-
భార్యాభర్తలిద్దరూ స్టార్ క్రికెటర్లే.. అతడు కాస్ట్లీ.. ఆమె కెప్టెన్!(ఫొటోలు)
-
స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
ఐపీఎల్-2024లో కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బ్యాటర్ల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. హార్డ్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ తప్ప మిగిలిన వాళ్లలో ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.ముఖ్యంగా టాపార్డర్ దారుణంగా విఫలమైంది. ఓపెనర్లు ఇషాన్ కిషన్(13)- రోహిత్ శర్మ(11) పూర్తిగా నిరాశపరచగా.. వన్డౌన్ బ్యాటర్ నమన్ ధిర్(11) కూడా చేతులెత్తేశాడు.ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నాలుగో నంబర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(35 బంతుల్లో 56) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన బ్యాటర్లు తిలక్ వర్మ(4), నేహాల్ వధేరా(6), హార్దిక్ పాండ్యా(1) పెవిలియన్కు క్యూ కట్టారు.సూర్య ఒంటరి పోరాటం వృథాసూర్య ఈ క్రమంలో ఒంటరి పోరాటం చేస్తున్న సూర్యకు తోడైన టిమ్ డేవిడ్(20 బంతుల్లో 24) నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇక టెయిలెండర్లు గెరాల్డ్ కోయెట్జీ(8), పీయూశ్ చావ్లా(0), జస్ప్రీత్ బుమ్రా(1 నాటౌట్) కూడా చేతులెత్తేయడంతో 145 పరుగులకే ముంబై కథ ముగిసిపోయింది.ఫలితంగా కేకేఆర్ విధించిన 170 పరుగుల లక్ష్య ఛేదనలో విఫలమైన ముంబై వాంఖడేలో పన్నెండేళ్ల తర్వాత తొలిసారి కోల్కతా చేతిలో 24 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.ఈ పరాజయం ముంబై ఫ్యాన్స్ హృదయాలను ముక్కలు చేస్తే.. పందొమ్మిదో ఓవర్లో మూడు వికెట్లు తీసి పాండ్యా సేన పతనాన్ని శాసించిన మిచెల్ స్టార్క్ను చూసి కేకేఆర్ అభిమానులు మురిసిపోయారు.అద్భుత రీతిలో బౌల్డ్ చేసిముంబైతో మ్యాచ్లో 3.5 ఓవర్లు బౌల్ చేసిన స్టార్క్ 33 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఓపెనర్ ఇషాన్ కిషన్ను అద్భుత రీతిలో బౌల్డ్ చేయడం హైలైట్గా నిలిచింది. గంటకు 142.3 కిలో మీటర్ల వేగంతో స్టార్క్ విసిరిన బంతి లెగ్ స్టంప్ను ఎగురగొట్టింది.అయినప్పటికీ స్టార్క్ పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు. అయితే.. ఇషాన్ అవుట్ కాగానే ముంబై ఇండియన్స్ కోచ్ మార్క్ బౌచర్తో పాటు చీర్ గర్ల్స్.. ముఖ్యంగా రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ వైరల్గా మారాయి. ఇక ఇషాన్తో పాటు టిమ్ డేవిడ్, కోయెట్జీ, పీయూశ్ చావ్లా వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు స్టార్క్. చదవండి: అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యాStumps dismantled, in vintage Starc style 🔥🫡 #TATAIPL #MIvKKR #IPLonJioCinema #IPLinBhojpuri pic.twitter.com/RcERxhgJps— JioCinema (@JioCinema) May 3, 2024 -
IPL 2024: కేకేఆర్ను ఢీకొట్టనున్న పంజాబ్.. స్టార్క్ ఔట్, ధవన్ ఇన్..?
ఐపీఎల్ 2024 సీజన్లో ఇవాళ (ఏప్రిల్ 26) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్.. టేబుల్ సెకెండ్ టాపర్ అయిన కేకేఆర్ను వారి సొంత మైదానమైన ఈడెన్ గార్డెన్స్లో ఢీకొట్టనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ పంజాబ్కు చాలా కీలకం కానుంది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే పంజాబ్ ప్లే ఆఫ్స్ లెక్కల్లో ఉంటుంది.లేకపోతే మరో సీజన్లో టైటిల్ లేకుండా రిక్త హస్తాలతో వైదొలగాల్సి ఉంటుంది. పంజాబ్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో కేవలం రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. మరోవైపు కేకేఆర్ ఏడింట ఐదు మ్యాచ్లు గెలిచి రెండో స్థానంలో ఉంది. ఈ సీజన్లో కేకేఆర్ అంచనాలకు తగ్గట్టు రాణిస్తూ మూడో టైటిల్ దిశగా అడుగులు వేస్తుంది.హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. పంజాబ్పై కేకేఆర్ స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శిస్తూ వచ్చింది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 32 మ్యాచ్ల్లో తలపడగా.. కేకేఆర్ 21, పంజాబ్ 11 మ్యాచ్ల్లో గెలుపొందాయి.బలాబలాల విషయానికొస్తే.. పంజాబ్తో పోలిస్తే కేకేఆర్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పెట్టి సొంతం చేసుకున్న మిచెల్ స్టార్క్ మినహా కేకేఆర్కు పెద్ద సమస్యలేమీ లేవు. స్టార్క్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్ల్లో తేలిపోయాడు. వికెట్లు తీయకపోగా.. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. నరైన్, రసెల్తో పాటు కుర్ర బౌలర్లు రాణిస్తుండటంతో స్టార్క్ వైఫల్యాలు హైలైట్ కావడం లేదు.పంజాబ్తో నేటి మ్యాచ్లో స్టార్క్ పక్కకు కూర్చోవాల్సి రావచ్చు. అతను ఆర్సీబీ గత మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు (వేలికి). స్టార్క్ గత రెండు రోజులుగా ప్రాక్టీస్ సెషన్స్లోనూ కనబడలేదు. దీన్ని బట్టి చూస్తే.. పంజాబ్తో మ్యాచ్లో అతను ఆడకపోవచ్చని తెలుస్తుంది.పంజాబ్ విషయానికొస్తే.. ఈ జట్టు మిడిలార్డర్ బ్యాటర్లు శశాంక్ సింగ్, అశుతోష్ శర్మపై అందరి చూపు ఉంది. ఈ సీజన్లో ఈ ఇద్దరు అద్భుతమైన పోరాటాలతో పంజాబ్ ఆడిన ప్రతి మ్యాచ్ను రక్తి కట్టించారు. వీరిద్దరి నుంచి అభిమానులు మరోసారి సంచలన ఇన్నింగ్స్లు ఆశిస్తున్నారు. వీరిద్దరు మినహా ఈ సీజన్లో పంజాబ్కు చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ లేవు. ఈ మ్యాచ్లో పంజాబ్ రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధవన్ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్లకు దూరంగా శిఖర్ తాజాగా జరిగిన ప్రాక్టీస్ సెషన్స్లో యాక్టివ్గా కనిపించాడు. దీన్ని బట్టి అతని రీఎంట్రీ ఖాయమని తేలిపోయింది. నేటి మ్యాచ్లో స్టార్క్ ఆడకపోతే అతడి స్థానంలో దుష్మంత చమీర ఆడే అవకాశం ఉంది. తుది జట్లు (అంచనా)..కేకేఆర్: ఫిల్ సాల్ట్ (వికెట్కీపర్), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్/దుష్మంత చమీర, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ. [ఇంపాక్ట్ ప్లేయర్: వెంకటేష్ అయ్యర్]పంజాబ్: శిఖర్ ధవన్ (కెప్టెన్), జానీ బెయిర్స్టో, ప్రభ్సిమ్రన్ సింగ్, సామ్ కర్రన్, జితేష్ శర్మ (వికెట్కీపర్), లియామ్ లివింగ్స్టోన్, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్ప్రీత్ బ్రార్, కగిసో రబాడ, హర్షల్ పటేల్. [ఇంపాక్ట్ ప్లేయర్: అర్ష్దీప్ సింగ్] -
అసలు ఆ ఓవర్లో అన్ని పరుగులిస్తావా?.. స్టార్క్పై ఆగ్రహం
#Starc: కోల్కతా నైట్ రైడర్స్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. కోట్లు పెట్టి కొన్నందుకు అతడి వల్ల జట్టుకు ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయిందని సొంత జట్టు అభిమానులే ఫైర్ అవుతున్నారు. కాగా ఐపీఎల్-2024 వేలంలో భాగంగా కేకేఆర్ మిచెల్ స్టార్క్ కోసం మిగతా ఫ్రాంఛైజీలతో పోటీ పడి మరీ అతడిని సొంతం చేసుకుంది. ఇందుకోసం ఏకంగా రికార్డు స్థాయిలో రూ. 24.75 కోట్లు ఖర్చు పెట్టింది. ఫలితంగా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్గా ఈ ఆసీస్ స్టార్ రికార్డులకెక్కాడు. కానీ అందుకు తగ్గ ప్రదర్శన మాత్రం చేయలేకపోతున్నాడు. పదిహేడో ఎడిషన్లో తొలి రెండు మ్యాచ్లో వికెట్లు తీయలేకపోయిన స్టార్క్.. ఆ తర్వాత గాడిలో పడ్డట్లే కనిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్పై రెండు.. లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. అసలు ఆ ఓవర్లో అన్ని పరుగులిస్తావా? అయితే.. రాజస్తాన్ రాయల్స్తో మంగళవారం నాటి మ్యాచ్లో మరోసారి విఫలమయ్యాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన స్టార్క్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఏకంగా 50 పరుగులు లీక్ చేశాడు. ముఖ్యంగా కీలకమైన పద్దెనిమిదవ ఓవర్లో 18 పరుగులు ఇవ్వడం తీవ్ర ప్రభావం చూపింది. ఇక కేకేఆర్ మిగిలిన బౌలర్లలో స్పిన్నర్లు సునిల్ నరైన్ (2/30), వరుణ్ చక్రవర్తి (2/36) మెరుగ్గా ఆడగా.. స్టార్క్తో పాటు పేస్ విభాగంలో వైభవ్ అరోరా(1/45), హర్షిత్ రాణా (2/45) భారీగా పరుగులు ఇచ్చారు. అయితే, వీరిద్దరు వికెట్లు కూడా తీశారు. కానీ ఎంతో అనుభవం ఉన్న స్టార్క్ ఒక్క వికెట్ కూడా తీయలేక చతికిలపడ్డాడు. ఇక ఈ మ్యాచ్లో ఆఖరి బంతికి సింగిల్ తీసిన సెంచరీ వీరుడు జోస్ బట్లర్ రాజస్తాన్ను గెలిపించిన విషయం తెలిసిందే. పైసా వసూల్ మాత్రమే.. ప్రదర్శన లేదు ఫలితంగా వరుస విజయాలతో జోరు మీదున్న కేకేఆర్కు ఓటమి ఎదురైంది. ఈ క్రమంలో స్టార్క్ విమర్శకుల టార్గెట్గా మారాడు. స్టార్క్ కాస్త పొదుపుగా బౌలింగ్ చేసి ఉంటే కేకేఆర్కు భంగపాటు తప్పేదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక నెట్టింట అయితే.. అతడిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ‘‘రూ. 24.75 కోట్లు ఖర్చు పెట్టి కొంటే పైసా వసూల్ మాత్రమే.. ప్రదర్శన లేదు’’ అంటూ స్టార్క్పై సెటైర్లు వేస్తున్నారు. అయితే, అతడి ఫ్యాన్స్ మాత్రం అండగా నిలుస్తూ.. కీలక సమయంలో రాణించి తన విలువేంటో చాటుకుంటాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేకేఆర్ వర్సెస్ రాజస్తాన్ స్కోర్లు: ►వేదిక: ఈడెన్ గార్డెన్స్, కోల్కతా ►టాస్: రాజస్తాన్.. బౌలింగ్ ►కేకేఆర్ స్కోరు: 223/6 (20) ►రాజస్తాన్ స్కోరు: 224/8 (20) ►ఫలితం: రెండు వికెట్ల తేడాతో కేకేఆర్పై రాజస్తాన్ విజయం Another Last Over Thriller 🤩 A Jos Buttler special guides @rajasthanroyals over the line and further extends their lead at the 🔝 🙌 🙌 Scorecard ▶️ https://t.co/13s3GZLlAZ #TATAIPL | #KKRvRR pic.twitter.com/d3FECR81X1 — IndianPremierLeague (@IPL) April 16, 2024 చదవండి: ఐపీఎల్ చరిత్రలో తొలి జట్టుగా రాజస్తాన్ ఆల్టైమ్ రికార్డు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2024 KKR VS LSG: కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన రమణ్దీప్ సింగ్
లక్నో సూపర్ జెయింట్స్తో ఇవాళ (ఏప్రిల్ 14) జరుగుతున్న మ్యాచ్లో కేకేఆర్ ఆటగాడు రమణ్దీప్ సింగ్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో దీపక్ హుడా (8) కొట్టిన షాట్ను రమణ్దీప్ డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ను అందుకున్నాడు. ఈ క్యాచ్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. Ramandeep Singh. 🦅pic.twitter.com/3mhPdFNAJc — Mufaddal Vohra (@mufaddal_vohra) April 14, 2024 కాగా, కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగింది. ఆచితూచి ఇన్నింగ్స్ ప్రారంభించిన లక్నో 13 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. డికాక్ (10), కేఎల్ రాహుల్ (39), దీపక్ హుడా (8), స్టోయినిస్ (10) ఔట్ కాగా.. బదోని (27), పూరన్ (2) క్రీజ్లో ఉన్నారు. స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రసెల్ తలో వికెట్ పడగొట్టారు. ప్రస్తుత సీజన్లో లక్నో హ్యాట్రిక్ విజయాలు సాధించి (5 మ్యాచ్ల్లో 3 విజయాలు) పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. 4 మ్యాచ్ల్లో 3 విజయాలతో కేకేఆర్ రెండో స్థానంలో ఉంది. హ్యాట్రిక్ విజయాల అనంతరం కేకేఆర్, లక్నో ఇటీవలే ఓ ఓటమిని ఎదుర్కొన్నాయి. కేకేఆర్ తమ చివరి మ్యాచ్లో సీఎస్కే చేతిలో ఓడగా.. లక్నో తాజాగా ఢిల్లీ చేతిలో పరాభవం ఎదుర్కొంది. హెడ్ టు హెడ్ ఫైట్ల విషయానికొస్తే.. ఈ ఇరు జట్లు ఇప్పటివరకు 3 మ్యాచ్ల్లో ఎదురెదురుపడగా.. మూడు సందర్భాల్లో లక్నోనే విజయం వరించింది. -
IPL 2024: కోట్లు పెట్టినా పేలని పేస్ గన్.. 20 లక్షలకే పేట్రేగిపోతున్న యువ సంచలనం
ఐపీఎల్ 2024 వేలంలో అత్యధిక ధర (24.75 కోట్లతో కేకేఆర్ సొంతం చేసుకుంది) పలికి, లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కిన ఆసీస్ పేస్ గన్ మిచెల్ స్టార్క్.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పేలవ ప్రదర్శనలతో నిరాశపరుస్తున్నాడు. భారీ అంచనాల నడుమ ఈ సీజన్ బరిలోకి దిగిన స్టార్క్ ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్ల్లో ఒక్క వికెట్ కూడా తీయకుండా ఏకంగా 100 పరుగులు సమర్పించుకున్నాడు. సన్రైజర్స్తో జరిగిన తొలి మ్యాచ్లో 4 ఓవర్లలో 53 పరుగులిచ్చిన స్టార్క్.. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో 4 ఓవర్లు బౌల్ చేసి 47 పరుగులు సమర్పించుకున్నాడు. జట్టులోని కుర్ర బౌలర్లు సత్తా చాటుతుంటే కోట్లు కుమ్మరించి కొనుక్కున స్టార్క్ తేలిపోతుండటంతో కేకేఆర్ యాజమాన్యం అసంతృప్తిగా ఉంది. స్టార్క్తో పాటు కేకేఆర్ బౌలింగ్ అటాక్ను ప్రారంభిస్తున్న 22 ఏళ్ల యువ పేసర్ హర్షిత్ రాణా సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో 3 వికెట్లు, ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో 2 వికెట్లు తీసి ఔరా అనిపిస్తే.. స్టార్క్ మాత్రం తనపై పెట్టిన డబ్బుకు కనీస న్యాయం కూడా చేయలేక ఉసూరుమనిపిస్తున్నాడు. స్టార్క్పై పెట్టిన పెట్టుబడిలో కనీసం ఒకటో వంతు (20 లక్షలు) కూడా లభించని రాణా ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంటే.. స్టార్క్ మాత్రం కోట్లు జేబులో వేసుకుని దిక్కులు చూస్తున్నాడు. మరో పక్క తన సహచరుడు, సన్రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ తనపై పెట్టుకున్న అంచనాలకు న్యాయం చేస్తుంటే స్టార్క్ మాత్రం కేకేఆర్ అభిమానులకు, యాజమాన్యానికి గుండు సున్నా చూపిస్తున్నాడు. తొలి రెండు మ్యాచ్ల్లో కేకేఆర్ ఎలాగోలా గెలిచింది కాబట్టి సరిపోయింది. లేకుంటే స్టార్క్పై విమర్శల పర్వం మొదలయ్యేది. ఇప్పటికైనా స్టార్క్ మొద్దు నిద్రను వీడి రాణించాలని కేకేఆర్ అభిమానులు కోరుకుంటున్నారు. కాగా, ప్రస్తుత సీజన్లో కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. కేకేఆర్.. ఏప్రిల్ 3న జరిగే తమ తదుపరి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. నేటి మ్యాచ్ల విషయానికొస్తే.. ఇవాళ డబుల్ హెడర్ మ్యాచ్లు జరుగనున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్లో గుజరాత్ తమ సొంత మైదానంలో సన్రైజర్స్ను ఎదుర్కోనుండగా.. విశాఖలో జరిగే రాత్రి మ్యాచ్లో ఢిల్లీ, సీఎస్కే జట్లు తలడనున్నాయి. -
రూ. 24.75 కోట్లు.. మరీ ఇంత చెత్త ప్రదర్శనా?
ఐపీఎల్-2024.. మినీ వేలంలో ఏకంగా రూ. 24.75 కోట్లకు అమ్ముడుపోయిన క్రికెటర్. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు. మరి ఆడిన రెండు మ్యాచ్లలో అతడి గణాంకాలు ఎలా ఉన్నాయి?!.. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఐపీఎల్లో పునరాగమనం చేశాడు ఆస్ట్రేలియా స్టార్ మిచెల్ స్టార్క్. వన్డే వరల్డ్కప్-2023లో సత్తా చాటిన ఈ సీనియర్ పేసర్ కోసం వేలంలో ఫ్రాంఛైజీలన్నీ పోటీ పడితే.. కోల్కతా నైట్ రైడర్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. ఒక్క వికెట్ కూడా తీయలేదు కానీ ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్లలో స్టార్క్ వల్ల జట్టుకు చేకూరిన ప్రయోజనం శూన్యం. ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ లో కేకేఆర్ తమ తొలి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడిన విషయం తెలిసిందే. సొంతమైదానం ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఈ మ్యాచ్లో కేకేఆర్ అదృష్టవశాత్తూ.. నాలుగు పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. అందుకే స్టార్క్ పేలవ ప్రదర్శన పెద్దగా హైలైట్ కాలేదు. చెత్త గణాంకాల వల్ల విమర్శలు నిజానికి ఈ మ్యాచ్లో మిచెల్ స్టార్క్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి ఏకంగా 53 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. 22 ఏళ్ల పేసర్ హర్షిత్ రాణా(4/33) విజయవంతమైన చోట ఈ లెఫ్టార్మ్ పేసర్ పూర్తిగా తేలిపోయాడు. తదుపరి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లోనూ చెత్త ప్రదర్శన పునరావృతం చేశాడు స్టార్క్. నాలుగ ఓవర్ల బౌలింగ్లో 47 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. ఫలితంగా.. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్లలో కలిపి 8-0-100-0 గణాంకాలు నమోదు చేసి విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. కమిన్స్ మాత్రం మెరుగ్గానే మరోవైపు.. రూ. 20.50 కోట్లకు అమ్ముడై సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. తొలి మ్యాచ్లో 1/32, మలి మ్యాచ్లో 2/35 గణాంకాలతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్గా ఓ మ్యాచ్లోనూ జట్టును గెలిపించాడు. బీరు కంటే ఎక్కువే ఇదిలా ఉంటే.. స్టార్క్ ప్రదర్శనను ఐస్ల్యాండ్ క్రికెట్ దారుణంగా ట్రోల్ చేసింది. ఐపీఎల్-2024లో ఇప్పటి వరకు స్టార్క్ బౌలింగ్ గణాంకాలు.. తమ దేశంలో బీర్ కంటే కూడా ఖరీదుగా ఉన్నాయని వ్యంగ్యస్త్రాలు సంధించింది. కాగా యూరోపియన్ దేశం ఐస్ల్యాండ్లో బీర్ ధరలు.. మిగతా దేశాలతో పోలిస్తే ఎక్కువగానే ఉంటాయనే ప్రచారం ఉంది. చదవండి: మాటల్లేవ్.. ఇన్నాళ్లూ ఎక్కడ దాక్కున్నావు! స్మిత్కు వార్నింగ్ ఇచ్చేశా! -
RCB Vs KKR: విరాట్ కోహ్లి విధ్వంసం.. 4 ఫోర్లు, 4 సిక్స్లతో! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో విరాట్ కోహ్లి సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో మ్యాచ్లో కోహ్లి విధ్వంసం సృష్టించాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికి కింగ్ కోహ్లి మాత్రం అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేకేఆర్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఓపెనర్గా వచ్చి నాటౌట్గా నిలిచి తన జట్టుకు మంచి స్కోర్ అందించాడు. 58 బంతులు ఎదుర్కొన్న 4 ఫోర్లు, 4 సిక్స్లతో 83 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో సూపర్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్ధానానికి చేరుకున్నాడు. ఓవరాల్గా ఇప్పటివరకు 3 మ్యాచ్లు ఆడిన కోహ్లి 90.50 సగటుతో 181 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో కోహ్లితో పాటు గ్రీన్(33), కార్తీక్(20) పరుగులతో రాణించాడు. King Kohli in his Kingdom! 🥵🤌#RCBvsKKR pic.twitter.com/c8kgfXdWHS — OneCricket (@OneCricketApp) March 29, 2024 -
IPL 2024: 24 కోట్ల బౌలర్కు చుక్కలు చూపించిన క్లాసెన్..
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడు పోయిన ఆసీస్ స్టార్ పేసర్, కోల్కతా నైట్ రైడర్స్ ప్రీమియర్ బౌలర్ మిచెల్ స్టార్క్కు సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు చుక్కలు చూపించారు. ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో స్టార్క్ను ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ఓ ఆట ఆడేసికున్నారు. ముఖ్యంగా సన్రైజర్స్ స్టార్ హెన్రిస్ క్లాసెన్ అయితే స్టార్క్ను ఊచకోత కోశాడు. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ 19 ఓవర్ వేసిన స్టార్క్ ఏకంగా 26 పరుగులు సమర్పించకున్నాడు. ఆ ఓవర్లో మొత్తం నాలుగు సిక్స్లు బాదారు. అందులో క్లాసెన్ 3 సిక్స్లు కొట్టగా.. షబాజ్ అహ్మద్ ఓ సిక్స్ బాదాడు. ఈ మ్యాచ్లో స్టార్క్ తన నాలుగు ఓవర్ల కోటాలో వికెట్ ఏమీ తీయకుండా ఏకంగా 53 పరుగులు సమర్పించుకున్నాడు. కాగా ఐపీఎల్-2024 మినీ వేలంలో రూ.24.75 కోట్ల భారీ ధరకు స్టార్క్ను కేకేఆర్ కొనుగోలు చేసింది. ఈ క్రమంలో దారుణ ప్రదర్శన కనబరిచిన స్టార్క్ను నెటిజన్లు దారుణంగా విఫలమవుతున్నారు. తన కంటే రూ.20 లక్షల తీసుకున్న హర్షిత్ రానా ఎంతో బెటర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్లో రానా మూడు వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా ఆఖరి ఓవర్లో అద్బుతంగా బౌలింగ్ చేసి తన జట్టుకు విజయాన్ని అందిచాడు. ఈ మ్యాచ్లో 4 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. హెన్రిస్ క్లాసెన్ 63 పరుగులతో విరోచిత పోరాటం చేసినప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు. -
రూ. 24.75 కోట్ల ఆటగాడు... ఎన్ని వికెట్లు తీస్తాడంటే?!
ఐపీఎల్-2024 సందడి మొదలైపోయింది. పొట్టి ఫార్మాట్లోని మజాను అందించేందుకు ఆటగాళ్లు.. ఆస్వాదించేందుకు అభిమానులూ సిద్ధమైపోయారు. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్తో శుక్రవారం (మార్చి 22) ఈవెంట్కు తెరలేవనుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, ఐపీఎల్ కామెంటేటర్ స్టీవ్ స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సహచర ఆటగాడు మిచెల్ స్టార్క్ ఐపీఎల్-2024లో కచ్చితంగా సత్తా చాటుతాడంటూ.. తాజా ఎడిషన్లో ఎన్ని వికెట్లు తీయగలడో అంచనా వేశాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023లో అదరగొట్టిన మిచెల్ స్టార్క్ దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత క్యాష్ రిచ్ లీగ్లో పునరాగమనం చేయనున్నాడు. వేలంలో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ అతడి కోసం పోటీ పడి ఏకంగా రూ. 24.75 కోట్లు ఖర్చు చేసింది. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా ఈ పేస్ బౌలర్ నిలిచాడు. దీంతో మిచెల్ స్టార్క్పై అంచనాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈఎస్ఎపీఎన్క్రిక్ఇన్ఫో షోలో మాట్లాడిన ఆసీస్ మాజీ సారథి స్టీవ్ స్మిత్కు స్టార్క్ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘నాకు తెలిసి అతడు కొత్త బంతితో కచ్చితంగా మ్యాజిక్ చేయగలడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అతడే బౌలింగ్ చేస్తాడు కాబట్టి వికెట్లు తీసే అవకాశం ఉంటుంది. ఈసారి స్టార్క్ 30 వికెట్లు తీస్తాడని అనుకుంటున్నా’’ అని స్మిత్ అంచనా వేశాడు. కాగా ఐపీఎల్లో ఒక ఎడిషన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా డ్వేన్ బ్రావో, హర్షల్ పటేల్ సంయుక్త రికార్డు సాధించారు. 2013లో సీఎస్కే తరఫున బ్రావో.. 2021లో ఆర్సీబీ తరఫున హర్షల్ పటేల్ 32 వికెట్లు తీశారు. 2020లో ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడిన సౌతాఫ్రికా స్టార్ కగిసో రబడ 30 వికెట్లతొ రెండోస్థానాన్ని ఆక్రమించాడు. ఇదిలా ఉంటే కేకేఆర్ తాజా సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్తో మార్చి 23న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. -
IPL 2024: కేకేఆర్ క్యాంప్లో జోష్ నింపుతున్న మిచెల్ స్టార్క్
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు మిచెల్ స్టార్క్ కోల్కతా నైట్రైడర్స్ క్యాంప్లో కొత్త జోష్ నింపుతున్నాడు. ఐపీఎల్ 2024 ప్రారంభానికి మరి కొద్ది గంటల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో అన్ని జట్లతో పాటు కేకేఆర్ కూడా ప్రాక్టీస ముమ్మరం చేసింది. కేకేఆర్ విషయానికొస్తే.. స్టార్క్ ఆ జట్టుకు తరుపుముక్కగా పరిగణించబడుతున్నాడు. ప్రాక్టీస్ సెషన్స్లో స్టార్క్ పేట్రేగిపోతున్నాడు. Mitchell Starc in Purple😍pic.twitter.com/yBDau2M436 — CricTracker (@Cricketracker) March 20, 2024 నిప్పులు చెరిగే బంతుల సంధిస్తూ సహచరులను తెగ ఇబ్బంది పెడుతున్నాడు. తాజాగా స్టార్క్ సహచర ఆటగాడిని ఎల్బీడబ్ల్యూ చేసే వీడియో ఒకటి నెట్టింట వైరలవుతుంది. ఇందులో స్టార్క్ మెరుపు వేగంతో బంతిని సంధిస్తూ కనిపించాడు. సహజంగానే మెరుపు వీరుడిగా పేరున్న స్టార్క్ ఇంత భారీ మొత్తం తనపై పెట్టుబడి పెట్టడంతో ఇంకాస్త విజృంభించే అవకాశం ఉంది. Pure cinema! 🤌 pic.twitter.com/u1vR0Wvq2r — KolkataKnightRiders (@KKRiders) March 19, 2024 కేకేఆర్ యాజమాన్యం స్టార్క్పై భారీ ఆశలు పెట్టుకుంది. గంభీర్ మెంటార్షిప్లో కేకేఆర్ కొత్త రక్తంతో ఉరకేలుస్తుంది. ఈసారి ఎలాగైనా మూడో ఐపీఎల్ టైటిల్ సాధించాలని ఆ జట్టు యాజమాన్యం కంకణం కట్టుకు కూర్చుంది. ఐపీఎల్ 2024 వేలంలో కేకేఆర్ స్టార్క్ను 24.75 కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. All about the 𝐊𝐧𝐢𝐠𝐡𝐭 kind of hustle! 🔥 pic.twitter.com/9aJNIpJUtN — KolkataKnightRiders (@KKRiders) March 20, 2024 ఇదిలా ఉంటే, ఐపీఎల్ 17వ ఎడిషన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా జరిగే సీజన్ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్.. ఆర్సీబీతో తలపడుతుంది. కేకేఆర్ తమ తొలి మ్యాచ్ను మార్చి 23న ఆడనుంది. ఈడెన్ గార్డెన్స్లో జరిగే ఈ మ్యాచ్లో కేకేఆర్.. ఆరెంజ్ ఆర్మీను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. తొలి విడదలో ప్రకటించిన షెడ్యూల్ వరకు కేకేఆర్ మార్చి 29, ఏప్రిల్ 3న మరో రెండు మ్యాచ్లు ఆడనుంది. 29న జరిగే తొలి మ్యాచ్లో ఆర్సీబీతో (బెంగళూరు), 2న జరిగే మరో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో (విశాఖ) కేకేఆర్ తలపడనుంది. Chalo shuru karte hai! 🗓 pic.twitter.com/i2l0M9dP8x — KolkataKnightRiders (@KKRiders) February 22, 2024 కోల్కతా నైట్ రైడర్స్ పూర్తి జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, రింకూ సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్, ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, సుయాష్ శర్మ, అనుకూల్ రాయ్, ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, కేఎస్ భరత్, చేతన్ సకారియా, మిచెల్ స్టార్క్, అంగ్క్రిష్ రఘువంశీ, రమణదీప్ సింగ్, షెర్ఫానే రూథర్ఫోర్డ్, మనీష్ పాండే, ముజీబ్ ఉర్ రెహమాన్, దుష్మంత చమీరా, సాకిబ్ హుస్సేన్. గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్ళు: జాసన్ రాయ్, గుస్ అట్కిన్సన్. -
స్టార్క్ బౌలింగ్లో భారీ సిక్సర్ బాదిన రింకూ! మెరుపు ఇన్నింగ్స్
కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఐపీఎల్-2024 సన్నాహకాల్లో తలమునకలైంది. కేకేఆర్ ఆటగాళ్లు రెండు జట్లుగా విడిపోయి ఇంట్రా- స్వ్కాడ్ మ్యాచ్తో బిజీబిజీగా గడిపారు. మెగా టోర్నీ ఆరంభానికి ముందు ప్రాక్టీస్ మ్యాచ్లో చెమటోడ్చారు. ఇక ఈ మ్యాచ్లో కేకేఆర్ స్టార్, టీమిండియా నయా ఫినిషర్ రింకూ సింగ్, ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడైన ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ మధ్య పోరు హైలైట్గా నిలిచింది. సన్నాహకాల్లో భాగంగా టీమ్ పర్పుల్, టీమ్ గోల్డ్గా విడిపోయిన కేకేఆర్ ఈడెన్ గార్డెన్స్ మైదానంలో మంగళవారం ప్రాక్టీస్ చేసింది. పర్పుల్కు స్టార్క్ సారథ్యం వహించగా.. టీమ్ గోల్డ్లో ఉన్న రింకూ సింగ్ అతడికి చుక్కలు చూపించాడు. వరల్డ్క్లాస్ పేసర్ అయిన స్టార్క్ బౌలింగ్లో రింకూ భారీ సిక్సర్ బాదాడు. కళ్లు చెదిరే రీతిలో మిడ్ వికెట్ మీదుగా సిక్స్ కొట్టి సత్తా చాటాడు. అంతేకాదు స్టార్క్ బౌలింగ్లో బాగానే పరుగులు పిండుకున్నాడు. Rinku Singh smashed a SIX to Mitchell Starc 🍿💥 This is Cinema!! pic.twitter.com/zQNhfPrqSR — कट्टर KKR समर्थक 🦁🇮🇳 ™ (@KKRWeRule) March 19, 2024 ఇక ఈ మ్యాచ్లో స్టార్క్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 40 పరుగులు సమర్పించుకుని ఒక వికెట్ మాత్రమే తీయగలిగాడు. మరోవైపు.. రింకూ సింగ్ 16 బంతుల్లోనే 37 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అదే విధంగా కేకేఆర్లో జేసన్ రాయ్ స్థానాన్ని భర్తీ చేస్తూ కొత్తగా వచ్చిన ఫిల్ సాల్ట్ 41 బంతులు ఎదుర్కొని 78 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఇక వైస్ కెప్టెన్ నితీశ్ రాణా 30 బంతుల్లో 50 పరుగులతో రాణించగా... మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 40 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. అయితే, ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో ఎట్టకేలకు టీమ్ పర్పుల్ విజయం సాధించింది. Starc⚡ vs Russell 💪?! Join #KnightLIVE to witness thrilling Practice Match https://t.co/0Z8XOaYXxE — KolkataKnightRiders (@KKRiders) March 19, 2024 కాగా వన్డే వరల్డ్కప్-2023లో అదరగొట్టిన ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కోసం కేకేఆర్ కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా రూ. 24.75 కోట్లు ఖర్చు పెట్టిన విషయం తెలిసిందే. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత అతడు ఐపీఎల్లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక ఐపీఎల్-2024లో కేకేఆర్ సన్రైజర్స్తో మార్చి 23న తొలి మ్యాచ్ ఆడనుంది. -
భర్త అడుగుజాడల్లో భార్య.. స్టార్క్ దంపతులకు విచిత్ర అనుభవం
భర్త అడుగుజాడల్లో భార్య అనే నానుడును నిజజీవితంలో మనం తరుచూ వింటుంటాం. ఈ మాటను క్రీడాజీవితంలో ఫాలో అయ్యి చూపించింది ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ అలైసా హీలీ. ఆస్ట్రేలియా పురుషుల జట్టు స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ భార్య అయిన హీలీ.. ప్రస్తుతం ఆస్ట్రేలియా మహిళల టెస్ట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తుంది. హీలీ క్రికెట్కు సంబంధించిన ఓ విషయంలో భర్త స్టార్క్ అడుగుజాడల్లో నడిచింది. యాదృచ్చికంగా చోటు చేసుకున్న ఈ సందర్భం ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఏం జరిగిందంటే.. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ 2013లో భారత్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 99 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఈ మ్యాచ్ స్టార్క్ కెరీర్లో తొమ్మిదవది. యాదృచ్చికంగా స్టార్క్ భార్య అలైసా హీలీ కూడా తన తొమ్మిదవ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 99 పరుగుల వద్దనే ఔటైంది. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో హీలీ తృటిలో సెంచరీ చేజార్చుకుని బాధతో పెవిలియన్కు చేరింది. అయితే తాను భర్త అడుగుజాడల్లోనే నడుస్తున్నానన్న విషయం హీలీకి తెలియకపోయి ఉండవచ్చు. తొమ్మిదో టెస్ట్లో భార్యా భర్తలు 99 పరుగుల వద్ద ఔట్ కావడం ఆసక్తికరంగా మారింది. కాగా, సౌతాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్ట్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్లో లిచ్ఫీల్డ్ (4), ఎల్లిస్ పెర్రీ (3), తమిళ మెక్గ్రాత్ (0) తక్కువ స్కోర్లకే వెనుదిరగగా.. బెత్ మూనీ (78), అలైసా హీలీ (99), సథర్ల్యాండ్ (54 నాటౌట్) అర్దసెంచరీలు చేసి ఆసీస్ను ఆదుకున్నారు. సౌతాఫ్రికా మహిళల జట్టుకు ఇది తొలి టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం. -
అతడే కాదు.. అసలు ఎవరికీ ఆ అర్హత లేదు: టీమిండియా దిగ్గజం
IPL 2024- KKR: ఐపీఎల్ వేలం-2024లో కోల్కతా నైట్ రైడర్స్ అవలంబించిన వ్యూహాన్ని టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ విమర్శించాడు. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ కోసం కేకేఆర్ ఏకంగా 24 కోట్లు వెచ్చించడం అతిశయోక్తిగా అనిపించిందన్నాడు. ఏ క్రికెటర్ కూడా అంత మొత్తం అందుకునేందుకు అర్హుడు కాదని తాను భావిస్తున్నట్లు గావస్కర్ పేర్కొన్నాడు. కాగా దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత స్టార్క్ క్యాష్ రిచ్ లీగ్లో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఏకంగా రూ. 24.75 కోట్లు భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్-2023లో సత్తా చాటిన ఈ పేస్ బౌలర్ కోసం మినీ వేలంలో ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. ఈ క్రమంలో స్టార్క్ కోసం గుజరాత్ టైటాన్స్తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైన కేకేఆర్.. ఏకంగా రూ. 24.75 కోట్లు చెల్లించి అతడిని సొంతం చేసుకుంది. తద్వారా ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా మిచెల్ స్టార్క్ పాత రికార్డులన్నీ బద్దలుకొట్టాడు. ఈ విషయం గురించి సునిల్ గావస్కర్ తాజాగా స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడాడు. ‘‘నాకైతే నిజంగా ఇది అతిశయోక్తి అనిపించింది. అతడే కాదు.. అసలు ఎవరికీ ఆ అర్హత లేదు నాకు తెలిసి ఏ క్రికెటర్కు కూడా అంత భారీ మొత్తం అందుకోగల అర్హత లేదు. ఒకవేళ తాను ఆడే 14 మ్యాచ్లలో స్టార్క్ కనీసం నాలుగింటిలోనైనా ప్రభావం చూపితే.. ఆ డబ్బుకు కాస్తైనా న్యాయం చేసినట్లు అవుతుంది. మిగతా మ్యాచ్లలోనూ రాణించగలిగితే అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వంటి జట్లలో మేటి బ్యాటర్లు ఉన్నారు. ఈ జట్లపై స్టార్క్ బంతితో ప్రభావం చూపితే మాత్రం ఫ్రాంఛైజీ తన కోసం వెచ్చించిన మొత్తానికి న్యాయం చేసినవాడవుతాడు’’ అని సునిల్ గావస్కర్ వ్యాఖ్యానించాడు. తొలుత ఆర్సీబీకి ఆడాడు కాగా 2014, 2015 సీజన్లలో ఆర్సీబీకి ఆడిన స్టార్క్.. 2018లో కేకేఆర్కు మారాడు. అప్పుడు కేకేఆర్ అతడి కోసం రూ. 9.40 కోట్లు ఖర్చు చేయగా.. గాయం కారణంగా ఆడలేకపోయాడు. ఇక వన్డే వరల్డ్కప్-2023లో మిచెల్ స్టార్క్ మొత్తంగా ఆడిన 10 మ్యాచ్లలో 16 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఆసీస్ ఆరోసారి ప్రపంచ చాంపియన్గా నిలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. చదవండి: Ravindra Jadeja: మా కోడలి వల్లే ఇదంతా... మండిపడ్డ రివాబా! -
కమిన్స్ దెబ్బ.. రెండో టెస్టులోనూ పాక్ చిత్తు.. సిరీస్ ఆస్ట్రేలియాదే
Australia vs Pakistan, 2nd Test : పాకిస్తాన్తో రెండో టెస్టులోనూ ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఆఖరి మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. బాబర్ ఆజం స్థానంలో టెస్టు జట్టు పగ్గాలు చేపట్టిన షాన్ మసూద్ సారథ్యంలో పాకిస్తాన్ తొలిసారి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఇరు జట్ల మధ్య డిసెంబరు 14న మొదలైన తొలి టెస్టులో ఆతిథ్య ఆసీస్ ఏకంగా 360 పరుగుల తేడాతో పాక్ను చిత్తు చేసింది. ఈ క్రమంలో రెండో టెస్టులోనైనా గెలిచి నిలవాలని పాక్ భావించింది. బాక్సింగ్ డే టెస్టులో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్లో కంగారూ జట్టును 318 పరుగులకు కట్టడి చేయగలిగింది పాక్. కానీ బ్యాటర్ల వైఫల్యం కారణంగా 264 పరుగులకే షాన్ మసూద్ బృందం ఆలౌట్ కావడంతో.. ఆసీస్కు 54 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాకు పాక్ ఆరంభంలోనే షాకిచ్చింది. పేసర్లు షాహిన్ ఆఫ్రిది, మీర్ హంజా దెబ్బకు టాపార్డర్ కుప్పకూలిపోయింది. 16 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆసీస్ ఇబ్బందుల్లో పడింది. Mitch Marsh hangs on at third man! Whatta catch! #AUSvPAK pic.twitter.com/BFC1LBXjeK — cricket.com.au (@cricketcomau) December 29, 2023 ఇలాంటి క్లిష్ట దశలో మిచెల్ మార్ష్ (96; 13 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (50; 3 ఫోర్లు) అర్ధ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు కలిసి ఐదో వికెట్కు 153 పరుగులు జోడించి ఆసీస్ను నిలబెట్టారు. ఈ క్రమంలో.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 62.3 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో ఓవరాల్గా 241 పరుగుల ఆధిక్యంతో నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన ఆస్ట్రేలియా 262 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ ముగించింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ను ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్ బెంబేలెత్తించాడు. ఐదు వికెట్లతో చెలరేగి పాక్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. మరో పేసర్ మిచెల్ స్టార్క్ కూడా తనదైన శైలిలో రాణించడంతో పాకిస్తాన్ 237 పరుగులకే చాపచుట్టేసింది. షాన్ మసూద్ కెప్టెన్ ఇన్నింగ్స్(71 బంతుల్లో 60 పరుగులు), ఆగా సల్మాన్ అర్ధ శతకం(50)తో రాణించినా ఫలితం లేకుండా పోయింది. 79 పరుగుల తేడాతో ఆసీస్ చేతిలో ఓటమి పాలు కాగా నాలుగో రోజే ఆట ముగిసిపోయింది. ఇక పాక్ రెండో ఇన్నింగ్స్లో స్టార్క్ నాలుగు, జోష్ హాజిల్వుడ్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ప్యాట్ కమిన్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మధ్య నామమాత్రపు ఆఖరి టెస్టు బుధవారం (జనవరి 3) నుంచి ప్రారంభం కానుంది. కాగా ఆస్ట్రేలియాలో పాక్ ఇంత వరకు ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ గెలవలేదన్న విషయం తెలిసిందే. 1995లో చివరగా కంగారూ గడ్డపై టెస్టు మ్యాచ్ గెలిచింది. తాజా పరాజయంతో 1999 పర్యటన నుంచి ఆ జట్టు వరుసగా 16 టెస్టుల్లో ఓడింది. THE AUSSIES GET IT DONE! 🔥 📺 Watch Day 4 #AUSvPAK on Fox Cricket and Kayo Sports: https://t.co/VNpf5Xojhg ✍ BLOG: https://t.co/physFvdl0W 🔢 MATCH CENTRE: https://t.co/v8I8vaM89H pic.twitter.com/D8dCwItqhb — Fox Cricket (@FoxCricket) December 29, 2023 -
వాళ్లిద్దరికి అంత మొత్తమా? ముంబై మాత్రం తెలివిగా రూ. 15 కోట్లకే: ఏబీడీ
ఐపీఎల్ వేలం-2024 వేలంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తెలివిగా వ్యవహరించాయని సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ అన్నాడు. అదే సమయంలో సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ మాత్రం ఆస్ట్రేలియా క్రికెటర్ల కోసం భారీ మొత్తం వెచ్చించడం సరికాదని అభిప్రాయపడ్డాడు. ఈసారి వేలంలో ఫాస్ట్ బౌలర్లకు డిమాండ్ ఉన్న వాస్తవమే అయినా.. మరీ ఈ స్థాయిలో రూ. 20 కోట్లకు పైగా ఖర్చుచేస్తారని ఊహించలేదన్నాడు. కాగా దుబాయ్ వేదికగా మంగళవారం జరిగిన ఆక్షన్లో ఆసీస్ పేసర్లు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ రికార్డు స్థాయి ధర పలికిన విషయం తెలిసిందే. కమిన్స్ను సన్రైజర్స్ రూ. 20.50 కోట్లకు కొనుగోలు చేయగా.. స్టార్క్ కోసం కేకేఆర్ ఏకంగా రూ. 24.75 కోట్లు ఖర్చు చేసింది. దీంతో క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే వీరిద్దరు అత్యధిక ధర పలికిన ఆటగాళ్లుగా నిలిచారు. ఈ నేపథ్యంలో తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఏబీ డివిలియర్స్కు ఈ విషయం గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందిస్తూ.. ‘‘ఈసారి వేలంలో కొన్ని ఫ్రాంఛైజీలు స్మార్ట్గా వ్యవహరించాయి. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ భావోద్వేగాలకు తావులేకుండా తెలివిగా కొనుగోళ్లు చేశాయి. నిజానికి కమిన్స్, స్టార్క్ అద్భుతమైన ఆటగాళ్లే! అయితే, వాళ్ల కోసం అంత భారీ మొత్తం వెచ్చించాలా? అంటే అవసరం లేదనే చెప్పవచ్చు. ఫాస్ట్ బౌలర్లకు ఈసారి వేలంలో డిమాండ్ ఉన్న మాట నిజమే! అందుకే ధరలు అమాంతం పెరిగిపోయాయి. అయితే, ముందుగా చెప్పినట్లు ముంబై ఇండియన్స్ తెలివిగా ఆటగాళ్లను కొనుగోలు చేసింది. నువాన్ తుషార, దిల్షాన్ మధుషాంక అద్భుతమైన క్రికెటర్లు. ఇక మహ్మద్ నబీ, శ్రేయస్ గోపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచి ధరకే వాళ్లిద్దరు ముంబైకి లభించారు. ముఖ్యంగా.. కొయెట్జీ, మధుషాంక, తుషారలను కలిపి 15 కోట్ల రూపాయలకే సొంతం చేసుకోవడం నాకు నచ్చింది’’ అని డివిలియర్స్ పేర్కొన్నాడు. కాగా పేస్త్రయం గెరాల్డ్ కొయెట్జీని రూ. 5 కోట్లు, దిల్షాన్ మధుషాంకను రూ. 4.5 కోట్లు, నువాన్ తుషారను రూ. 4.8 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. ఇక నబీ కోసం రూ. 1.5 కోట్లు, గోపాల్ కోసం రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది. వీరితో పాటు నామన్ ధిర్ను రూ. 20 లక్షలు, అన్షూల్ కాంబోజ్ను రూ. 20 లక్షలు, శైవిక్ శర్మను రూ. 20 లక్షలకు ఐపీఎల్-2024 వేలంలో ముంబై కొనుగోలు చేసింది. -
రూ.24.75 కోట్లు! అస్సలు ఊహించలేదు.. షాక్కు గురయ్యాను: స్టార్క్
ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్-2024 వేలంలో స్టార్క్ను రూ.24.75 కోట్ల భారీ ధరకు కోల్కతా నైట్రైడర్స్ సొంతం చేసుకుంది. ఈ ఆసీస్ పేసర్ కోసం ఢిల్లీ, ముంబై,గుజరాత్,కోల్కతా తీవ్రంగా పోటీ పడ్డాయి. కానీ చివరి వరకు ఎక్కడ తగ్గని కేకేఆర్.. ఈ యార్కర్ల కింగ్ను దక్కించుకుంది. అంతకంటే ముందు ఇదే వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న ప్యాట్ కమ్మిన్స్(రూ.20.50 కోట్లు) రికార్డును స్టార్క్ బ్రేక్ చేశాడు. ఇక ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర దక్కడంపై స్టార్క్ స్పందించాడు. "నిజంగానే షాక్కు గురయ్యాను. ఇంత మొత్తాన్ని అసలు ఊహించలేదు. ఎనిమిదేళ్ల తర్వాత ప్రపంచంలోని అత్యుత్తమ టీ20 లీగ్లో మళ్లీ ఆడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా. ఇప్పుడు విలువ పెరిగినా నా ఆటతీరు ఎప్పుడూ మారలేదు. భారీ మొత్తం కాబట్టి ఒత్తిడి సహజమే అయినా... నాకున్న అనుభవంతో మంచి ఫలితాలు సాధిస్తాననే నమ్మకం ఉందని" స్టార్ స్పోర్ట్స్తో స్టార్క్ పేర్కొన్నాడు. కాగా మిచెల్ స్టార్క్ గతంలో ఐపీఎల్లో ఆడిన అనుభవం పెద్దగా లేదు. అతడు కేవలం రెండు సార్లు మాత్రమే ఈ క్యాష్ రిచ్ లీగ్లో ఆడాడు. 2014, 15 సీజన్లలో ఆర్సీబీ తరపున స్టార్క్ ప్రాతినిథ్యం వహించాడు. 27 మ్యాచ్లలో 7.16 ఎకానమీతో 34 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత వేర్వేరు కారణాలతో అతను ఎనిమిది సీజన్ల పాటు లీగ్కు దూరంగా ఉన్నాడు. 2018లో కోల్కతా అతడిని ఎంచుకున్నా... గాయంతో టోర్నీకి ముందే తప్పుకున్నాడు. చదవండి: ENG vs WI: ఇదేమి విధ్వంసం.. ఏకంగా 267 పరుగులు! పాపం విండీస్ -
నీకు రూ. 20.50 కోట్లు... నాకు రూ. 24.75 కోట్లు
ఐపీఎల్ వేలం షురూ... ముందుగా బ్యాటర్ల జాబితా... అది ముగిసిన తర్వాత రెండో సెట్ క్యాప్డ్ బౌలర్ల జాబితా ముందుకు వచ్చింది... నాలుగో ఆటగాడిగా ప్యాట్ కమిన్స్ పేరు వినిపించింది... రూ.2 కోట్ల కనీస విలువతో వేలం మొదలైంది... చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ముందుగా పోటీ పడగా, ఆపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వచ్చి చేరింది. రూ.7.80 కోట్ల వద్ద సన్రైజర్స్ బరిలోకి దిగింది.. ఆపై మిగతా జట్లు తప్పుకోగా... రైజర్స్, ఆర్సీబీ మాత్రమే వేలం మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్లాయి... రూ.20.25 కోట్ల వద్ద రెండు టీమ్లు ఆగాయి... దానికి మరో రూ.25 లక్షలు సన్రైజర్స్ జోడించాక బెంగళూరు స్పందించలేదు. రూ.20.50 కోట్లతో కమిన్స్ హైదరాబాద్ చెంత చేరడంతో ఐపీఎల్లో కొత్త రికార్డు నమోదైంది. కానీ సినిమా అంతటితో ముగిసిపోలేదు... గంట సేపటి తర్వాత మిచెల్ స్టార్క్ పేరు వేలంలోకి వచ్చింది... ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ మొదలు పెట్టింది. ఆపై ముంబై, కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) సీన్లోకి వచ్చేశాయి. కోల్కతా, గుజరాత్ టైటాన్స్ పోటీ పడి స్టార్క్ విలువను రూ.20 కోట్లు దాటించేశాయి... అయినా ఇరు జట్లు వెనక్కి తగ్గలేదు. ఆసీస్ పేసర్ కోసం పోటీని కొనసాగించాయి... మరింత వేగంగా ఈ మొత్తం రూ.24.50 కోట్లకు చేరింది... ఈ దశలో కోల్కతా మరో అడుగు ముందుకేసింది... గుజరాత్ ఇక చాలనుకుకోవడంతో రూ.24.75 కోట్లతో స్టార్క్ తన సహచరుడు కమిన్స్ రికార్డును కొద్ది సేపటికే బద్దలు కొట్టేశాడు. ఇద్దరు స్టార్ ఆసీస్ పేసర్లు కలిసి ఐపీఎల్ ద్వారా రూ. 45.25 కోట్లతో పండగ చేసుకున్నారు! ఐపీఎల్ వేలం ఎప్పటిలాగే అంచనాలకు భిన్నంగా ఊహించని రీతిలో సాగింది. పేరుకే మినీ వేలం అయినా ఆటగాళ్లకు లభించిన మొత్తాలు మెగా వేలంలా అనిపించాయి. పెద్దగా గుర్తింపు లేని, టి20 ఫార్మాట్లో అంతగా అద్భుతాలు చూపించని ఆటగాళ్లపై కూడా కాసుల వాన కురవగా, ఇప్పటికే తమ ఆటతో సత్తా నిరూపించుకున్న కొందరికి ఆశ్చర్యకరంగా తక్కువ విలువే దక్కింది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రవిస్ హెడ్, న్యూజిలాండ్ ప్లేయర్ డరైల్ మిచెల్, విండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్, హరియాణా బౌలర్ హర్షల్ పటేల్ భారీ సొమ్మును తమ ఖాతాలో వేసుకోగా... అన్క్యాప్డ్ భారత ఆటగాడు సమీర్ రిజ్వీ (ఉత్తరప్రదేశ్), కుమార్ కుశాగ్ర (జార్ఖండ్) భారీ విలువ పలికి సంచలనం సృష్టించడం వేలంలో హైలైట్. 72 మంది ఆటగాళ్లతో... దుబాయ్: ఐపీఎల్–2024 కోసం మంగళవారం జరిగిన వేలం ముగిసింది. మొత్తం 332 మంది ఆటగాళ్లు వేలంలో అందుబాటులోకి రాగా... 10 ఫ్రాంచైజీలు కలిసి 72 మందిని ఎంచుకున్నాయి. ఇందులో 30 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. వేలంలో గరిష్టంగా 77 మందిని తీసుకునే అవకాశం ఉన్నా... కోల్కతాలో 2 ఖాళీలు, రాజస్తాన్లో 3 ఖాళీలు ఉండిపోయాయి. తొలిసారి విదేశీ గడ్డపై జరిగిన ఐపీఎల్ వేలంను మొదటిసారి ఓ మహిళ (మల్లిక సాగర్) నిర్వహించడం విశేషం. మధ్యాహ్నం 1 గంటకు మొదలైన వేలం స్వల్ప విరామాలతో రాత్రి 9 గంటల వరకు సాగింది. ఈ వేలం కోసం అన్ని ఫ్రాంచైజీలు కలిపి రూ.230 కోట్ల 45 లక్షలు వెచ్చించాయి. ఆసీస్ పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ రూ. 24.75 కోట్లతో కొత్త రికార్డు నెలకొల్పగా... 24 మంది క్రికెటర్లను కనీస విలువ రూ.20 లక్షలతో జట్లు సొంతం చేసుకున్నాయి. వచ్చే సీజన్ ఐపీఎల్ మార్చి 22 నుంచి మే 26 జరిగే అవకాశం ఉంది. ఐపీఎల్ వేలం విశేషాలు... ♦ విండీస్ ప్లేయర్ రావ్మన్ పావెల్ కోసం రాజస్తాన్ భారీ మొత్తం (రూ.7.40 కోట్లు) వెచ్చించింది. గతంలో ఢిల్లీ తరఫున ఏమాత్రం ప్రభావం చూపలేకపోయినా... కరీబియన్ ప్రీమియర్ లీగ్లో తమ జట్టు బార్బడోస్ రాయల్స్కు అతను కెపె్టన్ కావడమే ప్రధాన కారణం. ♦ హ్యారీ బ్రూక్ను చాలా తక్కువ మొత్తం (రూ.4 కోట్లు)కే ఢిల్లీ సొంతం చేసుకుంది. గత ఏడాది సన్రైజర్స్ బ్రూక్కు రూ. 13.25 కోట్లు ఇచ్చింది. ♦ బెంగళూరు తరఫున 3 సీజన్లలో ఆకట్టుకున్న లెగ్స్పిన్నర్ హసరంగను సన్రైజర్స్ చాలా తక్కువ మొత్తానికి (రూ. 1.50 కోట్లు) సొంతం చేసుకుంది. ♦ వన్డే వరల్డ్కప్లో చక్కటి ప్రదర్శన కనబర్చినా న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్రకు తక్కువ మొత్తమే (రూ.1.80కోట్లు) దక్కింది. అతని సహచరుడు డరైల్ మిచెల్ కోసం మాత్రం చెన్నై చాలా మొత్తం (రూ.14 కోట్లు) ఖర్చు చేసింది. ♦ ఫామ్ కోల్పోయి భారత జట్టులో స్థానం చేజార్చుకోవడంతో పాటు ఐపీఎల్లోనూ భారీగా పరుగులిస్తూ వచ్చిన హర్షల్ పటేల్ కోసం పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.11.75 కోట్లు వెచ్చించింది. ♦ విండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్ కోసం బెంగళూరు అనూహ్యంగా చాలా పెద్ద మొత్తం (రూ.11.50 కోట్లు) చెల్లించింది. ♦ ఒకే ఒక అంతర్జాతీయ వన్డే, 2 టి20లు ఆడిన ఆస్ట్రేలియా పేసర్ స్పెన్సర్ జాన్సన్కు రూ. 10 కోట్లు దక్కడం అనూహ్యం. ♦ వేలంలో ముందుగా పేరు వచ్చినప్పుడు రిలీ రోసో (దక్షిణాఫ్రికా)ను ఎవరూ పట్టించుకోలేదు కానీ చివర్లో పంజాబ్ కింగ్స్ రూ. 8 కోట్లకు అతడిని కొనుగోలు చేయడం విశేషం. వేలంలో టాప్–10 వీరే... 1. స్టార్క్ (కోల్కతా) రూ. 24.75 కోట్లు 2. కమిన్స్ (హైదరాబాద్) రూ. 20.50 కోట్లు 3. మిచెల్ (చెన్నై) రూ. 14 కోట్లు 4. హర్షల్ పటేల్ (పంజాబ్) రూ. 11.75 కోట్లు 5. జోసెఫ్ (బెంగళూరు) రూ. 11.50 కోట్లు 6. స్పెన్సర్ జాన్సన్ (గుజరాత్) రూ. 10 కోట్లు 7. సమీర్ రిజ్వీ (చెన్నై) రూ. 8.40 కోట్లు 8. రిలీ రోసో (పంజాబ్) రూ. 8 కోట్లు 9. షారుఖ్ (గుజరాత్) రూ. 7.40 కోట్లు 10. పావెల్ (రాజస్తాన్) రూ. 7.40 కోట్లు నిజంగానే షాక్కు గురయ్యాను. ఇంత మొత్తాన్ని అసలు ఊహించలేదు. ఎనిమిదేళ్ల తర్వాత ప్రపంచంలోని అత్యుత్తమ టి20 లీగ్లో మళ్లీ ఆడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా. ఇప్పుడు విలువ పెరిగినా నా ఆటతీరు ఎప్పుడూ మారలేదు. భారీ మొత్తం కాబట్టి ఒత్తిడి సహజమే అయినా... నాకున్న అనుభవంతో మంచి ఫలితాలు సాధిస్తాననే నమ్మకం ఉంది. –మిచెల్ స్టార్క్ సన్రైజర్స్తో జత కట్టేందుకు అమితోత్సాహంతో ఉన్నా. ఆరెంజ్ ఆర్మీ గురించి చాలా విన్నా. హైదరాబాద్లో కూడా మ్యాచ్లు ఆడా. నాకు బాగా నచ్చింది. నాతో పాటు హెడ్ కూడా ఉన్నాడు. విజయాలతో సీజన్ సాగాలని ఆశిస్తున్నా. –ప్యాట్ కమిన్స్ మిచెల్ స్టార్క్ రెండు సార్లు మాత్రమే ఐపీఎల్లో (2014–15) అదీ బెంగళూరు జట్టు తరఫునే ఆడాడు. 27 మ్యాచ్లలో 7.16 ఎకానమీతో 34 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత వేర్వేరు కారణాలతో అతను ఎనిమిది సీజన్ల పాటు లీగ్కు దూరంగా ఉన్నాడు. 2018లో కోల్కతా అతడిని ఎంచుకున్నా... గాయంతో టోర్నీకి ముందే తప్పుకున్నాడు. ప్యాట్ కమిన్స్ ఢిల్లీ తరఫున 12 మ్యాచ్లు, కోల్కతా తరఫున 30 మ్యాచ్లు ఆడి మొత్తం 45 వికెట్లు పడగొట్టాడు. 2020 వేలంలో కేకేఆర్ అతనికి రూ. 15.50 కోట్లు ఇచ్చింది. అంతర్జాతీయ షెడ్యూల్ కారణంగా 2023 సీజన్లో కమిన్స్ ఆడలేదు. వరల్డ్ కప్లో జట్టును విజేతగా నిలిపి అతను మళ్లీ ఇక్కడ అడుగు పెట్టాడు. -
2024 ఐపీఎల్ వేలంలో కొనుగోలు చేయబడ్డ ఆటగాళ్లు వీరే..!
దుబాయ్లోని కోలోకోలా ఎరీనా వేదికగా ఇవాళ (డిసెంబర్ 19) జరిగిన ఐపీఎల్ 2024 వేలం ఆసక్తికరంగా సాగింది. మొత్తం 77 స్లాట్ల కోసం వేలం జరగగా.. ఆయా ఫ్రాంచైజీలు 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఈ వేలంలో మిచెల్ స్టార్క్ అత్యధిక ధర పలికిన క్యాప్డ్ ప్లేయర్ కాగా.. సమీర్ రిజ్వి అత్యధిక ధర పలికిన అన్ క్యాప్డ్ ప్లేయర్గా నిలిచాడు. ఐపీఎల్ 2024 వేలం 2024 ఆయా ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్న ఆటగాళ్ల జాబితా: రోవ్మన్ పావెల్ (రూ. 7.40 కోట్లు); రాజస్థాన్ రాయల్స్ హ్యారీ బ్రూక్ (రూ. 4 కోట్లు); ఢిల్లీ క్యాపిటల్స్ ట్రావిస్ హెడ్ (రూ. 6.80 కోట్లు); సన్రైజర్స్ హైదరాబాద్ వనిందు హసరంగ (రూ. 1.50 కోట్లు); సన్రైజర్స్ హైదరాబాద్ రచిన్ రవీంద్ర (రూ. 1.80 కోట్లు); చెన్నై సూపర్ కింగ్స్ శార్దూల్ ఠాకూర్ (రూ. 4 కోట్లు); చెన్నై సూపర్ కింగ్స్ అజ్మతుల్లా ఒమర్జాయ్ (రూ. 50 లక్షలు); గుజరాత్ టైటాన్స్ పాట్ కమిన్స్ (రూ. 20.50 కోట్లు); సన్రైజర్స్ హైదరాబాద్ గెరాల్డ్ కోయెట్జీ (రూ. 5 కోట్లు); ముంబై ఇండియన్స్ హర్షల్ పటేల్ (రూ. 11.75 కోట్లు); పంజాబ్ కింగ్స్ డారిల్ మిచెల్ (రూ. 14 కోట్లు); చెన్నై సూపర్ కింగ్స్ క్రిస్ వోక్స్ (రూ. 4.20 కోట్లు); పంజాబ్ కింగ్స్ ట్రిస్టన్ స్టబ్స్ (రూ. 50 లక్షలు); ఢిల్లీ క్యాపిటల్స్ కేఎస్ భరత్ (రూ. 50 లక్షలు); కోల్కతా నైట్ రైడర్స్ చేతన్ సకారియా (రూ. 50 లక్షలు); కోల్కతా నైట్ రైడర్స్ అల్జరీ జోసెఫ్ (రూ. 11.50 కోట్లు); రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమేష్ యాదవ్ (రూ. 5.80 కోట్లు); గుజరాత్ టైటాన్స్ శివమ్ మావి (రూ. 6.40 కోట్లు); లక్నో సూపర్ జెయింట్స్ మిచెల్ స్టార్క్ (రూ. 24.75 కోట్లు); కోల్కతా నైట్ రైడర్స్ జయదేవ్ ఉనద్కత్ (రూ. 1.60 కోట్లు); సన్రైజర్స్ హైదరాబాద్ దిల్షన్ మధుశంక (4.60 కోట్లు); ముంబై ఇండియన్స్ శుభమ్ దూబే (రూ. 5.80 కోట్లు); రాజస్థాన్ రాయల్స్ సమీర్ రిజ్వీ (8.40 కోట్లు); చెన్నై సూపర్ కింగ్స్ అంగ్క్రిష్ రఘువంశీ (రూ. 20 లక్షలు); కోల్కతా నైట్ రైడర్స్ అర్షిన్ కులకర్ణి (రూ. 20 లక్షలు); లక్నో సూపర్ జెయింట్స్ షారుక్ ఖాన్ (రూ. 7.40 కోట్లు); గుజరాత్ టైటాన్స్ రమణదీప్ సింగ్ (రూ. 60 లక్షలు); కోల్కతా నైట్ రైడర్స్ టామ్ కోహ్లర్ కాడ్మోర్ (రూ. 40 లక్షలు); రాజస్థాన్ రాయల్స్ రికీ భుయ్ (రూ. 20 లక్షలు); ఢిల్లీ క్యాపిటల్స్ కుమార్ కుషాగ్రా (రూ. 7.20 కోట్లు); ఢిల్లీ క్యాపిటల్స్ యష్ దయాల్ (రూ. 5 కోట్లు); రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సుశాంత్ మిశ్రా (రూ. 2.20 కోట్లు); గుజరాత్ టైటాన్స్ ఆకాశ్ సింగ్ (రూ. 20 లక్షలు); సన్రైజర్స్ హైదరాబాద్ కార్తీక్ త్యాగి (రూ. 60 లక్షలు); గుజరాత్ టైటాన్స్ రాసిఖ్ దార్ (రూ. 20 లక్షలు); ఢిల్లీ క్యాపిటల్స్ మానవ్ సుతార్ (రూ. 20 లక్షలు); గుజరాత్ టైటాన్స్ ఎం సిద్ధార్థ్ (రూ. 2.40 కోట్లు); లక్నో సూపర్ జెయింట్స్ శ్రేయాస్ గోపాల్ (రూ. 20 లక్షలు); ముంబై ఇండియన్స్ షెర్ఫేన్ రూథర్ఫోర్డ్ (రూ. 1.5 కోట్లు); కోల్కతా నైట్ రైడర్స్ ఆష్టన్ టర్నర్ (రూ. 1 కోటి); లక్నో సూపర్ జెయింట్స్ టామ్ కర్రన్ (1.50 కోట్లు); రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డేవిడ్ విల్లీ (2 కోట్లు); లక్నో సూపర్ జెయింట్స్ స్పెన్సర్ జాన్సన్ (రూ. 10 కోట్లు); గుజరాత్ టైటాన్స్ ముస్తాఫిజుర్ రెహమాన్ (రూ. 2 కోట్లు); చెన్నై సూపర్ కింగ్స్ జై రిచర్డ్సన్ (రూ. 5 కోట్లు); ఢిల్లీ క్యాపిటల్స్ నువాన్ తుషార (రూ. 4.80 కోట్లు); ముంబై ఇండియన్స్ నమన్ ధీర్ (రూ. 20 లక్షలు); ముంబై ఇండియన్స్ అన్షుల్ కాంబోజ్ (రూ. 20 లక్షలు); ముంబై ఇండియన్స్ సుమిత్ కుమార్ (రూ. 1 కోటి); ఢిల్లీ క్యాపిటల్స్ అశుతోష్ శర్మ (రూ. 20 లక్షలు); పంజాబ్ కింగ్స్ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ (రూ. 20 లక్షలు); పంజాబ్ కింగ్స్ శశాంక్ సింగ్ (రూ. 20 లక్షలు); పంజాబ్ కింగ్స్ తనయ్ త్యాగరాజన్ (రూ. 20 లక్షలు); పంజాబ్ కింగ్స్ రాబిన్ మింజ్ (3.60 కోట్లు); గుజరాత్ టైటాన్స్ ప్రిన్స్ చౌదరి (రూ. 20 లక్షలు); పంజాబ్ కింగ్స్ జాతవేద్ సుబ్రమణ్యన్ (రూ. 20 లక్షలు); సన్రైజర్స్ హైదరాబాద్ రిలీ రోసౌ (రూ. 8 కోట్లు); పంజాబ్ కింగ్స్ అర్షద్ ఖాన్ (రూ. 20 లక్షలు); లక్నో సూపర్ జెయింట్స్ ముమ్మద్ నబీ (రూ. 1.50 కోట్లు); ముంబై ఇండియన్స్ షాయ్ హోప్ (రూ. 75 లక్షలు); ఢిల్లీ క్యాపిటల్స్ గుస్ అట్కిన్సన్ (రూ. 1 కోటి); కోల్కతా నైట్ రైడర్స్ స్వస్తిక్ చికారా (రూ. 20 లక్షలు); ఢిల్లీ క్యాపిటల్స్ అబిద్ ముస్తాక్ (రూ. 20 లక్షలు); రాజస్థాన్ రాయల్స్ శివాలిక్ శర్మ (రూ. 20 లక్షలు); ముంబై ఇండియన్స్ స్వప్నిల్ సింగ్ (రూ. 20 లక్షలు); రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అవినాష్ రావు ఆరవెల్లి (రూ. 20 లక్షలు); చెన్నై సూపర్ కింగ్స్ నాండ్రే బర్గర్ (రూ. 50 లక్షలు); రాజస్థాన్ రాయల్స్ సాకిబ్ హుస్సేన్ (రూ. 20 లక్షలు); కోల్కతా నైట్ రైడర్స్ సౌరవ్ చౌహాన్ (రూ. 20 లక్షలు); రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లాకీ ఫెర్గూసన్ (రూ. 2 కోట్లు); రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముజీబ్ ఉర్ రెహమాన్ (రూ. 2 కోట్లు); కోల్కతా నైట్ రైడర్స్ మనీశ్ పాండే (రూ. 50 లక్షలు); కోల్కతా నైట్ రైడర్స్ -
IPL 2024 Auction: స్టార్క్కు లభించే మొత్తం ఐపీఎల్ ప్రైజ్మనీ కంటే ఎక్కువ..!
దుబాయ్లోని కోకోకోలా ఎరీనాలో ఇవాళ (డిసెంబర్ 19) జరుగుతున్న ఐపీఎల్ 2024 వేలంలో ఆసీస్ స్పీడ్స్టర్ మిచెల్ స్టార్క్కు ఊహకందని ధర దక్కిన విషయం తెలిసిందే. స్టార్క్ను కోల్కతా నైట్రైడర్స్ రికార్డు స్థాయిలో 24.75 కోట్లకు సొంతం చేసుకుంది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే ఓ ఆటగాడికి దక్కిన అత్యధిక ధర. స్టార్క్కు ఇంతటి ధర లభించకముందు ఇదే వేలంలో అతని సహచరుడు, ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్కు కూడా ఇంచుమించు ఇలాంటి ధరనే లభించింది. కమిన్స్ను సన్రైజర్స్ హైదరాబాద్ 20 కోట్ల 50 లక్షలకు సొంతం చేసుకుంది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. 2024 సీజన్లో స్టార్క్, కమిన్స్లకు లభించబోయే మొత్తం ఐపీఎల్ విజేత ప్రైజ్మనీ కంటే ఎక్కువ. ఐపీఎల్ విజేతకు 20 కోట్ల ప్రైజ్మనీ లభిస్తుంది. ఇది స్టార్క్, కమిన్స్లకు వ్యక్తిగతంగా లభించే మొత్తం కంటే తక్కువ. ఐపీఎల్ విన్నర్, రన్నరప్లకు లభించే మొత్తం కలుపుకుంటే కూడా స్టార్క్, కమిన్స్లకు లభించే మొత్తంతో సరితూగదు. ఐపీఎల్ రన్నరప్కు లభించే 13 కోట్లు, విజేతకు లభించే 20 కోట్లు కలుపుకుంటే 33 కోట్లు మాత్రమే అవుతుంది. ఇది ఆసీస్ బౌలింగ్ ద్వయానికి లభించే మొత్తంతో పోల్చుకుంటే ఇంకా 11.75 కోట్లు తక్కువ. ఈ విషయం ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. -
IPL 2024: స్టార్క్ వేయబోయే ఒక్కో బంతి విలువ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
వచ్చే సీజన్లో ఐపీఎల్ ఆల్టైమ్ హైయ్యెస్ట్ పెయిడ్ ప్లేయర్ మిచెల్ స్టార్క్ వేయబోయే ఒక్కో బంతి విలువ 7 లక్షలకు పైమాటే ఉంటుంది. ఖచ్చితంగా చెప్పాలంటే 2024 సీజన్లో స్టార్క్ వేయబోయే ఒక్కో బంతి విలువ 7 లక్షల 36 వేల 607 రూపాయలు. లీగ్ క్రికెట్ చరిత్రలోనే ఇది కనీవినీ ఎరుగని మొత్తం. ఏ బౌలర్ కలలోనూ ఇంత మొత్తాన్ని ఊహించి ఉండడు. అయితే స్టార్క్కు ఇంత మొత్తం లభించాలంటే అతన్ని కొనుగోలు చేసిన కేకేఆర్ ప్లే ఆఫ్స్కు ముందే నిష్క్రమించాల్సి ఉంటుంది. ఒకవేళ కేకేఆర్ ప్లే ఆఫ్స్ దశ దాటి ఫైనల్స్కు చేరితే స్టార్క్కు లభించే మొత్తంలో కోత పడుతుంది. వచ్చే సీజన్లో కేకేఆర్ ఫైనల్స్కు చేరే క్రమంలో దాదాపుగా 16 మ్యాచ్లు ఆడాల్సి వస్తుంది. స్టార్క్ 16 మ్యాచ్లు ఆడాల్సి వస్తే ఒక్కో బంతికి లభించే మొత్తం 6.44 లక్షలకు తగ్గిపోతుంది. కాగా, దుబాయ్లోని కోకోకోలా ఎరినాలో ఇవాళ (డిసెంబర్ 19) జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో కోల్కతా నైట్రైడర్స్ జట్టు మిచెల్ స్టార్క్ను 24 కోట్ల 75 లక్షల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఓ ఆటగాడికి లభించే అత్యధిక ధర ఇదే. స్టార్క్కు ఇంత భారీ ధర దక్కక ముందు అతని సహచరుడు, ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్కు కూడా ఇంచుమించు ఈ స్థాయి ధరనే లభించింది. కమిన్స్ను సన్రైజర్స్ హైదరాబాద్ 20 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ వేలానికి ముందు వరకు ఐపీఎల్ ఆల్టైమ్ అత్యధిర ధర 18.5 కోట్లుగా ఉండింది. గత సీజన్లో పంజాబ్ కింగ్స్ ఇంగ్లండ్ ఆటగాడు సామ్ కర్రన్ను ఈ రికార్డు ధరకు కొనుగోలు చేసింది. -
మిచెల్ స్టార్క్ సరి కొత్త చరిత్ర.. ఐపీఎల్లో అత్యధిక ధర! రూ. 24.75 కోట్లకు
ఐపీఎల్-2024 వేలంలో సంచలనాలు నమోదవుతున్నాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచిల్ స్టార్క్ రికార్డులకెక్కాడు. స్టార్క్ను రూ.24.70 కోట్లకు కోల్కతా నైట్రైడర్స్ కొనుగోలు చేసింది. రూ.2 కోట్ల బేస్ ప్రైస్తో వేలంలోకి వచ్చిన అతడి కోసం గుజరాత్ టైటాన్స్, కేకేఆర్ తీవ్రంగా పోటీ పడ్డాయి. ఆఖరికి గుజరాత్ టైటాన్స్ టైటాన్స్ వెనక్కి తగ్గడంతో కేకేఆర్ సొంతం చేసుకుంది. కాగా ఇదే వేలంలో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ను రూ.20.50 కోట్ల రికార్డు ధరకు సన్రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. అయితే ఇప్పుడు స్టార్క్ డీల్తో కమ్మిన్స్ రికార్డు బద్దలైంది. కాగా స్టార్క్ ఐపీఎల్లో చివరగా 2015 సీజన్లో ఆర్సీబీ తరపున ఆడాడు. ప్రస్తుతం వరల్డ్క్లాస్ పేసర్లలో స్టార్క్ ఒకడు. ఇటీవల భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్లోనూ స్టార్క్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. -
'స్మిత్ను ఎవరూ కొనరు.. అతడికి మాత్రం ఏకంగా రూ.20 కోట్లు'
ఐపీఎల్-2024 మినీ వేలానికి సర్వం సిద్దమైంది.ఈ క్యాష్రిచ్ లీగ్ వేలం దుబాయ్లోని కోకాకోలా అరేనా వేదికగా మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ వేలంలో 77 స్ధానాలకు గానూ మొత్తంగా 330 ఆటగాళ్లు పాల్గోనున్నారు. ఇందులోనే ఇద్దరు అసోసియేట్ ప్లేయర్లు సహా 119 విదేశీ ఆటగాళ్లున్నారు. భారత్ నుంచి 214 ప్లేయర్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక ఈ వేలంలో నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గం, ఎస్ఆర్హెచ్ హెడ్ కోచ్ టామ్ మూడీ కీలక వ్యాఖ్యలు చేశాడు. వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ను ఎవరూ కొనుగోలు చేయరని మూడీ జోస్యం చెప్పాడు. అయితే ఆసీస్ పేసర్ మిచిల్ స్టార్క్ మాత్రం భారీ ధరకు అమ్ముడుపోతాడని మూడీ అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది వేలంలో స్టీవ్ స్మిత్ను ఏ ఫ్రాంఛైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపకపోవచ్చు. కానీ మిచిల్ స్టార్క్పై మాత్రం కాసుల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం అత్యధిక ధర కలిగి ఉన్న శామ్ కుర్రాన్(రూ.18.50) రికార్డును స్టార్క్ బ్రేక్ చేస్తాడు. స్టార్క్ దాదాపు రూ.20 కోట్లకు అమ్ముడుపోయిన ఆశ్చర్యపోన్కర్లేదని ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మూడీ పేర్కొన్నాడు. చదవండి: IPL 2024 Auction Updates: ఐపీఎల్ వేలానికి సర్వం సిద్దం.. జాక్పాట్ ఎవరికో? -
IPL 2024: స్టార్క్, కమిన్స్లకు భారీ ధర.. శార్దూల్ ఠాకూర్కు జాక్పాట్..!
ఐపీఎల్ 2024 వేలం రేపు (డిసెంబర్ 19) దుబాయ్లోని కోకాకోలా ఎరీనాలో జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ వేలం రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమవుతుంది. ఈ వేలానికి ముందు ఇవాళ (డిసెంబర్ 18) అదే వేదికపై మాక్ ఆక్షన్ (డమ్మీ వేలం) జరిగింది. ఈ వేలంలో పలువురు స్టార్ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కోసం ఆర్సీబీ చిన్న సైజ్ యుద్దమే చేసింది. ఆ జట్టు ప్రతినిధి మైక్ హెస్సన్ స్టార్క్ను 18.5 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నాడు. మాక్ వేలంలో ఇదే అత్యధిక ధర. స్టార్క్ తర్వాత సౌతాఫ్రికా యంగ్ గన్ గెరాల్డ్ కొయెట్జీ కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. చివరికి కొయెట్జీని గుజరాత్ టైటాన్స్ 18 కోట్లకు దక్కించుకుంది. వీరిద్దరి తర్వాత ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి. అంతిమంగా కమిన్స్ను 17.5 కోట్లకు సన్రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. ఈ మాక్ ఆక్షన్లో ఎవరూ ఊహించని ధరకు లార్డ్ శార్దూల్ ఠాకూర్ అమ్ముడుపోయాడు. శార్దూల్ను పంజాబ్ కింగ్స్ 14 కోట్లకు దక్కించుకుంది. లంక పేసర్ దిల్షన్ మధుషంక, లంక స్పిన్నర్ వనిందు హసరంగ, ఆసీస్ స్టార్ బ్యాటర్, వరల్డ్కప్ హీరో ట్రవిస్ హెడ్ల కోసం కూడా ఫ్రాంచైజీలు తెగ పోటీపడ్డాయి. మధుషంకను కేకేఆర్ (10.5 కోట్లు), హ్యారీ బ్రూక్ను గుజరాత్ టైటాన్స్ ( 9.5 కోట్లు), హసరంగను (8.5 కోట్లు), ట్రవిస్ హెడ్లను (7 కోట్లు) సీఎస్కే దక్కించుకున్నాయి. మిచెల్ స్టార్క్- 18.5 కోట్లు (ఆర్సీబీ) గెరాల్డ్ కొయెట్జీ-18 కోట్లు (గుజరాత్ టైటాన్స్) పాట్ కమిన్స్- 17.5 కోట్లు (సన్రైజర్స్ హైదరాబాద్) శార్దూల్ ఠాకూర్-14 కోట్లు (పంజాబ్ కింగ్స్) దిల్షన్ మధుషంక-10.5 కోట్లు (కేకేఆర్) హ్యారీ బ్రూక్- 9.5 కోట్లు (గుజరాత్ టైటాన్స్) వనిందు హసరంగ-8.5 కోట్లు (సీఎస్కే) ట్రవిస్ హెడ్- 7 కోట్లు (సీఎస్కే) కాగా, మాక్ వేలంలో లభించిన ధర డమ్మీ ధర అయినప్పటికీ.. పై పేర్కొన్న ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఎగబడటం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. రేపు జరుగబోయే అధికారిక వేలంలో ఈ ఆటగాళ్లపై కనక వర్షం కురువడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీరితో పాటు వరల్డ్కప్ హీరో, న్యూజిలాండ్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర కోసం కూడా ఫ్రాంచైజీలు ఎగబడవచ్చు. ఐపీఎల్ 2024 వేలం తేదీ: డిసెంబర్ 19, 2023 సమయం: మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభం (భారతకాలమానం ప్రకారం) వేదిక: దుబాయ్లోని కోకాకోలా ఎరీనా ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్ (టీవీ) డిజిటల్: జియో సినిమా మొత్తం స్లాట్లు: 77 వేలంలో పాల్గొంటున్న మొత్తం ఆటగాళ్లు: 333 భారతీయ ఆటగాళ్లు: 214 విదేశీ ఆటగాళ్లు: 119 -
IPL 2024: వేలంలో వాళ్లిద్దరికి రూ. 14 కోట్లకు పైగానే! హెడ్కు తక్కువే!
ఐపీఎల్-2024 వేలానికి సమయం ఆసన్నమైన తరుణంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మంగళవారం(డిసెంబరు 19)నాటి వేలంలో భారీ ధరకు అమ్ముడుపోయే ఆటగాళ్లు వీరేనంటూ తన అంచనాలు తెలియజేశాడు. అయితే, ఈ వేలంలో హాట్కేక్గా మారతాడనుకున్న వన్డే వరల్డ్కప్-2023 హీరో ట్రవిస్ హెడ్ విషయంలో మాత్రం అశ్విన్ ట్విస్ట్ ఇవ్వడం విశేషం. అశ్విన్ అంచనా ప్రకారం.. దుబాయ్ వేదికగా జరుగునున్న క్యాష్ రిచ్ లీగ్ వేలంలో తమిళనాడు బ్యాటింగ్ ఆల్రౌండర్ షారుఖ్ ఖాన్ 10 -14 కోట్ల రూపాయలకు అమ్ముడుపోతాడు. న్యూజిలాండ్ ఆల్రౌండర్, ప్రపంచకప్-2023లో సెంచరీలతో విరుచుకుపడిన రచిన్ రవీంద్రకి రూ. 4- 7 కోట్ల మేర దక్కే అవకాశం ఉంది. ఇక టీమిండియా బౌలర్ హర్షల్ పటేల్, వెస్టిండీస్ బ్యాటర్ రోవ్మన్ పావెల్, సౌతాఫ్రికా బౌలర్ గెరాల్డ్ కోయెట్జీలు రూ. 7- 10 కోట్ల మేర ధర పలికే ఛాన్స్ ఉంది. మరోవైపు.. ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రవిస్ హెడ్ రేంజ్ మాత్రం రూ. 2- 4 కోట్ల మధ్యే ఉంటుందని అశ్విన్ అంచనా వేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ ఐపీఎల్-2024 వేలంలో రూ. 4- 7 కోట్లకు అమ్ముడుపోగలడని అశ్విన్ పేర్కొన్నాడు. అదేవిధంగా.. ఆస్ట్రేలియా స్టార్ పేసర్లు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ మాత్రం రూ. 14 కోట్ల మార్కును దాటగలరని అశూ పేర్కొనడం విశేషం. సోషల్ మీడియా వేదికగా ఈ మేరకు తన అంచనాలు తెలియజేసిన అశ్విన్.. క్రికెట్ షాట్ల రూపంలో ఎవరు ఎంత ధర పలికే అవకాశం ఉందని తెలియజేయడం మరో విశేషం. డిఫెన్స్ షాట్(రూ. 2-4 కోట్ల మధ్య), డ్రైవ్(రూ. 4-7), పుల్షాట్(రూ. 7- 10 కోట్లు), స్లాగ్(రూ. 10-14 కోట్లు), హెలికాప్టర్ షాట్(14+ కోట్లకు పైగా) అంటూ అశ్విన్ వివిధ రేంజ్ల మధ్య ఉంటారనుకున్న ప్లేయర్ల పేర్లను ఇలా షాట్లతో పోల్చి వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన వీడియోపై లుక్కేయండి! View this post on Instagram A post shared by Ashwin (@rashwin99)
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
డిప్యూటీ సీఎంను చేసి పిఠాపురానికి పంపుతా
"గీతమ్మను గెలిపిస్తే.." పిఠాపురం ప్రజలకి బంపర్ ఆఫర్
మీడియాకు థ్యాంక్స్ చెప్పిన కేరళ గవర్నర్.. ఎందుకంటే?
బాలయ్య బాబు కి బలమైన కౌంటర్లు పిఠాపురం సాక్షిగా దత్తపుత్రుడి పరువు..!
గీతమ్మను, సునీల్ ను ఆశీర్వదించండి..
పిఠాపురంలో దత్తపుత్రుడిపై సీఎం జగన్ పవర్ పంచ్..
కుందనపు బొమ్మలా ప్రియాంకా జైన్ ఫొటోలు
పొరపాటున గెలిస్తే పవన్ కుబుసం విడిచి కాట్లు వేస్తాడు..!
పిఠాపురం: సీఎం జగన్ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)
గవర్నర్.. నీ దాదాగిరి పని చేయదు: మమతా బెనర్జీ
తప్పక చదవండి
- గవర్నర్.. నీ దాదాగిరి పని చేయదు: మమతా బెనర్జీ
- వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తా: సీఎం జగన్
- బీజేపీ గెలిస్తే ‘యోగి’ అవుట్: కేజ్రీవాల్ సంచలన కామెంట్స్
- ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాల మాస్టర్
- మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి: కైకలూరులో సీఎం జగన్
- బాబును సీఎం చేసేందుకే ఈ లేనిపోని పెంట వార్తలు: పోసాని
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
Advertisement