అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్‌బోర్డ్‌ ప్రయాణం | - | Sakshi
Sakshi News home page

అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్‌బోర్డ్‌ ప్రయాణం

May 19 2024 4:55 AM | Updated on May 19 2024 10:14 AM

-

రద్దీతో తలుపు వద్ద నిలబడగా ఘటన

ఖమ్మం: ఆర్టీసీ బస్సులో తలుపు వద్ద నిలుచున్న వివాహిత ప్రమాదవశాత్తు జారి వెనుక టైరు కింద పడి మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. కొణిజర్ల మండలం పెద్దమునగాలకు చెందిన దూరి అనూష (26) ఖమ్మంలోని డీమార్ట్‌లో పనిచేస్తోంది. శనివారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు కొణిజర్లలో ఎక్స్‌ప్రెస్‌ బస్సు ఎక్కింది. 

అప్పటికే ప్రయాణికుల రద్దీ ఉండటంతో ఆమె ఫుట్‌బోర్డ్‌పై నిలబడింది. బస్సు ఎంపీడీఓ కార్యాలయం సమీపానికి రాగానే మరో వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసేందుకు బస్సు డ్రైవర్‌ యత్నించాడు. ఇంతలోనే ఎదురుగా ద్విచక్రవాహనం రాగా డ్రైవర్‌ బ్రేక్‌ వేయడంతో తలుపు వద్ద నిలబడిన అనూష జారి రోడ్డుపై పడింది. అప్పటికే బస్సు కదలడంతో వెనుక టైరు ఆమె పైనుంచి వెళ్లగా నడుము భాగం నుజ్జునుజ్జయి ఘటనా స్థలిలోనే మృతి చెందింది. మృతురాలికి భర్త అశోక్‌, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 

కుటుంబ పోషణ కోసం పనిచేస్తున్న ఆమె మృతి చెందిందనే సమాచారంతో కుటుంబీకులు చేరుకుని కన్నీరుమున్నీరుగా రోదించారు. కాగా, అనూష మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్‌ వాహనంలో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శంకర్‌రావు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement