-
ముత్తు నందిని ప్యాలెస్ ఇష్టాల ఇల్లు
రాజ్ చందర్ పద్మనాభన్, నాగ జయలక్ష్మి దంపతులు తమిళనాడు రాష్ట్రం, కన్యాకుమారిలో నివసించేవారు. సొంత ఇంటి కలను నెరవేర్చుకునే క్రమంలో వీరు అనుసరించిన విధానం ఇప్పుడు దేశమంతటినీ ఆకర్షిస్తోంది. పర్యావరణ ప్రేమికులనైతే మరీ ఎక్కువగా ఆకట్టుకుంటోంది. రెండేళ్ల కిందట గృహప్రవేశం చేసుకున్న కొత్త ఇల్లది. అయితే ఆ ఇంట్లో అడుగుపెడితే కాలం గిర్రున సినిమా రీల్లాగ వందేళ్ల వెనక్కి తిరిగిపోయిందా అనిపిస్తుంది. ఇంటిని చూడడానికి వచ్చిన వాళ్లను అతిథి మర్యాదలతో ముంచెత్తుతారు ఈ దంపతులు. సేంద్రియ పద్ధతిలో పండించిన దినుసులు, కాయగూరలతో సంప్రదాయ తమిళ, చెట్టినాడు వంటలను వడ్డిస్తారు. ఎర్రమట్టి, సున్నపు రాయితో నిర్మించిన ఇంట్లో భూగర్భ జలాలను పరిరక్షించే ఏర్పాటు ఉంది. బంకమట్టి నిర్మాణం కావడంతో ఎండాకాలం చల్లగా ఉంటుంది. నేచర్ ఫ్రెండ్లీ ట్రావెల్ను ఇష్టపడే వాళ్లు ఇక్కడ బస చేస్తుంటారు. బస చేయకపోయినా చూసి పోవడానికి వచ్చేవాళ్లు కూడా ఎక్కువగానే ఉంటారు. ఈ కాలంలో ఇంటిని ఇలా ఎందుకు కట్టుకున్నారనే ప్రశ్న దాదాపుగా ప్రతి ఒక్కరి నుంచి ఎదురవుతుంటుంది. జయలక్ష్మి ప్రతి ఒక్కరికీ పూసగుచ్చినట్లు వివరిస్తుంటుంది. బాల్యంలోకి వెళ్లారాయన! ‘‘రాజ్చందర్ వృత్తిరీత్యా జియో డాటా అనలిస్ట్. ఆయనకు ఇష్టమైన రోజులంటే చిన్నప్పుడు వాళ్ల అమ్మమ్మ గారింట్లో గడిపిన బాల్యమే. పైగా రాజ్ అభిరుచి, విధి నిర్వహణ కూడా పర్యావరణవేత్తలతో కలిసి పని చేయడమే. ఈ రెండు ఇష్టాలను కలుపుతూ చక్కటి ఇల్లు కట్టుకోవాలని ఎప్పుడూ చెప్పేవారు. నాక్కూడా మా సంప్రదాయ నిర్మాణంలో ఉండే సౌందర్యం చాలా ఇష్టం. ఇద్దరి అభిరుచులూ కలవడంతో ఇంటిని ఇలా కట్టుకున్నాం. మా ఇద్దరి ఇష్టాల మేరకు ఎలా కట్టుకోవాలో ఒక ఐడియా వచ్చేసింది. ఎక్కడ కట్టాలనే విషయంలో ఒక అభిప్రాయానికి రావడం కొంచెం కష్టమే అయింది. లొకేషన్ సెర్చింగ్ మొదలు పెట్టాం. సంజీవని శకలం కన్యాకుమారికి సమీపంలో పోథయాడి గ్రామాన్ని చూసినప్పుడు కొండలు, పచ్చటి చెట్లతో ప్రదేశం బాగుందనిపించింది. ఆశ్చర్యంగా మరో విషయం తెలిసింది. అదేంటంటే... రామాయణంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు వైద్యం కోసం హనుమంతుడు ఏకంగా సంజీవని మొక్క ఉన్న పర్వతం అంతటినీ ఎత్తుకొచ్చాడని విన్నాం. వైద్యం చేసిన తర్వాత ఆ పర్వతాన్ని తిరిగి తీసుకెళ్లే క్రమంలో పర్వతంలోని ఒక శకలం విరిగి కింద పడి పోయిందని, ఆ శకలమే ఈ కొండ అని చె΄్పారు స్థానికులు. వాళ్ల విశ్వాసాన్ని పక్కన పెడితే ఆ కొండమీద చుట్టు పక్కల ఉన్న మొక్కలన్నీ ఔషధ మొక్కలే. ప్రకృతితో మమేకమై నివసించడానికి మాకు ఇంతకంటే సౌకర్యవంతమైన ప్రదేశం మరోటి ఉండదేమో అనిపించింది. అంతే... 2021లో నిర్మాణం మొదలు పెట్టాం. ఒక ఏడాదిలో తమిళ, వేనాడు, చెట్టినాడు సంస్కృతుల సమ్మేళనమైన మా ఇంటి నిర్మాణం పూర్తయింది. సంప్రదాయ కళాకృతుల సేకరణ నా హాబీ. ఇంటిని తమిళ సంప్రదాయ సంస్కృతికి ప్రతీకగా మలిచాను. ఇంటి ముఖద్వారం నుంచి నేల, గోడ, మెట్లు, పై కప్పు, అలంకరణ వస్తువులు ప్రతి ఒక్కటీ తమ వైభవాన్ని తామే చెప్పుకుంటాయి. పర్యావరణ హితమైన సున్నపు పోడి ఇటుకలు, ఎర్ర మట్టి, ఆవుపేడ, ధాన్యం పోట్టు, కోడిగుడ్లు, బెల్లంతోపాటు అత్తంగుడి నది తీరాన దొరికే ఇసుకతో తయారు చేసే అత్తంగుడి టైల్స్ను వాడాం. పై కప్పుకి కాంక్రీట్ వాడకాన్ని తగ్గించి ఫిల్లర్ స్లాబ్ టెక్నిక్ ఉపయోగించాం. వర్షపు నీటిని నిల్వ చేయడానికి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్, కరెంటుకోసం సోలార్ ప్యానెల్స్ పెట్టాం. ఈ మట్టి సౌధంలో 5బెడ్ రూమ్లు, మూడు బాల్కనీలు, మూడు లివింగ్ స్పేస్లు ఉన్నాయి. ఇప్పటివరకు రెండు వందల మందికి పైగా పర్యాటకులు ఈ హోమ్ స్టేలో బస చేశారు. ఆహారం కూడా తమిళనాటప్రాంంతాల వారీగా విలసిల్లిన విభిన్నమైన రుచులుంటాయి. ఇంటి ఆవరణలో అన్ని రకాల కూరగాయలనూ పండిస్తాం. వంటగదిలో వచ్చే వ్యర్థాలనే ఎరువుగా వేస్తాం’’ అని తమ పర్యావరణ హిత భవనం ముత్తు నందిని ప్యాలెస్ గురించి వివరించింది జయలక్ష్మి. -
పాతబస్తీ: కింగ్స్ ప్యాలెస్ యజమాని ఇంట్లో ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో ఆదాయపు పన్నుశాఖ అధికారులు సోదాలు జరుపుతున్నారు. కింగ్స్ ప్యాలెస్ యజమాని షానవాజ్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. మంగళవారం ఉదయం నుంచి ఈ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కాగా గతంలోనూ షానవాజ్ ఇంట్లో ఐటీ దాడులు చేసింది. అయితే ఆ సమయంలో షానవాజ్ దుబాయ్ వెళ్లిపోయాడు.. తాజాగా ఆయన్ను దుబాయ్ నుంచి తీసుకొచ్చిన అధికారులు ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయపు పన్ను కట్టకుండా తప్పించుకున్నారన్న సమాచారంతోనే ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. చదవండి: కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాలేదంటే.. -
‘చింతకాయల’కు చెంపదెబ్బలు రాల్తాయ్!
విశాఖపట్నంలోని గాదిరాజు ప్యాలెస్లో ఆక్రమణలో ఉన్న మిగులు భూమిని 0.3530 చదరపు మీటర్లుగా తేలుస్తూ 2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి జాయింట్ కలెక్టర్, కలెక్టర్ సంతకాలతో 22ఏ జాబితాను విడుదల చేశారు. మిగులు భూమిగా తేల్చిన మొత్తాన్ని 22 ఏ 1(డీ) జాబితాలో టీడీపీ ప్రభుత్వమే చేర్చింది. వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా భూముల సర్వేలో భాగంగా మళ్లీ పక్కాగా సర్వే చేసి గాదిరాజు ప్యాలెస్లో వాస్తవ మిగులు భూమి కేవలం 0.1141 చదరపు మీటర్లుగా తేల్చింది. అంతేకాకుండా దీన్ని క్రమబద్ధీకరించుకోవాలని గత మే నెలలోనే జాయింట్ కలెక్టర్.. స్థానిక తహసీల్దార్ ద్వారా నోటీసులు జారీ చేశారు. మిగులు భూమిని క్రమబద్ధీకరించుకోవడం ద్వారా పక్కాగా యాజమాన్య హక్కులను పొందేందుకు గాదిరాజు రామకృష్ణరాజుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. వాస్తవాలు ఇలా ఉండగా... దొంగే దొంగ దొంగ అన్నట్టుగా అయ్యన్నపాత్రుడు అసత్య ఆరోపణలు చేశారు. వీటిపై స్పష్టత తీసుకునేందుకు శుక్రవారమంతా మీడియా ప్రయత్నించినా ఆయన ముఖం చాటేశారు. దీన్ని బట్టి కావాలనే ఆయన తప్పుడు ఆరోపణలు చేశారని తేటతెల్లమవుతోంది. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/విశాఖ సిటీ ఇది వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గాదిరాజు ప్యాలెస్ ఉన్న ప్రాంతంలో యూఎల్సీ భూమి ఉన్నట్టు తేల్చిన విస్తీర్ణం కేవలం 0.1141 చదరపు మీటర్లు. తాజాగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పక్కాగా తేల్చిన సర్వే ప్రకారం మిగులు భూమి సుమారు 6 సెంట్ల మేర తగ్గింది. అంటే ప్రస్తుత ప్రభుత్వం పక్కాగా సర్వే చేసి వాస్తవ లెక్కలను తేల్చింది. దీన్నిబట్టి గత టీడీపీ ప్రభుత్వమే ఎక్కువ లెక్కలను చూపి గాదిరాజు యాజమాన్యాన్ని బెదిరించే ప్రయత్నం చేసిందని అర్థమవుతోంది. అయితే, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు సీఎం కుటుంబంపై దుష్ప్రచారమే చేయడమే లక్ష్యంగా తప్పుడు ఆరోపణలకు దిగారు. గాదిరాజు ప్యాలెస్ కావాలని దాని యజమానిని ముఖ్యమంత్రి సతీమణి కోరారని అభూత కల్పనలను సృష్టించేశారు. ఇందుకు గాదిరాజు ప్యాలెస్ యజమాని రామకృష్ణరాజు ఒప్పుకోకపోవడంతో ఆ ప్యాలెస్ను 22ఏ నిషేధిత భూముల జాబితాలో చేర్చారంటూ అసత్య ఆరోపణలు చేశారు. వాస్తవానికి అయ్యన్నపాత్రుడు తన కుమారుడికి ఎంపీ టికెట్, తనకు ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే చంద్రబాబు నుంచి సానుకూలత వ్యక్తం కాలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తే చంద్రబాబు మెప్పు పొందొచ్చని దిగజారుడు రాజకీయానికి దిగారు. రూ.5 వేల కోట్ల విలువైన భూములకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రక్షణ.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గీతం యూనివర్సిటీ మొదలుకుని అనేక మంది టీడీపీ నేతలు ప్రభుత్వ భూములను దర్జాగా ఆక్రమించేశారు. అందినకాడికి బినామీ పేర్లతో కబ్జా చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏకంగా రూ.5 వేల కోట్లకుపైగా విలువ చేసే ప్రభుత్వ భూములను కబ్జా కోరుల నుంచి రక్షించింది. ఎక్కడికక్కడ ప్రభుత్వ భూముల్లో బోర్డులను పాతడంతో పాటు చుట్టూ అధికారులు రక్షణ కంచె ఏర్పాటు చేశారు. దీన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధానంగా గీతం వర్సిటీ ఆక్రమించిన ప్రభుత్వ భూములను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్యాలెస్ అడిగారనేది పూర్తిగా అవాస్తవం.. గాదిరాజు ప్యాలెస్ ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి తన అనుచరులను పంపించి అడిగించారన్న టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. ఈ వ్యవహారంలో జిల్లా కలెక్టర్పై కూడా అభాండాలు వేయడం బాధ కలిగించింది. ప్యాలెస్ ఇవ్వడానికి నేను ఒప్పుకోకపోవడంతో ప్యాలెస్ స్థలాన్ని 22ఏలో పెట్టి జిల్లా కలెక్టర్ ద్వారా నోటీసులు ఇప్పించారని ఒక పత్రికలో వార్త రాయడం అన్యాయం. ఇంత దారుణమైన, అసలు సంబంధంలేని వార్తను నేనెప్పుడూ చూడలేదు. నేను అయ్యన్నపాత్రుడిని కలిసినట్లు చెప్పడం సమంజసం కాదు. ఇప్పటివరకు కనీసం నేరుగా కూడా ఆయనను చూడలేదు. వాస్తవానికి ఇదేం పెద్ద ప్యాలెస్ కాదు.. వేరే ప్రాంతంలో ఉన్న మోడల్ను చూసి నచ్చి ఇక్కడ నిర్మించుకున్నాను. పెద్దవారికి ఇది చాలా చిన్న విషయం.. ఇటువంటి బిల్డింగ్ను ఎవరైనా కట్టొచ్చు. మూడు నెలల కిందట అనారోగ్యానికి గురవడంతో హైదరాబాద్లో చికిత్స తీసుకుంటున్నా.. ఇప్పటికీ కోలుకోలేదు. ఈ పరిస్థితుల్లో నన్ను ఎవరూ, ఎక్కడా కలవలేదు. రాజకీయాలతో ఏ సంబంధంలేని నన్ను, జిల్లా కలెక్టర్ను ఇందులో ఎందుకు లాగారో అర్థం కావడం లేదు. గాదిరాజు ప్యాలెస్ స్థలాన్ని 1997లో కొనుగోలు చేశా.. అన్ని అనుమతులు తీసుకున్నాకే నిర్మాణాలు చేపట్టా. ఈ భూమిలో కొంత స్థలం మిగులు భూమిలో ఉందని.. ఏడాదిన్నర క్రితమే నోటీసు ఇచ్చారు. రెవెన్యూ సిబ్బందిలో కొందరికి పూర్తి అవగాహన లేకపోవడంతో కొంత స్థలం మిగులు భూమిలో ఉందని చూపించారు. వాస్తవానికి గతంలోనే నిబంధనల ప్రకారం అన్నీ చెల్లించి ప్రతి గజాన్ని రిజిస్టర్ చేయించుకున్నా. అది యూఎల్సీ స్థలమని ఎవరైనా నిరూపిస్తే నా ఆస్తి రాసిస్తా. –గాదిరాజు రామకృష్ణరాజు, గాదిరాజు ప్యాలెస్ యజమాని వాస్తవాలు తెలుసుకోకుండా రాస్తే చర్యలు.. ప్యాలెస్కు సంబంధించిన భూమి చినవాల్తేరు గ్రామంలో సర్వే నెంబర్ 10/4ఏ2ఏ, 10/4ఏ2బీ/2ఏ, 10/5ఏ2లో 0.2937 చదరపు మీటర్ల విస్తీర్ణం మిగులు భూమిగా ఉన్నందున 2018లోనే ప్రభుత్వ నిషేధిత భూముల జాబితా 22ఏ (1)(డీ) రిజిస్టర్లో నమోదైంది. ప్రసుత్తం ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 84 ప్రకారం.. సదరు మిగులు భూమిని క్రమబద్ధీకరించుకోవాలని గాదిరాజు ప్యాలెస్ యజమానిని కోరుతూ ఈ ఏడాది మే 23న సీతమ్మధార తహసీల్దార్ నోటీసు జారీ చేశారు. ఒక పత్రికలో పేర్కొన్న విధంగా ప్యాలెస్ యజమాని ఎప్పుడూ కలెక్టర్ను ఈ విషయంపై సంప్రదించలేదు. ఈ విషయంలో ఎవరి నుంచి ఎటువంటి ఒత్తిళ్లు లేవు. ప్రభుత్వ అధికారి ప్రతిష్టలకు భంగం కలిగించేలా వార్తలు ప్రచురిస్తే పరువునష్టం దావా వేసి న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – కె.ఎస్.విశ్వనాథన్, జాయింట్ కలెక్టర్, విశాఖపట్నం బాబు మెప్పు కోసమే అయ్యన్న అసత్యప్రచారం డెప్యూటీ సీఎం ముత్యాలనాయుడు ఆగ్రహం తిరుపతి కల్చరల్: కేవలం చంద్రబాబు మెప్పు కోసమే వైఎస్ కుటుంబంపై టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నోటికొచ్చినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని డెప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు ధ్వజమెత్తారు. తిరుపతి ప్రెస్క్లబ్లో మంత్రి ముత్యాలనాయుడు మీడియాతో మాట్లాడుతూ విశాఖలో గాదిరాజు ప్యాలెస్కు సంబంధించి అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేయడంతోపాటు అక్కడ పారిశ్రామిక అభివృద్ధి కోసం సీఎం జగన్ చేసే ప్రయత్నాలు గిట్టని టీడీపీ నేతలు నిత్యం అడ్డగోలు అబద్ధాలతో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉండగానే 2018లో గాదిరాజు ప్యాలెస్కు సంబంధించిన 3వేల చదరపు గజాల భూమిని 22ఏ 1డీ సీలింగ్లో పెట్టిందని చెప్పారు. ఆ భూమిని రెగ్యులరైజ్ చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఐదు నెలల కిందట ప్యాలెస్ యజమానికి నోటీసులు ఇచ్చారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో తనకు, తన కుమారుడికి టికెట్ల కోసమే వైఎస్ జగన్ కుటుంబంపై అయ్యన్నపాత్రుడు బురదజల్లుతూ మతి భ్రమించి ఆరోపణలు చేస్తున్నారన్నారు. టీడీపీ కుట్ర రాజకీయాలకు కాలం చెల్లిందని, వారి అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని స్పష్టంచేశారు. అధికార దాహంతో అయ్యన్న చేసిన అసత్య ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఇంతకంటే ఖరీదైన ప్యాలెస్ మరొకటి లేదు! ముఖేష్ అంబానీ యాంటిలియా దీని తరువాతే..
ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఇల్లు ఏదంటే, చాలామంది ముంబైలోని యాంటిలియా పేరు చెబుతారు. దీని కంటే ఖరీదైన ప్యాలెస్ మరొకటి ఉందంటే నమ్మడానికి కొంత సమయం పట్టొచ్చు, కానీ ఇది నిజం. ఈ ఖరీదైన ప్యాలెస్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బిలియనీర్ ముఖేష్ అంబానీ యాంటిలియా కంటే ఖరీదైన భవనం 'బకింగ్హామ్ ప్యాలెస్'. ఇది ప్రస్తుతం కింగ్ చార్లెస్ III నేతృత్వంలోని బ్రిటన్ రాజకుటుంబ నివాసం. 1703లో నిర్మించిన ఈ ప్యాలెస్ ప్రపంచంలో అత్యంత ఖరీదైనదిగా కీర్తి పొందుతోంది. 19వ శతాబ్దంలో క్వీన్ విక్టోరియా అధికారంలోకి వచ్చిన తరువాత ఈ రాజభవనాన్ని మళ్ళీ పునర్నిర్మించారు. ఆ తరువాత కూడా చాలా సంవత్సరాలు ఇది కొన్ని కొన్ని మార్పులు పొందుతూనే ఉంది. ప్రస్తుతం బకింగ్హామ్ ప్యాలెస్లో 775 గదులు ఉన్నాయి. ఇందులో 19 స్టేటురూమ్లు, రాయల్స్, అతిథుల కోసం 52 బెడ్రూమ్లు, సిబ్బందికి 188 బెడ్రూమ్లు, 92 ఆఫీసులు, 78 బాత్రూమ్లు ఉన్నాయి. ఇదీ చదవండి: సినిమాలకు దూరంగా హీరోయిన్.. అయినా కోట్లు ఖరీదు చేసే అపార్ట్మెంట్ కొనేసింది! ఈ భవనం విక్రయిస్తే 4.9 బిలియన్ల కంటే ఎక్కువ డబ్బు రావొచ్చని అంచనా. ముఖేష్ అంబానీ విలాసవంతమైన యాంటిలియా ధర కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ. బ్రిటీష్ వారు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను పాలించినప్పటి నుంచి బకింగ్హామ్ ప్యాలెస్ అత్యంత విలువైన ఆభరణాలకు, సంపదకు నిలయంగా విరాజిల్లింది. ముఖేష్ అంబానీకి చెందిన యాంటిలియా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రెండవ ప్యాలెస్. దీని విలువ రూ. 15000 కోట్లు కంటే ఎక్కువ. 27 అంతస్తులు కలిగిన ఈ భవనంలో మొదటి ఆరు అంతస్తులలో అంబానీ కుటుంబంలోని వ్యక్తులు ఉన్నారు. మిగిలిన అంతస్తుల్లో ఎన్నెన్నో విలాసవంతమైన సదుపాయాలు ఉన్నట్లు సమాచారం. -
రావణుని వైభోగం ఎంత? అవశేషాలు ఎక్కడున్నాయి?
దసరా రోజున రావణ దహనం చేస్తారు. ఇది మనలోని చెడును కాల్చివేయాలనే సందేశాన్ని అందిస్తుంది. అయితే ఇప్పుడు మనం రావణ దహనం గురించి కాకుండా రావణుని వైభోగం గురించి తెలుసుకోబోతున్నాం. రావణుడు ఎంత విలాసవంతమైన జీవితాన్ని గడిపాడో? అతని రాజభవనం ఎంత విలాసవంతమైనదో ఈ కథనంలో తెలుసుకుందాం. నేడు శ్రీలంకలో కనిపించే ‘సిగిరియా’ ఒకప్పుడు రావణుడి లంక అని చెబుతారు. రావణునికి ఇక్కడ ఒక పెద్ద రాతిపై ఒక రాజభవనం ఉందని, అక్కడ అతను సురక్షితంగా నివసించాడని స్థానికులు చెబుతారు. ఇక్కడికి సమీపంలో ఒక ప్రత్యేక విమానాశ్రయం ఉందని, అక్కడ నుండే రావణుని పుష్పక విమానం ఎగురేదని చెబుతారు. ఆనాటి కాలానికి అనుగుణంగా రావణుడి రాజభవనం పలు ఆధునిక సౌకర్యాలతో ఉండేది. రావణుని రాజభవనానికి లిఫ్ట్ సౌకర్యం ఉందని, నీటి నిర్వహణకు ఆధునిక వ్యవస్థ కూడా ఉండేదని చెబుతారు. మీడియా కథనాల ప్రకారం శ్రీలంకలోని సిగిరియా రాతిపై పురాతన ప్యాలెస్ అవశేషాలు కనిపించాయి. ఇక్కడి రాగైలా అడవుల్లో రావణుని మృతదేహాన్ని దాదాపు 8 వేల అడుగుల ఎత్తులో ఉంచినట్లు శ్రీలంక మీడియా పేర్కొంది. దానిని మమ్మీ రూపంలో ఉంచారని చెబుతారు. అయితే దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. శ్రీలంకలో రావణుని ప్యాలెస్ ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఇది కూడా చదవండి: ఇందిర ‘మూడవ కుమారుడు’ ఎవరు? -
బుడగల మాదిరి భవనం..కట్టడానికే 14 ఏళ్లు..కానీ..
ఈ విచిత్ర నిర్మాణం ఫ్రాన్స్లోనిది. పీయెయిర్ బెర్నార్డ్ అనే ఫ్రెంచ్ పారిశ్రామికవేత్త ఈ భవనాన్ని కట్టించుకున్నాడు. ప్రపంచంలో ఎక్కడా లేనంత వినూత్నంగా భవనాన్ని నిర్మించాలని కోరడంతో ఫిన్నిష్ ఆర్కిటెక్ట్ యాంటీ లోవాగ్ 13 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ బుద్బుద భవంతికి రూపకల్పన చేశాడు. దీని నిర్మాణానికి పద్నాలుగేళ్లు పట్టింది. చూడటానికి విచిత్రంగా బుడగల మాదిరిగా కనిపించే ఈ భవన నిర్మాణాన్ని 1975లో మొదలుపెడితే, 1989లో పూర్తయింది. ఇందులోకి వచ్చిన రెండేళ్లకే బెర్నార్డ్ మరణించాడు. తర్వాత దీనిని ఫ్రెంచ్ ఫ్యాషన్ డిజైనర్ పీయెయిర్ కార్డిన్ కొనుగోలు చేశాడు. భవనం పాతబడినట్లు అనిపించడంతో ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ ఓడిల్ డెక్ ఆధ్వర్యంలో మరమ్మతులు జరిపించి, కొత్త హంగులు సమకూర్చాడు. దీనిని 2017లో 350 మిలియన్ యూరోలకు (రూ.3120 కోట్లు) అమ్మకానికి పెట్టినా, కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈలోగా 2020లో కార్డిన్ మరణించాడు. ఇప్పుడు దీన్ని విహారయాత్రలకు వచ్చే పర్యాటకులకు అద్దెకు ఇస్తున్నారు. (చదవండి: 16 రోజుల్లో యూరప్ చుట్టేశాడు!..అదికూడా కేవలం..) -
ప్రియాంక చోప్రా సోదరి పెళ్లి.. ఆ మాత్రం రేంజ్ ఉండాల్సిందే!
బాలీవుడ్ భామ, ప్రియాంక చోప్రా సోదరి పరిణీతి చోప్రా త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. ఆప్ పార్టీకి చెందిన రాఘవ్ చద్దాతో కొన్నేళ్లపాటు డేటింగ్ కొనసాగించిన భామ.. ఆ తర్వాత అఫీషియల్గా ప్రకటించింది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట ఈనెలలోనే వివాహా బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో వీరిపెళ్లి వేదికపై బీటౌన్లో తెగ చర్చనడుస్తోంది. తారల డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే ఏ రేంజ్లో ఉంటుందో అందరికీ తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వేదిక ముస్తాబవుతోంది. వీరి పెళ్లి కోసం జరుగుతున్న ఏర్పాట్లపై ఓ లుక్కేద్దాం. ఇద్దరు ప్రముఖ రంగాలకు చెందిన వారు కావడంతో అతిథులు సైతం అదేస్థాయిలో రానున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: స్టార్ హీరో లగ్జరీ విల్లా.. అద్దెకు కూడా ఇస్తారట!) బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా ఈనెల 24న వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. తేదీలను ఇంకా ధృవీకరించనప్పటికీ వారి సన్నిహితులు ఈ విషయాన్ని వెల్లడించారు. రాజస్థాన్లోని ఉదయపూర్ ప్యాలెస్ వీరి పెళ్లికి వేదికగా నిలవనుంది. మూడు రోజుల పాటు జరిగే మెహందీ, సంగీత్, హల్దీ వేడుకల కోసం లీలా ప్యాలెస్ ముస్తాబవుతోంది. అత్యంత ఖరీదైన హోటల్ ఈ ప్యాలెస్లోని హోటల్ గది ఒక్కరోజుకు అత్యధికంగా రూ. 9 లక్షలకు పైగా ధర ఉన్నట్లు సమాచారం. వీరి పెళ్లికి ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా హాజరు కానున్నారు. అయితే పెళ్లి తర్వాత గురుగ్రామ్లో గ్రాండ్గా రిసెప్షన్ బాష్ను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మే 13న దిల్లీలోనిపరిణీతి, రాఘవ్ల నిశ్చితార్థ వేడుకకు కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ప్రియాంక చోప్రా హాజరయ్యారు. (ఇది చదవండి: ఆ తప్పు చేయడం వల్లే కెరీర్ నాశనం: ధనుశ్) View this post on Instagram A post shared by 𝐓𝐡𝐞 𝐋𝐞𝐞𝐥𝐚 𝐏𝐚𝐥𝐚𝐜𝐞 𝐔𝐝𝐚𝐢𝐩𝐮𝐫 (@theleelapalaceudaipur) -
Allu Arjun In Nalgonda Latest Photos: నాగార్జునసాగర్లో ఐకాన్ స్టార్ సందడి (ఫొటోలు)
-
అందులోని వాహనాల ఖరీదే వేలకోట్లు.. ఆ ప్యాలెస్ గురించి తెలిస్తే షాకవుతారు!
World Biggest Palace Istana Nurul Iman: ఇప్పటి వరకు భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని అత్యంత ఖరీదైన భవనాల జాబితాలో 'యాంటిలియా' ఉన్న విషయం తెలిసిందే. ఈ భవనం కంటే కూడా ఇంకా ఖరీదైన.. విశాలమైన & విలాసవంతమైన ప్యాలెస్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ఇస్తానా నూరుల్ ఇమాన్.. నివేదికల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవనం 'ఇస్తాన నూరుల్ ఇమాన్'. ఇది ఇండోనేషియాకు సమీపంలో ఉన్న చిన్న దేశం బ్రూనైలో ఉంది. దీని యజమాని బ్రూనై సుల్తాన్ 'హసనల్ బొల్కియ'. ఈయన ఆ దేశ ప్రధాన మంత్రి కావడం కూడా ఇక్కడ గమనించవలసిన విషయం. నిజానికి బోల్కియా దేశానికి సుల్తాన్గా పట్టాభిషేకం చేసినప్పటి నుంచి చాలా దశాబ్దాలుగా ఆ రాజప్రసాదంలో నివసిస్తున్నారు. ఇది కేవలం అంబానీ యాంటిలియాకి మాత్రమే కాదు భారతదేశంలోని లక్ష్మీ విలాస్ ప్యాలెస్ కంటే కూడా చాలా పెద్దది. దీని విస్తీర్ణం సుమారు 2.15 మిలియన్ చదరపు అడుగుల వరకు ఉంటుందని సమాచారం. ఇదీ చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లపై కీలక ప్రకటన - ఆ రెండు బ్యాంకులు.. ది లైట్ ఆఫ్ ఫెయిత్ ప్యాలెస్.. అత్యంత సుందరంగా రూపుదిద్దుకున్న ఈ భావనాన్ని 'ది లైట్ ఆఫ్ ఫెయిత్ ప్యాలెస్' (The Light Of Faith) అని కూడా పిలుస్తారు. ఇందులో చాలాభాగం తెలుపు రంగులో, గోపురాలు బంగారు రంగులో ఉంటాయి. అంతే కాకుండా ప్యాలెస్ గోపురం 22 క్యారెట్ బంగారంతో ఉన్నట్లు సమాచారం. ఇందులోని పైకప్పులు బ్రూనై ఇస్లామిక్ సంస్కృతి & మలయ్ సంప్రదాయాల ప్రకారం నిర్మించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్.. ఇస్తాన నూరుల్ ఇమాన్ ప్యాలెస్ ప్రపంచంలోనే అతి పెద్ద భవనంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా చోటు దక్కించుకుంది. ఈ భవన నిర్మాణానికి అయిన ఖర్చు అంచనా ప్రకారం రూ. 2,550 కోట్ల కంటే ఎక్కువ అని నివేదికలు చెబుతున్నాయి. హస్సనల్ బోల్కియా ఇందులో చాలా సంవత్సరాలుగా నివాసముంటున్నాడు. వీరి వద్ద 7000 కంటే ఎక్కువ లగ్జరీ కార్లు ఉన్నట్లు సమాచారం. వీటి విలువ సుమారు రూ. 41,600 కోట్లు. ఇదీ చదవండి: అకౌంట్లో డబ్బు లేకున్నా రూ. 80000 విత్డ్రా చేసుకోవచ్చు ఇస్తాన నూరుల్ ఇమాన్ 1,788 గదులను కలిగి ఉన్నట్లు, ఇందులో 257 బాత్రూమ్లు, 5,000 మంది అతిథులకు సరిపోయే హాల్, ఐదు స్విమ్మింగ్ పూల్స్, హెలిప్యాడ్ వంటి మరెన్నో సదుపాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రాజభవనం కూడా అని చెబుతారు. -
ప్రపంచంలో ఇలాంటి ప్యాలెస్ మరొకటి లేదు - అడుగడుగునా రాజసం (ఫోటోలు)
-
12 ఏళ్ల నిర్మాణం.. 700 ఎకరాల విస్తీర్ణం.. ప్రపంచంలో అతిపెద్ద ప్యాలెస్!
World's Largest Private Palace in India: ప్రపంచంలోనే అతి పెద్ద ప్యాలెస్ ఎక్కడ ఉంది అంటే చాలా మంది ప్యారిస్లోనో లేదా వేరే ఇతర దేశాల్లోనో ఉంటుందనుకుంటారు. కానీ ప్రపంచంలోనే చాలా పెద్దదైన ప్రైవేట్ ప్యాలెస్ భారతదేశంలోనే ఉంది. అదే 'లక్ష్మీ విలాస్ ప్యాలెస్' (Laxmi Vilas Palace). ఈ ప్యాలెస్ వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? దీని నిర్మాణానికి అయిన ఖర్చు ఎంత? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సుమారు 700 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ లక్ష్మీ విలాస్ ప్యాలెస్.. బకింగ్హామ్ ప్యాలెస్ కంటే నాలుగు రెట్లు పెద్దదిగా ఉందని నివేదిలకు చెబుతున్నాయి. దీని నిర్మాణకి ఏకంగా 12 సంవత్సరాల సమయం పట్టినట్లు సమాచారం. 1890లో మహారాజా సాయాజీరావు గైక్వాడ్ III హయాంలో రూపుదిద్దుకున్న ఈ ప్యాలెస్ నిర్మాణానికి అయిన ఖర్చు అప్పట్లో రూ. 27,00,000 అని చెబుతున్నారు. ఈ మహల్ విలువ వేలకోట్లలో ఉంటుంది. వందల సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ ప్యాలెస్ ఇప్పటికి కూడా అతి పెద్ద ప్రైవేట్ ప్యాలెస్గా కీర్తి పొందింది. దీని నిర్మాణ సమయంలో ఎలివేటర్లు వంటి అత్యంత ఆధునిక సౌకర్యాలతో కట్టుదిట్టం చేశారు. అత్యంత అందమైన ఈ భవనం మేజర్ చార్లెస్ మాంట్ అనే వాస్తు శిల్పి సారథ్యంలో పురుడు పోసుకుంది. దీని లోపల భాగం ఒక పెద్ద యూరోపియన్ కంట్రీ హౌస్ను గుర్తు చేస్తుంది. (ఇదీ చదవండి: వందల కోట్లు సామ్రాజ్యం సృష్టించిన కూలీ కొడుకు - ఎవరీ ముస్తఫా?) ప్రస్తుతం ఈ ప్యాలెస్ రాజకుటుంబానికి హెచ్ఆర్హెచ్ సమర్జిత్సిన్హ్ గైక్వాడ్ నాయకత్వంలో ఉన్నట్లు సమాచారం. ఈయన రాధికారాజే గైక్వాడ్ను వివాహం చేసుకున్నారు. హోసింగ్.కామ్ ప్రకారం లక్ష్మీ విలాస్ ప్యాలెస్ విస్తీర్ణం 3,04,92,000 చదరపు అడుగులు, బకింగ్హామ్ ప్యాలెస్ విస్తీర్ణం 8,28,821 చదరపు అడుగులు అని తెలుస్తోంది. ఇక ముఖేష్ అంబానీ యాంటిలియా విస్తీర్ణం 48,780 చదరపు అడుగులు కావడం విశేషం. (ఇదీ చదవండి: మహీంద్రా థార్ Vs మారుతి జిమ్నీ - ఏది బెస్ట్ అంటే?) 170 గదులతో కూడిన ఈ ప్యాలెస్ లోపల గోల్ఫ్ కోర్స్ కూడా ఉన్నట్లు సమాచారం. దర్బార్ హాల్ వెనీషియన్ మొజాయిక్ ఫ్లోర్, వెలుపల నీటి ఫౌంటైన్లతో కూడిన విశాలమైన తోట ఉంది. అంతే కాకుండా ఇందులో పాత ఆయుధాలు, శిల్పాలతో మ్యూజియం ఉంది. ఇందులో ప్రేమ్ రోగ్, దిల్ హి తో హై, సర్దార్ గబ్బర్ సింగ్, గ్రాండ్ మస్తీ వంటి అనేక సినిమా షూటింగులు జరిగాయి. -
రూ. 1600 కోట్ల ఇంద్రభవనం అమ్మకానికి ఎక్కడో తెలుసా? భారతీయుడి మోజు
విలాసవంతమైన టవర్స్; లగ్జరీ భవనాలు, ఎత్తైన శిఖరాలకు పెట్టింది పేరైన దుబాయ్లో రియల్ ఎస్టేట్కున్న డిమాండ్ మామూలుది కాదు. వెర్సైల్స్ను తలపించే మార్బుల్ ప్యాలెస్ ధర వింటే షాక్వుతారు. మార్కెట్లో దీని ధర రూ. 1,600 కోట్లు (750 మిలియన్ దిర్హామ్ల) పలుకుతోంది. విలాసవంతమైన భవనాలు ఎక్కువగా ఉండే నగరంలో మార్కెట్లో అత్యంత ఖరీదైన ఇల్లు అమ్మకానికి వుంది. ఇలాంటి ఇంద్రభవనంపై మోజుపడుతున్నవారిలో భారతీయుడు ఉండటం విశేషం. మార్బుల్ ప్యాలెస్ అదిరిపోయే ఫీచర్లు రియల్ ఎస్టేట్ ఏజెంట్లచే "మార్బుల్ ప్యాలెస్" గా పిలుస్తున్న ఈ భవనాన్ని అతి ఖరీదైన ఇటాలియన్ మార్బుల్ స్టోన్తో నిర్మించారు. Luxhabitat Sotheby's International Realty విక్రయిస్తున్న ఈ భవన నిర్మాణం దాదాపు 12 సంవత్సరాలు పట్టిందట. 60వేల చదరపు అడుగుల ఇంటిలో ఐదు బెడ్రూమ్లు ఉంటాయి. ఇందులో మాస్టర్ బెడ్రూమ్ 4,000 చదరపు అడుగులు ఒక పెద్ద భవనాన్ని మించిఅన్నమాట. (ఫేస్బుక్ మూత పడనుందా? కోర్టు సంచలన వ్యాఖ్యలు) ఇంకా 15-కార్ల గ్యారేజ్, 19 రెస్ట్రూమ్లు, ఇండోర్ అలాగే అవుట్డోర్ పూల్స్, రెండు రూఫ్లు, 80,000 లీటర్ (21,000 గాలన్లు) కోరల్ రీఫ్ అక్వేరియం, ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ ఎమర్జెన్సీ రూమ్లు తదితర ఫీచర్లలో ఉన్నాయి. ఇది 70 వేల చదరపు అడుగుల స్థలంలో గోల్ఫ్ కోర్స్కి ఎదురుగా ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో ఉంది. (అపుడు పాల ప్యాకెట్ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!) ఈ ఆస్తిని ఎవరైనా కొనుక్కెవచ్చు లేదా అద్దెకు తీసుకోవచ్చు, లేదా టెన్నిస్ లేదా పాడెల్ బాల్ కోర్ట్ కోసం ఉపయోగించవచ్చు అంటున్నారు. బ్రోకర్ కునాల్ సింగ్. ఈయన అంచనా ప్రకారం, కేవలం ఐదు నుండి పది మంది సంపన్నులు దీన్ని కొనుగోలు చేయగలరు. అంతేకాదు గత మూడు వారాల్లో కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఇంటిని చూశారు. ఇందులో రష్యాకు చెందిన కొనుగోలు ప్రతినిధి ఒకరు కాగా, రెండో కస్టమర్ ఎమిరేట్స్ హిల్స్లో ఇప్పటికే మూడు నివాసాలను కలిగి ఉన్న ఇండియన్ కావడం గమనార్హం. ఆయన భార్య ఇంకొంచెం మెరుగైన దాని కోసం చూస్తోందని అందుకే నిర్ణయం తీసుకోలేదని సింగ్ పేర్కొన్నాడు. -
ఐఏఎస్ ఆఫీసర్ నిర్వాకం..స్మారక కట్టడాన్ని కూల్చి బంగ్లాగా..
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓ ఐఏఎస్ ఆఫీసర్ నిర్వాకం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ని ఉలిక్కిపడేలా చేసింది. 15వ శతాబ్దపు స్మారక కట్టడాన్ని కూల్చివేసి బంగ్లాను నిర్మించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పలు రాజకీయా పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనిపై సత్యరమే చర్చలు తీసుకోమని డిమాండ్ చేశాయి. ఈ అనూహ్య ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఢిల్లీలో జల్ విహార్లో 15వ శతాబ్దపు రాజభవనం(ప్యాలెస్) ఉంది. ఆ ప్యాలెస్లో ఢిల్లీ జల్ బోర్ మాజీ చీఫ్ ఉదిత్ ప్రకాశ్ రాయ్ అతని కుటుంబం ఉంటోంది. వాస్తవానికి ఈ స్మారక కట్టడం పఠాన్ కాలం నాటి రాజభవనం, ఇది సయ్యద్ రాజవంశానికి చెందిన ఖిజర్ ఖాన్ స్థాపించిన ఖిజ్రాబాద్ నగరానికి గుర్తుగా మిగిలిన కట్టడం. ఇది ఢిల్లీ జల్ బోర్డు పరిధిలో ఉంది. ఐతే 2007 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఉదిత్ ప్రకాశ్ రాయ్, అతని కుటుంబం ఇందులో ఉంటోంది. కానీ ఆయన ప్రస్తుతం మిజోరాంలో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ఆ ప్యాలెస్ను ఖాళీ చేయాల్సిందిగా బుధవారం విజిలెన్స్ డిపార్ట్మెంట్ నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ అతని కుటుంబం అక్కడే నివశిస్తుంది. నిజానికి ఈ స్మారక కట్టడాన్ని జల్ బోర్డు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు అప్పగించాల్సి ఉంది. ఐతే జనవరిలో అధికారుల సంయుక్త సోదాల్లో అది మిస్ అయ్యినట్లు విజిలెన్స్ డిపార్ట్మెంట్ నోటీసులో పేర్కొంది. అంతేగాదు 2021 జనవరిలో ఈ ప్యాలెస్ను అప్పగించాలని పురావస్తు శాఖ కోరిందని, ఐతే దాన్ని జరగనివ్వకుండా ఉదిత్ ప్రకాశ్ రాయ్ అడ్డుకున్నారని విజిలెన్స్ డిపార్ట్మెంట్ నోటీసులో తెలిపింది. ఇదిలా ఉండగా, ఈ ప్రదేశంలో అది పెద్ద విస్తీర్ణంలో కోట లాంటి నిర్మాణం ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ఐతే దాని ప్లేస్లో బంగ్లా నిర్మించినట్లు సమాచారం. సమీపంలో అందుకు సంబంధించి శిథిలాల భాగాలు కూడా కనిపించాయి. దీంతో ఈ ఘటనపై తక్షణమై చర్యలు తీసుకోవాల్సిందిగా బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్తో సహా పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవా ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ లేఖ రాశారు. కాగా, ఇలాంటి దిగ్భ్రాంతి కర ఘటన భారత్లోనే జరిగింది, ఈ ఘటనతో భారత పురావస్తు, సాంస్కృతిక శాఖలు మరోసారి నిద్రపోతున్నాయనే అనే విషయాన్ని ప్రూవ్ చేశాయి. ఈ మేరకు సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డిని దుయ్యబడుతూ..దీనిపై విచారణ జరిపించాల్సిందిగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా ట్వీట్ చేశారు. (చదవండి: అప్పుడు జనజీవనంలో కలిసి.. ఇప్పుడు 50 కేజీల మందుపాతరకు బలి) -
కియారా -సిద్ధార్థ్ పెళ్లి.. మూడు రోజుల ఖర్చు ఎన్ని కోట్లో తెలుసా?
కొత్త ఏడాది తొలిరోజే వార్తల్లో నిలిచిన బాలీవుడ్ ప్రేమజంట హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, హీరోయిన్ కియారా అద్వానీ. ఈ జంట దుబాయ్ వెళ్లి, అక్కడే సంబరాలు జరుపుకున్నారు. ఈ ఇద్దరూ కొంత కాలంగా ప్రేమలో ఉన్నారనే వార్త ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట వివాహ బంధంతో ఒక్కటవ్వనుంది. రాజస్థాన్లోని జైసల్మీర్లోని సూర్యగఢ్ ప్యాలెస్లో వీరి వివాహా వేడుక అత్యంత ఘనంగా జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యయి. మూడు రోజుల పాటు పెళ్లి వేడుక ఫిబ్రవరి 4, 5, 6 తేదీల్లో మూడు రోజుల పాటు మెహందీ, సంగీత్, పెళ్లి వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలో పాల్గొనే అతిథుల కోసం కళ్లు చెదిరేలా ఏర్పాట్లు చేశారు. ముంబయికి చెందిన వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీకి బాధ్యతలను అప్పగించారు. బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన అతిథులతో పాటు దాదాపు 150 మంది వీవీఐపీల కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. అతిథుల కోసం 70 లగ్జరీ వాహనాలైన మెర్సిడెస్, జాగ్వార్, బీఎండబ్ల్యూ సిద్ధం చేశారు. అతిథులకు రాజస్థానీ వంటకాలను సిద్ధం చేయనున్నారు. సూర్యగఢ్ ప్యాలెస్ కియారా- సిద్ధార్థ్ రాయల్ వెడ్డింగ్కు భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. సూర్యగఢ్ ప్యాలెస్ డెస్టినేషన్ రాయల్ వెడ్డింగ్స్కు నిలయం. అతిథులకు విలాసవంతమైన హోటల్ గదులు, బెడ్రూమ్లు, పెద్ద తోటలు, ఒక కృత్రిమ సరస్సు, ఒక వ్యాయామశాల, ఒక ఇండోర్ స్విమ్మింగ్ పూల్, విల్లాలు, 2 పెద్ద రెస్టారెంట్లు ఉన్నాయి. ఈ ప్యాలెస్లో వెడ్డింగ్కు ఏప్రిల్ నుంచి సెప్టెంబరు నెలల్లో మద్యం లేకుండా ఒక్కరోజు ఖరీదు రూ.1.20 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు అక్టోబరు నుంచి మార్చి వరకైతే రోజుకు దాదాపు రూ.2 కోట్లు వసూలు చేస్తున్నారు. రూ.8 నుంచి 10 కోట్ల ఖర్చు సిద్ధార్థ్- కియారాల వివాహం మూడు రోజుల పాటు జరగనుంది. ఈ వేడుక ఖర్చు దాదాపు రూ. 6 కోట్లకు పైనే ఉండనుంది. ఇంకా ప్రైవేట్ ట్రావెల్స్, ఇతర ఖర్చులు కలుపితే పెళ్లి ఖర్చు దాదాపు రూ.8 నుంచి 10 కోట్ల వరకు కానుంది. వీరి పెళ్లి బాలీవుడ్లో అత్యంత ఖరీదైన వేడుకల్లో ఒకటిగా నిలవనుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. సిద్ధార్థ్కి హిందీలో నటుడిగా మంచి పేరుంది. కియారా తెలుగులో మహేశ్బాబు సరసన ‘భరత్ అనే నేను’, రామ్చరణ్తో ‘వినయ విధేయ రామ’ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో ఆమే హీరోయిన్. హిందీ చిత్రాల్లోనూ కియారా నటిస్తున్నారు. -
వజ్ర సింహాసన వైభవం
మైసూరు: స్వచ్ఛమైన బంగారం, అపురూపమైన వజ్రాలు, రత్నాలు పొదిగిన సింహాసనాన్ని చూడాలంటే మైసూరు ప్యాలెస్కు వెళ్లాల్సిందే. దసరా మహోత్సవాలకు నగరం హంగులు అద్దుకుంటుండగా, ప్యాలెస్లోనూ ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి. ప్యాలెస్లో ఉన్న దర్బార్ హాల్లో ఉన్న బంగారు సింహాసనాన్ని జోడించారు. వృశ్చిక లగ్నంలో పూజలు చేసి మంగళవారం ఉదయం 10.45 గంటల నుంచి 11.05 గంటల మధ్య శుభ వృశ్చిక లగ్నంలో పూజలు చేసి జోడింపు ప్రారంభించారు. మొదట వేద పండితుల సమక్షంలో గణపతి హోమం, చాముండి పూజ, శాంతి హోమం చేశారు. రాజవంశీకుడు యదువీర్ పాల్గొన్నారు. ప్యాలెస్లో కింది గదిలో ఉన్న స్ట్రాంగ్ రూంలో విడివిడిగా ఉన్న బంగారు, వజ్రఖచిత భాగాలను పోలీసు బందోబస్తు మధ్య దర్బార్ హాల్లోకి తీసుకొచ్చారు. పురాతన కాలం నుంచి సింహా సనం ఉంచే స్థలంలో జోడించారు. ఈ కార్యక్రమంలో గెజ్జగెహళ్లి గ్రామస్తులు, రాజమాత ప్రమోదాదేవి పాల్గొన్నారు. జోడింపు పూర్తయ్యాక మళ్లీ పూజలు చేసి తెల్లని వస్త్రంతో కప్పిఉంచారు. సెప్టంబర్ 26వ తేదీన దసరా నవరాత్రి ఉత్సవాల రోజున యదువీర్ ఈ సింహాసనాన్ని అధిష్టిస్తారు. (చదవండి: వధువు స్పెషల్ ఫోటో షూట్... ప్రశంసలతో ముంచెత్తిన నెటిజన్లు) -
తీవ్ర దుఃఖంలో ఉన్న కింగ్ చార్లెస్కు ముద్దు పెట్టిన మహిళ
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మరణంతో పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు ఆమె కుమారుడు కింగ్ చార్లెస్-3. అయితే రాణికి నివాళులు అర్పించేందుకు బకింగ్హామ్ ప్యాలెస్కు వెళ్లిన జెన్నీ అస్సిమినోయిస్ అనే మహిళ బాధతో ఉన్న కింగ్ చార్లెస్కు ముద్దుపెట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. దీంతో జెన్నీ దీనిపై వివరణ ఇచ్చారు. కింగ్ చార్లెస్కు ముద్దుపెట్టడం తనకు చాలా సంతోషంగా ఉందని జెన్నీ చెప్పారు. ఆయనను చాలా దగ్గరనుంచి నుంచి చూసి నమ్మలేకపోయానని పేర్కొన్నారు. ముద్దు పెడతానని కింగ్ చార్లెస్ను అడిగానని, అందుకు ఆయన అనుమతి ఇచ్చాకే కిస్ చేసినట్లు వెల్లడించారు. కింగ్ చార్లెస్ను చూడటమే గాక, ముద్దు పెట్టే అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఛాన్స్ ఎప్పటికీ రాదని.. కింగ్ చార్లెస్కు ముద్దు పెట్టే అవకాశం జీవితంలో ఎప్పటికీ రాదని తన మనసుకు అనిపించిందని జెన్నీ చెప్పారు. రాజకుటుంబీకులు అంటే తనకు ఎంతో ఇష్టమని, వాళ్లను ఎల్లవేళలా గమనిస్తూనే ఉన్నట్లు జెన్నీ పేర్కొన్నారు. అంతేకాదు వాళ్ల చిన్నప్పటి నుంచి ఫోటోలు కొని పెట్టుకున్నట్లు వివరించారు. తన దివంగత భర్త గ్రీస్ దేశానికి చెందినవాడని, కింగ్ చార్లెస్ తండ్రి ప్రిన్స్ ఫిలిప్ది కూడా గ్రీసే అని సిప్రస్కు చెందిన జెన్నీ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. అందుకే కింగ్ చార్లెస్తో పాటు రాజవంశస్థులు తనకు దగ్గరివాళ్లలా కన్పిస్తారని పేర్కొన్నారు. జెన్నీ ముద్దుపెట్టిన అనంతరం చిరునవ్వుతో అలాగే ముందుకుసాగారు కింగ్ చార్లెస్. తన తల్లికి నివాళులు అర్పించేందుకు బకింగ్హామ్ ప్యాలెస్కు వచ్చిన వేలాది మందికి కరచాలనం ఇచ్చారు. ఈ క్రమంలోనే మరో మహిళ కూడా కింగ్ చార్లెస్ చేతిపై ముద్దుపెట్టింది. చదవండి: బకింగ్హమ్ ప్యాలెస్పై జంట ఇంద్రధనుస్సులు -
గోటబయ నివాసాన్ని చూసేశా.. ఫోటోలు షేర్ చేసేశా!
కొలంబో: శ్రీలంకలోని ఆర్థిక సంక్షోభానికి కారణం గోటబయ రాజపక్స అని ఆరోపణలు చేస్తూ... పెద్ద ఎత్తున ఆందోళన కారులు కొలంబో వీధుల్లోకి వచ్చి నిరసనలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిరసకారులు గోటబయ అధికార నివాసాన్ని చుట్టుముట్టారు. దీంతో గోటబయ లంకని విడిచిపెట్టి పారిపోక తప్పలేదు. ఐతే ఆందోళనకారులు.. గోటబయ నివాసంలో ఎంజాయ్ చేస్తూ తమ ఆగ్రహాన్ని చల్లార్చుకుంటున్నారు. ఆయన నివాసంలోని స్విమ్మింగ్ పూల, జిమ్, పడకగది వంటి వాటన్నింటిని ఆక్రమించుకుని వారి ఇష్టారీతిన ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మధుహాన్సి హసింతర అనే యువతి కొలంబోలోని రాష్ట్రపతి నివాసాన్ని చూడాలనుకుంది. అనుకున్నదే తడువుగా గోటబయ అధికార నివాసానికి పయనమయ్యింది కూడా. ఆ భవనంలోని విలాస వస్తువులన్నింటిని తన కెమెరాతో క్లిక్మనిపించింది. పైగా ఆ భవనాన్ని సందర్శించినట్లుగా ఆ నివాసం వద్ద నుంచున్న ఫోటోలను కూడా ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఏప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు అధ్యక్షుడి నివాసం పర్యాటక ప్రదేశం మారిపోయిందని ఒకరు, మీరే అధ్యక్షురాలిగా మారాలి అని మరొకరు.. కామెంట్ చేస్తూ ట్వీట్ చేశారు. గోటబయ నివాసం దగ్గర ఫోటోలు దిగాలని ఉబలాటపడిందేమో పాపం.. అంతే వేగంగా ఫోటోలను కూడా షేర్ చేసింది అంటూ మరొకకరు కామెంట్ చేశారు. (చదవండి: ఎడారిలో స్మార్ట్ సిటీ...అక్కడ ఎగిరే డ్రోన్ టాక్సీలు, ఎలివేటర్,) -
రాజపక్స ఉపయోగించిన రహస్య బంకర్ ఇదే కావొచ్చు!
శ్రీలంక రాజధాని కొలంబోలో నిరసనకారులు అధ్యక్షుడు గోటబయ రాజపక్స అధికార నివాసాన్ని చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. పైగా రాజపక్స రాజీనామా చేయాలంటూ ఆందోళనకారులు ఆయన నివాసంలోకి చొరబడి ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో ఆయన నివాసంలో ఒక రహస్య బంకర్ బయటపడింది. ఈ రహస్య బంకర్ని ఉపయోగించే రాజపక్స పరారైనట్లు తెలుస్తోంది. ఇది భూగర్భ సోరంగంలా ఉంటుంది. లిఫ్ట్ ద్వారా మాత్రమే ఈ రహస్య బంకర్లోకి ప్రవేశించి తప్పించుకోగలరు. ఐతే శనివారం వేలాదిమంది నిరసనకారులు రాజపక్స నివాసంలోకి చొరబడి విలాసాలను ఆస్వాదిస్తూ...ఆయన వంటగదిలోకి ప్రవేశించి.. ఆహారాన్ని తింటూ కొందరూ, మరికొందరూ స్విమ్మింగ్ పూల్,జిమ్లలోకి ప్రవేశించి ఎంజాయ్ చేయడం వంటి పనులు చేశారు. ఈ మేరకు నిరసనకారులు ముట్టడించి హింసాత్మక నిరసనలు తెగబడటం, రాజీనామా చేయాలంటూ పెరిగిన డిమాండ్ల నడుమ రాజపక్స పారిపోవాల్సి వచ్చింది. ఐతే ఇంతవరకు గోటబయ రాజపక్స ఆచూకి తెలియరాలేదు. కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను పునర్జీవింప చేయడానికి... తన దౌత్యం, రాజీకీయ చతురత, అనుభవంతో ఈ దుస్థితి నుంచి బయటపడేయగలడన్న ఆశతో గత నెలలో రణిల్ విక్రమ సింఘేను ప్రధానిగా నియమించాడు రాజపక్స. అయినప్పటికీ శ్రీలంకలో కనీస నిత్వావసర వస్తువుల ధరలు ఆకాశాన్నట్టడంతో.. ప్రజలు కొనుగోలు చేయలని దారుణ స్థితిలో ఉన్నారు. ఇంకోవైపు ఇంధన కొరతతోపాటు, విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడం తదితర కారణాలతో కనీస ఆహారోత్పత్తులను సైతం దిగుమతి చేసుకోలేని దుస్థితిలో ఉంది శ్రీలంక. దీంతో ప్రజల్లో సహనం సన్నగిల్లిపోయి నిరసన జ్వాల కట్టలు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే ఆందోళనకారులు "గోట గో హోం" అంటూ నినాదాలతో రాజపక్స కార్యాలయాన్ని, అధికార నివాసాన్ని ముట్టడించారు. దీంతో లంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స రహస్య బంకర్ను ఉపయోగించి పరారైనట్లు సమాచారం. (చదవండి: శ్రీలంక సంక్షోభం గురించి కీలక వ్యాఖ్యలు చేసిన అమెరికా!) అధ్యక్షుడి భవనంలో కరెన్సీ కట్టల గుట్టలు.. ఆశ్చర్యంలో లంకేయులు -
అసమాన యోగయజ్ఞం
మైసూరు: ప్రపంచానికి యోగా శాంతిని బోధిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మంగళవారం ఉదయం ప్రఖ్యాత మైసూరు అంబా విలాస్ ప్యాలెస్ ఆవరణలో ప్రపంచ యోగా దినోత్సవంలో ప్రధాని పాల్గొన్నారు. వేలాది మంది యోగ సాధకులతో కలిసి మోదీ పలు యోగాసనాలను ఆచరించారు. బాలలు, యువత పెద్దసంఖ్యలో తరలిరావడంతో వేడుక కళకళలాడింది. సుమారు నలభై నిమిషాల పాటు వేలాది మంది ఎంతో దీక్షగా ఆసనాలను వేశారు. మోదీ అందరికీ అభివాదం చేస్తూ పలకరిస్తూ రావడంతో జనం ఉత్సాహంగా స్పందించారు. ప్యాలెస్లో మోదీకి అల్పాహార విందు యోగా కార్యక్రమం తరువాత ప్యాలెస్లో రాజ కుటుంబీకులు యదువీర్ ఒడెయర్– త్రిషిక దంపతులు, రాజమాత ప్రమోదాదేవి ఒడెయర్లను మోదీ కలిశారు. మసాలా దోసె, మసాలా వడ, సాంబార్, మైసూరు పాక్ లతో కూడిన అల్పాహార విందును ప్రధాని ఆరగించారు. ప్రమోదాదేవి మాట్లాడుతూ తమ ప్యాలెస్లో అల్పాహారాన్ని స్వీకరించాలని ప్రధాని మోదీకి ముందే లేఖ రాయగా, ఆయన అంగీకరించడం సంతోషంగా ఉందన్నారు. ఆయనకు ఏ వంటకాలు ఇష్టమైనప్పటికీ, తాము దక్షిణాది వంటకాలనే వడ్డించామని ఆమె చెప్పారు. యోగా ఎగ్జిబిషన్ ప్యాలెస్ ఆవరణలోని ఉన్న దసరా వస్తు ప్రదర్శనశాలలో యోగాకు సంబంధించిన ఆయుష్ డిజిటల్ ఎగ్జిబిషన్ స్టాల్స్ను ప్రధాని వీక్షించారు. సుమారు 15 నిమిషాల పాటు వివిధ స్టాళ్లలోని ఉత్పత్తులను ఆసక్తిగా పరిశీలించారు. ముగిసిన పర్యటన మోదీ రెండురోజుల పర్యటన విజయవంతంగా ముగిసింది. ప్యాలెస్లో అల్పాహారం స్వీకరించిన అనంతరం ఆయన మండకళ్లి విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. గవర్నర్ గెహ్లాట్, సీఎం బసవరాజ బొమ్మై తదితరులు ఆయనకు వీడ్కోలు పలికారు (చదవండి: కోర్టులో జడ్జి ముందు కాలు మీద కాలేసుకోవడం తప్పా? నేరమా?) -
'ఆర్ఆర్ఆర్'లో ఆ సాంగ్ ఉంటుందట.. ఇక ఫ్యాన్స్కు పండుగే
రాజమౌళి ‘మగధీర’ సినిమా చివర్లో వచ్చే ‘ధీర ధీర’ పాట కనువిందుగా ఉంటుంది. సినిమాలో ఉన్న కీలక తారాగణంతో పాటు సాంకేతిక నిపుణులు కూడా ఈ పాటకు కాలు కదిపిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్)లోనూ అలాంటి పాటను చూపించాలనుకుంటున్నారట దర్శకుడు రాజమౌళి. జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో పూర్తి కానుంది. ఈ షెడ్యూల్లో ఓ ప్రమోషనల్ సాంగ్ని చిత్రీకరించాలనుకుంటున్నారట. ఉక్రెయిన్లో ఓ ప్యాలెస్లో షూట్ చేయనున్నారని టాక్. హీరోలు తారక్, రామ్చరణ్, హీరోయిన్లు ఆలియా భట్, ఒలీవియా మోరిస్ తదితరులు ఈ పాటలో కనిపిస్తారట. ఈ చిత్రంలో స్వాతంత్య్ర సమర యోధులు కొమురం భీమ్గా జూనియర్ ఎన్టీఆర్, సీతారామరాజుగా రామ్చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 13న ఈ చిత్రం రిలీజ్. -
షాకింగ్: జ్యోతిరాదిత్య సింధియా ప్యాలెస్లో చోరీ
భోపాల్: బీజేపీ ఎంపీ, గ్వాలియర్ రాచ వంశానికి చెందిన జ్యోతిరాదిత్య సింధియాకు చెందిన ప్యాలెస్లో దొంగలు చోరీకి యత్నించినట్లు తెలిసింది. వివరాలు.. సింధియాకు చెందిన మధ్యప్రదేశ్ జై విలాస్ ప్యాలెస్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. స్థానిక పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘సోమవారం లేదా మంగళవారం అర్ధరాత్రి సమయంలో దొంగలు వెంటిలేటర్ బద్దలు కొట్టి జై విలాస్ ప్యాలెస్లోని రాణి మహల్లోకి ప్రవేశించేందుకు యత్నించినట్లు గుర్తించాం’’ అన్నారు. పోలీసులు, ఫోరెన్సిక్ బృందం ప్రస్తుతం ఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రలు సేకరించే పనిలో ఉన్నారు. స్నిఫర్ డాగ్స్ కూడా రంగంలోకి దిగాయి. ఎంతమంది ఈ దొంగతనానికి ప్రయత్నించారు.. ఏమేం చోరీ చేశారు అనే దాని గురించి పోలీసులు ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. గ్వాలియార్ సిటీ ఎస్పీ రత్నేష్ తోమర్ మాట్లాడుతూ.. ‘‘దొంగలు ప్యాలెస్లోని రాణి మహల్లోని ఓ గది వెంటిలేటర్ని బద్దలు కొట్టి లోనికి ప్రవేశించారు. ప్యాలెస్లో గతంలో బ్యాంక్ విధుల కోసం వినియోగించిన గదిలోని వస్తువులను ధ్వంసం చేశారు’’ అని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇక్కడ పని చేస్తున్న సిబ్బందిని విచారిస్తున్నట్లు తెలిపారు. స్నిఫర్ డాగ్తో ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న అధికారులు జై విలాస్ ప్యాలెస్ని 19వ శతాబ్దంలో జయరావ్ సింధియా నిర్మించారు. 1874 ప్రాంతంలో ఆయన గ్వాలియర్ మహారాజుగా ఉన్నపుడు ఈ ప్యాలెస్ను నిర్మించారు. ప్రస్తుతం ఇది జ్యోతిరాదిత్య సింధియాకు సొంతం అయ్యింది. చదవండి: ‘నా చుట్టూ గద్దలు తిరుగుతున్నాయి’ రూ.90 లక్షల ప్లాట్ కొని.. సొరంగం తవ్వి! -
‘పరదాగేట్ ప్యాలెస్’ విక్రయంలో మరో వివాదం
సాక్షి, సిటీబ్యూరో: నిజాం వైభవానికి ప్రతీక అయిన నజ్రీభాగ్ ప్యాలెస్ విక్రయం వివాదంలో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. గత ఏడాది ముంబై కేంద్రంగా ఓ కేసు నమోదు కాగా.. తాజాగా పరదాగేట్ ప్యాలెస్ను తమకు తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నారని, ఆపై మోసం చేస్తూ మరో సంస్థకు అమ్మేశారని ఆరోపిస్తూ ఎస్ఆర్ఈఐ సంస్థ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ఇ.వేణుగోపాల్ హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగంలో (సీసీఎస్) ఫిర్యాదు చేశారు. దీంతో నగరానికి చెందిన ఆషి రియాల్టర్స్, ముంబై సంస్థ నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్లకు చెందిన నలుగురిపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన నిందితుల జాబితాలో సుఖేష్ గుప్తా, నీతూ గుప్తా, రవీంద్రన్, సురేష్కుమార్ ఉన్నారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు నిందితుల కోసం గాలిస్తున్నారు. వివాదం వెనక అసలు కథ.. ముంబైకి చెందిన నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ రెసిడెన్షియన్, కమర్షియల్ నిర్మాణాల్లో పేరెన్నికగన్న సంస్థ. ఇది కొన్నాళ్ల క్రితం ప్రిన్స్ ముకర్రంజా మొదటి భార్య ఎస్త్రా నుంచి కింగ్కోఠిలోని నజ్రీభాగ్ (పరదాగేట్) ప్యాలెస్ను కొనుగోలు చేసింది. 5 వేల గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ భారీ భవంతి ఏడో నిజాం ఉస్మాన్ అలీఖాన్ వ్యక్తిగత నివాసంగా వెలుగొందింది. అయిదెకరాల విస్తీర్ణంలో కింగ్కోఠి ప్యాలెస్గా పిలిచే నిర్మాణంలో మొత్తం మూడు భవనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఒకదాంట్లో నిజాం ట్రస్ట్, మరోదాంట్లో కోఠి ఈఎన్టీ ఆస్పత్రి కొనసాగుతున్నాయి. మూడో భవనమైన నజ్రీభాగ్కు జీపీఓ హోల్డర్గా ఉన్న ఎస్త్రా నుంచి నిహారిక కన్స్ట్రక్షన్స్ సంస్థ రూ.150 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ప్యాలెస్ను నిహారిక సంస్థ భౌతికంగా తన అధీనంలోకి తీసుకోవాల్సి ఉంది. 2019 ప్రథమార్థంలో సంస్థ డైరెక్టర్ల మధ్య కొన్ని స్పర్థలు వచ్చాయి. దీంతో గత ఏడాది జూన్లో నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉద్యోగులు హైదరాబాద్ వచ్చినప్పుడు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సంప్రదించారు. ఈ నేపథ్యంలోనే నజ్రీభాగ్ ప్యాలెస్ యాజమాన్య హక్కులు కశ్మీర్కు చెందిన ఐరిష్ హాస్పిటాలిటీస్కు బదిలీ అయినట్లు గుర్తించారు. దీనిపై లోతుగా ఆరా తీయగా నిహారిక సంస్థకు రాజీనామా చేసి బయటకు వచ్చిన హైదరాబాద్ వాసి రవీంద్రన్తో పాటు సురేష్కుమార్ తదితరులప్రమేయంతోనే ఇది జరిగినట్లు తేల్చారు. నిహారిక సంస్థతో పాటు నజ్రీభాగ్ ప్యాలెస్ పేరుతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన వీళ్లు రూ.150 కోట్లకు ఐరిష్ హాస్పిటాలిటీస్కు 2019 జనవరిలో విక్రయించేశారు. ఈ విషయాలు గుర్తించిన నిహారిక సంస్థ ముంబైలోని వర్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిహారిక సంస్థకు చెందిన ఇద్దరు డైరెక్టర్లు అక్రమంగా విక్రయించేశారని అనుమానించిన పోలీసులు కేసును దర్యాప్తు నిమిత్తం అక్కడి ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగానికి (ఈఓడబ్ల్యూ) బదిలీ చేసింది. దీంతో ఆ వింగ్లోని యూనిట్– 9 అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రవీంద్రన్, సురేష్లతో పాటు మహ్మద్ ఉస్మాన్, సుఖేష్ గుప్తాలను నిందితుల జాబితాలో చేర్చింది. ఈ కేసులో కొన్ని అరెస్టుల్ని చేసిన ముంబై ఈఓడబ్ల్యూ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేసు కొనసాగుతుండగానే.. అక్కడ కేసు ఇలా ఉండగానే.. ఇటీవల బంజారాహిల్స్ కేంద్రంగా పని చేసే ఎస్ఆర్ఈఐ ఎక్వీప్మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్కు చెందిన అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ఇ.వేణుగోపాల్ సీసీఎస్ పోలీసులకు ఓ ఫిర్యాదు చేశారు. బషీర్బాగ్ కేంద్రంగా పని చేసే ఆషి రియాల్టర్స్కు చెందిన సుఖేష్ గుప్తా, నీతు గుప్తా, ముంబైకి చెందిన నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సురేష్ కుమార్, రవీంద్రన్లు ఎస్ఆర్ఈఐ వద్ద రూ.110 కోట్ల రుణం కోసం 2018 జూన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఆ ఏడాది అక్టోబర్ నుంచి ప్రారంభించి ప్రతి మూడు నెలలకు ఇన్స్టాల్మెంట్ చొప్పున చెల్లిస్తూ మొత్తం నాలుగు దఫాల్లో రుణం వడ్డీతో సహా తీర్చాలన్నది ఒప్పందం. ఈ రుణానికి సంబంధించి ష్యూరిటీగా హఫీజ్పేటలో ఉన్న ఎనిమిది ఎకరాల స్థలంతో పాటు కింగ్కోఠిలో 28,106 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న నజ్రీభాగ్ ప్యాలెస్ను చూపిస్తూ 2018 జూలై 15న అగ్రిమెంట్ చేసుకున్నారు. ఎస్ఆర్ఈఐ నుంచి తీసుకున్న రుణం చెల్లించడంలో సుఖేష్ గుప్తా తదితరులు విఫలం కావడంతో గత ఏడాది డిసెంబర్ 30న హఫీజ్పేటలోని స్థలాన్ని వేలం వేసి ఎస్ఆర్ఈఐ సంస్థ రూ.102.6 కోట్లు రాబట్టుకుంది. మిగిలిన మొత్తం రికవరీ కోసం నజ్రీభాగ్ను వేలం వేయాలని ప్రయత్నించగా.. నిందితులు అప్పటికే తమను మోసం చేస్తూ ఐరిష్ హాస్పిటాలిటీస్కు విక్రయించినట్లు గుర్తించింది. దీనికి సంబంధించి ఆషి, నిహారిక సంస్థలతో చేసిన సంప్రదింపులు ఫలితాలు ఇవ్వకపోవడంతో ఎస్ఆర్ఈఐ సంస్థ గత నెల 28న సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అధికారులు సుఖేష్ గుప్తా, నీతు గుప్తా, రవీంద్రన్, సురేష్కుమార్లపై ఐపీసీ 420, 406 రెడ్విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
కూలుతున్న శకలం.. మనసు వికలం
నిర్మల్: నిమ్మల.. పేరులోనే నిర్మలత్వాన్ని.. నిమ్మలమైన తత్వాన్ని నింపుకున్న ఈ ఊరిలోనూ ఎన్నో విశేషాలున్నాయి. ఎక్కడో భద్రాద్రి రామయ్య దగ్గరి నుంచి గోదారమ్మ వెంట వెనక్కి వచ్చిన దళవాయి నిమ్మల నాయుడు ఇక్కడి ప్రకృతికి పరవశుడయ్యాడు. స్థల విశేషతను గుర్తించి ఇక్కడే స్థిరపడ్డాడు. అలా.. ప్రస్తుత కస్బా ప్రాంతంలో 12 ఇండ్లతో మొదలైన ఊరికి తన పేరే పెట్టాడు. ఊరి చుట్టూ చెరువులను తవ్వించాడు. కోటలు కట్టించాడు. అనంతర పాలకులూ అదేరీతిలో అభివృద్ధి పరిచారు. కాకతీయులను తలపించేలా పాలన సాగించారు. ఆనాటి నిమ్మల రాజ్యమే తరాలు మారి.. నేడు నిర్మల్గా ఎదిగింది. నాడు రాజులు ఏలిన ఈ గడ్డపై నుంచి ఢిల్లీదాకా ఎదిగిన బిడ్డలూ ఉన్నారు. కాలగమనంలో దశాబ్ధాలు గిర్రున తిరిగిపోయినట్లే.. గతవైభవపు స్మృతులు ఒక్కొక్కటీ పోతున్నాయి. నాటి నిమ్మల రాజ్యపు ఆనవాళ్లు నేటి నిర్మల్లో కనుమరుగవుతున్నాయి. ఇన్నాళ్లు ఠీవీగా దర్పాన్ని చాటిన కోటలు.. వాటి గోడలు కూలిపోతున్నాయి. ఇప్పటికే చెరువులు సగం కబ్జాకోరల్లో చిక్కుకుపోగా, ఇప్పుడు చారిత్రక గుర్తులు సైతం శకలాలుగా పడిపోతూ.. నిమ్మలవాసుల మనసులను వికలం చేస్తున్నాయి. పట్టించుకునే అధికారులు.. పాలకులు లేక ఘన చరిత్ర శిథిలదశకు చేరుతోంది. కూలుతున్న శ్యాంగఢ్ ప్రధానద్వారం నిమ్మల..ఓ మినీ ఓరుగల్లు ఓరుగల్లును కాకతీయులు పకడ్బందీగా కట్టినట్లే.. నిమ్మలను పాలకులు నిర్మించారు. పట్టణం చుట్టూ సహజసిద్ధంగా ఉన్న గుట్టలు, అడవులను రక్షణ కవచాలుగా మలిచారు. వాటిని ఆధారంగా చేసుకుంటూ పట్టణం చుట్టూ గొలుసుకట్టు చెరువులను తవ్వించారు. ఈ చెరువులను పట్టుకుని ఊరి చుట్టూ చైనాగోడను తలపించేలా ఇటుకలతో ప్రహరీగోడను కట్టించారు. గోడకు ముందు లోతైన కందకాన్ని తవ్వించారు. వాటిలో నిండుగా నీళ్లు.. అందులో మొసళ్లు ఉండేవట. చుట్టూ ఉన్న గోడ మధ్యలో అక్కడక్కడ ఎత్తైన బురుజులు నిర్మించారు. వాటిపై ఆయుధ సంపత్తి ఉంచేలా ఏర్పాటు చేశారు. ఇక ఊరిమధ్యలో గల గుట్టపై ఖిల్లా(కోట) కట్టించారు. నాలుగు వందల ఏళ్ల క్రితం నిర్మల్లో కోటలు, బురుజులు, రాజభవనాలు కళకళలాడేవి. ఇప్పుడవన్నీ శిథిలమై పోయాయి. పట్టించుకునే నాథుడు లేక పలు కోటలు, బురుజులను నేలమట్టం చేసి వాటి ఇటుకలతోనే ఇళ్లు కట్టుకున్నారు. గఢ్.. గఢ్కో చరిత్ర నిర్మల్ అంటే కోటలు, గఢ్లకు ప్రసిద్ధి. అందులో ఒక్కోగఢ్కు ఒక్కో చరిత్ర ఉంది. పట్టణానికి తూర్పున ఎత్తైనగుట్టపై నిలువెత్తుగా ఉన్న బత్తీస్గఢ్ ఆరోజుల్లో శత్రువుల గుండెలను దడదడలాడించింది. హిందీలో బత్తీస్ అంటే 32. ఈ గఢ్లో ఒకదానికొకటి ఆనుకుని 32గదులు నిర్మించారు. దీంతో దీనికి బత్తీస్గఢ్ అనే పేరొచ్చింది. శ్రీనివాసరావు కాలంలో ఫ్రెంచ్ ఇంజినీర్ల సలహాలతో మట్టికోటగా ఉన్న బత్తీస్గఢ్ను డంగుసున్నం, ఇటుక, రాయితో బలమైన కోటగా మార్చారు. ఎతైన బురుజును నిర్మించి దానిపై ఫిరంగులను అమర్చారు. ఈ గఢ్లోనే మందుగుండు, ఆయుధాలు తయారు చేసేవారికి వసతి కల్పించారు. దక్షిణ భారతదేశంలో అప్పట్లో ఆయుధ కర్మాగారంగా నిర్మల్కు పేరుంది. శ్రీనివాస్రావు తన పాలనకాలంలోనే ఎక్కువ గఢ్లను నిర్మించాడు. పట్టణానికి దక్షిణం వైపు సైన్యాన్ని ఉంచేందుకు విశాలమైన శ్యాంగఢ్ను నిర్మించారు. అప్పటి తన అశ్వసైన్యాధిపతి పేరుమీదుగా దీనికి శ్యాంగఢ్గా పేరుపెట్టినట్లు చెబుతారు. బంగల్పేట్, వెంకటాద్రిపేట్లలో కూలిపోతున్న ప్రహరీ పట్టణంలోకి ఎవరు రావాలన్నా ఈ గఢ్ను దాటుకునే రావాల్సి ఉంటుంది. దీనికి ఓ వైపు కంచెరోని చెరువు ఉంది. చెరువుకు, గఢ్కు మధ్యలో నుంచే ప్రస్తుత 44వ నం. జాతీయరహదారి వెళ్తోంది. బంగల్పేట్ శివారులో ధం–ధంగఢ్, వెంకటాద్రిపేట్లో మరోగఢ్, బత్తీస్గఢ్ పక్కనే వేంకటేశ్వర(ఏకశిలా)గఢ్, సోన్ సమీపంలో సోన్గఢ్, చిట్యాలలో చిట్టీగఢ్లను నిర్మించారు. నిర్మల్, చుట్టుపక్కల కలిపి మొత్తం 64గఢ్లను ఫ్రెంచ్ ఇంజినీర్ల సాయంతో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ప్రతీగఢ్పైన ఫిరంగులు, మందుగుండు సామగ్రి ఉండేవి. ఫిరంగులు పేలిస్తే వచ్చే వేడిని సైనికులు తట్టుకోవడానికి వాటిపక్కనే, వారు కూర్చునేందుకు నీటితొట్టిలను నిర్మించారు. ఈగఢ్ల మరో ప్రత్యేకత ఏంటంటే.. ఒకదాని నుంచి మరోదానికి సొరంగమార్గం ఉండటం. మంటలు వేసి తెలిపేవారు ఈగఢ్లను ఎత్తైన గుట్టలపై నిలువెత్తుగా నిర్మించడానికీ కారణం ఉంది. వీటిపై నుంచి కొన్ని కిలోమీటర్ల వరకు వీక్షించవచ్చు. సెల్ఫోన్లు, వైర్లెస్లు లేనటువంటి ఆరోజుల్లో సహజసిద్ధమైన సాంకేతికతను ఉపయోగించేవారు. పట్టణంపైకి దక్షిణం వైపు నుంచి శత్రువులు దాడికి వస్తుంటే మొదట సోన్గఢ్పై సైనికులు గుర్తించేవారు. వెంటనే అగ్గిరాజేసి మంటలు పెట్టేవారు. 10కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్యాంగఢ్పై ఉన్న సైనికులు గమనించి వారు కూడా మంట రాజేసేవారు. ఈ మంటల పొగలు తూర్పు వైపున ఉన్న బత్తీస్గఢ్పై సైనికులు గుర్తించి వారు కూడా మంటలు పెట్టేవారు. ఈమంటలు నేరుగా పట్టణం మధ్యలో ఖిల్లాగుట్టపై ఉన్న రాజభవనానికి కనిపిస్తాయి. సైన్యాధికారులు, పాలకులు ఆ మంటలను గమనించి తమకు ఏదో ఆపద రాబోతుందని అప్రమత్తమై శత్రువులను ఎదుర్కొనేవారు. బంగల్ చెరువు వద్ద సీమోల్లంఘన ద్వారం పక్కాగా పట్టణ నిర్మాణం నిమ్మల ప్రాంతాన్ని పాలించిన నిమ్మలనాయుడు, కుంటి వెంకట్రాయుడు, శ్రీనివాసరావు, తదితరులు ఇక్కడి ప్రజలకు చక్కటి పాలన అందించారనడానికి ఊరిచుట్టూ నిర్మించిన గొలుసుకట్టు చెరువులే నిదర్శనం. ఊరి చుట్టూ ప్రహరీగోడతో పాటు పొలిమేరల్లో పట్టణంలోనికి వచ్చే రోడ్డుకు ఇరువైపులా బురుజులు నిర్మించారు. ఈ బురుజులకు బలమైన పొడవాటి గొలుసులు ఉండేవి. రాత్రిపూట ఇరువైపులా ఉన్న గొలుసులతో మార్గాలను మూసి వేసేవారు. కొన్నేళ్ల క్రితం వరకూ పట్టణంలో చైన్గేట్ వద్ద ఈ బురుజులు, గొలుసులు ఉండేవి. వీటిæ కారణంగా దీనికి చైన్గేట్ అనే పేరొచ్చింది. బంగల్పేట్ శివారులోనూ రోడ్డుకిరువైపులా బురుజులు ఉన్నాయి. బురుజులు, గోడచుట్టూ ఉన్న కందకంలో స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తూ ప్రజల అవసరాలను తీర్చేది. కాలక్రమంలో ఈ కందకాన్ని స్వర్ణప్రాజెక్టు జౌళినాలాగా మార్చారు. ప్రస్తుతం ఇది ఓ పెద్ద మురికికాలువగా మారింది. బంగల్పేట్ శివారులో బురుజులు గత వైభవమేనా.. గోల్కొండ, వరంగల్ వంటి చారిత్రక కోటలకు ఏమాత్రం తీసిపోని విధంగా నిర్మల్ కోటలను నాటి పాలకులు నిర్మించినా నేటి పాలకుల పట్టింపులేనితనంతో వెలుగులోకి రాలేదు. ఇప్పటికే చాలా కోటలు, బురుజులు ఆక్రమణలకు గురయ్యాయి. చాలావరకు దెబ్బతింటున్నాయి. పర్యాటకప్రాంతంగా శ్యాంగఢ్ను అభివృద్ధి చేస్తామని ప్రారంభించిన పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఇక్కడ నిర్మించిన హరిత హోటల్ ప్రారంభానికి ముందే శిథిలావస్థకు చేరింది. బత్తీస్గఢ్ చుట్టూ గుట్టలపై ఉన్న క్వారీల పేలుళ్ల ధాటికి గఢ్ గోడలు బీటలు వారాయి. రోడ్డు వెడల్పులో చైన్గేట్ను నామరూపాల్లేకుండా కూల్చేశారు. దృష్టి పెట్టేనా... నిర్మల్ జిల్లాకు చారిత్రక ప్రాంతంగా.. రాజకీయకేంద్రంగా పేరున్నా.. పర్యాటక అభివృద్ధిలో మాత్రం వెనుకబడి ఉంది. చారిత్రక కట్టడాలతో పర్యాటకపరంగా అభివృద్ధి చేసేందుకు పుష్కలమైన అవకాశాలున్నా పట్టించుకునే నాథుడు లేడు. వినాయకుల నిమజ్జనం కోసం బంగల్చెరువు వద్ద గల సీమోల్లంఘన ద్వారాలను కూల్చేశారు. కొత్తగా అభివృద్ధి చేయకున్నా చరిత్రకు గుర్తుగా మిగిలిన కట్టడాలను మాత్రం కాపాడాలంటూ జిల్లావాసులు మొరపెట్టుకుంటున్నారు. -
ఒబామా కొత్త ప్యాలెస్ చూశారా?
న్యూఢిల్లీ: చుట్టూ ఆవహించిన సముద్ర తరంగాల మీదుగా చల్లటి గాలులు వీస్తుంటే అందమైన దీవిపై వెలిసిన సువిశాల సుందర భవనంలో శాశ్వత నివాసం ఏర్పరుచుకొని, శేష జీవితం గడపాలనుకుంటే అది అందరికి స్వప్నం అవుతుందేమోగానీ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులకు మాత్రం సాకారమవుతుంది. అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలోని మార్తాస్ వినియార్డ్ దీవిపై 29 ఎకరాల విస్తీర్ణ ప్రాంగణంలో 6,900 చదరపు అడుగుల్లో నిర్మించిన సువిశాల సుందర భవనాన్ని ఒబామా దంపతులు కొనుగోలు చేశారు. ఏడు పడక గదులు, తొమ్మిది బాత్ రూమ్లు, రెండు అతిథుల చావడీలు, అధునాతన కిచెన్ కలిగిన ఈ భవనాన్ని 11.75 మిలియన్ల డాలర్ల(దాదాపు 85 కోట్ల రూపాయలు)కు ఒబామా దంపతులు కొనుగోలు చేశారు. ‘బోస్టన్ సెల్టిక్స్ (అమెరికా ఫ్రొఫెషనల్ ఫుట్బాల్ జట్టు)’ యజమాని విక్ గ్రౌస్బెక్ గత వేసవి కాలంలోనే అమ్మకానికి పెట్టగా ఒబామా వేసవి దంపతులు వేసవి విడిదిగా ఆ సుందర భవనంలో దిగారు. ఆ మైదానంలో ఒబామా తన మిత్రులతో గోల్ఫ్ కూడా ఆడుతూ వచ్చారు. చివరకు ఆ భవనాన్ని కొనుగోలు చేయాలని ఒబామ దంపతులు ధరను ఖరారు చేసుకున్నట్లు అభిజ్ఞవర్గాల ద్వారా తెల్సింది. 2001లో నిర్మించిన ఆ భవనాన్ని వాస్తవానికి 14.50 మిలియన్ డాలర్లకు యజామని గ్రౌస్బెక్ అమ్మకానికి పెట్టగా, ఒబామా గీచి గీచి బేరం పెట్టి యజమానిని ఒప్పించారట. ఆ భవనం ఆవరణలో ఓ స్విమ్మింగ్ పూల్తోపాటు అవుట్డోర్ ఫైర్ పిట్, సన్బాత్ కోసం అద్భుతమైన బాల్కనీ ఉన్నాయి. అన్నింటికంటే ప్రైవేట్ బీచ్, బోట్ హౌజ్ కూడా ఉన్నాయి. అమ్మకానికి ఆ భవనం ప్రాంగణానికి అనుకొని కొన్ని వందల ఎకరాల స్థలం ఉందట. క్రమంగా పక్కనున్న ఎకరాలను కూడా కొనుగోలు చేయవచ్చనే ముందు చూపుతోనే ఒబామా ప్యాలెస్ లాంటి ఆ భవనాన్ని కొనుగోలు చేశారట. మసాచుసెట్స్ నుంచి వినియార్డ్ దీవిపైకి రావాలన్నా, పోవాలన్నా గగన, జల మార్గాలే శరణ్యం. ఆ దీవిపై ప్రైవేటు ప్రాపర్టీ కొనుగోలు చేసిన మొదటి మాజీ దేశాధ్యక్షుడు ఒబామానే అనుకుంటే పొరపాటు జాకీ కెన్నడీకి అక్కడ సొంతిల్లుంది. 1994లో ఆయన చనిపోయే వరకు ఆయన అక్కడే ఉన్నారు. ఆయన వంశానికి చెందిన వారు ఇప్పటికీ అక్కడే ఉంటున్నారు. ఒబామా అదే దీవిపైనున్న తమ సమ్మర్ హోమ్ను గతేడాది 15 మిలియన్ డాలర్లకు విక్రయించారు. -
గురునానక్ ప్యాలెస్ కూల్చివేత
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లోని ప్రసిద్ధ గురునానక్ ప్యాలెస్ను కొందరు దుండగులు కూల్చివేశారు. ఎంతో విలువైన తలుపులు, కిటికీలను కూడా అమ్ముకున్నారు. న్యూలాహోర్ రోడ్డుకు 20 కిలోమీటర్ల దూరంలోని బథన్వాలా గ్రామంలో దాదాపు నాలుగు శతబ్దాల క్రితం ఈ ప్యాలెస్ను నిర్మించారు. భవనంలో సుమారు 16 పెద్ద పెద్ద గదులు, 4 వెంటిలేటర్లు ఉన్నట్లు సమాచారం. ఈ ప్యాలెస్లో గురు నానక్తో పాటు కొందరు హిందూ రాజుల చిత్ర పటాలు కూడా ఉన్నట్లు తెలిసింది. ప్రతి ఏడాది ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది పర్యాటకులు ఈ ప్యాలెస్ను చూడ్డానికి వస్తారు. సిక్కులు పవిత్రంగా భావించే ఈ ప్యాలెస్ను కూల్చేయడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే మహ్మద్ అన్వర్ అనే వ్యక్తి ఈ చర్యలకు పాల్పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. మహ్మద్ కుటుంబం కొన్ని తరాలుగా ఈ ఇంట్లోనే నివసిస్తున్నారని.. దాంతో వారు ఈ ప్యాలెస్ను తమ సొంత ఇంటిగా భావిస్తున్నారని తెలిపారు. బిల్డింగ్ పాతబడటమే కాక శిథిలావస్థకు చేరటంతో వారే ఈ ప్యాలెస్ను కూల్చి వేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
నియోజకవర్గానికో హబ్..
No Headline
No Headline
పాలమూరు సమగ్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
పూర్తిస్థాయిలో వలసల నివారణకు కృషి..
అహంకారానికి,ఆత్మగౌరవానికి మధ్య పోరు..
No Headline
పార్లమెంట్లో ప్రజల గొంతుకనవుతా..
కేంద్ర నిధులతోనే అనేక అభివృద్ధి పనులు..
ఓటింగ్ శాతం పెరుగుతుందా ?..తగ్గుతుందా ?
తప్పక చదవండి
- నాడు చెప్పుతో కొట్టి.. నేడు ‘కాపు’ కాస్తానంటూ కాకమ్మ కబుర్లు!
- అమ్మా... నా పేరు గుర్తుందా?
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- చట్టం మీ బాబు చుట్టమా రామోజీ?
- Israel-Hamas war: వెళ్లిపోవాల్సిందే...రఫా ప్రజలకు మరోసారి ఇజ్రాయెల్ అల్టిమేటమ్
- ఇక మాటల్లేవ్!
- ‘ఏబీవీ’ అవినీతి నిజం
- ‘ప్లేఆఫ్స్’కు కోల్కతా
- వందో ఆస్కార్కి నాలుగు వేల కోట్లు!
Advertisement