-
Allu Arjun Jatara Look Secret: పుష్పరాజ్ భీకర రూపం రహస్యం ఇదేనా?
పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ పీక్కు చేరింది. ఈ మూవీకి జాతీయ ఉత్తమ అవార్డు గెలుచు కుని మరో మెట్టు ఎక్కాడు అల్లు అర్జున్. దీనికి సీక్వెల్గా వస్తున్న 'పుష్ప 2: ది రూల్' పై అంచనాలు కూడా అదే రేంజ్లో ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే పుష్ప 2 సినిమా టీజర్లో అల్లు అర్జున్ నీలి రంగు చీర, నగలు, నిమ్మకాయ దండలతో వెరైటీ లుక్ హాట్టాపిక్గా నిలిచింది. దీంతో అభిమాన హీరో కొత్త ట్రెండ్ సెట్ చేయడం ఖాయమని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. 2003లో గంగోత్రి సినిమాతో తెరంగేట్రం చేసిన అల్లు అర్జున్ ..ఈ మూవీలో లేడీ గెటప్తో కనిపించి అలరించాడు. తాజాగా పుష్ప-2 సినిమాలో కూడా అమ్మవారి భీకర రూపంతో ఫ్యాన్స్ని మరింత ఎట్రాక్ట్ చేస్తున్నాడు. ఎర్రచందనం, తిరుపతి జిల్లాలో కథ సాగుతుంది కనుక ఇది గంగమ్మ జాతర నేపథ్యమే ఈ లుక్అని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏంటీ గంగమ్మ జాతర తెలుసుకుందాం రండి. తిరుపతి గ్రామదేవత శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. గంగమ్మ జాతరకు 900 ఏళ్ల చరిత్ర ఉంది. గ్రామదేవతగా అవతరించిన గంగమ్మ.. సాక్షాత్తు తిరుమల శ్రీవారి చెల్లెలని భావిస్తారు. వారం రోజుల పాటు జరిగే గంగమ్మ జాతరకు ఒక ప్రత్యేకత ఉంది. గంగమ్మ జాతర విశిష్టత పూర్వం తిరుపతిని పాలెగాళ్లు పరిపాలించే రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంలోని అందమైన యువతులను బలాత్కరించేవాడట. కొత్తగా పెళ్ళైన వధువులంతా మొదటిరాత్రి తనతో గడపాలంటూ ఆంక్షలు విధించి వేధించేవాడట. ఈ పాలెగాడిని అంతమొందించి స్త్రీ జాతిని రక్షించేందుకు జగన్మాత తిరుపతికి 2 కి.మీ దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించిందని భావిస్తారు భక్తులు. యుక్త వయసుకొచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలెగాడి కన్నుపడి ఆమెను బలాత్కరించబోయాడట. దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది.. తనను అంతమొందించేందుకు అవతరించిన పరాశక్తే గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కోవడంతో అనేక వేషాలు ధరించి మూడు రోజులపాటు గాలించినా ఫలితం దక్కలేదు. దీంతో నాలుగోరోజు గంగమ్మ-దొరవేషం వేసి, పాలెగాడిని అంత మొందించిందని భక్తుల విశ్వాసం. ఈ దుష్టశిక్షణను తలచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ జాతర చేసుకుంటారు. ఈ జాతరలో తొలి రోజున బైరాగివేషం ,రెండోరోజు బండవేషం,మూడోరోజు తోటివేషం,నాలుగోరోజు దొరవేషం వేసుకుంటారు. నాలుగో రోజున పాలెగాడిని సంహరించిన గంగమ్మ ఐదోరోజున మాతంగి వేషం ధరిస్తారు. ఆరోరోజు సున్నపుకుండల వేషం వేస్తారు. ఏడోరోజున జాతరలో భాగంగా సప్పరాల ఉత్సవం జరుగుతుంది. గోపురాన్ని పోలిన సప్పరాలను (వెదురు బద్దలతో) తయారుచేసి వాటిని శరీరంపై నిలబెట్టుకుంటారు. అలా చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని ప్రతీతి. అదేరోజున కైకాల కులస్థులు పేరంటాళ్ళ వేషం వేస్తారు.మగవారు ఆడవేషం వేసుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. ఇలా చేస్తే అమ్మవారు అనుగ్రహించి తమ కోర్కెలు తీరుస్తుందని భక్తుల నమ్మకం. పేరంటాలు వేషంలోఉన్న కైకాల కులస్థులు ఆలయానికి చేరుకుని నీలం రంగు ద్రవంతో బంకమట్టిని కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్నితయారుచేస్తారు. భక్తులంతా అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకున్నాక ఆ విగ్రహం నుంచిమట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. ఎనిమిదిరోజులపాటు ఘనంగా జరిగిన జాతర ఈ ఘట్టంతో ముగుస్తుంది. బన్నీ న్యూ లుక్ రహస్యం వీడాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. మరోవైపు పుష్ప 2: ది రూల్ టీజర్కి రెస్పాన్స్ ఒక రేంజ్లో ఉంది. బన్నీ మాతంగి లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ‘‘మరో బ్లాక్బస్టర్..బన్నీకి మరో జాతీయ అవార్డు పక్కా" అని కమెంట్ చేశారు. -
జూనియర్ ఎన్టీఆర్ దేవర.. వైరలవుతోన్న న్యూ లుక్!
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. సముద్రం బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ, శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ఈ మూవీ షూట్లకు సంబంధించిన జూనియర్ లుక్ నెట్టింట తెగ వైరలవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఎన్టీఆర్ ఫోటోను షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు దేవర లుక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. Making waves in Goa !! 🌊🎵 #Devara @tarak9999 #KoratalaSiva #JanhviKapoor @NANDAMURIKALYAN #RajuSundaram @sabucyril @RathnaveluDop @sreekar_prasad @anirudhofficial @Yugandhart_ @YuvasudhaArts @DevaraMovie @Tseries @Tseriessouth pic.twitter.com/G81lHl1EM8 — NTR Arts (@NTRArtsOfficial) March 22, 2024 -
చీరలు కొన్న వాటిలానే ఉండాలంటే ఇలా చేయండి!
చీరలు వాడుతున్న కొద్దీ కొన్నప్పుడూ ఉన్నట్టు కనపించవు. కలర్ తగ్గిపోయి కట్టుకున్న నలిగిపోతున్నట్లు ఉంటుంది. కొత్త ఉన్నంత షైన్గా కనిపించదు. దీంతో ఈ షాపు మంచిది, అది మంచిది అంటూ షాపులు మార్చుతుంటాం. ఎన్ని చోట్లకు తిరిగి కొన్నా అదే తీరులో చీరలు ఉంటాయి. అలా కాకుండా చీరలు కొన్న ప్పుడే ఏ రేంజ్లో మెరుస్తూ కనిపిస్తున్నాయో అలానే ఉండాలంటే కొన్న చిట్కాలు పాటిస్తే చాలు ఎప్పటికీ కొన్న వాటిలానే ఉంటాయి. ఇక్కడ చీరలు మెయింటైయిన్ చేయడమపైనే ట్రిక్ అంతా దాగి ఉంది. ఆ ట్రిక్ ఏంటంటే.. ముందుగా చీరలను ఎలా పడితే అలా మడతలు పెట్టొద్దు. అలాగే మడత పెట్టి ఎక్కువ రోజులు ఉంచొద్దు. ఇలా చేస్తే రంగు మారుతుంది. పైగా చీన ముడతలు ముడతలుగా అయిపోతుంది. ముడతలు పడకుండ మధ్యలో ఒకసారి తీసి తిరిగి మడతపెట్టాలి. వాటిని వెలుతురు పడని ప్రదేశాల్లోనే పెట్టాలి. చీరను ఉతికేటప్పుడూ కూడా జాగ్రత్త పాటించాలి. చీరలు అన్నింటిని ఒకే విధంగా ఉతికితే త్వరగా పాడవుతాయి. వాషింగ్ మిషన్ లో చీరలన్నింటిని ఉతక్కూడదు. కొన్నింటిని మినహాయించాలి. ఎందుకంటే? కొన్ని వాషింగ్ మిషన్లో ఉంటే కలర్ దిగిపోయే అవకాశం చీర పాడయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి చీరలను చేత్తో నానబెట్టకుండా ఉతుక్కోవడం మంచిది. ఇంకొన్ని చీరలను ఉతక్కుండా డ్రైక్లీనింగ్కు ఇవ్వాలి. అలాగే కొన్ని లైట్ వైట్ చీరలను కొనేటప్పుడే ఎలా ఉతకాలి ఏంటన్నది అడిగి తెలసుకోవాలి. అలాగే ఐరన్ చేయడం వల్ల చీరలకు మంచి లుక్ వస్తుంది కాబట్టి ఐరన్ తప్పనిసరి. ఎక్కువ వేడి మీద అసలు ఐరన్ చేయొద్దు. ఇలా చేస్తే తొందరగా పాడవుతాయి. సిల్క్, పట్టు చీరలు ఐరన్ చేసేటప్పుడు కాటన్ క్లాత్ వేసి ఐరన్ చేస్తే ఫ్యాబ్రిక్ దెబ్బతినకుండా ఉంటుంది కాబట్టి ఈ చిట్కాను తప్పక గుర్తించుకోవాలి ఎంత మంచిగా మెయింటెన్ చేసినా కూడా చీరలపై మరకలు, మడతలు అలాగే ఉంటాయి. దీంతో ఎలా పడితే అలా కాకుండా.. మరకను మాత్రమే క్లీన్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత వెనిగర్, నిమ్మరసం, సబ్బుతో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. కొన్ని చీరలకు వర్క్ మరికొన్ని చీరలకు స్టోన్స్, ముత్యాలు ఉంటాయి కాబట్టి అలాంటి వాటిని విడివిడిగా ఉతకాలి. చీర నాణ్యతను బట్టి ఉతకే విధానంలో మార్పులు చేయాలి. లేదంటే అంత కష్టబడి డబ్బులు పెట్టి మరీ చేయించుకున్న వర్క్ పాడయ్యే పోయే ప్రమాదం ఉంటుంది. (చదవండి: ప్రపంచంలోనే బెస్ట్ డెజర్ట్గా భారతీయ స్వీట్! ఎన్నో స్థానంలో నిలిచిందంటే..) -
సూపర్ లుక్
‘‘హాలీవుడ్ హీరోలా ఉన్నారు.. సూపర్ లుక్’’ అంటూ మహేశ్బాబు తాజా లుక్ గురించి నెటిజన్లు పోస్ట్లు షేర్ చేస్తున్నారు. రెండు మూడు రోజులుగా మహేశ్బాబు తన స్టయిలిష్ లుక్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తున్నారు. ముందు నలుపు రంగు సూట్లో ఉన్న ఫొటోలు షేర్ చేసినప్పుడు సూపర్ అంటూ అభిమానులు మురిసిపోయారు. శనివారం గళ్ల చొక్కాతో ఒత్తయిన జుట్టుతో ‘త్రూ ది లెన్స్’ అంటూ మహేశ్ మరో ఫొటోను షేర్ చేయగా, ఆ లుక్కి కూడా మంచి స్పందన వచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్బాబు హీరోగా ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో దాదాపు రూ. వెయ్యి కోట్ల బడ్జెట్తో రూపొందనున్న ఈ పాన్ ఇండియా చిత్రం కోసం మహేశ్ కొత్తగా మేకోవర్ అయ్యారు. మహేశ్తో పలు రకాల లుక్స్ని ట్రై చేస్తున్నారట రాజమౌళి. మరి.. మహేశ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది రాజమౌళి సినిమా లుక్కా? లేక ఏదైనా యాడ్ షూటా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఈ చిత్రంలో పలువురు విదేశీ తారలు కూడా నటించనున్నారు. -
మహేష్ నయా లుక్..రాజమౌళి మూవీ కోసమేనా (ఫొటోలు)
-
హాలీవుడ్ హీరో కాదు.. ఫేమస్ బిజినెస్ మ్యాన్ - గుర్తుపట్టారా?
పైన ఫోటోలో చూడగానే పిలక పెట్టుకుని, కళ్ళజోడుతో స్టైల్గా కనిపిస్తున్న వ్యక్తి ఏ హాలీవుడ్ హీరో అనుకుంటే మీరు పొరబడినట్లే.. ఎందుకంటే ఈయన ఇండియాలో ఓ ప్రముఖ బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్ అయితే ఎందుకు ఈ అవతారమెత్తారు అనే అనుమానం మీలో రావచ్చు? దాని గురించే ఇక్కడ తెలుసుకుందాం.. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ స్థాపించి, ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసి అతి తక్కువ కాలంలోనే గొప్ప అమ్మకాలను పొందుతూ దూసుకెళ్తున్న ఈయనే ఓలా సీఈఓ 'భవిష్ అగర్వాల్'. ఈ పేరు వినగానే ఇప్పుడు గుర్తోచేసి ఉంటుంది, ఈయనే భవిష్ అగర్వాల్ అని.. ఇక ఈ అవతారమెందుకు ఎత్తరనుకుంటున్నారా.. భవిష్ అగర్వాల్ ఆదివారం అబుదాబిలో ఇటీవల ప్రారంభించిన 'బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థకు చెందిన హిందూ మందిర్'ను సందర్శించారు. ఆ సమయంలో ఇలా కనిపించారు. ఇదీ చదవండి: హ్యాండ్సమ్గా కనిపిస్తున్న ఈ కుర్రాడే.. నేడు భారత్ గర్వించదగ్గ వ్యక్తి భవిష్ అగర్వాల్ ఈ టెంపుల్ సందర్శించిన సందర్భంగా.. ఇది నా జీవిత జ్ఞాపకం అని తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేస్తూ ఫోటోలు షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే వేలసంఖ్యలో లైక్స్ పొందిన ఈ ఫోటోలకు నెటిజన్ల నుంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి. Visiting and speaking at the @BAPS Hindu Mandir in Abu Dhabi was a life memory for me. It is such a historic moment of two civilisations coming together and thankful to be there to witness it🙏🏼 pic.twitter.com/rfHh8x4eJ3 — Bhavish Aggarwal (@bhash) February 18, 2024 -
న్యూ లుక్లో హీరోయిన్ హానీ రోజ్.. ఫోటోలు వైరల్
-
MS Dhoni New Look Photos: ధోనీ న్యూ లుక్ అదిరింది (ఫొటోలు)
-
కొత్త లుక్లో ఎయిర్ఇండియా విమానాలు - ఫోటోలు వైరల్
టాటా గ్రూప్ ఎయిర్ఇండియాను కొనుగోలు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు దాని అభివృద్ధిలో భాగంగా అనేక మార్పులు చేస్తూనే ఉంది. తాజాగా ఇప్పుడు లోగో, ఎయిర్క్రాఫ్ట్ లివరీలో మార్పులు చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కొత్త డిజైన్ పొందిన ఎయిర్ఇండియా విమానాల ఫోటోలను సంస్థ తన అధికారిక ఎక్స్ (ట్విటర్) వేదికగా షేర్ చేసింది. సోషల్ మీడియాలో ఇవి తెగ వైరల్ అవుతున్నాయి. ఈ డిజైన్ పొందిన కార్లు త్వరలోనే వినియోగంలోకి రానున్నట్లు సమచారం. ఫ్రాన్స్లోని టౌలౌస్లోని వర్క్షాప్లో కొత్త లోగో, డిజైన్తో రూపుదిద్దుకున్న ఏ350 విమానం ఫోటోలు ఇక్కడ చూడవచ్చు. ఈ లేటెస్ట్ విమానాలు ఈ శీతాకాలం నాటికి భారత్కు రానున్నట్లు ఎయిర్లైన్స్ తెలిపింది. ఇప్పటికే ఉన్న విమానాలు కూడా ఈ డిజైన్ పొందుతాయని, దీని కోసం దాదాపు 400 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని సమాచారం. సంస్థ విమానాలన్నీ కూడా 2025 నాటికి ఈ డిజైన్ పొందుతాయని తెలుస్తోంది. ఇదీ చదవండి: అంబానీ కంపెనీతో ఏడీఏఐ డీల్.. వేలకోట్లు పెట్టుబడికి సిద్ధం! ఎయిర్ ఇండియా తన కొత్త లోగో, ది విస్టా, గోల్డ్ విండో ఫ్రేమ్ నుంచి ప్రేరణ పొందిందని ఇంతకుముందు పేర్కొంది. అయితే దీనిని పూర్తిగా మార్చడానికి కంపెనీ సిద్ధమైంది. ఇందులో భాగంగానే కొత్త లివరీ అండ్ డిజైన్లో ముదురు ఎరుపు, వంకాయ, గోల్డ్ కలర్స్ అందిస్తోంది. ఇవి చూడటానికి కొత్తగా ఆకర్షణీయంగా ఉన్నాయి. Here's the first look of the majestic A350 in our new livery at the paint shop in Toulouse. Our A350s start coming home this winter... @Airbus #FlyAI #AirIndia #NewFleet #Airbus350 pic.twitter.com/nGe3hIExsx — Air India (@airindia) October 6, 2023 -
స్లిమ్గా హీరోయిన్ ప్రియమణి.. షాకవుతున్న నెటిజన్లు (ఫోటోలు)
-
పండగ కిక్కు.. కొత్త లుక్కు
వినాయక చవితికి వినాయకుడికి విభిన్న రకాల వంటకాలను భక్తులు నైవేద్యంగా సమర్పిస్తుంటారు. అలాగే ఈ పండక్కి వినాయకుడిని స్మరించుకుంటూ ‘పండగ కిక్కు..కొత్త లుక్కు’ అంటూ కొందరు సినిమా యూనిట్ వారు పలు రకాల అప్డేట్స్ ఇచ్చారు. వీటిలో కొన్ని ఈ విధంగా.. బీచ్లో సైంధవ్ బీచ్లో సేద తీరు తున్నారు వెంకటేశ్. ఆయన హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూ΄పొందుతున్న ‘సైంధవ్’ కొత్త పొస్టర్ విడుదలైంది. శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా నటిస్తున్న ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, తమిళ నటుడు ఆర్య, బాల నటి సారా కీలక పా త్రధారులు. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 22న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణ్. వీడు టైగర్... రవితేజ టైటిల్ రోల్ చేసిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. స్టువర్టుపురం దొంగగా పేరు గాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబరు 20న రిలీజ్ కానుంది. ఈ సినిమాలోని రెండో పా ట ‘వీడు..’ను ఈ నెల 21న విడుదల చేస్తున్నట్లుగా వెల్లడించి, రవితేజ పొస్టర్ను విడుదల చేశారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్కుమార్. రామ్.. కల్ట్ మామా ‘బిట్టు బిట్టు బాడీ మొత్తం రెడ్డూ చిల్లి సాల్టు..’ అంటూ సాగే పా ట ‘స్కంద’ చిత్రంలోనిది. రామ్ హీరోగా బోయపా టి శ్రీను దర్శకత్వంలో రూ΄పొందుతున్న చిత్రమిది. శ్రీలీల, సయీ మంజ్రేకర్ హీరోయిన్లు. ఈ సినిమాలో రామ్, ఊర్వశీ రౌతేలా కాంబినేషన్లో వచ్చే ప్రత్యేక గీతం ‘కల్ట్ మామా’ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. తమన్ స్వరపరచిన ఈ పాటను అనంత శ్రీరామ్ రాయగా హేమచంద్ర, రమ్య బెహ్రా, మహా పా డారు. జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్ల సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న రిలీజ్ కానుంది. టీజర్ రెడీ ‘యానిమల్’ మూవీ టీజర్ రెడీ అవుతోంది. ఈ నెల 28న ఈ సినిమా టీజర్ను రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించి, ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న రణ్బీర్ కపూర్ పొస్టర్ను విడుదల చేశారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్. భూషణ్కుమార్, క్రిషన్కుమార్, మురాద్ ఖేతాని, ప్రణయ్రెడ్డి వంగా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 1న, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. మది దోచేసిందే... ‘మాయే చేసి మెల్లగా మది దోచేసిందే సిన్నగా...’ అంటూ హీరో కల్యాణ్ రామ్ పా డారు. కల్యాణ్ రామ్, సంయుక్తా మీనన్ నటిస్తున్న ‘డెవిల్’లోని పా ట ఇది. అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం నవంబరు 24న రిలీజ్ కానుంది. ఈ సినిమా నుంచి ‘మాయే చేశావే..’ పా ట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరకల్పనలో ఆర్వీ సత్య రాసిన ఈ పా టను సిధ్ శ్రీరామ్ పా డారు. దేఖో ముంబై దోస్తీ మజా... కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘రూల్స్ రంజన్’. ఏఎం రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 6న రిలీజ్ కానుంది. ఈ సినిమాలోని ‘దేఖో ముంబై దోస్తీ మజా..’ పా ట లిరికల్ వీడియోను హీరో రవితేజ రిలీజ్ చేశారు. అమ్రిష్ గణేష్ స్వరకల్పనలో కాసర్ల శ్యామ్, మేఘ్ ఉట్– వాట్ సాహిత్యం అందించగా, అద్నాన్ సమీ, పా యల్ దేవ్ ఈ పా టను పా డారు. అంజనాద్రిలో... తేజా సజ్జా, అమృతా అయ్యర్ జంటగా నటించిన ‘హను–మాన్’ పొస్టర్ రిలీజైంది. ‘‘అంజనాద్రి అనే ఊహాత్మక ప్రదేశంలో ఈ సినిమా ఉంటంది. తెలుగు, హిందీ, మరాఠీ, తమిళ, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్, స్పానిష్, కొరియన్, చైనీస్ , జపనీస్తో సహా పలు భారతీయ భాషల్లో జనవరి 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కె. నిరంజన్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. -
గుండుతో ఢీ కొట్టేందుకు రెడీ అయిన స్టార్స్
హీరో అంటే ఫ్యాన్స్కి స్టయిలిష్గా కనబడాలి.. హెయిర్ స్టయిల్, డ్రెస్సింగ్, వాకింగ్... ఇలా అన్నీ స్టయిలు స్టయిలులే.. ఇది సూపర్ స్టయిలులే అన్నట్లు ఉండాలి. ఫ్యాన్స్ ఇలానే కోరుకుంటారు. కానీ తమ హీరోని ‘గుండు’లో చూడాలనుకోరు. ఒకవేళ గుండులో కనిపించే క్యారెక్టర్ చేస్తున్నారని తెలిస్తే ‘బాగుండునా!’ అని చర్చించుకుంటారు. చివరికి లుక్ చూశాక ఈ క్యారెక్టర్ చేస్తే ‘బాగుండు’ అనుకుంటారు. మరి.. గుండులోనూ స్టయిలిష్గా కనిపిస్తే ఎందుకు కాదంటారు. ఇక ఈ లుక్లో చిరంజీవి, మోహన్లాల్, ధనుష్ కనిపించనున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. భోళా శంకర్లో... వెండితెరపై ఇప్పటివరకూ చిరంజీవి గుండుతో కనిపించలేదు.. ఎందుకంటే క్యారెక్టర్ డిమాండ్ చేయలేదు. ఇప్పుడు ఒక క్యారెక్టర్ డిమాండ్ చేసింది.. అంతే.. గుండుతో కనిపించడానికి రెడీ అయ్యారు. ఆ సినిమా ‘భోళా శంకర్’. అజిత్ నటించిన తమిళ చిత్రం ‘వేదాళం’కి రీమేక్ ఇది. తమిళ వెర్షన్లో అజిత్ పూర్తి గుండుతో కనిపించలేదు... అయితే దాదాపు ‘హెడ్ షేవ్’ చేసుకున్నారు. కానీ చిరంజీవి మాత్రం నున్నటి గుండుతో కనిపించనున్నారు. అయితే జుట్టు తీయించకుండా ప్రొస్టేటిక్ మేకప్తో చిరంజీవి గుండు లుక్ని మౌల్డ్ చేశారు టెక్నీషియన్స్. ఆ వీడియోను చిరంజీవి షేర్ చేసి, నిపుణుల పని తీరుని మెచ్చుకున్నారు కూడా. ఇక మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి ఫ్లాష్బ్యాక్లో గుండుతో కనిపిస్తారట. ఈ చిత్రంలో చిరు సరసన తమన్నా కథానాయికగా, ఆయన చెల్లెలి పాత్రను కీర్తీ సురేష్ చేస్తున్నారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 11న ఈ చిత్రం విడుదల కానుంది. నిధిని కాపాడే బర్రోజ్ ఒక నిధిని కాపాడే పని మీద ఉంటాడు బర్రోజ్. వాస్కోడగామా దాచిన నిధి అది. వాస్కోడగామా నిజమైన వారసునికి మాత్రమే ఆ సంపద దక్కాలి. వారికి నిధిని అప్పగించే బాధ్యతను తీసుకున్న బర్రోజ్ 400 ఏళ్లుగా ఆ నిధిని కాపాడుకుంటూ వస్తాడు. ఈ కథతో రూపొందుతున్న చిత్రం ‘బర్రోజ్’. టైటిల్ రోల్లో నటిస్తూ, ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు మోహన్ లాల్. దర్శకుడిగా ఇది ఆయనకు తొలి చిత్రం. గుండు, గుబురు గడ్డంతో మోహన్లాల్ గెటప్ ఈ సినిమాలో డిఫరెంట్గా ఉంటుంది. బాలల చిత్రంలా రూపొందిస్తున్నారనీ, పెద్దలనూ ఆకట్టుకునే విధంగా ఉంటుందని సమాచారం. భారతీయ తొలి త్రీడీ చిత్రం ‘మై డియర్ కుట్టి సైతాన్’ దర్శకుడు జీజో పున్నూస్ ఈ త్రీడీ ‘బర్రోజ్’కి కథ, స్క్రీన్ప్లే అందించారు. ఈ ఏడాది ఓనమ్ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. యాభైయ్యవ సినిమాలో గుండుతో... నటుడిగా కెరీర్లో 50వ మైల్ స్టోన్ చేరుకున్నారు ధనుష్. ఈ చిత్రంలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. అయితే డైరెక్టర్గా ఆయనకిది తొలి చిత్రం కాదు. దర్శకుడిగా ‘పవర్ పాండీ’ (2017) మొదటి చిత్రం. ఆ చిత్రంలో ఓ అతిథి పాత్ర కూడా చేశారు. ఐదేళ్ల తర్వాత ధనుష్ మళ్లీ దర్శకుడిగా మెగాఫోన్ పట్టారు. ఈ చిత్రంలో గుండుతో కనిపించనున్నారట. ఈ సినిమా షూటింగ్ ఇటీవల ఆరంభమైంది. చిత్రీకరణ ఆరంభించక ముందు తిరుమల వెళ్లి ధనుష్ తలనీలాలు సమర్పించుకున్నారు. ఎలానూ ఈ చిత్రంలో గుండుతో కనిపిస్తారు కాబట్టి దైవాన్ని దర్శించుకుని, తల నీలాలు సమర్పించి ఉంటారని కోలీవుడ్ అంటోంది. ఇది గ్యాంగ్స్టర్ డ్రామా అట. ధనుష్, విష్ణు విశాల్, ఎస్జే సూర్య అన్నదమ్ములుగా కనిపిస్తారని టాక్. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. -
షాకింగ్ లుక్లో హీరోయిన్ మెహ్రీన్
-
హీరోయిన్ మెహ్రీన్కు ఏమైంది? ఇలా మారిపోయిందేంటి?
ఇండస్ట్రీలో టాలెంట్ ఎంత ఉన్నా అందం కూడా అంతే ముఖ్యం. అందుకే హీరో,హీరోయిన్లు ఫిట్నెస్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. జిమ్లో గంటల కొద్దీ వర్కవుట్స్ చేస్తూ అందాన్ని కాపాడుకుంటారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. ఒకప్పుడు బొద్దుగా మెస్మరైజ్ చేసే బ్యూటీలు ఇప్పుడు జీరో సైజే సో బెటర్ అంటున్నారు. చదవండి: కమెడియన్ మనోబాల మృతికి కారణం ఇదేనా?.. ఆ వ్యసనం వల్లేనా? తాజాగా ఈ లిస్ట్లో మెహ్రీన్ కూడా చేరింది. ‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన ఈ బ్యూటీ ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్2’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బొద్దుగా కనిపించిన మెహ్రీన్ ఈ మధ్యకాలంలో బాగా సన్నబడింది. వర్కవుట్స్, డైట్ పాటిస్తూ జీరో సైజ్కి వచ్చేసింది. లేటెస్ట్గా తన లుక్కి సంబంధించిన ఫోటోలను మెహ్రీన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసి.. మెహ్రీన్కు ఏమైంది ఇంత సన్నబడింది? అయినా ఒకప్పటిలా బొద్దుగా ఉంటేనే బాగుంది అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: గొప్పమనసు చాటుకున్న నిర్మాత.. లైట్మన్ కుటుంబానికి ఆర్థికసాయం -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేశ్ నయా లుక్.. ఏ కాలేజ్ అన్నా..?
ఇండియాలోనే మోస్ట్ హ్యాండ్సమ్ హీరోలలో సూపర్స్టార్ మహేశ్బాబు ఒకరు. ఆయన అందం గురించి ఎంత చెప్పిన తక్కువే. వయసుతో పాటు అందం కూడా పెరుగుతుందా అన్నట్లుగా మహేశ్ కనిపిస్తాడు. ప్రస్తుతం ఆయన ఏజ్ 47 ఏళ్లు. అయినా పాతికేళ్ల కుర్రాడిలా కనిస్తాడు. మహేశ్ కొడుకు గౌతమ్ని పక్కన నిలబెడితే ఇద్దరు అన్నదమ్ముల్లా కనిపిస్తారు. అందుకే కాబోలు ఇప్పటికీ మహేశ్ అంటే అమ్మాయిలకు పిచ్చి ప్రేమ. నమ్రతను చూసి ఈర్షపడే అమ్మాయిలు చాలానే ఉన్నారు. ఇక తాజాగా మహేశ్ నయా లుక్ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఒట్టో బ్రాండ్ షర్ట్స్ యాడ్ కోసం ఫోటో షూట్ చేశాడు మహేశ్. దానికి సంబంధిన ఫోటోలను ట్వీటర్లో షేర్ చేశాడు. అందులో మహేశ్ న్యూలుక్లో మరింత హ్యాండ్సమ్గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం మహేశ్ బాబు యాడ్ కు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘ఏ కాలేజ్ అన్నా?’ ‘ఇంజనీరింగ్ స్టూడెంట్లా ఉన్నావ్’, ‘గ్రీకువీరుడు’ అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మహేశ్ ప్రస్తుతం తివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. పూజాహెగ్డే హీరోయిన్. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా 2024, జనవరి 13న విడుదల కానుంది. Life in luxury! #Otto pic.twitter.com/aSiJUTWVTT — Mahesh Babu (@urstrulyMahesh) April 6, 2023 -
అమెరికాలో జూ. ఎన్టీఆర్ సందడి.. తారక్ కొత్త లుక్ చూశారా?
ఆస్కార్ అవార్డు కార్యక్రమం నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ మూవీ టీం అమెరికాలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్లు వరుసగా హలీవుడ్ మీడియాతో ముచ్చటిస్తున్నారు. వేరుగా వేరుగా ఇంటర్య్వూలు ఇస్తున్న చరణ్, తారక్లు అవకాశం వస్తే హాలీవుడ్లోనూ నటించేందుకు సిద్ధమేనంటూ ఆ దిశగా తమని తాము ప్రమోట్ చేస్తుకుంటున్నారు. అంతేకాదు తరచూ ఫొటోషూట్లకు ఫోజులు ఇస్తున్నారు. చదవండి: ‘బలగం’ మూవీపై చిరంజీవి రివ్యూ, ఏమన్నారంటే.. ఈ క్రమంలో తాజాగా ఎన్టీఆర్ ఇచ్చిన ఫొటోషూట్ నెట్టింట వైరల్గా మారింది. ఇదివరకు ఎన్నడు తారక్ను ఇలా చూడలేదంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. సూట్లో తారక్ మాసివ్ క్లాసీ లుక్ను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎన్టీతార్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. దీంతో ఆయన న్యూలుక్ క్షణాల్లో వైరల్గా మారింది. బ్లూ కలర్ సూట్తో తారక్ చాలా క్లాసీగా, కూల్గా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: తొలిసారి విమానం ఎక్కిన గంగవ్వ హడావుడి చూశారా? ట్రెండింగ్లో వీడియో కాగా ఆర్ఆర్ఆర్ మూవీలో నాటు నాటు ఒరిజినల్ సాంగ్ కాటగిరిలో ఆస్కార్కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. మరి ఆదివారం జరిగే ఈ వేడుకలో ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ ఖాయమంటూ తెలుగు ప్రేక్షకులంతా ధీమా వ్యక్తి చేస్తున్నారు. ఆస్కార్ ఒక్క అడుగు చేరువలో ఉన్న ఆర్ఆర్ఆర్కు ఈ అవార్డు వరిస్తుందా? లేదా? అని భారత ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, హాలీవుడ్ క్రిటిక్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకుని అంతర్జాతీయ వేదికపై సంచలనం సృష్టించింది. View this post on Instagram A post shared by Jr NTR (@jrntr) -
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సుధీర్ బాబు, కొత్తలుక్ చూశారా?
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంట్ హీరో సుధీర్ బాబు ఫలితాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేస్తున్నాడు. ఇటీవల ఆయన యాక్షన్ ఫిలింతో అలరించాడు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన హంట్ బాక్సాఫీసు వద్ద మిశ్రమ స్పందనను అందుకుంది. ఫలితంగా ఈ చిత్రం ప్లాప్గా నిలిచింది. ఇక సుధీర్ బాబు తన తదుపరి సినిమాను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం ఆయన మామ మశ్చీంద్ర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైన హిట్ కొట్టాలని ఆశగా ఎదురు చూస్తున్న సుధీర్ బాబు ఇందుకోసం ప్రమోగం చేస్తున్నాడని అప్పట్లో టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ఇప్పటి వరకు సిక్స్ ప్యాక్, ఫిట్నెస్ లుక్తో ఆకట్టుకున్న సుధీర్ బాబు ఈ సినిమా కోసం బొద్దుగా తయారయ్యాడు. ప్రస్తుతం షూటింగ్ను శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీలో తన లుక్ను తాజాగా విడుదల చేసి ఫ్యాన్స్కి షాకిచ్చాడు. దీనికి ‘బెట్.. ఇలా వస్తానని మీరు అనుకుని ఉండరు’ అని క్యాప్షన్ ఇచ్చాడు. లావుగా ఉన్న సుధీర్ బాబుని ఇలా చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్ సర్ప్రైజ్ అవుతున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఇలా ట్విస్ట్ ఇచ్చావేంటి భయ్యా అంటూ నెటిజన్లు అతడి పోస్ట్ కామెంట్స్ చేస్తున్నారు. Bet you didn't see this coming 😉 Meet Durga! #MaamaMascheendra@HARSHAzoomout @chaitanmusic @pgvinda #SunielNarang @puskurrammohan @SVCLLP #SrishtiCelluloids pic.twitter.com/IWhVydn4ie — Sudheer Babu (@isudheerbabu) March 1, 2023 -
Anasuya Bharadwaj : కొత్త లుక్ ఫోటోలు షేర్ చేసిన యాంకర్ అనసూయ..ఫోటోలు వైరల్
-
నిఖిల్ సిద్ధార్థ్ న్యూ లుక్.. ఫ్యాన్స్కు అదిరిపోయే గుడ్ న్యూస్..!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఇటీవల 18 పేజెస్ మూవీతో మరో హిట్ అందుకున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ కార్తికేయ-2 తర్వాత ఆయన నటించిన చిత్రం ఇదే. ప్రస్తుతం 18 పేజెస్ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న యంగ్ హీరో.. మరో మాస్ లుక్తో అభిమానులకు షాక్ ఇచ్చారు. ప్రేక్షకులను మరోసారి థియేటర్లలో పలకరించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా విడుదలైన నిఖిల్ లుక్ ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. తాజాగా విడుదలైన పోస్టర్ సినిమాపై మరింత హైప్ పెంచుతోంది. ఈ విషయాన్ని హీరో సోషల్ మీడియాలో పంచుకున్నారు. పోస్టర్ను గమనిస్తే.. అందులో నిఖిల్ గన్ పట్టుకుని సీరియస్లో లుక్లో కనిపించారు. నిఖిల్ తన ఇన్స్టాలో రాస్తూ.. 'అఫీషియల్ లీక్.. కార్తికేయ-2 తర్వాత భారీ చిత్రంతో మీ ముందుకు వస్తున్నా. మల్టీ లాంగ్వేజ్ స్పై థ్రిల్లర్ ఈ వేసవిలో మీ ముందుకు రానుంది.' అంటూ పోస్ట్ చేశారు. నిఖిల్ లుక్ చూసిన ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. అన్నా నీ సినిమా కోసం వెయిటింగ్ అని కొందరు.. మరికొందరేమో పోస్టర్ చూడగానే బ్లాక్ బస్టర్ అని కామెంట్స్ పెడుతున్నారు. View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) -
విజయ్ సేతుపతి షాకింగ్ లుక్ వైరల్, అవాక్కవుతున్న ఫ్యాన్స్
కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోగానే కాదు విలన్గానూ సత్తా చాటుతున్నాడు. భాషతో సంబంధం లేకుండా పాత్ర ప్రాధాన్యతను బట్టి అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. వెండితెరపై ఆయన విలక్షణ నటనకు ప్రతి ప్రేక్షకుడు ఫిదా అవుతున్నారు. ఇక ఉప్పెన మూవీతో తెలుగులో విలన్గా పరిచమైన ఆయన త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నారు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విజయ్ సేతుపతి. చదవండి: పెళ్లయిన డైరెక్టర్ను ధన్య బాలకృష్ణ సీక్రెట్ పెళ్లి చేసుకుందా? నటి సంచలన వ్యాఖ్యలు ఇదిలా ఉంటే స్టార్ నటుడిగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకున్న ఆయన లావుగా ఉండటం వల్ల తరచూ బాడీ షేమింగ్ను ఎదుర్కొంటుంటాడు. కాస్తా శరీరంపై శ్రద్ధ పెట్టాలని, డైట్ ఫాలో అవ్వు బ్రో అంటూ నెటిజన్లు ఆయనకు సూచిస్తుంటాడు. ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతి నయా లుక్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇందులో విజయ్ సేతుపతి స్లీమ్గా హీరోలా కనిపించి ట్రోలర్స్కి షాకిచ్చాడు. ఇక ఆయన కొత్త లుక్ చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. దీంతో ఆయన ఫొటోను పలు సామాజిక మాధ్యమాల్లో ఫ్యాన్స్ పేజీలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Vijay Sethupathi (@actorvijaysethupathi) -
మంచు మనోజ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తాడా? ఫోటో వైరల్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. 2017లో వచ్చిన ‘ఒక్కడు మిగిలాడు’ తర్వాత మనోజ్ ఇంతవరకు సినిమా చేయలేదు. ఆ మధ్య ‘అహం బ్రహ్మాస్మి’ అనే పాన్ ఇండియా సినిమాను ప్రకటించినా ఇంతవరకు అది పట్టాలెక్కలేదు. ఇదిలా ఉండగా తాజాగా మనోజ్ షేర్ చేసిన ఓ లెటెస్ట్ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. బ్లాక్ అండ్ వైట్ లుక్లో ఉన్న ఫోటోను షేర్చేసిన మనోజ్ త్వరలోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరుగుతుంది. ఇది సినిమాలోని స్టిల్ అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ మనోజ్ మాత్రం తన నెక్ట్స్ మూవీ గురించి ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు ‘అహం బ్రహ్మాస్మి’ గురించి అప్డేట్ అడగ్గా.. మనోజ్ ఒక స్మైలీ ఎమోజీని షేర్ చేశాడు. మరి ఈ ప్రాజెక్ట్ నుంచి మనోజ్ తప్పుకున్నాడా? లేక మరైదేనా సినిమా అనౌన్స్ చేయనున్నాడా అన్నది చూడాల్సి ఉంది. Adios amigo 🙌🏽 pic.twitter.com/vSSnbL0Sxd — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 8, 2022 -
స్పోర్టీ లుక్లో 2023 కవాసాకి నింజా 650 బైక్: ధర తెలిస్తే షాకే!
సాక్షి, ముంబై: కవాసాకి మోటార్స్ స్పోర్ట్స్ బైక్ లవర్స్ను అకట్టుకునేలా కొత్త వెర్షన్ బైక్ను ఆవిష్కరించింది. కొత్త 2023 కవాసాకి నింజా 650ని భారతీయ మార్కెట్లో తీసుకొచ్చింది నింజా మిడ్-లెవల్ స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్లో మార్కెట్లో మాంచి ఆదరణ పొందింది. ఈ నేపథ్యంలో సరికొత్తగా తీర్చి దిద్ది స్పోర్టీ డిజైన్, కొత్త ఫీచర్లు, అప్డేట్స్తో కొత్త కవాసాకి 2023 నింజా 650నిలాంచ్ చేసింది. లైమ్ గ్రీన్ కలర్ ఆప్షన్లో అందుబాటులో ఉంటుంది. ఇదీ చదవండి: ఆ విషయంలో మనవాళ్లు చాలా వీక్! మీరు అంతేనా?తస్మాత్ జాగ్రత్త! 2023 కవాసాకి నింజా 650 ఇంజీన్, ఫీచర్లు స్పోర్టీ లుక్లో తీసుకొచ్చిన ఈ బూక్లో 649 సీసీ పార్లల్-ట్విన్ ఇంజన్ను జత చేసింది. ఇది 8,000 rpm వద్ద 68 పవర్ను, 6,700 rpm వద్ద 64 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే విండ్షీల్డ్ను కొత్తగా డిజైన్ చేసింది. కొత్త డిజిటల్ TFT కలర్ ఇన్స్ట్రుమెంటేషన్, కాక్పిట్కు హై-టెక్, హై-గ్రేడ్ లుక్, ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్లో ఇచ్చిన బ్లూటూత్ టెక్నాలజీతో రైడర్లు తమ బైక్ను వైర్లెస్గా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. ఇంకా కవాసాకి ట్రాక్షన్ కంట్రోల్తోపాటు, ట్విన్ ఎల్ఈడీ హెడ్లైట్లు,కొత్త డన్లప్ స్పోర్ట్మ్యాక్స్ రోడ్స్పోర్ట్ 2 టైర్లు అందించింది. (ఎయిర్పాడ్స్ మిస్, స్మార్ట్ ఆటో డ్రైవర్ ఏం చేశాడో తెలుసా?) ధర, లభ్యత దేశంలో ఈ బైక్ ధరను రూ.7.12 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ధర నిర్ణయించింది కవాసకి మోటార్స్. అన్ని అధీకృత డీలర్షిప్ల వద్ద ఇప్పటికే కొత్త నింజా 650 బుకింగ్లు మొదలు కాగా, డెలివరీలు త్వరలో ప్రారంభం కానున్నాయి. -
సమంత సర్జరీ చేసుకుందా? సామ్ న్యూలుక్ చూసి షాకవుతున్న ఫ్యాన్స్
స్టార్ హీరోయిన్ సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్ధా కాలం దాటిన ఇప్పటికీ కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్లో ఉంది. వరుస అవకాశాలు ఆమె తలుపు తడుతూనే ఉన్నాయి. ఆమెకు ముందు, ఆమె తర్వాత వచ్చిన హీరోయిన్లు అవకాశాలు లేక ఫేడ్అవుట్ అయ్యారు. కానీ సామ్ మాత్రం ఇప్పటికీ ఆఫర్స్ క్యూ కడుతూనే ఉన్నాయి. ఇక గతేడాది స్టార్ హీరో నాగచైతన్యతో విడిపోయిన ఆమె తరచూ ఏదోకరకంగా వార్తల్లో నిలుస్తోంది. చదవండి: ఆల్భమ్ సాంగ్లో రెచ్చిపోయిన ఉర్ఫీ జావేద్.. తీవ్ర వ్యతిరేకత.. కేసు నమోదు ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్ట్స్తో ఫుల్ బిజీగా ఉంది సమంత. తెలుగు, తమిళ్, హిందీతో పాటు ఓ హాలీవుడ్ చిత్రానికి సంతకం చేసింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్స్ను పూర్తి చేసే పనిలో ఉంది. ఇదిలా ఉంటే ఇటీవల ఆమె విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో సామ్ సర్జరీ కోసమే విదేశాలకు వెళ్లిందంటూ ఆ మధ్య పుకార్లు షికారు చేశాయి. ఈ నేపథ్యంలో సామ్ న్యూలుక్ చర్చనీయాంశమైంది. తాజాగా ఓ ప్రకటనలో సామ్ను చూసి ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందులో సామ్ ముందుకంటే కాస్తా భిన్నంగా కనిపిస్తోంది. చదవండి: పెళ్లిలో నటి పూర్ణ వేసుకున్న బంగారం ఎంతో తెలుసా? సదరు ప్రకటనలో సామ్ డిఫరెంట్గా కనిపించడం చూసి ఆమె ఫాలోవర్స్, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ఏంటీ సామ్ ఇలా మారిపోయింది! సర్జరీ చేసుకుందా?’ అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతం సమంత శాకుంతలం, యశోద చిత్రాల షూటింగ్లో పాల్గొంటుంది. హాస్టారికల్ పాన్ ఇండియా చిత్రం రూపొందుతున్న శాకుంతలం షూటింగ్ చివరి దశకు చేరుకోవడమే కాదు డబ్బింగ్ వర్క్ను కూడా జరుపుకుంటోంది. View this post on Instagram A post shared by Drools (@droolsindia) -
అల్ట్రా స్టైలిష్ లుక్లో మహేష్బాబు.. వైరల్ అవుతున్న ఫోటో
సూపర్స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్కు సిద్ధమవుతుంది. ఈ చిత్రంలో మహేష్ గతంలో ఎన్నడూ చేయలేని మాస్ పాత్రలో కనిపించనున్నాడట. SSMB28 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఇప్పటికే మాంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో సరికొత్త లుక్లో కనిపించనున్న మహేశ్ తాజాగా అల్ట్రా స్టైలిష్ లుక్లో కనిపించారు. ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ స్టైలిష్ట్ ఆలీమ్ హకీమ్ మహేశ్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయగా క్షణాల్లో ఆ పిక్ వైరల్గా మారింది. వయసు పెరుగుతున్నా రోజురోజుకి మరింత యంగ్ లుక్లో కనిపిస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Aalim Hakim (@aalimhakim) -
స్టార్స్ మేకోవర్, న్యూ లుక్కు.. వెరీ కిక్కు
అభిమాన హీరోలు కొత్తగా కనబడితే ఫ్యాన్స్కి ఓ కిక్. అయితే ప్రతి సినిమాకీ కొత్తగా కనిపించడం కుదరదు. వెరైటీ క్యారెక్టర్ చేసినప్పుడు కొత్త లుక్ ట్రై చేస్తుంటారు. సూపర్ స్టార్ ట్యాగ్ ఉన్న ఇద్దరు హీరోలు రజనీకాంత్, మహేశ్బాబు ఇప్పుడు కొత్త హెయిర్ స్టయిల్ ట్రై చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫిజిక్ని మార్చుకుంటున్నారు. ఇంకా నేచురల్ స్టార్ నానీతో పాటు మరికొందరు హీరోలు కూడా ఫిజికల్గా మేకోవర్ అయ్యారు. ‘న్యూ లుక్కు.. వెరీ కిక్కు’ అంటూ వీరు కనిపించనున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. రజనీకాంత్ చాలా సింపుల్.. తెల్ల జుట్టు, నెరిసిన గడ్డంతోనే కనిపిస్తారు. కానీ సినిమాల్లో నల్లటి విగ్గుతో స్టయిలిష్గా కనబడతారు. అయితే ఇప్పటివరకూ కనిపించినట్లుగా కాకుండా ‘జైలర్’ సినిమాలో కొత్త రకం హెయిర్ స్టయిల్తో ఆకట్టుకోనున్నారు. ముంబైకి చెందిన హెయిర్ స్టయిలిస్ట్ హకీమ్ అలీమ్ ఈ సూపర్ స్టార్ని కొత్త రకం హెయిర్ స్టయిల్లో చూపించనున్నారు. రజనీతో హకీమ్ ఓ ఫొటో దిగి, కొత్తగా చూపించనున్నట్లు సోషల్ మీడియా ద్వారా చెప్పినప్పటి నుంచి ఈ సినిమాలో తమ అభిమాన హీరో గెటప్ విడుదల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. చదవండి: నెట్టింట దుమారం రేపుతున్న అనసూయ ట్వీట్.. ఉలిక్కిపడ్డ యాంకరమ్మ అయితే దానికి ఇంకా సమయం ఉంది. ఎందుకంటే ఇంకా షూటింగే ఆరంభం కాలేదు. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వం వహించనున్నారు. ఇక తెలుగు విషయానికొస్తే.. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లో కనిపించనున్నారు మహేశ్బాబు. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్న సినిమాలో అక్కడక్కడా తెల్ల జుట్టుతో కొత్తగా కనిపించనున్నారు మహేశ్. రజనీకి హెయిర్ స్టయిల్ చేస్తున్న హకీమ్ అలీమ్నే మహేశ్కి ఈ హెయిర్ స్టయిల్ చేస్తున్నారు. ఆ ఫొటోను నాలుగైదు రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు కూడా. ఇక ‘శనివారం ఉదయం ఇలా కూల్గా పూల్లో’ అంటూ చొక్కా లేకుండా మహేశ్బాబు ఓ ఫొటో షేర్ చేశారు. కొంచెం బీస్ట్ (దృఢంగా) లుక్లో కనిపించారు. దాంతో త్రివిక్రమ్ సినిమాలో కొత్త హెయిర్ స్టయిల్లోనే కాదు.. ఫిజిక్ పరంగా కూడా కొత్తగా కనిపించనున్నారని ఊహించవచ్చు. పైగా మేకోవర్ కోసం ఫిట్నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ని నియమించుకున్నారు మహేశ్. ఇక ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత నెక్ట్స్ సినిమా షూటింగ్లోకి ఎంటరయ్యేలోపు ఫ్యామిలీతో వెకేషన్ని ఎంజాయ్ చేస్తూ మరోవైపు మేకోవర్ మీద కూడా దృష్టి పెట్టారట ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ స్లిమ్ లుక్లో కనిపిస్తారట. దాదాపు పది కిలోలు బరువు తగ్గాలని టార్గెట్గా పెట్టుకున్నారని భోగట్టా. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్న సినిమాలో ఎన్టీఆర్ డార్క్ మేకప్తో డిఫరెంట్గా కనిపించనున్నారు. చదవండి: కరీనాకు ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ చురక, ఆమె కామెంట్స్పై ఘాటు స్పందన మరోవైపు గోదావరి ఖనిలోని బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందుతున్న ‘దసరా’ చిత్రం కోసం నాని పూర్తిగా మారిపోయారు. ఈ చిత్రంలో ఊర మాస్లో లుక్లో నాని కనిపిస్తారు. కొంచెం పెరిగిన జుట్టు, బరువు తగ్గిన ఫిజిక్తో నాని మేకోవర్ అయ్యారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. ఇంకోవైపు ‘ఏజెంట్’ కోసం అఖిల్ సిక్స్ ప్యాక్ ఫిజిక్కి మారిపోయారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే ఈ నెల 25న విడుదల కానున్న ‘లైగర్’లో బాక్సర్లా కనిపించడానికి విజయ్ దేవరకొండ ఫిజిక్ని మార్చుకున్నారు. ఇంకా పలువురు హీరోలు పాత్రకి తగ్గట్టు లావుగా లేక సన్నగా కనిపించే ప్రయత్నాల్లో ఉన్నారు. హెయిర్ స్టయిల్ పరంగానూ ప్రయోగాలు చేస్తున్నారు. ఈ కొత్త మేకోవర్ ఫ్యాన్స్కి కిక్కో కిక్కు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
ట్రై సైకిల్ను ఢీ కొట్టిన కారు
ప్రపంచ న్యాయస్థానం తీర్పుని సమర్థించిన భారత న్యాయమూర్తి!
అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువతీ మృతి
కిడ్నాప్ కేసులో యువకుడి అరెస్టు
అవినీతి ఆరోపణలతో ఇన్స్పెక్టర్ సస్పెన్షన్
కోడలు మీద పెట్రోలు పోసి సజీవ దహనం
చెత్త కుండీ కోసం గొడవలు
విద్యార్థులతో పనులు చేయించొద్దు
విద్యార్థినులకు ఎస్కేపీసీ చేయూత
అడవిలోకి చిరుత
తప్పక చదవండి
- యుద్ధ ట్యాంకుల రేసులో భారత్ ఘన విజయం
- హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో శృతి భావోద్వేగ ప్రసంగం: చప్పట్లతో మారుమోగిన క్యాంపస్
- అతనితో రవితేజ హీరోయిన్ పెళ్లి.. ఇప్పుడేమో వేల కోట్లకు!
- పాయింట్ బ్లాంక్లో డీజేపై కాల్పులు
- భారత్ నుంచి 40 దేశాలకు మేడ్ ఇన్ ఇండియా కార్లు
- ఇండస్ట్రీలో విషాదం.. నటుడిని కాల్చిచంపిన దుండగులు!
- అదిరిపోయే ఫీచర్లతో.. త్వరలో విడుదల కానున్న మరో రెడ్మీ సిరీస్ ఫోన్
- IPL 2024: ఓ పక్క స్టార్క్.. మరోపక్క అయ్యర్..!
- గంభీర్ కాదు!.. కేకేఆర్ విజయాల్లో అతడిది కీలక పాత్ర.. ముగ్గురు హీరోలు
- ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Advertisement