-
Patanjali: అది నిరూపిస్తే చావడానికైనా సిద్ధమే: బాబా రామ్దేవ్
ఆధునిక వైద్య విధానాన్ని, అల్లోపతి ముందులను టార్గెట్ చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలు చేస్తున్నారని పతంజలిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన జరిగిన ఒకరోజు తర్వాత బాబా రామ్దేవ్ అల్లోపతి ‘డాక్టర్ల ముఠా’ తన కంపెనీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బాబా రామ్దేవ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘యోగా, ఆయుర్వేదం, ప్రకృతివైద్యం, సనాతన విలువలకు వ్యతిరేకంగా కొందరి వైద్యుల బృందం ప్రచారం చేస్తోంది. రక్తపోటు, మధుమేహం, ఆస్తమా, కీళ్లనొప్పులు, కాలేయ వ్యాధి, మూత్రపిండాల సమస్యలు వంటివాటికి పరిష్కారం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పతంజలి మందుల ద్వారా వ్యాధులు నయం అయ్యాయని శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. యోగా, ఆయుర్వేదం, ప్రకృతివైద్యం ద్వారా మధుమేహం, థైరాయిడ్ సమస్యలు, అధిక రక్తపోటు, ఉబకాయం వంటి ఎన్నో వ్యాధులను నయం చేస్తున్నాం. సుప్రీంకోర్టు, దేశ చట్టాలు, రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. మేము నిజంగానే తప్పుగా ప్రచారం చేస్తే జరిమానా విధించండి. వైద్యుల బృందం అన్నట్లుగా మేము నిరాధార ఆరోపణలు చేసినట్లు నిరూపిస్తే చావడానికైనా సిద్ధమే. తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలి. శతాబ్దాలుగా ఉన్న యోగా, నేచురోపతి, ఆయుర్వేద వైద్యాలపై గత ఐదేళ్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. శాస్త్రీయ పరిశోధనలు, ప్రీ, పోస్ట్ క్లినికల్ ట్రయల్స్, ప్రోటోకాల్లను కలుపుకొని పతంజలి 500 అధ్యయనాలు నిర్వహించింది’ అని రామ్దేవ్ అన్నారు. ఇదీ చదవండి: గంటలోనే అమ్ముడైన 4.5 కోట్ల షేర్లు అల్లోపతి ఔషధాలకు వ్యతిరేకంగా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలను నిలిపివేయాలని సుప్రీంకోర్టు పతంజలిని ఆదేశించింది. ఇలాంటి ఉల్లంఘనను కోర్టు తీవ్రంగా పరిగణించనున్న కోర్టు ప్రతి తప్పుడు క్లెయిమ్కు గరిష్టంగా రూ.1 కోటి వరకు జరిమానా తప్పదని హెచ్చరించింది. -
పతంజలి ఫుడ్స్ లాభం ప్లస్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ పతంజలి ఫుడ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 15 శాతం వృద్ధితో రూ. 269 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 234 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 26 శాంత ఎగసి రూ. 7,964 కోట్లకు చేరింది. గతంలో రుచీ సోయా ఇండస్ట్రీస్గా కార్యకలాపాలు సాగించిన కంపెనీ గత క్యూ3లో రూ. 6,301 కోట్ల టర్నోవర్ సాధించింది. కాగా.. ఈ ఏడాది తొలి 9 నెలల్లో(ఏప్రిల్–డిసెంబర్) నికర లాభం రూ. 572 కోట్ల నుంచి రూ. 623 కోట్లకు బలపడింది. మొత్తం ఆదాయం రూ. 17,608 కోట్ల నుంచి రూ. 23,858 కోట్లకు జంప్చేసింది. చదవండి: రికార్డు స్థాయిలో సేల్స్.. ఎగబడుతున్న జనం, ఆ ఇళ్లకి యమడిమాండ్! -
రుచి సోయా కొనుగోలుకు పతంజలికి బ్యాంకింగ్ రుణాలు
న్యూఢిల్లీ: బాబా రామ్దేవ్ ఆధ్వర్యంలోని పతంజలి ఆయుర్వేద కంపెనీ... రుచి సోయా కంపెనీని కొనుగోలు చేయడానికి బ్యాంక్ల నుంచి రూ.3,200 కోట్ల రుణాన్ని పొందింది. ఈ మేరకు ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్షియంతో ఒప్పందం కుదిరిందని పతంజలి ఆయుర్వేద ఎమ్డీ ఆచార్య బాలకృష్ణ శుక్రవారం వెల్లడించారు. ఇందులో ఎస్బీఐ వాటా రూ.1,200కోట్లు. బకాయిల చెల్లింపుల్లో విఫలం కావడంతో రుచి సోయాపై 2017 డిసెంబర్లో దివాలా ప్రక్రియ ప్రారంభమైంది. పతంజలి ఆయుర్వేద కంపెనీ సమరి్పంచిన రిజల్యూషన్ ప్లాన్ను నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదించింది. -
పచ్చని పల్లెల్లో ‘పతంజలి’ పడగ!
►పతంజలి కోసం దళితులు, బలహీన వర్గాల భూములు ►40 ఏళ్ల క్రితం నుంచి సాగు చేసుకుంటున్న రైతులు ►బలవంతంగా 137 ఎకరాల భూసేకరణ ►అధికార పార్టీ నేతల భూములకు మాత్రం మినహాయింపు ►ఎకరా రూ.75 లక్షలు పలికే భూమి రూ.2.50 లక్షలకే ►ఐదు గ్రామాల రైతుల దీనగాథ చినరావుపల్లి, పెదరావుపల్లి, కాటకాపల్లి, గొల్లపేట, భీమాళి.. ఇవి ఉత్తరాంధ్రలో చాలా చిన్న గ్రామాలు. కరవొచ్చి ఊళ్లకు ఊళ్లే వలస వెళ్లినా ఈ గ్రామ ప్రజలకు అదేంటో తెలియదు. కారణం ఈ గ్రామాల్లో తయారయ్యే మామిడి తాండ్రకు రాష్ట్రవ్యాప్తంగా మంచి పేరుండటమే. కానీ ఇప్పుడీ గ్రామాలు భయంతో వణికిపోతున్నాయి. నిద్రలేని రాత్రులు గడుపుతున్నాయి. కన్నీరు పెట్టని ఇల్లు లేదు. తృప్తిగా పట్టెడన్నం తిని చాలా రోజులైంది. ఈ గ్రామాలపై పతంజలి సంస్థ కన్నుపడ్డప్పటి నుంచీ ఇదే పరిస్థితి. వాళ్ల భూములను ప్రభుత్వం కబళించి పతంజలికి కట్టబెట్టింది. రాళ్లూరప్పలు, గుట్టలు చదును చేసి తాతముత్తాతల కాలం నుంచి సాగు చేస్తున్న భూమిపై హక్కు లేదంటోంది. కన్నబిడ్డల్లా పెంచుకున్న పచ్చటి మామిడి, జీడి మామిడి తోటలను అధికారులు నరికేస్తామంటున్నారు. ఇదీ ఆ ఐదు గ్రామాల రైతుల దైన్య స్థితి. విజయనగరం జిల్లా కొత్తవలస మండల పరిధిలోని ఈ గ్రామాలు విశాఖపట్నానికి 35 కి.మీ దూరంలో ఉన్నాయి. 40 ఏళ్ల క్రితం వృధాగా ఉన్న భూములను 130 రైతు కుటుంబాలు బాగు చేసుకుని మామిడి, జీడి తోటలను సాగు చేస్తున్నాయి. ఆ రైతులకు కొన్నేళ్ల క్రితం ప్రభుత్వమే డీ పట్టాలు కూడా ఇచ్చింది. ఎకరా రూ.75 లక్షలు పలుకుతోంది. ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడతామంటూ పతంజలి సంస్థ ముందుకొచ్చింది. దీంతో ఈ ఐదు గ్రామాల్లో దళిత, బలహీనవర్గాలకు చెందిన 137 ఎకరాలను ప్రభుత్వం ఈ సంస్థకు కట్టబెట్టింది. మార్కెట్ ధర ప్రకారం ఎకరా కనీసం రూ.25 లక్షలైనా ఉంటుందని కలెక్టర్ చెప్పినా.. పతంజలికి ఎకరా రూ.2.5 లక్షలకే అప్పగిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం జీవో జారీ చేసింది. పతంజలి ప్రతినిధులు జెండాలు కూడా పాతేశారు. రైతులకు తెలియకుండానే.. పతంజలికి భూములు కేటాయించే వరకూ రైతులెవరికీ దీని గురించి తెలియదు. గుట్టుచప్పుడు కాకుండా గ్రామసభ తీర్మానం చేయించారు. తర్వాత రైతులు ఎదురుతిరగడంతో ప్రభుత్వం అనేక రకాలుగా వారిని మభ్యపెట్టింది. మొదట ఎకరాకు రూ.25 లక్షలని, తర్వాత రూ.15 లక్షలని, ఇప్పుడు కేవలం రూ.7.50 లక్షలు మాత్రమే ఇస్తామంటున్నారని రైతులు తెలిపారు. దీన్ని కూడా పూర్తిగా ఇవ్వడం లేదని వారు ఆరోపిస్తున్నారు. రికార్డు పరంగా ఉన్న భూమికే పరిహారం ఇవ్వడం వల్ల సగం మంది రైతులు నష్టపోనున్నారు. భూమిని కొనుగోలు చేసిన రైతులకు ఇది కూడా ఇవ్వడం లేదు. భూమార్పిడి నిషేధం (పీవోటీ) చట్టాన్ని ముందుకు తెచ్చి 25 మంది రైతులకు పరిహారం ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని చినరావుపల్లి గ్రామస్తులు చెప్పారు. పెద్దల భూములను వదిలేసి.. ఈ గ్రామాల్లో అధికార పార్టీ నేతల భూములున్నప్పటికీ వాటి జోలికి మాత్రం వెళ్లకపోవడం గమనార్హం. చినరావుపల్లి రెవెన్యూ పరిధిలోని 88, 89, 92, 93, 104, 105 సర్వే నెంబర్లలోని పేద రైతుల భూముల పక్కనే జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లగుడు సింహాద్రి సోదరుడు ఎర్రినాయుడి భూమి ఉంది. ఆ పక్కనే జీవీఆర్ కన్స్ట్రక్షన్ క్వారీ ఉంది. ఇందులో సెంటు భూమి కూడా పోకుండా అధికారులు జాగ్రత్తపడుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ పేరుతో ఉన్న 16.8 ఎకరాలను కూడా పతంజలికిచ్చే భూముల జాబితాలోంచి తొలగించడం గమనార్హం. ఉపాధీ ఉత్తమాటే! భూములు కోల్పోయే ఐదు గ్రామాల్లో దాదాపు వేయి మంది వరకు జనాభా ఉంటారు. వీళ్లంతా మామిడి, జీడి మామిడి తోటలను సాగు చేస్తూ బతుకుతున్నారు. ఇప్పుడీ అవకాశం ఉండదు. వీళ్లకు మరో పని కూడా తెలియదు. ప్రభుత్వం ఎకరాకు ఇచ్చే రూ.7.5 లక్షలను కుటుంబంలో ముగ్గురు వరకూ పంచుకోవాలి. ఇలాంటి కుటుంబాలు 45 వరకూ ఉన్నాయి. కేటాయించిన భూముల్లో ఆయుర్వేదిక ఉత్పత్తులు తయారుచేస్తామని ప్రభుత్వానికి పతంజలి నివేదిక సమర్పించింది. ఈ రంగంలో అనుభవం, అవగాహన ఉన్నవారిని మాత్రమే ఉద్యోగాల్లోకి తీసుకుంటామని పేర్కొంది. దీన్ని బట్టి స్థానికులకు ఎవరికీ ఉపాధి అవకాశాలు లభించే అవకాశం లేదు. ఎక్కడికి పోవాలి... మాది చినరావుపల్లి. నాకు 1.40 ఎకరాల భూమి ఉంది. మాకు తెలియకుండానే మా పొలంలో జెండాలు పాతారు. ఎమ్మెల్యే, అధికారుల చుట్టూ తిరిగా. మొదట్లో ఎకరాకు రూ.15 లక్షలు ఇస్తామన్నారు. కానీ ఆ తర్వాత రూ.7.50 లక్షలు అన్నారు. అది కూడా ఇంత వరకూ ఇవ్వలేదు. అందరికీ ఉద్యోగాలు వస్తాయని మొదట్లో చెప్పారు. ఇప్పుడు అలాంటిదేమీ లేదంటున్నారు. - బొబ్బిలి అర్జున్, బాధిత రైతు ఎలా బతకాలి? మా నాన్న 1981లో 1.33 ఎకరాలు వేరే వ్యక్తి వద్ద కొనుగోలు చేశాడు. ఈ భూమి పీవోటీ పరిధిలో ఉంది కాబట్టి పరిహారం కూడా ఇవ్వమంటున్నారు. ఉద్యోగం కూడా ఇస్తామని కలెక్టర్ చెప్పారు. ఇప్పుడు అసలుకే ఎసరు పెట్టారు. మా కుటుంబం ఎక్కడికి వెళ్లాలి? ఎలా బతకాలి? - బొబ్బిలి ఎర్రయ్య, బాధిత రైతు మాయమాటలు చెప్పి నేను వికలాంగుడిని. నాకున్న రెండు ఎకరాలు లాగేసుకుంటున్నారు. ఈ భూమి లేకుండా బతకలేను. జాయింట్ కలెక్టర్ను కలిసినా కనికరించలేదు. అన్యాయం జరగదని మాయమాటలు చెప్పి భూమి లాక్కున్నారు. -పెట్ల ఎర్రయ్య, బాధిత రైతు అడ్డుపడితే గెంటేశారు.. చెప్పకుండానే నా పొలంలో జెండాలు పాతారు. అడ్డుపడితే గెంటేశారు. భూమి తీసుకుంటే ఆత్మహత్య చేసుకుంటా. ఇదే విషయాన్ని కలెక్టర్కు చెప్పా. ఇన్నాళ్లూ ప్రభుత్వ భూమిలో ఫలసాయం తిన్నారు కదా అంటూ చులకనగా మాట్లాడారు. -సీర సన్యాసి, బాధిత రైతు
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఆ పని నాది కాదు.. వైరముత్తుకు కౌంటర్ ఇచ్చిన ఇళయరాజా!
‘కల్తీ కల్లును అరికట్టాలి’
● జిల్లాలో విందులు, వినోదాల పేరిట పెడదారిన టీనేజ్ యువత.. ● సిగరెట్లు, మద్యపానం ఫ్యాషన్గా భావిస్తున్న యువకులు ● విందులు, వినోదాల పేరుతో సెలవులు దుర్వినియోగం ● తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి
క్లుప్తంగా
ఆంక్షలు లేకుండా జొన్న కొనుగోళ్లు చేపట్టాలి
‘సూపర్వైజర్ను విధుల నుంచి తొలగించాలి’
‘స్వగృహ’ ఆక్రమణపై ఆర్డీవో విచారణ
‘గ్రూప్–1 ప్రిలిమినరీ’కి 18 కేంద్రాలు
పిల్లలపై ఓ కన్నేయండి..
స్టాక్ బయటకొచ్చింది
తప్పక చదవండి
- బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఇది మోదీ కూలర్.. లోకల్ బ్రాండ్ గురూ!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- పెళ్లయినా సరే ఆ విషయంలో హన్సిక తగ్గేదేలే
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- వైన్స్ షాపు ముందు యువతి హల్చల్
- Weekly Horoscope: ఈ రాశి వారికి చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు
- ఎయిర్పోర్ట్లో సీఎం జగన్ను అడ్డుకునేందుకు కుట్ర
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement