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, నెట్ వర్కింగ్, క్లౌడ్ నెట్వర్కింగ్, డేటా ఎనలిటిక్స్, ఏఐ ఎంఎల్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులలో విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తున్నాయి. ముందు వరుసలో రాష్ట్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయానికి అనుగుణంగా రెగ్యులర్ కోర్సులలో ఇంటర్న్షిప్తో పాటు ఆన్లైన్ వర్చువల్ సర్టిఫికేషన్ కోర్సులను ఉచితంగా అందిస్తున్నాం. దాదాపు 1.50 లక్షల మందికి సర్టిఫికేషన్ కోర్సులు నిర్వహించిన ఘనత దేశంలో ఏపీకే దక్కుతోంది. 2.5 లక్షల మందికి రెగ్యులర్ ఇంటర్న్షిప్లను అందించడంలోనూ మన రాష్ట్రం ముందు వరసలో ఉంది. వచ్చే రెండు మూడేళ్లలో డిగ్రీ విద్యార్థులలో 60 శాతానికి పైగా ఉద్యోగావశాలు పొందేలా చూడాలన్నది లక్ష్యం. ఈ ఏడాది రూ.40 లక్షల ప్యాకేజీ వచ్చిన విద్యార్థులు 100 మందికి పైగా ఉన్నారు. ఇక రూ.25 లక్షలు, రూ.30 లక్షలు వచ్చిన విద్యార్థులు చాలా మందే ఉన్నారు. – కె.హేమచంద్రారెడ్డి, చైర్మన్, ఉన్నత విద్యామండలి -
టెలికం ఉద్యోగాలు పెరిగాయి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం, 5జీ విభాగంలో ఉద్యోగ ప్రకటనలు సెప్టెంబర్తో ముగిసిన ఏడాదిలో 33.7 శాతం పెరిగాయని గ్లోబల్ జాబ్ సైట్ ఇండీడ్ వెల్లడించింది. ‘5జీ సేవల కోసం భారత్ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. 5జీ నిర్దిష్ట సాంకేతికత, సేవలను అభివృద్ధి చేయడానికి కంపెనీలు ఇప్పటికే నియామకాలను ప్రారంభించాయి. తదుపరితరం నూతన టెలికం సాంకేతికతను వేగంగా స్వీకరించేందుకు వ్యాపార సంస్థలు ఎదురు చూస్తున్నందున రాబోయే కొద్ది త్రైమాసికాల్లో ఈ విభాగంలో నియామకాల్లో పెరుగుదలను చూడవచ్చు. కొత్త సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా భద్రతా వ్యవస్థలను రూపొందించగల, నెట్వర్క్ నిర్మాణాలను బలోపేతం చేయగల నైపుణ్యం కలిగిన ప్రతిభ అవసరమని దీనినిబట్టి అవగతమవుతోంది. అభివృద్ధి చెందిన టెలికమ్యూనికేషన్ రంగానికి అనుగుణంగా ఉద్యోగార్ధులు, పరిశ్రమ సైబర్ సెక్యూరిటీ నిపుణుల బలమైన సమూహాన్ని సృష్టించాలి’ అని నివేదిక వివరించింది. ఉద్యోగ ప్రకటనలు కస్టమర్ సర్వీస్ ప్రతినిధుల కోసం 13.91, ఆపరేషన్స్ అసోసియేట్స్ 8.22 శాతం అధికం అయ్యాయి. 2019 ఆగస్ట్ నుంచి 2022 ఆగస్ట్ మధ్య సైబర్ సెక్యూరిటీ ఉద్యోగాల కోసం ప్రకటనలు 81 శాతం దూసుకెళ్లాయి. -
బీజేపీతోనే గుజరాత్ వికాసం: మోదీ
భావ్నగర్: దేశంలోనే అతిపొడవైన తీర ప్రాంతమున్న గుజరాత్ అభివృద్ధి కోసం దశాబ్దాలపాటు ఎలాంటి ప్రయత్నాలు జరగలేదని ప్రధాని మోదీ అన్నారు. ఫలితంగా ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారన్నారు. కానీ, బీజేపీ ప్రభుత్వం గత 20 ఏళ్లుగా నిజాయతీతో ప్రయత్నాలు చేసి రాష్ట్రం అభివృద్ధికి బాటలు పరిచిందని పేర్కొన్నారు. ప్రచార ఆర్భాటాలకు డబ్బు వృథా చేయకుండా తీర ప్రాంతం వెంబడి పలు భారీ ప్రాజెక్టులు చేపట్టిందని ఆయన అన్నారు. ఫలితంగా లక్షలాది యువతకు ఉద్యోగావకాశాలు లభించాయని చెప్పారు. ప్రజాసేవే పరమావధిగా భావిస్తున్న బీజేపీ ఇచ్చిన వాగ్దానాలను ఎప్పుడూ నెరవేరుస్తుందని ఆయన పేర్కొన్నారు. భావ్నగర్, బొటాడ్, అమ్రేలీ జిల్లాల్లో గురువారం రూ.6 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిపిన సందర్భంగా భావ్నగర్లో జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్జీ టెర్మినల్, బ్రౌన్ఫీల్డ్ పోర్ట్ అభివృద్ధి, కార్గో కంటెయినర్ ఉత్పత్తి విభాగం తదితరాలు ఈ ప్రాజెక్టుల్లో ఉన్నాయి. రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన సమయంలో ప్రధాని మోదీ రూ.29 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. -
పరిశ్రమలకు బెస్ట్.. ఏపీ
విస్తృతంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ‘గ్రీన్ ఎనర్జీ’పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. రాయలసీమ ప్రాంతం ఇందుకు అనుకూలంగా ఉంది. ప్రస్తుతం రూ.72,188 కోట్ల పెట్టుబడులతో ఈ పరిశ్రమలకు అనుమతులు ఇచ్చాం. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకు వేస్తూ రైతులు గ్రూపుగా ముందుకొస్తే వారి పొలాల్లో విండ్, సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఏటా ఎకరానికి రూ.30 వేల చొప్పున ప్రభుత్వం లీజు చెల్లిస్తుంది. తద్వారా రైతులకు నికర ఆదాయంతో పాటు వారి పిల్లలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, కర్నూలు: పారిశ్రామిక అభివృద్ధి, తద్వారా ఉద్యోగ అవకాశాల కల్పనపై ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళుతోందని, పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రం అన్ని విధాలా అనుకూలమని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ప్రతి అంశంలో ‘ఇండస్ట్రీ ఫ్రెండ్లీ’గా అడుగులు వేస్తూ.. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు సహకరిస్తోందన్నారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాలలో ఏర్పాటైన ‘రామ్కో సిమెంట్స్’ కర్మాగారాన్ని బుధవారం ఆయన ప్రజల సమక్షంలో బజర్ నొక్కి ప్రారంభించారు. అంతకు ముందు ఫ్యాక్టరీలోని పరికరాలు, టెక్నాలజీ, ఉత్పత్తి తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రామ్కో ఇండస్ట్రీ వల్ల మన ప్రాంతానికి, మనకు మంచి జరుగుతుందన్నారు. మన పిల్లలు ఎక్కడికో వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా ఇక్కడే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఈ ప్రాంతంలో లైమ్ స్టోన్ మైన్స్ ఉన్నప్పటికీ గతంలో ఎలాంటి పరిశ్రమలు లేవని.. ప్రస్తుతం ఇక్కడ 2 మిలియన్ టన్నుల క్లింకర్, 1.5 మిలియన్ టన్నుల గ్రైండింగ్ సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటైందన్నారు. తద్వారా 3 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి అవుతుందని, ఇది తొలి దశ మాత్రమేనని.. రాబోయే రోజుల్లో యాజమాన్యం దీన్ని విస్తరిస్తుందని అన్నారు. తద్వారా ఈ ప్రాంతంలో మెరుగైన వసతులు వస్తాయని, సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బులిటీ – సామాజిక బాధ్యత) వల్ల చుట్టుపక్కల గ్రామాలకు మంచి జరుగుతుందని తెలిపారు. 75 శాతం స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఉండాలని చట్టం చేయడం వల్ల మన పిల్లలకు మంచే జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. తొలిదశలో వెయ్యి మందికి ఉద్యోగాలు ► మన ప్రాంతంలో రామ్కో సిమెంట్ను స్థాపించిన వెంకట్రామరాజా అన్నకు మనస్ఫూర్తిగా అభినందనలు. రూ.2,500 కోట్ల పెట్టుబడితో స్థాపించిన ఈ ప్లాంటులో తొలి దశలో వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. 2019లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది. పనులు వేగంగా పూర్తి చేసింది. ► గొప్ప మార్పునకు ఈ ఫ్యాక్టరీ నిదర్శనం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు దీనికంటే మరొక ఉదాహరణ అవసరం లేదు. ఎమ్మెల్యే, కలెక్టర్ నుంచి నా వరకు అందరి సహకారంతో ఎలాంటి జాప్యం జరగకుండా 30 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేశారు. ► 1961లో రామ్కో సిమెంట్స్ ప్రస్థానం మొదలైంది. రోజుకు 200 టన్నులు అంటే ఏటా 0.4 మిలియన్ టన్నుల సామర్థ్యంతో మొదలు పెట్టిన ప్లాంటు ఈ రోజు 20 మిలియన్ టన్నుల సామర్థ్యం దాకా అడుగులు వేసింది. ప్రతిచోటా వీరి యూనిట్లు బాగా పని చేస్తున్నాయి. 5 చోట్ల ఉత్పత్తి యూనిట్లు.. మరికొన్ని చోట్ల గ్రైండింగ్ యూనిట్లు.. మొత్తం 11 యూనిట్లు ఉన్నాయి. అన్నిచోట్ల సామర్థ్యాన్ని పెంచుతూ పోతున్నారు. ఇక్కడ ప్రారంభమైన ప్లాంట్కు ఇకపై కూడా మనందరి సహకారం అందిస్తే త్వరితగతిన మరింత అభివృద్ధి, విస్తరణకు దోహద పడుతుంది. ► కొద్ది రోజుల కిందట గ్రీన్కో 5,400 మెగావాట్ల సామర్థ్యంతో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి, పంప్డ్ స్టోరేజ్తో చేపట్టిన రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంటుకు పునాది రాయి వేశాను. ఈ ప్రాజెక్టు వల్ల కర్నూలు జిల్లాలో 2,600 ఉద్యోగాలు వస్తాయి. మన పిల్లలకు మేలు జరుగుతుంది. ప్రభుత్వ సహకారం బావుందని వాళ్లే చెబుతున్నారు.. ► ప్రతి అంశంలో ‘ఇండస్ట్రీ ఫ్రెండ్లీ’గా రాష్ట్రం అడుగులు వేస్తోంది. ఇది చాలా కీలకం. ఈ మధ్య కాలంలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో రాష్ట్రం వరుసగా మూడో ఏడాది కూడా దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. పరిశ్రమల నిర్వాహకులతో ఇక్కడి పరిస్థితులపై అభిప్రాయాలు తీసుకుని మార్కులు వేస్తున్నారు. ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈలకు ఇస్తున్న సహాయం, ప్రోత్సాహకాలు కలిపి పరిశ్రమలకు రాష్ట్రం బాగా సహకరిస్తోందని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. ► మన రాష్ట్రం, ప్రభుత్వం ఇస్తున్న మద్దతు గురించి, చేయి పట్టుకుని నడిపిస్తున్న తీరు గురించి పారిశ్రామికవేత్తలు సంతృప్తిగా ఉన్నారు. కాబట్టి మనకు మొదటి స్థానం వచ్చింది. ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగింది. 2021–22లో దేశంలో అత్యధిక గ్రోత్రేట్ 11.43 శాతంతో మనం మొదటి స్థానంలో ఉన్నాం. ఇది గొప్ప మార్పునకు అవకాశం. రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి మనమంతా మద్దతు ఇస్తున్నాం కాబట్టే ఇంతగా మంచి జరుగుతోంది. రూ.1000 కోట్లతో గ్రాసిమ్ ఇండస్ట్రీ ► రాష్ట్రంలో ఇటీవలే రూ.1000 కోట్లతో గ్రాసిమ్ ఇండస్ట్రీని ప్రారంభించాం. దీనిని కుమార మంగళం బిర్లా ఏర్పాటు చేశారు. 1,150 ఉద్యోగాలు వచ్చాయి. అలాగే 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే అపాచీ ఫ్యాక్టరీని రూ.700 కోట్లతో చిత్తూరు, పులివెందులలో చేపట్టాం. ► దాదాపు రూ.1,700 కోట్ల పెట్టుబడితో టీసీఎల్ ప్యానల్ ఉత్పత్తి చేపడుతోంది. 3,100 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. విశాఖలో ఏటీసీ టైర్స్ దాదాపు రూ.2,200 కోట్ల పెట్టబడితో ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 2 వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. రామాయపట్నం పోర్టుకు పునాది రాయి వేశాం. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక హార్బర్ లేదా పోర్టు ► ఇప్పటిదాకా రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో ఆరు పోర్టులు ఉన్నాయి. ఈ మూడేళ్లలో మరో నాలుగు పోర్టులు (రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ, భావనపాడు) నిర్మించేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాం. తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు తీసుకొస్తున్నాం. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక హార్బర్, పోర్టు ఉండేలా.. తద్వారా ఎగుమతులు పెంచేలా ప్రణాళికలు రచిస్తున్నాం. ► 2021–22లో రాష్ట్రం నుంచి రూ.1.70 లక్షల కోట్ల ఎగుమతులు ఉన్నాయి. దీన్ని రాబోయే ఐదేళ్లలో రూ. 3.40 లక్షల కోట్లకు పెంచేలా లక్ష్యంగా నిర్దేశించుకుని అడుగులు వేగంగా వేస్తున్నాం. దేశంలో ఎక్కడా జరగని విధంగా మూడు పారిశ్రామిక కారిడార్లు.. వైజాగ్–చెన్నై, చెన్నై–బెంగళూరు, హైదరాబాద్– బెంగళూరును అభివృద్ధి చేస్తున్నాం. ► వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో మెగా ఇండస్ట్రియల్ పార్క్, ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్, తిరుపతిలో మరో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ప్రారంభిస్తున్నాం. ఇవన్నీ పూర్తయితే మన పిల్లలకు ఉద్యోగావకాశాలు విస్తృతమయ్యే పరిస్థితి వస్తుంది. మరిన్ని పరిశ్రమలు మన రాష్ట్రం వైపే చూసే పరిస్థితి వస్తుందని ఆశిస్తున్నా. పారిశ్రామికవేత్తలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటాం. పూర్తి సహకారం అందిస్తాం. ► ఈ కార్యక్రమంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుడివాడ అమర్నాథ్, అంజాద్ బాషా, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీలు గుంగుల ప్రభాకర్రెడ్డి, చల్లా భగీరథరెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, కలెక్టర్ మనజీర్ జిలానీ శామూన్ పాల్గొన్నారు. భూమికి లీజు.. పిల్లలకు ఉద్యోగాలు గ్రీన్ డోసాల్, ఆర్సిలర్ మిట్టల్, అరవిందో, అదానీ వాళ్లకు రూ.72,188 కోట్ల విలువైన ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చాం. 3–4 ఏళ్లలో ఆ ప్రాజెక్టులు పూర్తయితే 20 వేల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. వీటికి తోడు.. రైతులు ముందుకొస్తే ఎకరాకు ఏడాదికి రూ.30 వేల చొప్పున లీజు ఇచ్చేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది. 30.. 50.. ఎన్ని ఏళ్లయినా ఏటా లీజు డబ్బులు ఇస్తాం. మూడేళ్లకోసారి 5 శాతం లీజు పెంచుతాం. ఈ మేరకు అగ్రిమెంట్లు చేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని ఒక ప్రాంతంలో కనీసం 1,500 నుంచి 2 వేల ఎకరాలు ఒక క్లస్టర్గా అందుబాటులో ఉండేలా చూస్తే.. రైతులు, గ్రామాలు ముందుకొస్తే ఆ భూముల్లో సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులు చేపడతాం. తద్వారా రైతులకు మేలు జరగడంతో పాటు వారి పిల్లలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మరింత అభివృద్ధి చేస్తాం ఇక్కడ సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుకు కలెక్టర్ నుంచి ముఖ్యమంత్రి వరకు పూర్తిగా సహకరించారు. వేగంగా పనులు పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభిస్తున్నాం. ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు. ప్రభుత్వ సహకారంతో ప్లాంటును మరింత అభివృద్ధి చేస్తాం. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనలో మా వంతుగా సహకారం అందిస్తాం. – వెంకట్రామ రాజా, రామ్కో ఎండీ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్.. పారిశ్రామికంగా రాష్ట్రం మంచి పురోగతి సాధిస్తోంది. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం. రాష్ట్రంలో పరిశ్రమలు ఎలాంటి వాతావరణంలో నడుస్తున్నాయో చెప్పేందుకు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్’లో మనం ప్రథమ స్థానంలో ఉండటమే నిదర్శనం. ఏపీ ‘ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్’ రాష్ట్రంగా ఉంది. సముద్రతీరం, జాతీయ రహదారులు, పోర్టుల కనెక్టివిటీ లాంటి అంశాలు పరిశ్రమల రాక, అభివృద్ధికి దోహదపడుతున్నాయి. వీటన్నిటికీ తోడు గొప్ప ముఖ్యమంత్రి అండగా ఉండటం మన అదృష్టం. అనకాపల్లి నియోజకవర్గంలో కూడా రామ్కో ప్లాంటు ఉంది. ఇక్కడ మూడో ప్లాంట్ ప్రారంభోత్సవానికి రావడం పట్ల ఆనందంగా ఉంది. – గుడివాడ అమర్నాథ్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి -
3.5 లక్షల మంది విద్యార్థులకు ఇంటర్న్షిప్
సాక్షి అమరావతి: ఏపీలోని 3.5 లక్షల మంది విద్యార్థులు అక్టోబర్ 1 నుంచి తమ ఇంటర్న్షిప్లను ప్రారంభిస్తారని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె. హేమచంద్రారెడ్డి తెలిపారు. మండలి కార్యాలయంలో లింక్డ్ఇన్ ద్వారా చేకూరే ప్రయోజనాలపై మంగళవారం ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. మండలి అభివృద్ధి చేసిన లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎల్ఎంఎస్) ప్లాట్ఫారమ్ గురించి వివరిస్తూ.. ఇప్పటికే 9 లక్షల మంది విద్యార్థులు ఈ ప్లాట్ఫారమ్లో నమోదు చేసుకున్నారని తెలిపారు. ఇక నుంచి ఎల్ఎంఎస్లో ఉద్యోగావకాశాలు కనిపిస్తాయని చెప్పారు. లింక్డ్ఇన్ ఇండియా హెడ్ సబాకరీం మాట్లాడుతూ.. ఏపీలో చాలా టాలెంట్ పూల్ ఉందని.. రాష్ట్రంలో విద్యార్థుల అవకాశాలు పెంచడానికి, యజమానులను ఆకర్షించడానికి లింక్డ్ఇన్ సహాయపడుతుందని చెప్పారు. లింక్డ్ఇన్ సీనియర్ డైరెక్టర్ రుచీ ఆనంద్ మాట్లాడుతూ.. లింక్డ్ఇన్ లెర్నింగ్ సొల్యూషన్స్ నుండి విద్యార్థులు ప్రతివారం 60 కోర్సులు నేర్చుకుంటున్నారని చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ ఐటీ సలహాదారు శ్రీనాథ్ దేవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
దేవుడా.. నీవే దిక్కు !
విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు
పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి
జూన్ 4 తర్వాత వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే
24న డీఈఈ సెట్
యంత్రంలో ఫలితాలు.. బెట్టింగ్ల జోరు
గదులు నిర్మించండి
రైతులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు
బదిలీలతో బరితెగింపు
Lok Sabha Election 2024: బీజేపీ అభ్యర్థుల్లో... నాలుగోవంతు ఫిరాయింపుదారులే
తప్పక చదవండి
- కుమ్మక్కుతో విధ్వంసకాండ
- ఎన్నికలు vs ఏఐ
- ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం.. భారత్లో రేపు సంతాపదినం
- చరిత్రాత్మకం! సౌదీలో తొలిసారిగా స్విమ్వేర్ ఫ్యాషన్ షో!
- కారుతో ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి.. గంటల్లోనే బెయిల్
- అప్పటికి భారతీయులు ధనవంతులవుతారా.. అసలు సమస్య ఏంటంటే?
- కేజ్రీవాల్కు బెదిరింపులు బీజేపీ పనే: ఆప్
- రూ. 5 కోట్లు దండుగ అన్నారు.. చెత్తలో పడేసిందంటూ: యశ్ తండ్రి
- నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!
- ‘AI’తో ప్రమాదమే.. గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ వార్నింగ్
Advertisement