Crime News
-
మధ్యప్రదేశ్లో తెలుగువారిని బలిగొన్న ఘోర ప్రమాదం
హైదరాబాద్, సాక్షి: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం తెలుగువారిని బలిగొంది. మంగళవారం ఉదయం హైవేపై ఓ మినీ బస్సును ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా హైదరాబాద్ నాచారం ప్రాంతానికి చెందినవాళ్లుగా నిర్ధారణ అయ్యింది. హైదరాబాద్ నాచారంలోని కార్తికేయ నగర్, రాఘవేంద్ర నగర్లకు చెందిన స్థానికులు మూడు మినీ బస్సుల్లో మహా కుంభమేళా యాత్రకు వెళ్లారు. అయితే తిరుగు ప్రయాణంలో అందులోని ఓ బస్సును.. రాంగ్ రూట్లో వచ్చిన సిమెంట్లోడ్ ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వాళ్లను ఆస్పత్రులకు తరలించారు. జబల్పూర్(Jabalpur) సిహోరా దగ్గర జాతీయ రహదారి 30పై మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ఘోరం చోటు చేసుకుందని కలెక్టర్ దీపక్ కుమార్ సక్సేనా మీడియాకు తెలిపారు. ప్రమాదానికి గురైన మినీ బస్ నెంబర్ AP29 W1525 అని తెలిపారు. ఘటనపై నాచారం పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. అలాగే.. మృతుల వివరాలను ఆయన మీడియాకు వివరించారు. మృతుల వివరాలునవీన్ , బాలకృష్ణ, సంతోష్, శశికాంత్,రవి, ఆనంద్మరొకరి వివరాలు తెలియరావాల్సి ఉందిమృతుల్లో.. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేసే శశికాంత్ కుటుంబ సభ్యులే ఉన్నట్లు సమాచారం. ఏడుగురి మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.హైదరాబాద్వాసులేప్రమాదంలో మరణించినవాళ్లంతా ఏపీ వాసులంటూ తొలుత ప్రచారం జరిగింది. అయితే.. వాళ్లంతా హైదరాబాద్ నాచారం ప్రాంతానికి చెందిన వాళ్లుగా తర్వాత అధికారులు నిర్ధారించుకున్నారు. ప్రమాద సమయంలో అందులో 14 మంది ఉన్నట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. Jabalpur, MP: A bus from Andhra Pradesh returning from Prayagraj collided with a truck near Sihora on NH-30, killing seven people. The accident occurred around 9:15 AM near Mohla-Bargi. Officials, including the Collector and SP, have reached the site pic.twitter.com/j6uQD592Wl— IANS (@ians_india) February 11, 2025 -
భార్యతో గొడవపడి.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న భర్త
రాంగోపాల్పేట్ (హైదరాబాద్) : భార్యతో గొడవ పడిన భర్త..ఆమె పనిచేసే దుకాణానికి వెళ్లి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన మార్కెట్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..దోమలగూడ తాళ్లబస్తీకి చెందిన శ్రవణ్కుమార్ రాణిగంజ్లోని బేరింగ్ షాపులో పనిచేస్తున్నాడు. ఇతనికి మౌనికతో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు ఉంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఆమెపై అనుమానంతో కొట్టడం, తిట్టడం చేస్తుండటంతో ఎనిమిదేళ్లుగా ఇద్దరూ విడిగా ఉంటున్నారు. శ్రవణ్కుమార్ తాళ్లబస్తీలో ఉంటుండగా మౌనిక దోమలగూడలో నివసిస్తూ ప్యాట్నీ సెంటర్లోని కామాక్షి సిల్్క్సలో రెండున్నరేళ్లుగా క్యాషియర్గా పని చేస్తోంది. విడివిడిగా ఉంటున్నా ఇద్దరూ అప్పుడప్పుడూ మాట్లాడుకునే వారు. అలాగే కుమార్తె కూడా గత 8 నెలల నుంచి శ్రవణ్కుమార్ వద్దే ఉంటోంది. పెట్రోల్ బాటిళ్లతో వచ్చి.. ఆదివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ప్యాట్నీ సెంటర్లోని కామాక్షి సిల్్క్సకు కుమార్తెతో సహా వచి్చన శ్రవణ్కుమార్ భార్యతో గొడవ పడ్డాడు. షాపులో పనిచేసే సిబ్బంది అతడిని వారించి బయటకు పంపించారు. మళ్లీ 8.15 గంటలకు షాపు వద్దకు వచి్చన శ్రవణ్కుమార్ తనతో పాటు వాటర్ బాటిళ్లలో పెట్రోల్ తీసుకుని వచ్చాడు. రావడం రావడమే ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని బాటిల్లోని పెట్రోల్ను కింద పోశాడు. సిబ్బంది అతడిని వారిస్తుండగానే చేతిలో ఉన్న లైటర్తో నిప్పంటించాడు. వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగి అతనికి అంటుకున్నాయి. అక్కడ ఉన్న కొన్ని చీరెలు, సామగ్రితో పాటు సిబ్బంది మొబైల్ ఫోన్లు కాలిపోయాయి. 50 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రికి... సిబ్బంది వెంటనే అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది, మార్కెట్ పోలీసులు, షోరూం సిబ్బంది కలిసి మంటలను ఆరి్పవేశారు. సకాలంలో మాల్లోని సిబ్బంది తమ దగ్గర ఉన్నఅగ్నిమాపక పరికరాలతో మంటలను కొద్దిగా అదుపులోకి తేవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. శ్రవణ్కుమార్ 50శాతంకు పైగా కాలిన గాయాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మహంకాళి ఏసీపీ సర్ధార్సింగ్, మార్కెట్ ఎస్ఐ శ్రీవర్ధన్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. -
‘లక్కీ భాస్కర్’.. కరీంనగర్ టు దుబాయ్.. వయా జగిత్యాల
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: క్రిప్టో కరెన్సీ(Cryptocurrency) పేరిట అమాయకుల నుంచి రూ.కోట్లు వసూలు చేసి ‘లక్కీ భాస్కర్’(Lucky Baskhar) సినిమా తరహాలో దేశం దాటిపోదామనుకున్న రమేశ్గౌడ్ (Ramesh Goud) కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడు వసూలు చేసిన మొత్తంలో దాదాపు రూ.40 కోట్ల వరకు హవాలా ద్వారా దుబాయ్కి పంపినట్లు తెలిసింది. ఇందుకోసం అతను పలువురు హవాలా వ్యాపారులను ఆశ్రయించినట్లు సమాచారం. మొత్తం వసూలు చేసిన డబ్బును జగిత్యాల, వరంగల్ జిల్లాలోని హవాలా వ్యాపారుల సాయంతో హైదరాబాద్ మీదుగా దుబాయ్కి పంపారని ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంలో జీబీఆర్ రమేశ్గౌడ్ (Ramesh Goud) తాను ఎక్కడా దొరకకూడదన్న ఉద్దేశంతో చాలా తెలివిగా వ్యవహరించాడు. డబ్బుకు ఆశపడి అతడి మాటలు నమ్మిన బాధితులు వెంటనే తేరుకున్నారు. అతని ప్రతీ కదలిక, ప్రతీ లావాదేవీలను ఎప్పటికపుడు కనిపెట్టి సీఐడీకి అప్పగించారు. ఇందులో భాగంగానే ఇటీవల కరీంనగర్ సీఐడీ డీఎస్పీ పలుమార్లు రమేశ్గౌడ్తో రహస్య సమావేశాల వివరాలు కూడా ఉన్నతాధికారులకు అందించారు. దీంతో అతనిపై వేటు పడిన విషయం తెలిసిందే. మరోవైపు ఇంతకాలమైనా కేసు దర్యాప్తులో పురోగతి లేదంటూ బాధితులు త్వరలో కరీంనగర్ సీఐడీ కార్యాలయం ఎదుట ధర్నా చేసే ఆలోచనలో ఉన్నారు.ఆధునిక విధానంలో వసూలుక్రిప్టో కరెన్సీ ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉన్న పెట్టుబడి కావడంతో సహజంగానే బాధితులు అతని మాటలు నమ్మారు. పైగా రామోజీ ఫిలింసిటీ, గోవా, సింగపూర్, మలేసియా, దుబాయ్ దేశాల్లో ఖరీదైన ఈవెంట్లు పెట్టడంతో కస్టమర్లు అతని జీబీఆర్ క్రిప్టోలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చారు. ఇక్కడే రమేశ్గౌడ్ చాలా ఆధునికంగా ఆలోచించాడు. కస్టమర్ల నుంచి తొలుత దాదాపు రూ.30కోట్లకుపైగా డబ్బును కస్టమర్లు నగదు రూపంలో చెల్లించారని తెలిసింది. కస్టమర్లు మరీ అధికంగా డబ్బులు కడుతుండటంతో ఐటీకి చిక్కుతామని తెలివిగా వ్యవహరించాడు. అప్పటి నుంచి కస్టమర్ల నుంచి పెట్టుబడులను క్రిప్టో కాయిన్స్ అయిన బీఎన్బీ, యూఎస్డీటీ, క్రిప్టో వ్యాలెట్లు అయిన ట్రస్ట్వ్యాలెట్, బినాన్స్, వజ్రిక్స్ తదితర వాలెట్ల ద్వారా సేకరించాడు.రూ.10 నోటు ద్వారానే అధికంవిదేశాల్లో వ్యక్తులకు అడిగినంత డబ్బును అందజేయడానికి హవాలా వ్యాపారులు ఉంటారు. ఉదా: రూ.కోటిని దుబాయ్కి పంపాలనుకుంటే.. అక్కడ తమ కమీషన్ మినహాయించుకుని మిగిలిన డబ్బును వారు చెప్పిన వ్యక్తికి అందిస్తారు. అది ఇవ్వాలంటే రూ.10 నోటును చింపి ఇస్తారు. విదేశాలకు వెళ్లి చినిగిన ముక్కను ఇస్తే.. మిగిలిన డబ్బు అందిస్తారు. ఇదే తరహాలో రమేశ్గౌడ్ తనకు రావాల్సిన డబ్బును హవాలా మార్గంలో సేకరించాడు. తాను చెప్పిన హవాలా వ్యాపారి వద్ద డబ్బులు కట్టించాడు. ఆ డబ్బును తాను ఇండియాలో కాకుండా తెలివిగా దుబాయ్లో డ్రా చేసుకున్నాడు. అలా హవాలా, క్రిప్టో వ్యాలెట్ల ద్వారా డబ్బును దుబాయ్లో డాలర్ల రూపంలోకి మార్చుకున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. దాదాపు రూ.40 కోట్ల డాలర్ల వరకు డ్రా చేసుకుని అలా అక్కడ ఆస్తులు కొనుగోలు చేశాడు. అలా అక్కడ పదేళ్ల వరకు నివసించేలా వీసా సంపాదించడాన్ని సీఐడీ అధికారులు కూడా గుర్తించిన విషయం తెలిసిందే. దేశం దాటిపోయిన బాధితుల డబ్బును తిరిగి తీసుకురావడం సీఐడీకి సవాలుగా మారింది. మనీలాండరింగ్ జరిగిన నేపథ్యంలో కేసు సీబీఐ లేదా ఈడీ దర్యాప్తు చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.Hyderabad: అవినీతి మకిలి.. అధ్వానపు పాలన -
చిన్న కారణానికే ఎంత దారుణం
చౌటుప్పల్, చౌటుప్పల్ రూరల్: పాఠశాల నుంచి ఆలస్యంగా ఇంటికి వచ్చాడని కొడుకును మద్యం మత్తులో ఉన్న తండ్రి కొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన శనివారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో చోటుచేసుకోగా.. ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన కట్ట సైదులు లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. స్వగ్రామంలో వ్యవసాయం కూడా చూసుకుంటున్నాడు. కొంతకాలంగా కుటుంబంతో కలిసి చౌటుప్పల్ పట్టణంలోని హనుమాన్నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. సైదులుకు ముగ్గురు కూమారులు ఉన్నారు. పెద్ద కూమారుడు చదువు ఆపి వేసి హయత్నగర్లో కారు మెకానిక్ నేర్చుకుంటున్నాడు. రెండో కుమారుడు చౌటుప్పల్లోనే ఇంటర్ చదువుతున్నాడు. మూడో కుమారుడు భానుప్రసాద్ చౌటుప్పల్లోని అన్నా మెమోరియల్ ప్రైవేట్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. శనివారం పాఠశాలలో జరిగిన ఫేర్వెల్ పార్టీలో పాల్గొన్న భానుప్రసాద్ రాత్రి ఇంటికి కాస్త ఆలస్యంగా వెళ్లాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న సైదులు కుమారుడు ఇంటికి ఆలస్యంగా రావడంతో కోపంతో అతడిని చితకబాదాడు. తండ్రి కొట్టిన దెబ్బలకు తాళలేక భానుప్రసాద్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అరగంట తర్వాత తండ్రి కోపం తగ్గిందని భావించి భానుప్రసాద్ ఇంటికి రాగా.. మరోసారి విచక్షణారహితంగా కొట్టాడు. ఛాతీపై తన్నడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు పరీక్షించి బాలుడు చనిపోయాడని నిర్ధారించారు. దీంతో శనివారం రాత్రి హుటాహుటిన స్వగ్రామం ఆరెగూడేనికి మృతదేహాన్ని తీసుకెళ్లారు. ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఆదివారం ఉదయం దహనసంస్కారాలు చేస్తుండగా.. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు ఆరెగూడెం గ్రామానికి చేరుకున్నారు. చితిపై ఉంచిన మృతదేహాన్ని కిందకు దింపారు. పోస్టుమార్టం చేసిన తర్వాతే దహన సంస్కారాలు చేయాలని చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్రెడ్డి, సీఐ మన్మథకుమార్ మృతుడి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. గ్రామ పెద్దలు వారికి నచ్చజెప్పడంతో మృతదేహానికి పోస్టుమార్టం చేసేలా ఒప్పించారు. పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అశ్రునయనాలతో అంత్యక్రియలుపోస్టుమార్టం అనంతరం స్వగ్రామం ఆరెగూడెం గ్రామంలో భానుప్రసాద్ మృతదేహానికి అశ్రునయనాల మధ్య కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. చేతికి అందివచి్చన కొడుకును క్షణికావేశంలో మద్యం మత్తులో ఉన్న తండ్రి కొట్టడంతో చనిపోయాడని తెలుసుకున్న గ్రామ ప్రజలు మృతుడి ఇంటికి బారులుదీరారు. మృతదేహాన్ని చూసి కంటతడి పెట్టుకున్నారు. మృతుడి తల్లి రోదనలు మిన్నంటాయి. కేసు నమోదుఈ ఘటనపై మృతుడి తల్లి కట్ట నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపారు. చౌటుప్పల్ పట్టణంలో సైదులు నివాసం ఉండే ప్రాంతంలో పోలీసులు విచారణ చేపట్టారు. అక్కడి వ్యక్తుల నుంచి వివరాలు తెలుసుకుని నమోదు చేశారు. -
వివాహితతో సహజీవనం.. ఉపాధ్యాయుడికి హెచ్ఐవీ..?
సూర్యాపేటటౌన్: విద్యాబుద్ధులు నేర్పించే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఓ మహిళతో సహజీవనం చేస్తూ ఆమె కుమార్తెలపై అత్యాచారం ఒడిగట్టాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చర్చి కాంపౌండ్లో నివాసముండే ప్రభుత్వ ఉపాధ్యాయుడు జాటోతు సునీల్కుమార్ జిల్లా కేంద్రంలోని మామిళ్లగడ్డ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా అతడు భార్యకు దూరంగా ఉంటూ మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. 2018 నుంచి ఆ మహిళతోనే ఉంటూ సహజీవనం చేస్తున్నాడు. సదరు మహిళకు భర్త లేడు. ఇద్దరు కుమార్తెలు ఉండడంతో వారిని చదివించుకుంటూ సునీల్కుమార్తోనే ఉంటోంది. తల్లితో సహజీవనం చేస్తూ.. ఇద్దరు కుమార్తెలపై అత్యాచారం..జాటోతు సునీల్కుమార్ కన్ను ఆ మహిళ కుమార్తెలపై పడింది. వారిని ఎలాగైనా లొంగతీసుకోవాలనే కోరికతో కొద్దిరోజులుగా ముగ్గురికి నిద్రమాత్రలు ఇస్తూ సదరు మహిళ ఇద్దరు కుమార్తెలపై అత్యాచారం చేశాడు. తల్లితో చెబితే చంపేస్తానని బెదిరింపులకు సైతం పాల్పడ్డాడు. ఓ రోజు సదరు మహిళ చూస్తుండగానే ఆమె కుమార్తెపై సునీల్కుమార్ అత్యాచారం చేస్తుండగా వెంటనే కేకలు వేసి అతడి చెర నుంచి విడిపించింది. పోక్సో కేసు నమోదు...సదరు మహిళ సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్లో ఈ నెల 5వ తేదీన సునీల్కుమార్పై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సునీల్కుమార్పై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ సీఐ వీరరాఘవులు తెలిపారు. సునీల్కుమార్ తనను తనను పెళ్లి కూడా చేసుకున్నాడని సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొంది.ఉపాధ్యాయుడికి హెచ్ఐవీ..? సునీల్కుమార్కు హెచ్ఐవీతో పాటు పలు సుఖ వ్యాధులు ఉన్నట్లు సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. తమకు న్యాయం చేసి ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. సునీల్కుమార్ను అరెస్ట్ చేసి హెచ్ఐవీ టెస్ట్ చేయిస్తామని పట్టణ సీఐ తెలిపారు. అదేవిధంగా సదరు మహిళకు, ఆమె కుమార్తెలకు కూడా సోమవారం హెచ్ఐవీ పరీక్షలు చేయించనున్నట్లు చెప్పారు. -
తల్లి సెల్ఫోన్ ఇవ్వలేదని కూతురు..
కౌటాల(సిర్పూర్): తల్లి తనకు సెల్ఫోన్ ఇవ్వలేదని పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కుమురంభీం జిల్లా కౌటాల మండల కేంద్రంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఎస్సై మధుకర్ కథనం ప్రకా రం.. కౌటాలలోని ప్రగతి కాల నీకి చెందిన బొమ్మకంటి సదానందం, రమాదేవి దంపతులకు కుమారుడు, కుమార్తె స్ఫూర్తి (16) ఉన్నారు. స్ఫూర్తి స్థానిక ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువు తోంది. శనివారం మధ్యాహ్నం కాగజ్నగర్ నవోదయలో నిర్వహించిన ఇంటర్ ప్రవేశ పరీక్ష రాసింది. పరీక్ష అనంతరం తండ్రి సదానందం స్ఫూర్తిని ఇంటివద్ద దించి బయ టకు వెళ్లాడు. కాగా, పదో తరగతి స్టడీ మెటీరియల్ను చూసుకోవడానికి సెల్ఫోన్ ఇవ్వాలని స్ఫూర్తి తన తల్లి రమాదేవిని కోరింది. అయితే సెల్ఫోన్ ఇస్తే గేమ్స్ ఆడి సమయం వృథా చేస్తావని, మెటీరియల్ను జిరాక్స్ తీసుకు వస్తానని ఆమె తెలిపింది. కాసేపటి తర్వాత తల్లి జిరాక్స్ సెంటర్కు వెళ్లింది. ఈ క్రమంలో తల్లి తనకు సెల్ఫోన్ ఇవ్వ లేదని మనస్తాపం చెందిన స్ఫూర్తి.. ఫ్యాన్కు ఉరేసుకుంది. జిరాక్స్ పత్రాలతో ఇంటికి వచ్చిన తల్లికి కుమార్తె ఉరి వేసుకుని ఉండడంతో భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది. వెంటనే ఇంటికి వచ్చిన అతను కుమార్తెను కిందకు దింపి కౌటాల పీహెచ్సీకి తరలించాడు. వైద్యులు పరీక్షించి సిర్పూర్(టీ) ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడికి బాలికను తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సిర్పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో స్ఫూర్తి మృతదేహాన్ని ఎస్సై మధుకర్ పరిశీలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. తండ్రి సదానందం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఉన్మాదిలా మారి.. 70 సార్లు కత్తితో పొడిచి..
పంజగుట్ట: ఆస్తి కోసం ఉన్మాదిలా మారి తాతను అత్యంత పాశవికంగా పలుమార్లు కత్తితో పొడిచి హత్య చేసిన మనవడి కేసులో పంజగుట్ట పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడు కిలారు కార్తి తేజ (29)ను శనివారం అదుపులోకి తీసుకుని వివరాలు రాబట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ఏలూరుకు చెందిన వి.చంద్రశేఖర జనార్దన్ రావు (86) వెలిజ గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్. ఆయనకు ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. రెండో కూతురు సరోజ భర్త వేరే ప్రాంతంలో ఉండగా.. ఆమె తండ్రితో కలిసి సోమాజిగూడలో నివసిస్తోంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా మరొకరిని నియమించారని.. సరోజ కొడుకు కార్తి తేజ అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసి 2018లో నగరానికి వచ్చాడు. కార్తి తేజ తనకు తాత ఆస్తిలో వాటా సరిగా ఇవ్వడం లేదని, చిన్నతనం నుంచి అందర్నీ పెంచినట్లు తనను పెంచలేదని మనసులో కక్ష పెంచుకున్నాడు. ల్యాంకో హిల్స్లో స్నేహితులతో కలిసి ఉంటూ.. తాత, తల్లితో తరచూ గొడవపడుతుండేవాడు. ఇటీవల జనార్దన్ రావుకు సంబంధించిన ఒక సంస్థకు సరోజ అక్క కొడుకును బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా నియమించడంతో కార్తి తేజ జీర్ణించుకోలేక పోయాడు. ఎలాగైనా తాతను చంపాలని నిర్ణయించుకున్నాడు. గురువారం రాత్రి 11 గంటలకు సోమాజిగూడలోని తాత జనార్దన్రావు ఇంటికి వచ్చాడు. కుర్చీలో కూర్చుని ఉన్న తాతను తన వెంట తెచ్చుకున్న కత్తితో సుమారు 60 నుంచి 70 సార్లు విచక్షణారహితంగా పొడిచాడు. జనార్దన్ రావు గట్టిగా కేకలు వేయడంతో వంటింట్లో ఉన్న కార్తి తేజ తల్లి సరోజ బయటకు వచ్చి అడ్డుకోబోగా ఆమెను కూడా కత్తితో ఆరు పోట్లు పొడిచాడు. బయట విధుల్లో సెక్యురిటీ గార్డు ఇంట్లోకి రాగా.. చంపేస్తానంటూ అతడిని కత్తితో బెదిరించి అక్కడి నుంచి పారిపోయాడు. తనను అందరిలా పెంచలేదని తాతను చంపిన మనవడుమంచి వితరణశీలిగా పేరు.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి జనార్దన్ రావు అప్పటికే మృతి చెందాడు. కుమారుడి చేతిలో కత్తిపోట్లను గురైన తల్లి సరోజను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. జనార్దన్ రావు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి అనంతరం ఏలూరుకు తరలించారు. శనివారం సోమాజిగూడలోని భీమా జ్యువెలరీ షాపు వద్ద సంచరిస్తున్న కార్తి తేజను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. జనార్దన్ రావు పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ ఆస్పత్రులు, టీటీడీకి కోట్లాది రూపాయలు విరాళంగా ఇచ్చేవారని స్థానికులు చెబుతున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే మంచి మనిషి మృతి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. -
మీర్పేట్ మాధవి హత్య కేసులో మరో సంచలనం
సాక్షి, హైదరాబాద్: మీర్పేట్ మాధవి హత్య కేసులో మరో సంచలనం వెలుగులోకి వచ్చింది. వెంకట మాధవిని గురుమూర్తి ఒక్కడే చంపలేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భర్తతో కలిసి మరో ముగ్గురు హత్య చేసి ఉంటారనే అనుమానాలున్నాయి. ఆ ముగ్గురిలో ఒక మహిళ ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్యకు సహకరించిన వారి వివరాలు సేకరించే పనిలో పోలీసులు పడ్డారు. అవసరమైతే గురుమూర్తికి పాలీగ్రాఫ్ టెస్ట్లు నిర్వహించే యోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం.ఈ కేసులో నిందితుడు గురుమూర్తిని పోలీసులు శనివారం కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే అతడిని రిమాండ్ చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మీర్పేట పోలీసులు కస్టడీ పిటిషన్ వేసి గురుమూర్తిని విచారణ నిమిత్తం శనివారం కస్టడీలోకి తీసుకున్నారు. సరూర్నగర్లోని సీసీఎస్ లేదా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్కు విచారణ నిమిత్తం తరలించినట్లు తెలుస్తోంది. ఈ నెల 12 వరకు వరకు అతన్ని విచారణ చేయనున్నట్లు సమాచారం.ఏపీలోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన పుట్ట గురుమూర్తి, అదే గ్రామానికి వెంకట మాధవికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. గురుమూర్తి ఆర్మీలో జవాన్గా చేరి నాయక్ సుబేదార్గా పదవీ విరమణ పొందాడు. ప్రస్తుతం కంచన్బాగ్ డీఆర్డీఏలో కాంట్రాక్టు భద్రతా సిబ్బందిగా పని చేస్తున్నారు. గురుమూర్తి కొన్నాళ్లుగా తన సమీప బంధువైన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం భార్యకు తెలిసి పలుమార్లు గొడవలు జరిగినట్టు సమాచారం. ఈ క్రమంలోనే భార్య అడ్డు తొలగించుకోవాలనే క్రమంలోనే ఆమెను హత్య చేశాడు.మరోవైపు.. నిందితుడు చెప్పిన విషయాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మృతదేహాన్ని చెరువులో విసిరేసినట్లు చెబుతున్నా, అక్కడ ఇంకా ఆధారాలు లభించలేదు. శరీరం ఆనవాళ్లు లభ్యమైనా వెంకట మాధవి పిల్లల డీఎన్ఏతో పోల్చే అవకాశముంది. ఇప్పటి వరకూ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. క్లూస్టీం, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక కీలకం కానుంది. వెంకట మాధవి అదృశ్యంపై కేసు నమోదు చేశామని, ఆమె ఇంట్లోకి వెళ్తున్న దృశ్యాలు మాత్రమే లభ్యమైనట్లు పోలీసులు తెలిపిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: ఉన్మాదిలా మారి.. 70 సార్లు కత్తితో పొడిచి.. -
నా చావుకు స్నేహితులే కారణం..
ఉరవకొండ: నలుగురు స్నేహితులు. సులువుగా డబ్బు సంపాదించాలనుకున్నారు. ఎంతో ఆశతో బెట్టింగ్ యాప్లో రూ.లక్షలు పోశారు. లాభం కాదు కదా చిల్లిగవ్వ లేకుండా డబ్బంతా పోయింది. అయితే, కలసి కట్టుగా ఆడిన వారు.. నష్టం వస్తే మాత్రం తట్టుకోలేకపోయారు. ముగ్గురు కలిసి తమ స్నేహితుడిపైనే తిరగబడ్డారు. నీ వల్లే జరిగిందని, తమ డబ్బు ఇవ్వాలని ఒత్తిళ్లు చేయడం ప్రారంభించారు. దీంతో మనస్తాపం చెందిన ఆ వ్యక్తి ఉరేసుకుని బలవన్మరణం పొందాడు. ఉరవకొండలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుని బంధువులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ఉరవకొండ పంచాయతీ కార్యాలయం సమీపంలో నివాసముంటున్న కిషోర్కుమార్ (41) స్థానిక ముద్దలాపురం వద్ద ఉన్న సుజలాన్ విండ్ పవర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య సునీతతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వైఎస్సార్ జిల్లా చెన్నూరు సచివాలయంలో మహిళా పోలీసుగా సునీత విధులు నిర్వహిస్తున్నారు. తన స్నేహితులైన హరి, కేదార్, సంజయ్తో కలిసి కిషోర్కుమార్ మూడేళ్ల నుంచి ఆన్లైన్ బెట్టింగ్ ఆడేవారు. ఇటీవల నలుగురూ దాదాపు రూ.9 లక్షల వరకు ఆన్లైన్ బెట్టింగ్లో పోగొట్టుకున్నారు. ఇందుకు కారణం నువ్వేనంటూ కిషోర్కుమార్ను హరి, కేదార్, సంజయ్లు నిందించడం ప్రారంభించారు. డబ్బు తమకు తిరిగి ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి తెచ్చారు. శనివారం ఇంటి వద్ద గొడవకు దిగారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కిషోర్ ఇంట్లో ఫ్యాన్కు ఊరేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎస్ఐ జనార్దన్ నాయుడు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రి మార్చురీకి తరలించారు.నా చావుకు స్నేహితులే కారణం..ఆత్మహత్య చేసుకొనే ముందు కిషోర్ తన చావుకు ముగ్గురు స్నేహితులే కారణమని, వారి పేర్లు హరి, కేదార్, సంజయ్ అని ఒక పేపర్తో పాటు షర్టుపై పెద్ద అక్షరాలతో రాశాడు. డేటా బెట్టింగ్ యాప్లో పెట్టిన డబ్బు మొత్తం తననే కట్టమని తీవ్ర ఒత్తిడి చేశారంటూ అందులో పేర్కొన్నాడు. -
తిరుపతి జనసేన ఇన్చార్జ్ కిరణ్ రాయల్ అక్రమాలు.. మహిళ ఆత్మహత్యాయత్నం
తిరుపతి: తిరుపతి జనసేన ఇన్చార్జ్ కిరణ్ రాయల్ అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చిందో మహిళ. తన వద్ద కోటి రూపాయిలకు పైగా అప్పు తీసుకోవడమే కాకుండా తనను బెదిరిస్తున్నాడని లక్ష్మీ అనే మహిళ పేర్కొంది. ఈ మేరకు ఓ సెల్ఫీ వీడియో విడుదల చేసింది. తాను అప్పు చేసి నగలు తాకట్టు పెట్టి ఆ మొత్తాన్ని ఇచ్చానని స్పష్టం చేసింది.‘నావద్ద నుంచి తిరుపతి జనసేన ఇన్చార్జ్గా ఉన్న కిరణ్ రాయల్ అనే వ్యక్తి కోటి 20 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు ీతీర్చమని అడిగితే తన పిల్లల్ని చంపుతానని బెదిరిస్తున్నాడు. నేను కూడా అప్పు చేయడమే కాకుండా ఉన్న నగల్ని తాకట్టు పెట్టి ఆ డబ్బును తెచ్చాను. రూ. 30 లక్షలు ఇచ్చేందుకు ాబాండ్స్, ెచెక్ రాసిచ్చాడు. నన్ను బెదిరించి, భయపెట్టి వీడియో తీసుకున్నారు. నాకు అప్పులు ఇచ్చిన వాళ్ల వద్ద నుంచి ఒత్తిళ్లు ఎక్కువ అయ్యాయి. నాకు చావే శరణ్యం’ అంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసింది లక్ష్మి అనే మహిళ. తనకు ఆత్మహత్యే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కాసేపటికే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమెకు తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని సీఐపై భార్య ఫిర్యాదు -
అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని సీఐపై భార్య ఫిర్యాదు
శాలిగౌరారం: అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేయడంతోపాటూ మరో మహిళను రెండో వివాహం చేసుకుని తనను వేధిస్తున్నాడని ఓ మహిళ ఆబిడ్స్ సీఐ నర్సింహపై ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం బండమీదిగూడెంకు చెందిన కప్పల సోమలింగయ్య–అంజమ్మ కుమార్తె సంధ్యకు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం వెల్దేవి గ్రామానికి చెందిన కుంభం నర్సింహకు 2012 లో వివాహం జరిగింది. నర్సింహ ప్రస్తుతం హైదరాబాద్లోని ఆబిడ్స్ సీఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు.వివాహ సమయంలో కట్నకానుకలు మొత్తం అప్పజెప్పారు. పెళ్లయిన కొద్ది రోజులకే అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేయడం మొదలు పెట్టాడని సంధ్య ఆవేదన వ్యక్తం చేసింది. తట్టుకోలేక 2024 జూన్లో తల్లిగారింటికి వచ్చి తన భర్తపై 2024 డిసెంబర్18న నల్లగొండ మహిళా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశానంది. అక్కడ చర్యలు తీసుకోకపోవడంతో 2024 డిసెంబర్ 24న శాలిగౌరారంలో ఫిర్యాదు చేశానంది.ఇదిలా ఉండగా హైదరాబాద్లోని సరూర్నగర్లో గల తన కుమార్తెను చూసేందుకని ఈ నెల 4న పాఠశాలకు వెళ్లి తన కూతురిని తల్లిగారింటికి తీసుకుని వచ్చానని తెలిపింది. దీంతో తన కుమార్తె కిడ్నాప్నకు గురైందని నర్సింహ సరూర్నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సరూర్నగర్ ఎస్ఐ మారయ్య, ఏఎస్ఐ శ్రీనివాసరెడ్డి, మహిళా హెడ్కానిస్టేబుళ్లు శుక్రవారం బండమీదిగూడెం వచ్చి తనను విచారించి వివరాలు నమోదు చేసుకుని వెళ్లారని సంధ్య తెలిపింది.చదవండి: డబ్బులు ఇచ్చి.. భర్త కాళ్లు విరగ్గొట్టించిన భార్య ఈ విషయమై ఆబిడ్స్ సీఐ నర్సింహ వివరణ కోరగా, తన భార్యతో గొడవలు జరుగుతున్నాయిని దీంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించానని తెలిపారు. ప్రస్తుతం తమ కేసు కోర్టులో ఉందన్నారు. -
ట్రాన్స్జెండర్ పల్లవితో ప్రేమ..
గద్వాల క్రైం: ట్రాన్స్జెండర్తో ప్రేమ వ్యవహారం చివరికి ప్రాణాల మీదకు తెచ్చింది. ట్రాన్స్జెండర్ను ప్రేమించి చివరకు పురుగుమందు తాగి బలవనర్మణానికి పాల్పడిన ఘటన గద్వాల జిల్లా కేంద్రంలో జరిగింది. మృతుడి తల్లి శంకుతుల, పట్టణ ఎస్ఐ కళ్యాణ్కుమార్ తెలిపిన వివరాల మేరకు... గద్వాల పట్టణంలోని చింతలపేటకాలనీకి చెందిన బోయ నవీన్(25) అనే యువకుడు, ట్రాన్స్జెండర్(రవి అలియాస్ పల్లవి) ఇద్దరు స్నేహితులు. కాగా వారిద్దరు ఇటీవలే ప్రేమలో పడ్డారు. వారి ప్రేమకు గుర్తుగా నవీన్ తన చెస్ట్ (ఎడమ వైపు) ట్రాన్స్జెండర్ పల్లవి(రవి) టాటును సైతం వేయించుకున్నాడు. ఇంతలో ఏం జరిగిందో కానీ మంగళవారం సాయంత్రం పురుగుమందు తాగి అపస్మారక స్థితికి చేరాడు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో గద్వాల జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు సిఫార్సు చేశారు. అక్కడ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రెండు రోజులుగా అందించినా పరిస్థితి మెరుగు పడకపోలేదు. చేసేదేమీ లేక గురువారం రాత్రి తిరిగి గద్వాల ప్రభుత్వాస్పత్రికి తీసుకు రాగా.. ఇక్కడే చికిత్స పొందుతూ మృతిచెందాడు. కాగా ఈ విషయం ప్రస్తుతం గద్వాల జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. అయితే మృతుడి రెండు కాళ్లు, తోడలు, సున్నితమైన ప్రదేశాల్లో గాయాలు ఉన్నాయి. గాయాలను పరిశీలిస్తే వేడి చేసిన వస్తువుతో వాతలు పెట్టినట్లు ఎర్రగా కందిపోయి ఉన్నాయి. దీంతో మృతుడి తల్లి తన కుమారుడు పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోలేదని, చిత్రహింసలు పెట్టారని అనుమా నం వ్యక్తం చేసింది. ఈమేరకు ట్రాన్స్జెండర్ పల్లవి అలియాస్ రవి, నరేష్ పై ఆమె ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్ఐ కళ్యాణ్కుమార్ తెలిపారు. పక్కా వ్యూహ రచనతోనే? ట్రాన్స్జెండర్ (పల్లవి) రవి, నవీన్లు ఇద్దరూ గతంలో చింతలపేటకాలనీలోనే ఉండేవారు. కొన్నేళ్ల క్రితం రవి కాలనీ వదిలి వెళ్లిపోయి ట్రాన్స్జెండర్గా మారి పట్టణ శివారులో హమాలీ కాలనీలో సొంత ఇళ్లు కట్టుకున్నాడు. నవీన్ జిల్లాకేంద్రంలోని ఓ ఫైనాన్సియర్ వద్ద కలెక్షన్ బాయ్గా పనిచేస్తున్నాడు. ఇటీవలే అతడి తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా కుటుంబ భారాన్ని మోస్తున్నాడు. ఈ క్రమంలో పల్లవితో నవీన్ ప్రేమలో పడ్డాడు. ఈ నేపథ్యంలో పల్లవిని డబ్బులు యాచించేందుకు బయటికి వెళ్లొద్దని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు సమాచారం. ఈనెల 4న అర్ధరాత్రి వేళ నవీన్ను పల్లవి (రవి) తమ్ముడు నరేష్ ఇంటి వద్దకు వచ్చి స్కూటీపై ఎక్కించుకు వెళ్లిన వీడియో సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియోలు సైతం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. దీంతో పక్కా వ్యూహరచనతోనే నవీన్ను చిత్రహింసలకు గురి చేసి హత్యచేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరువురి మధ్య సంబంధాలపై ఆరా.. నవీన్ మృతిపై అతడి తల్లి శకుంతల ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేశాం. ఇరువురి మధ్య ఉన్న సంబంధాలపై ఆరా తీస్తాం. ట్రాన్స్జెండర్ పల్లవిపై గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా అన్న కోణంలో విచారిస్తాం. ఈ నెల 4న జరిగిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుటాం. – కళ్యాణ్కుమార్, పట్టణ ఎస్ఐ, గద్వాల Mettuguda Incident: అంతా కట్టుకథేనా! -
Hyderabad: నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య
బౌద్ధనగర్,హైదరాబాద్: ప్రేమించిన వ్యక్తి తరచూ అనుమానిస్తూ..వేధింపులకు పాల్పడడంతో భరించలేక ఓ నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వారాసిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..బౌద్ధనగర్లోని అంబర్నగర్కు చెందిన నాగయ్య కుమార్తె ప్రవళిక (23) కోఠి ఉమెన్స్ కాలేజీలో బీఎస్సీ ఫైనలియర్ చదువుతుంది. కాలేజీ అయ్యాక సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు వారాసిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పార్ట్టైమ్ జాబ్ చేస్తుంది. కాగా నాలుగేళ్లుగా ప్రవళిక..సృజన్ అనే యువకుడిని ప్రేమిస్తోంది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా సృజన్ ఆమెను వేధిస్తూ వేధింపులకు దిగాడు. మరో యువకుడితో మాట్లాడుతున్నావని అనుమానించేవాడు. ఇదే విషయంపై పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ నెల 6వ తేదీన సాయంత్రం ఉస్మానియా యూనివర్సిటీలోని ఓ బేకరీలో ప్రవళిక, సృజన్ల మధ్య వాగి్వవాదం జరిగింది. దీంతో మరో స్నేహితుడు మధుకర్ వచ్చి ఇద్దరిని సముదాయించాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి వచ్చిన ప్రవళిక తన తండ్రి నాగయ్యకు ఫోన్ చేయగా, తాను ఫంక్షన్కు వెళ్తున్నానని ఆలస్యంగా వస్తానని చెప్పాడు. అర్థరాత్రి ఒంటి గంటకు ఇంటికి వచ్చిన నాగయ్యకు బెడ్రూమ్లో ప్రవళిక దుప్పటితో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకొని కనిపించింది. వెంటనే స్థానికుల సహాయంతో ప్రవళికను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రవళిక స్నేహితుడు మధుకర్..సృజన్తో ప్రేమ, గొడవల గురించి నాగయ్యకు తెల్పగా..ఆయన ఫిర్యాదు మేరకు సృజన్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మమత హత్య కేసు.. వీడిన మిస్టరీ
సాక్షి, కరీంనగర్ జిల్లా: ఐదురోజుల క్రితం వెలుగులోకొచ్చిన మహిళ అనుమానాస్పద మృతి కేసును చొప్పదండి పోలీసులు ఛేదించారు. బెల్లంపల్లికి చెందిన మమతను జనవరి 27న హత్య చేసి కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి శివారులో పడేసిన విషయం తెలిసిందే. అయితే, వివాహేతర సంబంధమే మమత హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కాసిపేటకు చెందిన మమత.. గత నెల 27న తన కుమారుడితో కలిసి బెల్లంపల్లి నుంచి కారులో బయలుదేరింది. ఆ తర్వాత కనిపించకుండా పోయినా ఆమె.. కరీంనగర్ జిల్లా కొండనపల్లి శివారులో శవమై కనిపించింది. తల్లితో పాటు ఉన్న నాలుగేళ్ల కుమారుడు కూడా కనిపించకుండా పోయాడు. నిందితులు పరారైన కారు నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. చెన్నైలోని ఒక లాడ్జిలో బాలుడు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని బాలుడిని కాపాడి.. నానమ్మకు అప్పగించారు.మృతురాలు మమత.. భర్తతో విడిపోయి సింగరేణి ఉద్యోగి భాస్కర్తో కలిసి ఉంటుంది. దీంతో భాస్కర్ కుటుంబ సభ్యులు రూ.5 లక్షలు సుపారీ ఇచ్చి మమతను హత్య చేయించినట్లు పోలీసులు నిర్థారించారు. భాస్కర్ సోదరి, ఆమె స్నేహితుడు రఘు, సుపారీ కిల్లర్ కల్యాణ్, భాస్కర్ తండ్రి, సోదరి సమీప బంధువును అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. -
అనుమానంతో.. భార్యను వెంటాడి మరీ..
దొడ్డబళ్లాపురం,కర్ణాటక: అక్రమ సంబంధం అనుమానంతో భార్యను కడతేర్చాడో కిరాతక భర్త. ఈ సంఘటన బెంగళూరు ఆనేకల్ తాలూకా హెబ్బగోడిలోని వినాయకనగరలో చోటుచేసుకుంది. శ్రీగంగ (27), భర్త మోహన్రాజు(30). వీరు చిరుద్యోగులు. శ్రీగంగ అక్కడే డిమార్ట్లో పనిచేసేది. పృథ్విక్ (6) అనే కుమారుడు ఉన్నాడు.శ్రీగంగ సోషల్ మీడియాలో చురుగ్గా పోస్టులు పెట్టేది. గత 7 నెలలుగా మోహన్రాజు పనికి వెళ్లకుండా మద్యం తాగుతూ కాలం గడుపుతున్నాడు. దీంతో నిత్యం ఇద్దరికీ గొడవ జరిగేది. అంతేకాకుండా శ్రీగంగ ప్రవర్తనపై మోహన్ అనుమానంతో పీడించేవాడు. బుధవారం ఉదయం ఇద్దరూ గొడవపడ్డారు. ఘర్షణ తారాస్థాయికి చేరడంతో మోహన్ కత్తితో భార్యపై దాడి చేశాడు. ఆమె రోడ్డు మీదకు పరుగులు తీయగా వెంటాడి ఎనిమిది సార్లు పొడిచాడు. చావు బతుకుల్లో పడి ఉన్న ఆమెను స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరణించింది. హెబ్బగోడి పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న మోహన్రాజుని అరెస్టు చేశారు. కాగా, గత కొన్ని నెలలుగా దంపతులు ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారని, అతడు అప్పుడప్పుడు కొడుకును చూడాలని వచ్చి వెళ్లేవాడని స్థానికులు తెలిపారు. అలా వచ్చినప్పుడు గొడవపడి హత్య చేశాడని తెలిపారు. -
దారుణం.. మరదలిని హత్య చేసిన బావ
కొరుక్కుపేట: కుటుంబ కలహాల కారణంగా అక్క భర్త తన మరదలిని గొంతు కోసి హత్య చేసిన ఘటన తిరువొత్తియూర్లో కలకలం రేపింది. వివరాలు.. తిరువొత్తియూర్లోని సెల్వ కుమార్ ఆయపిళ్లై గార్డెన్ ఏరియాకు చెందిన ధనలక్ష్మి ఉదయం ఇంటి ముందు ముగ్గు వేసే పనిలో ఉన్నారు. తనతో పాటు సోదరి సెల్వి కూడా ఉంది. అంతలో ధనలక్ష్మి అక్క సెల్వి భర్త కాళీముత్తు అక్కడికి వచ్చాడు. అక్కడ కుటుంబ గొడవలు చోటు చేసుకున్నాయి. దీంతో ధనలక్ష్మి, కాళీ ముత్తు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన కాళీముత్తు దాచిన కత్తితో ధనలక్ష్మి మెడపై నరికి పారిపోయాడు. ధనలక్ష్మి రక్తపుమడుగులో కుప్పకూలిపోయింది. ఈ శబ్ధం విని ఇరుగుపొరుగు వారు గుమిగూడి చూడగా ధనలక్ష్మి ప్రాణాలతో పోరాడుతూ పడి ఉండడం చూసి షాక్కు గురయ్యారు. వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. మార్గమధ్యంలోనే ధనలక్ష్మి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీనిపై తివొత్తియూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంటి స్థలం కోసమే హత్య..
బషీరాబాద్,వికారాబాద్: మండలంలోని నవల్గాలో మంగళవారం జరిగిన మాల శ్యామప్ప హత్య కేసును బషీరాబాద్ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. హత్యలో ప్రమేయం ఉన్న నలుగురు నిందితులను బుధవారం అరెస్టు చేసి మీడియా ముందు హాజరుపరిచారు. ఇందుకు సంబంధించిన వివరాలను తాండూరు రూరల్ సీఐ నగేష్, ఎస్ఐ శంకర్తో కలిసి తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి వెల్లడించారు. నవల్గా గ్రామానికి చెందిన హతుడు మాల శ్యామప్పకు ఇంటి స్థలం విషయంలో వదిన మాల సుగుణమ్మతో కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. మరిదిని అంతమొందిస్తే అతని ఆస్తి తనకు దక్కుతుందని సుగుణమ్మ భావించింది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన మాల శివకుమార్, కొత్త విజయ్కాంత్, విశ్వనాథ్తో రూ.50 వేలకు హత్య చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ముందుగా రూ.10 వేలు అడ్వాన్స్ ఇచ్చింది. మాల శ్యామప్పకు శివకుమార్ వరుసకు తమ్ముడు.. కొత్త విజయ్కాంత్, విశ్వనాథ్ స్నేహితులు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం శివకుమార్, కొత్త విజయ్కాంత్, విశ్వనాథ్ ఈ నెల 3వ తేదీ సాయంత్రం మద్యం తాగుదామని శ్యామప్పను బైక్పై ఎక్కించుకొని నవల్గా గేటు సమీపంలోని రాథోడ్ మోహన్ పొలం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ అందరూ కలిసి మద్యం తాగారు.. ఆ తర్వాత శ్యామప్ప తలపై బండరాళ్లతో మోది హత్య చేశారు. హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు రోడ్డు పక్కన పడేశారు. ఈ కేసును ఛాలెంజ్గా తీసుకున్న తాండూరు రూరల్ సీఐ నగేష్, ఎస్ఐ శంకర్, సిబ్బంది 24 గంటల్లో ఛేదించారని డీఎస్పీ తెలిపారు. నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.5వేల నగదు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని తాండూరు మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి రిమాండ్కు తరలించారు. మొదటి ముద్దాయి సుగుణమ్మను చర్లపల్లి జైలుకు, మిగతా ముగ్గురిని పరిగి సబ్జైల్కు తరలించారు. హత్య కేసును ఛేదించిన ఎస్ఐ శంకర్, ఏఎస్ఐ నారాయణ, క్రైమ్ కానిస్టేబుళ్లు దస్తప్ప, నర్సింలు, ముని, ప్రతాప్ సింగ్కు డీఎస్పీ నగదు రివార్డులు అందజేశారు.Vikarabad: ఆస్తి కోసం మరిదిని చంపించిన వదిన.. -
జీవితం నచ్చలేదంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగి..
నగరంలో 18.. 28.. 29 ఏళ్ల వయసున్న ముగ్గురు యువకులు, 22 ఏళ్ల ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రేమ విఫలమైందని ఒకరు..ఈ జీవితం నచ్చలేదంటూ మానసిక వేదనతో మరొకరు.. పరీక్ష సరిగా రాయలేదనే భయంతో ఓ యువకుడు, అనారోగ్యం వేధిస్తోందని ఓ యువతి ఉసురు తీసుకున్నారు. క్షణికావేశం.. జీవితమంటే ఏర్పడిన భయం.. మానసిక ఒత్తిడితో బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఎంతో భవిష్యత్తు ఉన్న నలుగురు ప్రాణాలు తీసుకోవడం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. 1 ప్రియురాలికి వీడియో కాల్ చేసి.. ప్రేమ వ్యవహారంలో మనస్పర్థల కారణంగా ఓ యువకుడు ప్రియురాలికి వీడియో కాల్)(Video call) చేసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రాములు తెలిపిన ప్రకారం.. ఒడిశాలోని గంజాం జిల్లా జిల్లుండ జరడ గ్రామానికి చెందిన ధర్మ ప్రధాన్ (29) ఇరవై రోజుల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి రాయదుర్గంలోని అపర్ణ సైట్లో క్రేన్ ఆపరేటర్గా పని చేస్తున్నారు. అక్కడే లేబర్ కాలనీలో నివాసం ఉంటూ మంగళవారం సాయంత్రం 4.55 గంటల సమయంలో ఓ యువతికి వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అంతకు ముందు చేతిపై కత్తితో కోసుకొని..ఆ తర్వాత వీడియో కాల్ చేసినట్లుగా ఎస్ఐ రాములు పేర్కొన్నారు. ప్రేమ వైఫల్యమే కారణమై ఉండవచ్చని పోలీసులు పేర్కొన్నారు. వీడియో కాల్ అందుకున్న యువతి హైదరాబాద్లో మరో సైట్లో పనిచేస్తున్న తమ బంధువులకు ఫోన్చేసి ధర్మ ప్రదాన్ విషయాన్ని చెప్పి అప్రమత్తం చేసింది. వెంటనే వారు సైట్లోని లేబర్ కాలనీకి వచ్చి చూడగా యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. వెంటనే రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించారు. బుధవారం మృతుడి బంధువులు రాయదుర్గం పీఎస్లో ఫిర్యాదు చేశారు. 2 అనారోగ్య సమస్యలతో ఐటీ ఉద్యోగిని .. అనారోగ్య సమస్యలతో ఐటీ ఉద్యోగి (IT employee) ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం మాదాపూర్ పోలీస్స్టేషన్(Madhapur Police Station) పరిధిలో చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం ఘటన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . మాదాపూర్ ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ చెందిన రిటోజ బసు(22) మాదాపూర్ సిద్దిఖ్నగర్ జోలో స్టెర్లింగ్ కో లివింగ్ హాస్టల్లో స్నేహితునితో కలసి నివాసం ఉంటున్నారు. గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీలో హెచ్ఆర్గా పనిచేస్తున్నారు. ఆమె స్నేహితుడు కోల్కత్తాకు చెందిన హర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఇద్దరు కలిసి ఒక నెలక్రితమే హాస్టల్కు వచ్చారు. కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఈ లోపే అనారోగ్య సమస్యల కారణంగా ఒత్తిడికి గురైన రిటోజ బసు హాస్టల్ భవనం ఆరవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్లోయినట్టు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 3 జీవితం నచ్చలేదంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగి.. ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇన్స్పెక్టర్ శ్రీనాథ్రెడ్డి తెలిపిన ప్రకారం..జగిత్యాల జిల్లా బూగారం మండలం భోపాల్పూర్ గ్రామానికి చెందిన గంతుల కుమార్ (28) ఎంబీఏ పూర్తి చేసి గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు. బీకే గూడ సంజయ్ గాం«దీనగర్ కాలనీలో గంగాధర్ అనే స్నేహితుడితో కలిసి ఉంటున్నాడు. బుధవారం ఉదయం గంగాధర్ బయటికు వెళ్లి తిరిగి 10 గంటల సమయంలో రూమ్కు వచ్చాడు. లోపలి నుంచి గడియ వేసి ఉండటంతో తలుపులు తట్టినా లోపల నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో కిటికీలో నుంచి చూడగా కుమార్ ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని తలుపులు తెరిచి విచారణ జరిపారు. గదిలో ఓ సూసైడ్ నోట్ను స్వా«దీనం చేసుకున్నారు. ‘నాకు జీవితం నచ్చలేదు. నన్ను క్షమించండి’ అని నోట్ రాసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.4 పరీక్ష భయంతో సీఏ విద్యార్థిపరీక్ష సరిగా రాయలేదని ఓ సీఏ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా మాన్వి మండలం కరిటిగుడ్డ గ్రామానికి చెందిన రాజుశెట్టి కుమారుడు ఎస్.అమర్జీత్ (18) ఎస్ఆర్ నగర్ బాపూనగర్లోని జీవీ క్రేజీ పీజీ హాస్టల్లో ఉంటూ లక్ష్య కళాశాలలో సీఏ చదువుతున్నాడు. 2024 డిసెంబరు 22న పరీక్షలు రాసి సొంత గ్రామానికి వెళ్లాడు. పరీక్ష సరిగా రాయలేదని ఇంట్లో కుటుంబ సభ్యుల వద్ద బాధపడ్డాడు. ఫెయిల్ అవుతానేమో అని భయం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో గత జనవరి 27న మరో పరీక్ష రాయాల్సి ఉండటంతో తిరిగి నగరానికి వచ్చి హాస్టల్నే ఉంటున్నాడు. మంగళవారం ఉదయం కళాశాలకు వెళ్లాల్సి ఉండగా ఆరోగ్యం బాగాలేదని రూమ్మేట్ సుబ్రమణ్యంతో చెప్పి గదిలో ఉండిపోయాడు. రాత్రి 10.30 గంటల సమయంలో సుబ్రమణ్యం వచ్చి చూడగా లోపలి నుండి లాక్ చేసి ఉంది. ఎంత పిలిచినా పలుకక పోవడంతో అనుమానం వచ్చి హాస్టల్ నిర్వాహకులకు చెప్పగా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులు తెరిచి చూడగా అమర్జీత్ ఉరి వేసుకుని కనిపించాడు. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ జరిపారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
లావణ్య హత్యకు మస్తాన్ సాయి ప్లాన్.. వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: అమాయక యువతులు, మహిళలను లోబరుచుకుని అఘాయిత్యాలకు పాల్పడిన మస్తాన్సాయి రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు. హార్డ్ డిస్క్ కోసం ఆమెను చంపేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మస్తాన్సాయి, అతడి స్నేహితుడు ఖాజాకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు నిర్ధరణ అయినట్లు రిమాండ్ రిపోర్టు ద్వారా వెల్లడైంది.మస్తాన్సాయి రిమాండ్ రిపోర్టు ప్రకారం..‘మస్తాన్సాయి, అతడి స్నేహితుడు ఖాజాకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు నిర్ధరణ అయినట్లు రిమాండ్ రిపోర్టు ద్వారా వెల్లడైంది. డ్రగ్స్ మత్తులో లావణ్య ఇంటికి మస్తాన్ సాయి వెళ్లి గొడవ చేశాడు. అతడిపై ఎన్డీపీఎస్ సెక్షన్ను కూడా పోలీసులు జత పరిచారు. మస్తాన్ సాయి ల్యాప్టాప్లో ఉన్న లావణ్య వీడియోలను రాజ్తరుణ్ గతంలోనే తొలగించాడు. అయితే, ఆలోపే ఇతర డివైస్లలోకి ఆ వీడియోలను మస్తాన్ సాయి కాపీ చేసుకున్నాడు. లావణ్యను పలు మార్లు చంపేందుకు అతడు యత్నించాడు. హార్డ్ డిస్క్ కోసం ఆమెను చంపేందుకు ప్లాన్ చేసినట్లు పేర్కొన్నారు. గత నెల 30న లావణ్య ఇంటికి వెళ్లి హత్యాయత్నం చేసినట్లు వెల్లడించారు.వెలుగులోకి వస్తున్న ఆకృత్యాలు.. కొన్నేళ్లుగా మస్తాన్సాయి పబ్లు, వీఐపీ పార్టీలలో యువతులు, వివాహిత మహిళలను మచ్చిక చేసుకుని వారితో ఏకాంతంగా గడిపిన వీడియోలు, వాట్సాప్ చాటింగ్లు, ఫోన్ రికార్డింగులను హార్డ్ డిస్క్లో భద్రపరిచాడు. ఆ హార్డ్ డిస్క్ను మస్తాన్సాయి ఇంటినుంచి తీసుకున్న లావణ్య.. పోలీసులకు అందించారు. ఆ హార్డ్ డిస్క్ కోసమే మస్తాన్సాయి తన ఇంటిపై దాడిచేసి తనను చంపేందుకు ప్రయత్నించాడని ఫిర్యాదు చేశారు. చదవండి: రాజ్ తరుణ్- లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్..కాగా, లావణ్యను డ్రగ్స్ కేసులో మరోమారు ఇరికించేందుకు మస్తాన్సాయి, శేఖర్బాషా యత్నిస్తున్నారని ఆమె తరపు న్యాయవాది నాగూర్బాబు ఆరోపించారు. వారి మధ్య జరిగిన సంభాషణ రికార్డులను మంగళవారం పోలీసులకు అందించామని తెలిపారు. లావణ్య ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసి, ఇంట్లో డ్రగ్స్ పెట్టి పోలీసులకు పట్టించాలనే పథకం వేశారని ఆరోపించారు. ఆ వివరాలన్నీ పోలీసులకు అందించి చర్యలు తీసుకోవాలని కోరామని వెల్లడించారు. -
వంట మనిషి చెయ్యి పట్టి లాగాడని..
పటాన్చెరు టౌన్: వంట మ నిషి చెయ్యి పట్టి లాగాడని సెంట్రింగ్ మేస్త్రిని లేబర్లు చితకబాదడంతో మృతి చెందిన ఘటన బీడీఎల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. బీహార్కి చెందిన దీపక్ ఠాగూర్ (30) నాలుగు నెల కిందట బతుకుదెరువు కోసం వచ్చాడు. పటాన్చెరు మండలం నందిగామ పరిధిలోని మై ఫేర్ విల్లాస్లో సెంట్రింగ్ మేస్త్రిగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం రాత్రి మద్యం మత్తులో వెస్ట్ బెంగాల్కు చెందిన వంట మనిషి మాషారాణి చేయి పట్టి లాగడంతో ఆమెతోపాటు సంజయ్, సోప్దేవ్ సర్కార్, గోధంగా సన్యాసి మేస్త్రిని చితకబాదారు. తీవ్ర గాయాలైన అతడిని పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. వంట మనిషితోపాటు ముగ్గురు లేబర్లపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.చదవండి: HYD: బ్లాక్మెయిలింగ్ సొమ్ముతో అపార్ట్మెంట్ కొనుగోలు -
HYD: గాయత్రి హాస్టల్ కేసులో షాకింగ్ విషయాలు
తూర్పుగోదావరి: అశ్లీల వీడియోల పేరుతో యువతిని బెదిరిస్తూ నాలుగేళ్ల నుంచి డబ్బులు గుంజుతున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు వివరాలను మంగళవారం సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయంలో డీఎస్పీ జి.దేవకుమార్ వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. నిడదవోలుకు చెందిన ఓ యువతి హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఉన్న గాయత్రీ ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ విప్రో కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. అదే హాస్టల్లో ఉంటున్న కాజా అనూషాదేవితో ఆమెకు పరిచయం ఏర్పడింది. గుంటూరు జిల్లా ఓబులనాయుడుపాలేనికి చెందిన నీనావత్ దేవా నాయక్ అలియాస్ మధు అనే వ్యక్తిని అనూషాదేవి వివాహం చేసుకుంది. ఈ నేపథ్యంలో స్నేహితురాలికి తన భర్తను పరిచయం చేసింది. అనూషాదేవితో ఉన్న పరిచయం, ఒకే హాస్టల్లో ఉండడంతో బాధితురాలు ఆమెతో అత్యంత సన్నిహితంగా ఉండేది. దీంతో దేవనాయక్ వేరే వ్యక్తి ఫోన్ చేసినట్లుగా బాధితురాలికి ఫోన్ చేసి తన వద్ద ఆమె న్యూడ్ వీడియోలున్నాయని, వాటిని ఇంటర్నెట్లో పెడతానని బెదిరించారు. అలా చేయకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. విడతల వారీగా ఫోన్పే, గూగుల్ పే ద్వారా డబ్బులు వేయించుకునేవాడు. ఇలా కూడబెట్టిన సొమ్ముతో చిన్న కాకానిలో అపార్ట్మెంటు కోనుగోలు చేశాడు.కారు, బుల్లెట్, పెద్ద ఎత్తున బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేశాడు. కాగా..తనను ఒక వ్యక్తి బ్లాక్మెయిల్ చేస్తున్న విషయాన్ని అనూషాదేవికి బాధితురాలు తెలిపింది. ఈ విషయం మళ్లీ దేవానాయక్ దృష్టికి వెళ్లింది. వేరొకరి ద్వారా సెటిల్మెంట్ చేసినట్లు బాధితురాలిని నమ్మించాడు. అలాగే పలు అవసరాల కోసం బాధితురాలి దగ్గర డబ్బులు కాజేశాడు. కాగా.. అనూషాదేవి, ఆమె భర్త దేవానాయక్లు తనను మోసం చేస్తున్నారని బాధితురాలు గుర్తించించి. దీంతో తల్లిదండ్రులతో కలిసి నిడదవోలు పోలీసులను ఆశ్రయించింది. ఇలా ఆమె 2021 నుంచి 2025 వరకూ దాదాపు రూ. 2,53,76,000 మోసపోయింది. మరో రూ.14 లక్షలు డిమాండ్ చేయడంతో పోలీసులను ఆశ్రయించింది. మూడు రోజుల్లో కేసు ఛేదనబాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మూడు రోజుల్లో దేవా నాయక్ను పట్టుకున్నారు. అతడి నుంచి రూ.1,81,45,000 విలువైన 938 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2.250 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.75 లక్షల నగదు, కారు, బుల్లెట్ స్వా«దీనం చేసుకున్నారు. చిన్నకాకానిలో కొనుగోలు చేసిన అపార్ట్మెంటును స్థానిక రెవెన్యూ అధికారుల ద్వారా స్వా«దీనం పర్చుకున్నారు. -
ఆస్తి కోసం మరిదిని చంపించిన వదిన..
బషీరాబాద్, వికారాబాద్ : మరిదిని చంపితే అతని వాటా ఆస్తి తమకు వస్తుందని హత్య చేయించింది ఓ వదిన. ఈ ఘటన వికారాబాద్ జిల్లా (Vikarabad District) బషీరాబాద్ మండలం నవల్గా గ్రామంలో (Navalga Village) జరిగింది. పోలీసులు, హతుడి కుటుంబ సభ్యులు, తెలిపిన వివరాల ప్రకారం.. నవల్గాకు చెందిన మాల శ్యామప్ప (39) గ్రామ గేటు సమీపంలో హత్యకు గురయ్యాడు. మంగళవారం ఉదయం అటుగా వెళ్లిన వారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు బషీరాబాద్ (Basheerabad) పోలీసులకు ఫిర్యాదు చేశారు. అడ్డు తొలగిస్తే.. ఆస్తి దక్కుతుందని.. నవల్గాకు చెందిన మాల మల్లమ్మకు మాల నర్సిములు, శ్యామప్ప (39), శ్యామమ్మ సంతానం. అయితే శ్యామప్ప భార్య నాలుగేళ్ల క్రితం భర్తను వదిలేసి కూతురును తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి శ్యామప్ప తన చెల్లితో కలిసి ఉంటున్నాడు. అదే ఇంట్లోని రెండో భాగంలో అన్న నర్సిములు, వదిన సుగుణ నివసిస్తున్నారు. మరిదిని అంతమొందిస్తే ఇల్లు పూర్తిగా తమ సొంతం అవుతుందని భావించింది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన కొత్త విజయ్, విశ్వనాథ్, శివకుమార్లతో కలిసి వారం రోజుల క్రితం శ్యామప్ప హత్యకు పథకం వేసింది. అతన్ని చంపితే రూ.50 వేలు ఇస్తానని చెప్పి, శనివారం అడ్వాన్స్గా రూ.10 వేలు అందజేసింది. ఈ క్రమంలో సుపారీ తీసుకున్న ముగ్గురు శ్యామప్ప హత్యకు పక్కా ప్లాన్ వేశారు. సోమవారం సాయంత్రం బషీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో గ్లౌజ్లు తీసుకున్నారు. మద్యం తాగేందుకని రాత్రి శ్యామప్పను తీసుకుని గ్రామ శివారులోని ఓ పొలంలోకి వెళ్లారు. మద్యం తాగిన తర్వాత శ్యామప్ప తలపై రాళ్లతో కొట్టి హత్య చేశారు. దీన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు పొలానికి ఆనుకుని ఉన్న బషీరాబాద్– తాండూరు ప్రధాన మార్గం వద్దకు ఈడ్చుకెళ్లి పడేశారు. హత్య సమాచారం అందుకున్న ఎస్ఐ శంకర్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రూరల్ సీఐ నగేష్ హత్య తీరును పరిశీలించారు.చదవండి: రాజ్ తరుణ్- లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్..హతుడి తల్లి మల్లమ్మ, సోదరి శ్యామమ్మను విచారించి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి ఆధారాలు సేకరించాయి. అనుమానం వచ్చిన పోలీసులు వదిన సుగుణను ఠాణాకు తరలించి విచారించారు. హత్యకు సంబంధం ఉన్నట్లు గుర్తించిన ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించగా, వారు నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు బుధవారం వెల్లడిస్తామని సీఐ మీడియాకు తెలిపారు. -
ఐదు ట్రాలీ బ్యాగుల్లో నీట్గా ఫారిన్ గంజాయి
న్యూఢిల్లీ: రాజధానిలో మరోసారి మత్తు దందా బయటపడింది. ఢిల్లీ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ గంజాయిని అధికారులు సీజ్ చేశారు. ముఠాకు సంబంధించిన ఐదుగురిని అరెస్ట్ చేసిన అధికారులు.. మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఐదుగురు ప్రయాణికులు ఎయిర్పోర్టులో గ్రీన్ చానెల్ దాటేందుకు ప్రయత్నించారు. అయితే వాళ్ల కదలికలు అనుమానాస్పదంగా అనిపించడంతో కస్టమ్స్ అధికారులు ఆపి తనిఖీలు చేశారు. వాళ్ల దగ్గర ఉన్న ట్రాలీ బ్యాగుల నుంచి 94 ప్యాకెట్లలో నీట్గా ప్యాక్ చేసిన గంజాయి బయటపడింది. అది ఫారిన్ గంజాయి అని, దాని విలువ రూ.47 కోట్ల దాకా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు.. ఆ ఐదుగురిని రిమాండ్కు తరలించారు. -
వీడియోలు చూపి బాలికపై దురాగతం
యశవంతపుర: బాలిక (15)పై అత్యాచారం చేసి వీడియోలను తీసి వాటి ద్వారా తరచూ బెదిరింపులకు పాల్పడుతున్న ఇద్దరు కామాంధులను గదగ్ జిల్లా గజేంద్రగడ తాలూకా నరేగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. సులేమాన్, అల్తాఫ్ అరెస్టయినవారు.వివరాలు.. సులేమాన్ ఓ బాలికను ప్రేమపేరుతో లోబర్చుకున్నాడు. ఊరికి దూరంగా తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడేవాడు. ఆ వీడియోలను తీసుకుని స్నేహితుడు అల్తాఫ్కు ఇచ్చాడు. అతడు కూడా వీడియోలను ద్వారా బాలికను భయపెట్టి అత్యాచారానికి పాల్పడేవాడు. ఎవరికై నా చెబితే వీడియోలను వైరల్ చేస్తామని బాలికను బెదిరించారు. ఈ దారుణంపై బాలిక తల్లిదండ్రులతో మొరపెట్టుకోగా 2024 డిసెంబర్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో కేసు నమోదు చేసుకొని గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేరంలో 9 మంది నిందితులున్నట్లు తాలూకాలో ముమ్మరంగా ప్రచారం జరిగింది. విచారణ సాగిస్తున్నట్లు ఎస్పీ బీఎస్ నేమగౌడ తెలిపారు. -
ప్రేమ, పెళ్లి పేరుతో అమ్మాలయిను ట్రాప్ చేసిన మస్తాన్సాయి