-
బరిగీసి.. బర్రెలక్క
రాష్ట్రంలోని నిరుద్యోగుల తరపున అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు శిరీష. సోషల్మీడియాలో ‘బర్రెలక్క’గా ప్రాచుర్యం పొందిన 26 ఏళ్ల యువతి కర్నె శిరీష. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీలో నిలవడంతో ఆమెకు వివిధ వర్గాల నుంచి విశేష మద్దతు లభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే యానాం మాజీ మంత్రి, ఢిల్లీ ప్రత్యేక అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఆమె ప్రచార ఖర్చుల కోసం రూ. లక్ష ఆర్థిక సాయం అందజేశారు. ఇతర ప్రాంతాల నుంచి నిరుద్యోగులు వచ్చి కొల్లాపూర్లో ఆమెకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మద్దతుగా హోరెత్తిన ప్రచారం.. కొల్లాపూర్ నుంచి నామినేషన్ వేసిన శిరీష తాను నిరుద్యోగుల తరపున పోరాటం చేసేందుకే అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచినట్టు ప్రకటించారు. దీంతో క్రమంగా ఆమెకు సోషల్మీడియాతో పాటు రాష్ట్రంలోని యువత, నిరుద్యోగుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఉమ్మడి మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల నుంచి నిరుద్యోగులు స్వచ్ఛందంగా ప్రచారం నిర్వహించేందుకు కొల్లాపూర్కు తరలివస్తున్నారు. ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్న ఆమె తమ్ముడు చింటూపై కొందరు యువకులు ఇటీవల దాడికి పాల్పడటంపై నిరుద్యోగ వర్గాలు మండిపడుతున్నాయి. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఈ ఘటనపై ఖండించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శిరీషకు మద్దతు ఇచ్చారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్న శిరీషకు రక్షణ కల్పించాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఎక్స్ (ట్విట్టర్) లో పోస్ట్ చేశారు. బర్రెలక్క పేరుతోనే ట్రెండింగ్.. ‘హాయ్ ఫ్రెండ్స్.. డిగ్రీలు ఎన్ని వచ్చినా నోటిఫికేషన్లు, ఉద్యోగాలు రావడం లేదు. అందుకే మా అమ్మకు చెబితే నాలుగు బర్లను కొనిచ్చింది. బర్లను కాయడానికి వచ్చిన ఫ్రెండ్స్’ అంటూ ఏడాదిన్నర కిందట శిరీష చేసిన వీడియో సోషల్ మీడియాలో సంచలనమైంది. నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన కర్నె శిరీష బీకాం వరకు చదువుకుంది. తల్లి అనూరాధ ఓ చిన్న టిఫిన్ సెంటర్ నడుపుతూ శిరీషతో పాటు ఇద్దరు కుమారులను చదివించింది. చిన్న రేకులòÙడ్డులో జీవనం సాగిస్తున్న ఆ కుటుంబానికి తల్లితో పాటు తానూ పెద్దదిక్కులా నిలవాలని భావించింది. ఆ మేరకు పోలీస్ కానిస్టేబుల్, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమైంది. అయితే నోటిఫికేషన్లు రాలేదంటూ అప్పట్లో ఈమె చేసిన వీడియోపై పోలీసులు 2022లో పెద్దకొత్తపల్లి పోలీస్స్టేషన్లో ఐపీసీ 505(2) సెక్షన్ కింద కేసు కూడా నమోదు చేశారు. నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్నా ‘రాష్ట్రంలో నోటిఫికేషన్లు రాక, నియామకాల ప్రక్రియ సక్రమంగా లేక ఉద్యోగాలు పొందలేని నిరుద్యోగుల తరపున అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచాను. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నాతో కలసి ప్రచారంలో ఉన్న మా తమ్మునిపై దాడిచేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా నిరుద్యోగుల తరపున పోరాటాన్ని కొనసాగిస్తాను. యువత రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నా. నిరుపేద కుటుంబానికి చెందిన విద్యావంతురాలుగా నాకు అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఙప్తి చేస్తున్నా.’ -పాదం వెంకటేష్ -
వైఎస్ ఇక లేరని..
అచ్చంపేట/కొల్లాపూర్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అకాలమరణాన్ని తట్టుకోలేక అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో ముగ్గురు మృతిచెందారు. బాధిత కుటుంబాలను మంగళవారం షర్మిల పరామర్శించనున్నారు. అమ్రాబాద్కు చెందిన పర్వతనేని(బోగం) రంగయ్య వైఎస్ అభిమాని. 2009 సెప్టెంబర్8న వైఎస్ఆర్ సంతాపసభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా ఆందోళనతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. లేపిచూసే సరికి అప్పటికే ప్రాణాలు విడిచాడు. రంగయ్యకు భార్య అనసూయమ్మతో పాటు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆ మహానేత కూతురు షర్మిల మమ్మల్ని పరామర్శించేందుకు రావడం ఎంతో సంతోషంగా ఉందని అనసూయమ్మ అంటున్నారు. కోడేరు మండలం ఎత్తం గ్రామానికి చెందిన పుట్టపాగ నర్సింహా కూలీ పను లు చేసుకుంటూ హైదారాబాద్లో జీవనం సాగించేవాడు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణవార్త విని నర్సింహా జీర్ణించుకోలేకపోయాడు. ఆ రోజం తా భోజనం కూడా చేయలేదు. సెప్టెంబర్ 3న టీవీలో వైఎస్ మరణవార్తను చూస్తూ గుండెపోటుతో మరణించాడు. అతని భార్య శంకరమ్మ, కొడుకు, కూతురు ఉన్నారు. ప్రస్తుతం వీరు కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొల్లాపూర్ పట్టణంలోని పాతబస్టాండ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న కటిక రాంచందర్ వైఎస్కు వీరాభిమాని. వైఎస్ఆర్ మరణవార్త తెలిసి కుంగిపోయాడు. రూ.2కు కిలోబియ్యం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వంటి పథకాలు ఇక ఆగిపోతాయని తన సన్నిహితులతో చెబుతుండేవాడు. 2009 సెప్టెంబర్ 21న టీవీల్లో వైఎస్ఆర్ మరణవార్తలు చూస్తూ గుండెపోటుతో మరణించారు. అతనికి భార్య శంకరబాయి, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇంటిపెద్దదిక్కు చనిపోవడంతో కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
బీజేపీ కోసం కిషన్ రెడ్డి కంటే ఎక్కువ రేవంత్ కష్టపడ్డాడు: కేటీఆర్
'రెండు గంటల జర్నీ 20 నిమిషాల్లో'.. పుష్ప భామ ప్రశంసలు
ఎంపీ స్వాతి మలివాల్పై దాడి నిజమే.. స్పందించిన ‘ఆప్’
రొమాంటిక్ కామెడీ చిత్రంగా సంగీత్.. గ్రాండ్గా షూటింగ్ ప్రారంభం (ఫొటోలు)
ఢిల్లీతో లక్నో డూర్ ఆర్ డై మ్యాచ్.. తుది జట్లు ఇవే
ఎందుకలా వదిలేశారు?.. మీ బాధ్యత కాదా?.. రష్మి ట్వీట్ వైరల్
తప్పక చదవండి
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- ఏపీలో తుది పోలింగ్ శాతంపై సాయంత్రానికి క్లారిటీ: ఎంకే మీనా
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- మొబైల్ యూజర్స్కు షాక్, త్వరలో రీఛార్జ్ ధరలు భారీగా పెంపు!
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement