-
ఎనిమిదేళ్లకే పెళ్లి..బడి గుమ్మం తొక్కలేదు : అయితేనేం ఆమె ఒక లెజెండ్!
స్వాతంత్ర్య పోరాటంలో భారతీయ మహిళలు కీలక పాత్ర పోషించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సమరరంగాన దూకేందుకు ఏ మాత్రం వెనుకంజ వేయలేదు. అలాంటి సమర యోధుల్లో నెల్లూరుకు చెందిన పొణకా కనకమ్మ ఒకరు. ఎనిమిదేళ్లకే వివాహం. పాఠశాల గడప తొక్క కుండానే పాండిత్యాన్ని సంపాదించారు. చివరికి జైలుకు వెళ్లారు. ఎవరీ కనకమ్మ? నెల్లూరు వాసులకే కాదు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలిచిన ధీరవనిత కనకమ్మ జీవిత విశేషాలు మీకోసం... కవయిత్రి, సామాజిక కార్యకర్త కనకమ్మ 1882 జూన్ 10న పోట్లపూడి గ్రామంలో మరుపూరు కొండారెడ్డి, రావమ్మల దంపతులకు జన్మించారు. ఎనిమిదేళ్లకే నెల్లూరు సమీపంలోని పొట్లపూడి గ్రామం భూస్వామి మేనమామ, సుబ్బ రామ రెడ్డితో బాల్య వివాహం అయింది కనకమ్మకు. దీంతో కుటుంబ కట్టుబాట్ల ప్రకారం పాఠశాలకు వెళ్లేందుకు అనుమతి లేదు. (మర్డర్ మిస్టరీని ఛేదించిన పోలీసులు: సెల్ఫీ వీడియో పుణ్యమే!) అయితే ఆమెలోని ధీరత్వం వెనక్కి పోలేదు. సంఘ సేవ కోసం ఇల్లు విడిచి కనకమ్మ ఉద్యమబాటన నడిచారు. నెల్లూరు కాంగ్రెస్ కమిటీకి తొలిమహిళా అధ్యక్షురాలుగా ఎంపికైన ఘనత కనకమ్మ సొంతం. మహాత్మా గాంధీ శిష్యురాలిగా ఉప్పు 1930ల కాలంలో సత్యాగ్రహం,వందేమాతరం ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. దీంతో వేలూరు, నెల్లూరు జైళ్లలో ఒక ఏడాదికిపైగా జైలు జీవితాన్ని అనుభవించారు. 1913లో పోట్లపూడిలో సుజన రంజనీ సమాజ స్థాపన, వివేకానంద గ్రంథాలయం, బాలబాలికల విద్య కోసం శ్రీ కస్తూరిదేవి విద్యాలయం స్థాపనలో ఆమె కృషి మరువలేనిది. (లగ్జరీ బంగ్లాను విక్రయించిన ఇషా అంబానీ? ఎవరు కొన్నారు? ) సాహిత్య రంగంలో కూడా కనకమ్మ ఎంతో కృషి చేశారు. వ్యాసాలు, కవితలు రచించారు. ముఖ్యంగా స్త్రీవాద కోణంలో ఆమె రచనలు సాగాయి. కొంతకాలం జమీన్ రైతు పత్రికను కూడా నడిపారు. అందుకే ప్రతిష్ఠాత్మకమైన గృహలక్ష్మి స్వర్ణకంకణం కూడా ఆమెను వరించింది.తన జీవితంలో 45 ఏళ్లు సామాజిక కార్యక్రమాలకే అంకితం చేసిన గొప్ప మహిళ. 1963 సెప్టెంబర్ 15న కనకమ్మ కనకమ్మ అస్తమించారు. 2011లో ఆమె ఆత్మకథను తెలుగులో “కనకపుష్యరాగం” పేరుతో డా.కె.పురుషోత్తం విడుదల చేయడం గమనార్హం. (వేసవిలో చల్ల చల్లగా : గోండ్ కటీరా జ్యూస్.. ఒక్కసారి తాగితే..!) ‘‘ఊయలలూగించే కోమల కరాలే రాజ్యాలు శాసిస్తవి ,తూలికపట్టే మృదుహస్తాలే శతఘ్నులు విదలిస్తవి, జోలలుబుచ్చే సుకుమారపు చేతులే జయభేరులు మోగిస్తవి’’ -కనకమ్మ -
కనకమ్మ @ 110
సెంచరీ దాటినా చలాకీగా. రోజువారీ పనులు చేసుకుంటున్న అవ్వ జగమంత కుటుంబానికి పెద్ద దిక్కు మండలంలోని బంధనపల్లి శివారుతండాకు చెందిన భూక్యా కనకమ్మ అనే వృద్ధురాలు ప్రస్తుతం 110 ఏళ్లు వయస్సు ఉంటుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆమె భర్త భూక్యా తావుర్యా నడీడులోనే మరణించాడు. కాగా, కనకమ్మకు కుమారుడు జీవ్లా, ముగ్గురు కూతుర్లు (మంగతి, లచ్చమ్మ, ఈరమ్మ) ఉన్నా రు. అయితే కుమారుడు మరణించాక మనువ డు బీల్యాకు కనకమ్మే పెళ్లి చేసింది. అతడికి ముగ్గురు కుమారులు. వీరిలో పెద్ద కొడుకుకు కూతురు, రెండో కుమారుడికి ఇద్దరు కుమారు లు, మూడో కొడుకుకు కూతురు ఉన్నారు. ఇదిలా ఉండగా, కనకమ్మ పెద్ద కూతురుకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు.. రెండో కూతురుకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు.. మూడో కూతురుకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. అలాగే వీరికీ కూడా సం తానం ఉన్నారు. మొత్తం అందరూ కలిపి ‘సెం చరీ’ దాటారు. అయితే ఇంత కుటుంబానికి పే...ద్ద మనిషి కనకమ్మే. ఇప్పుడు కూడా ఆమె అందరి బాగోగులూ చూస్తోంది. కాగా, వ య స్సు పెరిగిపోతున్నప్పటికీ ఆమె ఇప్పటివరకు ఎవరిపై ఆధారపడడం లేదు. గిన్నెలు తోముకోవడం, ఇళ్లూవాకిలి ఊడ్చుకోవడం ఇలా అన్ని పనులు సొంతంగానే చేసుకుంటోంది. అన్నట్టు.. ఇంకో విషయం.. కనకమ్మ నాటు వైద్యురాలు కూడా! సంతానం లేనివారికి ఆకుపసరు అందిస్తుంది. చిన్న పిల్లలు భయపడితే వారికి బూడిదతో బొట్టు పెడితే కుదుటపడతారని స్థానికుల విశ్వాసం. అలా కనకమ్మ జనంతోనూ మమేకమవుతోంది. ఆమె ఇంటి కెళ్లిన వారు ఆప్యాయం గా పలకరించి మంచీచెడ్డ మాట్లాడాకే వెనుదిరుగుతారు. కాగా, ఈ వయసులోనూ ఆమె మెనూ మాత్రం జొన్నరొట్టే! ఇంత వయస్సున్నా.. ఈమెకు అధికారులు ఆసరా పింఛన్ ఇవ్వలేదు. ఎందుకంటే ఆమె మునిమనుమడు ఎస్సై అయ్యూడనేది అధికారుల మాట. ఇది యూంత్రిక జీవనం. మనిషికి లక్షాతొంభై రోగాలు. ఒత్తిళ్లు.. ఆహారపు అల వాట్లు.. కారణాలేమైనా కావచ్చు.. మనిషి ఆయుర్ధాయం మాత్రం క్రమంగా తగ్గిపోతోంది. ఆరు పదుల వయస్సుదాటి బతికితే ‘అబ్బో ముసలోడు గట్టోడే’ అంటుంటారు. అదే వందేళ్లూ జీవిస్తే ఆశ్చర్యమే..! మరి 110 ఏళ్లు బతికి ఉంటే.. అమితాశ్చర్యం కదా! బతికి ఉండడమే కాదు.. ఈ వయసులోనూ తన రోజువారీ పనులు చక్కగా చేసుకుంటుంటే చూసిన వారు నోరెళ్ల బెట్టాల్సి వస్తోంది. మరీ ఆ ‘సీనియర్’ సిటిజన్ గురించి తెలుకోవాలనుకుంటున్నారా.. అయితే పదండి.. - బంధనపల్లి(రాయపర్తి) దేవతలా చూసుకుంటాం.. మా కనకమ్మను ఇ ప్పటికి మేము దేవత లా చూసుకుం టాం. ఆమెకు 110 యేళ్లకు పైగా ఉంటాయని మా బంధువులు చెబుతుంటారు. ఇప్పటికీ తనపని తానే చేసుకుంటుంది. ఆమెకే ఇబ్బంది రాకుండా కుటుంబ సభ్యుల మంతా జాగ్రత్తలు తీసుకుంటాం. - దీప్లానాయక్, కనకమ్మ మునిమనవడు
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
వంద కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరిక
48 గంటల ముందు ప్రచారం నిలిపివేత
అభివృద్ధి చేశా.. ఆశీర్వదించండి
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
●తీరనున్న తాగునీటి సమస్య
పోలింగ్ స్టేషన్లను పరిశీలించిన జేసీ
పుష్పగిరిలో కనుల పండువగా కల్యాణోత్సవాలు
కోపంగా ఉంటే.. ఇక్కడికొచ్చి కేకలేయండి చాలు!
పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు పక్కాగా ఉండాలి
ప్రచారం.. పరిసమాప్తం!
తప్పక చదవండి
- ఎన్నికల వేళ సినిమా రేంజ్లో పోలీసులు ఛేజింగ్.. భారీగా డబ్బు స్వాధీనం
- మథర్స్ డే వెనకాల మనసును కథలించే కథ!
- నాడు చెప్పుతో కొట్టి.. నేడు ‘కాపు’ కాస్తానంటూ కాకమ్మ కబుర్లు!
- Weekly Horoscope: ఈ రాశి వారికి జీవితాశయం నెరవేరి ఉత్సాహంగా గడుపుతారు
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- చట్టం మీ బాబు చుట్టమా రామోజీ?
- అఫ్గాన్లో ఆకస్మిక వరదలు.. 300 మందికి పైగా మృతి
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- AP: వ్యవసాయం పండగ
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
Advertisement