breaking news
Crime News
-
శ్రీవాణి ఆత్మహత్యకు ఫొటోనే కారణమా..
పరకాల: ఓ పదో తరగతి విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా పరకాల మండలం మల్లక్పేట శివారులోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో సోమవారం జరిగింది. పరకాలకు చెందిన ఏకు ఈశ్వర్–నీల కుమార్తె శ్రీవాణి ఉదయం అల్పాహారం తీసుకున్న అనంతరం బాత్రూమ్కు వెళ్లింది. చాలాసేపటి వరకు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితురాళ్లు ప్రిన్సిపాల్ కృష్ణకుమారికి తెలిపారు. ఆమె వచ్చి బాత్రూం డోర్ను బలవంతంగా తీయడంతో శ్రీవాణి చున్నీతో ఉరివేసుకుని కనిపించింది. వెంటనే ఆమెను పరకాల సివిల్ ఆస్పత్రికి తరలించారు. శ్రీవాణి బాత్రూంలో జారిపడిందని తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన ఆస్పత్రికి వచ్చారు. అప్పటికే బాలిక చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు భోరుమని విలపించారు. తమ కుమార్తె చావుకు కారణం తెలపాలంటూ రెసిడెన్షియల్ ముందు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపల్ కృష్ణకుమారి, హౌజ్మాస్టర్ మీరాబాయి వేధింపుల కారణంగానే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆత్మహత్యకు ఫొటోనే కారణమా.. వారం క్రితమే రెసిడెన్షియల్లో చేరిన శ్రీవాణి వద్ద ఓ ఫొటోను చూసిన హౌస్ టీచర్ బలవంతంగా లాక్కున్నట్లు తెలిసింది. తర్వాత విద్యార్థిని సదరు టీచర్ తాళం చెవి కనుక్కొని లాకర్ ఓపెన్ చేసి ఫొటో తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయంపై ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేయగా.. విద్యార్థినుల సమక్షంలోనే శ్రీవాణిని నోటికి వచి్చనట్లు తిట్టి.. చావచ్చు కదా అన్నట్లు సమాచారం. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ప్రిన్సిపాల్ ఆటోలో విద్యారి్థని మృతదేహాన్ని తరలించడాన్ని పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకొని పరకాల పోలీస్స్టేషన్కు తరలించినట్లు సమాచారం. -
భర్త దారుణ హత్య.. ఇంటికి తాళం వేసి భార్య పరార్..!
నాగోలు(హైదరాబాద్): ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసి నగర శివార్లలోని నిర్మానుష్య ప్రాంతంలో పడవేసిన సంఘటన నాగోలు పోలీసుల స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగులోకి వచి్చంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని పసుమాముల శివారులో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు నాగోలు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహం వద్ద లభించిన వివరాల ఆధారంగా మృతుడు కాచిగూడకు చెందిన అశోక్ యాదవ్ గా గుర్తించారు. కాచిగూడలో జ్యూస్ షాప్ నిర్వహిస్తున్న అశోక్ యాదవ్కు భార్య క్రాంతి దేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్కుమార్, ఏసీపీ కృష్ణయ్య, నాగోలు ఇన్స్పెక్టర్ సూర్యనాయక్ సంఘటన స్ధలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించింది. అశోక్ యాదవ్ మృతదేమం లభించిన ఫోన్ ఆధారంగా అతని భార్యకు ఫోన్ చేసిన పోలీసులు సమాచారం సేకరించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు ఇంటి వస్తున్నట్లు సమాచారం అందుకున్న అతడి భార్య ఇంటికి తాళం, జ్యూస్ సెంటర్ మూసి వేసి సెల్ఫోన్ ఆఫ్ చేసి పరారైనట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కు తరలించారు. -
తమిళనాడులో భారీ పేలుడు.. 8 మంది మృతి
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. పటాకుల తయారీ ప్రముఖ కేంద్రం శివకాశిలోని ఓ గోడౌన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది మరణించగా.. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు. పేలుడు ధాటికి సత్తూరులోని బాణసంచా యూనిట్పై దట్టమైన పొగ అములుకుంది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నామని బాణాసంచా గోడౌన్ నిర్వాహకులు చెబుతున్నప్పటికీ.. తరచూ ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి.#JUSTIN சிவகாசி அருகே சின்ன காமன்பட்டி கோகுலேஸ் பட்டாசு ஆலையில் பயங்கர வெடி விபத்து #Sivakasi #FireAccident #News18Tamilnadu | https://t.co/3v5L32pLWJ pic.twitter.com/5g7GYG6V6d— News18 Tamil Nadu (@News18TamilNadu) July 1, 2025VIDEO Credits: News18 Tamil Nadu -
‘నా వద్దకు రాకపోతే ఆత్మహత్య చేసుకుంటా’
నేరేడుచర్ల(నల్గొండ): ప్రియుడికి వీడియో కాల్ చేస్తే స్పందించకపోవడంతో మనస్తాపానికి గురై ఉరేసుకున్న వివాహిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. ఆమె మృతికి ప్రియుడే కారణమని మృతదేహాన్ని అతడి ఇంటి ముందు ఉంచి మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆదివారం రాత్రి ఆందోళన చేపట్టారు. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మండలం బోడలదిన్నె గ్రామానికి చెందిన మల్గిరెడ్డి అశ్విని(35) తన భర్తతో కలిసి గత మూడేళ్లుగా హైదరాబాద్లోని ఎల్బీనగర్లో నివాసముంటోంది. వీరికి ఒక కుమార్తె సంతానం. బోడలదిన్నె గ్రామానికే చెందిన కందుకూరి సురేష్రెడ్డి కూడా ఎల్బీనగర్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో అశ్విని, సురేష్రెడ్డి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇటీవల అశ్విని, సురేష్రెడ్డి మధ్య దూరం పెరగడంతో.. నాలుగు రోజుల క్రితం అశ్విని సురేష్రెడ్డికి వీడియో కాల్ చేసి ‘నా వద్దకు రాకపోతే ఆత్మహత్య చేసుకుంటా’ అని చెప్పింది. దీనికి తాను రానని సురేష్రెడ్డి సమాధానం చెప్పడంతో మనస్తాపానికి గురైన అశ్విని తాను ఉంటున్న ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత అనుమానం వచ్చి సురేష్రెడ్డి అశ్విని ఇంటికి వెళ్లగా ఆమె ఆపస్మారక స్థితిలో ఉండటం చూసి సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. మృతదేహంతో ఆందోళన..అశ్విని మృతికి సురేష్రెడ్డే కారణమంటూ మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి బోడలదిన్నె గ్రామంలోని సురేష్రెడ్డి ఇంట్లో మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్ తన సిబ్బందితో బోడలదిన్నె గ్రామానికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు కుటుంబాలతో గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో చర్చలు జరిపి సోమవారం అశ్విని మృతదేహానికి అంత్యక్రియలు పూర్తిచేశారు. అశ్విని మృతికి సురేష్రెడ్డి కారణమంటూ ఆమె కుటుంబ సభ్యులు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. -
నెల్లూరులో అత్తమామలను నరికి చంపిన అల్లుడు
భార్యపై అనుమానమే పెనుభూతమైంది. రెక్కాడితే గానీ డొక్కాడని పేద కుటుంబంలో మద్యం చిచ్చు రేపింది. మత్తులో విచక్షణ కోల్పోయేలా చేసింది. అడ్డుకోబోయిన అత్త, మామల ప్రాణాలు తీసింది. భార్య కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటనతో దుత్తలూరు ఒక్కసారిగా ఉలికి పడింది. పల్లెల్లో విచ్చలవిడిగా జరుగుతున్న మద్యం విక్రయాలే ఈ ఘటనకు కారణమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: దుత్తలూరు ఏసీ కాలనీ ఆదివారం అర్ధరాత్రి హత్యల కలకలంతో ఉలికి పడింది. మద్యం మత్తులో భార్యపై అనుమానంతో విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి సాగించిన మారణకాండ ఇది. కాలనీలో నివాసముంటున్న ఏలూరు వెంగయ్య మద్యానికి బానిసయ్యాడు. ఇదే క్రమంలో భార్యపై పెంచుకున్న అనుమానం అతనిలో మనిషిని మృగాన్ని చేసింది. భార్యను ఎలాగైనా అంతమొందించాలనే ఉద్దేశంతో ఉన్న వెంగయ్య ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు పూటుగా మద్యం తాగి ఇంటికెళ్లాడు. అప్పటికే భార్య వెంకాయమ్మ సమీపంలోని పుట్టింటికెళ్లింది. దీంతో మరింత కోపోద్రిక్తుడైన వెంగయ్య కట్టెలు కొట్టడానికి ఉపయోగించే పదునైన మచ్చుకత్తి వెంట తీసుకొని అత్తామామల ఇంటికి వెళ్లాడు. తన భార్యను చంపేస్తానంటూ వీరంగం చేశాడు. దీంతో అడ్డుకోబోయిన అత్తామామలు చలంచర్ల జయమ్మ (60) కల్లయ్య (65)లను కత్తితో విచక్షణా రహితంగా దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమై ఆ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. అంతటితో ఆగకుండా భార్య వెంకాయమ్మపై కూడా కత్తితో దాడి చేశాడు. అయితే ఆమె తప్పించుకునే ప్రయత్నం చేయడంతో గాయాలతో బయటపడి కింద పడిపోయింది. పెద్ద కుమార్తె కేకలు వేయడంతో స్థానికులు వచ్చి గట్టిగా నియంత్రించడంతో వారిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ కత్తితో పరారయ్యాడు. గాయపడిన వెంకాయమ్మను ఉదయగిరి వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న సీఐ వెంకట్రావు, ఎస్సైలు ఆదిలక్ష్మి, రఘునాథ్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. క్లూస్టీం ప్రాథమిక ఆధారాలు సేకరించారు. నిందితుడు వెంగయ్య కోసం స్థానికంగా, సాంకేతకంగా వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఎప్పుడుపడితే అప్పుడు పల్లెల్లో మద్యం దొరకడం వల్లే ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. -
పాశమైలారం ఘటన.. సిగాచి బాధితులకు సీఎం పరామర్శ
పెను విషాదాన్ని మిగిల్చిన సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మరణించిన వారి సంఖ్యను 45గా అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఫ్యాక్టరీ అడ్మిన్ భవన శిథిలాల ప్రక్రియ కొనసాగుతోంది. తొలగింపు తర్వాతే మృతుల సంఖ్యపై స్పష్టత రానుంది. Updates: 42కు చేరిన మృతులుమృతుల సంఖ్య పెరిగే అవకాశంమృతుల్లో ఎక్కువ మంది తమిళనాడు, బిహార్, జార్ఖండ్ వాసులుమృతదేహాలను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలుఆసుపత్రుల్లో 35 మంది బాధితులకు చికిత్స12 మంది పరిస్థితి విషమం, ఐసీయూలో చికిత్సపేలుడు ఘటనలో 27 మంది కార్మికులు గల్లంతుశిథిలాల కింద మృతదేహాల కోసం గాలిస్తున్న డీఆర్ఎఫ్ టీమ్సహాయక చర్యల్లో ఎస్డీఆర్ఎఫ్, రెవెన్యూ, హైడ్రా సిబ్బందితమవాళ్ల ఆచూకీ కోసం బాధిత కుటుంబాల ఆందోళన బాధితులకు సీఎం పరామర్శసిగాచి ఫ్యాక్టరీ బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి పరామర్శధృవ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన సీఎంఆరోగ్య స్థితిపై ఆరాకార్మికుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీమార్చురీ వద్ద రోదనలతో పడిగాపులుపటాన్ చెరులో డిఎన్ఏ శాంపుల్స్ సేకరణ కోసం ప్రత్యేక చర్యలుగుర్తుపట్టేందుకు వీలులేని మృతదేహాలకు డీఎన్ఏ టెస్ట్ లుతమ వారిని గుర్తించలేని కుటుంబ సభ్యుల నుండి డీఎన్ఏ సేకరణఇప్పటివరకు 18 మంది డిఎన్ఏ శాంపుల్ సేకరణ మృతదేహాలడీఎన్ఏ రిపోర్ట్ వచ్చిన తరువాతే మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్న అధికారులుఇవాళ 11 మంది డెడ్ బాడీలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్న అధికారులుతమవాళ్ల మృతదేహాల కోసం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోదనలతో కుటుంబ సభ్యుల పడిగాపులుఘటనపై NHRC కేసు నమోదుపాశమైలారం ప్రమాదంపై జాతీయ మానవ హక్కుల సంఘం కేసు నమోదుఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన న్యాయవాది రామారావుకేసు నమోదు చేసిన ఎన్హెచ్ఆర్సీమృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం యాజమాన్యం నుంచి ఇప్పించాలని పిటిషన్తాజా ప్రమాదం నేపథ్యంలో.. తెలంగాణలోని పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టాలని కోరిన పిటిషనర్త్వరలో ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు? యాజమాన్యం ఎక్కడ? 24 గంటలు దాటినా యాజమాన్యం రాకపోవడం బాధాకరమన్న మంత్రి శ్రీధర్బాబుఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్న శ్రీధర్బాబుప్రమాద ఘటనను కార్మిక, వైద్యశాఖ మంత్రులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు: మంత్రి శ్రీధర్బాబుఅంతకుముందు.. యాజమాన్యం ఎక్కడ? అని అధికారులను ఆరా తీసిన సీఎం రేవంత్ బాయిలర్ల పనితీరుపై యాజమాన్యానికి చెప్పారా? అని ప్రశ్న యాజమాన్యం రాకపోవడంపై సీఎం ఆగ్రహం సిగాచి ఘటనపై సీఎం కీలక ఆదేశాలుసిగాచి పరిశ్రమను పరిశీలించిన సీఎం, మంత్రులుఅనంతరం ప్రమాద స్థలిలోనే అధికారులతో సీఎం సమీక్షఫ్యాక్టరీ ప్రమాదంపై అధికారులను ఆరా తీసిన సీఎం రేవంత్సిగాచి పరిశ్రమ అనుమతులు, భద్రతా ప్రమాణాలపై అధికారులను ప్రశ్నించిన సీఎం రేవంత్పరిశ్రమను తనిఖీ చేశారా?.. తనిఖీల్లో ఏమైనా లోపాలను గుర్తించారా?పరిశ్రమ బోర్డు సభ్యులు ఎవరు? అంటూ ఫ్యాక్టరీస్ డైరెక్టర్ను అడిగిన సీఎంఘటనపై కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్గతంలో ఏమైనా ప్రమాదాలు జరిగాయా?.. కారణాలు తెలుసుకోండిఇప్పటికే తనిఖీలు చేసినవాళ్లతో కాకుండా.. కొత్త వాళ్లతో విచారణ జరిపించండిఈ ప్రమాదంపై నిపుణులతో విచారణ జరిపించి నివేదిక ఇవ్వండిఇలాంటి ప్రమాదాలపై అధికారులు అలర్ట్గా ఉండాలితక్షణ సాయం కింద.. మృతుల కుటుంబాలకు రూ.లక్ష, క్షతగాత్రులకు రూ.50 వేలు అందించాలని సీఎం ఆదేశంపాశమైలారం ఘటనా స్థలిలో సీఎం రేవంత్పాశమైలారం సిగచి ఫ్యాక్టరీ ప్రమాద స్థలికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డివెంట మంత్రులు పొంగులేటి, వివేక్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి..ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీని పరిశీలిస్తున్న ముఖ్యమంత్రిప్రమాదం జరిగిన తీరును.. సహాయక చర్యలపై అధికారులను ఆరా తీస్తున్న సీఎం రేవంత్పటాన్చెరు మార్చురీలో 37 మృతదేహాలు11 మృతదేహాల గుర్తింపు పూర్తి పూర్తిగా కాలిపోయి గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహాలుడీఎన్ఏ టెస్ట్కు ఒకరోజు నుంచి రోజున్నర టైం పడుతుందంటున్న అధికారులు సిగచి ప్రమాద స్థలికి కేంద్రమంత్రి కిషన్రెడ్డిసంగారెడ్డి పటాన్ చెరువు సిగచి కంపెనీ ప్రమాద స్థలానికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డిమధ్యాహ్నం ప్రమాద స్థలిని పరిశీలించి.. బాధితులను పరామర్శించనున్న కిషన్రెడ్డికిషన్రెడ్డి వెంట బీజేపీ నూతన అధ్యక్షుడు రాంచందర్రావు కూడాకొనసాగుతున్న మృతదేహాల గుర్తింపుపాశమైలారం ఘటనలో కొనసాగుతున్న మృతదేహాల గుర్తింపుడీఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాల గుర్తింపునకు ఏర్పాట్లుఘటనాస్థలానికి వచ్చిన డీఎన్ఏ పరీక్షలు చేసే బృందాలుఇప్పటిదాకా కేవలం 6 మృతదేహాలకు మాత్రమే గుర్తింపుపటాన్చెరు బయల్దేరిన సీఎం రేవంత్రెడ్డికాసేపట్లో పటాన్చెరు పాశమైలారం పారిశ్రామికవాడకు సీఎం రేవంత్ రెడ్డిఫ్యాక్టరీ ప్రమాద బాధితులకు ఆస్పత్రిలో పరామర్శపాశమైలారం ప్రమాద స్థలిని పరిశీలించనున్న సీఎంసీఎం వెంట మంత్రులు కూడాసిగచి ఆవరణలో పోలీసు ఆంక్షలుసిగచి ప్రమాద స్థలానికి సీఎం రేవంత్ రెడ్డిఅంతకంటే ముందు.. ఆస్పత్రిలో క్షతగాత్రులకు పరామర్శసీఎం రాక నేపథ్యంలో సిగచి కంపెనీ పరిసర ప్రాంతాల్లో పోలీసుల ఆంక్షలుసిగచి కంపనీ వైపు ఎవరిని అనుమతించని పోలీసులునిన్న ప్రమాదం తర్వాత బాధిత కుటుంబాలతో పోలీసులకు వాగ్వాదంతమ వారి గురించి సరైన సమాచారం లేదని ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులుతోసేసిన పోలీసులు.. ఫ్యాక్టరీ వద్ద కాసేపు ఉద్రిక్తత42కు చేరుకున్న మృతుల సంఖ్యశిథిలాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగింపు..మరో రెండు గంటల పాటు శిధిలాల తొలగించే ప్రక్రియ కొనసాగే అవకాశం..కుప్పకూలిన సిగచి ప్రొడక్షన్ బిల్డింగ్చనిపోయిన వారిలో ఎక్కువ మంది తమిళనాడు బీహార్ జార్ఖండ్ కు చెందిన వారే..వివిధ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 34 మంది క్షతగాత్రులుమూడు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులుశిథిలాల కింద మరో 20 మంది42కి చేరిన మృతుల సంఖ్యశిథిలాల కిందే మరో 20 మంది?మృతుల సంఖ్య 55కి చేరే అవకాశంకొనసాగుతున్న శిథిలాల తొలగింపుధ్వంసమైన ప్లాంట్ను పక్కకు తొలగించిన సహాయక బృందాలుగుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలుమృతుల్లో తమిళనాడు, యూపీ వాసులేక్కువడీఎన్ఏ పరీక్షల అనంతరమే కుటుంబ సభ్యులకు అప్పగించే ఛాన్స్ఇప్పటివరకు గుర్తు పట్టినవి ఆరు మృతదేహాలు మాత్రమేఅంతకు ముందు.. ఈ ఉదయం ప్రమాదంపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారిక ప్రకటన చేశారు. ఘటన వివరాలతో పాటు సహాయక చర్యలు ఇతరత్రా వివరాలను వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదంలో 47 మంది గల్లంతు అయ్యారుఇప్పటివరకు 26 మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. అందులో నాలుగు మృతదేహాలను మాత్రమే గుర్తించాం.ఆస్పత్రిలో చికిత్స పొందుతు మరికొందరు మృతిగుర్తుపట్టలేని స్థితిలో 20 మృతదేహాలు ఉన్నాయి మరో 27 మంది జాడ తెలియాల్సి ఉందిఆస్పత్రిలో తీవ్ర గాయాలతో 35 మందికి చికిత్స అందుతోంది.. అందులో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది57 మంది సరక్షితంగా ఇంటికి వెళ్లారుప్రమాద సమయంలో మూడు అంతస్తుల భవనం కూలిపోయిందిశిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉన్నారు.. వారిని బయటకు తీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయిసహాయక చర్యల్లో ఎస్డీఆర్ఎఫ్, రెవెన్యూ, హైడ్రా సిబ్బంది పాల్గొంటున్నారు ఇదీ చదవండి: పరిశ్రమల్లో ప్రాణాలు.. గాలిలో దీపాలు సంగారెడ్డి కలెక్టరేట్లో కంట్రోల్ రూం సిగాచీ పరిశ్రమలో ప్రమాదం నేపథ్యంలో బాధిత కుటుంబాలకు సహాయం కోసం సంగారెడ్డి కలెక్టరేట్లో కంట్రోల్ రూంతక్షణ సహాయం కోసం సంబంధిత వ్యక్తులు 08455–276155 నంబర్ను సంప్రదించవచ్చన్న కలెక్టర్ ప్రావీణ్యబ్లోయర్ పేలి.. రియాక్టర్కు అంటుకుని.. మందుల తయారీకి సంబంధించిన ఈ పరిశ్రమలో కన్సిస్టెన్స్ మైక్రోస్టెల్లయిన్ సెల్యులర్ పౌడర్ ఉత్పత్తి ప్రాథమికం సమాచారం ప్రకారం.. ఉదయం 9.10 గంటల ప్రాంతంలో మొత్తం 111 మంది కార్మికులు, ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. అంతా పనిలో నిమగ్నమై ఉండగా తొలుత హెయిర్ బ్లోయర్ పేలింది. ఎగసిన మంటలు సమీపంలో ఉన్న రియాక్టర్కు అంటుకోవడంతో చెవులు చిల్లులు పడిపోయేంత శబ్దంతో భారీ పేలుడు సంభవించింది. భూమి కంపించినట్టు అయ్యిందన్న ప్రత్యక్ష సాక్షులు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్న కొందరు కార్మికులు అయితే ఎయిర్ ఫైర్ సిస్టమ్లో ప్రెషర్ వల్లే సిగాచీ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుందని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ స్పష్టం చేశారు. ఇప్పటికే పరిశ్రమల శాఖ అధికారులు దీనిపై విచారణ ప్రారంభించారని తెలిపారు. మృతుల్లో యాజమాన్య ప్రతినిధి?మృతులు, గాయపడిన వారిలో ఎక్కువగా ఒడిశా, బిహార్, యూపీ వాళ్లే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మరణించిన వారిలో ఫ్యాక్టరీ యాజమాన్యానికి చెందిన గోవన్ అనే వ్యక్తి కూడా ఉన్నారని అధికారవర్గాలు వెల్లడించాయి. ఆయన ఫ్యాక్టరీలోకి వచ్చిన కొద్ది సేపటికే ఈ పేలుడు సంభవించిందని తెలిపాయి. అర్ధరాత్రి వరకు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ సిగాచి పరిశ్రమ భవనాల శిథిలాల కింద కార్మికులు చిక్కుకుపోయి ఉంటారనే అంచనాతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. హైడ్రా, అగ్నిమాపక సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. భారీ కట్టర్లు, క్రేన్లు, హిటాచీలతో శిథిలాల తొలగింపును చేపట్టారు. సాయంత్రం కురిసిన చిన్న పాటి వర్షం సహాయక చర్యలకు కొంత అంతరా యం కలిగించింది. అయితే రెస్క్యూ ఆపరేషన్ అర్ధరాత్రి వరకు కొనసాగింది. మంగళవారం కూడా శిథిలాల తొలగింపు చర్యలు కొనసాగనున్నాయి. మిన్నంటిన రోదనలు.. ఆందోళన కార్మికుల కుటుంబసభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. విధులకు హాజరై ఆచూకీ లేకుండా పోయిన వారి కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. తమ వారి ఆచూకీ అధికారులను ఆరా తీశారు. సరైన స్పందన లేకపోవడంతో ఆందోళనకు దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఫార్మా పరిశ్రమలో భారీ పేలుడుసంగారెడ్డి జిల్లాలోని సిగాచీ కంపెనీలో రియాక్టర్ పేలడంతో ప్రమాదం చెల్లాచెదురుగా ఎగిరిపడిన కార్మికులు, ఛిద్రమైన శరీరాలు అగ్నికీలల్లో పలువురి సజీవదహనం.. కార్మికులు, ఉద్యోగులు దుర్మరణం! సమీప ఆసుపత్రులకు క్షతగాత్రుల తరలింపు మృతుల్లో ఎక్కువమంది ఒడిశా, బిహార్, యూపీ వారే.. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ సహా ప్రముఖుల సంతాపం 36 మందికి కాలిన గాయాలు.. పలువురి పరిస్థితి విషమం కుప్పకూలిన భవనాలు.. శిథిలాల కింద మరికొందరు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం అర్ధరాత్రి వరకు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్... ఘటనా స్థలాన్ని,ఆస్పత్రులను సందర్శించిన మంత్రులు.. నేడు ఘటనా స్థలానికి సీఎం రేవంత్ ఆస్పత్రిలో బాధితులకు సీఎం పరామర్శ -
బతుకులు బుగ్గి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/పటాన్చెరు టౌన్/పటాన్చెరు/రామచంద్రాపురం/జిన్నారం/చందానగర్: ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడగా పేరున్న పాశమైలారంలోని సిగాచి అనే ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో సోమవారం భారీ పేలుడు సంభవించింది. కంపెనీలోని రియాక్టర్ పేలిపోగా దాని తీవ్రతకు మూడంతస్తుల భవనాలు రెండు కుప్పకూలిపోయాయి. పరిశ్రమ పైకప్పు, రేకులు, ఇతర యంత్ర భాగాలు ఎగిరి వంద మీటర్ల దూరంలో పడ్డాయి. యంత్రాల భాగాలు చెల్లాచెదురయ్యాయి. భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఆ ప్రదేశమంతా దట్టమైన పొగ అలుముకుంది. ఆ సమయంలో అక్కడ పని చేస్తున్న 100 మందికి పైగా కార్మికులు, ఉద్యోగులు పేలుడు ధాటికి చెల్లాచెదురుగా పడిపోయారు. శరీరాలు ఛిద్రమైపోయాయి. 10 మంది అక్కడికక్కడే సజీవ దహనం కాగా ఇద్దరు ఆస్పత్రుల్లో మృతి చెందినట్లు తెలుస్తోంది. మొత్తం 16 మంది మరణించినట్లు అనధికారిక సమాచారంకాగా, మంత్రులు దామోదర, వివేక్ మాత్రం 12 మంది మరణించినట్లు ప్రకటించారు. మృతదేహాలను గుర్తించలేని పరిస్థితి నెలకొంది. సుమారు 36 మంది గాయపడ్డారు. 20 మందికి పైగా కార్మికులకు 80 శాతానికి పైగా కాలిన గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. క్షతగాత్రులను సమీపంలో ఉన్న పటాన్చెరు, చందానగర్, మదీనాగూడ, మియాపూర్లలోని పలు ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. భవనాల శిథిలాల కింద మరింత మంది కార్మికులు, ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. పరిశ్రమ ఆవరణలో భీతావహ వాతావరణం నెలకొంది. ఘటనా స్థలాన్ని మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, పోలీసు ఉన్నతాధికారులు, ఇతర అధికారులు సందర్శించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఘోర దుర్ఘటనపై ప్రధాని మోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ, సీఎం రేవంత్రెడ్డి, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తదితర ప్రముఖులు ది్రగ్బాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. బ్లోయర్ పేలి.. రియాక్టర్కు అంటుకుని.. మందుల తయారీకి సంబంధించిన ఈ పరిశ్రమలో కన్సిస్టెన్స్ మైక్రోస్టెల్లయిన్ సెల్యులర్ పౌడర్ను ఉ త్పత్తి చేస్తారు. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం.. ఉదయం 9.10 గంటల ప్రాంతంలో మొత్తం 111 మంది కార్మికులు, ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. అంతా పనిలో నిమగ్నమై ఉండగా తొలుత హెయిర్ బ్లోయర్ పేలింది. దీంతో ఎగసిన మంటలు సమీపంలో ఉన్న రియాక్టర్కు అంటుకోవడంతో చెవులు చిల్లులు పడిపోయేంత శబ్దంతో భారీ పేలుడు సంభవించింది. భూమి కంపించినట్టు అయ్యింది. కొందరు కార్మికులు వెంటనే బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. మృతుల్లో యాజమాన్య ప్రతినిధి? మృతులు, గాయపడిన వారిలో ఎక్కువగా ఒడిశా, బిహార్, యూపీ వాళ్లే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మరణించిన వారిలో ఫ్యాక్టరీ యాజమాన్యానికి చెందిన గోవన్ అనే వ్యక్తి కూడా ఉన్నారని అధికారవర్గాలు వెల్లడించాయి. ఆయన ఫ్యాక్టరీలోకి వచ్చిన కొద్ది సేపటికే ఈ పేలుడు సంభవించిందని తెలిపాయి. అర్ధరాత్రి వరకు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ సిగాచి పరిశ్రమ భవనాల శిథిలాల కింద కార్మికులు చిక్కుకుపోయి ఉంటారనే అంచనాతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. హైడ్రా, అగ్నిమాపక సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. భారీ కట్టర్లు, క్రేన్లు, హిటాచీలతో శిథిలాల తొలగింపును చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం కురిసిన చిన్న పాటి వర్షం సహాయక చర్యలకు కొంత అంతరా యం కలిగించింది. అయితే రెస్క్యూ ఆపరేషన్ అర్ధరాత్రి వరకు కొనసాగింది. మంగళవారం కూడా శిథిలాల తొలగింపు చర్యలు కొనసాగనున్నాయి. మిన్నంటిన రోదనలు.. ఆందోళన కార్మికుల కుటుంబసభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. విధులకు హాజరై ఆచూకీ లేకుండా పోయిన వారి కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. తమ వారి ఆచూకీ అధికారులను ఆరా తీశారు. వారి నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆందోళనకు దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి దామోదర రాజనర్సింహ నాలుగు గంటల పాటు అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్కు పలు సూచనలిచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని పరిశ్రమల శాఖ ఫైర్ సేఫ్టీ అధికారులను ఆదేశించారు. ఎయిర్ ఫైర్ సిస్టమ్లో ప్రెషర్ వల్లే సిగాచీ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుందని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ స్పష్టం చేశారు. ఇప్పటికే పరిశ్రమల శాఖ అధికారులు దీనిపై విచారణ ప్రారంభించారని తెలిపారు. ప్రభుత్వం తరఫున మెరుగైన ఎక్స్గ్రేషియా అందించేందుకు కృషి చేస్తామన్నారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న మంత్రులు దామోదర, వివేక్ రాజకీయం చేయొద్దు: మంత్రులు పేలుడు ఘటనలో గాయపడిన వారిలో హేమ సుందర్, ధర్మరాజ్ ప్రసాద్, రాజేష్ కుమార్ చౌదరి, కమలేష్ ముఖియా, చందన్కుమార్ నాయక్, నగ్నజిత్, అభిషేక్ కుమార్, అజిత్ తివారి, సంజయ్కుమార్, యశ్వంత్ కుమార్, ధన్వీర్ కుమార్, సంజయ్ ముఖియా, రాజశేఖర్రెడ్డి, దేవనంద్, గణేష్ కుమార్, సంజయ్కుమార్ యాదవ్, నీలాంబర్ బట్రా, సమీర్, అమర్జిత్, అర్జున్కుమార్, అజిమ్ అన్సారీలను మియాపూర్ మదీనాగూడలోని ప్రణామ్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఇక్కడ చికిత్స పొందుతూ అభిషేక్ కుమార్, అజిత్ తివారి మృతి చెందారు. ముగ్గురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రివర్గాలు వెల్లడించాయి. ఆస్పత్రిలో ఉన్నవారిని మంత్రులు దామోదర్ రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదంలో గాయపడిన కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. దీనిపై ఎవరూ ఎలాంటి రాజకీయం చేయవద్దని కోరారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఇందుకు అయ్యే ఖర్చు ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. సంగారెడ్డి కలెక్టరేట్లో కంట్రోల్ రూం.. సిగాచీ పరిశ్రమలో ప్రమాదం నేపథ్యంలో బాధిత కుటుంబాలకు సహాయం కోసం సంగారెడ్డి కలెక్టరేట్లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. తక్షణ సహాయం కోసం సంబంధిత వ్యక్తులు 08455–276155 నంబర్ను సంప్రదించవచ్చని కలెక్టర్ ప్రావీణ్య ఒక ప్రకటనలో తెలిపారు. నేడు సీఎం సందర్శన సిగాచి పరిశ్రమను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం ఉదయం 10 గంటలకు సందర్శించనున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించనున్నారు. అక్కడి కార్మికులతో మాట్లాడనున్నారు. సహాయక చర్యలను కూడా పరిశీలిస్తారు. కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి: కేసీఆర్ సిగాచి పరిశ్రమ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. ప్రమాదానికి కారణాలపై విచారణ జరిపించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందేలా చూడాలని, చనిపోయిన కార్మికులు, ఉద్యోగుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ఇలావుండగా పాశమైలారం పరిశ్రమలో రియాక్టర్ పేలుడు అత్యంత విషాదకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పలువురు కార్మికులు చనిపోయారన్న వార్త తనను తీవ్రంగా కలచి వేసిందని అన్నారు. రూ.2 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రధానిసాక్షి, న్యూఢిల్లీ: సంగారెడ్డి జిల్లాలో సంభవించిన పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున ఖర్గే, రాహుల్గాంధీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రధాని తక్షణ ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రధానమంత్రి జాతీయ ఉపశమన నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు చొప్పున, గాయపడ్డ వారికి రూ.50 వేలు చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ‘ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నా. తమకు ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తున్నా. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా..’ అని మోదీ పేర్కొన్నారు. ‘ఈ ఘోర ప్రమాదం గురించి విని చాలా బాధ కలిగింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు తక్షణ సహాయ, రక్షణ చర్యలు చేపడుతున్నారు..’ అని రాహుల్ పేర్కొన్నారు. ‘ఈ ఘోర ప్రమాదంలో అమూల్యమైన ప్రాణాలు పోవడం ఎంతో దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం..’ అని ఖర్గే అన్నారు.సీఎం రేవంత్ దిగ్భ్రాంతి.. ప్రమాదంపై ఆరా సాక్షి, హైదరాబాద్: పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన ఘోర ప్రమాదంఫై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సహాయక చర్యలకు ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ను అడిగి తెలుసుకున్నారు. డీజీపీ జితేందర్, సీఎస్ రామకృష్ణారావుతో సమీక్షించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు. సహాయక చర్యలను నిరంతరాయంగా కొనసాగించేందుకు, వాటిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం తరఫున సీఎస్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. డిజాస్టర్మేనేజ్మెంట్స్పెషల్ సీఎస్, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఫైర్సరీ్వసెస్అడిషనల్డీజీని సభ్యులుగా నియమించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలను సిఫారసు చేసే బాధ్యతను కమిటీకి అప్పగించారు. -
భర్త వివాహేతర సంబంధం.. భార్య అనుమానాస్పద మృతి
పీలేరు(అన్నమయ్య): అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన సంఘటన మండలంలోని కాకులారంపల్లె పంచాయతీ బందారువాండ్లపల్లెలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం వెంగంపల్లెకు చెందిన లోకనాథరెడ్డి, జీవనజ్యోతి కుమార్తె ఇందుజా (30)కు ఐదేళ్ల క్రితం బందారువాండ్లపల్లెకు చెందిన వరంపాటి శంకర్రెడ్డి కుమారుడు విజయశేఖర్రెడ్డితో వివాహం జరిగింది. కొంతకాలంపాటు వారి సంసారం సజావుగా సాగింది. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. విజయశేఖర్రెడ్డి వేరే మహిళతో వివాహేతర సంబంధం కలిగి వుండడంతో తరచూ భార్య భర్తలు గొడవ పడేవారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున ఇందుజా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు పీలేరుకు చేరుకుని తమ కుమార్తెను అత్తింటివారే కడతేర్చారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్రెడ్డి స్థానిక ప్రభుత్వాస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించి, బంధువుల ఫిర్యాదు మేరకు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
రియాక్టర్ మొదట బ్లాస్ట్ కాలేదు.. ఫ్యాక్టరీ ప్రమాదంపై మంత్రి వివేక్
పటాన్చెరు పారిశ్రామికవాడ ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరిగేలా కనిపిస్తోంది. షిఫ్ట్లో 150 మంది కార్మికులు ఉండగా.. ప్రమాదం జరిగిన బ్లాక్లోనే 90 మంది దాకా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం.. మృతుల సంఖ్య 15కి చేరింది. కంపెనీ మేనేజర్ ఒకరు సైతం మృతి చెందినట్లు సమాచారం. 26 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. అందులో పలువురిపరిస్థితి విషమంగా ఉంది. శిథిలాల తొలగింపు తర్వాతే మృతుల సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. సంగారెడ్డి, సాక్షి: పటాన్చెరు పారిశ్రామికవాడ పాశమైలారంలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. సిగాచి కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలింది. పేలుడు ధాటికి కంపెనీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, మ్యాన్ఫ్యాక్చరింగ్ యూనిట్ సహా చాలా భాగం దెబ్బతింది. ఆ సమయంలో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ పరిసరాల్లోనే భారీ సంఖ్యలో కార్మికులు ఉన్నట్లు సమాచారం. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సోమవారం ఉదయం 9గం. సమయంలో భారీ శబ్దంతో రియాక్టర్ పేలి మంటలు వ్యాపించాయి. పేలుడు ధాటికి కార్మికులు 100 మీటర్ల దూరం ఎగిరి పడ్డారు. కంపెనీలో ఎక్కడ పడితే అక్కడ క్షతగాత్రులు పడిపోయారు. ప్రమాద సమయంలో లోపల కార్మికులు చాలామందే ఉన్నారు. మంటల్లో.. శిథిలాల కింద పలువురు కార్మికులు చిక్కుకునిపోయారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని తెలిపారు. అలాగే అధికారులు సకాలంలో స్పందించి చుట్టపక్కల ప్రజలను ఖాళీ చేయించడంతో మరింత ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు. ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో.. సహాయక చర్యలపై మంత్రులు కీలక ప్రకటనలు చేస్తున్నారు.భవన శిథిలాల కింద పెద్ద సంఖ్యలో కార్మికులుశిథిలాలను తొగించిన కొద్దీ బయటపడుతున్న మృతదేహాలుగుర్తు పట్టరాని స్థితిలో మృతదేహాలుపాశమైలారంలోని ప్రమాద స్థలం నుంచి మరో రెండు మృత దేహాలు వెలికితీత15కి చేరిన మృతుల సంఖ్యమరణాలు, క్షతగాత్రుల సంఖ్యపై వెలువడని అధికారిక ప్రకటనపరిశ్రమ వద్ద, ఆస్పత్రుల వద్ద కార్మికుల కుటుంబాల నిరీక్షణ.. రోదనలుఆచూకీ లభించక శోకసంద్రంలో కుటుంబాలుభారీ వర్షంలోనూ కొనసాగుతున్న సహాయక చర్యలురేపు సంగారెడ్డి జిల్లాకు సీఎం రేవంత్రెడ్డిరేపు ఉదయం పాశమైలారం ప్రమాద ఘటన స్థలానికి వెళ్లనున్న రేవంత్పాశమైలారం ఘటనపై సీఎం విచారంక్షేత్ర స్థాయిలో జరుగుతున్న సహాయక చర్యలపై సీఎం ఆరాప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని అధికారులకు ఆదేశంగాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించిన సీఎంబాధాకరం: ప్రధాని మోదీ సంగారెడ్డి ఫ్యాక్టరీ ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతిచాలా మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరంతమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానుక్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.మృతుల బంధువులకు PMNRF నుండి రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50,000 ఎక్స్ గ్రేషియా అందిస్తాంసీఎం రేవంత్ విచారంపాశమైలారం ఫ్యాక్టరీ పేలుడు ఘటనపై సీఎం రేవంత్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఘటనలో పలువురు మరణించడం బాధాకరమన్న ఆయన.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా ఆదేశాలిచ్చినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. కేటీఆర్ దిగ్భ్రాంతిపటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలో జరిగిన రియాక్టర్ పేలుడుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతికార్మికులు చనిపోవడం అత్యంత విషాదకరంగాయపడిన వారిని రక్షించి అత్యుత్తమ వైద్య సహాయం అందించాలిమృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలిప్రమాదానికి కారణాలు తెలుసుకుని బాధ్యులను శిక్షించాలి 15 నిమిషాల్లో స్పందించాం: మంత్రి వివేక్ఘటన జరిగిన 15నిమిషాల్లో స్పందించాం. కలెక్టర్, జిల్లా యంత్రాగ సమన్వయంతో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. వెంటనే 34మంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించాం. ప్రస్తుతం.. 12మంది ఐసీయూలో ఉన్నారు. వెంటిలేటర్ పై చికిత్స అందుతోంది. మొత్తం ఘటనలో12మంది చనిపోయారు. ప్రమాదంలో కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. చర్మం, శరీరం తీవ్రంగా కాలిపోయాయి. హైడ్రా కూడా చేరుకుంది.. షాకిలాలను తీసివేస్తున్నారు. ఆ తర్వాత క్లారిటీ వస్తుంది.. రియాక్టర్ మొదట బ్లాస్ట్ కాలేదు. నిర్లక్ష్యం ఏంటి అనేది ఒక రిపోర్ట్ వస్తుంది. ఆ తర్వాత క్లారిటీ వస్తుంది. నిజంగా విచారణ జరిపి బాద్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటాం. ప్రమాద బాధితులకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటాం అని మంత్రి వివేక్ మీడియాకు తెలిపారు.ఎక్కడా నిర్లక్ష్యం లేదు: మంత్రి రాజనర్సింహసిగాచి కంపెనీ ప్రమాదంపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించిందని.. సకాలంలో స్పందించి ఉంటే ప్రాణాలు పోయేవి కావని మాజీ మంత్రి హరీష్ రావు చేసిన విమర్శలను మంత్రి దామోదర రాజనర్సింహ ఖండించారు. సిగచి కంపెనీ ప్రమాదం బాధాకరం. ఉదయం 9గం.ప్రాంతంలో ప్రమాదం జరిగింది. మూడు గంటల నుంచి ప్రమాద స్థలంలోనే ఉన్నాం. సంఘటన జరిగినా వెంటనే ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. ఎమర్జెన్సీ సిస్టం ద్వారా త్వరితగతిన క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించాం. ఫ్యాక్టరీలో మైక్రో క్రిస్టల్ పౌడర్ ని తయారు చేస్తుంటారు. మార్నింగ్ 60మంది వర్కర్స్ పనిలో ఉన్నారు. జనరల్ వాళ్ళు 20మంది ఉన్నారు. ఆస్పత్రిలో 34మందికి చికిత్స అందుతోంది. 12 మృతదేహాలను ఇప్పటిదాకా వెలికి తీశాం. ప్రతి కార్మికుడికి ప్రభుత్వం వైద్యం అందిస్తుంది.. ఎక్కడ నిర్లక్ష్యం లేదు. మృతుల కుటుంబాలను పరామర్శిస్తాం. ప్రభుత్వం తరపున బాధితులకు అండగా ఉంటాం. ప్రతి కార్మిక కుటుంబాన్ని అదుకుంటాం. ఈ ప్రమాదాన్ని రాజకీయం చేయడం సరికాదు అని మంత్రి రాజనర్సింహ అన్నారు. ఇదీ చదవండి: ఫ్యాక్టరీ ప్రమాదం.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే!👉ఐజీ సత్యనారాయణ ప్రమాదంపై మీడియాతో మాట్లాడారు. రియాక్టర్ పేలడంతో ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన టైంలో.. షిఫ్ట్లో 150 మంది ఉన్నారని చెబుతున్నారు. ఇప్పటిదాకా 8 మంది మరణించారు. మూడు ఆస్పత్రుల్లో 26 మంది చికిత్స పొందుతున్నారు. ఇంకొక బ్లాక్ ఓపెన్ చేయాల్సి ఉంది.. అందులో కార్మికులు ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది అని తెలిపారు. 👉ప్రమాదం తర్వాత.. ఫ్యాక్టరీ నుంచి భారీగా మంటలు ఎగసి పడ్డాయి. ప్రమాదం గురించి తెలియగానే కలెక్టర్, ఐజీ, సంగారెడ్డి ఎస్పీ, అడిషనల్ కలెక్టర్.. అధికార యంత్రాంగమంతా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. సీఎం రేవంత్రెడ్డి ప్రమాదంపై ఆరా తీశారు. ప్రమాద వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రమాద ఘటనపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. 👉ఫ్యాక్టరీ నుంచి దట్టమైన పొగ, ఘాటైన వాసనలు వెలువడుతుండడంతో అక్కడున్నవాళ్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దీంతో అటువైపుగా ఎవరూ రావొద్దని స్థానికులను పోలీసులు కోరుతున్నారు. మొత్తం 8 ఫైర్ ఇంజిన్లు అక్కిడికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నంలో ఉన్నాయి. ప్రమాద స్థలానికి భారీగా ఆంబులెన్స్లు చేరుకుని క్షతగాత్రుల్ని తరలిస్తున్నాయి. భారీ క్రేన్లు, కట్టర్ల సాయంతో ఘటనా స్థలానికి చేరుకున్న హైడ్రా బృందం.. అడ్మిన్స్ట్రేషన్ బిల్డింగ్ శిథిలాల తొలగింపు ప్రక్రియను చేపట్టింది. -
మరో మలుపు తిరిగిన యాంకర్ స్వేచ్ఛ కేసు
తెలుగు యాంకర్ స్వేచ్ఛ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో నిందితుడు పూర్ణ చందర్ భార్య స్వప్న మీడియా ముందుకు వచ్చింది. మృతురాలిపై సంచలన ఆరోపణలు చేసిన ఆమె.. ఇటు తన భర్త అమాయకుడంటూ చెబుతోంది. హైదరాబాద్, సాక్షి: న్యూస్ రీడర్ స్వేచ్ఛా వొటార్కర్(Swetcha Votarkar Case) కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో నిందితుడు పూర్ణ చందర్ భార్య స్వప్న మీడియా ముందుకు వచ్చింది. స్వేచ్ఛపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమె.. ఇటు తన భర్త ఎలాంటి తప్పు చేయలేదంటూ సాక్షికి తెలిపింది. పూర్ణ చందర్ ద్వారానే స్వేచ్ఛ నాకు పరిచయమైంది. వారిద్దరి మధ్య సంబంధం మొదట్లో నాకు తెలియదు. అది తెలిశాకే పూర్ణను వదిలేశాను. స్వేచ్ఛ నన్ను మానసికంగా వేధించింది. నా పిల్లలను కూడా ‘అమ్మా’ అని పిలవాలని భయపెట్టింది. నా భర్త పూర్ణ నిర్దోషి, అమాయకుడు. .. పూర్ణచందర్పై స్వేచ్ఛ కూతురు అరణ్య చేస్తున్న ఆరోపణలు అసత్యం. అరణ్యను పూర్ణచందర్ సొంత కూతురిలా చూసుకున్నాడు. పూర్ణనే స్వేచ్ఛ బ్లాక్మెయిల్ చేసింది అని స్వప్న మీడియాకు తెలిపింది. ఇదిలా ఉంటే.. పలు టీవీ ఛానెల్స్లో న్యూస్రీడర్, యాంకర్గా పని చేసిన స్వేచ్ఛ(40) శుక్రవారం రాత్రి తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఈ కేసులో అనుమానాలు ఉన్నాయని చెబుతూ.. స్వేచ్ఛ సహజీవనం చేసిన పూర్ణచందర్పై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన పూర్ణచందర్.. చివరకు పోలీసులకు లొంగిపోయాడు. ఇదిలా ఉండగానే.. స్వేచ్ఛ కూతురు అరణ్య తనను పూర్ణ వేధించేవాడంటూ మీడియాకు చెప్పడం సంచలనంగా మారింది. దీంతో అతనిపై పోక్సో కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలో.. ఇప్పుడు పూర్ణ భార్య మీడియా ముందుకు రావడం గమనార్హం.యాంకర్ స్వేచ్ఛ మృతిపై తండ్రి శంకర్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. మానసిక వేదన వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందన్న ఆయన.. కేసు నుంచి రక్షించుకోవడానికే పూర్ణ చందర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. పూర్ణ మీడియాకు తప్పుడు సమాచారం ఇస్తున్నాడు.. పాప పట్ల అతను అసభ్యంగా ప్రవర్తించిన మాట వాస్తవం అని అన్నారాయన. లొంగిపోయే ముందు పూర్ణ చందర్ మీడియాకు విడుదల చేసిన ఐదు పేజీల లేఖలో ఏం ఉందంటే.. నాకు స్వేచ్ఛ 2009 నుంచే తెలుసు. ఆ సమయంలో ఇద్దరం కలిసి ఓ ఛానెల్లో పని చేశాం. అప్పట్లో స్వేచ్ఛ తన వ్యక్తిగత బాధలు, కుటుంబ సమస్యలను నాతో పంచుకుంటూ ఉండేది. కానీ నిజమైన సాన్నిహిత్యం మాత్రం 2020 తర్వాత మొదలైంది. స్వేచ్ఛ తీవ్ర మానసిక ఒత్తిడికి గురవ్వడానికి ప్రధాన కారణం ఆమె తల్లిదండ్రుల తీరే. చిన్న వయసులోనే తల్లిదండ్రులు ఆమెను వదిలేసి ఉద్యమాల్లో భాగమయ్యారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే కలిసేవారు. ఈ విషయాన్ని ఆమె ఎన్నోసార్లు నాతో పంచుకుంది. కుటుంబంలో తల్లిదండ్రుల మధ్య తరచూ జరుగుతున్న గొడవలే ఆమెని మనోవేదనకు గురి చేశాయి. 2020లో స్వేచ్ఛ తల్లిదండ్రుల నుంచి విడిపోయి హైదరాబాద్లోని కవాడిగూడలో ఇల్లు అద్దెకు తీసుకుంది. ఇక 2022లో తన కూతురు అరణ్యని కూడా నా వద్దకు తీసుకువచ్చింది. కుమార్తె భవిష్యత్తు పట్ల చాలా ఆందోళనగా ఉండేది. తన కూతురికి తనలాంటి జీవితాన్ని అందించకూడదని చెప్పేది. అందుకే ఆమె అన్ని బాధ్యతలు నాకు అప్పగించింది. తాను ఒక తండ్రి లా ఆ పిల్ల బాధ్యతలు చూసుకున్నాను. స్వేచ్ఛ జీవితంలో ఎప్పుడూ పూర్తిగా సంతోషంగా లేదు. తన బాధను మర్చిపోవడానికి కుమార్తెతో ఎక్కువ సమయం గడిపి ఓదార్పు పొందేది అని పూర్ణ చందర్ పేర్కొన్నాడు. -
నాన్నా.. ఈ మెంటల్ టార్ఛర్ భరించలేకున్నా!
అన్నానగర్: తిరుప్పూర్ జిల్లా అవినాశిలోని కైకాట్టిపుదూర్ ప్రాంతానికి చెందిన అన్నాదురై బనియన్ కంపెనీ నడుపుతున్నాడు. ఇతని కూతురు రిదన్య ( 27). ఈమెకి కైకట్టిపుదూర్ లోని జయం గార్డె¯న్కు చెందిన కవింకుమార్కు మూడు నెలల క్రితం వివాహమైంది. శనివారం ఇంటి నుంచి కారు తీసుకెళ్లిన రిదన్య ఆ తర్వాత తిరిగి రాలేదు. ఇంతలో, మొండిపాళయం సమీపంలోని చెట్టిపుత్తూరులో కొబ్బరి చెట్లకు ఉపయోగించే పురుగుమందుల మాత్రలు మింగి రిదన్య తన కారులో మృతి చెంది కనిపించింది. ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న సేవూర్ పోలీసులు రిదన్య మతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం అవినాశి ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. కుటుంబ వివాదం కారణంగా రిదన్య విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీనికి మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు ముందు రిదన్య తన తండ్రికి వాట్సాప్ ద్వారా కొన్ని ఆడియోలను పంపింది. పోలీసులు వాటిని స్వా«దీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అందులో భర్త కవిన్కుమార్, మామగారు ఈశ్వరమూర్తి, అత్తగారు చిత్రాదేవి, ఆమెను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారని పేర్కొంది. ఇకపై ఈ జీవితాన్ని గడపలేనని వెల్లడించింది. రిదన్యకు పెళ్లయి 3 నెలలే కావడంతో, ఆర్టీఓ దర్యాప్తు కూడా జరుగుతోంది. -
అన్యోన్య దాంపత్యం.. అర్ధాంతరంగా ముగిసిపోయింది..!
వారిది కచ్చితంగా అన్యోన్య దాంపత్యమనే చెప్పొచ్చు. కానీ వారి జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. ఇక్కడ అన్యోన్య దాంపత్యం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. అది సీసీ టీవీ ఫుటేజ్ చెబుతున్న మాట. మనిషి మాట నమ్మని ఈ రోజుల్లో.. సీసీ టీవీ ఫుటేజ్ ‘మాట’ కచ్చితంగా నమ్ముతాం. వీరు శవాలుగా మారకముందు గత రెండు రోజుల సీసీ టీవీ ఫుటేజ్ను పరిశీలించి చూస్తే వారు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఎంతో అన్యోన్యంగా కనిపించారు. మరి ఈ జంట ఎలా చనిపోయిందనేది ప్రశ్న. ఏమైనా చిన్నపాటి మనస్పర్థలు తలెత్తి అది ఆత్మహత్య వరకూ వెళ్లిందా? లేక ఎవరైనా హత్య చేశారా? అనేది పోలీసులు దర్యాప్తులో తేలనుంది. ప్రస్తుతం అనుమానాస్పద మృతిగానే ఈ కేసు దర్యాప్తు చేపట్టారు పోలీసులు.రాజస్థాన్ రాష్ట్రంలోనే జైపూర్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ దంపతుల్లో భర్త పేరు ధర్మేంద్ర కాగా, భార్య పేరు సుమన్. వీరికి 11, 8 ఏళ్లు కల్గిన ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారి ఇద్దరు భరత్పూర్ గ్రామంలో తమ నానమ్మ, తాతయ్యలు దగ్గర ఉంటున్నారు. సమ్మర్ హాలీ డేస్కు తాతయ్య ఇంటికి వెళ్లిన ఆ పిల్లలు ఇంకా రాలేదు.ధర్మేంద్ర- సుమన్ జంట ఈ శుక్రవారం(జూన్ 27వ తేదీ) తమ ఫ్లాట్లో విగతజీవులుగా కనిపించారు. అంతకుముందూ వరకూ ఎంతో ఆనందంగా ఉన్న ఈ జంట.. ఎందుకు ఇలా చేశారు అనేది చర్చగా మారింది. ధర్మేంద్ర బ్యాంక్ సేల్స్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. అయితే శుక్రవారం ధర్మేంద్ర బ్యాంక్కు వెళ్లకపోవడంతో తోటి ఉద్యోగులు ఫోన్ చేస్తే స్పందన రాలేదు. దీంతో ఈ విషయాన్ని సదర ఉద్యోగి.. ధర్మేంద్ర బంధువులకు తెలియజేశాడు. దీంతో వారు వెళ్లి తలుపులు పగలగొట్టి చూడగా ఆ జంట విగతజీవులుగా కనిపించారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వగా దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం వీరికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవని బంధువులు చెబుతున్నారు. ఇటీవలే రీసెంట్గా ఫ్లాట్ కొనుగోలు చేసిన వీరి ఆర్థికపరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు వారు అంటున్నారు. మూడు సీసీ ఫుటేజ్లో ఇలా..ఒక సీసీ ఫుటేజ్లో వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నట్లు కనిపించారు. వారు ఫ్లాట్లో కారు పార్కు చేసే క్రమంలో భార్య సుమన్.. భర్త ధర్మేంద్ర భుజంపై తలపెట్టుకుని అతని చేతుల్ని పట్టుకుని ఉంది. ఆపై కారు దిగి వెళ్లిపోతున్న వీడియోలో ఆమె భుజంపై భర్త ధర్మేంద్ర చేయి వేసి నడుచుకుంటూ వెళ్లినట్లు ఉంది. అయితే వారు చనిపోవడానికి ముంద రోజు గురువారం మాత్రం ఇద్దరికీ చిన్నపాటి వాగ్వాదం జరిగినట్లు కనిపించింది. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం భార్య సుమన్.. ఒక క్యారీ బ్యాగ్ తీసుకుని వెళుతున్నట్లు కనిపించింది. అదే వారు చివరిసారి సజీవంగా కనిపించడం. ఆ తర్వాత రోజే ఈ దారుణం చోటు చేసుకుంది. సుమన్ ఒంటిపై గాయాలుఅయితే భార్య సుమన్ ఒంటిపై గాయాలు కనిపించడంతో హత్యా కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరి కుటుంబంలో ఎటువంటి వైవాహిక విభేదాలు ఉన్నట్లు తమకు కనిపించలేదని పోలీస్ అధికారి అజయ్ సింగ్ తెలిపారు. అయితే ఇద్దరూ సూసైడ్ చేసుకుని ఉండటంతో అనుమానాస్పద మృతి కేసుగా దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఏమైనా క్లూ దొరుకుతుందనే కోణంలో వారి మొబైల్స్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు పోలీసులు. -
వివాహితపై అమానవీయ దాడి ఘటన.. పోలీసుల అదుపులో నిందితులు
ధర్మసాగర్: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో ఓ వివాహితను వివస్త్రను చేసి అమానవీయంగా దాడి చేసిన ఘటనలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి ఘటనపై ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన కథనా ని కి జిల్లా యంత్రాంగం స్పందించింది. న్యా యసేవా అధికార సంస్థ హనుమకొండ జిల్లా కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి క్షమాదేశ్ పాండేతోపాటు మరో జడ్జి శ్రావణ స్వాతి, వివిధ శాఖల అధికారులు, పోలీసులు హుటాహుటిన తాటికాయల గ్రామానికి చేరుకున్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్తుల ద్వారా వివరాలు సేకరించారు. ఏదైనా సమస్య వచి్చనప్పుడు ప్రజలు పోలీసులను లేదా కోర్టును ఆశ్రయించాలి తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని జడ్జీలు హెచ్చరించారు. జిల్లాలో న్యాయసేవా అధికార సంస్థను ఏర్పాటు చేశామని.. దీనిద్వారా ఉచితంగా న్యాయ సేవలు అందుతాయన్నారు. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొనిఇలాంటి ఘటనలకు పాల్పడితే వారిని కూడా నేరస్తులుగా పరిగణించి శిక్షలు విధిస్తామని హెచ్చరించారు. అశ్లీల వీడియోలు షేర్ చేయడం నేరం ఈ అంశంపై కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్రెడ్డి ధర్మసాగర్ పోలీసు స్టేషన్లో మీడియాతో మాట్లాడారు. సాక్షి దినపత్రికలో వచ్చిన కథనంపై వివరాలు సేకరించగా దాడి జరిగింది నిజమేనని తేలిందన్నారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ కొనసాగుతోందని.. బాధితుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. ఒకరు తప్పు చేశారని, మరొకరు ఇంకో తప్పు చేస్తే పెద్దశిక్షలు పడతాయని చెప్పారు. నిందితులు తమ అదుపులోనే ఉన్నారని, వారిని విచారించి పూర్తి సమాచారం సేకరించాల్సి ఉందన్నారు. జుగుప్సాకరమైన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం నేరమని.. అశ్లీల కంటెంట్ను షేర్ చేస్తే సెక్షన్ 67 కింద కనీసం 5 ఏళ్ల జైలుశిక్ష, రూ. 10 లక్షల జరిమామా పడుతుందన్నారు. -
కన్న తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు
సంగెం: కన్న కొడుకే తల్లిపాలిట కాలయముడయ్యాడు. డబ్బులకోసం తల్లిని చంపేందుకు సిద్ధమయ్యాడు. ‘వద్దు కొడుకా’.. అంటూ తల్లి బతిమాలినా వినకుండా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లిలో శుక్రవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కుంటపల్లికి చెందిన ముత్తినేని వినోద (60), సాంబయ్య దంపతులకు ఒక కూతురు, లింగమూర్తి, సతీశ్ అనే కుమారులు ఉన్నారు. వీరిలో కొంతకాలం కిందట లింగమూర్తి అనారోగ్యంతో మరణించాడు. సాంబయ్యకు ఉన్న భూమిలో 4 ఎకరాలను ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకోసం తీసుకుంది. మరో ఎకరం భూమి ఇంకా సాంబయ్య పేర ఉంది. ప్రభుత్వం పరిహారంగా రూ.40 లక్షలు ఇచ్చింది. వీటిలో రూ.30 లక్షలను చిన్న కుమారుడు సతీశ్కు ఇచ్చారు. ఈ డబ్బులతో సతీశ్ వేరే చోట రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. సాంబయ్య పేర రూ.3 లక్షలు, తల్లి వినోద పేర రూ.3.50 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నారు. మిగిలిన డబ్బులో నుంచి కూడా కొంత సతీశ్కు ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ రూ.2 వేలు, డిపాజిట్ ద్వారా వచ్చే వడ్డీతో కాలం వెళ్లదీస్తున్నారు. కాగా, తల్లిదండ్రుల వద్ద ఉన్న డబ్బులను కూతురుకు ఇస్తున్నారని సతీశ్ తరచూ గొడవ పడుతుండేవాడు. మిగిలిన డబ్బులను కూడా తనకు ఇచ్చేయాలని వేధించేవాడు. డబ్బులు ఇవ్వకుండా తల్లి అడ్డుపడుతోందని గతంలో తల్లి కాలు, చేయి విరగ్గొట్టాడు. దీంతో అతడిని ఇంటి నుంచి వెళ్లగొట్టారు. తల్లిపై కక్ష పెంచుకున్న సతీశ్ శుక్రవారం రాత్రి ఇంటి ముందు తల్లిదండ్రులు నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో వచ్చి తల్లి వినోదపై దాడి చేశాడు. బాటిల్లో తెచ్చిన పెట్రోల్ ఆమెపై చల్లి నిప్పు అంటించి పారిపోయాడు. భార్య అరుపులు విని లేచిన సాంబయ్య చుట్టుపక్కల వారి సాయంతో మంటలు ఆర్పారు. అప్పటికే 80 శాతం గాయాలైన వినోదను 108లో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ప్రస్తుతం ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. న్యాయమూర్తి సమక్షంలో పర్వతగిరి సీఐ రాజగోపాల్, సంగెం ఎస్సై నరేశ్లు వినోద వాంగ్మూలం రికార్డు చేశారు. భర్త సాంబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ శనివారం తెలిపారు. -
ఎర్రగడ్డ ఆస్పత్రికి సోనీ
హైదరాబాద్: రైలు పట్టాలపై కారు నడిపిన కేసులో నిందితురాలైన వోమికా సోనీని ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ఆమె మానసిక స్థితి బాగోలేనందున తొలుత చికిత్స తీసుకోవాలని, అనంతరం తమ ఎదుట విచారణకు హాజరు పర్చాలని ఆమె కుటుంబ సభ్యులకు పోలీసులు సూచించారు. 2025 జూన్ 26న(గురువారం) శంకర్పల్లి (రంగారెడ్డి జిల్లా) నాగులపల్లి వద్ద ఓ మహిళ రైలు పట్టాలపై కారు నడిపి హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఉదయం 7 గంటల ప్రాంతంలో సుమారు 8 కిలోమీటర్లపాటు ఆమె అలా పట్టాలపై కారు పోనిచ్చింది. అది గమనించిన స్థానికులు, రైల్వే పోలీసులు ఆమెను అడ్డుకునేందుకు యత్నించారు. ఆ సమయంలో రాడ్తో ఆమె అందరిపై దాడికి యత్నించింది. చివరకు ఓ చెట్టును ఢీ కొట్టి కారు ఆగిపోగా.. ఎలాగోలా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఫలితంగా 45 నిమిషాల పాటు రైలు సేవలు నిలిచిపోయాయి. బెంగళూరు-హైదరాబాద్ మధ్య నడిచే 15 రైలు దారి మళ్లించారు. ఘటనకుగానూ ఆమెపై పోలీసులు, రైల్వే పోలీసులు విడివిడిగా కేసు నమోదు చేశారు. తొలుత మద్యం మత్తులో ఆ మహిళ అలా చేసి ఉండొచ్చని పోలీసుల భావించారు. అయితే.. ఆమె పేరు వోమికా సోని(34) అని, లక్నో(యూపీ)కి చెందిన మహిళ అని తర్వాత నిర్ధారించుకున్నారు. ఐటీ జాబ్ పొగొట్టుకున్న ఆమె డిప్రెషన్లోకి వెళ్లిందని.. ఆపై తన కియా కారుతో ఇలా పట్టాలపై బీభత్సం సృష్టించిందని పోలీసులు తేల్చారు. చివరకు కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమెను ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించారు. కోలుకున్నాక.. ఆమెపై చర్యల అంశాన్ని పోలీసులు పరిశీలించనున్నట్లు తెలుస్తోంది.Video: Woman Drives Car On Railway Track, Disrupts Train Services pic.twitter.com/5MSyXJXzbG— NDTV (@ndtv) June 26, 2025 -
Hyderabad: కోడలితో అఫైర్.. ప్రాణం తీసింది
కుషాయిగూడ(హైదరాబాద్ ): వరుసకు కోడలయ్యే యువతితో సన్నిహితంగా ఉన్నాననే విషయం బయట పడిందనే భయంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం చర్లపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి– భువనగిరి జిల్లా ఆలేరు మండలం మందనపల్లికి చెందిన పంగా భానుచందర్ (30) బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి పెయింటింగ్ వర్క్ చేస్తున్నాడు. దమ్మాయిగూడకు చెందిన పెయింటింగ్ కాంట్రాక్టర్, వరుసకు బావ అయ్యే వ్యక్తి వద్ద పని చేస్తూ చర్లపల్లి ఐజీ కాలనీలో భార్య, ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో బావ కూతురితో పరిచయం పెరిగి ఆమెకు సన్నిహితమయ్యాడు. విషయం తెలిసిన బాధితురాలి తండ్రి, అతడి భార్య గురువారం రాత్రి భానుచందర్కు ఫోన్ చేసి మందలించారు. ఈ విషయమై శుక్రవారం పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టామని భార్యాభర్తలిద్దరూ హాజరు కావాలని చెప్పినట్లు మృతుడి భార్య పోలీసులు అందించిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలో భానుచందర్ శుక్రవారం పిల్లలను స్కూల్ పంపి పంచాయితీకి వెళ్దామంటూ భార్యకు చెప్పడంతో ఆమె స్నానానికి వెళ్లింది. దీంతో బాత్రూం బయట నుంచి గడియ పెట్టిన భానుచందర్.. నలుగురిలో తన పరువు పోతుందన్న భయంతో ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకున్నాడు. బాత్రూం తలుపులు ఎంతకీ తెరుచుకోకపోవడంతో గట్టిగా అరిచింది. ఆమె అరుపులు విన్న ఇరుగు పొరు గు ఇంటి తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా భానుచందర్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. కొన ఊపిరితో ఉన్న భానుచందర్ను కిందికి దింపి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ప్రాణాలు వదిలాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
యాంకర్ స్వేచ్ఛ కేసులో ట్విస్ట్
తెలుగు న్యూస్ రీడర్, యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్(Swetcha Votarkar) ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. తమ బిడ్డ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ ఆమె తల్లిదండ్రులు చిక్కడపల్లి పోలీసులను ఆశ్రయించారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. సాక్షి, హైదరాబాద్: పలు టీవీ ఛానెల్స్లో పని చేసిన స్వేచ్ఛకు.. గతంలోనే వివాహమైంది. ఓ కూతురు కూడా ఉంది. మనస్పర్థలతో భర్త నుంచి విడిపోయాక పూర్ణ చంద్రరావు అనే వ్యక్తితో ఆమె కలిసి ఉంటోంది. ఆమె ఫేస్బుక్ పేజీ పేరు సైతం స్వేచ్ఛా పూర్ణ చందర్గా మార్చుకుంది. అయితే కొన్నాళ్లుగా వీళ్ల మధ్యా విభేదాలు నడుస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వివాహం చేసుకోవాలని స్వేచ్ఛ ఒత్తిడి చేయగా.. అందుకు పూర్ణ చంద్రరావు నిరాకరించాడు. దీంతో అతనితో ఇక కలిసి ఉండలేనంటూ ఆమె తల్లిదండ్రుల వద్ద వాపోయింది. ఈ విషయంలోనే ఆమె మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటన తర్వాతి నుంచి పూర్ణచంద్రరావు ఫోన్ స్విచ్ఛాప్ వస్తోంది. అజ్ఞాతంలో ఉన్న అతని ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. యాంకర్గా, న్యూస్ప్రజెంటర్గా పలు చానెల్స్లో పని చేసిన స్వేచ్ఛ.. డిజిటల్ కంటెంట్ క్రియేటర్గానూ గుర్తింపు దక్కించుకున్నారు. శుక్రవారం గాంధీనగర్ జవహర్ నగర్ తన ఇంట్లో ఫ్యాన్కు ఆమె ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తొలుత పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. పోస్ట్మార్టం నిమిత్తం ఆమె మృతదేహానికి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె నేత్రాలను దానం చేసేందుకు తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. స్వేచ్ఛ మృతి పట్ల పలువురు జర్నలిస్టులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. -
వివస్త్రను చేసి.. జననాంగంలో జీడిపోసి..
వరంగల్ క్రైం: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో ఐదు రోజుల కిందట జరిగిన ఓ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం కొనసాగిస్తోందంటూ కొందరు వ్యక్తులు ఓ వివాహితను వివస్త్రను చేసి జననాంగంలో జీడిరసం పోసి విచక్షణారహితంగా దాడి చేశారు. ‘సాక్షి’కి విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం.. తాటికాయల గ్రామానికి చెందిన ఓ యువతిని పదేళ్ల క్రితం ములుగు మండలం బోలోనిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. వారికి ముగ్గురు పిల్లలు. అయితే సమీప బంధువైన ఓ వివాహితతో అతను వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. సుమారు పది రోజులు ఆమెతో కలిసి గ్రామం విడిచి వెళ్లిపోయాడు. దీంతో అతని భార్య స్వగ్రామమైన తాటికాయలకు వచ్చి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో వారు ఆ ఇద్దరినీ వెతికి పట్టుకొని ఐదు రోజుల క్రితం తాటికాయల గ్రామానికి తీసుకువచ్చి విచక్షణారహితంగా దాడి చేశారు. ఇద్దరికీ గుండు గీయించారు. ఆ మహిళను ఓ మంచానికి కట్టేసి వివస్త్రను చేసి.. జననాంగంపై జీడి (పూర్వకాలంలో నొప్పి తగ్గించేందుకు వాడేవారు. అదేవిధంగా శరీరంలోని సున్నిత అవయవాలపై పోస్తే పుండ్లు అవుతాయి) పోశారు. ‘తప్పు చేశాను.. క్షమించండి’ అంటూ బాధిత మహిళ వేడుకున్నా వినకుండా దాడి చేశారు. జననాంగంలోనుంచి తీవ్ర రక్తస్రావమవుతున్నా వదల్లేదు. ఆ తరువాత ఆ ఇద్దరినీ ఏం చేశారో ఇప్పటివరకు ఆచూకీ తెలియడం లేదు. ఈ ఘటన జరిగి ఐదు రోజులు గడుస్తున్నా పోలీసులకు సమాచారం లేదని తెలిసింది. అసలు ఆ ఇద్దరూ ప్రాణాలతో ఉన్నారో, లేదో తెలియని పరిస్థితి నెలకొంది. -
కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు
కోల్కతా: దేశమంతటా సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ కాలేజీ మెడికోపై హత్యాచార ఘటనను మరవకముందే కోల్కతాలో అలాంటిదే మరో దారుణం జరిగింది. సౌత్ కలకత్తా లా కాలేజీ విద్యార్థిపై కాలేజీలోనే అత్యాచారం జరిగింది. అదే కాలేజీకి చెందిన మాజీ విద్యార్థి ఇద్దరు ప్రస్తుత విద్యార్థులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురినీ పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పశ్చిమబెంగాల్ అంతటా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పరీక్షకు సంబంధించిన పత్రాలను నింపేందుకు బాధితురాలు (24) బుధవారం మధ్యాహ్నం కాలేజీకి వెళ్లింది. విద్యార్థి సంఘం గదిలో కూర్చుని పత్రాలు నింపుతుండగా అధికార తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన ఛాత్ర పరిషత్ (టీఎంసీపీ) జిల్లా ప్రధాన కార్యదర్శి మోనోజిత్ మిశ్రా (31) అక్కడికి వచ్చాడు. ఆమెతోపాటు మరో ఆరుగురు విద్యార్థులను కూర్చోబెట్టి టీఎంసీపీ గురించి, తన అధికారాల గురించి మాట్లాడాడు. బాధితురాలిని కళాశాల విద్యార్థిని విభాగం కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించాడు. సాయంత్రం దాకా ఆమెను ఒక్కదాన్నే ఆ గదిలో కూర్చోమని చెప్పాడు. అనంతరం జరిగిన పరిణామాలను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. ‘‘మోనోజిత్ గదిలోకి వచ్చి, ఉన్నట్టుండి తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రతిపాదించాడు. దాంతో విస్తుపోయా. ఇంకొకరితో ప్రేమలో ఉన్నానంటూ అందుకు నిరాకరించా. దాంతో ఒక్కసారిగా ఆగ్రహించాడు. కాలేజీ మెయిన్ గేట్కు తాళం వేయాల్సిందిగా అక్కడి వారిని ఆదేశించాడు. నన్ను పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డు రూంలోకి బలవంతంగా లాక్కెళ్లాడు. మా కాలేజీలో ఫస్టియర్ చదువుతున్న జయీబ్ అహ్మద్ (19), ప్రమీద్ ముఖర్జీ (20)తో కలిసి నాపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తప్పించుకోవడానికి ప్రయ త్నిస్తే అడ్డుకుని చేయిచేసుకున్నాడు. బాయ్ఫ్రెండ్ ఉన్నాడని, వదిలేయాలని కాళ్లు పట్టుకుని బతిమాలినా కనికరించలేదు. ఈ దారుణాన్ని జయీబ్, ప్రమీద్ ఫోన్లలో చిత్రీకరించారు. ఆ వీడియోను నా బంధుమిత్రులకు పంపుతామని బెదిరించారు. కాలేజీ గార్డు కూడా నన్ను కాపాడేందుకు ప్రయత్నించలేదు. బుధవారం రాత్రి 7.30 నుంచి 10.50 మధ్య ఈ దారుణం జరిగింది. దీని గురించి ఎవరికైనా చెబితే దారుణ పరిణామాలుంటాయని మోనోజిత్ బెదిరించాడు. నా బోయ్ఫ్రెండ్కు హాని తలపెడతామని, తల్లితండ్రులను తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని భయపెట్టాడు’’ అని వాపోయింది. ‘‘క్రూరమైన లైంగిక దాడిలో తీవ్రంగా గాయపడ్డా. ఒక దశలో శ్వాస కూడా అందలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లమని ప్రాధేయపడ్డా మోనోజిత్ పట్టించుకోలేదు. పైగా హాకీ స్టిక్ చూపించి, కొడతానని బెదిరిస్తూ వెళ్లిపోయాడు’’ అని వివరించింది. ‘‘ప్రధాన నిందితునికి మిగతా ఇద్దరు సహకరించారు. గది బయట కాపలాగా ఉన్నారు’’ అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ముగ్గురు నిందితులకు కోర్టు ఐదు రోజుల రిమాండ్ విధించింది. ప్రధాన నిందితునికి సహకరించడం కూడా అత్యాచారానికి పాల్పడటంతో సమానమేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని వారు గుర్తు చేస్తున్నారు. ‘‘బాధితురాలు మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలమిచ్చింది. ఘటన జరిగిన గార్డు గదితోపాటు పక్కనే ఉన్న విద్యార్థి సంఘం గదిని సీజ్ చేసి, ప్రత్యక్ష సాక్షులను విచారించాం’’ అని పోలీసులు తెలిపారు.అతనో క్రిమినల్ లాయర్ ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా అదే లా కాలేజీలో చదివాడు. 45 రోజుల కాంట్రాక్టుపై ప్రస్తుతం కాలేజీలో బోధనేతర విధుల్లో పనిచేస్తున్నాడని వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నైనా చటర్జీ చెప్పారు. అంతేగాక అలీపోర్ పోలీస్ అండ్ సెషన్స్ కోర్టులో క్రిమినల్ లాయర్గా చేస్తున్నట్టు కాలేజీ వర్గాలు తెలిపాయి. టీఎంసీకి చెందిన పలువురు నేతలతో మోనోజిత్కు దగ్గర సంబంధాలున్నట్లు సమాచారం. ఘటనపై వామపక్ష విద్యార్థి విభాగం, కాంగ్రెస్ శ్రేణులు కస్బా పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగాయి.తృణమూల్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు అత్యాచారోదంతంపై తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘యువతులు తాము ఎలాంటి వారితో కలిసి తిరుగుతున్నామో చూసుకోవాలి. రాష్ట్రంలో ప్రతి చోటా మహిళలకు పోలీసులు రక్షణ కల్పించడం సాధ్యం కాదు’’ అన్నారు. ఈ ఉదంతంపై నిరసనలు పెరిగి పెద్దవవుతుండటంతో తృణమూల్ కాంగ్రెస్ స్పందించింది. ప్రధాన నిందితుడు మోనోజిత్తో పారీ్టకి సంబంధం లేదని ప్రకటించింది. బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొంది. కానీ తృణమూల్ ప్రకటనను బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ ఖండించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీతో పాటు పలువురు ప్రముఖ తృణమూల్ నేతలతో పాటు మోనోజిత్ ఎన్నోసార్లు వేదికలపై కని్పంచినట్టు చెప్పారు. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మమతకు సీఎంగా కొనసాగే అర్హత లేదని రాష్ట్ర బీజేపీ చీఫ్ సువేందు అధికారి మండిపడ్డారు. -
విశాఖలో ఆరుగురిని హత్య చేసిన కేసులో సంచలన తీర్పు
-
నాకు కష్టమొచ్చింది.. ఇక ఈ ట్రైన్ ఎందుకు?.. అందులో ఉన్న మీరెందుకు?
మనిషికొక్క తీరు.. మనకి ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎలా అధిగమించాలనేది కొంతమంది ఆలోచిస్తే, ఆ సమస్యనే తన చుట్టంగా చేసుకుని బాధపడే వాళ్లు మరికొందరు. తన సమస్యను ప్రపంచ సమస్యలా ఫీలయ్యే వాళ్లు ఇంకొందరు. ఇది చాలా ప్రమాదం. తన సమస్యను ప్రపంచ సమస్యలా ఫీలవ్వాలని కోరుకుంటారు.కానీ ప్రపంచంలోని సమస్యతో మాత్రం వీరికి అవసరం ఉండదు. ఇలాంటి వాళ్లు చాలా సందర్భాల్లో ఏం చేస్తున్నామనే విచక్షణ మరిచిపోతారు. ఏదైనా చిన్నపాటి కష్టం వస్తే చాలు.. మన చుట్టూ ఉన్న వాళ్లు ఎంత సుఖంగా ఉన్నారో అనే భ్రాంతిలో ఉండి వారికి తీవ్ర నష్టం చేయడానికి యత్నించడంలో ముందుంటారు. ఈ తరహాలోనే తన భార్య తనకు విడాకులు ఇచ్చిందనే కారణంతో మొత్తం ట్రైన్నే తగలబెట్టాలనుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. తన వెంట బ్యాగులో తెచ్చుకున్న పెట్రోల్ డబ్బాను ఒక్కసారిగా ట్రైన్లో చల్లుకుంటా వచ్చి ఒక్కసారిగా నిప్పంటించాడు. అసలు ఏం జరుగుతుందనే ప్రయాణికులు తేరుకుని పరుగులు తీసే లోపే ఆ ట్రైన్ లోపల ఒక్కసారిగా భగ్గుమంది. భార్య విడాకులిచ్చిందనే ఫ్రస్టేషన్లో..ఈ ఘటన దక్షిణాకొరియా దేశంలో చోటు చేసుకంది. ఇటీవల సియోల్కు చెందిన వాన్ అనే వ్యక్తికి భార్యతో విడాకులయ్యాయి. దీన్ని భరించలేకపోయాడు. సుమారు 67 ఏళ్ల వయసులో తనకు విడాకులు మంజూరు కావడాన్ని వాన్ తట్టుకోలేకపోయాడు. ఇక తాను ఎందుకు అనుకున్నాడు. అలా అనుకుంటూనే ట్రైన్ ఎక్కాడు. అప్పటికే ఓ పెట్రోల్ డబ్బా బ్యాగ్తో పాటు వెంట తెచ్చుకున్నాడు. అయితే ఆ ట్రైన్ కోచ్లో జనం కాస్త సంతోషంగా కనిపించారు. తనకు కష్టం వచ్చింది.. వీరి ముఖాల్లో నవ్వులు పూస్తున్నాయి అనుకున్నాడో ఏమో కానీ.. ఒక్కసారిగా పెట్రోల్ డబ్బా బయటకు తీశాడు. పెట్రోల్ డబ్బా బయటకు తీసిన క్షణంలోనే అనుమానం వచ్చిన ఆ కోచ్లోని ప్రయాణికులు పరుగులు తీశారు. పెట్రోల్ మొత్తం కోచ్ అంతా చల్లడం.. ఆపై నిప్పంటించడం జరిగిపోయాయి. సముద్రగర్భంలోని టన్నెల్లో రైలు ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ ఘటనలో 22 మంది ఆస్పత్రి పాలు కాగా, మరొక 129 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నిందితుడు వాన్ కూడా గాయపడటంతో ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన కారణంగా 240,000 యూఎస్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.వాన్పై హత్యాభియోగాలుఈ దారుణానికి పాల్పడ్డ వాన్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కదులుతున్న ట్రైన్లో ఘటన జూన్ 9న జరగ్గా, ఇది ఆలస్యంగా వెలుగుచూసింది. వాన్పై హత్యాయత్నం అభియోగాలతో పాటు పలు సెక్షన్లు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్న వాన్.. భార్యతో విడాకులు మంజూరు అయినందుకే ఇలా చేశానని స్పష్టం చేశాడు. ట్రైన్లో పెట్రోల్ పోసిన ఘటన వీడియో వైరల్గా మారింది.서울지하철 5호선 방화범 CCTV사망자 없는게 기적이네요 pic.twitter.com/IQMowGZkWH— 브이몬 (@XXV_mon) June 25, 2025 -
ఇంట్లోకి దూసుకెళ్లిన కారు తప్పిన పెను ప్రమాదం
ఆర్థిక ఇబ్బందులతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యవేములవాడరూరల్: ఆర్థిక ఇబ్బందులతో బీటెక్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు. వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్లకు చెందిన వాణి–లింగయ్యలకు ముగ్గురు కుమార్తెలు. తండ్రి ఫ్యాన్లు రిపేర్ చేస్తుండగా, తల్లి గ్రామంలోనే గాజులషాపు నడుపుతోంది. పెద్ద కుమార్తె చేని వైష్ణవి(20) హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ ఫైనలియర్ చదువుతోంది. 15 రోజుల క్రితం ఇంటికొచి్చంది. పలు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపం చెంది గురువారం ఇంట్లోనే దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.ఇంట్లోకి దూసుకెళ్లిన కారు తప్పిన పెను ప్రమాదంఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో సిరిసిల్ల బైపాస్ నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. టీవీ చూస్తున్న ఇద్దరు చిన్నారులు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. కామారెడ్డికి చెందిన ఇద్దరు వేములవాడ నుంచి సిరిసిల్ల బైపాస్ మీదుగా కారులో వెళ్తున్నారు. వెంకటాపూర్ వద్ద కుడివైపు మళ్లకుండా ఎదురుగా వెళ్లి వాగుమడి రాజయ్య ఇంటిని ఢీకొట్టారు. ఆ సమయంలో ఇంట్లో టీవీ చూస్తున్న ఇద్దరు చిన్నారులు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. అప్పటికే గ్రామస్తులు గుమిగూడారు. కారు డ్రైవర్కు దేహశుద్ధి చేశారు. దీంతో కారును అక్కడే వదిలేసి ఇద్దరు పరారయ్యారు. కారులో బీరు బాటిళ్లు, బిర్యాని పొట్లాలు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. కారు నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నారని చెప్పారు. కారును పోలీస్స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు. -
మళ్లీ చిక్కిన ఘరానా దొంగ మహ్మద్ సలీం
సాక్షి, సిటీబ్యూరో/పహాడీషరీఫ్: అసలు పేరు మహ్మద్ సలీం... మారు పేరు సునీల్శెట్టి... సొంత దుకాణం నుంచే చోరీలు ప్రారంభించాడు... 34 ఏళ్ల నేర ప్రస్థానంలో 187 చోరీలు చేశాడు... ఇప్పటి వరకు 25 సార్లు అరెస్టై కటకటాల్లోకి వెళ్ళాడు... ‘పీడీ’కి దొరక్కుండా జాగ్రత్తపడే సునీల్ గత నెల 5న జైలు నుంచి బయటకు వచ్చాడు... మరో రెండు నేరాలు చేసి బండ్లగూడ పోలీసులకు చిక్కాడు. చోరీ సొత్తుతో ఉత్తరాదిలో జల్సాలతో పాటు హెలీటూరిజం ఈ సునీల్ శెట్టి నైజం. ఈ ఘరానా దొంగను బండ్లగూడ పోలీసులు అరెస్టు చేసినట్లు చంద్రాయణగుట్ట ఏసీపీ ఎ.సుధాకర్ గురువారం వెల్లడించారు. మార్చిన ‘ఆమె’ పరిచయం... ఫతేదర్వాజా సమీపంలోని కుమ్మరివాడికి చెందిన సలీం నిరక్షరాస్యుడు. తొలుత కిరోసిన్ లాంతర్ల కర్మాగారంలో పనివాడిగా చేరాడు. ఆపై తన తండ్రికి చెందిన కిరాణా దుకాణంలోనే పని చేయడం మొదలెట్టాడు. సలీంకు 16వ ఏట ఓ అమ్మాయితో అయిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఆమెతో కలిసి షికార్లు చేయడానికి అవసరమైన ఖర్చుల కోసం తమ దుకాణంలోనే చోరీలు చేయడం మొదలెట్టాడు. ఈ విషయం బయటకు పొక్కేసరికి ఇల్లు వదిలి పారిపోయి చాదర్ఘాట్లోని ఓ హోటల్లో కారి్మకుడిగా మారాడు. ఈ పని చేస్తూనే అవకాశం చిక్కినప్పుడల్లా చిన్న చిన్న గృహోపకరణాలు తస్కరించడం మొదలెట్టాడు. 1991లో ఇతడి 18వ ఏట ఇత్తడి వస్తువుల చోరీ కేసులో తొలిసారిగా చాదర్ఘాట్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. జైల్లో పరిచయమైన ‘సీనియర్ల’ వద్ద తాళాలు పగులకొట్టడంతో మెళకువలు నేర్చుకున్నాడు. ఇంటి తాళం ముట్టనే ముట్టడు... ఈ చోరుడు ప్రధానంగా పాతబస్తీలోని ఓ వర్గానికి చెందిన వారి ఇళ్ళనే టార్గెట్గా చేసుకుంటాడు. ఆ ప్రాంతాల్లోని ప్రజలు సాధారణంగా తెల్లవారుజాము 3 గంటల వరకు మెలకువగానే ఉంటారు. అందుకే ఇతగాడు తెల్లవారుజాము 4 గంటల తర్వాతే చోరీ చేస్తాడు. అప్పటి వరకు నిద్రరాకుండా ఉండేందుకు తన స్మార్ట్ఫోన్లో లూడో, క్రికెట్ ఆడుతూ టైమ్పాస్ చేస్తాడు. చిన్న టార్చ్లైట్, కటింగ్ ప్లేయర్తో ‘రంగం’లోకి దిగే ఇతగాడు ప్రధానంగా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన ఇళ్లనే ఎంచుకుంటాడు. తాళం వేసున్న ఇంటిని టార్గెట్ చేసినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని పగులకొట్టడు. గోడ దూకి సజ్జ ద్వారా ఇంటి పైకి చేరతాడు. అక్కడ నుంచి ఇంట్లోకి చేరే మార్గం వెతుక్కుని ప్రవేశిస్తాడు. ఇతగాడు చోరీ చేసే సమయంలో పెట్రోలింగ్ వాహనాలు ఆ ప్రాంతానికి వచి్చనా ఇంటి తాళం యథాతథంగా ఉండటంతో వారు దృష్టిపెట్టరని ఇలా చేస్తుంటాడు. లోపలకు వెళ్లాక చెంచాల సహా అక్కడ ఉన్న ఉపకరణాలతోనే అల్మారాలు పగులకొట్టి సొత్తు స్వాహా చేస్తాడు. 1998లో ముగ్గురు సంతానం ఉన్న ఓ వితంతువును వివాహం చేసుకున్న ఈ సునీల్శెట్టి ఇప్పుడు ఏడుగురి పిల్లలకు తండ్రి. -
తల్లి మృతి.. అనాథలుగా మారిన చిన్నారులు
మంచిర్యాల: భర్త చేతిలో భార్య హతమైన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని దర్బాతాండకు చెందిన ఆడె నటరాజన్కు 2021లో మామడ మండలం గాయిది పల్లకి చెందిన సుజాత (25)తో వివాహమైంది. మండల కేంద్రంలోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న నటరాజన్ కోరమండల్ కంపెనీలో పనిచేస్తుండగా సుజాత టైలరింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. బుధవారం రాత్రి దంపతుల మధ్య గొడవ చోటు చేసుకుంది. క్షణికావేశంలో గొంతునొక్కడంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు గురువారం ఉదయం మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తరచూ అదనపు కట్నంకోసం వేధిస్తుండేవాడని, ఈక్రమంలో హత్య చేశాడని ఆరోపించారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న ఏఎస్పీ కాజల్ సింగ్ సంఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. అనంతరం పోలీసులు బాధిత కుటుంబ సభ్యులను పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి పూర్తి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. తల్లి మృతి చెందడంతో ఇద్దరు చిన్నారులు రోధించిన తీరు పలువురిని కంటతడి పెట్టింది. కాగా బోథ్ నుంచి మృతదేహాన్ని ఆదిలాబాద్ రిమ్స్కు పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు. -
ఛీ.. వీడేం టీచర్.. టెన్త్ నుంచి వేధింపులు.. పెళ్లి తర్వాత..
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో చదివే బా లికను వేధించి, లోబర్చుకొని శారీరకంగా వాడుకున్న ఇంగ్లిష్ టీచర్ సాతూరి మధుకర్(52)కు 17 ఏళ్ల కారాగార శిక్ష, రూ.1.50 లక్షల జరిమానా విధిస్తూ ఫాస్ట్ట్రాక్ స్పెషల్ జడ్జి సునీత తీర్పు చెప్పారు. ఎస్సై వెంకటేశ్ తెలిపిన వివరాలు.. హనుమకొండ జిల్లా కేంద్రంలో ఉండే మధుకర్ 2013లో కాల్వశ్రీరాంపూర్ స్కూల్లో ఇంగ్లిష్ టీచర్గా పని చేశాడు. ఆ సమయంలో 10వ తరగతి బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, బలవంతంగా లో బర్చుకున్నాడు. రాత్రి క్లాస్ల పేరిట స్కూల్కు పిలిచి స్టాఫ్ రూమ్లో చాలాసార్లు శారీరకంగా అనుభవించాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే మీ అమ్మానాన్నను చంపేస్తానని బెదిరించాడు. తర్వాత బాలిక హనుమకొండలో డిగ్రీ చదువుతున్న సమయంలో మధుకర్ అక్కడి కూడా వెళ్లి ఆమెను భయపెట్టి శారీరకంగా వాడుకున్నాడు. ఆమెకు తెలియకుండా ఫొటోలు, వీడియోలు తీశాడు. తాను పిలిచినప్పుడల్లా రాకుంటే ఫొటోలు, వీడియోలు అందరికీ పంపిస్తానని బెదిరించాడు. అనంతరం ఆమెకు పెళ్లయినా వదిలిపెట్టలేదు. ఆమె భర్తకు ఫోన్లో ఫొటోలు, వీడియోలు పంపించాడు. అవి చూసిన ఆమె భర్త విడాకులు ఇచ్చాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై ఎస్కే జానీపాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితుడిని రిమాండ్కు పంపించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాదం రమేశ్ సాక్షులను ప్రవేశపెట్టి తన వాదనలు వినిపించి నేరాన్ని రుజువు చేయడంలో కీలకపాత్ర పోషించారు. జడ్జి సునీత సాక్ష్యాధారాలు పరిశీలించి నిందితుడికి కఠిన కారాగార శిక్ష, జరిమానా విధించారు. -
‘ప్రియ’రాలి వల.. ఆపరేషన్ సింధూర్ సమాచారం పాక్కు అమ్మేశాడు!
ఇటీవల కాలంలో పాకిస్తాన్కు వెన్నులో వణుకు పుట్టించిన ఆపరేషన్ ఏదైనా ఉంది అంటే అది.. ఆపరేషన్ సింధూర్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలను మట్టుబెట్టింది. భారత్ చేపట్టిన ఆ మెరుపు ఆపరేషన్కు పాక్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో ఆ యుద్ధం ముగిసింది. ఇక ఎప్పుడైనా పాకిస్తాన్ దుశ్చర్యలకు పాల్పడి భారత్ను లక్ష్యంగా చేసుకుంటే మాత్రం ఆపరేషన్ సింధూర్ మళ్లీ ఆరంభమవుతుందనే గట్టి హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటివరకూ ఎటువంటి ఘటనలు చోటు చేసుకోలేదు. అయితే ఫహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు సంబంధించిన వివరాలతో పాటు ఆపరేషన్ సింధూర్ వివరాలను పాకిస్తాన్కు భారత్కు చెందిన వ్యక్తి చేరవేసిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. ఢిల్లీలోని నావీ డైరెక్టర్ ఆఫ్ ద డాక్యార్డ్లో అప్పర్ డివిజన్ క్లర్క్గా పని చేస్తేన్న విశాల్ యాదవ్ అనే వ్యక్తి.. ఆపరేషన్ సింధూర్ సమాచారాన్ని పాక్కు చేరవేశాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న విశాల్ యాదవ్,. ప్రియురాలి మోజులో పడి ఆ సమాచారాన్ని పాక్కు చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు. భారత్కు చెందిన ప్రియగా పరిచయమై..భారత్కు చెందిన అమ్మాయిగా, ప్రియా శర్మగా పరిచయం అయిన సదరు అమ్మాయి.. సోషల్ మీడియ ద్వారా విశాల్ను ఆకట్టుకుంది. తాను భారత్కు చెందిన అమ్మాయినంటూ మాయమాటలతో బురిడీ కొట్టించింది. ఈ క్రమంలోనే కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ పరిచయం అలా మొదలై.. వాట్సాప్ వరకూ వచ్చింది. ఈ క్రమంలోనే భారత్ చేపట్టిన పలు ఆపరేషన్ల సమాచారాన్ని విశాల్ నుంచి తస్కరించింది. తొలుత చిన్నా చితకా భారత డిఫెన్స్ వ్యవహారాల సమాచారాన్ని తనకు తెలియకుండానే పాక్కు చేరవేసిన విశాల్.. ఆపై పహల్గాం ఉగ్రదాడి ఘటన, ఆపరేషన్ సింధూర్ సమాచారాన్ని సైతం అమ్మేశాడు. ప్రధానంగా ఆపరేషన్ సింధూరు సమాచారాన్ని రూ. 50 వేలకు అమ్మేసిట్లు తేలగా, మొత్తంగా రూ. 2 లక్షల వరకూ ఇలా సమాచారాన్ని అమ్మి డబ్బులు చేసుకున్నాడు విశాల్.పోలీసులు ఏం చెబుతున్నారంటే..తొలుత ఫేస్బుక్లో విశాల్కు ఫ్రెండ్ రిక్వస్ట్ పెట్టి పరిచయయ్యింది. ఒక ఫేక్ ఐడెంటీతో పరిచయం అయిన అమ్మాయి.. భారత్కు చెందిన ప్రియా శర్మగా పరిచయం అయ్యింది. అనంతరం మెల్లగా అతన్ని మాయమాటల్లో పెట్టి, వరుసగా భారత ఆపరేషన్ల సమాచారాన్ని దొంగిలించింది. ఈ క్రమంలోనే విశాల్కు డబ్బులు ఆశపెట్టి మరీ తనపని తాను కానిచ్చేసింది. సీఐడీ సెక్యూరిటీ విభాగానికి చెందిన ఇన్స్పెక్టర్ విష్ణు కాంత్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం.. సమాచారాన్ని పాక్కు చేరవేసినందకు రూ. 2 లక్షల వరకూ విశాల్ తీసుకున్నట్లు గుర్తించామన్నారు. ఇందులో ఆపరేసన్ సింధూర్ సమాచారానికి రూ. 50 వేలు ప్రత్యేకంగా తీసుకున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. -
తేజేశ్వర్ కేసు.. కీలక విషయాలు వెల్లడించిన ఎస్పీ
జోగులాంబ గద్వాల: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గద్వాల సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసును గద్వాల పోలీసులు చేదించారు. భార్య ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, ప్రియుడు తిరుమల రావుతో పాటు మొత్తం 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హత్య సమయంలో నిందితులు ఉపయోగించిన వస్తువులు, నగదు, కారును స్వాధీనం చేసుకున్నారు. తేజేశ్వర్ హత్య కేసుకు సంబంధించి వివరాలను గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. ఏ 1గా తిరుమల రావు, ఏ 2గా ఐశ్వర్య, ఏ8 సుజాతలను చేర్చారు. కాగా, పోలీసుల విచారణలో.. విస్తూపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తేజేశ్వర్కు ఈ ఏడాది ఫిబ్రవరిలో కర్నూలు కల్లూరుకు చెందిన ఐశ్వర్య అనే యువతితో వివాహం నిశ్చయమైంది. అయితే ఐశ్వర్య కనిపించకుండా పోవడం.. ఆమె తిరుమలరావు అనే బ్యాంకు ఉద్యోగితో వెళ్లిపోయిందన్న ప్రచారంతో తేజేశ్వర్ కుటుంబ సభ్యులు ఆ వివాహాన్ని రద్దు చేసుకున్నారు. అయితే కొన్ని రోజులకే తిరిగి వచ్చిన ఐశ్వర్య.. కట్నం ఇవ్వలేకపోయామన్న కారణంతోనే తాను బంధువుల ఇంటికి వెళ్లిపోయానని తేజేశ్వర్ను నమ్మించింది.దీంతో పెద్దలు ఒప్పుకోకపోయినా.. మే 18వ తేదీన ఐశ్వర్యను తేజేశ్వర్ వివాహం చేసుకున్నాడు. తిరుమల్రావు కోసం భర్త తేజేశ్వర్కు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే పెళ్లైన 29 రోజుల్లో.. 15 రోజులు ఐశ్వర్య కర్నూలులోనే గడిపింది. చివరకు.. తిరుమల్ రావు, సుపారీ గ్యాంగ్ సహకారంతో జూన్ 17వ తేదీన భర్త తేజేశ్వర్ను హత్య చేయించింది. ఆపై ఆ ముఠా తేజేశ్వర్ మృతదేహాన్ని కర్నూలు శివారు పాణ్యం అటవీ ప్రాంతంలో వదిలేసి పారిపోయారు. ఆయుధాలు, ఫోన్, ల్యాప్టాప్ను కృష్ణానదిలో పడేశారు.ఈ ఘటన తర్వాత ఐశ్వర్యతో కలిసి లడాఖ్ పారిపోవాలని తిరుమలరావు స్కెచ్ వేశారు. ఘటనకు ముందు రోజు బ్యాంకు నుంచి రూ.20 లక్షలు డ్రా చేశాడు. ఆపై హత్య జరిగిన మరుసటి రోజు ఘటనా స్థలానికి వెళ్లి.. తేజేశ్వర్ మృతదేహాన్ని చూసి వచ్చాడు. సుపారీ గ్యాంగ్కు రూ.2 లక్షలు ఇచ్చాడు. అయితే తిరుమలరావుకు ఎనిమిదేళ్ల కిందటే వివాహం అయ్యింది. ఆ జంటకు పిల్లలు లేరు. దీంతో ఐశ్వర్యతో అయినా పిల్లల్ని కనాలని తిరుమలరావు భావించారు. ఈ క్రమంలో భార్యను అడ్డు తొలగించుకోవాలని ఆలోచన చేసినప్పటికీ.. బంధువుల నుంచి చెడు పేరు వస్తుందన్న భయంతో ఆ ఆలోచనను అమలు చేయకుండా వదిలేశాడు. ఈ కేసులో ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, తిరుమలరావు, సుపారీ గ్యాంగ్ సభ్యులను పోలీసులు నిందితులుగా చేర్చారు. ఐశ్వర్య తల్లి సుజాత తిరుమలరావు పని చేసే బ్యాంకులోనే చిరుద్యోగి కాగా.. ఆమెతోనూ అతనికి శారీరక సంబంధం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. -
ఆన్ లైన్ లో దంపతుల గలీజ్ దందా
-
కటకటాల్లోకి స్వీటీ తెలుగు కపుల్
హాయ్.. ఫ్రెండ్స్. మా న్యూడ్ వీడియో కావాలా?. అయితే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కు డబ్బులు కొట్టండి. లింక్ను షేర్ చేస్తాం అంటూ బూతు వీడియోలతో నెట్టింట రెచ్చిపోతున్న ‘స్వీటీ తెలుగు కపుల్’కు.. సడన్ ఎంట్రీతో పోలీసులు సర్ప్రైజ్ ఇచ్చారు. హైదరాబాద్ నడిబొడ్డున నడిచిన ఈ లైవ్ సెక్స్ దందా బాగోతంలోకి వెళ్తే..సాక్షి, హైదరాబాద్: నగరంలో లైవ్ సెక్స్ దందా వెలుగు చూసింది. అంబర్పేటలో ఓ జంట.. తమ శృంగార కార్యకలాపాలను ఆన్లైన్లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో వ్యూయర్స్ నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది. స్వీటీ తెలుగు కపుల్ 2027 పేరుతో ఆన్లైన్లో ఈ జంట.. ఆ ప్రైవేట్ లింక్స్ను గత నాలుగు నెలలుగా పంచుతూ ఈ దందా నడిపిస్తోంది. హాయ్.. ఫ్రెండ్స్. మా న్యూడ్ వీడియో కావాలా?. అయితే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కు డబ్బులు కొట్టండి. లింక్ను షేర్ చేస్తాం అంటూ బూతు వీడియోలతో నెట్టింట రెచ్చిపోసాగింది. నగ్న వీడియోలతో పాటు తమ శృంగార వీడియోలను షేర్ చేస్తూ వచ్చింది. తాజాగా ఈ వ్యవహారం టాస్క్ఫోర్స్ పోలీసుల దృష్టికి చేరింది.దీంతో అంబర్పేటలోని ఆ ఇంటిపై టాస్క్ఫోర్స్ టీం రైడ్ చేసింది. ఆ దంపతులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించింది. ఈ బూతు బాగోతం కోసం తాము ఉంటున్న ఇంటిపైన పరదాలతో ప్రత్యేక సెటప్ ఏర్పాటు చేశారు. అలాగే ఇంట్లో నుంచి కెమెరా, లైవ్ లింక్ పరికరాలు స్వాధీనపర్చుకున్నారు. టాస్క్ఫోర్స్ టీం ఈ దంపతులను అంబర్పేట పోలీసులకు అప్పగించగా.. వాళ్లు ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే వాళ్ల వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది. -
భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం.. భార్య ఆత్మహత్య
తిమ్మాపూర్(మానకొండూర్): భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని మనస్తాపం చెందిన ఓ మహిళ క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని రేణికుంటలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఇందిరానగర్కు చెందిన రొడ్డ విజయకు ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు సంతానం. చిన్న కూతురు మమత(27)ను 2018లో రేణికుంటకు చెందిన రాజమల్లుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు కొడుకులు. పెళ్లి సమయంలో రూ.2 లక్షల కట్నం ఒప్పుకుని రూ.30 వేలు ముట్టజెప్పారు. రూ.లక్ష కళ్యాణలక్ష్మి వచ్చిన తర్వాత ఇచ్చారు. మరో రూ.70 వేలకు గడువు కోరి.. తర్వాత బంగారం ముట్టజెప్పారు. అయితే రాజమల్లు అదనంగా రూ.2 లక్షల కట్నం డిమాండ్ చేయడంతో గొడవలు జరుగుతున్నాయి. కొన్నిరోజులుగా రాజమల్లు రోజూ మద్యం తాగివచ్చి భార్యను శారీరకంగా, మానసికంగా హింసించేవాడు. కట్నం తేకుంటే ఇంటి నుంచి వెళ్లిపోవాలని బెదిరించాడు. ఇటీవల మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం మమతకు తెలియడంతో మనస్తాపం చెందింది. సోమవారం అర్ధరాత్రి క్రిమిసంహారక మందు తాగింది. ఈ విషయాన్ని మమత కొడుకు అమ్మమ్మ విజయకు ఫోన్ చేసి చెప్పాడు. ఆమె రేణికుంటకు వెళ్లగా మమత అపస్మారక స్థితిలో కనిపించింది. వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.అత్తింటి వేధింపులతో..ఫెర్టిలైజర్సిటీ: పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీస్స్టేషన్ పరిధిలోని రామగుండం కార్పొరేషన్ 39వ డివిజన్ ప్రగతినగర్కు చెందిన పెసరు అనిత (27) క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి వేధింపులతోనే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఎన్టీపీసీ ఎస్సై టి.ఉదయ్ కిరణ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసు కస్టడీలో తిరుమలరావు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
-
భర్తను కాదని భార్య వేరే యువకుడితో..
కర్ణాటక: ఓ యువకుడు తమ ప్రియురాలిని చంపి తన పొలంలోనే మృతదేహాన్ని పాతిపెట్టిన అమానుష ఘటన జిల్లాలోని కరోటి గ్రామంలో జరిగింది. హాసన జిల్లా హొసకొప్పలు గ్రామానికి చెందిన ప్రీతి అనే యువతి హత్యకు గురైంది. పునీత్ అనే యువకుడే హత్య చేసిన నిందితుడు. ప్రీతికి వివాహమై పిల్లలున్నా పునీత్ వెంటపడింది. గత ఆదివారం మండ్య, మైసూరులకు ట్రిప్ వెళ్లిన ఇద్దరూ జాలీ జాలీగా సమయాన్ని గడిపారు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు. కేఆర్ పేటె కత్తరఘట్ట అడవిలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత పునీత్ ఆమెను చంపి బంగారు ఆభరణాలను దోచుకుని ఆమె మృతదేహాన్ని తమ పొలంలోనే పాతిపెట్టి పరారయ్యాడు. ప్రీతి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా పునీత్ పట్టుబడ్డాడు. ప్రస్తుతం నిందితుడు పునీత్ జైలులో ఊచలు లెక్కపెడుతున్నాడు. ప్రీతి పెళ్లయి పిల్లలు ఉన్నా పునీత్ వెంటపడి తనువు చాలించగా తల్లిని కోల్పోయి పిల్లలు అనాథలయ్యారు. -
అంజలిని హత్య చేయడంలో తప్పులేదు: నిందితుడి తల్లి
జీడిమెట్ల(హైదరాబాద్): ప్రియుడు, అతని సోదరుడితో కలిసి పదో తరగతి బాలిక కన్నతల్లిని చంపించిన కేసులో పోలీసులు నిందితులను రిమాండ్కు తరలించారు. బుధవారం షాపూర్నగర్లో బాలానగర్ డీసీపీ శ్రీనివాస్, అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, ఏసీపీ నరే‹Ùరెడ్డి, జీడిమెట్ల ఇన్స్పెక్టర్ మల్లేష్ డీఐ కనకయ్యలతో కలిసి విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తికి చెందిన సట్ల అంజలి (39) తెలంగాణ సాంస్కృతిక శాఖలో కళాకారిణి. అంజలి తన ఇద్దరు కుమార్తెలు (16), (12)లతో కలిసి షాపూర్నగర్లోని హెచ్ఎంటీ సొసైటీలో నివసిస్తోంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పెద్ద కుమార్తె పదో తరగతి చదువుతోంది. ఆమెకు ఎనిమిది నెలల క్రితం నల్లగొండ జిల్లా కట్టంగూర్కు చెందిన శివ (18)తో ఇన్స్టాలో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. వీరి ప్రేమను బాలిక తల్లి అంజలి తొలుత అంగీకరించినా.. ఆ తర్వాత వ్యతిరేకించసాగింది. బాగా చదువుకోవాలని కుమార్తెకు చెబుతూనే ప్రేమ విషయంలో మందలించేది. తల్లి మందలించడంతో ప్రియుడి చెంతకు.. ఈ క్రమంలో ఈ నెల 8న బాలిక తన సోదరిని తీసుకుని కట్టంగూర్కు వెళ్లి నాలుగు రోజులు ఉండి వచి్చంది. ఇది నచ్చని తల్లి కుమార్తెను తీవ్రంగా మందలించింది. తనను మందలించడంతో తల్లిపై కోపం పెంచుకున్న బాలిక ఈ నెల 19న కట్టంగూర్లోని ప్రియుడు శివ వద్దకు వెళ్లిపోయింది. మరునాడు బాలిక తల్లి అంజలి తన కూతురుని శివ కిడ్నాప్ చేశాడంటూ జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు శివపై కేసు నమోదు చేసి బాలికను తల్లి అంజలికి అప్పగించారు. అంజలికి అదే శాపమైంది.. ఈ నెల 22న తన చెంతకు చేరిన కుమార్తెను తల్లి అంజలి గట్టిగా మందలించడంతో పాటు చేయి చేసుకుంది. శివను జైలుకు పంపిస్తానని భయపెట్టింది. దీంతో తన ఇష్టానికి అడ్డుగా వస్తున్న తల్లిని ఎలాగైనా చంపాలని బాలిక గట్టిగా నిర్ణయించుకుంది. 23న సాయంత్రం శివను షాపూర్నగర్ వచ్చి తన తల్లిని హత్య చేయాలని కోరింది. దీనికి శివ అభ్యంతరం చెప్పడంతో.. అయితే తానే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో శివ... పదో తరగతి చదువుతున్న తన తమ్ముడి (16)ని తీసుకుని గత సోమవారం సాయంత్రం షాపూర్నగర్ వచ్చాడు. బాలిక ఇంటి బయట కాపలా కాయగా.. శివ, అతని సోదరుడు లోపలికి వెళ్లి అంజలి మెడకు చున్నీతో గట్టిగా ఉరి బిగించి హత్య చేశారు. విషయం పోలీసులకు తెలియడంతో మంగళవారం తెల్లవారుజామున శివను కట్టంగూర్లో, అతని సోదరుడిని, బాలికను నగరంలో అదుపులోకి తీసుకుని విచారణ చేయగా అంజలిని తామే చంపినట్లు ఒప్పుకొన్నారు. ముగ్గురిపై హత్య కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. మొదటి నుంచీ తల్లి అంటే కుమార్తెకు గిట్టేది కాదు.. నిందితురాలు బాలిక (16)కు తల్లి అంజలి అంటే గిట్టేది కాదు. 7వ తరగతిలోనే తల్లి వద్ద ఉండను అంటూ అప్పట్లోనే పోలీసులకు బాలిక ఫిర్యాదు చేసింది. దీంతో అంజలి తన కూతురును రెండేళ్ల పాటు గుండ్లపోచంపల్లిలోని సోదరి ఇంట్లో ఉంచింది. మూడు నెలల క్రితమే బాలిక తల్లి వద్దకు వచి్చనట్లు తెలుస్తోంది. బాలికకు మొదటి నుంచీ తల్లితో శత్రుత్వమే అని.. తరచూ తల్లి తరచూ తనపై చేయి చేసుకొంటోందని బాలిక తన గోడును స్నేహితులతో వెళ్లబోసుకునేదని తెలిసింది. కేసును కొన్ని గంటల్లోనే ఛేదించిన జీడిమెట్ల ఇన్స్పెక్టర్ మల్లే‹Ù, డీఐ కనకయ్య, సిబ్బందిని డీసీపీ అభినందించారు.అంజలిని హత్య చేయడంలో తప్పులేదు: నిందితుడి తల్లి జీడిమెట్లలో అంజలి హత్యోదంతం కేసులో నిందితుడు శివ తల్లి ఓ టీవీ చానల్తో మాట్లాడుతూ.. పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. బాలిక తల్లి అంజలిని తన కుమారులు హత్య చేయడాన్ని ఆమె సమరి్థంచుకుంది. మొదట్లో శివ ప్రేమకు అంగీకారం తెలిపిన అంజలి.. ఆ తర్వాత ఒప్పుకోకపోవడం వల్లే ఆమెను తన కొడుకులు హత్య చేశారని చెప్పుకొచి్చంది. తల్లికి తలకొరివి పెట్టిన చిన్నకూతురు కేసముద్రం: జీడిమెట్లలో హత్యకు గురైన అంజలి అంత్యక్రియలు బుధవారం ఆమె స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో జరిగాయి. ఆమె మృతదేహాన్ని మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్తో పాటు, వివిధ పారీ్టలు, ప్రజా సంఘాల నాయకులు, కళాకారులు సందర్శించి నివాళులరి్పంచారు. అనంతరం తల్లి మృతదేహానికి చిన్న కుమార్తె మనస్విని తలకొరివి పెట్టింది. -
Illegal Relations: వైఫ్ లు కాదు.. వైల్డ్ నైఫ్ లు
-
Anantapur: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
-
హైదరాబాద్: ఓయో లాడ్జిలో బ్యూటీషియన్ అనుమానాస్పద మృతి
సాక్షి, హైదరాబాద్: ఓయో లాడ్జిలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సీహెచ్ వెంకన్న తెలిపిన ప్రకారం.. నల్లగండ్లలో నివాసం ఉండె జి.అనూష(26) ఆన్లైన్ ఆర్డర్లపై బ్యూటీషియన్గా పని చేస్తోంది. గత సంవత్సరం వివాహం జరగ్గా మనస్పర్థల కారణంగా విడిపోయారు. అప్పటి నుంచి అనూష తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది.ఈ నెల 22న సాయంత్రం 6 గంటలకు స్నేహితుల వద్దకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరింది. రాత్రి ఫోన్ చేసినా స్పందించలేదు. సోమవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో గచ్చిబౌలిలోని ఓ లాడ్జిలో అనూష ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు సమాచారం అందించారు.సీలింగ్ ప్యాన్కు కర్టన్తో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని, కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. సంతోష్ అనే వ్యక్తి మొదట సమాచారం అందించాడని, తన సోదరి ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయని సోదరుడు రాజు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
జీడిమెట్ల హత్య కేసులో సంచలన విషయాలు
-
పోలీసుల అదుపులో సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు ప్రధాన నిందితుడు తిరుమలరావు
-
తేజేశ్వర్ కేసు.. ఎట్టకేలకు తిరుమలరావు అరెస్ట్!
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో నిందితుడు తిరుమలరావును ఎట్టకేలకు గద్వాల పోలీసులు అరెస్ట్ చేశారు. తేజేశ్వర్ భార్య ఐశ్వర్యతో ఎప్పటి నుంచో వివాహేతర బంధంలో ఉన్న తిరుమలరావు.. ప్లాన్ ప్రకారమే తేజేశ్వర్ను హత్య చేయించినట్లు అభియోగాలు ఉన్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే.. సర్వేయర్ హత్య కేసులో ఇప్పటికే ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో తేజేశ్వర్ భార్య ఐశ్వర్య(సహస్ర), ఆమె తల్లి సుజాతతో పాటు హత్య చేసిన సుపారీ గ్యాంగ్ సభ్యులు ముగ్గురు, వీళ్లకు సహకరించిన మరో ముగ్గురు నిందితులు ఉన్నారు. అయితే కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న బ్యాంక్ ఉద్యోగి అయిన తిరుమలరావు మాత్రం పరారీలో ఉన్నాడు. దీంతో.. అతన్ని గాలించేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్లోనే అతన్ని గద్వాల్ పోలీసులు అదుపులోకి తీసుట్లు సమాచారం. ప్రస్తుతం అతన్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. సుపారీ గ్యాంగ్తో పోలీసులు ఈ ఉదయం సీన్ రీ కన్స్ట్రక్షన్ చేనసిట్లు తెలుస్తోంది.ఏం జరిగిందంటే..జోగులాంబ గద్వాలకు చెందిన లైసెన్స్ సర్వేయర్ గంటా తేజేశ్వర్ హత్య కేసు తెలంగాణలో తీవ్ర సంచలనం రేపింది. భార్య ఐశ్వర్య తన ప్రియుడు తిరుమల్ రావుతో ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమనే అభియోగాలు ఉన్నాయి. పోలీసుల విచారణలో.. విస్తూపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.తేజేశ్వర్కు ఈ ఏడాది ఫిబ్రవరిలో కర్నూలు కల్లూరుకు చెందిన ఐశ్వర్య అనే యువతితో వివాహం నిశ్చయమైంది. అయితే ఐశ్వర్య కనిపించకుండా పోవడం.. ఆమె తిరుమలరావు అనే బ్యాంకు ఉద్యోగితో వెళ్లిపోయిందన్న ప్రచారంతో తేజేశ్వర్ కుటుంబ సభ్యులు ఆ వివాహాన్ని రద్దు చేసుకున్నారు. అయితే కొన్ని రోజులకే తిరిగి వచ్చిన ఐశ్వర్య.. కట్నం ఇవ్వలేకపోయామన్న కారణంతోనే తాను బంధువుల ఇంటికి వెళ్లిపోయానని తేజేశ్వర్ను నమ్మించింది.దీంతో పెద్దలు ఒప్పుకోకపోయినా.. మే 18వ తేదీన ఐశ్వర్యను తేజేశ్వర్ వివాహం చేసుకున్నాడు. తిరుమల్రావు కోసం భర్త తేజేశ్వర్కు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే పెళ్లైన 29 రోజుల్లో.. 15 రోజులు ఐశ్వర్య కర్నూలులోనే గడిపింది. చివరకు.. తిరుమల్ రావు, సుపారీ గ్యాంగ్ సహకారంతో జూన్ 17వ తేదీన భర్త తేజేశ్వర్ను హత్య చేయించింది. ఆపై ఆ ముఠా తేజేశ్వర్ మృతదేహాన్ని కర్నూలు శివారు పాణ్యం అటవీ ప్రాంతంలో వదిలేసి పారిపోయారు. ఆయుధాలు, ఫోన్, ల్యాప్టాప్ను కృష్ణానదిలో పడేశారు.ఈ ఘటన తర్వాత ఐశ్వర్యతో కలిసి లడాఖ్ పారిపోవాలని తిరుమలరావు స్కెచ్ వేశారు. ఘటనకు ముందు రోజు బ్యాంకు నుంచి రూ.20 లక్షలు డ్రా చేశాడు. ఆపై హత్య జరిగిన మరుసటి రోజు ఘటనా స్థలానికి వెళ్లి.. తేజేశ్వర్ మృతదేహాన్ని చూసి వచ్చాడు. సుపారీ గ్యాంగ్కు రూ.2 లక్షలు ఇచ్చాడు. అయితే తిరుమలరావుకు ఎనిమిదేళ్ల కిందటే వివాహం అయ్యింది. ఆ జంటకు పిల్లలు లేరు. దీంతో ఐశ్వర్యతో అయినా పిల్లల్ని కనాలని తిరుమలరావు భావించారు. ఈ క్రమంలో భార్యను అడ్డు తొలగించుకోవాలని ఆలోచన చేసినప్పటికీ.. బంధువుల నుంచి చెడు పేరు వస్తుందన్న భయంతో ఆ ఆలోచనను అమలు చేయకుండా వదిలేశాడు. ఈ కేసులో ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, తిరుమలరావు, సుపారీ గ్యాంగ్ సభ్యులను పోలీసులు నిందితులుగా చేర్చారు. ఐశ్వర్య తల్లి సుజాత తిరుమలరావు పని చేసే బ్యాంకులోనే చిరుద్యోగి కాగా.. ఆమెతోనూ అతనికి శారీరక సంబంధం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. తిరుమలరావును క్షణ్ణంగా విచారిస్తే.. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. -
యాడ్ షూటింగ్ కోసం వస్తే.. నీకు సిటీ చూపిస్తానని చెప్పి..!
ఉదయ్పూర్: రాజస్థాన్ రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ యాడ్ షూట్లో భాగంగా రాజస్థాన్కు వచ్చిన ఫ్రెంచ్ యువతికి చేదు అనుభవం ఎదురైంది. యాడ్ షూటింగ్ పేరుతో ఆమెను ఒక రూమ్కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు ఈవెంట్ మేనేజ్మెంట్ ఉద్యోగి. ఆదివారం రాత్రి ఓ గ్రూప్తో కలిసి వచ్చిన వారంతా కలిసి డిన్నర్ చేశారు. అయితే ముందుగా ప్లాన్ చేసుకున్న సదరు ఉద్యోగి.. ఆ ఫ్రెంచ్ యువతికి ఉదయపూర్ అంతా చూపెడతానని నమ్మబలికాడు. దాంతో నమ్మి వెళ్లిన ఆమెను ముందుగా బుక్ చేసి పెట్టుకున్న హోటల్ రూమ్కు తీసుకెళ్లాడు ఈఎమ్ ఉద్యోగి. అనంతరం ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు పోలీసులు స్పష్టం చేశారు. యువతి ఫిర్యాదు ఆధారంగా దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ దుండగుడి కోసం వెతుకలాట ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే.. ఈవెంట్ మేనేజ్మెంట్ నిర్వహిస్తున్న షూటింగ్లో భాగంగా కొంతమంది ఉదయ్పూర్లోని బాద్గావ్ ఏరియాలోని టైగర్ హిల్స్లోని ఓ రెస్టారెంట్కు వచ్చారు. ఫ్రెంచ్ మహిళతో పాటు ఇద్దరు మహిళలు షూటింగ్ కోసం వచ్చారని పోలీస్ అధికారులు తెలిపారు.ఈ క్రమంలోనే వీరంతా డిన్నర్ పూర్తి చేసుకున్న తర్వాత తనను ఉద్యోగి కారులో ఎక్కించుకుని ఓ హెటల్కు తీసుకెళ్లాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఉదయ్పూర్ సిటీ చూపిస్తాననని చెప్పి తనపై అత్యాచారం చేశాడని యువతి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ యువతిని మెడికల్ పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించామన్నారు. ప్రస్తుతం నిందితున్ని పట్టుకునే పనిలో ఉన్నామని, సదరు హోటల్ రూమ్ సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నామని ఉదయ్పూర్ ఎస్పీ యోగేష్ గోయల్ తెలిపారు. -
ఐశ్వర్యతోనే పిల్లల్ని కనాలని..
సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్ బయటపడింది. దర్యాప్తు లోతుల్లోకి వెళ్లిన పోలీసులకు దిగ్భ్రాంతి కలిగించే విషయం ఒకటి తెలిసింది. ఐశ్వర్య(సహస్ర) కోసం ఆమె భర్తను మాత్రమే కాదు.. తన భార్యనూ అడ్డు తొలగించుకోవాలని బ్యాంకు ఉద్యోగి తిరుమల్ రావు ప్లాన్ వేసినట్లు వెల్లడైంది.తిరుమల్ రావుకు ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. అయితే ఆ జంటకు పిల్లలు లేరు. దీంతో భార్యను అడ్డు తొలగించుకుని.. ఐశ్వర్యతోనే పిల్లలను కనాలని భావించాడు. ఈ క్రమంలో ఐశ్వర్య భర్త తేజేశ్వర్తో పాటు తన భార్యను చంపాలని ప్లాన్ వేసుకున్నాడు. ఆపై ఐశ్వర్యతో కలిసి లడాఖ్కు ట్రిప్ ప్లాన్ వేశాడు. అయితే భార్యను చంపితే బంధువుల్లో చెడ్డ పేరు వస్తుందన్న భయంతో ఆ ప్లాన్ను విరమించుకున్నాడు. కేవలం తేజేశ్వర్ను మాత్రమే చంపాలని ఆ ఇద్దరూ డిసైడ్ అయ్యారు.ఇందుకోసం .. తేజేశ్వర్ హత్య జరిగిన ముందు రోజు బ్యాంకు నుంచి రూ.20 లక్షలు డ్రా చేశాడు. అయితే అప్పటికే భర్త తేజేశ్వర్ను చంపేందుకు ఐశ్వర్య ఐదుసార్లు ప్రయత్నించింది. జూన్ 17వ తేదీన ఆరోసారి చేసిన ప్రయత్నంలో తేజేశ్వర్ బలయ్యాడు. సుపారీ గ్యాంగ్కు సమాచారం అందించేందుకు తేజేశ్వర్ బైక్కు జీపీఎస్ ట్రాకర్ అమర్చింది ఐశ్వర్య. దాని ఆధారంగా అతనికి లొకేషన్ వివరాలను ఆ ముఠాకు అందించింది. ఆపై సర్వే పేరిట తేజేశ్వర్ను వెంట తీసుకెళ్లిన రాజు, పరమేశ్వర్, పరుశరామ్.. కత్తితో పొడిచి చంపారు.కర్నూలు శివారులో పడేసిన మృతదేహాన్ని ఆ మరుసటిరోజు తిరుమల్ వెళ్లి చూసొచ్చాడు. అటుపైనే సుపారీ గ్యాంగ్కు రూ. 2 లక్షలు అందించాడు. ఇక ఈ కేసులో ఇప్పటికే ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తిరుమల్ కోసం నాలుగు బృందాలు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం అతను లడఖ్లోని ఉండి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.కేసు నేపథ్యం ఇదే.. జోగులాంబ గద్వాలకు చెందిన లైసెన్స్ సర్వేయర్ గంటా తేజేశ్వర్ హత్య కేసు తెలంగాణలో తీవ్ర సంచలనం రేపింది. భార్య ఐశ్వర్య తన ప్రియుడు తిరుమల్ రావుతో ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమనే అభియోగాలు ఉన్నాయి. తేజేశ్వర్కు ఈ ఏడాది ఫిబ్రవరిలో కర్నూలు కల్లూరుకు చెందిన ఐశ్వర్య అనే యువతితో వివాహం నిశ్చయమైంది. అయితే ఐశ్వర్య కనిపించకుండా పోవడం.. ఆమె తిరుమలరావు అనే బ్యాంకు ఉద్యోగితో వెళ్లిపోయిందన్న ప్రచారంతో తేజేశ్వర్ కుటుంబ సభ్యులు ఆ వివాహాన్ని రద్దు చేసుకున్నారు. అయితే కొన్ని రోజులకే తిరిగి వచ్చిన ఐశ్వర్య.. కట్నం ఇవ్వలేకపోయామన్న కారణంతోనే తాను బంధువుల ఇంటికి వెళ్లిపోయానని తేజేశ్వర్ను నమ్మించింది. దీంతో పెద్దలు ఒప్పుకోకపోయినా.. మే 18వ తేదీన ఐశ్వర్యను తేజేశ్వర్ వివాహం చేసుకున్నాడు. తిరుమల్రావు కోసం భర్త తేజేశ్వర్కు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే పెళ్లైన 29 రోజుల్లో.. 15 రోజులు ఐశ్వర్య కర్నూలులోనే గడిపింది. చివరకు.. తిరుమల్ రావు, సుపారీ గ్యాంగ్ సహకారంతో జూన్ 17వ తేదీన భర్త తేజేశ్వర్ను హత్య చేయించింది. ఆపై ఆ ముఠా తేజేశ్వర్ మృతదేహాన్ని పాణ్యం అటవీ ప్రాంతంలో వదిలేసి పారిపోయారు. ఆయుధాలు, ఫోన్, ల్యాప్టాప్ను కృష్ణానదిలో పడేశారు. ఈ కేసులో ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, తిరుమలరావు, సుపారీ గ్యాంగ్ సభ్యులను పోలీసులు నిందితులుగా చేర్చారు. ఐశ్వర్య తల్లి సుజాత తిరుమల్రావు పని చేసే బ్యాంకులోనే చిరుద్యోగి కాగా.. ఆమెతోనూ అతనికి శారీరక సంబంధం ఉన్నట్లు తేలింది. -
జీడిమెట్ల కేసులో విస్తుపోయే నిజాలు
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్ల హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘‘మా అక్కే మా అమ్మను చంపింది’’ అని తేజశ్రీ చెల్లి తెలిపింది. ‘‘ట్యూషన్ నుంచి వస్తుంటే నన్ను మా అక్క గల్లీలోనే ఆపింది. అమ్మ ఒక ఆంటీని తీసుకుని రమ్మంది.. పదా వెళ్దామంటూ నన్ను తీసుకెళ్లింది. 20 నిమిషాల తర్వాత ఇంటికి తిరిగి వచ్చాం. అప్పటికే కిచెన్లో అమ్మ స్పృహ లేకుండా పడి ఉంది. అమ్మను లేపే ప్రయత్నం చేశా....అమ్మను నేను చూసుకుంటా నువ్వు బయటకు వెళ్లు అంటూ అక్క చెప్పింది. చుట్టూ పక్కల ఎవరికీ చెప్పవద్దని చెప్పింది.. కానీ అక్క మాత్రం అమ్మ దగ్గరికి కూడా రాలేదు. అమ్మ చనిపోయింది లేపి వేస్ట్ అని అక్క చెప్పింది. మా అమ్మ ఇంకా చనిపోలేదని తెలుసుకుని.. శివకు ఫోన్ చేసింది. మళ్లీ శివ, యశ్వంత్ వచ్చి సుత్తితో అమ్మ తలపై కొట్టాడు’’ అని తేజశ్రీ చెల్లి తెలిపింది.ప్రేమకు అడ్డు చెప్పిందనే కారణంతో కన్నతల్లిని పదో తరగతి చదువుతున్న కుమార్తె తేజశ్రీ.. ప్రియుడితో కలిసి హతమార్చిన సంగతి తెలిసిందే. బాలికకు కొన్ని నెలల క్రితం ఇన్స్టాగ్రామ్లో ఓ యువకుడు పరిచయం కాగా.. అతడితో ప్రేమ వ్యవహారం నడిచింది. దీంతో ఆ బాలిక ఇంటి నుంచి వెళ్లి పోవడంతో తన కుమార్తె కనిపించడం లేదని తల్లి జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ బాలిక మూడు రోజుల క్రితం తిరిగి ఇంటికి వచ్చింది.ఇదిలా ఉండగా.. తల్లి అడ్డు తొలగించునేందుకు ప్రియడితో కలిసి స్కెచ్ వేసింది. నిన్న(సోమవారం) సాయంత్రం నల్లగొండ నుంచి ప్రియుడు శివను రప్పించింది. ఇంట్లో అంజలి పూజ చేస్తుండగా వెనుక నుంచి దాడి చేశాడు. బెడ్షీట్తో అంజలి ముఖాన్ని శివ కప్పగా.. సుత్తితో తల్లి అంజలిపై కూతురు దాడి చేసింది. శివ తమ్ముడు యశ్వంత్ కూడా కత్తితో పీక కోశాడు. -
భార్యే తేజేశ్వర్ ని హతమార్చిందని మృతుడి కుటుంబ సభ్యుల ఆరోపణ
-
నా భర్త భాస్కర్ వికారాబాద్ పోలీస్స్టేషన్లో ఎందుకున్నాడు..!
నారాయణపేట: సినీ ఫక్కీలో చోరీలకు పాల్పడుతూ మోస్ట్ వాంటెడ్ దొంగగా పోలీసు శాఖలో గుర్తింపు పొందిన చాపల భాస్కర్ (35) మృతి అనుమానాస్పదంగా మారింది. బెయిల్పై విడుదలైన వ్యక్తిని వికారాబాద్ పోలీసులు తీసుకెళ్లారని కుటుంబసభ్యులు చెబుతుంటే.. మాకేం సంబంధం లేదంటున్నారు. దీనికి తోడు సొంతూరులో కాకుండా వేరేరాష్ట్రంలో అంత్యక్రియలు చేయడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. నారాయణపేట జిల్లా ఊట్కూర్కి చెందిన చాపల భాస్కర్ కొన్నేళ్లుగా దొంగతనాలను వృత్తిగా చేసుకున్నాడు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసేవాడు. పోలీసుశాఖలో చాపల భాస్కర్ మోస్ట్ వాంటెడ్గా గుర్తింపు పొందారు. ఆరు మాసాలుగా మహబూబ్నగర్ జైలులో ఉన్నాడు. కాగా.. ఈ నెల 20వ తేదీన బెయిల్పై విడుదలయ్యాడు. అయితే వికారాబాద్ జిల్లాలో 14 చోరీల్లో భాస్కర్పై కేసులు నమోదు కావడంతో భాస్కర్ను మహబూబ్నగర్ జైలు నుంచి బయటికి వచ్చినవెంటనే సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ స్టేషన్) పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు.⇒ వికారాబాద్ పోలీస్స్టేషన్ నుంచి చాపలి భాస్కర్ భార్య తారమ్మకు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఫోన్ చేసి.. మీరొచ్చి మీ భర్తను తీసుకెళ్లాలని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే తన భర్త వికారాబాద్ పోలీస్స్టేషన్లో ఎందుకున్నారంటూ పోలీసులను అడిగినట్లు సమాచారం. అయితే శనివారం ఉదయం 10 గంటల సమయంలో వికారాబాద్ నుంచి మఫ్టీలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు ఓ ప్రైవేట్ ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చి గుర్మిట్కల్ దగ్గరలోని ఓ గ్రామస్టేజీ వద్ద చాపలి భాస్కర్ను వారి బంధువుకు అప్పజెప్పారు. అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురైన భాస్కర్ను ఓ ప్రైవేట్ వాహనాన్ని మాట్లాడించి కానిస్టేబుళ్లు.. అందులో నారాయణపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేలా చేస్తూ అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు.ఆస్పత్రికి వచ్చేసరికి మృతి..స్పృహలో లేని భాస్కర్ను ఆస్పత్రికి తీసుకువచ్చే సరికి చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు భాస్కర్ వెంబడి వచ్చిన బంధువు చేరవేశారు. వెంటనే భార్య తారమ్మతో పాటు కుటుంబసభ్యులు వచ్చి ఆస్పత్రిలో శవమై కనిపించిన చాపలిభాస్కర్ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే నారాయణపేట పీఎస్కు వెళ్లగా ఈ కేసు తమ పరిధిలో రాదంటూ సీఐ, ఎస్ఐలు చేతులెత్తేసినట్లు తెలిసింది. అక్కడి నుంచి ఓ ప్రైవేట్ వాహనంలో శనివారం సాయంత్రం భాస్కర్ మృతదేహాన్ని వికారాబాద్ పోలీస్స్టేషన్ వద్దకు తీసుకెళ్లి.. ఆరా తీశారు. మేము కస్టడీలోకి తీసుకున్నట్లు ఏమైనా ఆధారాలున్నాయా అంటూ బుకాయించినట్లు తెలుస్తోంది. దీంతో దీంతో చేసేదేమి లేక తిరిగి నారాయణపేటకు చేరుకున్నారు. చివరకు ఆదివారం నారాయణపేట రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాముడు తెలిపారు. నారాయణపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రిలో చాపలి భాస్కర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆయన స్వగ్రామం ఊట్కూర్ అయినప్పటికీ భాస్కర్ అత్తగారి ఊరు కర్ణాటకలోని సంకలాపూర్కు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. -
చెంగల్పట్టు ఎక్స్ప్రెస్లో భారీ దోపిడీ.. సిగ్నల్ కట్ చేసి...
సాక్షి, అనంతపురం జిల్లా: తాడిపత్రి సమీపంలోని కోమలి గ్రామం సమీపంలో అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు రైల్లో భారీ దోపిడీకి పాల్పడ్డారు. ముంబై నుంచి చెన్నైకి వెళ్తున్న చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ రైలులో ఈ ఘటన జరిగింది.దుండగులు కోమలి సమీపంలో సిగ్నల్ కేబుల్ కట్ చేయడంతో రైలు నిలిచిపోయింది. ఎస్1, ఎస్2 బోగీల్లోకి చొరబడిన దుండగులు.. ప్రయాణికులను బెదిరించి డబ్బులు, బంగారు నగలు దోచుకున్నారు. ప్రయాణికులు గట్టిగా కేకలు వేయడంతో దుండగులు పరారీ అయ్యారు. ఈ ఘటనపై బాధిత ప్రయాణికులు రేణిగుంట రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
జీడిమెట్ల: తల్లిని కడతేర్చిన కూతురు.. వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, మేడ్చల్: నవమాసాలు మోసి కనిపెంచిన తల్లినే కడతేర్చింది ఓ బాలిక.. కన్న పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ.. తల్లి ప్రేమను మరిచిది. 18 ఏళ్లు నిండక ముందే ప్రియుడితో కలిసి తల్లి పాలిట యమపాశం గా మారింది. జీడిమెట్ల పరిధిలో ఈ దారుణ ఘటన జరిగింది. ప్రియుడితో కలిసి కన్నతల్లిని కూతురు హత్య చేసింది. ప్రేమ వ్యవహారంలో మందలించిందన్న కోపంతో తన ప్రియుడు శివ(19), అతని తమ్ముడు యశ్వంత్(18)తో కలిసి కూతురు తేజశ్రీ(16) కన్నతల్లిపై కిరాతకానికి పాల్పడింది.కేసు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలు అంజలి చాకలి ఐలమ్మ ముని మనవరాలు. మహబూబాబాద్ చెందిన అంజలి 20 ఏళ్లుగా జిడీమెట్లలో నివాసం ఉంటున్నారు. ఆమె మహిళా మండలిలో కూడా పనిచేస్తోంది. కాగా, ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని నెలల క్రితమే బాలికకు ఇన్స్టాలో శివ పరిచయమయ్యాడు. పదో తరగతికే ప్రేమ ఏంటని తల్లి అంజలి మందలించింది. వారం క్రితం శివతో ఆ బాలిక వెళ్లిపోయింది. దీంతో పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. మూడు రోజుల క్రితం బాలిక ఇంటికి తిరిగి వచ్చింది.తల్లి అడ్డు తొలగించునేందుకు ప్రియడితో కలిసి స్కెచ్ వేసింది. నిన్న(సోమవారం) సాయంత్రం నల్లగొండ నుంచి ప్రియుడు శివను రప్పించింది. ఇంట్లో అంజలి పూజ చేస్తుండగా వెనుక నుంచి దాడి చేశాడు. బెడ్షీట్తో అంజలి ముఖాన్ని శివ కప్పగా.. సుత్తితో తల్లి అంజలిపై కూతురు దాడి చేసింది. శివ తమ్ముడు యశ్వంత్ కూడా కత్తితో పీక కోశాడు. తల్లి హత్య తర్వాత కుర్చీలో నుంచి పడిపోయిందని అందరిని నమ్మించే ప్రయత్నం చేసింది. ఆ బాలిక.. తన పెద్దమ్మకు ఫోన్ చేసి అమ్మ కుర్చీ నుంచి పడిపోయిందని.. గాయాలయ్యాయంటూ చెప్పుకొచ్చింది. తన తల్లి మృతిపై బాలిక తేజశ్రీ చెల్లెలు కన్నీరుమున్నీరైంది. బయటకెళ్లి వచ్చేసరికి అమ్మ రక్తపు మడుగుల్లో ఉందని పేర్కొంది. పోలీసులకు ఫోన్ చేసి.. అమ్మను ఆసుపత్రికి తీసుకెళ్దామని చెప్పినా కూడా అక్క వినలేదని పేర్కొంది. -
ఒకే వ్యక్తితో తల్లీ, కూతురు వివాహేతర సంబంధం..!
గద్వాల క్రైం: మేఘాలయ హనీమూన్ మర్డర్ తరహాలో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వివాహం జరిగినప్పటి నుంచి భర్త తేజేశ్వర్ రాకపోకలపై నిఘా పెట్టి దారుణహత్యకు భార్య సహస్రనే పూర్తి పథకం రచించినట్టు తెలుస్తోంది. కర్నూలుకు చెందిన ఓ బ్యాంకు అధికారితో ఉన్న సన్నిహిత సంబంధం పెళ్లయిన రెండురోజులకే తెలియగా, సహస్రను తేజేశ్వర్ మందలించినట్టు తెలిసింది. దీంతో తమ బాగోతం ఎక్కడ బయట పడుతుందోనని బ్యాంకు ఉద్యోగికి జరిగిన విషయం చేరవేసింది. ఆయన సూచన మేరకు భర్త బైక్కు జీపీఎస్ ట్రాకర్ను తన దూరపు బంధువుతో అమర్చేలా చేసింది. సుపారీ తీసుకున్న ముఠా సభ్యులు గద్వాలలో ఉన్న ఇన్ఫార్మర్ ద్వారా తేజేశ్వర్పై నిఘా పెట్టారు. జీపీఎస్ ద్వారా ఎక్కడ ఉంటున్నాడో గుర్తించి మూడు దఫాలుగా గద్వాల శివారులో హత్య చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో సహస్ర, ఆ బ్యాంకు ఉద్యోగి ముఠా సభ్యులను ఎగతాళి చేసి, హేళనగా మాట్లాడారు. దీంతో ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్న సుపారీ గ్యాంగ్ ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఈ నెల 17వ తేదీన ఉదయం వారి కారులో తేజేశ్వర్ను ఎక్కించుకొని జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వ్యవసాయేతర భూములు చూసేందుకు వెళ్లారు. ఆ కారులోనే కత్తితో పొడిచి హత్య చేసి నంద్యాల జిల్లా పాణ్యం మండలం పిన్నాపురం శివారులో మృతదేహాన్ని పడేశారు. కేసు విచారణ వేగవంతంతేజేశ్వర్ హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. హత్యకు సుపారీ ఇచ్చిందెవరు..ఎంతమంది వచ్చారు.. వారు వెళ్లేందుకు వినియోగించిన వాహనం.. అసలు తేజేశ్వర్ను వారికి పరిచయం చేసిందెవరు.. ఇలా అనేక అంశాలపై విచారణ అధికారులు పలు బృందాలుగా విడిపోయి అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సీన్ రీ కన్స్ట్రక్షన్తేజేశ్వర్ను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లిన ఘటన, ప్రయాణించిన ప్రదేశాల్లో గుర్తుతెలియని వ్యక్తుల సమాచారం మేరకు సీన్ రీ కన్స్ట్రక్షన్ ప్రక్రియను సోమవారం సీఐ శ్రీను, ఎస్ఐలు కల్యాణ్కుమార్, మల్లేశ్, శ్రీకాంత్ పరిశీలించారు. గద్వాల నుంచి సంగాల ఔటర్ రింగ్ రోడ్డు అక్కడి నుంచి పూడూరు, ఇటిక్యాల, మొగిల్రావుల చెరువు శివారు, పెబ్బేర్, బీచుపల్లి ఫ్లై ఓవర్, తుంగభద్ర ఫ్లైఓవర్ బ్రిడ్జి తదితర ప్రాంతాల్లో పరిశీలించారు. గద్వాల మండలం పూడూరు శివారులోనే తేజేశ్వర్ను హత్య చేసినట్టు తెలుస్తోంది. అయితే మృతదేహాన్ని ఓ గోనెసంచిలో చుట్టి కారు డిక్కీలో పెట్టి ఎవరూ లేనిచోట పడేయాలని భావించినట్టు తెలిసింది. అయితే అలా సాధ్యం కాకపోవడంతో నంద్యాల జిల్లాలోని పాణ్యం మండలం పిన్నాపురం శివారులో అర్ధరాత్రి పడేసి కారులోంచి తప్పించుకున్నట్టు అనుమానిస్తున్నారు. హత్యకు ముందే పరిచయం.. తేజేశ్వర్ భార్య సహస్ర తల్లి సుజాత పుట్టినిల్లు గద్వాలలోని జమిచేడ్ కాగా, కర్నూలుకు చెందిన రామకృష్ణతో వివాహం అనంతరం కల్లూరుకు వెళ్లారు. సుజాత భర్త రామకృష్ణ చనిపోవడంతో కర్నూలు జిల్లా కేంద్రంలో ఓ బ్యాంకులో స్వీపర్గా పనిచేస్తోంది. అక్కడే బ్యాంకు ఉద్యోగితో పరిచయం పెరిగి, చనువుగా ఉండేది. కూతురు సహస్ర సైతం సదరు ఉద్యోగితో చనువుగా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వివిధ సందర్భాల్లో సహస్ర తన తల్లితో కలిసి జమిచేడ్కు వచి్చన క్రమంలో దూరపు బంధువు ద్వారా తేజేశ్వర్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఇరు కుటుంబ సభ్యులతో వివాహానికి సిద్ధమయ్యారు. అయితే బ్యాంకు ఉద్యోగికి ఈ విషయం తెలిసి వ్యతిరేకించడంతో తేజేశ్వర్తో నిశ్చితార్థం రద్దు చేసుకుంది. మరోవైపు బ్యాంకు ఉద్యోగికి ముందే మరో మహిళతో వివాహం కావడం, బ్యాంకు ఉద్యోగి భార్య కట్టడి చేయడంతో సమస్య అక్కడితో ఆగిపోయిందని తెలిసింది. ఆ తర్వాత సహస్ర.. తేజేశ్వర్ను మళ్లీ కలిసి పెళ్లికి డబ్బులు లేకపోవడంతో నిరాకరించినట్టు నమ్మించి పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో గత నెల 18న ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరిగినట్టు పోలీసులు గుర్తించారు.పోలీసుల అదుపులో అనుమానితులు?పోలీసులు ఇప్పటికే ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఇందులో సహస్ర, సుజాత, బ్యాంకు ఉద్యోగి, హత్యకు పాల్పడిన ముగ్గురు, ఒక ఇన్ఫార్మర్ ఉన్నారు. ఈ ఘటనపై గద్వాల సీఐ శ్రీనుతో మాట్లాడగా.. కేసుకు సంబంధించిన అన్ని విషయాలను ఇప్పటికే గుర్తించామన్నారు. హత్యకు పాల్పడిన నిందితుల వివరాలు తెలియాల్సి ఉందని.. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించామని వివరించారు. తాజాగా రీ కన్స్ట్రక్షన్లో భాగంగా వివిధ ప్రాంతాల్లో పరిశీలించి గద్వాల మండల శివారులోనే తేజేశ్వర్ను హత్య చేసినట్టు గుర్తించినట్లు పేర్కొన్నారు. ప్రధాన నిందితుల కోసం ఓ బృందం కర్నూలు జిల్లాలో గాలిస్తున్నట్టు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్న వెంటనే పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. -
స్నేహితుడి కుమార్తెపై లైంగికదాడి
నెల్లూరు (క్రైమ్): కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి స్నేహితుడి కుమార్తెపైనే లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చడంతో ఆదివారం విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు.. సంతపేట పోలీసుస్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి తన భార్య, పదిహేడేళ్ల కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతనికి వారధి సెంటర్కు చెందిన కుమార్ స్నేహితుడు ఉన్నాడు. ఇరు కుటుంబాలు సన్నిహితంగా ఉంటున్నాయి. అందరూ కలిసి బయటకు వెళ్లేవారు. ఈ ఏడాది మార్చిలో ఇరు కుటుంబాలు తిరుమలకు వెళ్లాయి. తిరుగు ప్రయాణంలో కుమార్ అతని భార్య, స్నేహితుడి కుమార్తె శ్రీకాళహస్తికి వెళ్లారు. అక్కడే ఉండి మార్చి 16న నెల్లూరుకు వచ్చారు. బాలిక కుమార్ ఇంట్లో ఉండగా, అతని భార్య వ్యాపార నిమిత్తం బయటకు వెళ్లింది. ఇదే అదనుగా భావించిన కుమార్ బాలికను బెదిరించి లైంగిక దాడి చేశాడు. ఈ విషయం ఇంట్లో చెబితే చంపేస్తామని బెదిరించాడు. దీంతో బెదిరిపోయిన ఆమె ఎవరికి చెప్పలేదు. రెండు నెలలుగా బాలికకు పీరియడ్స్ రాకపోవడంతో బాధిత తల్లి ఆమెను శనివారం జీజీహెచ్కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు బాలిక గర్భవతి అని నిర్ధారించారు. దీంతో బాలికను తల్లిదండ్రులు ప్రశ్నించగా జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో బాధితురాలు ఆదివారం సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇన్స్పెక్టర్ జి. దశరథరామారావు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాలికపై వేధింపులు.. ఎనిమిది మందిపై పోక్సో కేసు
గుడిహత్నూర్: సోషల్ మీడియాలో స్నేహం పేరుతో ఓ బాలికను వేధింపులకు గురిచేసిన కేసులో ఎనిమిది మందిని శనివారం రాత్రి అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికతో మండల కేంద్రానికి చెందిన ఓ బాలుడు పరిచయం పెంచుకున్నాడు. అప్పటి నుంచి ఫోన్లో చాటింగ్ చేస్తున్నాడు. ఒకరోజు తనకు న్యూడ్ వీడియో కాల్ చేయాలని, లేదంటే చాటింగ్ అందరికీ తెలిసేలా చేస్తానని బెదిరించాడు. ఆ బాలిక ఒకరోజు న్యూడ్ కాల్చేసి మాట్లాడుతుండగా వీడియోను స్క్రీన్ రికార్డు చేసి తన ఏడుగురు స్నేహితులకు పంపించాడు. వారు వీడియోను అడ్డం పెట్టుకుని బాలికను మానసికంగా వేధింపులకు గురి చేయడం ప్రారంభించారు. ఓ యువకుడు ఏకంగా ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో బాలిక తన కుటుంబ సభ్యులకు విషయం తెలిపింది. బాలిక తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో షీటీం పోలీసులు ఎనిమిది మందిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారని తెలిపారు. ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ వివరించారు. -
బ్యాంకు ఉద్యోగితో భార్య వివాహేతర సంబంధం.. చివరికి..!
కర్నూలు: కర్నూలు టీజే మాల్లో ఉన్న కెనరా బ్యాంకు మేనేజర్ తిరుమలరావు దారుణానికి ఒడిగట్టాడు. గద్వాల రాజవీధిలో ఉంటున్న ప్రైవేటు సర్వేయర్ గంట తేజేశ్వర్ (32)ను వివాహేతర సంబంధంతో హత్య చేయించినట్లు పోలీసులు భావిస్తున్నారు. తిరుమలరావు అదే బ్యాంకులో పనిచేసే కల్లూరుకు చెందిన చిరుద్యోగితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అలాగే కూతురుతో కూడా వివాహేతర సంబంధం కొనసాగించే ప్రయత్నం చేశాడు. అప్పటికే గద్వాలకు చెందిన తేజేశ్వర్ను ఆ యువతి ప్రేమ వివాహం చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ సర్వేయర్ను హత మార్చాలని యువతి తల్లితో కలిసి తిరుమలరావు పథకం పన్నాడు. ల్యాండ్ సర్వే చేయించాలని స్నేహితుల ద్వారా తేజేశ్వరరావును కర్నూలుకు రప్పించి రహస్య ప్రాంతంలో హత్య చేసి పాణ్యం సమీపంలోని పిన్నాపురం రస్తాలో పడేశారు. అయితే సర్వేయర్ తేజేశ్వర్ కనిపించకపోవడంతో అతని సోదరుడు తేజవర్థన్ ఐదు రోజుల క్రితం గద్వాల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా, అక్కడి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ జిల్లా ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బృందం శనివారం కర్నూలుకు వచ్చి విచారించారు. బ్యాంకు మేనేజర్ తిరుమలరావుకు సంబంధించిన స్నేహితులను అదుపులోకి తీసుకొని కర్నూలు మూడో పట్టణ పోలీసుల సహకారంతో దర్యాప్తు చేపట్టారు. మొబైల్ ఫోన్ లోకేషన్ ఆధారంగా పాణ్యం సమీపంలోని పిన్నాపురం చెరువు వద్ద తేజేశ్వర్ మృతదేహం ఉన్నట్లు గుర్తించి పాణ్యం పోలీసుల సహయంతో మృతదేహాన్ని వెలికి తీసి ఆదివారం పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యకు సంబంధించి గద్వాల పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. హత్య కుట్రకు వెనుక మరి కొందరి హస్తం ఉన్నట్లు గద్వాల పోలీసులు భావించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.గొంతు కోసి.. మృతదేహాన్ని పడేసి పాణ్యం: తేజేశ్వర్ను అత్యతం కిరాతకంగా హత్య మార్చారని పాణ్యం ఎస్ఐ నరేంద్రకుమార్రెడ్డి తెలిపారు. కారులోనే తేజేశ్వర్ను గొంతు కోసి హత్య చేశారని, నన్నూరు టోల్ప్లాజా మీదుగా పాణ్యం మండలం సుగాలిమెట్ట వద్ద పిన్నాపురం రస్తాలో పడేశారన్నారు. కారులో వచ్చిన వ్యక్తుల వివరాలు తెలుసుకునేందుకు విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. కారు కోసం గద్వాల్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా.. పోలీసులు అదుపులో ముగ్గురు వ్యక్తులు ఉండగా మరో కీలక వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం. -
అంతుచూసిన అక్రమ సంబంధం
మైసూరు: చామరాజనగర జిల్లా కొళ్లేగాలలోని హలె హంపాపురలోని సువర్ణవతి నది ఒడ్డున పాతిపెట్టిన మహిళ శవం వర్షాలకు బయటకు వచ్చింది. ఆమె హత్యకు గురైనట్లు గుర్తించారు. కొళ్లేగాల పట్టణంలో నివసించే విజయ్కుమార్ భార్య సోనాక్షి (29) గా గుర్తించారు. పోలీసులు విచారణ జరిపగా, వారి ఇంటి దగ్గరే ఉండే మహేష్ బాబు ఈ హత్య చేశాడని తేలింది. సోనాక్షితో మహేష్బాబు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇది తెలిసి సోనాక్షి భర్త గొడవ పడి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. పోలీసులు నిందితున్ని విచారించారు. ఇటీవల సోనాక్షిని బయటకు తీసుకెళ్లిన నిందితుడు ఆమెను హత్య చేసి శవాన్ని చిన్నపాటి గుంత తీసి పాతిపెట్టి వెళ్లిపోయాడు. వర్షాలు రావడంతో పాటు కుక్కలు శవాన్ని లాగడంతో బయటపడింది. పోలీసులు మృతదేహాన్ని చామరాజనగర సిమ్స్ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి కుటుంబసభ్యులకు అప్పగించారు. నిందితున్ని అరెస్టు చేశారు. -
‘మీ కూతురు కెనడాలో డ్రగ్స్ కేసులో పట్టుబడింది’
సాక్షి, హైదరాబాద్: ‘మీ కూతురు కెనడాలో డ్రగ్స్ కేసులో పట్టుబడింది. ఈ కేసు నుంచి మీ కూతుర్ని తప్పించాలంటే మేం చెప్పిన ఫోన్పే నంబర్కు రూ.50 వేలు వెంటనే పంపండి’అంటూ బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు విశ్వ ప్రయత్నం చేశారు. అయితే వారి వలకు చిక్కకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించారు నగరవాసి శ్రీనివాస్రెడ్డి. కేసు వివరాల్లోకి వెళితే..సరూర్నగర్కు చెందిన ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థను నడిపే శ్రీనివాస్రెడ్డికి ఈనెల 19న ఒక వాట్సప్ కాల్ వచ్చింది. అందులో పేరు సీబీఐ విక్రమ్గా..డీపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా ఫొటో ఉంది. అవతలి నుంచి ఒక మహిళ ఇంగ్లిష్ లో మాట్లాడుతూ.. మీ కూతురు కెనడాలో డ్రగ్స్ కేసులో పట్టుబడింది అని చెప్పింది. వెంటనే డబ్బులు పంపితే ఆమెను ఈ కేసు నుంచి వదిలేస్తామని లేదంటే థర్డ్ డిగ్రీ తప్పదని బెదిరించడం ప్రారంభించింది. ఫోన్ పే చేయాలంటూ ఒక నంబర్ ఇచ్చింది. పదేపదే డబ్బుల కోసం ఒత్తిడి చేస్తుండడంతో అనుమానించిన శ్రీనివాస్రెడ్డి ఆ వాట్సప్ కాల్ను కట్ చేసి, కెనడాలో ఉన్న కూతురుకు ఫోన్ చేశారు. ఇంట్లోనే నిద్రపోతున్నానని..తాను క్షేమంగానే ఉన్నానని...ఎలాంటి సమస్య లేదని కూతురు చెప్పింది. దీంతో తన అనుమానం నిజమైందని గుర్తించిన శ్రీనివాస్రెడ్డి సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులకు ఫిర్యాదు చేశారు. సైబర్ నేరగాళ్లు చేసిన ఫోన్ నంబర్ పాకిస్తాన్ నుంచి వచ్చినట్టుగా గుర్తించారు. తనను మోసగించేందుకు ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్రెడ్డి తన ఫిర్యాదులో కోరారు. టీజీ సీఎస్బీ డీఎస్పీ కేవీఎం ప్రసాద్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. -
అశ్లీలం చూస్తే 'కటకటాలే '.. ఆచూకీ కనిపెడుతున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: చిన్నారులపై లైంగిక దాడులు జరగడానికి, పెరగడానికి కారణమైన చైల్డ్ పోర్నోగ్రఫీపై ప్రపంచ వ్యాప్తంగా నిషేధం ఉంది. దీనిపై కన్నేసి ఉంచడానికి నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్ చిల్డ్రన్ (ఎన్సీఎంఈసీ) పని చేస్తోంది. చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్డ్ మెటీరియల్ను (సీఎస్ఏఎం) కనిపెట్టడానికి అత్యాధునిక సాఫ్ట్వేర్స్ వినియోగిస్తోంది. వీరు గుర్తించిన వివరాల ఆధారంగానే గత వారం సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఐఐటీ ఖరగ్పూర్ గ్రాడ్యుయేట్ సహా 15 మందిని అరెస్టు చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న కఠిన చట్టాల ప్రకారం ఇంటర్నెట్తో పాటు సోషల్మీడియాలో చైల్డ్ పోర్నోగ్రఫీని సెర్చ్ చేసినా, చూసినా, డౌన్లోడ్, అప్లోడ్ చేసినా నేరమే. నిఘా వేసి ఉంచే రెండు సంస్థలు..చైల్డ్ పోర్నోగ్రఫీని ప్రపంచ వ్యాప్తంగా నిషేధించిన తర్వాత ఎన్సీఎంఈసీ చర్యలు ముమ్మరం అయ్యాయి. దీంతో పాటు ఇంటర్నేషనల్ చైల్డ్ ఎక్స్ప్లాయిటేషన్ (ఐసీఎస్ఈ), గూగుల్కు సంబంధించిన సైబర్ టిప్లైన్ రిపోర్ట్స్ సీఎంఏఎంని గుర్తించడానికి ప్రత్యేక సాఫ్ట్వేర్లు వాడుతున్నాయి. ప్రపంచంలో ఎవరైనా ఆయా వేదికలపై సీఎస్ఏఎంకు సంబంధించి ఎవరైనా సెర్చ్ చేసినా, వీక్షించినా, డౌన్లోడ్ చేసినా, అప్లోడ్ చేసినా..తక్షణం గుర్తించే ఈ సాంకేతిక పరిజ్ఞానం వారు వినియోగించిన ఐపీ అడ్రస్లను రీడ్ చేస్తుంది. ఈ వివరాలను ఎన్సీఎంఈ, ఐసీఎస్ఈలకు చెందిన సర్వర్ అందిస్తుంది. వీటిని క్రోడీకరించి జాబితాలు రూపొందించి వీటిని ఆయా దేశాలకు చెందిన నోడల్ ఏజెన్సీలకు అందిస్తారు. జాతీయ స్థాయిలో హోమ్ మంత్రిత్వ శాఖ ఆ«దీనంలోని ఐ4సీ నోడల్ ఏజెన్సీగా ఉంది. ఇది తమకు అందిన వివరాలను ఆయా రాష్ట్ర స్థాయి దర్యాప్తు సంస్థలకు పంపిస్తారు. ఇలా గత వారం సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు సమాచారం అందింది. నిందితుల్లో అన్ని రకాల వాళ్లూ... వీటిపై కేసులు నమోదు చేసి, ఐపీ అడ్రస్ల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేయడం సైబర్ బ్యూరో నిర్వర్తిస్తుంది. ఈ నిందితుల్లో విద్యాధికులు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు కూడా ఉంటున్నారు. ఇటీవల అరెస్టు అయిన వారిలో వ్యాపారులు, చిరుద్యోగి కూడా ఉన్నారు. ఇంటర్నెట్లో ఉండే పోర్న్ మెటీరియల్తో పాటే కొన్ని రకాలైన వైరస్లు కూడా ఉండే ప్రమాదం ఉంటుందని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. ఈ వెబ్సైట్ల ద్వారా ఆయా వైరస్లు పంపే హ్యాకర్లు ఫోన్లు, ల్యాప్టాప్లు హ్యాక్ చేసి తమ ఆధీనంలోకి తీసుకుంటారు. ఇలా వ్యక్తిగత సమాచారం, నెట్ బ్యాంకింగ్ ఖాతా వివరాలు వారికి చేరి పోర్నోగ్రఫీ బానిసలు అన్ని రకాలుగానూ నష్టపోవాల్సి వస్తుందని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కేవలం చైల్డ్ పోర్నోగ్రఫీనే కాదు..అన్ని రకాలైన అసభ్య, అశ్లీల వెబ్సైట్లపై ఫిర్యాదులు వచి్చనప్పుడు కేంద్ర ప్రభుత్వం వాటిని నిషేధించి బ్లాక్ చేయిస్తోంటే నిర్వాహకులు మరోటి తయారు చేస్తున్నారు. వీటిని హోస్ట్ చేస్తున్న సర్వర్లన్నీ విదేశాల్లో ఉంటుండటంతో కఠిన చర్యలు సాధ్యం కావట్లేదని పోలీసులు చెబుతున్నారు. -
అత్తింటి వేధింపులకు నవ వధువు బలి
హైదరాబాద్: అత్తింటి వేధింపులు భరించలేక ఓ నవ వధువు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కేపీహెచ్బీ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన మాలోతు పూజిత (19)కు, జాటోతు శ్రీనుతో ఈ ఏడాది ఏప్రిల్ 16న వివాహమైంది. జాటోతు శ్రీను ఓ జ్యువెలరీ షాపులో సేల్స్ మేనేజర్. కేపీహెచ్బీ కాలనీలోని రోడ్డు నెంబర్ 3, టెంపుల్ బస్టాప్ సమీపంలోని ఈఎస్డబ్ల్యూ 1140లో నివసిస్తున్నారు. పూజిత పెళ్లి సమయంలో 8 తులాల బంగారంతో పాటు సుమారు రూ.11 లక్షలు ఇచ్చారు. కొద్ది రోజుల తర్వాత అదనపు కట్నం కోసం అత్త, మామ, భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఆమెను వేధింపులకు గురి చేయసాగారు. అదనంగా రూ.10 లక్షల అదనపు కట్నం కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో పూజిత నానమ్మ మాలోతు భద్రమ్మ వచ్చే పంట విక్రయాల అనంతరం అదనపు కట్నం ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ నెల 21న రాత్రి 12 గంటలకు పూజిత నానమ్మకు శ్రీను ఫోన్ చేసి ఉదయం 9 గంటలకు తాను పనికి వెళ్లి రాత్రి 11.30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చానని, ఇంతలో పూజిత చీరతో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందన్నాడు. పూజిత తన సోదరులతో కలిసి కూల్డ్రింక్ తాగుతున్న ఫొటోలను హరి అనే వ్యక్తి శ్రీనుకి పంపించాడని, వాటిని చూపించి శ్రీను ఆమెను వేధిస్తున్నాడని, తన మనవరాలు మృతికి శ్రీను, అతని కుటుంబ సభ్యులే కారణమని పూజిత నానమ్మ కేపీహెచ్బీ పోలీస్లకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘ఆంటీ...ఇల్లు చూట్టానికి వచ్చారు...కిందకు రండి !’
తెనాలి: ఒకే ఇంట్లో ఇద్దరు వృద్ధ మహిళలను హత్య చేసి బంగారు నగలను అపహరించిన కేసులో మారీసుపేటకు చెందిన అత్తోట కుసుమ అనే మహిళ ప్రధాన సూత్రధారిగా పోలీసులు నిర్ధారణ కొచ్చారు. ఆమెను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. విచారణలో మరో వృద్ధురాలి హత్యతో పాటు, ఇంకొకరి హత్యకు రెక్కీ నిర్వహించినట్టు తెలిసీ, ఆ కోణంలో దర్యాప్తు జరుగుతోందని విశ్వసనీయ సమాచారం. దీనితో మారీసుపేట, మల్లెపాడు గ్రామంలో కలకలం రేగింది.ఇన్స్యూరెన్స్ ఏజెంటుగా వివరాల సేకరణతెనాలి పట్టణం మారీసుపేటలో కుసుమ నివాసం. ఆమె భర్త 15 ఏళ్ల క్రితమే మృతి చెందాడు. ఇద్దరు సంతానం. కాలేజీకి వెళుతున్నారు. గతంలో ‘మెప్మా’ విభాగంలో తాత్కాలికంగా పని చేసింది. ప్రస్తుతం ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంటుగా పని చేస్తోంది. పాలసీల పేరుతో అందరినీ కలుస్తూ వారి వివరాల ఆధారంగా నేరాలకు ప్రణాళికను రచిస్తోంది. తన సహాయకులతో పక్కాగా అమలు చేస్తోంది. తెనాలి నుంచి చినపరిమి వెళ్లే రోడ్డులో మూతపడిన అప్పడాల కంపెనీ పైభాగంలో వితంతువులైన వియ్యపురాళ్లు దాసరి రాజేశ్వరి (65), పిట్టా అంజమ్మ (70) నివసిస్తున్నారు. ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం ఆ ఇద్దరు హత్యకు గురయ్యారు. వీరి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. ఈ కేసులో కుసుమ సహా ఆటోడ్రైవర్, మరొక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.హత్యకు ప్లాన్ ఇలా..హత్యకు గురైన వృద్ధుల ఇంటికి ఆ రోజు ఒక ఆటోలో కుసుమ సహా మరో ఇద్దరు యువకులు వచ్చారు. ‘ఆంటీ...ఇల్లు చూట్టానికి వచ్చారు...కిందకు రండి !’ అని కుసుమ పిలవడంతో ఒక వృద్ధురాలు కిందకు వచ్చారు. కిందకు వెళ్లినామె ఎంతకీ పైకి రాకపోవటతో ఇంకో వృద్ధురాలు, ‘ఇంకా రాలేదేంటి...పైకి రా!’ అని వియ్యపురాలిని కేకేసింది. దీనితో మళ్లీ కుసుమ, ఆమెను కూడా ‘కిందకు రండి...పిలుస్తున్నారు !’ అనడంతో ఆమె కూడా దిగివచ్చింది. తర్వాత ఆ ముగ్గురూ అదే ఆటోలో తిరిగి వెళ్లిపోయారు. ఇదంతా ఇంటిముందున్న సీసీ కెమెరాలో రికార్డు కావడంతో పోలీసులు కుసుమతో సహా ఆ ఇద్దరు యువకులను తేలిగ్గా పట్టుకోగలిగారు. విచారణలో వారు కూడా విస్తుపోయే మరికొన్ని నిజాలు తెలిసినట్టు విశ్వసనీయ సమాచారం. -
వివాహేతర సంబంధం: చెట్టుకు కట్టేసి.. రాళ్లతో కొట్టి హత్య
నల్గొండ: తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో మహిళ భర్త, ఆయన కుటుంబ సభ్యులు ఓ యువకుడిని చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. దీంతో ఆ యువకుడు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం నోముల గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నోముల గ్రామానికి చెందిన నర్సింగ్ జానయ్య(35)కు ఇంకా వివాహం కాలేదు. జానయ్యకు అదే గ్రామానికి చెందిన ఓ వివాహిత మహిళతో పరిచయం ఏర్పడి.. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. గతేడాది ఇదే విషయమై ఆ మహిళ కుటుంబ సభ్యులకు, జానయ్యకు మధ్య గొడవలు జరిగాయి. పలుమార్లు పెద్దమనుషుల మధ్య పంచాయితీలు కూడా నడిచాయి. ఇదే విషయంపై జానయ్యపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడంతో అతడు జైలుకు వెళ్లి వచ్చాడు. జైలు నుంచి వచ్చాక కూడా జానయ్య ఆమెతో సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలిసి జానయ్యను అంతమొందించాలని ఆ మహిళ భర్త నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో తన భార్యతోనే జానయ్యను శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి పిలిపించాడు. ఇంటికి వచ్చిన జానయ్య కళ్లలో కారం చల్లి.. కాళ్లు, చేతులు కట్టేసి ఆ మహిళతోపాటు ఆమె భర్త కర్రలతో చితకబాదారు. అనంతరం మరికొందరితో కలసి ఇంటి పక్కన ఉన్న వీధిలో చెట్టుకు జానయ్యను తాళ్లతో కట్టేసి అతడి తల, కాళ్లు, చేతులు, మర్మాంగాలపై విచక్షణారహితంగా కొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన జానయ్య అసస్మారకస్థితిలోకి వెళ్లాడు. చుట్టుపక్కల వారు గమనించి జానయ్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి జానయ్యను నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. ఈ ఘటనపై జానయ్య తల్లి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజశేఖర్ తెలిపారు. -
బాలాపూర్ అక్కాచెల్లెళ్ల మృతిపై అనుమానాలు!
సాక్షి, హైదరాబాద్: బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఒకే ఇంట్లో ఇద్దరు యువతులు శనివారం అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. తండ్రి మందలించాడని ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారని స్థానికులు చెబుతుండగా.. పోలీసులు మాత్రం దర్యాప్తు తర్వాతే మృతికి గల కారణాలపై ఓ అంచనాకి వస్తామని చెబుతున్నారు.వినీల (17), అఖిల (16) అక్కాచెల్లెళ్లు. వినీల ఈ మధ్య ఓ యువకుడిని ప్రేమించి ఇంట్లోంచి వెళ్లిపోయింది. దీంతో పెద్దలు పంచాయితీ పెట్టి కులాంతర వివాహం వద్దని సర్దిచెప్పి ఆమెను వెనక్కి తీసుకొచ్చారు. అప్పటి నుంచి అక్కాచెల్లెళ్లు తల్లిదండ్రుల మాట వినకుండా ఇష్టారాజ్యంగా వ్యవరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. బుద్ధిగా చదువుకోకుండా ఇలాంటి పనులు ఏంటని ఆ అక్కాచెల్లెళ్లను తండ్రి మందలించగా.. మనస్థాపానికి గురైన ఇద్దరూ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.ఈరోజు మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో కిటికీ రెయిలింగ్కి చున్నీతో ఉరి వేసుకున్నారు!. విషయం తెలుసుకున్న బాలాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు. ఉరివేసుకొని మృతి చెందినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. ఈ అక్కాచెల్లెళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారా? ఎవరైనా హత్య చేసి ఉంటారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబ స్వస్థల నెల్లూరు జిల్లా ఉదయగిరిగా సమాచారం. -
మాదాపూర్లో మరో భారీ మోసం
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్లో మరో భారీ మోసం బయటపడింది. బై బ్యాక్ పేరుతో ఏవీ ఇన్ఫ్రా రూ.500 కోట్లు వసూలు చేసింది. పెట్టుబడి పెట్టిన వారికి డబుల్ అమౌంట్ ఇస్తామంటూ మోసానికి పాల్పడింది. నారాయణ ఖేడ్, యాదగిరిగుట్ట ప్రాంతాల్లో వెంచర్లు అంటూ మోసానికి తెరలేపింది. అమౌంట్ ఇవ్వకపోతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తామంటూ హామీ ఇచ్చింది.సుమారు 500 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 18 నెలలకు డబుల్ అమౌంట్ ఇస్తానని భారీగా వసూలు చేశారు. నెలలు గడుస్తున్నా.. డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు ప్రశ్నించడంతో మరో చోట ప్రాజెక్టు అంటూ మోసం చేశారు. దీంతో బాధితులు సైబరాబాద్ కమిషనర్ కార్యాలయం, మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
భార్య ఫోన్ మాట్లాడుతుందని.. భర్త దారుణం..
యశవంతపుర(కర్ణాటక): నిత్యం సెల్ఫోన్లో మాట్లాడుతోందని ఓ వ్యక్తి తన భార్యను హత మార్చాడు. ఈ ఘటన ఉడుపి జిల్లా బ్రహ్మావర తాలూకా హిలియాణ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో గణేశ్, రేఖ దంపతులు నివాసం ఉంటున్నారు. ఇటీవల రేఖకు కొత్త సెల్ఫోన్ కొనిచ్చాడు. దీంతో బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసి గంటల కొద్దీ మాట్లాడేది. ఎక్కువ సమయం ఫోన్లో మాట్లాడవద్దని భర్త హెచ్చరిస్తుండటంతో గొడవ జరిగేది. గురువారం మద్యం మత్తులో ఇంటికి వచ్చిన గణేష్ భార్యతో గొడవకు దిగి కత్తితో కడుపు భాగంలో పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఉడుపి జిల్లా బ్రహ్మావర తాలూకా శంకరనారాయణ పోలీసులు గణ్శ్ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ హరిరామ్ శంకర్ పరిశీలించారు. -
మంట కలిసిన మానవ సంబంధం
వరంగల్: ధన దాహం.. ఆస్తి పంపకాల్లో తేడాలతో రక్త సంబంధాలు మంట కలిసిపోతున్నాయి.. భూ వివాదంలో అన్నాదమ్ముళ్ల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ హత్యకు దారితీసింది. సొంత త మ్ముళ్లు (పినతల్లి కుమారులు).. అన్నయ్య వల్లపు కృష్ణ(43)ను దారుణంగా కత్తితో పొడిచి చంపారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా సీరోలు మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. మృతుడి బంధువులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సీరోలు మండల కేంద్రానికి చెందిన వల్లపు లింగయ్యకు ఇద్దరు భార్యలున్నారు. మొదటి భార్య మాణిక్యమ్మకు ఒక కొడుకు కృష్ణ, ముగ్గురు కుమార్తెలు ప్రమీల, రమణ, వినోద ఉన్నారు. రెండవ భార్య నర్సమ్మకు ఇద్దరు కొడుకులు నరేశ్, మహేశ్ ఉన్నారు.లింగయ్యకు గ్రామ ప్రధాన రహదారికి ఆనుకుని 16 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కొన్నేళ్ల క్రితం లింగయ్య తన ముగ్గురు కొడుకులకు, కూతురు రమణకు భూమి పట్టా చేయించాడు. కొన్నేళ్ల తర్వాత భూమి పంపకాలు చేశాడు. బిడ్డకు ఎందుకు పట్టా చేశావని రెండో భార్య కొడుకులు తండ్రితో గొడవ పడుతున్నారు. పలుమార్లు పంచాయితీలు, పోలీస్ స్టేషన్లో కేసుల దాకా వెళ్లింది. అయినా సమస్య పరి ష్కారం కాలేదు. ఈ క్రమంలో భూమి పంపకాల్లో రిజిస్ట్రేషన్ సర్వేనంబర్ ప్రకారం రెండో భార్య కొడుకుల్లో ఒకరు నరేశ్కు రోడ్డు వైపు వచ్చింది. కాగా, తండ్రి.. ముగ్గురు కుమారులకు రోడ్డువైపు సమానంగా ఉండేలా పంపకాలు చేశాడు. కానీ, నరేశ్ రిజిస్ట్రేషన్ ప్రకారం తనకు భాగం వచ్చిందంటూ తండ్రి చేసిన పంపకాన్ని ఒప్పుకోవడం లేదు. ఈ పంచాయితీ ముదిరిపాకాన పడింది. కృష్ణ తన భార్య సత్యవతి, కుమారుడు మిన్ను, కుమార్తెతో కలిసి హైదరాబాద్లో బతుకుతున్నాడు. ఈ నెల 17న (మంగళవారం) హైదరాబాద్ నుంచి సీరోలుకు వచ్చాడు. బుధవారం ఉదయం వ్యవసాయ భూమి వద్దకు వెళ్లాడు. ముందస్తు పథకం ప్రకారం తమ్ముళ్లు నరేశ్, మహేశ్, వారి భార్యలు, కాంపలి్లకి చెందిన నున్న వీరన్న(నరేశ్ బావమరిది) కలిసి వ్యవసాయ భూమి వద్ద కృష్ణతో గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న తండ్రి లింగయ్య అక్కడికి చేరుకున్నాడు. గొడవ ముదరడం, తండ్రి గొడవను ఆపే యత్నం చేశారు. అప్పటికే వెంట తెచ్చుకున్న కత్తితో నరేశ్ తన అన్న కృష్ణ కుడి మెడపై నరికాడు. ఆపే యత్నం చేస్తున్న తండ్రికి సైతం గాయాలయ్యాయి. కృష్ణ రక్తమడుగులో పడి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలియడంతో సీరోలు ఎస్సై నగేశ్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం, తండ్రి లింగయ్యను చికిత్స నిమిత్తం వెంటనే మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మరిపెడ సీఐ రాజ్కుమార్ సీరోలుకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాగా, నిందితుడు నరేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కొడుకు పుట్టిన రోజే తండ్రి మరణం..మృతుడు వల్లపు కృష్ణ కొడుకు మిన్ను పుట్టిన రోజు బుధవారం. సాయంత్రం వేడుకలు చేద్దామని అనుకున్న తరుణంలో ఈ హత్య జరగడంతో ఆ కుటుంబాన్ని కుంగదీసింది. -
ప్రియుడే కాలయముడు?
విశాఖపట్నం: భీమిలి కృష్ణా కాలనీకి చెందిన బంగారు కవిత మృతి కేసు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. భీమిలి బీచ్రోడ్డు సమీపంలోని జీడి తోటలో బంగారు కవిత మృతదేహం లభ్యమైన సంగతి తెలిసిందే. ఆమె ప్రియుడే కవితను కిరాతకంగా హత్య చేసి.. నెల రోజులుగా ఏమీ ఎరుగనట్టు నాటకమాడినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. క్రైమ్ సినిమా కథను తలపించేలా సాగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలివి.. కృష్ణా కాలనీకి చెందిన బంగారు కవితకు, భీమిలికి చెందిన పారిశుధ్య కార్మికుడు బొడ్డు రాజుతో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. అయితే గత కొంతకాలంగా వారిద్దరి మధ్య మనస్పర్థలు పెరిగి, తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కవితను అడ్డు తొలగించుకోవాలని రాజు నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం మాట్లాడదామనే నెపంతో గత నెలలో ఆమెను బీచ్రోడ్డు సమీపంలోని ఎర్రమట్టి దిబ్బల వద్దకు పిలిపించాడు. అక్కడికి వచ్చిన ఆమెపై రాయితో దాడి చేసి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని పక్కనే ఉన్న జీడి తోటలోకి తీసుకెళ్లి, ఒక చెట్టు కొమ్మకు వేలాడదీసి వచ్చేశాడు. ఆ తర్వాత రాజు ఏమీ తెలియనట్టు అందరితో కలిసి తిరుగుతూ, పోలీసులను సైతం తప్పుదోవ పట్టించాడు. కవిత కనబడటం లేదని ఆమె భర్త, కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అనుమానంతో రాజును పలుమార్లు విచారించారు. అయినప్పటికీ తనకు ఏమీ తెలియదని నమ్మబలుకుతూ దర్యాప్తును పక్కదారి పట్టించాడు. అయితే కవిత మృతదేహం లభ్యమైన తర్వాత పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. పక్కా ఆధారాలతో బొడ్డు రాజును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, అతడు చేసిన నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది. ఒక వైపు దారుణ హత్యకు పాల్పడి, మరో వైపు నెలరోజుల పాటు అందరినీ నమ్మించిన రాజు తీరుపై పోలీసులు, స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
హనీ ట్రాప్కు చిక్కి.. 38.73 లక్షలు పోగొట్టుకున్న రిటైర్ ప్రభుత్వ ఉద్యోగి
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని హనీ ట్రాప్ చేసి 38.73 లక్షలను సైబర్ నేరగాళ్లు కాజేశారు. ఫేస్ బుక్లో వృద్దుడికి మహిళ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించారు. తండ్రి తమను వదిలేసి వెళ్లిపోయాడని.. తల్లి టైలర్ అంటూ సదరు ఆ మహిళ పరిచయం చేసుకుంది. చాటింగ్ చేసేందుకు ఇంటర్నెట్ సదుపాయం ఏర్పాటు చేయాలని ఆ మహిళ.. కేబుల్ ఆపరేటర్ నంబర్ ఇచ్చింది. ఆమె ఇచ్చిన కేబుల్ ఆపరేటర్ నంబర్తో మాట్లాడిన బాధితుడు రూ.10 వేలు పంపించాడు.అనంతరం మహిళ నుంచి ఫేస్ బుక్లో స్పందన లేకపోవడంతో కేబుల్ ఆపరేటర్తో బాధితుడు చాటింగ్ చేశాడు. సదరు మహిళ జబ్బు పడిందని.. ఆస్పత్రిలో ఉందని చెప్పడంతో రూ. 10 లక్షలు ఆ వృద్ధుడు పంపించాడు. అనంతరం క్రెడిట్ కార్డు నుంచి మరో 2.65 లక్షలు చెల్లించాడు.కొన్ని రోజుల తర్వాత ఆ మహిళ దుబాయ్ వెళ్లిపోయిందని.. ఆమె కాంటాక్ట్స్ ఏమీ లేవని చెప్పిన కేబుల్ ఆపరేటర్.. తన తల్లి, సోదరి మీతో మాట్లాడాలనుకుంటున్నారంటూ కేబుల్ ఆపరేటర్ చెప్పగా.. సరేనన్న వృద్ధుడు.. కొద్ది రోజుల పాటు తల్లి, సోదరితో లైంగికంగా చాటింగ్ చేశాడు. తన తల్లి, మైనర్ చెల్లితో చాటింగ్ చేశావంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ కేబుల్ ఆపరేటర్ బెదిరించాడు. పోలీస్ కానిస్టేబుల్ పేరుతో మ్యాటర్ సెటిల్ చేసుకోవాలంటూ బాధితుడికి సందేశం పంపాడు.బాలిక చదువు, తల్లి డ్వాక్రా రుణం చెల్లింపు నిమిత్తం 12.5 లక్షలు చెల్లించిన బాధితుడు.. సెటిల్ చేసిన కానిస్టేబుల్, ఎస్ఐకి లక్ష సమర్పించుకున్నాడు. కొత్త ఎస్ఐ వచ్చానని.. కేసు అవ్వకుండా ఉండాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలంటూ మరో వ్యక్తి డిమాండ్ చేశాడు. దీంతో మరో ఏడు లక్షలను ఆ వృద్ధుడు పంపించాడు. ఇలా మొత్తం 38.73 లక్షలు ఆ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి దగ్గరి నుంచి సైబర్ నేరగాళ్లు దోపిడీ చేసేశారు. -
కసాయి కూతురు.. ప్రియుడితో కలిసి కన్నతండ్రినే కడతేర్చింది
సాక్షి, మహబూబాబాద్: కూతురి జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందో అని ఆ తండ్రి భయపడ్డాడు. ఆమె ప్రేమ వ్యవహారం తెలిసి ‘వద్దూ.. బిడ్డా’ అని సున్నితంగా మందలించాడు. ఆ మందలింపు ఆమెకు నచ్చలేదు. తండ్రిపైనే కోపం పెంచుకుంది. ప్రియుడిని రప్పించి ఆ తండ్రినే హతమార్చింది. మరిపెడ మండలం జండాల తండాలో జరిగిన ఈ దారుణం వివరాల్లోకి వెళ్తే.. దారావత్ కిషన్ తన కూతురు ఓ కుర్రాడితో ప్రేమ వ్యవహారం నడిపిస్తుందని తెలిసి మందలించాడు. దీంతో తన ప్రియుడిని రప్పించిన ఆమె.. తండ్రిని కట్టేసి చితకబాదింది. తీవ్ర గాయాలపాలైన కిషన్ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆ తండ్రి చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కూతురి ఘాతుకం పట్ల స్థానికులు రగిలిపోతున్నారు. అయితే ఘటనపై ఇంకా కేసు నమోదు కాలేదని సమాచారం. -
భర్తను కలవాలి, ఎవరికైనా మంత్రాలు తెలుసా?
అన్నానగర్(తమిళనాడు): నెల్లై జిల్లాలోని పనగుడి సమీపం పళవూర్ మదన్పిళ్లై ధర్మం గ్రామానికి చెందిన శివలింగదురై కుమార్తె కయల్విళి (28). ఆమె వివాహం చేసుకుని భర్త నుండి విడిపోయి తల్లిదండ్రులతో నివశిస్తోంది. గత ఏడాది అక్టోబర్ 5న ఆలయానికి వెళ్తున్నానని చెప్పి కనిపించకుండా పోయిన కయల్విళి అదృశ్యమైంది. ఫిర్యాదు ఆధారంగా పళవూరు పోలీసులు గత 8 నెలలుగా కేసు నమోదు చేసి వెతుకుతున్నారు. ఆ ప్రాంతంలోని నిఘా కెమెరాల రికార్డింగులను పరిశీలించినప్పుడు, కన్యాకుమారి జిల్లాలోని కొట్టారం ప్రాంతానికి చెందిన శివ స్వామి అనే పూజారి కయల్విళిని కారులో తీసుకెళ్లినట్లు వెల్లడైంది. దీని తరువాత అతన్ని అరెస్టు చేసి విచారించారు. అతను తన సహచరులతో కలిసి కయల్విళి మెడలో ఉన్న 7 సవర్ల బంగారు చైన్ కోసం ఆమెను గొంతు నులిమి హత్య చేసి, 80 అడుగుల కోయ మహాదేవి కాలువలోకి విసిరేసినట్లు దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలువడ్డాయి. కాలువ నుండి కయల్విళి అస్థిపంజరాన్ని స్వా«దీనం చేసుకున్నారు. ఖైదీలను విచారించగా దిగ్భ్రాంతికరమైన సమాచారం వెల్లడైంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన ఈమె 2022లో బెంగళూరులో పనిచేస్తున్న యువకుడిని వివాహం చేసుకుంది. ఆమె ఫిబ్రవరి 2024లో తన భర్త నుండి విడిపోయింది. కయల్విళి తన భర్తతో తిరిగి కలవాలని ప్రార్థించడానికి అనేక దేవాలయాలను సందర్శిస్తోంది. ఈ పరిస్థితిలో ఆమె ఫేస్బుక్లో తన భర్తతో కలపటానికి మంత్రం బాగా తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని పోస్ట్ చేసింది. మాయాండి రాజా మొదట ఈ విషయంపై కయల్విళిని సంప్రదించాడు. వారు ఆమెను మంత్రవిద్య చేసే శివస్వామి వద్దకు తీసుకెళ్లి, ఆమె నుండి డబ్బు వసూలు చేయాలని ప్లాన్ చేశారు. దీని ప్రకారం శివస్వామి, మాయాండి వీరు కయల్విళిని నుంచి అనేక వాయిదాలలో మొత్తం రూ.5 లక్షలు చెల్లించాడు. ఆమెను మళ్లీ ఆమె భర్తతో కలిసి జీవించనిస్తానని చెప్పాడు. ఒకానొక సమయంలో, వారు మోసం చేస్తున్నారని తెలిసిన కయల్విళి వారిని తన డబ్బు తిరిగి ఇవ్వమని కోరింది. మాయాండి, శివస్వామి, అతని కుమారుడు శివ, సంఘటన జరిగిన రోజున కయల్విళికి ఫోన్ చేసి, డబ్బు ఇస్తామని హామీ ఇచ్చారు. తరువాత మాయాండి రాజా, అతని సోదరి కుమారుడు, వీరవనల్లూరుకు చెందిన కన్నన్, శివనేశ్వరి సహా నలుగురు హత్య చేశారు. తరువాత ఆమె ధరించిన 7 తులాల నగలను తీసుకొని, కయల్విళి మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి, చేరన్మాదేవి పక్కన ఉన్న గంగానకుళం సమీపంలోని 80 అడుగుల కాలువలో విసిరేసి, సాధారణ జీవితాన్ని గడిపారని తేలింది. ఆ తర్వాత పోలీసులు అరెస్టు చేసిన నలుగురిని కోర్టులో హాజరుపరిచారు. తదనంతరం, శివనేశ్వరిని కొక్కిరాకుళం మహిళా జైలుకు, మిగిలిన ముగ్గురిని పాలైయంగోటై సెంట్రల్ జైలుకు తరలించారు. -
అమ్మ లేదని.. ఇక తిరిగి రాదని తెలియక..
మహబూబాబాద్ రూరల్ : మేకను కొనేందుకు వెళ్తున్న క్రమంలో ఓ మహిళ మృత్యుఒడికి చేరింది. బస్సును ఆటో ఢీకొన్న ఘటనలో దుర్మరణం చెందింది. ఈ ప్రమాదం సోమవారం మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి బేతోలు శివారు భజన తండా సమీపంలో చోటుచేసుకుంది.. పోలీసులు, బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. జిల్లాలోని బయ్యారం మండలం జగత్ రావు పేట జీపీ పరిధిలోని బోటి తండాకు చెందిన మాలోత్ సురేశ్, అతడి అన్న గణేశ్, వదిన అమలాదేవి (27), వారి ఇద్దరు కుమారులు నాలుగేళ్ల గౌతమ్, ఏడాదిన్నర వయసుగల గగన్, అక్కాబావ బానోత్ రంగ్య, మంజుల ఓ ఆటోలో కురవి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆటో మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి బేతోలు శివారు భజన తండా దాటుతుండగా ముందునుంచి వెళ్తున్న ఆర్టీసీ బస్సు సడన్ బ్రేక్ వేయడంతో ఆ వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో అమలాదేవికి తీవ్ర, మిగతా వారందరికీ స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న 108 వాహనం క్షతగాత్రులను ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అమలాదేవిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందిందని ధ్రువీకరించారు. కాగా, మంగళవారం తమ ఇంటి వద్ద ఎల్లమ్మ పండుగ చేసుకోనున్న నేపథ్యంలో కురవిలోని అంగడిలో మేకను కొనుగోలు చేయడానికి వారంతా ఆటోలో వెళ్తున్నట్లు బంధువులు పేర్కొన్నారు. కుమారులు గౌతం, గగన్.. తల్లి అమలాదేవి కనిపించకపోవడంతో వెక్కివెక్కి ఏడుస్తుండగా వారిని ఆపడం ఎవరితరం కాలేదు. ప్రమాద సమాచారం తెలుసుకున్న కురవి ఎస్సై గండ్రాతి సతీశ్, సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. -
పెళ్లయిన నెల రోజులకే మృత్యు ఒడికి..
గాజువాక: వివాహమైన నెల రోజులకే ఒక జంట మృత్యు ఒడికి చేరింది. కాళ్ల పారాణి ఆరకముందే విధి ప్రమాదరూపంలో కబళించింది. నగరంలో సరదాగా షికారు చేసి వద్దామనుకొని బయల్దేరిన కొత్త జంట రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. గాజువాక ట్రాఫిక్ పోలీసులు అందించిన వివరాలివి..కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన జొన్నాడ సాయి(27), పెదగంట్యాడ మండలం గంగవరం గ్రామానికి చెందిన శాలిని (25) గాజువాకలోని యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్లో ల్యాబ్ టెక్నీషియన్లుగా పని చేస్తున్నారు. వీరిద్దరూ ప్రేమించుకొని నెల రోజుల కిందట పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం శ్రీహరిపురంలో ఒక అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం ల్యాబ్కు సెలవు కావడంతో షికారు కోసం నగరంలోకి వెళ్లేందుకు ద్విచక్రవాహనంపై బయల్దేరారు. ములగాడ మీదుగా పోర్టు రోడ్లోని మారుతీ సర్కిల్ వద్ద వెనుకనే వస్తున్న ఒక ట్రాలర్ వారిని ఢీకొని ఈడ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో సాయి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. తీవ్ర గాయాలపాలైన శాలినిని షీలానగర్లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స ప్రారంభించే సమయానికి మృతి చెందిందని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు సీఐ కోటేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఇదే రోడ్డులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయిల్ ట్యాంకర్ కింద పడి ఇద్దరు నేవీ వైద్యులు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.. 24 గంటల వ్యవధిలో నలుగురు మృత్యువాత పడటం.. వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. -
ఇంటర్లో ఫెయిలై.. ముగ్గురి ఆత్మహత్య
నస్పూర్/అక్కన్నపేట(హుస్నాబాద్)/జహీరాబాద్ టౌన్: ఇంటర్లో ఫెయిల్ కావడంతో సోమవారం ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంచిర్యాల, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్లోని జయశంకర్ కాలనీలో నివాసం ఉండే కోటేజీ కృష్ణార్జునరావు, ప్రవీణ దంపతుల చిన్న కూతురు అక్షయ సెకండియర్ గణితం ఫెయిల్ కాగా సప్లిమెంటరీ పరీక్ష రాసింది. సోమవారం వెలువడిన ఫలితాల్లోనూ పాస్ కాకపోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో అక్షయ ఫ్యాన్కు ఉరేసుకుంది. తండ్రి గమనించి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందింది. మరో ఘటనలో.. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం దాస్తండా గ్రామానికి చెందిన గుగులోతు కవిత–సూర్యనాయక్ దంపతుల రెండవ కుమార్తె హారిక (17) హనుమకొండ జిల్లా వంగర గురుకులంలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. బాటనీ సబ్జెక్ట్లో ఫెయిలైంది. తిరిగి సప్లిమెంటరీ రాసినా పాస్ కాకపోవడంతో సాయంత్రం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మరో ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. రాయికోడ్ మండలం మహబత్పూర్ గ్రామానికి చెందిన ముదిరాజ్ కృష్ణ కుమారుడు వెంకటరమణ(18)ఆర్ఎల్ఆర్ కళాశాలలో ఇంటర్ చదివాడు. సెకండ్ ఇయర్లో ఫెయిల్ కావడంతో సప్లిమెంటరీ పరీక్షలు రాసాడు. సోమవారం విడుదలైన ఫలితాల్లోనూ ఒక సబెక్టులో ఫెయిల్ కావడంతో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. -
ఛాతికి గురిపెట్టి.. కటకటాల్లోకి రివాల్వర్ రాణి
డబ్బు ఉందనే పొగరు.. అధికారం ఉందనే అహంకారంతో కిందిస్థాయి సిబ్బందితో కొందరు వ్యవహరించే తీరు తీవ్ర విమర్శలకు తావిస్తుంటుంది. అలాంటిదే ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన. కారు దిగమని మంచిమాటగా చెప్పినందుకు.. పెట్రోల్ బంకు సిబ్బందిపైనే ఓ కుటుంబం దౌర్జన్యానికి దిగింది. ఆ ఇంటి బిడ్డ అయితే ఏకంగా తుపాకీతో సిబ్బందినే చంపుతానంటూ బెదిరించింది. వివరాల్లోకి వెళ్తే..ఉత్తర ప్రదేశ్ హర్దోయ్లో(Hardoi Viral Video) జరిగిన ఘటన తాలుకా వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇషాన్ ఖాన్ అనే వ్యక్తి తన భార్య, బిడ్డతో కలిసి కారులో బయటకు వచ్చాడు. బిల్గ్రామ్ ఏరియాలోని ఓ సీఎన్జీ పెట్రోల్ పంప్ దగ్గర వాళ్ల కారు ఆగింది. అయితే.. గ్యాస్ నింపుతున్న టైంలో కారు దిగాలంటూ ఇషాన్ను మర్యాదపూర్వకంగా అక్కడి సిబ్బంది కోరారు. దీంతో.. ఊగిపోతూ నన్నే కారు దిగమంటావా? అంటూ దుర్భాషలాడుతూ సిబ్బందితో గొడవకు దిగాడు ఇషాన్. ఈలోపు.. అతని భార్య, కూతురు కూడా బయటకు వచ్చి ఆ గొడవలో చేరారు. కూతురు సురుష్ఖాన్(అరిబా) కారు వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి అందులో ఉన్న రివాల్వర్ను బయటకు తీసుకొచ్చింది. నేరుగా అక్కడి సిబ్బంది ఛాతీకి గురిపెట్టి ‘‘కాల్చేయమంటావా?’’ అంటూ బెదిరింపులకు దిగింది. ఈలోపు.. అక్కడున్న జనం వాళ్లను దూరం తీసుకెళ్లి సర్దిచెప్పి పంపించి వేశారు. అయితే అక్కుడున్న సీసీ ఫుటేజీలో ఆ వీడియో అంతా రికార్డయ్యింది.'इतनी गोली मारूंगी की परिवार वाले...' यूपी में 'रिवॉल्वर रानी' की दबंगई का वीडियो वायरलउत्तर प्रदेश के हरदोई जिले से एक सनसनीखेज़ मामला सामने आया है, जहां सीएनजी पंप पर कहासुनी के बाद एक लड़की ने कर्मचारी पर लाइसेंसी रिवॉल्वर तान दी. घटना उस वक्त हुई जब एहसान ख़ान नाम का शख्स… pic.twitter.com/tVNOM5IfJb— NDTV India (@ndtvindia) June 16, 2025ఘటనపై బాధితుడు రజనీష్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ భార్యభర్తలతో కూడా ఆ రివాల్వర్ రాణిని కూడా అరెస్ట్ చేశారు. రివాల్వర్తో పాటు 25 క్యాట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఆ రివాల్వర్ ఇషాన్ లైసెన్స్డ్ ఆయుధంగా పోలీసులు నిర్ధారించుకున్నారు. అయితే దురుసుగా ర్తించడంతో పాటు చంపుతామని బెదిరించినందుకుగానూ ఆ కుటుంబంపై మొత్తానికి కేసు నమోదయ్యింది. #HardoiPoliceथाना बिलग्राम पुलिस द्वारा मु0अ0सं0 268/25 धारा 115(2)/352/351(3) बीएनएस व धारा 30 आर्म्स एक्ट से संबंधित कृत कार्यवाही के संबंध में-#UPPolice pic.twitter.com/hsYiegkb1v— Hardoi Police (@hardoipolice) June 16, 2025 -
ఆస్తినంతా ప్రియురాలికి ఇచ్చాడు
కర్ణాటక: వారం రోజుల క్రితం జిల్లా కేంద్రం క్రిష్ణగిరి సమీపంలో నిద్రిస్తున్న భర్తపై పెట్రోలు పోసి నిప్పంటించి హత్య చేసిన కేసులో భార్య కారణాలను వెల్లడించింది. తిమ్మాపురం గ్రామానికి చెందిన కూలికార్మికుడు రంగస్వామి (47) నిద్రపోతుండగా భార్య కవిత (44) పెట్రోలు పోసి తగలబెట్టడంతో చనిపోయాడు.పోలీసులు ఆమెను అరెస్టు చేసి విచారించారు. తమకు పెళ్లి జరిగి 22 ఏళ్లు అయ్యిందని, ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారని, తమకు ఆస్తి, డబ్బు, నగలు అన్నీ ఉన్నాయని, కుటుంబంతో బాగానే ఉన్నామని తెలిపింది.అయితే భర్త కూలి పని చేసే చోట మరో మహిళ మంజులతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిపింది. ఇంట్లో ఉన్న నగలు మంజులకు అందజేశాడు. ఆస్తిని విక్రయించి ఆమెకు ముట్టజెప్పాడని తెలిపింది. రోజూ తాగి వచ్చి అందంగా లేవని నన్ను దూషించేవాడని, దీంతో హత్య చేశానని చెప్పింది. కాగా తండ్రి మరణించి, తల్లి జైలుకెళ్లి ముగ్గురు పిల్లలు బోరుమని విలపించారు. -
చిన్న కాగితంతో పెద్ద కుట్ర భగ్నం
ఎలాంటి నిఘా హెచ్చరికలు లేవు, ఎలాంటి అనుమానాస్పద ఉదంతాలు జరగలేదు; పోలీసు, ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రయత్నించలేదు. అయినా 2004 ఆగస్టులో భారీ కుట్రను సిటీ టాస్క్ఫోర్స్ భగ్నం చేయగలిగింది. సికింద్రాబాద్లోని గణేశ్ దేవాలయం పేల్చివేతతో పాటు నగరాన్ని సందర్శిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ టూరిస్టుల హత్యకు ఉగ్రవాదులు పన్నిన పథకం వెలుగులోకి వచ్చింది. ఓ వాహనచోరుడి వద్ద యాదృచ్ఛికంగా లభించిన చిన్న కాగితం ఈ పెద్ద కుట్రను బట్టబయలు చేసింది.నగర టాస్క్ఫోర్స్ విభాగం నిత్యం అసాంఘికశక్తులపై నిఘా ఉంచి, నేరగాళ్లను పట్టుకోవడానికి పని చేస్తుంటుంది. భారీ నేరాల కోసమే కాదు, కొన్ని సందర్భాల్లో చిన్నా చితకా కేసుల కోసమూ ఈ టీమ్స్ పరుగులు పెడుతుంటాయి. 2004 ఆగస్టులో సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు– అది నెలలో ఆఖరి వారం కావటంతో ఏదో ఒక ముఠా లేదా నేరగాడిని పట్టుకుని ఉన్నతాధికారులకు చూపించడానికి కసరత్తులు చేస్తున్నారు. అప్పుడే ఓ వేగు ద్వారా అందిన చిన్న సమాచారం అధికారుల్లో కోటి ఆశలు రేపింది. ఓ వాహనచోరుడి సంబంధించిన ఆ సమాచారం ఆధారంగా టీమ్ వర్కౌట్ చేయడం మొదలెట్టింది. నల్లగొండ జిల్లా భువనగిరి నుంచి వచ్చి పహాడీషరీఫ్లోని హఫీజ్బాబానగర్లో మెకానిక్గా స్థిరపడిన సయ్యద్ అబ్దుల్ ఖదీర్కు పలు వాహన చోరీలతో ప్రమేయం ఉందన్నది ఆ వేగు అందించిన సమాచారం. దీంతో టాస్క్ఫోర్స్ అతడి కోసం ముమ్మరంగా గాలించి అదుపులోకి తీసుకుంది. అప్పటి వరకు తాను చేసిన వాహనచోరీలను అతడు అంగీకరించాడు. వాటిలో కొన్నింటిని రికవరీ చేసి నిందితుడిని అరెస్టు చేయాలని టాస్క్ఫోర్స్ పోలీసులు నిర్ణయించుకున్నారు. ఈ తతంగంలో భాగంగా చోరీ వాహనాలతో పాటు నిందితుడి వద్ద లభించిన వస్తువులను సీజ్ చేయాల్సి ఉంటుంది. దీని కోసం ఖదీర్ను తనిఖీ చేసిన అధికారులు అతడి జేబుల్లో ఉన్న కాగితాలను సైతం తీసి పరిశీలించారు. అన్నీ మామూలుగానే ఉన్నా, ఓ చిన్న స్లిప్లోని వివరాలు మాత్రం అనుమానాస్పదంగా కనిపించాయి. అతడి వద్ద లభించిన స్లిప్లో కశ్మీర్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలకు చెందిన నంబర్లు ఉండటమే పోలీసుల అనుమానానికి కారణం. దీంతో లోతుగా విచారించగా, అతడి స్నేహితుడైన ఒమర్ ఫారూఖ్ షరీఫ్ (స్వస్థలం నల్లగొండ జిల్లా చిట్యాల), లంగర్హౌస్లకు చెందిన అబ్దుల్ అజీజ్ అలియాస్ గిడ్డా అజీజ్ పేర్లు వెలుగులోకి రావడంతో పాటు వారిద్దరూ బండ్లగూడలోని గౌస్నగర్లో ఓ ఇంట్లో డెన్ ఏర్పాటు చేసుకున్నట్లు బయటపెట్టాడు. తాను చోరీ చేసిన వాహనాల్లో కొన్ని వారికి ఇచ్చానని, ఆ నంబర్లు వారికి సంబంధించినవే అని అంగీకరించాడు. ఈ వివరాలు వెలుగులోకి రావడంతో విషయం ‘పెద్దదని’ అనుమానించిన టాస్క్ఫోర్స్ బృందాలు హుటాహుటిన గౌస్నగర్లోని డెన్పై దాడి చేశాయి. అక్కడ ఫారూఖ్ చిక్కగా, అజీజ్ తప్పించుకున్నాడు. అప్పటికే అజీజ్ ఆయుధ చట్టం కింద నమోదైన కేసులో అరెస్టై ఉండటం, ఇప్పుడు పారిపోవడంతో పోలీసులు ఇది కచ్చితంగా ‘పెద్ద విషయం’ అని నిర్ధారించుకున్నారు. ఖదీర్, ఫారూఖ్లను కలిపి విచారించడంతో భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది. సిటీలో ఘర్షణలు రెచ్చగొట్టాలని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ‘లష్కరే తోయిబా’ పథకం వేసినట్లు బయటపడింది. గణేశ్ నిమజ్జనం రోజు సికింద్రాబాద్లోని గణేశ్ దేవాలయం పేల్చివేతకు కుట్ర పన్నినట్లు బయటపడింది. దీనికోసం ‘లష్కరే తోయిబా’ నగరానికి చెందిన తెహరీక్ తెహఫూజ్ షరియా ఓ ఇస్లామీ (టీటీఎస్ఐ) నేత మౌలానా నసీరుద్దీన్ (2020లో చనిపోయాడు), గులాం యజ్దానీలతో (2006లో ఢిల్లీ ఎన్కౌంటర్లో హతుడయ్యాడు) పాటు మరో 12 మందిని రంగంలోకి దింపి పేలుడు పదార్థాలు అందించింది. వినాయక నిమజ్జనం రోజు ఈ గ్యాంగ్కు చెందిన కొందరు ఇతర మతస్థులుగా వేషం వేసుకుని గణేశ్ దేవాలయంలోకి ప్రవేశించి బాంబు పెట్టాలని పథకం సిద్ధం చేసుకున్నారు. గులాం యజ్దానీ ఆదేశాల మేరకు ఈ పేలుడు హడావుడి సద్దుమణగక ముందే సిటీలో ఉన్న అమెరికా, ఇజ్రాయెల్ టూరిస్టులనూ చంపాలని భావించారు. అందుకు అవసరమైన పేలుడు పదార్ధాలు, వాహనాలు సిద్ధం చేసుకున్నారు. ఈ విషయాలు వెలుగులోకి రావడంతో వరుస దాడులు చేసిన పోలీసులు 2004 ఆగస్టు 28న ఎనిమిది మందిని అరెస్టు చేసి, వారి నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు, పలు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ కొందరు నిందితులు పరారీలోనే ఉన్నారు. ఈ కేసు తొలుత నగర నేర పరిశోధన విభాగంలో నమోదైంది. దీనికి సంబంధించి అప్పట్లో టాస్క్ఫోర్స్ విభాగం అత్యంత వివాదాస్పదమైంది. అమాయకులను కేసుల్లో ఇరికించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. అన్ని కోణాల్లోనూ లోతుగా ఆరా తీసిన సీఐడీ పోలీసులు అరెస్టుల్లో ఎలాంటి కుట్ర లేదని తేల్చారు. ఆపై కేసు సీఐడీకే బదిలీ అయింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో తుది విచారణలో ఉంది. భవానీనగర్కు చెందిన గిడ్డా అజీజ్ తండ్రి మెహతబ్ అలీ హెడ్–కానిస్టేబుల్గా పని చేశారు. ఈ కేసులో అరెస్టు నుంచి గిడ్డా అజీజ్ తృటిలో తప్పించుకున్నాడు. అప్పటికే తన వద్ద ఉన్న బోస్నియా పాస్పోర్ట్ వినియోగించి అడ్డదారిలో సౌదీ పారిపోయి అక్కడే తలదాచుకున్నాడు. అజీజ్ది నకిలీ పాస్పోర్ట్ అని గుర్తించిన సౌదీ అధికారులు 2007లో అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న హైదరాబాద్ పోలీసులు రెండు కేసుల్లో వాంటెడ్గా ఉన్న అజీజ్పై 2008లో ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించారు. సౌదీలో నకిలీ పాస్పోర్ట్ కేసు విచారణ, శిక్ష పూర్తికావడంతో అక్కడి అధికారులు 2016లో భారత్కు బలవంతంగా తిప్పి పంపించారు. 2001 నాటి విధ్వంసాల కుట్ర కేసులో అజీజ్కు 2022లో పదహారేళ్ల శిక్ష పడటంతో జైలులో ఉన్నాడు. -
భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య
కర్ణాటక: భర్త వివాహేతర సంబంధాన్ని భరించలేని భార్య నిద్రిస్తున్న సమయంలో కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటనలో భర్త ఆస్పత్రిలో చనిపోయాడు. కావేరిపట్టణం వద్ద ఈ సంఘ టన జరిగింది. వివరాల మేరకు క్రిష్ణగిరి జిల్లా కావేరిపట్టణం సమీపంలోని తిమ్మాపురం ప్రాం తానికి చెందిన కూలికార్మికుడు రంగస్వామి (47), అతని భార్య కవిత(44). ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కొడుకు సూర్య (23) కొడుకు న్నాడు.రంగస్వామి తాగుడుకు అలవాటు పడ డంతో పాటు గత మూడేళ్లుగా ధర్మపురి జిల్లా కారిమంగలం ప్రాంతానికి చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ వచ్చాడు. దీం తో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. 9వ తేదీన రాత్రి మిద్దెపై నిద్రిస్తున్న రంగస్వా మిపై భార్య పెట్రోలు పోసి నిప్పంటించింది. తీవ్ర గాయాలేర్పడిన అతన్ని కొడుకు సూర్య చికిత్స కోసం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకె ళ్లాడు. ఆస్పత్రిలో చికిత్స ఫలితంలేక బుధవారం రాత్రి మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. -
గృహిణి ఆత్మహత్య
హైదరాబాద్: సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రియాంక కాలనీలో నివాసం ఉంటున్న రూప అనే గృహిణి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన తల్లి, సోదరి వేధింపులే తన చావుకు కారణమని సూసైడ్ నోట్ రాసింది. సీఐ భరత్ కుమార్ కథనం ప్రకారం..మహబూబాబాద్కు చెందిన జంగారెడ్డి, సత్తమ్మల చిన్నకుమార్తె రూప వివాహం 2014లో గుండు జలంధర్ రెడ్డితో జరిగింది. వీరికి సిరిరెడ్డి, వేదాన్ష్ రెడ్డి సంతానం. శుక్రవారం ఉదయం 7.30 గంటల సమయంలో రూప సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని ఉండగా కూతురు సిరిరెడ్డి గమనించి తండ్రికి ఫోన్ చేసింది. దీంతో ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా అప్పటికే చనిపోయింది. అక్కడ నాలుగు పేజీల సూసైడ్ నోట్ లభించింది. అందులో తన తండ్రి జంగారెడ్డి రెండునెలల క్రితం చనిపోగా..తల్లి సత్తమ్మ, అక్క చంద్రకళలు తనకు కట్నం కింద రాసిచ్చిన రెండెకరాల భూమిని తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేస్తూ వేధిస్తున్నారని, అందువల్లనే తాను చనిపోతున్నట్లు లేఖలో పేర్కొంది. తనకు రాసిచ్చిన రెండెకరాల భూమి తన పిల్లలకే చెందాలని రూప పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
విశాఖలో దారుణం.. భార్యను చంపి భర్త ఆత్మహత్య
సాక్షి, విశాఖపట్నం: నగరంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్యను హతమార్చి.. భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యను డంబుల్తో కొట్టి చంపేశాడు.. భార్యను హతమార్చిన అనంతరం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కంచర పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివాహేతర సంబంధమే కారణమమని పోలీసులు అంటున్నారు.తమ్ముడి చేతిలో అన్న హతంమరో ఘటనలో తమ్ముడి చేతిలో అన్న హతమయ్యాడు. ఈ ఘటన తెలంగాణలోని జగిత్యాలా జిల్లా పెగడపల్లి మండలం ఐతుపల్లిలో జరిగింది. కుటుంబ కలహాలతో తాగిన మైకంలో అన్న కూన నర్సయ్యను కట్టెతో తలపై తమ్ముడు కూన రాములు విచక్షణారహితంగా కొట్టి చంపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
కర్ణాటకలో APSRTC బస్సుకి ప్రమాదం.. చిత్తూరువాసుల మృతి
బెంగళూరు: కర్ణాటకలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఏపీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు, ఓ లారీ ఢీ కొట్టడంతో నలుగురు స్పాట్లోనే మరణించారు. 16 మందికి గాయాలు కాగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు చిత్తూరు వాసులుగా తెలుస్తోంది.తిరుపతి నుంచి ఏపీ 03 జెడ్ 0190 నెంబర్ బస్సు బెంగళూరుకు వెళ్తోంది. కోలారు జిల్లా హోసాకోట్లోని పుట్టిపురా గేట్ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. క్షతగాత్రులను స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల వివరాలుకేశవరెడ్డి(44)తులసి(21)ప్రణతి(5)ఏడాదిన్నర వయసున్న చిన్నారి -
నా చావుకు.. నా భార్యే కారణం..
సంగారెడ్డి క్రైమ్: భార్య వేధింపులు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రమేష్ వివరాల ప్రకారం..పుల్కల్ మండలానికి చెందిన కప్పరితల మల్లేశం, లక్ష్మమ్మ దంపతుల రెండో కుమారుడు నవీన్ కుమార్(29), తోషిబా కంపెనీలో పని చేస్తున్నాడు. మూడేళ్ల క్రితం దుద్దేల గ్రామం వట్పల్లి మండలానికి చెందిన స్వరూప రాణితో వివాహం జరిగింది. తర్వాత దంపతులు సంగారెడ్డి పట్టణంలోని గణేశ్ నగర్లో నివాసం ఉంటున్నారు. వీరికి పిల్లలు లేరు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పెద్దల సమక్షంలో పలుసార్లు పంచాయితీ పెట్టి దంపతులకు నచ్చజెప్పారు. ఇటీవల మళ్లీ దంపతుల మధ్య గొడవలు జరగడంతో ఈ నెల 6న స్వరూప రాణి పుట్టింటికి వెళ్లింది. తర్వాత ఆమె పలుమార్లు నవీన్కు ఫోన్ చేస్తే ఎత్తలేదు. దీంతో 10వ తేదీన సాయంత్రం 6 గంటల సమయంలో మామకు ఫోన్లో సమాచారం అందించింది. వెంటనే కుటుంబ సభ్యులు నవీన్ రూమ్కు వెళ్లారు. తలుపులు తీయకపోవడంతో పగులగొట్టి చూడగా గదిలో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని ఉన్నాడు. వెంటనే సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు నిర్ధారించి మృతి చెందినట్లు తెలిపారు. సూసైడ్ నోట్లో తన మరణానికి కారణం భార్య మానసిక వేధింపులు, ఆమె చేసిన అప్పులే కారణం అని రాశాడు. పోలీసులు సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. మృతుడి తండ్రి మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వరలక్ష్మి నీకు ఇదేం బుద్ధి..!
మనోహరాబాద్(తూప్రాన్): వృద్ధురాలికి మాయమాటలు చెప్పి బైక్పై ఎక్కించుకుని ఆభరణాలతో ఉడాయించిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం మనోహరాబాద్ పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశంలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్ వివరాలు వెల్లడించారు. తూప్రాన్ మండలం కొప్పులపల్లి గ్రామానికి చెందిన బాదనపురం పెంటయ్య(30) మండలంలోని వట్టూర్ గ్రామానికి చెందిన వరలక్ష్మి(30)తో సహజీవనం చేస్తున్నాడు. కాగా నిందితుడికి భార్యాపిల్లలు ఉన్నారు. నిందితుడు ఆన్లైన్ గేమ్స్కు బానిసై ఈ క్రమంలో లోన్లు సైతం తీసుకున్నాడు. అప్పులు ఎక్కువ అవ్వడంతో తీర్చేందుకు చోరీలు చేస్తున్నాడు. గత సంవత్సరం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ పల్సర్ బైక్ను చోరీ చేసి ఆంధ్రాకు చెందిన నంబర్ ప్లేట్ అమర్చాడు.ఈ నెల 7న సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మన్నె రామవ్వ పాములపర్తికి వెళ్లేందుకు గజ్వేల్ బస్టాండులో ఉంది. నిందితులు వరలక్ష్మి వృద్ధురాలికి మాయమాటలు చెప్పి పెంటయ్యతో కలిసి బైక్ౖపై తీసుకొని పర్కిబండ సమీపంలోని ఓ గుడిలోకి వెళ్లి మద్యం తాగారు. కాగా వృద్ధురాలు మత్తులోకి జారుకోగానే ఆమె ఒంటిపై ఉన్న తులం బంగారు నల్లపూసల తాడు, చెవికమ్మలు, 50 తులాల వెండి కడియాలు చోరీ చేశారు. వృద్ధురాలు అరవగా చంపుతామని బెదిరించి పరారయ్యారు. వెంటనే వృద్ధురాలు మనోహరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు తూప్రాన్ సీఐ రంగాకృష్ణ, ఎస్ఐ సుభాష్గౌడ్ దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం దండుపల్లి వద్ద వాహనాల తనిఖీలో నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసును ఛేదించిన సీఐ, ఎస్ఐ, సిబ్బంది గోవర్ధన్రావు, రాధాకృష్ణ, భిక్షపతిలను ఎస్పీ అభినందించినట్లు తెలిపారు. అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ పేర్కొన్నారు. -
అత్త సెల్ఫోన్ అమ్మేసి, ఆపై..
మేడ్చల్−మల్కాజిగిరి జిల్లా: ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఘట్కేసర్లో బుజ్జి అనే మహిళ నివాసముంటోంది. బుజ్జికి బాబురావు అనే అల్లుడు ఉన్నాడు. ఈ క్రమంలో అత్త వద్ద ఉన్న మొబైల్ను బాబు రావు తీసుకున్నాడు. డబ్బుల కోసమో మరే ఇతర కారణమో తెలియదు కానీ అత్త మొబైల్ను బాబు రావు అమ్మేశాడు. ఆ తరువాత మొబైల్ ఇవ్వాలని కోరగా.. అమ్మేసినట్లు చెప్పాడు బాబురావు. దీంతో మొబైల్ అమ్మడంపై అల్లుడిని నిలదీసింది అత్త బుజ్జి. మొబైల్ను అమ్మాల్సిన అవసరం ఏంటంటూ ప్రశ్నించింది. ఈ విషయంపై అల్లుడు బాబురావు, అత్త బుజ్జి మధ్య గొడవ తలెత్తింది. ఈ విషయాన్ని బాబురావు సీరియస్గా తీసుకున్నాడు. మొబైల్ ఫోన్ కోసం అవమానించారంటూ కోపంతో రగిలిపోయాడు. క్షణికావేశంలో అత్త బుజ్జి గొంతు నులిమాడు. అపస్మారకస్థితిలోకి వెళ్లిన బుజ్జు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. బుజ్జి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన ఘట్కేసర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మొబైల్ ఫోన్ కోసం అత్తను చంపేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. -
భార్యను రివాల్వర్తో కాల్చి చంపిన భర్త..!
కోరుట్ల(కరీంనగర్): రెండ్రోజుల క్రితం ముంబయిలోని వర్లిలో కుటుంబ కలహాలతో భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటనతో కోరుట్ల మండలం అయిలాపూర్లో తీవ్ర విషాదం నెలకొంది. మంగళవారం దంపతుల అంత్యక్రియలు అయిలాపూర్లో ఒకే చితిపై నిర్వహించారు. కోరుట్ల మండలం అయిలాపూర్కు చెందిన నాంపల్లి రాజమనోహార్(62), లత(51) దంపతులు కొన్నేళ్లుగా కొడుకు– కోడలుతో కలిసి ముంబయిలోని వర్లిలో నివాసముంటున్నారు. కుటుంబంలో చిన్నపాటి కలహాలు నెలకొనడంతో ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో రాజమోహన్(62) తన వద్ద ఉన్న కంట్రీమేడ్ రివాల్వర్తో భార్య లతను కాల్చిచంపాడు. అనంతరం రాజమోహన్ తనకు తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వర్లి పోలీసులు ఈ సంఘటనదపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా, పోస్టుమార్టం అనంతరం దంపతులు రాజమోహన్–లత మృతదేహాలు మంగళవారం స్వగ్రామం అయిలాపూర్కు తీసుకువచ్చారు. దంపతుల మృతదేహాలను ఒకే చోట చితిపై ఉంచి అంత్యక్రియలు పూర్తి చేసిన వైనం స్థానికులను కంటతడి పెట్టించింది. -
భర్త అంత్యక్రియల్లో ప్రియుడు.. ప్రియురాలి తండ్రిని ఓదారుస్తూ..
-
భార్యతో విసుగు చెంది భర్త ఆత్మహత్య
బనశంకరి(కర్ణాటక): పదే పదే ఇల్లు వదిలిపెట్టి వెళుతున్న భార్య ప్రవర్తనతో విరక్తి చెందిన భర్త ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన బెంగళూరులో కేపీ అగ్రహార పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. గోవర్ధన్, ప్రియా దంపతులకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. ప్రియా అప్పుడప్పుడు ఇళ్లు వదిలిపెట్టి వెళ్లేది. నెల క్రితం కూడా ఎక్కడికో వెళ్లిపోయింది. గోవర్ధన్ కుటుంబం మూడో అంతస్తులో ఉంటుంది. గోవర్ధన్ తల్లి కింది అంతస్తులో ఉంటుంది. 8వ తేదీ రాత్రి తల్లి గోవర్దన్ కు భోజనం అందించి వచ్చింది. భోజనం కూడా చేయకుండా గోవర్ధన్ ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరుసటి రోజు సాయంత్రం వరకు కొడుకు బయటకు రాలేదని తల్లి వెళ్లిచూడగా ఉరికి వేలాడుతూ ఉన్నాడు. కేపీ.అగ్రహార పోలీసులు చేరుకుని మృతదేహాన్ని విక్టోరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. -
పిక్నిక్లో ఘోర విషాదం.. 8 మంది దుర్మరణం
విహారయాత్ర పెను విషాదం నింపింది. మంగళవారం రాజస్తాన్ బనాస్ నదిలో నీట మునిగి ఎనిమిది మంది మృతి చెందారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. వీళ్లంతా స్నేహితులు కాగా.. 25-30 ఏళ్ల మధ్య వయస్కులు కావడం గమనార్హం. బక్రీదు తర్వాత జైపూర్ ఘాట్గేట్, హసన్పుర ప్రాంతానికి చెందిన కొంత మంది స్నేహితులు టోంక్ జిల్లా బనాస్ నది వద్దకు విహార యాత్రకు వచ్చారు. వీళ్లలో ముగ్గురు నది ఒడ్డునే ఉండి వంటలు చేస్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా అలజడి రేగింది. తమతో వచ్చిన వాళ్లు నీట మునిగిపోతూ కేకలు వేయసాగారు. దీంతో ఒడ్డున ఉన్న వాళ్లు స్థానికులను అప్రమత్తం చేశారు. స్థానికులు వారినే కాపాడే ప్రయత్నం చేయగా.. అప్పటికే ఆ 8 మంది ఊపిరి ఆగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను అక్కడి నుంచి తరలించారు. మరో ముగ్గురిని ఆస్పత్రిలో చేర్చామని, వాళ్ల ఆరోగ్యం నిలకడగానే ఉందని టోంక ఎస్పీ వికాస్ సంగ్వాన్ పీటీఐకి తెలిపారు. అయితే.. ఒకేసారి అందరూ ఒకేసారి ఎలా నీట మునిగారనే దానిపై స్పష్టత లేదని అన్నారాయన. లోతు అంచనా వేయకుండా దిగి ఉంటారని, బహుశా ఒకరినొకరు రక్షించుకునే సమయంలోనే నీట మునిగి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం భజన్లాల్ శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన ఎంతో బాధించిందని అన్నారాయన. राजस्थान: बनास नदी में नहाने के लिए गया 11 दोस्तों का ग्रुप, डूबने से 8 की हुई मौत#Tonk #Banasriver #NewsUpdate #Tonk #banas pic.twitter.com/9kYVZAKry7— Jan Aayam News (@AayamJan) June 10, 2025 -
ఎంత పని చేశావు తల్లి!
చాగలమర్రి(నంద్యాల): ఇద్దరు చిన్నారులు.. ఒకరికి నాలుగేళ్లు, మరొకరికి ఏడేళ్లు.. తండ్రి అకాల మరణం చెందారు. ఇక పిల్లల భారమంతా ఆ తల్లిదే. కుమార్తెల ఆలనా..పాలనా చూసుకోవాల్సిన ఆమె మనోవేదనతో తీసుకున్న నిర్ణయం ఇద్దరి పిల్లలను అనాథగా మార్చేసింది. భర్త లేని లోకంలో తాను ఉండలేనంటూ ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన మండల కేంద్రం చాగలమర్రిలో చోటు చేసుకుంది. స్థానిక న్యూ బిల్డింగ్స్ కాలనీలోని రోసిరెడ్డి రైస్ మిల్ వీధిలో నివాసం వుంటున్న పవన్ కుమార్(40) నిత్యావసర వస్తువుల ఏజెన్సి నిర్వహిస్తూ 40 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో అతని భార్య మహేశ్వరమ్మ(30) ఇద్దరు కుమార్తెలు జాహ్నవి (7), హర్షిత (4)తో కలసి తండ్రి కృష్ణమూర్తి చెంత ఉంటోంది. కృష్ణమూర్తికి మతిస్థిమితం లేదు. కొన్నాళ్ల క్రితం అతని భార్య కూడా మృతి చెందింది. మరో వైపు పవన్ కుమార్ తల్లిదండ్రులు కూడా మృతి చెందారు. అటు భర్త తరఫు, ఇటు తన తరఫు అండగా నిలవాల్సిన ఎవరూ లేకపోవడంతో భర్త చనిపోయినప్పటి నుంచి మహేశ్వమరమ్మ తీవ్ర ఆందోళన చెందింది. చివరకు మనోవేదనతో ఆదివారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. ఓ గదిలోకి వెళ్లి నిప్పంటించుకుంది. ఇంట్లో మంటలు కనిపించడం, పెద్దగా కేకలు రావడంతో ఇరుగు పొరుగున ఉన్నవారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన ఎస్ఐ సురేష్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇంటి లోపల వైపు గడియ పెట్టి ఉండటంతో ఇంటిపై నుంచి పోలీసులు లోపలికి ప్రవేశించి సోఫాలో నిద్రిస్తున్న పిల్లలిద్దరిని, ఆమె తండ్రిని బయటకు తీసుకొచ్చారు. అప్పటికే మహేశ్వరమ్మ పూర్తిగా కాలిపోయి మృతి చెందింది. తల్లి మృతితో రోదిస్తున్న చిన్నారులను చూసి పలువురు కంట తడి పెట్టారు. ప్రస్తుతం దూరపు బంధువు వద్ద ఆ చిన్నారులు ఉన్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఏపీలో ఘోరం: కడుపులో బిడ్డ ఉంది.. కొట్టొద్దన్నా..!
తాడేపల్లి రూరల్ : అసలే అర్ధరాత్రి.. ఆపై మద్యం మత్తు.. దీనికితోడు నేర చరిత్ర ఉన్న యువకులు.. మహిళ కనిపించగానే ఉన్మాదులుగా మారారు.. ఆమెపై దాడికి దిగారు.. గర్భంతో ఉన్నానని చెప్పినా వినకుండా పైశాచికంగా ప్రవర్తించారు..! తాడేపల్లి పోలీస్స్టేషన్ పరిధి పాత జాతీయ రహదారి వెంట పోలకంపాడు వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిందీ ఘటన. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం భార్యాభర్తలైన రైల్వే ఉద్యోగి ఆనందరావు, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సునీత ఉండవల్లిలో ఉంటూ విజయవాడలో విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం విధులు ముగిశాక ద్విచక్ర వాహనంపై వస్తుండగా పోలకంపాడు మూడు బొమ్మల సెంటర్ దాటిన తర్వాత వెనుక నుంచి మద్యం మత్తులో ఉన్న గుర్తుతెలియని వ్యక్తి ఢీకొట్టాడు. ఐదు నెలల గర్భిణి అయిన సునీతను ఆనందరావు పైకి లేపుతుండగా, మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు వచ్చి దాడి చేశారు. ప్రతిఘటించే క్రమంలో సునీత చెప్పు తీసుకుని కొట్టింది. రెచ్చిపోయిన యువకులు ఫోన్ చేసి మరికొందరిని పిలిపించారు. ఆనందరావు, సునీతలను రోడ్డుపై విచక్షణారహితంగా కొట్టారు. భార్యాభర్తలు రక్షించండి అని కేకలు వేయడంతో తాడేపల్లి పోలీసులు వస్తున్న సంగతి తెలిసి యువకులు పరారయ్యారు. వీరిపై రౌడీషీట్ ఉన్నట్లు తెలుస్తోంది. తాడేపల్లి పోలీస్స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. -
సామూహిక అత్యాచారం కేసులో ఆరుగురి అరెస్ట్
పుట్టపర్తి టౌన్: శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో దళిత మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు ఎస్పీ రత్న సోమవారం చెప్పారు. ఈ ఘటనలో మొత్తం 18 మందిపై కేసు నమోదు చేయగా.. మిగిలిన నిందితులు పరారీలో ఉన్నట్టు తెలిపారు. దళిత బాలికపై కొన్ని నెలలుగా టీడీపీ కీచకులు అత్యాచారానికి ఒడిగట్టారు. దీంతో బాలిక గర్భం దాలి్చంది. విషయం బయటకు రాకుండా నిందితులు జాగ్రత్త పడుతూ వచ్చారు. అత్యాచారం చేసిన వీడియోలు తీసి తల్లీకూతుర్లను బెదిరిస్తూ వచ్చారు. నాలుగు రోజుల క్రితం బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. అత్యాచారానికి పాల్పడిన 14 మందితో పాటు రాజీ కుదర్చడానికి ప్రయతి్నంచిన నలుగురు వ్యక్తులతో కలసి మొత్తం 18 మందిపై కేసు నమోదు చేశారు. ధర్మవరం డీఎస్పీ పర్యవేక్షణలో సీఐ నేతృత్వంలో అచ్చంపల్లి వర్దన్, తలారి మురళి, నందవర్దన్రాజు, నాగరాజు, బోయ సంజీవ, బడిద రాజన్నలను రాప్తాడు సమీపంలో అరెస్ట్చేసి కోర్టులో హాజరుపరిచారు. మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం ప్రత్యేక పోలీస్ బృందాలతో గాలిస్తున్నామని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్పీ తెలిపారు. మారుమూల ప్రాంతం కావడం, ఆరి్థక చేయూత, అవగాహన లేకపోవడంతో ఈ ఘటన జరిగిందని, మహిళలు, చిన్నారులపై నేరాలు అరికట్టేందుకు భవిష్యత్లో అన్నివిధాలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు. ఎస్పీ వెంట ధర్మవరం డీఎస్పీ హేమంత్కుమార్, రామగిరి సీఐ శ్రీధర్, ధర్మవరం టూటౌన్ సీఐ రెడ్డెప్ప ఉన్నారు. -
కుప్పం నుంచి వచ్చి చోరీలు
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): రద్దీగా ఉన్న బస్సుల్లో ప్రయాణిస్తూ చోరీలకు పాల్పడుతున్న చిత్తూరుకు చెందిన నలుగురు కిలేడీలు పట్టుబడ్డారు. చిత్తూరు జిల్లా కుప్పం నివాసులైన శశి(35), మాధవి(40),అకిల (30), విద్య(29)ను హాసన్ జిల్లా హొళేనరసీపుర పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి రూ.6.38 లక్షల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. హొళెనరసీపుర బస్టాండులో ఒక మహిళకు చెందిన బంగారు గొలుసు చోరీకి గురవ్వడంతో పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈక్రమంలో నలుగురు మహిళలు అనుమానాస్పదంగా కనిపించగా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో దొంగలని తేలడంతో అరెస్ట్ చేశారు. బెంగళూరులోని పలు పోలీస్స్టేషన్లలో వీరిపై కేసులు నమోదై ఉన్నాయి. నలుగురూ వేర్వేరు పనులు చేస్తున్నా ఊరూరూ తిరుగుతూ చోరీలు చేసి మళ్లీ స్వంత ఊరికి వెళ్లిపోయేవారని విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. -
పక్కా ప్లాన్ తో భర్తను హత్య చేసిన భార్య
-
బావ పెళ్లి చేసుకోవడం లేదని ఆత్మహత్య
నిర్మల్టౌన్: బావ పెళ్లి చేసుకోవడం లేదని అనుమానంతో మరదలు ఆత్మహత్య చేసుకున్నట్లు రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపారు. ఎస్సై, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గత ఆరేళ్ల క్రితం ఒంగోలు నుంచి గురునాథం శ్రీను కుటుంబంతో కలిసి నిర్మల్ రూరల్ మండలం డ్యంగాపూర్ గ్రామానికి వలసవచ్చి మేస్త్రి పని చేసుకుంటున్నారు. శ్రీను చెల్లెలు రాధ ఒంగోలులో నివాసం ఉంటోంది. రాధ భర్త తాగుడుకి బానిస కావడంతో.. ఆమె రెండో కుమార్తె భవాని(17)ని మూడేళ్ల క్రితం తీసుకువచ్చి వీళ్ల దగ్గరనే ఉంచుకున్నారు. ఇంకో నాలుగేళ్ల తర్వాత శ్రీను తన కొడుకును, భవానిని ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నాడు. అయితే శ్రీను కొడుకు వేరే యువతితో ఫోన్లో మాట్లాడుతున్నాడని, తనను పెళ్లి చేసుకోడేమోనని భవాని అనుమానించింది. శనివారం రాత్రి 10 గంటలకు పూలమొక్కలకు కొట్టే పురుగుల మందు తాగింది. గమనించిన కు టుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ ఆదివారం మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
AP: ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య
అనంతపురం: జిల్లాలో దారుణం చోటు చేసకుంది. ఇంటర్ చదువుతున్న తన్మయి అనే విద్యార్థిని దారుణంగా హత్య చేయబడింది. కొంతమంది దుండగులు ఇంటర్ విద్యార్థినిని తొలుత తలపై బండరాయితో కొట్టి చంపి.. ఆపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఉరవకొండ నియోజవర్గం కూడేర మండలం బ్రహ్మణపల్లి వద్ద మృతదేహం లభించడం స్థానికంగా కలకలం రేపింది. తమ కుమార్తె కనిపిండం లేదని ఆరు రోజుల క్రితం ఫిర్యాదు చేసినా పోలీసలు పట్టించుకోలేదని, చివరకు ఇలా పూర్తిగా కాలిపోయి కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇంటర్ చదివే ఆ విద్యార్థినిని హత్య చేసిన తర్వాత పెట్రోల్ పోసి కాల్చివేసినట్ల తెలుస్తోంది. ఆర రోజుల క్రితం అదృశ్యమైనప్పటికీ పోలీసుల కాలయాపన చేయడంతోనే ఇలా జరిగిందని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. పోలీసులు ముందుగానే పట్టించుకని ఉంటే తమ కూతురు బతికేదని తల్లిదండ్రలు కన్నీటి పర్యంతమవుతున్నారు. కాల్లిస్ట్ పేరుతో పోలీసులు కాలయాపన చేశారని ఆ అమ్మాయి తరఫు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీర్ బాటిల్తో కొట్టడం వల్లే..విద్యార్థిని తన్మయిని బీర్ బాటిల్తో కొట్టడం వల్లే చనిపోయిందని అనంతపురం వన్ టౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ తెలిపారు. ఈ నెల 3వ తేదీన తన్మయి అదృశ్యం అయినట్లు ఫిర్యాదు వచ్చిందన్నారు. వంటనే కేసు నమోదు చేసి అనుమానితులను విచారించామన్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు సీఐ రాజేంద్రనాథ్. -
ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న చైత్ర..!
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): ప్రియుడి మోజులో ఉన్న వివాహిత తన భర్త కుటుంబాన్ని అంతం చేయాలని పన్నాగం పన్నగా అది బెడిసి కొట్టింది. భర్త అప్రమత్తం కావడంతో ఆకుటుంబం బతికి బట్ట కట్టింది. ఈఘటన హాసన్ జిల్లా బేలూరు తాలూకా కెరళూరు గ్రామంలో చోటుచేసుకుంది. కెరళూరు గ్రామానికి చెందిన గజేంద్ర అనే వ్యక్తికి 11 ఏళ్ల క్రితం చైత్ర అనే యువతితో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. అత్తమామలతో కలిసి జీవిస్తున్నారు. మూడేళ్లుగా చైత్ర పునీత్ అనే యువకుడితో సన్నిహితంగా ఉంటోంది. ఈ విషయం గజేంద్రకు, అత్తమామకు తెలిసింది. పెద్దలు పంచాయితీ చేసి రాజీ కుదిర్చారు. కొన్ని రోజులు దంపతులు అన్యోన్యంగా ఉన్నప్పటికీ చైత్ర మరోసారి శివ అనే మరో యువకుడితో అక్రమ సంబంధం కొనసాగించింది. ఇక భర్త, అత్తమామలను అడ్డు తొలగించుకోవాలని భావించి భోజనంలో విషం కలిపింది. చైత్ర ప్రవర్తనలో తేడా గమనించిన భర్త ప్రమాదాన్ని పసిగట్టాడు. అన్నంలో విషం కలిపినట్లు తెలుసుకొని బేలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు చైత్రను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. -
పాపం జుబేదా!
మైలార్దేవ్పల్లి(హైదరాబాద్): సమీపంలోని నివాసంలో భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవ గురించి తెలుసుకునేందుకు వారింటికి వెళ్లిన మహిళపై కత్తితో దాడి చేసిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు..మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి చెందిన సలీమ్, రేష్మ దంపతులు. బక్రీద్ పండగను పురస్కరించుకొని ఇక్కడ ఉంటున్న కూతురి దగ్గరికి వచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో సలీమ్ మద్యం తాగి భార్యతో గొడవకు దిగాడు. పెద్దగా అరుపులు వినిపిస్తుండటంతో పక్కనే ఉంటున్న జుబేదా (26) అనే మహిళ అక్కడికి వెళ్లింది. అప్పటికే సలీం కొట్టడానికి రావడంతో భార్య రేష్మ ఇంటి నుంచి బయటకు పరుగులు తీసింది. సలీం కూరగాయలు కోసే కత్తిని చేతపట్టుకొని ఆమె కోసం గాలిస్తున్నాడు. అదే సమయంలో ఇంట్లోకి వచ్చిన జుబేదాను తన భార్య అనుకొని కత్తితో పొడిచాడు. ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో సలీం అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలికి చేరుకుని నిందితుడిని గాలించి పట్టుకున్నారు. తీవ్రంగా గాయపడిన జుబేదాను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రంగారెడ్డి: గంజాయి కేసులో ఎక్సైజ్ కానిస్టేబుల్ అరెస్ట్
సాక్షి, రంగారెడ్డి: గంజాయి కేసులో ఎక్సైజ్ కానిస్టేబుల్ గులం సుల్తాన్ అహ్మద్ను షాద్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. షాద్ నగర్లో పోలీసులు తనిఖీల్లో గంజాయితో ఓ యువకుడు పట్టుబట్టాడు. అతని వద్ద నుంచి 1.5 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.తనకు గంజాయి ఎక్సైజ్ కానిస్టేబుల్ ఇచ్చినట్టు ఆ యువకుడు తెలిపాడు. ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేసిన గంజాయిని ఆ యువకుడికి సుల్తాన్ ఇచ్చాడు. ఎక్సైజ్ కానిస్టేబుల్ సుల్తాన్ అహ్మద్, యువకుడు అంజాద్లను అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్కు తరలించారు. -
కాలేజీకి వెళ్లాల్సిన కొడుకు కాటికి..!
మంచిర్యాలక్రైం: మరొక్క రోజు గడిస్తే కొడుకు కాలేజీకి వెళ్తాడని తల్లిదండ్రులు అంతా సిద్ధం చేశారు. పదో తరగతి పూర్తి చేసిన తనయుడిని హైదరాబాద్లోని ప్రైవేటు ఇంటర్మీడియట్ కళాశాలలో చేర్పించేందుకు ఫీజు కూడా చెల్లించారు. స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు ఏసీసీ క్వారీకి వెళ్లిన విద్యార్థి.. స్నానానికి క్వారీలోకి దిగి మృత్యువాత పడ్డాడు. కాలేజీకి వెళ్తాడనుకుంటే కనిపించకుండా పోయాడంటూ తల్లిదండ్రులు రోదించిన తీరు అక్కడున్న వారికి కలిచివేసింది. ఈ సంఘటన మంచిర్యాల పోలీసుస్టేషన్ పరిధిలోని ఏసీసీ క్వారీ వద్ద చోటు చేసుకుంది.ఎస్సై తిరుపతి, విద్యార్థి కుటుంబ సంభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాలలోని జాఫర్నగర్లో ప్రైవేటు బ్యాంకు ఉద్యోగి సాదుల ప్రసాద్ నివాసం ఉంటున్నాడు. ఆయన భార్య లావణ్య కోటపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. వీరికి ఇద్దరు కుమారులు హర్షిత్ (15), ధనుష్ ఉన్నారు. çహర్షిత్ను హైదరాబాద్లోని పాఠశాలలో చదివించారు. ఇటీవల పదో తరగతి పూర్తి చేయగా ఇంటర్ కోసం హైదరాబాద్లోని ప్రైవేటు కళాశాలలో చేర్పించారు. ఈ నెల 5న కాలేజీకి వెళ్లాల్సి ఉండగా అన్ని ఏర్పాట్లు చేశారు.స్నేహితులతో వెళ్లి..హర్షిత్ చిన్ననాటి స్నేహితులు అందరూ పదో తరగతి పూర్తి చేసి వేర్వేరు కళాశాలల్లో చేరారు. గురువారం హైదరాబాద్కు వెళ్లాల్సి ఉండడంతో స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు మంగళవారం ఏసీసీ క్వారీకి వెళ్లారు. బిర్యానీ పార్టీ చేసుకుని ఫొటోలు దిగారు. స్నానం చేసేందుకు హర్షిత్ పాటు మరో స్నేహితుడు క్వారీలోకి దిగారు. హర్షిత్ లోతుకు వెళ్లి నీట మునిగి చనిపోయాడు. గమనించిన స్నేహితులు భయంతో బయటకు వచ్చి ఏం చేయాలో తెలియక రోదిస్తూ వెళ్లిపోయారు. హర్షిత్ రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో తండ్రి ప్రసాద్ స్నేహితులను ఆరా తీయగా.. సాయంత్రం క్వారీకి వెళ్లినట్లు తెలిపారు. అక్కడికి వెళ్లి పరిశీలించగా.. స్కూటీ, నీటిమడుగు పక్కనే డ్రెస్, చెప్పులు కనిపించాయి. పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ ప్రమోద్రావు, ఎస్సై తిరుపతి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మంగళవారం రాత్రి కావడంతో బుధవారం ఉదయం గజ ఈతగాళ్లతో గాలించగా çహర్షిత్ మృతదేహం లభించింది. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. క్వారీ ప్రాంతంపై నిఘా పెంచాలి ఏసీసీ క్వారీ దట్టమైన అటవీ ప్రాంతం. అత్యంత ప్రమాదకరమైన క్వారీ. పెద్ద పెద్ద నీటి మడుగులు ఉంటాయి. పైగా సెల్ఫోన్ సిగ్నల్స్ కూడా రావు. ఏదైనా ప్రమాదం జరిగితే సమాచారం ఇవ్వడం కష్టమే. ఇంతటి ప్రమాదకరమైన ప్రాంతం వద్ద అధికారులు నిషేధం విధించారు. అయినా సరదాగా గడిపేందుకు, అసాంఘిక కార్యకలాపాలకు ఏసీసీ క్వారీ అడ్డాగా మారిందని పలువురు చర్చించుకుంటున్నారు. ఏసీసీ క్వారీ ప్రాంతంపై నిఘా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. -
Hyderabad: సూట్కేసులో యువతి మృతదేహం
నిజాంపేట్: ఓ యువతిని హత్య చేసి సూట్కేసులో తీసుకువచ్చి బాచుపల్లి పరిసర ప్రాంతాల్లో పడేసిన సంఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరి«ధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం బుధవారం బాచుపల్లిలోని జీతేపీర్ దర్గా ఎదురుగా ఉన్న జీపీఆర్ లే అవుట్ విజయదుర్గ ఓనర్స్ అసోషియేషన్ కాలనీలో పొదల మధ్యలో ఓ సూట్కేసు నుంచి గత రెండు రోజుల నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాచుపల్లి ఇన్స్పెక్టర్ ఉపేందర్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా అందులో యువతి మృతదేహం లభ్యమైంది. ఆమె వయసు సుమారు 25 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో గుర్తుపట్టలేని విధంగా ఉంది. బాలానగర్ డీసీపీ సురేశ్కుమార్, అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, ఏసీపీలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఐదు నుంచి పది రోజుల క్రితం ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తే కీలకం.. యువతి హత్య పోలీసులకు సవాల్గా మారింది. ఎక్కడో చంపేసి సూట్కేసులో మృతదేహాన్ని తీసుకువచ్చి ఇక్కడ పడేయడం, అందులో మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో పోలీసులకు దర్యాప్తు కీలకంగా మారింది. రంగంలోకి ఐదు పోలీసు బృందాలను దింపి సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. అదే విధంగా వివిధ పోలీస్స్టేషన్ పరిధిలో మిస్సింగ్ అయిన వారి వివరాలతో పోల్చి చూస్తున్నారు. ఇప్పటి వరకు ఎక్కడి నుంచి పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాజులు, డ్రెస్లే ఆధారాలు.... మృతి చెందిన యువతి ఒంటిపై ఉన్న గాజులు, డ్రెస్ ఆధారంగానే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. భార్యా భర్తల గొడవల కారణంగా ఏమైనా ఈ హత్య జరిగిందా? లేదా మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పరిశీలిస్తున్నారు. ఒంటిపై మెరున్ కలర్ పంజాబీ డ్రెస్ ఉంది. ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళనా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. -
కుప్పం దొంగల ముఠా కేసులో కీలక పురోగతి
సాక్షి, చిత్తూరు: కుప్పంలో పోలీసుల మీదకే వాహనంతో దూసుకెళ్లిన దొంగల ముఠా కోసం గాలింపు కొనసాగుతోంది. ఆ ముఠాలో ఐదుగురు సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి పోలీసులు పురోగతి సాధించారు.కుప్పం రైల్వే స్టేషన్లో ముఠా సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఉదయం పుష్పుల్ రైలులో బెంగళూరు వెళ్లే ప్రయత్నంలో ఉండగా.. అదుపులోకి తీసుకున్నారు. అతని ద్వారా మిగిలిన ముఠా సభ్యుల ఆచూకీ కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. కరుడుగట్టిన దొంగల ముఠా ఒకటి సరిహద్దు దాటుతున్నారనే సమాచారంతో కుప్పం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో కృష్ణగిరి-పలమనేరు జాతీయ రహదారిపై ఉన్న తంబిగానిపల్లె చెక్పోస్టు వద్ద పోలీసులను చూసి దుండగులు తమ కారుతో తొక్కించేందుకు విఫలయత్నం చేశారు. వెంటనే కానిస్టేబుళ్లు పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ నేపథ్యంలో తప్పించుకున్న వారిని నిలువరించేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కారు నడుపుతున్న డ్రైవర్ తొడకు బుల్లెట్ గాయమైంది. అయినా కూడా ఆ ముఠా తప్పించుకుంది. కొద్దిదూరం వెళ్లాక కారును వదిలేసి ఆ ముఠా సభ్యులు పరారైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కుప్పం డీఎస్పీ పార్థసారథి మాట్లాడుతూ హత్యాయత్నం కింద దొంగలపై కేసు నమోదు చేశారు. పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి సమీప ప్రాంతాల్లో దొంగల కోసం జల్లెడ పడుతున్నారు. కుప్పం పరిధిలోని పలు గ్రామాల్లో డ్రోన్ కెమెరాలు, డాగ్ స్క్వాడ్తో గాలింపు చేపట్టారు. ఆ ముఠాలో హర్యానా, రాజస్థాన్ ముఠా సభ్యులు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. హిందీలో మాట్లాడుతూ ఎవరైనా అనుమానాస్పద రీతిలో ఎవరైనా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. -
బిడ్డను చంపి.. తనువు చాలించి..
కాకినాడ క్రైం: కన్న పేగుని చిదిమేసి తానూ తనువు చాలించిన తల్లి హృదయ విదారక సంఘటన కాకినాడలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు, రాజమహేంద్రవరానికి చెందిన గుడేటి రమ్యదీప్తి(30)కి ఐదేళ్ల క్రితం కాకినాడ రేచర్లపేట దౌర్లవారి వీధికి చెందిన రాజాల శరత్తో వివాహమైంది. ఈ దంపతులు అబుదాబీలో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు. వీరికి నాలుగేళ్ల కుమారుడు కియాన్ ప్రశాంత్ ఉన్నాడు. రెండు నెలల క్రితం రమ్యదీప్తి అబుదాబి నుంచి తన కుమారుడితో కలిసి రాజమహేంద్రవరానికి వచ్చింది. అక్కడ ఒకటిన్నర నెలల పాటు ఉండి, సుమారు పది రోజుల క్రితం కాకినాడలోని అత్తయ్య ఇంటికి వచ్చి ఉంటోంది. ఏమైందో, ఏమో మంగళవారం రాత్రి నిద్రపోయేందుకు కుమారుడితో కలిసి తన గదిలోకి వెళ్లింది. ఉదయం ఎంతకూ తలుపు తీయకపోయేసరికి దీప్తి అత్తయ్య, ఆడపడుచు కిటికీ నుంచి గదిలోకి చూశారు. దీప్తి ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. ఆమె కుమారుడు మంచంపై నిర్జీవంగా పడి ఉన్నాడు. పొరుగు వారి సాయంతో తలుపులు తెరిచిచూడగా.. దీప్తి అప్పటికే చనిపోయి ఉంది. బాలుడు ప్రశాంత్కు ముక్కు, నోటికి ప్లాస్టర్లు వేసి ఉన్నాయి. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. టూ టౌన్ ఇన్చార్జి సీఐ సత్యనారాయణ, ఎస్సై తులసీరామ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీప్తి ఆత్మహత్యకు పాల్పడిందని, అంతకు ముందు తన కుమారుడి ముక్కు, నోటికి ప్లాస్టర్లు వేసి, ఊపిరాడకుండా చేసి ఉంటుందని గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో దీప్తి ఈ ఘాతుకానికి పాల్పడిందని భావిస్తున్నామని, విచారణలో వాస్తవాలు తెలుస్తాయని సీఐ చెప్పారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇలాఉంటే, అత్త, ఆడపడుచు, భర్త వేధింపులు తాళలేకున్నానని దీప్తి తమకు వాయిస్ మెజేస్లు పెట్టి ఈ ఘాతుకానికి పాల్పడిందని దీప్తి తల్లి అరుణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాకినాడ టూ టౌన్ పోలీసులు బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు. -
పర పురుషునితో పరారైన భార్యను..!
మైసూరు: పర పురుషునితో పరారైన తన భార్యను చంపిన ఘటన చామరాజనగరలోని సోమవారపేటె బడావణెలో జరిగింది. విద్య (26) అనే మహిళను ఆమె భర్త గిరీష్ హత్య చేసి పరారయ్యాడు. వివరాలు.. కరినంజనపుర బడావణెకు చెందిన విద్యకు సోమవారపేటెకు చెందిన గిరీష్తో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. కొన్ని రోజుల క్రితం విద్య మరో వ్యక్తితో వెళ్లిపోయింది. తరువాత వాపసు వచ్చిన ఆమెను పుట్టింటివారు, భర్త ఇంటిలోకి చేర్చుకోలేదు. దీంతో ఆమె మహిళా సాంత్వన కేంద్రంలో ఆశ్రయం పొందింది. ఇటీవల తన మొబైల్ను భర్త నుంచి తీసుకుంది. భర్త గిరీష్ సాంత్వన కేంద్రానికి వెళ్లి మొబైల్ వాపసు ఇవ్వాలని గొడవ పడ్డాడు. ఫిర్యాదు చేసి వెళ్తుండగా దాడి దీంతో విద్యా తన భర్త గిరీష్ తనను వేధిస్తున్నాడంటూ టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. లా కాలేజీ ఎదుట జాతీయ రహదారిని దాటి మహిళా సాంత్వన కేంద్రానికి వెళుతుండగా ఆమెను అడ్డుకున్న గిరీష్ పదునైన కొడవలితో దాడికి యతి్నంచాడు. ఆమె చేయిని అడ్డు పెట్టగా బలమైన గాయం కావడంతో రక్తం కారింది. ఆమె భయపడి తప్పించుకునేందుకు పరుగు తీసి ఓ కెఫె ముందు పడిపోయింది. భర్త ఆమె మెడ, భుజనం, తలపై దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మరణించింది. ఆ సమయంలో కెఫెలోని సిబ్బంది దాడిని అడ్డుకునేందుకు ప్రయతి్నంచగా వారిపై గిరీష్ తిరగబడ్డాడు. కొడవలిని అక్కడే పారేసి రైల్వేస్టేషన్కు వెళ్లే రోడ్డు వైపు పరుగెత్తి తప్పించుకున్నాడు. విషయం తెలిసిన వెంటనే టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యా మృతదేహాన్ని అంబులెన్స్లో నగర శివార్లలోని సిమ్స్ బోధనాస్పత్రికి తరలించారు. ఎస్పీ డాక్టర్ బీటీ కవిత, ఏఎస్పీ శశిధర్, డీఎస్పీ లక్ష్మయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
కూకట్పల్లి డ్రగ్స్ కేసులో ఇద్దరు ఏపీ పోలీసుల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి డ్రగ్స్ కేసులో ఇద్దరు ఏపీ పోలీసులు అరెస్ట్ అయ్యారు. తిరుపతిలో టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ గుణ శేఖర్ను కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. గుణశేఖర్తో పాటు హెడ్ కానిస్టేబుల్ రామచంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎఫీడ్రిన్ డ్రగ్ను కానిస్టేబుల్ గుణశేఖర్కు ఎవరు సప్లై చేస్తున్నారనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.ఎఫీడ్రిన్లో కొకైన్ కలిపి డ్రగ్స్ విక్రయాలపై కూకట్పల్లి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే రిమాండ్లో ఉన్న ఐదుగురు నిందితులను కస్టడీకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టనున్నారు. -
హైదరాబాద్లో దారుణం.. ట్రావెల్ బ్యాగ్లో మహిళ మృతదేహం
సాక్షి, మేడ్చల్: బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీ నిర్మానుష్య ప్రాంతంలో బ్యాగులో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. బ్యాగ్ నుంచి దుర్వాసన వస్తుందని స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు.మెరూన్ కలర్ పంజాబీ డ్రెస్తో ఉన్న మృతురాలికి 25 నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉండొచ్చని పోలీసులు తెలిపారు. మృత దేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాలనగర్ జోన్ డీఎస్పీ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. మృతురాలి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. -
ఎంత పని చేశావ్ బ్రహ్మయ్య!
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: తోపూరి నరసింహంను దారుణంగా హత్య చేసిన చలంచర్ల బ్రహ్మయ్యను అరెస్ట్ చేసి కందుకూరు కోర్టులో హజరుపరిచినట్లు గుడ్లూరు సీఐ మంగారావు చెప్పారు. బంగారు ఉంగరం కోసమే బ్రహ్మయ్య హత్య చేసినట్లు విచారణలో తేలిందన్నారు. వివరాలను సీఐ మంగళవారం వెల్లడించారు. పొన్నలూరు మండలం రావులకొల్లు గ్రామానికి చలంచర్ల బ్రహ్మయ్య కుటుంబ సభ్యులతో పదేళ్ల నుంచి పెంట్రాల ఎస్టీ కాలనీలో ఉంటూ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. గత నెల 30వ తేదీన నరసింహం నిమ్మతోటకు కంచె వేసేందుకు బ్రహ్మయ్యను తీసుకెళ్లాడు. పని చేస్తుండగా నరసింహం చేతికున్న పచ్చరాయి బంగారపు ఉంగరాన్ని చూసి దానిని ఎలాగైనా దక్కించుకోవాలని బ్రహ్మయ్య భావించాడు. నరసింహంను మొద్దుకత్తితో నరకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం ఉంగరాన్ని తీసుకుని కందుకూరులో విక్రయించాడు. రాత్రి మృతదేహాన్ని పక్క పొలంలోకి లాక్కెళ్లి ముక్కలుగా నరికి బోరుబావిలో పడేశాడు. బ్రహ్మయ్యను విచారించగా తాను బంగారు ఉంగరం కోసమే నరసింహంను హత్య చేసినట్లు అంగీకరించాడని సీఐ చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసి కందుకూరు కోర్టులో హాజరుపరచగా మేజి్రస్టేట్ రిమాండ్ విధించినట్లు వెల్లడించారు. -
నన్ను ప్రేమించి.. మరో వ్యక్తితో చాటింగ్ చేస్తావా?
అన్నానగర్: పొల్లాచ్చిలో మంగళవారం పట్టపగలు ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిని ప్రియుడు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. కోయంబత్తూరు జిల్లా, పొల్లాచ్చి సమీపంలోని వడుగపాళయంలోని పొన్ముత్తునగర్కు చెందిన కన్నన్. ఇతను కార్ వర్క్షాప్లో ఉద్యోగి. ఇతని భార్య వనిత. వీరికి అశ్విక (19) సహా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అశ్విక కోవైలోని ఒక ప్రైవేట్ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అదేవిధంగా పొల్లాచ్చి–ఉడుమలై రోడ్డులోని అన్నామలైకు చెందిన రాజన్ కుమారుడు ప్రవీణ్కుమార్ (23). ఇతను ఒక ప్రైవేట్ ఆర్థిక సంస్థలో ఉద్యోగి. ఈక్రమంలో అశ్విక, ప్రవీణ్కుమార్ ప్రేమించుకుంటున్నారు. అశ్విక కొన్ని రోజులుగా ప్రవీణ్కుమార్తో మాట్లాడడం మానేసిందని తెలిసింది. ఆగ్రహించిన ప్రవీణ్కుమార్ సోమవారం మధ్యాహ్నం అశ్విక ఒంటిరిగా ఉందని తెలిసి ఆమె ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేసి పారిపోయాడు. గమనించిన ఇరుగుపొరుగు వెంటనే కుటుంబసభ్యులకు, పొల్లాచ్చి తాలూకా పోలీస్స్టేషన్కు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి రక్తపుమడుగులో పడివున్న అశ్వికను పొల్లాచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు గాలిస్తున్నారని తెలిసి ప్రవీణ్కుమార్ పొల్లాచ్చి సిటీ వెస్ట్ పోలీస్స్టేన్లో లొంగిపోయాడు. పోలీసుల విచారణలో అశ్విక మరొక స్నేహితుడితో కలిసి దిగిన ఫొటోను ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేసినట్లు తెలిసింది. ఇది చూసిన ప్రవీణ్కుమార్ అశ్వికను ప్రశించాడు. దీంతో ఆమె ప్రవీణ్కుమార్తో మాట్లాడడం మానేసింది. దీంతో ఆగ్రహించిన ప్రవీణ్కుమార్ అశ్వికను హతమార్చినట్లు తెలిసింది. -
ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి
క్రైమ్: శుభకార్యానికి వెళ్లి తిరిగొస్తుండగా.. ఘోర ప్రమాదం ఆ కుటుంబాన్ని బలి తీసుకుంది. ఓ ట్రక్కు అదుపు తప్పి అనూహ్యంగా వాళ్లు ప్రయాణిస్తున్న వ్యాన్ మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.మధ్యప్రదేశ్ ఝుబువా(Jhabua) జిల్లా మేఘ్నగర్లో బుధవారం వేకువ జామున ఘోర ప్రమాదం జరిగింది. సిమెంట్ బస్తాల లోడ్ తీసుకెళ్లే ట్రక్కు ఒకటి.. సంజేలి రైల్వే క్రాసింగ్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి దాటుతుండగా అదుపు తప్పింది. పక్కన వెళ్తున్న ఓ వ్యాన్ మీద ట్రక్కు బోల్తా పడింది. ఈ ఘటనలో అందులో ఉన్న తొమ్మిది మంది మరణించారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు.మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్లని, ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని ఎస్పీ పద్మవిలోచన్ శుక్లా వెల్లడించారు. ట్రక్కు డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నట్లు తెలిపిన ఆయన.. దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.मध्यप्रदेश के झाबुआ में भीषण सड़क हादसाबेकाबू ट्रक और कार की जबरदस्त टक्करभीषण हादसे में 9 लोगों की मौके पर ही मौत2 लोग गंभीर रूप से घायल, अस्पताल में भर्ती#MadhyaPradesh #jhabua #accident pic.twitter.com/FIFsn8mRCg— Diksha singh (@DikshaSingh7522) June 4, 2025 -
పాక్లో మరో ఘోరం.. ఎవరీ సనా యూసఫ్?
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో మరో ఘోరం చోటు చేసుకుంది. సనా యూసఫ్(Sana Yousuf) అనే టీనేజర్ దారుణ హత్యకు గురైంది. మంగళవారం ఇస్లామాబాద్ సుంబల్ ప్రాంతంలో ఆమె ఉంటున్న ఇంటికి ఓ వ్యక్తి వచ్చాడు. సనాతో మాట్లాడుతూనే.. వెంట తెచ్చుకున్న రివాల్వర్తో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన సనా అక్కడికక్కడే చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు దుండగుడి కోసం గాలింపు జరిపి, ఫైసలాబాద్లో ఉండగా పట్టుకున్నారు. నిందితుడిని ఉమర్ హయత్(Umar Hayath) అలియాస్ కాకాగా నిర్ధారించారు. సనాను ఉద్దేశపూర్వకంగానే చంపినట్లు ఉమర్ అంగీకరించాడు. సనాకు టిక్టాక్లో 7.40 లక్షల మంది, ఇన్స్టాలో 5 లక్షల మంది ఫాలోయెర్లున్నారు. ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా తెలుస్తోంది. నేరానికి పాల్పడిన ఉమర్ కూడా టిక్టాకరేనని పోలీసులు ధృవీకరించారు. అయితే.. నేరానికి ఎందుకు పాల్పడ్డాడనే కారణాన్ని మాత్రం పోలీసులు వెల్లడించలేదు. నిందితుడి నుంచి రివాల్వర్, ఐఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. సనా(17) మెడిసిన్ మొదటి సంవత్సరం చదువుతోందని తెలుస్తోంది. ఆమె తండ్రి ప్రభుత్వ అధికారి, సోషల్ యాక్టివిస్ట్ కూడా. తల్లి గృహిణి. ఈమె 15 ఏళ్ల సోదరుడు ఖైబర్ ప్రావిన్స్లోని సొంతూరు చిత్రాల్కు వెళ్లాడు. ఘటన సమయంలో ఆమె దగ్గరి బంధువు ఒకరు ఇంట్లో ఉన్నారు. ఈ కేసులో ఆ బంధువే ప్రత్యక్ష సాక్షి. కాగా, పాకిస్తాన్(Pakistan)లో ఈ మధ్యకాలంలో హత్యకు గురైన మూడో మహిళా ఇన్ఫ్లుయెన్సర్(Social Media Teenager) సనా కావడం గమనార్హం. పంజాబ్లో మహిళా టిక్టాకర్ను ఇటీవలే ఆమె బంధువొకరు చంపేశారు. ఫిబ్రవరిలో పెషావర్లో మరో మహిళా టిక్టాకర్ హత్యకు గురయ్యారు. సనా కేసు అక్కడి సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఈ కేసును పరువు హత్య, ప్రేమ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు.ఇదీ చదవండి: ఏకాంత వీడియోలు ఒక్కొటిగా బయటకు.. -
ఏయ్.. నేను ఎవర్నో తెలుసా?
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఆమె వితంతువు. మరో వ్యక్తితో రిలేషన్షిప్లో ఉంది. అయితే ఆ ప్రియుడి సాయంతోనే తన అత్తమామలను హతమార్చేెందుకు ప్రయత్నించి పట్టుబడి పోయింది. ఆ ప్రియుడేమో ‘‘ఏయ్.. నేను ఎవర్నో తెలుసా?. నా బ్యాక్గ్రౌండ్ తెలుసా?.. జనసేన లీడర్ని, ఇక్కడి ఎమ్మెల్యే పీఏని’’ అంటూ ఊరి జనంపైనే బెదిరింపులకు దిగాడు. నందిగామ మండలం అనాసాగరం గ్రామంలో చోటు చేసుకున్న ఘటన వివరాల్లోకి వెళ్తే.. మమత అనే మహిళ భర్త ఐదేళ్ల కిందట బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె అత్తమామల దగ్గరే ఉంటూ వస్తోంది. అయితే గత కొంతకాలంగా కర్రి హనుమంతరావు అనే వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. విషయం తెలిసి పెద్దలు ఆమెను మందలించారు. దీంతో కోపం పెంచుకున్న ఆమె ఏకంగా వాళ్ల అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నించింది. ఈ క్రమంలో.. ప్రియుడు హనుమంతరావుతో కలిసి అత్తమామలను హతమార్చేందుకు ప్లాన్ వేసింది. గత రాత్రి మరో వ్యక్తితో కలిసి వచ్చిన హనుమంతరావు.. కొబ్బరి కాయలు కొట్టే కత్తితో వెంకటేశ్వర్లు, మంగమ్మలపై దాడి చేయబోయాడు. దీంతో వాళ్లు పెద్దగా కేకలు వేయగా చుట్టుపక్కల వాళ్లు అప్రమత్తమయ్యారు. ఈ పరిణామంతో షాక్ తిన్న హనుమంతరావు పారిపోయే యత్నం చేయగా.. గ్రామస్తులు వెంబడించి పట్టుకున్నారు. ఆ సమయంలో తాను.. జనసేన లీడర్నని, నందిగామ ఎమ్మెల్యే పీఏ వాళ్లను బెదిరించే ప్రయత్నం చేశాడు. అయితే గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి వచ్చారు. పోలీసులకు గ్రామస్తులకు మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగింది. చివరకు.. హనుమంతరావు ఫోన్లోని ఫొటోలు, ఇతర వివరాల ఆధారంగా పోలీసులు జనసేన నేతగా నిర్ధారించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి కత్తిని స్వాధీనం చేసుకుని.. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. -
స్నేహితులతో కలిసి ప్రియురాలిపై అత్యాచారయత్నం
అన్నానగర్: ఓ యువకుడు స్నేహితులతో కలిసి ప్రియురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. తిరువణ్ణామలై జిల్లాకు చెందిన 17 ఏళ్ల బాలిక, ఆమె తల్లి చెన్నైలోని పూందమల్లిలో నివసిస్తున్నారు. ఆ అమ్మాయికి ఇన్స్ట్రాగామ్ చూసే అలవాటు ఉంది. ఈ క్రమంలో ఉత్తర చెన్నైకి చెందిన సాయి (22) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది చివరికి ప్రేమగా మారింది. ఈ విషయం తెలిసిన ఆ అమ్మాయి తల్లి తరచుగా కూతురిని మందలించింది. దీంతో ఆ బాలిక కొన్ని రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయి, స్నేహితురాలి ఇంట్లో బస చేసింది. మళ్లీ ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్న ఆ బాలిక తన ప్రియుడిని ఓ సారి కలిసి మాట్లాడాలని ప్లాన్ చేసుకుంది. ఆదివారం రా త్రి 11 గంటల ప్రాంతంలో ఆ అమ్మాయి చెన్నైలోని కొత్తవల్సావడి ప్రాంతంలోని ఒక భవనం వద్ద ప్రియుడిని కలవడానికి వెళ్లింది. ఆ సమయంలో సాయి స్నేహితులు రాహుల్ (26)సహా ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్పై అక్కడికి వచ్చారు. హఠాత్తుగా సా యి, అతని స్నేహితులు కూడా ఆ బాలికను ఆ భవనంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి ప్రయతి్నంచారు. ఆ ప్రాంత ప్రజలు దీనిని చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోర్ట్ మహిళా పోలీస్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ నేతృత్వంలోని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో యువకులు పారిపోయారు. -
చిన్న వయసు, విష్ణుప్రియ డాక్టర్ ఆశలకు 'ఉరి'
శివమొగ్గ(కర్ణాటక): శివమొగ్గలో ఉన్న సుబ్బయ్య మెడికల్ కళాశాలలో హాస్టల్లో ఓ మెడికో ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు విష్ణుప్రియ (22). వివరాలు.. ఈమె కుటుంబం బెంగళూరుకు చెందినది కాగా, జర్మనీలోని బెర్లిన్లో నివసిస్తోంది. విష్ణుప్రియ ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తిచేసి ఇంటర్న్షిప్ చేస్తోంది. మరికొన్ని రోజుల్లో పూర్తయి డాక్టర్ కానుంది. అయితే ఏమి జరిగిందో మరి.. హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. కారణాలు తెలిసి రాలేదు. డెత్నోట్ ఏదీ దొరకలేదు. శివమొగ్గ గ్రామీణ పోలీసులు ఆమె శవాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
కాళ్లు, చేతులు కట్టేసి..కడపలో వ్యక్తి దారుణ హత్య
కడప అర్బన్: కడప నగరం చిన్నచౌక్ పోలీస్స్టేషన్ పరిధిలోని అశోక్నగర్లో మసీద్ వీధిలో ఆదివారం సాయంత్రం సయ్యద్ చాంద్బాషా (36) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటనపై అతని తల్లి సయ్యద్ జుబేదా, పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కడప నగరంలోని రామకృష్ణ నగర్లో నివాసం వుంటున్న సయ్యద్ జుబేదా చిన్నకుమారుడు సయ్యద్ చాంద్బాషాకు, అశోక్నగర్ మసీద్ వీధిలో నివాసం వుంటున్న షేక్ మహబూబ్ బాషా కుమార్తె ఆయేషాకు 9 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు కుమారులు సంతానం. చాంద్బాషా ఆటోడ్రైవర్గాను, ఎలక్ట్రికల్ పనులు, ఇంకా తనకు వచ్చిన పనులను చేసుకుంటూ జీవనం సాగించేవాడు. భార్య ఆయేషా కడప నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తోంది. ఈ క్రమంలో వివాహమైనప్పటి నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. అతను అశోక్నగర్లోనే తన అత్తగారింటికి సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని వుండేవాడు. వీరి మధ్య మనస్పర్థలు తీవ్రం కావడంతో పోలీసుస్టేషన్, కేసుల దాకా వెళ్లారు. గత ఆరునెలల నుంచి ఆయేషా తన పుట్టింటిలోనే వుంటూ పిల్లలను తనదగ్గరే పెట్టుకుంది. ఈ క్రమంలో పరస్పరం ఘర్షణ పడుతూనే వున్నారు.20 రోజుల క్రితం ఆయేషా తండ్రి షేక్ మహబూబ్ బాషా కువైట్ నుంచి వచ్చాడు. ఒకసారి తన అల్లుడు సయ్యద్ చాంద్బాషాపై హత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం మధ్యాహ్నం చాంద్బాషా తల్లి జుబేదాకు దావత్ ఉందని చెప్పి వెళ్లాడు. తన అత్తారింటికి సమీపానికి వెళ్లాడు. ఆ సమయంలో మామ షేక్ మహబూబ్బాషా, వారి కుటుంబ సభ్యులు సయ్యద్ చాంద్ బాషాను తమ ఇంటికి తీసుకుని వెళ్లారు. చేతులు, కాళ్లను తాళ్లతో కట్టేసి, కత్తి, కొడవలితో దారుణంగా నరికి హత్య చేశారు. రక్తపుమడుగులో పడివుండగా ప్రధాన నిందితుడైన షేక్ మహబూబ్బాషా, ఇతర కుటుంబ సభ్యులు పరారయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, చిన్నచౌక్ సీఐ ఓబులేసు, ఎస్ఐ రవికుమార్, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు.మామ, కుటుంబ సభ్యులే మా కుమారుడిని పొట్టన పెట్టుకున్నారు– హతుని తల్లి జుబేదా తన కుమారుడు సయ్యద్ చాంద్ బాషా అన్ని పనులను చేసుకుంటూ తన భార్య ఆయేషాను, ముగ్గురు పిల్లలను పోషించేవాడు. తన కోడలికి, కుమారునికి మనస్పర్థలుండటం, తన కుమారుడిని మామ షేక్ మహబూబ్బాషా ఇంటి వద్దకు తీసుకుని వెళ్లి పొట్టన బెట్టుకున్నాడని ఆరోపించారు. మామతో పాటు, అతని భార్య, కుమార్తె, ముగ్గురు కుమారులే కారణమని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.షేక్ మహబూబ్బాషానే తన అల్లుడు సయ్యద్ చాంద్బాషాను దారుణంగా హత్య చేశాడని, ఇందులో బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కడప చిన్నచౌక్ సీఐ ఓబులేసు తెలిపారు. కాగా పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు షేక్ మహబూబ్బాషాతో పాటు, ఇతర నిందితులు ఉన్నారని తెలిసింది. కాగా ఈ హత్యను ఆప్ కి ఆవాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, వక్ఫ్ పరిరక్షణ కమిటీ జేఏసీ నగర కో కన్వీనర్ ఒక ప్రకటనలో ఖండించారు. -
గర్భిణి ప్రాణం తీసిన మూఢనమ్మకం!
ఆదిలాబాద్ టౌన్: శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న ఈ రోజు ల్లోనూ ప్రజలు ఇంకా మూఢనమ్మకాలను వీడటం లేదు. నూతన ఇంటి నిర్మాణ సమయంలో భార్య కడుపుతో ఉండటం శుభసూచకం కాదని నమ్మిన ఓ భర్త.. గర్భిణి అయిన తన భార్యకు అబార్షన్ మాత్రలు ఇచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ఆరు నెలల గర్భిణి మృతిచెందింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బంగారుగూడకు చెందిన ప్రవళికకు మూడేళ్ల క్రితం మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్తో వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల బాబు ఉన్నాడు. ఇటీవల వారు నూతన ఇంటి నిర్మాణం చేపట్టినట్లు తెలిసింది. ఈ సమయంలో ఆమె గర్భం దాల్చడం అరిష్టమని భావించిన భర్త ప్రవళికకు అబార్షన్ మాత్రలు మింగించాడు. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం జరిగింది. చికిత్స నిమిత్తం కుటుంబీకులు జిల్లా కేంద్రంలోని రిమ్స్లో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆమె శనివారం మృతిచెందింది. కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ రూరల్ సీఐ ఫణీందర్ తెలిపారు. -
AP: పోలీసుల వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్య
తాడేపల్లి : ఏపీలో కూటమి ప్రభుత్వం అండదండలతో పోలీసులు రెచ్చిపోతున్నారు. ఇటీవల దళిత, మైనార్టీ వర్గాలకు చెందిన ముగ్గురు యువకులపై తెనాలి పట్టణంలో పట్టపగలే దాడి చేసిన పోలీసులు.. మరో యువకుడు ఆత్మహత్యకు కారణమయ్యారు. పోలీసుల వేధింపులతో సిద్ధేష్ శివాజీ అనే యువకుడు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ ధ్వజంతెనాలిలో పోలీసుల వేధింపులతో మరొకరు బలికావడంపై వైఎస్సార్సీపీ మండిపడింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వలనే తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ ధ్వజమెత్తింది. కొందరు పోలీసుల దారుణాలకు పాల్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ విమర్శించింది. ఈ సంఘటనపై నేషనల్ మీడియాను ట్యాగ్ చేస్తూ వైఎస్సార్సీపీ ట్వీట్ చేసింది.కాగా, బంగారం రికవరీ కేసులో సిద్ధేష్ ను పోలీసులు వేధింపులకు గురి చేశారు. ఆ ఒత్తిడి, వేధింపులు తట్టుకోలేక సిద్ధేష్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీన్ని తప్పించుకోవడానికి సిద్ధేష్ మృతదేహాన్ని మహారాష్ట్రకు తరలించారు. Same Tenali cops behind another tragedy: Siddhesh dies after police harassmentTenali, June 1: The same police officers who were recently caught on video brutally assaulting three Dalit youths in broad daylight in Tenali are now being accused of driving another young man,… pic.twitter.com/rFyyglLpXk— YSR Congress Party (@YSRCParty) June 1, 2025 -
తెనాలిలో విషాదం.. బంగారం వ్యాపారి ఆత్మహత్య
సాక్షి, గుంటూరు: తెనాలిలో విషాదం చోటు చేసుకుంది. బంగారం వ్యాపారి సిద్దేశ్ శివాజీ ఆత్మహత్యకు పాల్పడ్డారు. బంగారం వ్యాపారి ఆత్మహత్య పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిద్దేశ్ శివాజీ ఆత్మహత్యకు పోలీసులు వేధింపులే కారణమని సమాచారం.దొంగ బంగారం కేసులో సిద్దేశ్ శివాజీని కొంత బంగారం ఇవ్వమని పోలీసులు వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు కొందరు ఆరోపిస్తున్నారు. సిద్ధేష్ శివాజీ మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
వైఎస్సార్ జిల్లాలో దారుణం.. భార్యపై అనుమానంతో..
సాక్షి, వైస్సార్ జిల్లా: జిల్లాలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో ఉరివేసి చంపిన భర్త.. తాను ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెన్నూరు పట్టణంలో ఈ ఘటన జరిగింది. బంధువుల సమాచారం ప్రకారం.. కొత్త గాంధీనగర్ చెందిన వల్లెపు నిత్యానంద్ 11 రోజుల క్రితం కువైట్ నుంచి స్వగ్రామానికి నిత్యానంద తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి భార్యపై అనుమానంతో చిన్నపాటి తగాదాలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో ఇవాళ తెల్లవారుజామున నిత్యానంద్ తన భార్య లక్ష్మీకుమారితో గొడవపడ్డాడు. దీంతో భార్యకు ఉరివేసిన భర్త.. తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులకు ఇద్దరు కుమార్తెలు గంగా మేఘన (8) గంగా మౌనిక (5) ఉన్నారు. సంఘటనా స్థలికి చేరుకున్న సీఐ కృష్ణారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కడప రిమ్స్కు తరలించారు. -
డ్రెస్సులు మార్చుతూ చోరీలు చేస్తున్న మహిళ
సికింద్రాబాద్: దొంగతనం చేసే సమయంలో మూడు డ్రెస్సులు మార్చుతూ తప్పించుకు తిరుగుతున్న నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈస్ట్జోన్ అదనపు డీసీపీ జే.నర్సయ్య, చిలకలగూడ ఏసీపీ కే.శశాంక్రెడ్డి, ఇన్స్పెక్టర్ మధుసూదన్రెడ్డి తెలిపిన మేరకు.. పార్సిగుట్టకు చెందిన దుర్గ ఇంట్లో ఈనెల 23న 6.7 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి, రూ.38 వేలు మాయమయ్యాయని బాధితురాలు వారాసీగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 500 సీసీ కెమెరాల పరిశీలనతో.... వారాసీగూడ పోలీసులు దుర్గ ఇంటి సమీపంలోని సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. పార్శిగుట్ట నుంచి మచ్చ»ొల్లారం వరకు ఉన్న సుమారు 500 కెమెరాలను పరిశీలించారు. మొత్తం పుటేజీల్లో ఒక మహిళ ప్రయాణం కనిపించింది. అయితే సీసీ కెమెరాలు మారినకొద్దీ ఆమె ధరించిన దుస్తులు మారుతుండడంతో పోలీసులకు అనుమానం వచి్చంది. మచ్చొల్లారం ప్రాంతంలో వరుస సీసీ కెమెరాలు పరిశీలించే సరికి ఒకే మహిళ «మూడు రకాల దుస్తుల్లో కనిపించడంతో ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దొంగతనానికి పాల్పడింది మచ్చ»ొల్లారం ప్రాంతానికి చెందిన గడ్డమీది విజయ (45)గా గుర్తించారు. విచారణలో మరో రెండు నేరాలుసీసీ పుటేజీలోని మహిళ పోలికల ఆధారంగా విజయను పట్టుకున్న పోలీసులు విచారింగా ఇదే తరహాలో దుస్తులు మార్చుతూ లోగడ మరో రెండు నేరాలకు పాల్పడినట్టు అంగీకరించింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని నేరేడ్మెట్ పీఎస్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అల్వాల్ పీఎస్ పరిధిలో తాళం వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలకు పాల్పడినట్టు పేర్కొంది. సీసీ కెమెరాల్లో పోలీసులు గుర్తించకుండా ఉండేందుకు తాను ఒక్కో దొంగతనం చేయడం కోసం చీర, జీన్స్, నైటీ ఇలా మూడు రకాల దుస్తులు ధరించినట్టు పేర్కొంది. నిందితురాలి నుంచి బంగారు ఆభరణాలు, నగదును స్వా«దీనం చేసుకున్న పోలీసులు రిమాండ్కు తరలించారు. -
చెల్లెళ్లు ఆటపట్టించడంతో అక్క ఆత్మహత్య
మర్రిపాలెం(విశాఖపట్నం): జ్ఞానాపురం గెడ్డ వీధికి చెందిన 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కంచరపాలెం పోలీసులు తెలిపిన వివరాలివి.. కిరణ్మయి (15) తల్లిదండ్రులు, చెల్లెళ్లతో కలిసి నివాసం ఉంటోంది. ఇటీవల పదో తరగతి పరీక్షల్లో ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది. అయితే బాలికను చెల్లెళ్లు నిత్యం ఏదో ఒక విషయంపై ఆటపట్టిస్తుండటంతో.. శుక్రవారం ఇంట్లో ఉన్న బాత్రూమ్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ సమయంలో తల్లిదండ్రులిద్దరూ ఇంట్లో లేరు. కొంతసేపటికి ఆమె తాత ఇంటికి రావడంతో, అక్క ఎక్కడికో వెళ్లిపోయిందని వారు అతనికి చెప్పారు. అంతా వెతికి, చివరికి బాత్రూమ్ తలుపులు పగలగొట్టి చూడగా, కిరణ్మయి విగతజీవిగా కనిపించింది. వెంటనే కంచరపాలెం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. కాగా బాలిక తండ్రి ఎండాడలో వెల్డింగ్ పనులు చేస్తుండగా, తల్లి గౌరి నగరంలో ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
గొంతు కోసిన కత్తి ఏమైంది?
నాయుడుపేట టౌన్(తిరుపతి): నాయుడుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఉన్న లాడ్జీలో జంట ఆత్మహత్య ఘటన మిస్టరీగా మారింది. లాడ్జీలో కొన్ని గంటల పాటు సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, మృతుడి గొంతు కోసిన కత్తి కనిపించకపోవడం.. మృతుల సెల్ ఫోన్లు ఎక్కడున్నాయో తెలియక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. వారి కథనం మేరకు.. దొరవారిసత్రం మండలం, ఏకొల్లు పంచాయతీ, కుప్పారెడ్డిపాళెం గ్రామానికి చెందిన జమ్మల సుబ్రహ్మణ్యం, అలీయాస్ మణి, అదే గ్రామానికి చెందిన బొడిపెద్ద శీరిష వివాహేతర సంబంధం పెట్టుకుని ఇద్దరూ నాయుడుపేట పట్టణంలోని ఓలాడ్జీలో గురువారం అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ ఘటనపై మణి తల్లి జమ్మల లక్ష్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ బాబి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మణి గొంతుపై కత్తితో కోసిన గాట్లు ఉండడం, అతని మృతదేహంపై నుంచే కుర్చీ వేసుకుని చున్నీతో శీరిష ఉరేసుకుని మృతి చెంది ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా గొంతు కొసుకునేందుకు వినియోగించిన కత్తి లాడ్జీ గదిలో ఎక్కడా లభించలేదు. మృతు లు మణి, శీరిష సెల్ ఫోన్లు సైతం లేకపోవడం మిస్టరీగా మారింది. మణి, శీరిష మధ్య ఏదైనా గొడవ జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. శీరిష పథకం ప్రకారమే మణికి అతిగా మద్యం తాగించి కత్తితో గొంతు కొసి హతమార్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. తర్వాత ఆమె కూడా గదిలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అంతేకాకుండా లాడ్జీ సిబ్బంది వ్యవహర శైలిపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తు న్నారు. లాడ్జీలో సీసీ కెమెరాలు కొన్ని గంటల పాటు పనిచేయకపోవడంపై విచారిస్తున్నారు. మృతులు ఇద్దరూ నాయుడుపేట లాడ్జీలో బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు పలుమార్లు రిసెప్షన్ వద్దకు రావడం గుర్తించారు. శిరీష లాడ్జీ కిందకు వచ్చి పలువురితో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఈ మేరకు అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మేరకు మణి, శిరీష మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.ప్రేమ జంట ఆత్మహత్య -
గచ్చిబౌలి: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.. 13 మందికి తీవ్ర గాయాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం సంభవించింది. గోపనపల్లి(Gopanpally) సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం(Road Accident) సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు స్థానికుల సాయంతో క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన అదనపు సమాచారం అందాల్సి ఉంది.ఇదీ చదవండి: భర్తకు మెసేజ్ పెట్టి బలవన్మరణం -
హైదరాబాద్: దాబాలో రూ.3 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్ను పట్టుకున్నారు. కిలోన్నర హెరాయిన్ను ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షాద్నగర్ సమీపంలోని ఓ డాబాలో డ్రగ్స్ విక్రయిస్తున్నారు. హెరాయిన్తో పాటు గంజాయి, ఓపీఎం డ్రగ్స్ సీజ్ చేశారు. రూ.3 కోట్లకు పైగా విలువ చేసే డ్రగ్స్ను ఎస్వోటీ స్వాధీనం చేసుకుంది. సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి వివరాలను మీడియాకు వెల్లడించారు. కుక్గా పని చేసే వికాస్ సోహు.. రాజస్థాన్ నుంచి డ్రగ్స్ను తీసుకొచ్చి అమ్ముతున్నాడు. డాబాకు వచ్చే కస్టమర్లకు మాత్రమే మాత్రమే అమ్ముతున్నారని సీపీ తెలిపారు.నిందితుడు ఫోన్ను స్వాధీనం చేసుకున్నామని.. అతని కాంటాక్ట్ ఆధారంగా కస్టమర్స్పై దృష్టి పెట్టామని సీపీ వెల్లడించారు. మధ్యప్రదేశ్, హైదరాబాద్కు చెందిన వ్యక్తులతో లింక్స్ ఉన్నాయని.. ఈ కేసులో రూ.89,700 నగదు, రూ. 30 వేల విలువైన మూడు మొబైల్ ఫోన్లు, వేయింగ్ మిషన్, ప్యాకింగ్ కవర్ ప్యాకెట్ సీజ్ చేశామని సీపీ తెలిపారు. ధూల్పేట్కు చెందిన సలీమ్, మహేశ్వరానికి చెందిన రాజు, మధ్యప్రదేశ్కి చెందిన మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు సీపీ వెల్లడించారు. -
ప్రతీ పనికి నిన్ను ఇబ్బంది పెడుతున్నా.. ఈ జీవితం నాకొద్దు!
ఏలూరు టౌన్: అన్నింటికీ నీపై ఆధారపడుతున్నాను.. ఇక నీకు భారం కాలేను.. పిల్లల్ని జాగ్రత్తగా చూస్కోండి అంటూ భర్తకు ఫోన్లో మెసెజ్ పెట్టి ఓ వివాహిత గోదావరిలోకి దూకి తనువు చాలించింది. వివరాలు ఇలా ఉన్నాయి. రాజమండ్రి లాలా చెరువు స్పిన్నింగ్ మిల్లు ప్రాంతానికి చెందిన సుంకరం రామకృష్ణ, కళ్యాణి (32) దంపతులు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. ఏలూరు శాంతినగర్ 21 వ డివిజన్ సచివాలయంలో కళ్యాణి ఏఎన్ఎంగా పనిచేస్తుండడంతో ఆమె కుటుంబంతో స్థానికంగానే నివాసముంటున్నారు. రెండేళ్ల క్రితం ఆమెకు ఒక రోడ్డు ప్రమాదంలో కాలికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమె సరిగా నడవలేని పరిస్థితిలో భర్తపై ఆధారపడి జీవనం సాగిస్తోంది. ఆమె చేస్తున్న ఉద్యోగంలో, కుటుంబ జీవనంలోనూ భర్తపై ఆధారపడుతోంది. ఒకవైపు కరోనా వ్యాప్తి చెందుతుందనే భయం, మరోవైపు పని భారం పెరగడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆమె బుధవారం ఎవరికీ చెప్పకుండా రాజమండ్రి వెళ్లింది. భర్త రామకృష్ణకు ఫోన్లో.. ప్రతి పనికి నీ మీద ఆధార పడి ఉంటున్నా.. నిన్ను ఇబ్బంది పెడుతున్నాను.. నాకు జీవితంపై విరక్తి కలిగింది.. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అని మెసేజ్ పెట్టింది. దీంతో ఏలూరు త్రీ టౌన్ పోలీస్స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా సెల్ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేశారు. లొకేషన్ రాజమండ్రిలో చూపించగా అక్కడకు వెళ్లి వెదికారు. తీరా చూస్తే ఆమె గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై రాజమండ్రి త్రీ టౌన్ సీఐ వీ అప్పారావు ఆధ్వర్యంలో మృతదేహాన్ని రాజమండ్రి సర్వజన ఆసుపత్రి మార్చురీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాజమండ్రి త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
రౌండప్ చేసి.. అబ్బాయి మెడలో బంగారు గొలుసు కొట్టేశారు
బంజారాహిల్స్: బస్సు దిగుతున్న ప్రయాణికుడి మెడలోని బంగారు లాక్కొని పరారైన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–10లోని నూర్నగర్బస్తీలో నివసించే వి.ఓంసాయిప్రకాష్ అనే విద్యార్థి మెహిదీపట్నంలో 19కే బస్సు ఎక్కాడు. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–7లోని జీవీకే బస్టాప్లో దిగుతుండగా అంతక ముందే విరించి బస్టాపులో ఎక్కిన నలుగురు వ్యక్తులు పథకం ప్రకారం తాము కూడా దిగుతున్నట్లు నటించి సాయిప్రకాష్ మెడలో నుంచి గొలుసు తస్కరించి ఆయనకు కిందకు తోసేసి పరారయ్యారు. గొలుసు చోరీకి గురైనట్లు గుర్తించి అదే బస్సు ఎక్కి నిందితుల కోసం గాలించాడు. అయితే అప్పటికే వారంతా దిగిపోయినట్లు కండక్టర్ తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారుఉద్యోగం ఇప్పిస్తానని మోసం వెంగళరావునగర్ : ఉద్యోగం పేరుతో ఓ యువకుడిని మోసం చేసిన ఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. దమ్మాయిగూడెం ప్రాంతానికి చెందిన ఎం.నాని ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంటాడు. ఐదు నెలల కిందట సంధ్య, సంజయ్ అనే వ్యక్తులు అతనికి పరిచయమయ్యారు. తనకు మంచిజీతం ఇచ్చే జాబ్ కావాలని వారితో చెప్పడంతో రూ.1.40 లక్షలు చెల్లిస్తే జాబ్ ఇప్పిస్తామని చెప్పారు. దాంతో నాని వారు అడిగిన నగదును అందజేశాడు. అమీర్పేటలోని వాసవీ ఎంపీఎం మాల్లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం ఇప్పించారు గాని జీతం మాత్రం ఇవ్వలేదు. పలుమార్లు అడిగినా తప్పించుకుని తిరుగుతున్నారు. నాని వారి వివరాలు ఆరా తీయగా యువతీ యువకుడి అసలు పేర్లు షేక్ నాగూర్బీ, షేక్ సుభానీలుగా తెలిసింది. తనను మోసం చేసి నగదు తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
తల్లిదండ్రులు మందలించారని బాలిక ఆత్మహత్య
చింతపల్లి(అల్లూరి సీతారామరాజు): మండలంలో తల్లిదండ్రులు ఇంటి పనులు చేయలేదని మందలించడంతో బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామారావుపాలెం జరిగింది. అన్నవరం ఎస్ఐ వీరబాబు, కు టుంబీకులు అందించిన వివరాలిలా ఉ న్నాయి. లోతుగెడ్డ పంచాయతీ పరిధిలో రామారావుపాలెం గ్రామానికి చెందిన బాలిక పాంగి దివ్య(13) వంగసార గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది. వేసవి సెలవులకు ఇంటికి వచ్చిన బాలిక అధిక సమయం చదవకుండా, ఏ పని చేయకుండా ఉండడంతో తండ్రి పాంగి బిట్టు, తల్లి కుమారి రెండురోజులు క్రితం మందలించారు. బుధవారం ఉదయం కూడా ఖాళీగా ఉండవద్దు ఇంటి పనులు, వ్యవసాయ పనుల్లో సహాయం చేయాలని మందలించి తల్లిదండ్రు లు వ్యవసాయ పనులకు వెళ్లిపోయారు. దీంతో మనస్థాపానికి గురైన బాలిక గ్రా మానికి సమీపంలో ఉన్న పంటపొలాల్లో ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 10 గంటల సమయంలో అటుగా వెళ్తున్న స్థానికులు ఉరి వేసుకున్న బాలికను గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చింతపల్లి ఏరియా ఆసుపత్రిలో బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్టు ఎస్ఐ వీరబాబు తెలిపారు. -
భర్త కర్కశత్వం.. భార్య హతం
యశవంతపుర(కర్ణాటక): ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కత్తివేటుకు బలి చేశాడు కర్కోటక భర్త. ఈ ఘటన చిక్కమగళూరు తాలూకా కైమరా చెక్పోస్టు వద్ద జరిగింది. అవినాశ్(32) కీర్తి(26)లు నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు రెండన్నరేళ్ల చిన్నారి ఉంది. వీరి సంసారం సవ్యంగా సాగుతుండగా ఇటీవల కలతలు ఏర్పడ్డాయి. విడాకులు ఇవ్వాలని అవినాశ్ ఒత్తిడి చేసేవాడు. భార్య నాలుగు నెలల గర్భిణిగా ఉండగా అబార్షన్ చేయించినట్లు తెలిసింది. కొంతకాలంగా పుట్టింటిలో ఉన్న కీర్తి బట్టలు తీసుకురావటానికి బుధవారం భర్త వద్దకు వచ్చింది. ఆ సమయంలో అవినాశ్ కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. చుట్టు పక్కలవారు గమనించి బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పోందుతూ మృతి చెందింది. అవినాశ్ అక్క వల్లనే తమ కుమార్తె కాపురంలో కలతలు ఏర్పడ్డాయని మృతురాలి తల్లిదండ్రులు చిక్కమగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి పరారీలో ఉన్న అవినాశ్ కోసం గాలింపు చేపట్టారు. -
అప్పులు తీర్చేందుకు సూడో నక్సల్ అవతారమెత్తి..
హైదరాబాద్: పారిశ్రామిక వేత్త కూన రవీందర్ గౌడ్ను బెదిరించి రూ. 50 లక్షలు డిమాండ్ చేసిన కేసులో జీడిమెట్ల పోలీసులు ఇద్దరు సూడో నక్సలైట్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాడు. బుధవారం జీడిమెట్ల పోలీస్స్టేషన్లో బాలానగర్ ఏసీపీ పింగళి నరేష్ రెడ్డి, ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ డీఐ కనకయ్యలతో కలిసి వివరాలు వెల్లడించారు. విజయవాడ, గన్నవరానికి చెందిన యర్రంశెట్టి రాజు అక్కడ చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లివచ్చాడు. వ్యసనాలకు బానిసైన అతను అప్పులు చేసి జల్సా చేశాడు. అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చేస్తుండటంతో ఎలాగైనా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు.ఈ నేపథ్యంలో షాపూర్నగర్లో తాను నివాసం ఉంటున్న ఇంటి యజమాని కూన రవీందర్గౌడ్ను బెదిరించి డబ్బు లాగాలని పథకం వేశాడు. ఇందులో భాగంగా గన్నవరానికి చెందిన తన స్నేహితుడు కందురెల్లి రాజు(24)ను నగరానికి రప్పించుకున్నాడు. ఈనెల 21న రాత్రి పథకం ప్రకారం కందురెల్లి రాజును కూన రవీందర్గౌడ్ ఇంటికి పంపించాడు. స్నేహితుడు చెప్పినట్లుగానే అతను మెయిన్ గేట్లోనుంచి ఇంట్లోకి ప్రవేశించాడు. మొదటి అంతస్తులోకి వెళ్లి కిందికి వచ్చాడు. అక్కడ ఉన్న తులసి మొక్కను పీకేశాడు. అనంతరం ఎర్రరంగు టవల్లో ఓ లేఖను ఉంచి కారుపై పెట్టి వెళ్లిపోయాడు. మర్నాడు ఉదయం రవీందర్గౌడ్ కారుపై ఉన్న లేఖను చదివిన రవీందర్ గౌడ్ జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసును సవాల్ తీసుకున్న పోలీసులు ఏసీపీ నరేష్ రెడ్డి నేతృత్వంలో జీడిమెట్ల ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్, డీఐ కనకయ్య, ఎస్సై ప్రేమ్సాగర్ రంగంలోకి దిగారు. దాదాపు 500 సీసీ కెమరాలను పరిశీలించి రవాందర్గౌడ్ ఇంట్లో అద్దెకు ఉంటున్న యర్రంశెట్టి రాజును నిందితుడిగా గుర్తించారు.దీంతో యర్రంశెట్టి రాజు, అతని స్నేహితుడు కందురెల్లి రాజులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. వారి నుంచి 13నాటు బాంబులు, 4 సెల్ఫోన్లు, ఒక బెదిరింపు ఉత్తరాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. ఈ కేసును చేదించిన ఇన్స్పెక్టర్ మల్లే‹Ù, డీఐ కనకయ్య, ఎస్సై ప్రేమ్సాగర్, పీసీలు నరేష్, రవినాయక్, వెంకటే‹Ùలను ఏసీపీ అభినందించి రివార్డులు అందజేశారు. కాగా నాటు బాంబులు ఎలా వచ్చాయనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. -
చీకటి.. ఆ కుటుంబాన్ని చిమ్మ చీకటిలోకి నెట్టేసింది..!
చీకటి.. రిలాక్స్ డ్ గా ఉండే సమయంలో చీకటిని ఒకింత ఆస్వాదిస్తాం. కానీ అదే చీకటిలో ఎక్కువ సేపు ఉండాలంటే ‘వామ్మో’ అంటాం. చాలా మంది చీకటి అంటేనే భయపడతారు. మరి అదే చీకటి కారణంగా ఓ జీవితంలో చిమ్మ చీకటి ఏర్పడితే పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఓ కుటుంబాన్ని చీకటి పూర్తిగా అంధకారంలోకి నెట్టేసిందనే చెప్పాలి. అది వారి తలరాత అనుకోవాలో.. లేక విధి ఆడిన నాటకమనుకున్నా ఓ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ లో రాయల్ ఫార్మ్ విల్లా కాలనీలో చోటు చేసుకున్న విషాదానికి చీకటే కారణంగా నిలిచింది. ఒకవైపు భారీ వర్షం, ఈదురు గాలులతో కరెంట్ పోతే, అదే సమయంలో ఓ చిన్నారి లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన ఘటన తండ్రి ప్రాణాల మీదకు తెచ్చింది. రాయల్ ఫార్మా అపార్ట్ మెంట్ లోని 307 ఫ్లాట్ లో ఉంటుంన్న రిషిరాజ్ కుటుంబం ఇప్పుడు చీకటి తెచ్చిన విషాదాన్ని తల్చుకుని రోదిస్తున్న తీరు వర్ణనాతీతంగా మారింది.కొడుకును రక్షించబోయి..సోమవారం(మే 26 వ తేదీ) రాత్రి గం. 10 లకు. భారీ వర్షం కారణంగా పవర్ సప్లై నిలిచిపోయింది. ఆ సమయంలో రిషిరాజ్ తన ఎనిమిదేళ్ల కొడుకు దేవాన్ష్ గురించి ఆరా తీశాడు. అయితే ఆ పిల్లాడు కిందకు వెళ్లాడని తల్లి చెప్పడంతో తండ్రి రిషిరాజ్ హుటాహుటీనా దేవాన్ష్ గురించి వెతకడం ప్రారంభించాడు. అయితే ఆ సమయంలో ఆటోమేటిక్ గా పని చేయాల్సిన జనరేటర్ పని చేయకపోవడాన్ని గ్రహించాడు.దేవాన్ష్.. దేవాన్ష్ అంటూ ఆ ఫ్లోర్ నుంచే అరవడం ప్రారంభించాడు. అయితే పాప..పాప(నాన్న నాన్న) అంటూ చిన్నగా ఓ గొంతు వినిపించింది. అది తన కుమారుడుదేనని గ్రహించిన తండ్రి.. తన పిల్లాడికి ధైర్యం చెబుతూ కిందకు జనరేటర్ ఉన్న స్థలానికి పరుగు తీశాడు. అంతే నిమిషాల వ్యవధిలో లిఫ్ట్ ఆన్ చేయడం, ఆ తండ్రి అక్కడే కుప్పకూలడం జరిగిపోయాయి.విధి రాత అంటే ఇదేనేమో..ఆ కాలనీ ఎంతో సంతోషంగా ఉంటూ అందరి సమస్యలను పట్టించుకునే రిషిరాజ్ ఇక లేడనే వార్త స్థానికంగా ఉన్నవారిని తీవ్రంగా కలిచివేసింది. చీకటి.. ఆ జీవితాన్ని చిమ్మ చీకటిలో నెట్టేసిందని, విధి రాత అంటే ఇదేనేమో అంటూ వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక ఆ కుటుంబం పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. రిషిరాజ్ భార్య, పిల్లల్ని ఓదార్చడం కాలనీ వాసుల వల్ల కావడం లేదు. జనరేటర్ ఆన్ చేయడానికి వెళ్లి ఇలా కుప్పకూలిపోవడంతో ఆ కుటుంబం పెద్ద దిక్కులేనిదిగా మిగిలింది.సీపీఆర్ చేసి ప్రయత్నించినా..రిషిరాజ్ కుప్పకూలడంతో తొలుత సీపీఆర్ చేశారు. ఆ చీకటిలో రిషిరాజ్ కుప్పకూలిపోవడాన్ని కాస్త ఆలస్యంగా గ్రహించడంతో సీపీఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. ప్రాణం కోల్పోయి జీవచ్ఛవంలా పడిఉన్న రిషిరాజ్ ను ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు.లిఫ్ట్ అంటే భయం..లిఫ్ట్ ఎక్కి అందులో ఇరుక్కుపోయిన దేవాన్ష్.. ఒకప్పుడు అదే లిఫ్ట్ అంటే తీవ్రంగా భయపడిపోయేవాడట. క్రమేపీ లిఫ్ట్ భయాన్ని తండ్రి పోగొట్టినా, చివరకు అదే లిఫ్ట్ కారణంగా తన తండ్రి ఆందోళనకు లోనై ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబాన్ని మరింత బాధిస్తుంది. ఇదే విషయాన్ని రిషిరాజ్ భార్య పదే పదే గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు.లోతుగా దర్యాప్తు ..అయితే దీనిపై కేసు నమోదు చేసుకున్న మిస్రోడ్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక సమస్య కారణంగా జనరేటర్ ఆగిపోవడం, అదే సమయంలో లిఫ్ట్ ఆన్ చేయడానికి రిషిరాజ్ వెళ్లి అక్కడే పిల్లర్ కింద పడి ఉన్నాడని ప్రాథమిక దర్యాప్తులో తేలినా, దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు సదరు పోలీస్ స్టేషన్ అధికారి మనీష్ రాజ్ భడోరియా తెలిపారు. -
అశోక్ నన్ను వదిలేయ్.. నా బతుకు నేను బతుకుతా..!
మదనపల్లె రూరల్(అన్నమయ్య జిల్లా) : భర్త వేధింపులు భరించలేక, క్షణికావేశంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన వివాహిత ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. కర్నాటక రాష్ట్రం చింతామణికి చెందిన రాణి(30) భర్తతో విడాకులు తీసుకుని కుమార్తె లేఖన, కుమారుడు సుమిత్తో వేరుగా ఉంటోంది. ఈ క్రమంలో మూడేళ్ల కిందట సత్యసాయిజిల్లా పాలసముద్రం మండలం బోయలపల్లెకు చెందిన డ్రైవర్ అశోక్తో రాణికి పరిచయం ఏర్పడి సహజీవనం చేసేంతవరకు వెళ్లింది. అయితే అశోక్కు అంతకు మునుపే తంబళ్లపల్లెకు చెందిన మౌనిషాతో వివాహమైంది. ప్రస్తుతం ఆమె గర్భిణిగా ఉంది. కొద్దిరోజుల క్రితం అశోక్కు ప్రమాదంలో కాలు విరగడంతో రాణి దగ్గరుండి చికిత్స చేయించి, కోలుకున్నాక స్వగ్రామంలో విడిచిపెట్టింది. తల్లిదండ్రుల సూచన మేరకు అశోక్తో సహజీవనం వద్దనుకుని బెంగళూరుకు వెళ్లి కూలిపనులు చేసుకుంటోంది. ఈనెల 22న గురువారం అశోక్ రాణికి ఫోన్చేసి నీతో మాట్లాడాలని కోరడంతో కుమార్తె లేఖనను వెంటతీసుకుని 23 వ తేదీ శుక్రవారం మదనపల్లెకు వచ్చింది. ఇద్దరూ కలుసుకున్నాక, తమ బంధం కొనసాగింపు విషయమై గొడవపడ్డారు. నీ వేధింపులు నేను భరించలేనంటూ మనస్తాపంతో రాణి కుమార్తెను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది.దీంతో ఆమె కోసం పట్టణమంతా వెతికి కనిపించకపోవడంతో రాత్రి ఊరికి వెళ్లేందుకు అశోక్ ఆర్టీసీ బస్టాండుకు చేరుకున్నాడు. బస్టాండ్లో రాణి కనిపించడంతో మరోసారి ఆమెతో గొడవకు దిగాడు. దీంతో ఆవేశంతో రాణి బస్టాండ్ వెనుక వైపు ఉన్న కోమటివానిచెరువు కట్ట వద్దకు వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన. ప్రమాదంలో ఆమె శరీరం 70 శాతానికి పైగా కాలిపోయింది. గమనించిన స్థానికులు హుటాహుటిన ఆమెను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించగా, టూటౌన్ పోలీసులు ఆమె నుంచి వాంగ్మూలం నమోదు చేశారు. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ, పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందింది. -
మోసాలకు పాల్పడుతున్న యువతి అరెస్టు!
మిర్యాలగూడ అర్బన్: తాను డాక్టర్, ఐఏఎస్ అధికారిని అంటూ డబ్బున్న యువకులను గుర్తించి మోసాలకు పాల్పడుతున్న యువతిని మిర్యాలగూడ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. మిర్యాలగూడ మండలం లావుడితండాకు చెందిన ఓ యువతి కొంత కాలంగా డబ్బున్న యువకులను బ్లాక్మెయిల్ చేసి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. ఆమెపై మలక్పేట, చైతన్యపురి, ఉప్పల్, నల్లగొండ టూటౌన్, మిర్యాలగూడ వన్టౌన్, నార్కట్పల్లి పోలీస్స్టేషన్లో పలు కేసులు నమోదయ్యాయి. గత మూడు రోజుల క్రితం యువతి మర్డర్ అంటూ హైదరాబాద్లోని ఓ డీఎస్పీకి, మిర్యాలగూడ సబ్డివిజన్ పరిధిలో ఓ సీఐకి ఫోన్చేసి స్వీచ్ ఆఫ్ చేసినట్లు తెలిసింది. గత సంవత్సరం ఓ వైద్యుడిని బెదిరించి అతడి నుంచి రూ.5లక్షలు వసూలు చేసి ఉడాయించినట్లు సమాచారం. ఇటీవల ఓ యువకుడిని డబ్బులు డిమాండ్ చేయడంతోపాటు డబ్బులు ఇవ్వకుంటే చంపుతానని బెదిరించడంతో సదరు యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సదరు యువతి బాగోతం వెలుగుచూడటంతో నివ్వెరపోయారు. యువతిని అరెస్టు చేసిన పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా రిమాండ్ చేసినట్లు తెలిసింది. -
మనవరాలిని చూద్దామనుకొని మరలిరాని లోకాలకు..
మనవరాలిని చూడడానికి బయలుదేరిన వారు... ఆమెను కలవకుండానే అనంత లోకాల కు చేరుకున్నారు. వీరిని తమ కారులో తీసుకువెళుతున్న వారు కూడా ప్రమాదంలో చిక్కుకోవడంతో మరో ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. రాజానగరం/చాగల్లు/తాళ్లపూడి(కొవ్వూరు)/కంబాలచెరువు(రాజమహేంద్రవరం): రాజానగరం మండలం, దివాన్చెరువు శివారు గామన్ బ్రిడ్జి హైవేపై కొంతమూరు కేశవస్వామి ఆస్పత్రి వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రెండు కుటుంబాలకు చెందిన నలుగురు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో కొవ్వూరు, చాగల్లు మండలాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. దారవరం గ్రామానికి చెందిన లకంసాని సురేష్ భార్య బిందు (34), కొవ్వూరుకు చెందిన ఉప్పులూరి ప్రసాద్ (60), భార్య శివ లీలావతి (56)తో పాటు లీలావతి తల్లి చాగల్లు మండలం మార్కొండపాడు గ్రామానికి చెందిన ఇమ్మణి వీరవెంకట సత్యవతి(75) కలిసి సోమవారం ఉదయం కారులో కొవ్వూరు నుంచి కాకినాడ వెళుతుండగా లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లకంసాని సురేష్ తో పాటు భార్య బిందు కొవ్వూరులో నివాసం ఉంటున్నారు. పక్కపక్కనే నివాసం ఉంటున్న సురేష్ ప్రసాద్ కుటుంబ సభ్యులు బంధువులు కూడా. వీరంతా సురేష్ కారులో ఇంటి నుంచి బయలుదేరిన 30 నిమిషాల్లోనే మృత్యువాత పడటంతో బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మనవరాలు కన్నీరు మున్నీరు..మార్కొండపాడుకు చెందిన ఇమ్మణి సత్యవతి 20 రోజులు క్రితం కుమార్తె శివ లీలావతి అస్వస్థతకు గురి కావడంతో చూడ్డానికి వెళ్లారు. ఉప్పులూరి ప్రసాద్ కొవ్వూరులోని యువరాజ్ కేబుల్ ఆఫీసు వీధిలో ఇంట్లో నివాసం ఉంటున్నారు. ట్రక్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ప్రసాద్ హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నాడు. దీనికితోడు అతని భార్య శివ లీలావతి అనారోగ్యంతో బాధపడుతోంది. వీరి ఒక్కగానొక్క అమ్మాయి వివాహితైన భవాని సుమారు 15 ఏళ్ల కిందట విద్యుత్ షాక్కు గురై మృతి చెందింది. భవాని కుమార్తె పూజ (సిరి) కాకినాడలో ఇంజినీరింగ్ చదువుతోంది. దీంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న మనవరాలి పూజను చూసేందుకు వెళుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ముది అమ్మమ్మ, తాత, అమ్మమ్మలు ఒక్కసారిగా మృతిచెందడంతో పూజ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఏ నిమిషానికి ఏమీ జరుగునో.. మృత్యువు ఎప్పుడు, ఏ విధంగా కబళించుకుపోతుందో ఎవరికీ తెలీదు .. అంటే ఇదేనేమో? మండలంలోని దివాన్చెరువు గామన్ బ్రిడ్జి జాతీయ రహదారిపై కేశవస్వామి ఆస్పత్రికి సమీపంలో సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో లారీ, కారు ఢీ కొన్న ప్రమాదాన్ని చూస్తే నిజమనిపిస్తుంది. నాలుగు లేన్లతో టు వే గా ఉన్న ఈ రహదారిపై ఒక వైపు కారు, రెండో వైపు లారీ ప్రయాణిస్తూ పై ప్రాంతంలో ఒకదానిని ఒకటి ఢీ కొనడం చూస్తుంటే .. భగవంతుని రాతను ఎవ్వరూ తప్పించలేరని ఈ ప్రమాదాన్ని చూసిన వారంతా అంటున్నారు. కేశవస్వామి ఆస్పత్రికి సమీపంలో ఉన్న జంక్షన్ వద్ద లారీని మలుపు తిప్పే క్రమంలో అటుగా వచ్చిన కారును ఢీ కొనడంతో కారు నుజ్జునుజ్జయ్యింది. దీనితో అందులో ప్రయాణిస్తున్న వారంతా ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదం గురించి లారీ డ్రైవర్ రాజానగరం పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో నార్త్ జోన్ డీఎస్పీ వై. శ్రీకాంత్, సీఐ వీరయ్యగౌడ్, ఎస్సైలు, సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్ని క్రమబదీ్ధకరించి, ప్రమాదానికి గురైన రెండు వాహనాలను క్రేన్ల సాయంతో పక్కకు తొలగించారు. ప్రమాదానికి గురైన వారి వివరాలను తెలుసుకోవడంతోపాటు ప్రమాదానికి గల కారణాల పై ఆరా తీస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉందని సీఐ వీరయ్యగౌడ్ తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ లకంసాని ప్రసాద్కు కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో వెటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాద విషయం తెలియగానే మృతుల కుటుంబీకులు, బంధువులు ఆసుపత్రికి చేరుకున్నారు. మృతిచెందిన లకంసాని బిందు, ఉప్పులూరి ప్రసాద్, అతని భార్య లీలావతి, ఇమ్మని వీరవెంకటసత్యవతి మృతదేహాలకు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. టైర్ పంక్చర్ కాలేదు లారీ టైర్ పంక్చర్ కావడంతోనే కారుని ఢీకొట్టిందని చెబుతున్న మాటలు పూర్తి అవాస్తమని జిల్లా రవాణాశాఖాధికారి ఆర్.సురేష్ ఈ సందర్భంగా తెలిపారు. ఎక్కడా లారీ టైరు పేలిన దాఖలాలు లేవన్నారు. ప్రమాద స్థలికి సమీపంలో రవాణాశాఖాధికారులు వాహన తనిఖీలు చేస్తున్నారన్నారు. దాన్ని చూసి సడన్గా డ్రైవర్ లారీని తిప్పాడా...లేక క్లీనర్ లారీ డ్రైవ్ చేస్తున్నాడా అనేది తెలియాల్సి వుందని తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో 71 మీటర్ల మేర లారీ టైరు జారిపోయినట్లు గుర్తులు ఉన్నాయన్నారు. ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి నివేదికను కలెక్టర్కు అందజేస్తామన్నారు. తెల్లారేసరికే మా కూతురు బతుకు తెల్లారిపోయింది దారవరానికి చెందిన లకంసాని సురేష్ కొవ్వూరులో అవంతి ఫీడ్స్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. దీంతో భార్య బిందుతో కలిసి కొవ్వూరులో అద్దెకు నివాసం ఉంటున్నాడు. ఈ ప్రమాదంలో సురేష్ కు తీవ్ర గాయాలు కాగా రాజమహేంద్రవరంలోని బొల్లినేని ఆసుపత్రిలో అత్యవసర వైద్యసేవలు అందిస్తున్నారు. భార్య బిందు ఘటనా స్థలంలోనే మృతిచెందింది. చాగల్లుకు చెందిన బిందుకు, సురే‹Ùకు సుమారు ఆరేళ్ల క్రితం వివాహమైంది. మూడురోజుల క్రితం చాగల్లులో ఒక శుభాకార్యానికి హాజరై పుట్టింటికి వచ్చిందని, ఆదివారం రాత్రి ఫోన్ చేసి మాట్లాడిందని, సోమవారం అల్లుడు సురే‹Ùకు సెలవు కావడంతో బయటకు వెళ్లామని తనకు చెప్పిందని, తెల్లారిసరికి అనంతలోకాలకు తన కూతురు వెళ్లిపోయిందని తల్లి వెంకటలక్ష్మి, తండ్రి కొఠారు శ్రీను హృదయ విదారకంగా రోదిస్తున్నారు. -
ప్రియుడితో కలిసి భర్త హత్య
యశవంతపుర)(కర్ణాటక): ప్రియునితో కలిసి ఓ మహిళ భర్తను హత్య చేసిన ఘటన చిక్కమగళూరు జిల్లా ఎన్ఆర్పుర తాలూకా కరగుంద వద్ద జరిగింది. ఎన్ఆర్పుర పోలీసుస్టేషన్లో మొదట అనుమానాస్పద కేసు నమోదైయింది. అయితే భార్య, ప్రియుని పనేనని బయట పడింది. ఎన్ఆర్ పుర పట్టణానికి చెందిన సుదర్శన్ మృతదేహం కడుహినబైలు గ్రామం కరుగుండ బస్టాండ్ సమీపంలో శనివారం బయట పడింది. ఆమె భార్య కమల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనేక అనుమానాలు రావడంతో పోలీసులు విచారణకు రెండు బృందాలను రచించారు. విచారణలో కమల హత్య చేయించిన్నట్లు బయట పడింది. కమల 10 ఏళ్లు క్రితం సుదర్శన్ను ప్రేమించి పెళ్లి చేసుకొంది. కమల, శివరాజ్ అనే వ్యక్తితో అనైతిక సంబంధం పెట్టుకొంది. దీనికి భర్త సుదర్శన్ అడ్డుచెప్పేవాడు, దీంతో భర్తని అడ్డు తొలగించాలని ప్లాన్ వేసుకొన్నారు. మద్యంలో నిద్రమాత్రాలను కలిపి ఇవ్వడంతో స్పృహ తప్పి పడిపోయాడు. శివరాజ్ అతని స్నేహితులు కలిసి గొంతు పిసికి హత్య చేసి మృతదేహాన్ని పారవేశారు. నిందితులను అరెస్ట్ చేశారు. -
డ్యాన్స్ మాస్టర్ ఆత్మహత్య
మియాపూర్(హైదరాబాద్): కుటుంబ సమస్యలతో పాటు ప్రేమ విఫలమై ఓ డ్యాన్స్ మాస్టర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ కైలాసపూరికి చెందిన సాగర్ కుమార్ (17) ఇంటర్ వరకు చదువుకున్నాడు. కొన్నాళ్ల క్రితం నగరానికి వలస వచి్చన అతను మియాపూర్లోని గ్లోకుల్ ప్లాట్స్ని డెలయిట్ డాన్స్ స్టూడియోలో డ్యాన్స్ మాస్టర్గా పని చేస్తూ అక్కడే ఉంటున్నాడు. ఈ నెల 25న రాత్రి స్టూడియో మూసివేసిన తర్వాత స్టూడియో యజమాని పరమేష్ అతడికి ఫోన్ చేసి స్టూడియో డోర్లను లాక్ చేయాలని సూచించాడు. సోమవారం మధ్యాహ్నం యజమాని పరమేష్ స్టూడియోకు వెళ్లి చూడగా సాగర్ కుమార్ ఓ గదిలో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించాడు. మియాపూర్ పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సాగర్ కుమార్ స్టూడియోకు వచి్చనప్పటి నుంచి బాధపడుతూ ఉండేవాడని పది రోజుల క్రితం స్టూడియో యజమాని వంగాల పరమేష్ ఈ విషయమై అతడిని ప్రశి్నంచగా కుటుంబ సమస్యలు ఉన్నాయని, ఓ అమ్మాయిని ప్రేమించి విఫలమైనట్లు తెలిపాడన్నారు. స్టూడియో యజమాని పరమేష్ ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అడ్డుకునేందుకు వెళితే హత్య చేశాడు..
ఉప్పల్(హైదరాబాద్): బార్లో మద్యం సేవిస్తున్న యువకుల మద్య జరిగిన గొడవ ఓ అమాయకుడి ప్రాణాలు తీసింది. పక్క పక్క టేబుళ్లలో మద్యం సేవిస్తున్న యువకుల మద్య వివాదం చెలరేగడంతో అడ్డుకోబోయిన యువకుడి తలపై బీరు సీసాతో దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా, తిమ్మాజి పేట గ్రామానికి చెందిన భాస్కర్ నగరానికి వలసవచ్చి అంబర్పేట్, బాపూజీ నగర్లో నివాసం ఉంటూ కారు డ్రైవర్గా పని చేస్తున్నాడు. అతడి కుమారుడు పవన్(26) డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడు. ఆదివారం రాత్రి అతను తన స్నేహితుడు రిషికేష్ తో కలిసి రామంతాపూర్లోని గుడ్ డే బార్కు వెళ్లాడు. మద్యం సేవిస్తుండగా పక్క టేబుల్లో కూర్చున్న అంబర్పేట, పటేల్ నగర్ ప్రాంతానికి చెందిన శ్రావణ్ కుమార్ గౌడ్ హరికృష్ణ అనే వ్యక్తితో గొడవ పడి అతడిపై బీరు సీసాతో దాడి చేయడంతో అతడికి గాయాలయ్యాయి. పక్కనే ఉన్న పవన్ కుమార్ దీనిని అడ్డుకునేందుకు యత్నించడంతో శ్రావణ్ కుమార్ బీరు సీసాతో పవన్ తలపై బలంగా మోదాడు. దీంతో తీవ్రంగా గాయపడిన పవన్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై సమాచారం అందడంతో ఉప్పల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. పవన్ మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ అసుపత్రికి తరలించారు. దాదాపు అరగంట పాటు బార్లో గొడవ జరుగుతున్నా నిర్వాహకులు అడ్డుకోకపోవడమేగాక, పోలీసులకు సమాచారం అందించనందునే తన కుమారుడు మృతి చెందాడని మృతుడి తండ్రి భాస్కర్ ఆరోపిస్తున్నాడు. బార్ నిర్వాహకులతో పాటు తన కుమారుడిని హత్య చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
ఇద్దరి ప్రాణాలు తీసిన ఇన్ స్టా పరిచయం
-
మార్కులు తక్కువొచ్చాయని..
ముస్తాబాద్(సిరిసిల్ల): పాలిసెట్లో ర్యాంక్ రాలేదని మనస్తాపం చెందిన ఒక విద్యార్థిని ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఎస్ఐ గణేశ్ తెలిపిన వివరాలివి. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్కు చెందిన గూడ స్నేహిత (16) పదో తరగతి ఉత్తీర్ణురాలైంది. శనివారం విడుదలైన పాలిటెక్నిక్ ఎంట్రన్స్ (పాలిసెట్) ఫలితాల్లో ర్యాంక్ రాలేదని మనోవేదనకు గురైంది. శనివారం ఉదయం స్నేహిత తల్లిదండ్రులు.. బంధువుల ఇంట్లో జరిగిన పెళ్లికి వెళ్లారు. తమ్ముడు, తాతతో కలిసి ఇంట్లోనే ఉన్న స్నేహిత.. సాయంత్రం గదిలోకి వెళ్లి చీరతో ఉరి వేసుకుంది. గమనించిన తాత, తమ్ముడు గది తలుపులు బద్దలుకొట్టి చూడగా.. అప్పటికే మృతి చెందింది. మృతురాలి తల్లి స్రవంతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
కుటుంబాన్ని బలిగొన్న ప్రేమ
మైసూరు(కర్ణాటక): కూతురు ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయిందని తల్లిదండ్రులు సహా ముగ్గురు చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన మైసూరు జిల్లాలోని హెచ్డి కోటె తాలూకాలోని బూదనూరు గ్రామంలో జరిగింది. మహాదేవస్వామి, భార్య మంజుల, వీరి చిన్న కుమార్తె హర్షిత మృతులు. మహాదేవస్వామిపెద్దకుమార్తె హర్షిత రెండురోజుల క్రితం ప్రియునితో కలిసి ఎక్కడికో వెళ్లిపోయింది. గ్రామంలో తల ఎత్తుకోలేకపోయామని తల్లిదండ్రులు, చెల్లెలు ఆవేదనకు లోనయ్యారు. శనివారం గ్రామ సమీపంలోని చెరువులోకి దూకారు. చెరువు కట్టపై బైక్, చెప్పులు ఉండడంతో గ్రామస్తులు వెళ్లి చూడగా ఏమీ కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా ఫైర్ సిబ్బందితో వచ్చి చెరువులో గాలించగా ముగ్గురి మృతదేహాలు బయటపడ్డాయి. -
క్రిమినల్... కిడ్నాపర్స్
జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు జి.కృష్ణంరాజును 2006 సెప్టెంబర్13న దుండగులు కిడ్నాప్ చేశారు. ఆయన పెంపుడు శునకాన్ని కూడా వారు ఎత్తుకుపోయారు. ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, కోటి రూపాయలు డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై మల్లగుల్లాలు పడుతున్న పోలీసు అధికారుల్లో ఒకరికి వచ్చిన ‘విసిగించే కాల్’ విలువైన సమాచారం ఇచ్చింది.నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన గౌరు సురేష్ బీకాం పూర్తి చేశాడు. ఎంబీఏ చదవాలనే లక్ష్యంతో 1999లో హైదరాబాద్కు వచ్చి, బద్రుకా కాలేజీలో చేరాడు. అనివార్య కారణాలతో ఆ కోర్సులో డ్రాపౌట్గా మిగిలిన సురేష్.. బతుకుతెరువు కోసం దిల్సుఖ్నగర్లో ‘మార్చ్ స్టడీ సర్కిల్’ ఏర్పాటు చేశాడు. అది నష్టాల్నే మిగల్చడంతో తేలిగ్గా డబ్బు సంపాదించడానికి నేరాలబాట పట్టాడు. 17 దోపిడీలు, 11 బందిపోటు దొంగతనాలు చేసి, జైలుకు వెళ్లి వచ్చాడు. 2003 నుంచి కిడ్నాపర్ అవతారం ఎత్తిన సురేష్, పలువురు బడా బాబుల్ని కిడ్నాప్ చేసి, భారీ మొత్తాలు వసూలు చేసుకున్నాడు. ప్రతి నేరానికి ముందూ ఓ ముఠా కట్టే సురేష్ ఒకసారి వినియోగించిన అనుచరుడిని మరోసారి వాడడు. కిడ్నాప్ చేసిన వ్యక్తుల్ని నిర్మానుష్య ప్రాంతాల్లో నిర్భంధించేవాడు. కొందరినైతే వాహనంలోనే ఉంచుకుని, వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ, వారి కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి డబ్బు వసూలు చేసేవాడు. తిరుపతికి చెందిన ఓ వ్యాపారవేత్త కుమారుడిని కిడ్నాప్ చేయడానికి పథకం వేసిన సురేష్ 2006 ఏప్రిల్లో అక్కడి పోలీసులకు చిక్కాడు. ఈ కేసులో బెయిల్పై బయటకు వచ్చి హైదరాబాద్కు మకాం మార్చాడు. ఘరానా కిడ్నాపర్ గౌరు సురేష్ కన్ను జి.కృష్ణంరాజుపై పడింది. బి.సురేష్ కుమార్, ఎ.పరమేష్, కె.శ్రీనివాస్, కె.వెంకన్న, బి.నాగేశ్వరరావులతో ముఠా కట్టాడు. వీరిలో ఇద్దరు సస్పెన్షన్లో ఉన్న పోలీసులు. 2006 సెప్టెంబర్ 9న యూసుఫ్గూడలోని ఒక లాడ్జిలో గదులు బుక్ చేసుకున్న ఈ గ్యాంగ్ అక్కడే బస చేసింది. మూడు రోజుల పాటు జి.కృష్ణంరాజు కదలికలను నిశితంగా గమనిస్తూ, రెక్కీ చేసింది. ఈ కిడ్నాప్కు ముందు సురేష్ టవేరా వాహనాన్ని అద్దెకు తీసుకున్నాడు. కిడ్నాప్ తర్వాత కృష్ణంరాజును దాచి ఉంచడానికి జగద్గిరిగుట్ట సమీపంలో ఉన్న ఎల్లమ్మ బండను ఎంచుకున్నాడు. హైదరాబాద్కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి అక్కడ ఫామ్హౌస్ ఉండేది. ఆయన వీకెండ్స్లో కుటుంబంతో వెళ్లి అందులో గడిపేవారు. మిగిలిన రోజుల్లో కాపలాదారుడి దగ్గరే ఆ ఫామ్హౌస్ తాళాలు ఉండేవి. ఈ విషయం తెలుసుకున్న సురేష్ రెండు రోజుల కోసం ఫామ్హౌస్ ఇస్తే రూ.లక్ష ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. తన యజమానులు వారాంతాల్లో వస్తుండటం, సురేష్ కోరింది బుధ, గురువారాలు కావడంతో ఆ కాపలాదారు అంగీకరించాడు. 2006 సెప్టెంబర్ 13, బుధవారం లాడ్జి నుంచి బయలుదేరిన సురేష్ గ్యాంగ్, వాకింగ్ కోసం బయటకు వచ్చిన కృష్ణంరాజును ఆయన పమేరియన్తో సహా కిడ్నాప్ చేసింది. టవేరా వాహనంలో వెళ్తూ మాదాపూర్ ప్రాంతంలో ఆ శునకాన్ని కారు నుంచి బయటకు విసిరేసింది. టవేరా వాహనాన్ని సురేష్ నేరుగా ఎల్లమ్మబండకు తీసుకువెళ్లాడు. అయితే ఆ రోజు అనుకోకుండా ఫామ్హౌస్ యజమాని అక్కడకు రావడంతో కాపలాదారు చేతులెత్తేశాడు. దీంతో సురేష్ తనకు షెల్టర్ ఇచ్చే ఇతర వ్యక్తులు ఎవరనేది ఆలోచించాడు. ఇలా అతడికి గుర్తుకు వచ్చిన పేరే ఇక్బాల్ (పేరు మార్చాం). ఘరానా నేరగాడైన ఇక్బాల్తో సురేష్కు చంచల్గూడ జైలులోనే పరిచయం ఏర్పడింది. నగర పోలీసులకు ఉన్న ఇన్ఫార్మర్స్లో ఇక్బాల్ కూడా ఒకడు. అతడు వంద ఫోన్లు చేస్తే అందులో 95 మద్యానికి అవసరమైన డబ్బు కోసమే అయుండేది. దీంతో పోలీసులు కూడా కొన్ని సందర్భాల్లో అతడి ఫోన్లు ఎత్తేవాళ్లు కాదు. ఒకవైపు కృష్ణంరాజు కిడ్నాప్ ఉదంతంతో ఉలిక్కిపడిన పోలీసులు, టాస్క్ఫోర్స్ అధికారులు ఈ కేసుపై వరుస సమావేశాల్లో బిజీగా ఉన్నారు. సురేష్ తన వద్ద ఉన్న ఫోన్కు కేవలం అవసరమైనప్పుడు ఆన్ చేస్తుండటంతో దర్యాప్తు మరింత కష్టసాధ్యమైంది. మరోవైపు ఎల్లమ్మబండలో షెల్టర్ దొరక్కపోవడంతో సురేష్– ఇక్బాల్కు అసలు విషయం చెప్పి, రెండు రోజుల కోసం షెల్టర్ కోరాడు. ఈ విషయంపై టాస్క్ఫోర్స్లో తనకు నమ్మకస్తుడైన అధికారికి ఉప్పందించాలని భావించిన ఇక్బాల్, ఆయనకు వరుసపెట్టి ఫోన్లు చేశాడు. అయితే కృష్ణంరాజు కేసు బిజీలో ఉన్న ఆ అధికారి ఫోన్ కాల్ను కట్ చేస్తూ పోయారు.అయినా పట్టువదలని ఇక్బాల్ పదేపదే కాల్స్ చేస్తుండటంతో ఆయన అసహనం వ్యక్తం చేయడానికి ఫోన్ లిఫ్ట్ చేశారు.‘సాబ్ సిటీ మే కోయీ కిడ్నాప్ హువా క్యా’ అని ఇక్బాల్ అడగడంతో ఆ అధికారి అప్రమత్తమయ్యారు. సురేష్కు ఆశ్రయం ఇస్తానని చెప్పాలని, ఆపై అతడి ముఠాను తమకు పట్టించాలని కోరారు. దీనికి అంగీకరించిన ఇక్బాల్– సురేష్కు ఫోన్ చేసి కూకట్పల్లి వద్దకు రమ్మన్నాడు. అక్కడ ఇక్బాల్ను రోడ్డు పైన ఉంచిన పోలీసులు కాస్త దూరంలో కాపు కాశారు. సురేష్ టవేరాలో ఇక్బాల్ వద్దకు వచ్చి, అతడినీ ఎక్కించుకుని ఉడాయించేశాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని ఇక్బాల్ కొద్దిదూరం వెళ్లాక డ్రైవింగ్ సీటులోకి మారాడు. పాతబస్తీలో నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న ఇల్లు సిద్ధంగా ఉందని చెప్తూ, వాహనాన్ని సిటీలోకి తీసుకువచ్చాడు. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులకు నాంపల్లిలోని ఓ హోటల్ అడ్డాగా ఉండేది. అక్కడ ఏ సమయంలో అయినా కొందరు అధికారులు, సిబ్బంది ఉండేవాళ్లు. వేగులతో సమావేశాలను అక్కడే ఏర్పాటు చేసుకునే వాళ్లు. ఇక్బాల్కు ఈ విషయం తెలుసు. ఆ హోటల్ సెల్లార్ కేవలం ఓ చిన్న కారు పట్టేంత మాత్రమే ఉండేది. దీనిపై అవగాహన ఉన్న ఇక్బాల్, కారును నేరుగా సదరు హోటల్ సెల్లార్లోకి తీసుకువెళ్లిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న అధికారులకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేశాడు. హుటాహుటిన సెల్లార్లోకి దూసుకువచ్చిన అధికారులు సురేష్ ముఠాను పట్టుకోవడంతో పాటు కృష్ణంరాజును రెస్క్యూ చేశారు. ఇక్బాల్ను అభినందించిన పోలీసులు రివార్డు సైతం అందించారు. ఈ కేసులో జైలుకు వెళ్లి వచ్చినా తన పంథా మార్చుకోని సురేష్ 2008 జూలై 18న బేగంపేటలోని ఎయిర్ కార్గో కాంప్లెక్స్ వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో చనిపోయాడు. -
టీడీపీలో ఆధిపత్య పోరు.. ఇద్దరు నేతల దారుణ హత్య
పల్నాడు జిల్లా: మాచర్ల నియోజకవర్గంలో డబుల్ మర్డర్ కలకలం రేపింది. ఇద్దరు టీడీపీ నేతలు దారుణ హత్యకు గురయ్యారు. గుండ్లపాడు టీడీపీలో ఆధిపత్య పోరు కారణంగా ఇద్దరు బలయ్యారు. బైక్పై వెళ్తున్న టీడీపీ నేతలు ముద్దయ్య, ఆయన సోదరుడు కోటేశ్వరరావును ఆ పార్టీకే చెందిన మరో వర్గం స్కార్పియో ఢీకొట్టి చంపేసింది. వెల్దుర్తి మండలం బోదలవీడులో ఈ ఘటన జరిగింది.గత కొంతకాలంగా గ్రామంలో టీడీపీలోని రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎలాంటి గొడవలు జరగకుండా గ్రామంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
భర్తతో విడిపోయేందుకు పసికందును చంపేసింది.. ...
దుబ్బాక(మెదక్): మావనత్వం మంటగలిసింది.. నవమాసాలు మోసి.. పేగు తెంచుకొని పుట్టిన రెండు మాసాల పసికందును ఆ కర్కశ తల్లి బావిలో వేసి కడతేర్చింది.. ఆపై తన బిడ్డను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారంటూ డ్రామాకు తెరలేపింది.. అనుమానం వచ్చిన పోలీసులు ఆ కర్కశ తల్లిని అదుపులోకి తీసుకొని విచారించగా తానే బావిలో వేసి చంపానంటూ ఒప్పుకుంది. ఈ అమానుషమైన ఘటనకు సంబంధించి శుక్రవారం దుబ్బాక సీఐ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. సిద్దిపేట మండలం పుల్లూరుకు చెందిన రామగల శ్రీమాన్, నంగునూర్ మండలం నర్మెట్టకు చెందిన కవిత మూడేళ్ల కిందట ప్రేమ వివాహం చేసకున్నారు. వీరికి రెండు నెలల కిందట కుమారుడు పుట్టడటంతో దీక్షిత్ కుమార్ పేరు పెట్టారు. భర్త శ్రీమాన్ దొంగతనం కేసుల్లో రెండు సార్లు జైల్కు వెళ్లడం.. తనను సరిగ్గా చూసుకోకుండా మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తూ రావడంతోపాటు తల్లిదండ్రులకు దూరం కావడంతో కవిత కొద్ది రోజులుగా మానసికంగా కుంగిపోతూ వస్తుంది. భర్తతో ఉండటం ఇష్టం లేక కవిత ఎలాగైనా వదిలించుకోవాలనుకుంది. పది రోజుల కిందట అత్తగారిల్లు పుల్లూరులో గొడవపడి శ్రీమాన్ అమ్మమ్మ గారింటికి దుబ్బాక మండలం అప్పనపల్లికి వచ్చారు. శ్రీమాన్ 17వ తేదిన పని నిమిత్తం రుద్రారం గ్రామానికి వెళ్లి అక్కడే ఉన్నాడు. భర్తతో ఉండటం ఇష్టం లేక ఎలాగైన వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. ఇందుకు రెండు నెలల పసికందు దీక్షిత్ అడ్డుగా ఉన్నాడని భావించి ఓ పథకాన్ని వేసింది.కిడ్నాప్ డ్రామా..ఈ నెల 21న మధ్యాహ్నం 2 గంటల సమయంలో దీక్షిత్ను బావిలో పడేసింది. ఏం తెలియనట్లుగా ఇద్దరు వ్యక్తులు వచ్చి తన బిడ్డను ఎత్తుకెళ్లారంటూ కిడ్నాప్ డ్రామా ఆడి తన భర్తతో కలిసి బుధవారం రాత్రి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె మాటలు, ప్రవర్తన పట్ల అనుమానం వచ్చి కవితను అదుపులోకి తీసుకొని విచారించగా తనకు భర్తతో ఉండటం ఇష్టం లేకనే పసికందును బావిలో వేసినట్లు తెలపడంతో గురువారం బావిలో గాలించి పసికందు మృతదేహాన్ని వెలికితీసినట్లు సీఐ తెలిపారు. ఈ వ్యవహారంలో శ్రీమాన్కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. కవితను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు పేర్కొన్నారు. -
‘రాజస్థాన్ నేరం’ వెనుక లోకేంద్ర!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కాచిగూడకు చెందిన కార్టన్స్ ఫ్యాక్టరీ యజమాని హేమ్రాజ్ దుగ్గర్ ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న లోకేంద్ర బహదూర్ షాహి నేతృత్వంలోని ముఠా మరో నేరం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ పంజా విసరడానికి ఆరు నెలల ముందు ముంబైకి చెందిన ఓ బడా వ్యాపారి ఇంట్లో ఇదే పంథాలో 5 కేజీల బంగారం తస్కరించినట్లు ఇప్పటికే వెలుగులోకి వచ్చింది. దీంతో పాటు ఈ నెల 14 రాత్రి రాజస్థాన్లోని జైపూర్లో నివసించే కాంగ్రెస్ పార్టీ నేత సందీప్ చౌదరి ఇంట్లో రూ.6 కోట్ల సొత్తు దొంగతనానికీ ఇతడే సూత్రధారి అని ఆ పోలీసులు అనుమానిస్తున్నారు. దీన్ని ఖరారు చేసుకోవడానికి హైదరాబాద్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. వ్యవస్థీకృతంగా లోకేంద్ర వ్యవహారాలు.. కొన్నేళ్ల క్రితం నేపాల్ నుంచి వసలవచ్చిన లోకేంద్ర వ్యవస్థీకృతంగా ఈ చోరీలు చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక్కడి వ్యాపారుల ఇళ్లల్లో పని చేస్తున్న నేపాలీల్లో కొందరితో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. వారి ద్వారా ఆయా వ్యాపారుల కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు తెలుసుకుంటున్నాడు. అదను చూసుకుని అప్పటికే పని చేస్తున్న వారి ద్వారానే, ఆ స్థానంలో మరో నేపాలీని పనిలో పెట్టిస్తున్నాడు. ఆపై తన ముఠాతో రంగంలోకి దిగి ఆ ఇంటిని కొల్లగొట్టిస్తున్నాడు. ముంబైకి చెందిన వ్యాపారి ఇంట్లో ఇదే పంథాలో ఐదు కేజీల బంగారం తస్కరించారు. గత నెల్లో కాచిగూడలోనూ ఇలానే భారీ చోరీకి పాల్పడ్డారు. ఇక్కడ ఇంట్లో ఉన్న ఇద్దరు వృద్ధులకు మత్తు మందు ఇచ్చి తమ పని కానిచ్చారు.వైశాలీ నగర్లోనూ .. జైపూర్లోని వైశాలీనగర్లో ఉన్న సందీప్ చౌదరి ఇంట్లోనూ ఇదే పం«థాలో నేరం జరిగింది. ఈ ఇంట్లో పని చేసే మహిళతో పాటు ఓ పురుషుడు అదను కోసం ఎదురు చూశారు. సందీప్ జైపూర్లో లేని విషయం గమనించి మరో ఇద్దరికి సమాచారం ఇచ్చారు. ఆయన కుటుంబీకులతో మత్తు మందు కలిపిన టీ తాగించారు. అంతా అపస్మారక స్థితిలో ఉండగా ఆ ఇద్దరితో పాటు మరొకరినీ రప్పించిన ఈ ద్వయం ఇంట్లో ఉన్న నగదు, బంగారం, వెండి, వజ్రాభరణాలతో సహా రూ.6 కోట్ల విలువైన సొత్తుతో ఉడాయించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన ప్రత్యేక బృందం భరత్ బిస్త్, హరి బహదూర్ దామిలను అరెస్టు చేశారు. మిగిలిన ముగ్గురి ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. నిందితుల విచారణలో సరైన వివరాలు రాకపోవడంతో ఈ పంథాలో జరిగిన నేరాల వివరాలు ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే కాచిగూడ చోరీ వారి దృష్టికి వెళ్లింది. ఇక్కడా, అక్కడా ఒకేలా నేరం జరగడంతో జైపూర్ చోరీ వెనుకా లోకేంద్ర బహదూర్ షాహి పాత్రను అనుమానిస్తున్నారు. దర్యాప్తు కోసం వివరాలు కోరుతూ నగర పోలీసులను సంప్రదిస్తున్నారు. -
దారుణం.. మూడేళ్ల బాలికపై హత్యాచారం
వైఎస్సార్ జిల్లా: మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామంలో దారుణ ఘటన జరిగింది. తల్లిదండ్రులతో పాటు వివాహానికి వెళ్లిన మూడేళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడి హత్య చేశాడు. నిందితుడిని పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ప్రొద్దుటూరులోని అమృతనగర్కు చెందిన దంపతులు వారి మూడేళ్ల కుమార్తెతో బంధువుల పెళ్లి నిమిత్తం మైలవరం మండలం కంబాలదిన్నెకు వెళ్లారు.మూడేళ్ల బాలిక పెళ్లి మండపం బయట ఆడుకుంటుండగా.. ఓ వ్యక్తి అరటి పండు ఇస్తానని ఆశ చూపించి ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. విషయం బయటపడుతుందని బాలికను హత్య చేశాడు. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు సమీపంలో గాలించగా.. ముళ్ల పొదల్లో బాలిక మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
సీఎం రేవంత్ ఓఎస్డీనంటూ బెదిరింపులు.. మాజీ క్రికెటర్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి ఓఎస్డీ పేరుతో బెదిరింపులకు దిగుతున్న శ్రీకాకుళానికి చెందిన ఆంధ్రా మాజీ రంజీ క్రికెటర్ బుడుమూరు నాగరాజును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా పొలాకి మండలం యవ్వారిపేటకు చెందిన నాగరాజు ర్యాపిడో, కంట్రీ డిలైట్ ఎండీలకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.తాను సీఎం ఓఎస్డీ అని చెప్పుకొంటూ పలు రియల్ ఎస్టేట్ కంపెనీల ఛైర్మన్లకు వాట్సాప్ మెసేజ్లు పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఓఎస్డీ పేరుతో నాగరాజు ఫేక్ ఈ మెయిల్ క్రియేట్ చేసినట్టు పోలీసులు నిర్థారించారు. నాగరాజును శ్రీకాకుళంలోఅదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్టు సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాజీ క్రికెటర్ నాగరాజుపై 30 కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. శ్రీకాకుళంలో నాగరాజును అరెస్ట్ చేసిన పోలీసులు.. హైదరాబాద్కు తరలించారు. -
అనకాపల్లి: అచ్యుతాపురం కేంద్రంగా భారీ సైబర్ డెన్ గుట్టురట్టు
సాక్షి, అనకాపల్లి జిల్లా: అచ్యుతాపురం కేంద్రంగా భారీ సైబర్ డెన్ గుట్టురట్టరయ్యింది. అచ్యుతాపురం శివారులో ఫేక్ కాల్ సెంటర్ ముసుగులో ఈ సైబర్ కార్యకలాపాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 44 ఫ్లాట్స్ అద్దెకు తీసుకుని.. గత రెండేళ్ల నుండి సైబర్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు నిర్థారించారు. నెలకి రూ.15 నుంచి 20 కోట్ల టర్నోవర్ జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.అమెరికా పౌరులే లక్ష్యంగా కాల్ సెంటర్ ముసుగులో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న 33 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై, రాజస్థానకు చెందిన ఇద్దరు ప్రధాన మేనేజర్లు నడిపిస్తున్నారు. మేఘాలయ, సిక్కిం, అస్సాం, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాలకు చెందిన యువతీ యువకులు ఇందులో పనిచేస్తున్నారు. అమెరికా పౌరులతో ఎలా మాట్లాడాలో రెండు వారాలు ట్రైనింగ్ ఇస్తున్నారు. అమెజాన్ ఈ మార్కెట్ పేరుతో సైబర్ కాల్స్, వాల్నట్, సూపర్ మార్కెట్ గిఫ్ట్ కూపన్ లా పేరుతో నాలుగు దశల్లో ట్రాప్ చేస్తున్నారు.3 వందల డాలర్ల నుంచి 3,000 డాలర్ల వరకు కూపన్లు ఒక్కొక్కరికి అమ్ముతున్నారు. ఇందులో 200 నుండి 250 మంది కాల్ సెంటర్లో పని చేస్తున్నారు. మొదట వీరందరికీ ఉద్యోగాల పేరుతో ఎరవేస్తున్నారు. అపార్ట్మెంట్లకు 18 లక్షల రూపాయలు చొప్పున అద్దె చెల్లిస్తున్నారు. పోలీసులు.. అన్ని కోణాల్లో పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు. రూ.3 లక్షల నగదు, 300కు పైగా కంప్యూటర్స్ సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని.. అపార్ట్మెంట్ ఓనర్లపై కూడా విచారణ జరుపుతామని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. -
ప్రేమ పేరుతో మోసం.. యువకుడిపై కేసు
ఫిలింనగర్(హైదరాబాద్): ప్రేమ పేరుతో ఓ యువతిని మోసగించి..మరో యువతితో తిరుగుతున్న యువకుడిపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. అర్చిత్ పసుపులేటి అనే యువకుడు 2023 ఓ యువతిని పరిచయం చేసుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ యువతితో సన్నిహితంగా ఉండడంతో గర్భందాల్చగా అబార్షన్ చేయించాడు. అనంతరం ఆమెను దూరం పెట్టాడు. ఇటీవల అర్చిత్ మరో యువతితో తిరుగుతున్నట్లు తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అర్చిత్తో పాటు అతని సోదరుడు, మామ, మరో ఇద్దరు స్నేహితులపై కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదులో పేర్కొంది. తనను మానసికంగా వేధిస్తుండడంతో పాటు ఆత్మహత్యాయత్నానికి పాల్పడేలా ప్రవర్తించారని, ఆర్థికంగా దెబ్బతీశారని ఫిర్యాదులో పేర్కొంది. తనను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టడమే కాకుండా అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటకు తోసేశారని, అర్ధరాత్రి రోడ్డుపై బలవంతంగా నడుచుకుంటూ ఫిలింనగర్ పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశానని, ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు ఆమె పోలీసులకు అందజేశారు. ఈ మేరకు పోలీసులు అర్చిత్తో పాటు సోదరుడు, మామ, మరో ఇద్దరిపై బీఎన్ఎస్ సెక్షన్ 69, 79, 89, 351 (3) కింద కేసు నమోదు చేశారు. -
ఒంటరి మహిళలే రాము టార్గెట్.. 18 దారుణ హత్యలు!
ఘట్కేసర్(హైదరాబాద్): మహిళను హత్యచేసి మృతదేహాన్ని కాల్చిన నిందితుడికి 1వ అడిషనల్ జిల్లా కోర్టు జీవితఖైదు విధించింది. బుధవారం ఇన్స్పెక్టర్ పరశురాం తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 4, 2021న అంకుషాపూర్ రైల్వేట్రాక్ 218/16–18 మైలురాయి వద్ద ముళ్లపొదల్లో 35–45 ఏళ్లున్న గుర్తు తెలియని మహిళ కుళ్లిపోయిన మృతదేహం లభ్యమైంది. గుర్తుతెలియని దుండగులు ఆమెను అక్కడికి తీసుకొచ్చి గుర్తుపట్టకుండా ముఖం కాల్చివేసినట్లు కేసు నమోదైంది. అప్పటి ఇన్స్పెక్టర్ చంద్రబాబు దర్యాప్తు చేయగా.. మృతురాలు నగరానికి చెందిన దినసరి కూలీ కూర వెంకటమ్మగా తేలింది. సీసీ ఫుటేజీ, ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా.. పోలీసులు సీసీ పుటేజీ, ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేసి 18 మందిని హత్య చేసిన నిందితుడు సీరియల్ కిల్లర్ సంగారెడ్డి జల్లా కంది మండలం, ఆరుట్ల గ్రామానికి చెందిన మైనం రాములు (47)గా పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని అరెస్ట్చేసి రిమాండ్కు తరలించి దర్యాప్తు తర్వాత చార్జ్షిట్ దాఖలు చేశారు. మహిళ హత్య కేసును ఛేదించిన అప్పటి ఇన్స్పెక్టర్ చంద్రబాబును పోలీస్ ఉన్నతాధికారులు అభినందించి అవార్డును అందజేశారు. ఇరు వాదనలు విన్న 1వ అడిషనల్ మేడ్చల్ జిల్లా న్యాయమూర్తి నిందితుడికి జీవితఖైదు విధించారు. -
బెంగళూరు: సూట్కేస్లో యువతి డెడ్బాడీ కలకలం
బెంగళూరు: నగరంలో దారుణం జరిగింది. సూట్కేస్లో మహిళ మృతదేహం కలకలం రేపింది. రైల్వే వంతెన సమీపంలో ట్రావెల్ బ్యాగ్లో యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. బుధవారం ఉదయం హోసూర్ ప్రధాన రహదారిలోని పాత చందాపుర రైల్వే బ్రిడ్జి సమీపంలో, రైలు పట్టాల దగ్గర నీలం రంగులో ఉన్న ట్రావెల్ సూట్కేస్ పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు.అందులో యువతి మృతదేహం ఉండటంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతిని వేరే ప్రాంతంలో హత్య చేసి మృతదేహాన్ని సూట్కేస్లో కుక్కి కదులుతున్న రైలు నుంచి బయటకు విసిరేసి ఉంటారని అనుమానిస్తున్నారు.ట్రావెల్ బ్యాగ్లోని యువతి మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. యువతి వయస్సు 18 ఏళ్లు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. యువతి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. ఆమె వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. -
Hyderabad: స్టార్ హోటల్లో యువ వైద్యురాలిపై లైంగిక దాడి
హైదరాబాద్: తన భార్యకు విడాకులు ఇచ్చానని, త్వరలోనే నిన్ను పెళ్లి చేసుకుంటానని వైద్యురాలిని నమ్మించి బంజారాహిల్స్ లోని ఒక స్టార్ హోటల్ లో లైంగిక దాడికి పాల్పడిన వైద్యుడిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...మహబూబాబాద్ లోని అమ్మ ఆసుపత్రిలో పిల్లల వైద్య నిపుణుడిగా పనిచేస్తున్న డాక్టర్ జర్పుల స్వామి (37)కి 2023 లో అక్కడే మెడికో గా పని చేస్తున్న యువ వైద్యురాలు (30)తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. తన భార్య తనను బలవంతంగా వివాహం చేసుకుందని, ఆమెకు నాలుగు అబార్షన్లు సైతం అయ్యాయని, అందుకే ఆమెకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్నట్లు యువ వైద్యురాలిని నమ్మించారు. ఆమెతో స్నేహం, ప్రేమకు దారి తీసి విషయం పెళ్ళి వరకు వెళ్ళింది. 2024 సెపె్టంబర్లో వైద్యురాలు నగరానికి వచ్చి ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్నది. ఇదిలా ఉండగా డాక్టర్ స్వామి ఈ ఏడాది జనవరి 12న నేషనల్ పెడికాన్ సదస్సు నిమిత్తం నగరానికి రాగా ఆ సదస్సుకు యువ వైద్యురాలు సైతం హాజరైంది. ఇద్దరు కలిసి అదే రోజు బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ లో గది తీసుకున్నారు. పెళ్లి పేరుతో నమ్మించిన డాక్టర్ స్వామి ఆమెపై బలవంతంగా లైంగిక దారికి పాల్పడ్డాడు. విషయం బయటికి తెలియవద్దని పెళ్లి చేసుకుంటానని నమ్మించి వెళ్లిపోయాడు. స్వామి వ్యవహార తీరును అనుమానించిన యువ వైద్యురాలు అతని గురించి విచారించగా భార్యకు విడాకులు ఇవ్వలేదని తెలుసుకున్నది. తనకు జరిగిన అన్యాయాన్ని స్వామి తల్లిదండ్రుల దృష్టికి యువ వైద్యురాలు తీసుకెళ్లింది. వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆమె సోమవారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మంగళవారం పోలీసులు డాక్టర్ స్వామి, అతని కుటుంబ సభ్యులపై బి.ఎన్.ఎస్ 64 (1), 318(4), 318(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమించి పెళ్లాడి.. ఎస్ఐ భార్య ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం/ కృష్ణరాజపురం: కొందరి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఓ ఎస్సై భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరు హెచ్బీఆర్ లేఔట్లోని గణపతి దేవాలయం వద్ద చోటుచేసుకుంది. కాడుగొండనహళ్లి పోలీస్స్టేషన్లో ఎస్సైగా పనిచేసే నాగరాజు భార్య శాలిని (32) సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని తనువు చాలించింది. గోవిందపుర పోలీసులు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. మొదటి భర్తకు విడాకులు ఇచ్చి.. శాలిని, నాగరాజుది సినిమా కథను పోలిన కథ. ఇద్దరూ కూడా ఇల్కల్ వాసులు. స్కూలు, కాలేజీ రోజుల నుంచి పరిచయం ఉంది. శాలిని ఎమ్మెస్సీ చేయగా, నాగరాజు ఇంజినీరింగ్ చదివేవాడు. తరువాత ఎస్ఐ ఉద్యోగానికి సిద్ధమవుతానంటే శాలిని అతనికి ఆర్థిక సహాయం చేసింది. అలా నాగరాజు ఐదేళ్ల కిందట ఎస్ఐ పోస్టుకు ఎంపికై బెంగళూరులో పనిచేసేవాడు. శాలిని కూడా సిలికాన్ సిటీలో ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఇద్దరి మధ్య గాఢమైన ప్రేమ చిగురించి, శాలిని తన భర్తకు విడాకులు ఇచ్చి నాగరాజును పెళ్లి చేసుకుంది. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణం కావచ్చని అనుమానాలున్నాయి. -
స్పా ముసుగులో వ్యభిచారం
కర్ణాటక: మండ్య నగరంలోని బెంగళూరు -మైసూరు జాతీయ రహదారిలో క్లౌడ్ -11 పేరుతో నిర్వహిస్తున్న యూనిసెక్స్ సెలూన్ అండ్ స్పాపై ఒడనాడు సంస్థ సిబ్బంది, పోలీసులు సం యుక్తంగా దాడి చేశారు. ఇక్కడ వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించి సెలూన్ యజమాని ఎలిజబెతో సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. నలుగురు మహిళలకు విముక్తి కల్పించారు.ఇతర ప్రాంతాల నుంచి మహిళలను తీసుకువచ్చి వారిని వ్యభిచారం ఊబిలోకి దింపారని పోలీసులు తెలిపారు. ఈ స్పా సమీపంలోనే విద్యా సంస్థలు ఉన్నాయి. స్పాలో చీకటి వ్యవహారాలు జరుగుతున్నట్లు ప్రజలనుంచి ఫిర్యాదులు రావడంతో ఒడనాడు సంస్థకు చెందిన స్వాన్లి పరశురామ్, సీఐ నవీన్ లు పోలీసులతో కలిసి దాడి చేశారు. -
వైద్యులు నా కుటుంబాన్ని నాశనం చేశారు
గుంటూరు: ఈ ఏడాది ఫిబ్రవరిలో నా భర్త సాయిబాబు బల్బు బిగిస్తూ కాలు జారి కింద పడ్డారు. దీంతో ఆయనకు చేయి మణికట్టు వద్ద విరిగింది. స్థానిక కొత్తపేటలోని హాస్పిటల్కు తీసుకెళితే సర్జరీ చేశారు. చేసిన మరుసటి రోజే ఆయనకు కుడివైపు పక్షవాతం వచ్చింది. కనీసం ఆసుపత్రి వైద్యులు చికిత్స చేయకపోగా హడావుడిగా మమ్మల్ని బయటకు పంపేశారు. నాకు ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబాన్ని నడిపించే నా భర్త అచేతనంగా పడి ఉండడానికి ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణం. మెడికల్ వెరిఫికేషన్ పెట్టించాలని మనవి.–జక్కంపూడి శ్రీవల్లి, గుంటూరునా కొడుకును అమృతే కడతేర్చి ఉంటుంది.. తండ్రి ఫిర్యాదు -
నా కొడుకును అమృతే కడతేర్చి ఉంటుంది.. తండ్రి ఫిర్యాదు
నాయుడుపేట టౌన్(తిరుపతి): ‘నా కుమారుడిది సహజ మరణం కాదు. అతని మరణంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. నా కుమారుడు నివాసముంటున్న నివాసంలోనే అతని భార్య స్నేహితుడు కూడా ఉన్నాడు. ఈ విషయాన్ని నా కోడలు చెప్పలేదు. దీనిపై విచారణ చేపట్టండి’ అంటూ శ్రీకాకుళానికి చెందిన మృతుడి తండ్రి పీ.నరసింహమూర్తి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు.. శీకాకుళం ప్రాంతానికి చెందిన పూతల గణేష్ కుమార్(34), అతని భార్య అమృత, వారి బాబుతో కలిసి నాయుడుపేట పట్టణంలోని మంగపతినాయుడు నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. గణేష్కుమార్ మేనకూరు సెజ్లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో గణేష్కుమార్ ఇంట్లో నిద్రలేచి కింద పడిపోవడంతో తలకు బలమైన గాయమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతన్ని స్థానిక ప్రభుత్వ వైద్య శాలకు తీసుకెళ్తుండగా గణేష్కుమార్ మృతి చెందినట్లుగా భార్య అమృత పేర్కొన్నారు. అయితే కోడలు అమృత చెప్పిన విషయాలపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. తన కుమారుడు నివాసముంటున్న ఇంట్లో కోడలు అమృత స్నేహితుడు కూడా ఉంటున్నాడు. ఆ విషయం చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది.. అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు గణేష్కుమార్ది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బంధువులు శ్రీకాకుళం నుంచి నాయుడుపేటకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. -
నాన్నే అమ్మను రాయితో గుద్ది చంపేశాడు..!
నాయుడుపేట టౌన్(తిరుపతి): ‘నాన్నే అమ్మను రాయితో గుద్ది చంపేశాడు.. మా కళ్లెదుటే అమ్మ చనిపోయింది’ అంటూ ఆ చిన్నారి కళ్ల నిండా నీళ్లు పెట్టుకుని తన తల్లిని చంపిన వైనాన్ని పోలీసులకు వివరించిన తీరు స్థానికులను కలచివేసింది. కన్న బిడ్డల ఎదుటే అతి కిరాతకంగా భార్యను కడతేర్చిన ఘటనపై పోలీసులు సోమవారం విచారణ చేపట్టారు. వివరాలు.. మండల పరిధిలోని మడపలం గ్రామ సమీపంలో కాలువ గట్టు వద్ద శనివారం రాత్రి మద్యం మత్తులో భార్య వీణమ్మ(28)ను భర్త రాపూరు శ్రీనివాసులు హత్య చేసిన విషయం తెలిసిందే. మృతురాలి తల్లి తుపాకులు పెంచలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతురాలికి అఖిల(7), బత్తెయ్య(4), ఆదెయ్య(3) చిన్నారులున్నారు. శనివారం రాత్రి భర్త శ్రీనివాసులు పూటుగా మద్యం సేవించి భార్య వీణమ్మతో గొడవపడ్డాడు. ఆపై బండరాయితో తలపై మోది చంపేశాడు. తర్వాత పాము కాటు వేయడంతో వీణమ్మ మృతి చెందిందని నమ్మబలికాడు. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లి పెంచలమ్మ ఆదివారం ఉదయం బిక్కుబిక్కుమంటూ ఏడ్చుతున్న వీణమ్మ పిల్లల్ని అక్కున చేర్చుకుంది.పోలీసుల ఔదార్యం విచారణ అనంతరం వీణమ్మ మృతదేహానికి సోమవారం నాయుడుపేట ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతురాలి కుటంబ సభ్యులు నిరుపేద గిరిజనులు కావండతో వారికి పోలీసులు అన్ని విధాలుగా సహాయసహకారాలు అందించారు. వీణమ్మ మృతదేహాన్ని సైతం తీసుకెళ్లందుకు వారి వద్ద నగదు లేక పోవడంతో పోలీసులే నాయుడుపేటలో వీణమ్మకు అంత్యక్రియలు జరిపించారు. పరారీలో ఉన్న ఆమె భర్త శ్రీనివాసులును త్వరలో పట్టుకుంటామని తెలిపారు. -
ముక్కులో దూది.. నోటికి పది రౌండ్లు టేపు చుట్టుకుని..
శ్రీకాకుళం రూరల్: నోటికి పది రౌండ్లు టేపు చుట్టుకున్నాడు. ఊపిరి ఆడకుండా ముక్కులో దూది పెట్టుకున్నాడు. చేతులను కుర్చీ వెనక్కి కట్టుకున్నాడు. ఇలా ప్రాణం పోకపోతే.. ఎలాగైనా చనిపోవాలని నాలుగు రకాల కత్తులను రెడీగా ఉంచుకున్నాడు. దిగ్భ్రాంతి కలిగించే రీతిలో దాసరి ఉమామహేశ్వరరావు (26) అనే యువకుడు సోమవారం రాత్రి జిల్లాకేంద్రంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాకుళం రూరల్ మండ లం రాగోలు గ్రామం షిర్డీ సాయినగర్లో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దాసరి ఉమామహేశ్వరరావు హైదరాబాద్లో ని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రి చిరంజీవి ఎక్సైజ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లినట్లు సమాచారం. తమ్ముడు బెంగళూరులో ఓ బ్యాంక్లో పనిచేస్తున్నాడు. ఉమామహేశ్వరరావుకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావడంతో ఒక్కడే ఇంటిలో ఉంటున్నాడు. ఏమైందో గానీ సోమవారం రా త్రి తలుపునకు గడియ పెట్టి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. భోజనం కోసం బంధువులు ఎంత తలుపు తట్టినా తీయకపోవడంతో బలవంతంగా తలుపు తెరిచి.. కుర్చీలో విగతజీవిగా పడి ఉన్న యువకుడిని చూసి నిర్ఘాంతపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బాధ తెలియకూడదనేనా.. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించా రు. మృతుడు యూట్యూబ్లో వీడియోలు చూసి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నా రు. నొప్పి తెలియకుండా ఉండడానికే ఈ విధంగా బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని తెలిపారు. ముందుగా వీల్చైర్లో కూర్చుని నోటికి పది రౌండ్ల టేపును చుట్టుకున్నాడని, ముక్కులో దూది పెట్టుకుని, రెండు చేతులను కుర్చీ వెనక్కి కట్టుకునేలా ఏ ర్పాట్లు చేసుకున్నాడని పోలీసులు వివరించారు. ఈప్లాన్ సక్సెస్ కాకపోతే మరోలాగైనా చనిపోవడానికి నాలుగు రకాల కత్తులు ఉంచుకున్నాడని పేర్కొన్నారు. మృతుడి చిన్నాన్న దాసరి ప్రభాకర రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
Hyderabad: ఔటర్ రింగ్రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం
ఇబ్రహీంపట్నం రూరల్(హైదరాబాద్): ఔటర్ రింగ్రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. క్రాష్ బారియర్ను ఢీకొట్టడంతో కారులోకి పది మీటర్ల మేర దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందిన సంఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ బాలరాజు కథనం ప్రకారం.. బెంగాల్ రాష్ట్రానికి చెందిన కితాబ్అలీ అలియాస్ హిలాల్ (35) ఘట్కేసర్ మండలం, నాగారంలోని శిల్పానగర్, విశ్వసాయి బృందావనం అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. తుక్కుగూడ సమీపంలోని వివిధ కంపెనీలకు మ్యాన్పవర్ సప్లయ్ చేసేవాడు. సోమవారం ఉదయం తుక్కుగూడకు వచ్చి తిరిగి నాగారం వైపు కారులో వెళ్తున్నాడు. బొంగ్లూర్ ఎగ్జిట్ 12 వద్దకు రాగానే అతివేగం కారణంగా కారు అదుపుతప్పి క్రాష్ బారియర్ను ఢీకొంది. దీంతో కారు అద్దంలో నుంచి క్రాష్ బారియర్ పది మీటర్ల వరకు దూసుకెళ్లడంతో కితాబ్అలీ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో క్రాష్బారియర్ ఇరక్కుపోవడంతో మృతదేహం బయటకు తీయడం పోలీసులకు కష్టతరంగా మారింది. ఔటర్రింగ్ రోడ్డు సిబ్బంది సహాయంతో కారు పైభాగం కట్ చేయించి గంటల తరబడి శ్రమించి మృతదేహాన్ని బయటికి తీశారు. సీఐ రాఘవేందర్రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం మార్చురీకి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మంచి మాటలు చెప్పినందుకు...
మేడ్చల్: మద్యానికి బానిసై సంసారాన్ని ఎందుకు చెడగొట్టుకుంటున్నావ్ మంచిగా ఉంటూ భార్యా పిల్లలను బాగా చూసుకో అంటూ నాలుగు మంచి మాటలు చెప్పినందుకు ఓ వ్యక్తి తన బావ వరుసైన వ్యక్తిని నడిరోడ్డుపై కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన సంఘటన స్థానిక సరస్వతీనగర్లో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుజరాత్కు చెందిన సోలంకి మోతీలాల్(43), అతడి మేనత్త కుమారుడు శంకర్(35) కుటుంబాలతో కలిసి రైల్వె స్టేషన్ సమీపంలోని సరస్వతీ నగర్లో ఉంటూ భవన నిర్మాణ కారి్మకులుగా పని చేస్తున్నారు. కాగా మద్యానికి బానిసైన శంకర్ కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం కూడా మద్యం తాగి వచి్చన అతను కుటుంబ సభ్యులతో గొడవ పడి సమీపంలోని రైల్వే ప్లాట్ ఫారంపై పడుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మోతీలాల్ అక్కడికి వెళ్లి శంకర్కు నచ్చజెప్పేందుకు యతి్నంచాడు. అయితే మద్యం మత్తులో ఉన్న శంకర్ అతడిని దుర్బాషలాడాడు. అనవసరంగా భార్యా పిల్లలతో గొడవలు ఎందుకని అతడికి సర్దిచెప్పిన మోతీలాల్ శంకర్ను ఇంట్లో దిగబెట్టి తన ఇంటికి వెళ్లాడు. సోమవారం ఉదయం పనికి వెళ్లేందుకు సిద్ధమైన మోతీలాల్ తన బంధువుల ఇంటి వద్దకు వెళుతుండగా అతడిని అడ్డుకున్న శంకర్ తన కుటుంబ విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావంటూ అతడిని తిడుతూ దాడి చేసేందుకు వెళ్లాడు. దీంతో మోతీలాల్ ఈ విషయాన్ని శంకర్ తల్లికి చెప్పేందుకు వెళుతుండగా ఆగ్రహానికి లోనైన శంకర్ తన వెంట తెచ్చుకున్న కత్తితో మోతీలాల్పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అతను అక్కడే కుప్పకూలడంతో శంకర్ అక్కడి నుంచి పరారయ్యాడు. కుటుంబసభ్యులు మోతీలాల్ను 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మేడ్చల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. -
మామిడికాయ పచ్చడి విషయంలో గొడవ
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): మామిడికాయ పచ్చడి పెట?్ట విషయంలో తలెత్తిన గొడవలో భార్యను గొంతు నులిపి చంపాడు భర్త. ఈ ఘటన పందిళ్ల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సూర అంజలి– సూర రాజ్కుమార్ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆదివారం సాయంత్రం మామిడికాయ పచ్చడి పెట్టేందుకు అంజలి సన్నద్ధమైంది. ఇందుకోసం అవసరమైన వెల్లుల్లి కొనుక్కు రావాలని భర్త రాజ్కుమార్కు సూచించింది. ఈ విషయంలో దంపతుల మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన రాజ్కుమార్.. అంజలి(27)ను గొంతు నులిమి చంపేశాడు. ఈమేరకు మృతురాలి తండ్రి సంపంగి మల్లేశ్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు శవాన్ని పరిశీలించి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్త రాజ్కుమార్పై కేసు నమోదు చేశామని ఎస్సై వెంకటేశ్ తెలిపారు.