Crime News
-
ఆఖరి స్టెప్తోనే ముగిసిన జీవితం..పెళ్లి వేడుకలో విషాదం
చిలకలూరిపేటటౌన్: పెళ్లి వేడుకలో ఆనందంగా చిందేస్తూ, ఆ నవ్వుల మధ్యే ఓ నిండు ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోయిన హృదయవిదారక సంఘటన చిలకలూరిపేట మండలం దండమూడి గ్రామంలో చోటుచేసుకుంది. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బాపట్ల మండలం రేకులగడ్డకు చెందిన ఏసోబు (62)కు చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి గ్రామానికి చెందిన భాగ్యమ్మతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు సంతానం లేదు. ఈ క్రమంలోనే దండమూడి గ్రామంలో బంధువుల ఇంట్లో జరిగిన ఓ వివాహ వేడుకకు ఈ దంపతులు హాజరయ్యారు. పెళ్లి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన డీజే పాటలకు అక్కడి వారంతా ఉత్సాహంగా నృత్యాలు చేస్తుండటంతో ఏసోబు కూడా వారితో కలిసి ఆనందంగా చిందేశాడు. అయితే దురదృష్టవశాత్తూ వెల్లకిలా పడిపోయాడు. కింద పడే క్రమంలో తలకు తీవ్ర గాయాలవ్వడంతో అపస్మారక స్థితికి చేరుకున్న ఆయనను బంధువులు హుటాహుటిన చిలకలూరిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ఏసోబు ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అప్పటివరకు పెళ్లి సందడితో కళకళలాడిన ఆ గ్రామంలో విషాదం నెలకొంది. బిడ్డలు కూడా లేని తనకు ఆఖరి శ్వాస వరకు తోడుగా ఉంటాడనుకున్న భర్త ఇలా మధ్యలోనే దూరమయ్యాడయ్యా.. అంటూ భాగ్యమ్మ కన్నీటి రోదన చూపరులను సైతం కంట తడిపెట్టించింది. -
బాలిక గర్భం కేసులో సంచలనం.. అసలు నిందితుడు తండ్రి
తమిళనాడు: వేలూరు సమీపంలోని పాఠశాల విద్యార్థి ని కన్న తండ్రే బెదిరించి గర్భం చేసిన సంఘటన సంచలనం రేపింది. వేలూరు తాలూకాకు చెందిన 13 సంవత్సరాల బాలిక వేలూరులోని ప్రభుత్వ పాఠశాలలో గత విద్యా సంవత్సరం ఎనిమిదో తరగతి చదివింది. ఈ నేపథ్యంలో గత నెల 25వ తేదీన బాలికకు ఉన్నపళంగా అనారోగ్యం క్షీణించింది. దీంతో కుటుంబ సభ్యులు బాలికను వేలూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు బాలిక రెండు నెలలు గర్భం దాల్చినట్లు నిర్ధారించారు. వీటిపై ఆసపత్రి నిర్వాహకులు బాలిక మైనర్ కావడంతో వేలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేలూరు మహిళా పోలీసులు బాలిక వద్దకు చేరు కొని విచారణ జరపగా ఆ సమయంలో ఆ బాలిక కాట్పాడికి చెందిన ఒక యువకుడిని ప్రేమించినట్లు అతను వివాహం చేసుకుంటానని మాయ మాటలు చెప్పి గర్భం చేసినట్లు తెలిపింది. దీంతో పోలీసులు ఆ యువకుడిని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసేందుకు అతని వివరాలు, ఫొటో, చిరునామా వివరాలు అడిగారు. ఆ సమయంలో బాలిక మాటలు తడబడుతూ సరైన సమాధానం చెప్పలేదు. దీంతో అనుమానించిన పోలీసులు బాలిక వద్ద సమగ్రమైన విచారణ చేపట్టారు. ఆ సమయంలో తన తండ్రి పెయింటర్గా పనిచేసేవాడని రాత్రి వేళల్లో మద్యం మత్తులో తన తల్లి నిద్రించిన సమయంలో తనను బెదిరించి అత్యాచారం చేసినట్లు తెలిపింది. ఈ విషయాన్ని బయటకు చెపితే కుటుంబంలోని అందరినీ హత్య చేస్తానని బెదిరించినట్లు తెలిపింది. అదే విధంగా తన కన్న తండ్రి కారణంగా తాను గర్భం దాల్చిన విషయాన్ని బయట పెట్టకూడదనే కారణంతోనే కాటా్పడిలోని ఒక యువకుడిపై చెప్పినట్లు తెలిపింది. దీంతో పోలీసులు బాలిక తండ్రిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న తండ్రి కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. కన్న కుమార్తెను తండ్రే బెదిరించి గర్భం చేసిన సంఘటన వేలూరు పట్టణంలో సంచలనం రేపింది. -
మహిళా ఉద్యోగి ఫొటోలు పోస్టు చేసిన ఏఓ అరెస్ట్
జనగామ: జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో పనిచేస్తు న్న ఓ మహిళా ఉద్యోగి ఫొటోలను అనుమతి లేకుండా తీసి, నకిలీ ఖాతా ద్వారా అసభ్యకర వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పోస్టు చేసిన కేసులో అదే కార్యాలయంలో ఏఓగా పనిచేస్తున్న విజయ్రెడ్డిని అరెస్టు చేసి, రిమాండ్ పంపించినట్టు సీఐ సత్యనారాయణరెడ్డి సోమవారం తెలిపారు. సీఐ మాట్లాడుతూ విజయ్రెడ్డి తన సోషల్ మీడియా ఖాతా నుంచి ఆమె ఫొటోలను పోస్టు చేసి, అవమానకరమైన కామెంట్లతో గౌరవానికి భంగం కలిగించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు స్పష్టం చేశారు. మహిళల పై కార్యాలయాల్లో జరిగే లైంగిక వేధింపులను నిరోధించే పోష్ చట్టం–2013 ప్రకా రం ఇది శిక్షార్హమైన నేరమని తెలిపారు. దర్యాప్తులో సేకరించిన డిజిటల్ ఆధారాలు, సోషల్ మీడియా పోస్టులు, ఇతర సాక్ష్యాల ఆధారంగా నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ తరలించినట్టు పేర్కొన్నారు. -
మత్తులో 2 హత్యలు..
కంటోన్మెంట్, బంజారాహిల్స్: గంజాయి మత్తులో ఓ యువకుడు కత్తితో పొడిచి మరో యువకుడిని, మద్యం మత్తులో ఓ వ్యక్తి స్నేహితుడిని చంపేశారు. మారేడ్పల్లి సంజీవయ్యనగర్ బస్తీ వాసి, ఫ్లవర్ డెకరేటర్ శ్రావణ్ (22)ను అదే ప్రాంతానికి చెందిన నిఖిల్ (23) అంతమొందించాడు.బీటెక్ ఆపేసి గంజాయికి బానిసైన నిఖిల్... శ్రావణ్ బంధువుల యువతిని అసభ్య సైగలతో వేధిస్తున్నాడు. శ్రావణ్, నిఖిల్ మధ్య 2 నెలల క్రితం గొడవ జరిగింది. ఆదివారం రాత్రి యువతిని నిఖిల్ మళ్లీ వేధించాడు. ఆమె తండ్రి మందలించగా గొడవ మొదలైంది. అప్పుడే ఇంటికి వస్తున్న శ్రావణ్ నిలదీయగా... కోపోద్రిక్తుడైన నిఖిల్ కత్తితో 8 సార్లు పొడిచాడు. గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా శ్రావణ్ చనిపోయాడు. నిఖిల్ గంజాయి తాగడంతో పాటు అమ్ముతుంటాడని, ఆ మత్తులోనే హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు బేంగపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి తెలిపారు.బంజారాహిల్స్ రోడ్ నం11 లోని బోళానగర్ బస్తీకి చెందిన మహ్మద్ ఇమ్రాన్ (32), రౌడీషీటర్ అహ్మద్ హుస్సేన్ స్నేహితులు. ఆటో నడుపుతుంటారు. ఖాలిద్ సయీద్ జావీద్, హైదర్ షరీఫ్, అన్వర్, మతీన్తో కలిసి హయత్ ప్లేస్ హోటల్ గల్లీలో ఆటోలోనే ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మద్యం తాగారు. ఖాళీ బీరు సీసాలను హుస్సేన్ రోడ్డు పక్కన పడేశాడు. అలా నిర్లక్ష్యంగా పడేస్తే ఎవరికైనా గుచ్చుకుంటాయని ఇమ్రాన్ మందలించాడు. హుస్సేన్ కోపంతో నాకే నీతులు చెబుతావా? అంటూ దాడికి దిగాడు. అరగంట పాటు పిడిగుద్దులు కురిపించుకున్నారు. కుప్పకూలిన ఇమ్రాన్ మృతి చెందాడు. -
‘ధురంధర్’ దెబ్బకు దావూద్ ముఠాలో కలకలం.. మన దేశంలోకి..
ముంబై: డీ-కంపెనీని బాలీవుడ్ స్పై థ్రిల్లర్ ధురంధర్ మూవీ తీవ్ర ఆగ్రహానికి గురిచేసినట్లు సమాచారం. పాకిస్థాన్లో ఉంటూ అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నడిపిస్తున్న ఈ ముఠా ధురంధర్ సినిమా విజయానంతరం ముంబైలో తన గ్రౌండ్ నెట్వర్క్ను యాక్టివేట్ చేసినట్లు సోర్సెస్ తెలిపాయి.రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన ధురంధర్ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో బడే సాహెబ్ అనే పాత్ర కనిపిస్తుంది. మరణశయ్యపై ఉన్న ఆ పాత్రను దావూద్ను పోలి ఉన్నట్లు చూపించారు. దీనివల్ల దావూద్ ఇప్పటికీ బతికే ఉన్నాడని ప్రజలను నమ్మించాల్సిన అత్యవసర పరిస్థితి డీ-కంపెనీకి ఏర్పడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.షకీల్ ముఠాకు నియామకాల బాధ్యత కొత్త ఉగ్ర కుట్రలో భాగంగా కొత్త సభ్యులను సమీకరించడం ముఠా ముందున్న తొలి సవాలు. నియామక ప్రక్రియ బాధ్యతను షకీల్ ముఠాకు అప్పగించినట్లు సోర్సులు తెలిపాయి. పాకిస్థాన్ ఐఎస్ఐకి ఈ కొత్త సభ్యులకు శిక్షణ ఇవ్వడం, ఆయుధాలు అందించడం వంటివి చేయనుందని చెప్పాయి. ఉగ్ర ప్రణాళిక అమలు బాధ్యతను షూటర్ మున్నా జింగాడాకు అప్పగించినట్లు తెలిపాయి.ఈ ఆపరేషన్ వెనుక అసలు కారణాన్ని కొత్త సభ్యులకు చెప్పలేదని సోర్సెస్ తెలిపాయి. ముంబై నుంచి జాగ్రత్తగా ఎంపిక చేసిన వీరిని, బాంద్రా గరీబ్ నగర్లో అక్రమ మసీదుపై జరిగిన బుల్డోజర్ చర్యను చూపించి రెచ్చగొట్టినట్లు వెల్లడించాయి.ఇటీవల ఢిల్లీ పోలీసులు ఒక ఉగ్ర ప్రణాళికను భగ్నం చేసి, ఐఎస్ఐకి ముంబై అండర్వరల్డ్తో ఉన్న సంబంధాన్ని బయటపెట్టిన నేపథ్యంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అండర్వరల్డ్ కార్యకలాపాలు, వసూళ్ల వ్యవహారాల్లో ప్రభావం క్రమంగా తగ్గుతున్న వేళ, డీ-కంపెనీ ఆకస్మిక కదలికలు మనుగడ కోసం చేస్తున్న ప్రయత్నమై ఉండవచ్చని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.తమ ప్రభావాన్ని మళ్లీ పెంచుకునేందుకు, ఐఎస్ఐ సాయంతో భారతదేశంలో భారీ దాడి చేయాలని లేదా ఓ వీఐపీని లక్ష్యంగా చేసుకోవాలని దావూద్ ముఠా ప్రణాళికలు రచిస్తున్నట్లు సోర్సెస్ తెలిపాయి.ఇలాంటి ఉగ్ర ప్రణాళికలకు ఆశ్రయం ఇవ్వడంలో పాకిస్థాన్ పాత్ర నిరంతరంగా కొనసాగుతోందని పేర్కొన్నాయి. అయితే కీలక అరెస్టులు సకాలంలో జరుపుతూ భారత దర్యాప్తు సంస్థలు ఇలాంటి ప్రయత్నాలను భగ్నం చేస్తున్నాయని సోర్సెస్ తెలిపాయి. -
వివాహమైన 18 రోజులకే విషాదం!
పటాన్చెరు టౌన్: పెళ్లయిన 18 రోజులకే నవ వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా, కోట్పల్లి మండలం బీరోల్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ (28)కు పటాన్చెరుకు చెందిన రేణుకతో మే 13న వివాహం జరిగింది. కాగా ఐదు రోజుల క్రితం పటాన్చెరు డివిజన్ పరిధిలోని గోకుల్నగర్లో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు.ఈ క్రమంలో శనివారం రాత్రి శ్రీకాంత్ సెల్ఫోన్లో ఉన్న వాయిస్ రికార్డ్ విషయంలో భార్య రేణుక ఇష్టం వచి్చనట్టు అతడ్ని తిట్టింది. దీంతో శ్రీకాంత్ అతని సోదరుడు శ్రీశైలానికి జరిగిన విషయం చెప్పడంతో ఉదయం మాట్లాడుదామని చెప్పాడు. భార్యతో గొడవపడిన శ్రీకాంత్ వేరే రూమ్లోకి వెళ్లి ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. ఆదివారం ఉదయం రూమ్ నుంచి బయటికి రాకపోవడంతో వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ముగ్గురు స్నేహితులను కాపాడి! చివరికి..
అబ్దుల్లాపూర్మెట్: అమెరికాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన ముగ్గురు స్నేహితులను కాపాడిన అనురూప్రెడ్డి.. నీట మునిగి మృతి చెందాడు.మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కోడూరి రాజేందర్రెడ్డి–దుర్గాభవాని దంపతులు కొన్నేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కవాడిపల్లి గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు. వారికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఆశ్రిత్రెడ్డితోపాటు అనురూప్రెడ్డి (22) సైతం ఐదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లారు. అనురూప్రెడ్డి యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్లో ఇటీవల మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాడు.శనివారం లూసియానాలోని టోరోడో పార్క్లో ఉన్న సెబాన్ రివర్లో సరదాగా స్నేహితులతో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈత కొట్టే సమయంలో అతనితోపాటు మరో ముగ్గురు స్నేహితులు ఉన్నారు. హఠాత్తుగా ముగ్గురూ లోతు ప్రదేశంలోకి వెళుతూ రక్షించండి అంటూ కేకలు వేశారు. అనురూప్రెడ్డి ఒక్కొక్కరిని పైకి లాగుతూ ఒడ్డుకు చేర్చారు. తను పైకి వచ్చే క్రమంలో చెరువులో ఉన్న ఫిషింగ్ వైర్ కాలికి చుట్టుకోవడంతోపాటు నీటి ప్రవాహం పెరగడంతో పైకి రాలేకపోయాడు. అక్కడున్న వారు రక్షించే ప్రయత్నం చేసినా, అప్పటికే నీటిని ఎక్కువగా మింగడంతో మృత్యువాత పడ్డాడు.ఉన్నత చదువుల కోసం వెళ్లిన కుమారుడు ఇలా విగతజీవిగా మారుతాడని అనుకోలేదని కుటుంబ సభ్యులు దు:ఖసాగరంలో మునిగారు. అనురూప్రెడ్డికి ఫొటోగ్రఫీ ఎంతో ఇష్టమని, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడని అతని సోదరుడు తెలిపారు. టీం ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ, ఇండియన్ ఎంబసీ, లూసియానా కాన్సులేట్ సంయుక్త సహకారం అందించి వారం రోజుల్లో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్టు సమాచారం. -
‘వీళ్లసలు మనుషులేనా?’.. పోలీసుల ముందే చితకబాదారు
మొదట అది సాధారణ మరణం అనుకున్నారు. తినేటప్పుడు ఊపిరాడక చిన్నారి ప్రాణాలు కోల్పోయాడని స్వయంగా తల్లే చెప్పడంతో అంతా అదే నిజమనుకున్నారు. కానీ పోస్టుమార్టం నివేదిక వెన్నులో వణుకు పుట్టించే విషయాల్ని బయటపెట్టింది. పోలీసులు సైతం ఆ నివేదిక చూసి షాక్కు గురయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. అలా ఆ చిన్నారి కేసు యావత్ సమాజాన్ని కుదిపేసిన ఘటనగా మారింది. పట్టరాని కోపంతో.. అదీ పోలీసుల సమక్షంలోనే జనాలు నిందితుల మీద దాడి చేసే దాకా తీసుకెళ్లింది.. కేరళలోని తిరువనంతపురం జిల్లా నెడుమంగాడ్లో.. ఏడాదిన్నర వయసున్న అర్షిద్ మరణం అందరితో ‘అయ్యో పాపం’ అనిపిస్తోంది. భోజనం చేస్తుండగా.. దగ్గు, వాంతులు చేసుకుంటూ ఆ చిన్నారి అస్వస్థతకు గురయ్యాడని.. ఆస్పత్రికి తరలిస్తే చికిత్స పొందుతూ కన్నుమూశాడని తల్లి అఖిల(24) మీడియా ముందు వాపోయింది. అయితే ఆమె కన్నీళ్లంతా కట్టుకథ అని తేలడానికి 24 గంటలు కూడా పట్టలేదు. అర్షిద్ మాములు చిన్నారేం కాదు. కొన్ని నెలల కిందట.. రెండు చేతులకు బ్యాండ్లతో తల్లి చంకలో సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యాడు. ఆడుకుంటుండగా సైకిల్ మీద నుంచి పడిపోయాడని చెబుతూ.. ఆమె పలువురి సాయం కోరడం నెట్టింట వైరల్ అయ్యింది. అలా ఆ తల్లికి చాలామంది డబ్బు కూడా పంపించారు. కట్ చేస్తే.. మే 29వ తేదీన ఆ చిన్నారి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. Tragic incident from God’s own countryHere is a 2-week-old video of 1-and-a-half-year-old Arshad with both hands fractured. In the video, his mother Akhila lies, claiming he broke his hands by falling off a bicycle.Tragically, little Arshad passed away 2 days ago at the… pic.twitter.com/j1WnUTE2fU— Revolutionary Monk (@RevolutionMonk) May 31, 2026అన్నం తింటుండగా ఆ చిన్నారి అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో అఖిల, ఆమె స్నేహితుడు అష్కర్ అర్షిద్ను హుటాహుటిన పనవూర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో తిరువనంతపురంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆలస్యం అయ్యింది. ఈలోపు ఒంటిపై గాయాలు కనిపించడంతో పోలీసులు అనుమానంతో పోస్టుమార్టం నిర్వహించారు. అందులో షాకింగ్ విషయాలు బయటపెట్టాయి. అర్షిద్ ఒంటిపై సుమారు 50కి పైగా గాయాల గుర్తులు ఉన్నట్లు ప్రాథమిక నివేదిక వెల్లడించింది. తలతో పాటు శరీరంలోని పలు భాగాల్లో అంతర్గత రక్తస్రావం జరిగినట్లు గుర్తించారు. అంతేకాదు.. సిగరెట్లతో ఒంటి నిండా కాల్చిన గాయాలు ఉండడం వైద్యుల్ని విస్మయానికి గురిచేసింది. పైగా ఈ గాయాలు ఒక్కరోజులో జరిగినవి కావని.. చాలా కాలంగా కొనసాగుతున్న హింసకు సంబంధించినవని తేల్చారు.నెలల వయసు నుంచే..అఖిల కడుపుతో ఉన్నప్పుడు ఆమె భర్త అఖిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఆమె అష్కర్(31) అనే వ్యక్తితో సహజీవనం మొదలుపెట్టింది. ఈ సంబంధం కారణంగానే ఆమె పుట్టిన బిడ్డను తల్లికి అప్పగించింది. అయితే అఖిల భర్త తరఫున బంధువుల అభ్యంతరాలతో తిరిగి చిన్నారిని తన దగ్గరకు తెచ్చుకుంది. అప్పటి నుంచే చిన్నారి అర్షిద్కు వేధింపులు మొదలయ్యాయి. ఆ సమయంలోనూ శరీరంపై తరచూ గాయాలు కనిపించేవని.. అడిగితే గాయాలపాలవుతున్నాడని చెప్పేదని అఖిల తల్లి పోలీసులకు చెబుతోంది. అంతేకాదు.. మే నెలలో వైరల్ అయిన వీడియోను కూడా అర్షిద్ అమ్మమ్మ గుర్తు చేసింది. మనవడి చేతులు విరిగిన సందర్భంలోనూ కూతురు, ఆమె ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించింది. ఇక.. చుట్టుపక్కల వాళ్లు చిన్నారి గుక్కపట్టి ఏడ్వడంపై చాలాసార్లు అఖిలను నిలదీసినట్లు చెబుతున్నారు. ఆగ్రహంతో దంచి కొట్టారు!పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాత పోలీసులు కేసును అనుమానాస్పద మృతి నుంచి హత్య కేసుగా మార్చారు. కేసు తీవ్రత దృష్ట్యా మే 30న అఖిల, అష్కర్లను అరెస్ట్ చేశారు. చిన్నారిపై నిరంతరం హింస కొనసాగుతున్న విషయం తెలిసినా తల్లి అడ్డుకోలేదని, అధికారులకు సమాచారం ఇవ్వలేదని స్పష్టమైంది. అందుకే ఆమెపైనా హత్య కేసు నమోదు చేశారు. అంతేకాదు.. గతంలో చేతులు విరిగిన ఘటనలోనూ ఆమె ప్రమేయం ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక ఆదివారం అష్కర్ను ఘటనాస్థలికి తీసుకెళ్లి సాక్ష్యాలు సేకరిస్తుండగా.. స్థానికులు ఆగ్రహంతో అతనిపై దాడి చేశారు. ఆ సమయంలో పోలీసులు కూడా వాళ్లను నిలువరించలేపోయారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిందితులిద్దరినీ కఠినంగా శిక్షించాలని అర్షిద్ అమ్మమ్మ, నాన్నమ్మ, తాతలు.. స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ అర్షిద్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.തിരുവനന്തപുരം നെടുമങ്ങാട് ഒന്നര വയസ്സുകാരൻ കൊല്ലപ്പെട്ട സംഭവത്തിൽ പ്രതികളിൽ ഒരാളായ അഷ്കറുമായി തെളിവെടുപ്പ് നടത്തുന്നതിനിടെ പ്രതിയെ കയ്യേറ്റം ചെയ്ത് നാട്ടുകാർ #nedumangad #ashkar #crime #kerala pic.twitter.com/4MEuPTbAXl— DD News Malayalam (@DDNewsMalayalam) May 31, 2026 -
హత్యకు దారి తీసి పబ్లో గొడవ!
సాక్షి,చెన్నై: కోయంబేడులో శనివారం అర్ధరాత్రి దాటి న తర్వాత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ స్టార్ హోటల్ పబ్లో మద్యం మత్తులో డ్యాన్స్ చేస్తూ మొదలైన చిన్న వివాదం.. చివరకు ఓ యువతి ప్రాణాలను బలితీసుకుంది. గంజాయి, మద్యం మత్తు లో ఉన్న ఒక ముఠా.. కక్షపూరితంగా బైక్ను కారుతో ఢీకొట్టడంతో ప్లస్–2 చదువు పూర్తి చేసిన శ్రీలంక త మిళ శరణార్థి శిబిరం యువతి అక్కడికక్కడే మరణించింది. ఈ ఘోర ఘటనలో మరో 17 ఏళ్ల బాలిక తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టు మిట్టాడుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. విల్లుపురం జిల్లా అనిచన్ కుప్పంలోని శ్రీలంక తమిళ పునరావాస శిబి రానికి చెందిన యాన్సీ(18) ఇటీవల ప్లస్–2 పరీక్షల్లో 450 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఆమె ఉన్నత చదువుల కోసం అలగప్ప విశ్వవిద్యాలయానికి దరఖా స్తు చేసుకుంది. ఈ క్రమంలో చెన్నై రామపురంలో నివసిస్తున్న తన స్నేహితురాలిని (17 ఏళ్ల బాలిక) కలవడానికి యాన్సీ కొద్దిరోజుల క్రితం చెన్నైకి వచ్చింది. శనివారం రాత్రి యాన్సీ, ఆమె స్నేహితురాలు తబిత (18) అనే మరో యువతితో పాటూ యువకులు కలిసి మొత్తం ఆరుగురు మూడు మోటారు సైకిళ్లపై కోయంబేడు ఫ్లైఓవర్ సమీపంలోని ఓ ప్రైవేట్ స్టార్ హోటల్ పబ్కు వెళ్లారు. అక్కడ మద్యం సేవించిన తర్వాత యాన్సీ బృందం నృత్యం చేస్తున్న సమయంలో అక్క డ మద్యం మత్తులో ఉన్న మరో వర్గానికి చెందిన యు వకులతో వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో పబ్ లో గందరగోళం నెలకొంది. హో టల్ బౌన్సర్లు ఇరు వర్గాలకు నచ్చజెప్పి అక్కడి నుంచి బయటకు గెంటేశారు. బయటకు వచ్చినా మరోసారి గొడవ పడ్డారు. తర్వాత ఇళ్లకు బయలుదేరారు. కారుతో తొక్కించి హత్య గొడవతో తీవ్ర ఆగ్రహానికి గురైన కారు డ్రైవర్ సుమన్ శక్తివేల్ (20) బైక్పై ప్రయాణిస్తున్న యువతులను చంపాలనే ఉద్దేశంతో కారును మెరుపు వేగంతో వారి బైక్ వైపు పోనిచ్చి బలంగా ఢీకొట్టాడు. దీంతో బైక్ నడుపుతున్న యాన్సీ, వెనుక కూర్చున్న 17 ఏళ్ల బాలిక గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడిపోయారు. తలకు తీవ్ర గాయమై, ముఖం పూర్తిగా చిద్రమైన స్థితిలో యాన్సీ (18) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తీవ్రగాయాలైన బాలికను కోయంబేడు కిల్పాక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా నిరుపేద కూలీ అయిన యాన్సీ తండ్రి నకులేశ్వరన్ , కుటుంబ సభ్యులు ఈ వార్త విని కన్నీరుమున్నీరవుతున్నారు. -
ప్రియునితో కలిసి వదిననే చంపిన మరదలు..!
బెంగళూరు: బంగారు నగల కోసం మానవులు రాక్షసులుగా మారుతున్న ఉదంతాలు అక్కడక్కడా జరుగుతున్నాయి. అదే రీతిలో బంగారం కోసం ప్రియునితో కలిసి సొంత వదిననే గొంతు కోసి చంపిందో మరదలు. ఈ కిరాతక ఘటన చిక్కబళ్లాపురం నగరంలో వెలుగుచూసింది. ఏం జరిగిందంటే.. వివరాలు.. మే 28వ తేదీ అర్ధరాత్రి కందవార పేట సమీపంలోని బాపూజినగరలో మేస్త్రి నరసింహమూర్తి ఇంట్లో కోడలు పుష్పలతను దొంగలు పడి గొంతు కోసి బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయారు. ఆమె పక్కనే పడుకొన్న మరదలు భవ్య నోట్లో బట్టలు కుక్కి పెప్పర్ స్ప్రే కొట్టి పారిపోయారు. ఈ మేరకు బాధితురాలు భవ్య కుటుంబీకులకు, పోలీసులకు తెలిపింది. పుష్పలత తల్లిదండ్రులు మహేశ్, లక్ష్మి మాత్రం ఏదో జరిగిందని, భర్త తరఫు వారే తమ బిడ్డను బలిగొన్నారని విలపించారు. పోలీసులు మొదట్లో ఇది దోపిడీ అనుకున్నారు. ఆస్పత్రిలో ఉన్న భవ్యను విచారించగా ఆమె మాటల్లో పొంతన కుదరలేదు. నివ్వెరపోయే నిజాలు.. జిల్లా ఎస్పీ కుశాల్ చౌక్సె దర్యాప్తులో అసలు నిజాన్ని గుర్తించారు. భవ్యకు హొసకోటకు చెందిన వ్యక్తితో పెళ్లి చేసి పంపారు. కానీ ఆమె భర్త మిత్రుడు, కార్ డ్రైవర్ లోహిత్కుమార్ లల్లుతో అక్రమ సంబంధం ఏర్పడి అతనితో పరారైంది. భర్త గొడవచేయడంతో పుట్టింటికి వచ్చేసింది. మరోవైపు లల్లు నీ ప్రైవేటు వీడియోలు బయట పెడతానని బెదిరించడంతో భవ్య రూ. 5 లక్షల వరకూ ఇచ్చుకుంది. మరింత డబ్బులు కావాలని బెదిరించగా, నా వదిన దగ్గర బంగారు నగలు ఉన్నాయి, ఆమెను హత్య చేసి తీసుకుపో అని చెప్పింది. 28వ తేదీ అనుకూలంగా ఉంటుందని తెలిపింది. ప్లాన్ ప్రకారం భవ్య వదిన పక్కన పడుకుంది. లల్లు రాగానే తలుపులు తీసింది. ఇద్దరూ కలిసి పుష్పలతను దిండుతో అదిమి, కత్తితో గొంతుకోసి చంపి ఆభరణాలను తీసుకొని వెళ్లాడు. దొంగలు తనపై దాడి చేశారని భవ్య నాటకమాడింది. అదే రోజు ఇంటి సీసీ కెమెరాలు పనిచేయలేదు. ఎక్కడా దొంగల ఆచూకీ లేదు. పోస్టుమార్టం రిపోర్టు ఇది సహజ మరణం కాదు అని తేలి్చంది. దీంతో భవ్యను తమదైన రీతిలో ప్రశ్నించగా, మొత్తం ఏకరువు పెట్టింది. లల్లును కూడా అరెస్టు చేశారు. అత్త మామల పాత్ర ఉంటే వదిలిపెట్టబోమని ఎస్పీ కుశాల్ తెలిపారు. -
భర్త, అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నా..!
రాజేంద్రనగర్ : భర్తతో పాటు అత్త వేధింపులు రోజురోజుకూ అధికమయ్యాయని.. ఇక తాను భరించలేనని ఓ వివాహిత తన తండ్రికి ఫోన్ చేసి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రాజేంద్రనగర్ ఎస్ఐ ప్రశాంత్ తెలిపిన మేరకు.. సికింద్రాబాద్కు చెందిన భవాని (26) రాజేంద్రనగర్ మాణిక్యమ్మ కాలనీకి చెందిన శ్రీకాంత్లు ప్రేమించి 2025లో పెళ్లి చేసుకున్నారు. శ్రీకాంత్ స్థానికంగా వెల్డింగ్ షాప్ లో పనిచేసేవాడు.పెళ్లయిన తరువాత భవాని అత్త కనకమ్మ రోజూ తాగి వచ్చి కోడలితో గొడవకు దిగేది. భర్త శ్రీకాంత్కు చెప్పినా పట్టించుకోకుండా తల్లికి వత్తాసు పలికేవాడు. ఇదిలా ఉండగా శ్రీకాంత్ సొంత ఊరు అయిన సిద్దిపేటలో శుభకార్యం ఉండడంతో భార్యాభర్తలతో పాటు అత్త గ్రామానికి వెళ్లారు. అక్కడ అత్త భవానీని బంధువుల ముందే తిట్టి అవమానించింది. ఈనెల 30న తిరిగి వచ్చారు.ఆరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో భవాని తండ్రి ఎల్లయ్యకు ఫోన్ చేసి.. వేధింపులు రోజురోజుకూ ఎక్కువయ్యాయని ఇక తాను భరించలేనని ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తెలిపి ఫోన్ కట్ చేసింది. అనంతరం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎల్లయ్య ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎల్లమ్మ పండుగ వేళ.. కన్నవారికి తీరని కడుపుకోత
నల్గొండ జిల్లా: తల్లిదండ్రులు రేణుకా ఎల్లమ్మ పండుగ చేసే పనిలో నిమగ్నమయ్యారు. వారి కుమార్తె మధ్యాహ్నం సమయంలో సరదాగా తోటి పిల్లలతో ఈత కొట్టేందుకు వెళ్తుండగా తల్లిదండ్రులు వద్దని వారించిన వినలేదు. బాలిక గుంత లోతు గమనించక ఈత కొడుతూ కొంత దూరం వెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి మృతి చెందింది. ఈ ఘటన కట్టంగూర్ మండలంలోని ముత్యాలమ్మగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని బిల్లంకానిగూడెంలో శనివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్యాలమ్మగూడెంలో ఆది, సోమవారాల్లో గంగదేవమ్మ పండగ నిర్వహించేందుకు గ్రామస్తులు సిద్ధమయ్యారు. ముందు రోజు శనివారం గ్రామానికి చెందిన ఎలుక శంకర్, కల్పన దంపతులు ఇంట్లో రేణుకా ఎల్లమ్మ పండుగ నిర్వహిస్తున్నారు. వారు ఈ పనుల్లో నిమగ్నం కాగా.. వారి కుమార్తె హారిక(13) గ్రామ శివారులోని నీటి గుంతలో ఈత కొట్టేందుకు తన అన్న గణేష్, తన మేనత్త కుమార్తె, కుమారుడితో కలిసి గ్రామ శివారులో రైతులు పొలాల దిగువ భాగంలో నీటి నిల్వ కోసం తీసిన పెద్దగుంత వద్దకు వెళ్లారు. గుంత లోతు ఎక్కువగా ఉండటంతో గమనించని హారిక ఈత కొడుతూ దూరంగా వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయింది. హారిక అన్న గణేష్ ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. వెంటనే ఈ విషయాన్ని గణేష్ తన తల్లిదండ్రులకు తెలపడంతో అక్కడకు చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో నకరేకల్ ఫైరింజన్ సిబ్బందిని పిలిపించారు. సిబ్బంది బాలిక మృతదేహాన్ని బయటకు తీశారు. హారిక చిన్నపురిలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో 7వ తరగతి పూర్తి చేసింది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
బొల్లారంలో దారుణం.. బైక్పై వెళ్తున్న దంపతులపై దాడి
సాక్షి, హైదరాబాద్: బొల్లారంలో దారుణం జరిగింది. బైక్పై వెళ్తున్న భార్యాభర్తలపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో దుండగులను భర్త అడ్డుకున్నారు. దీంతో ఆయన భార్య మీనాను దుండగులు గొంతు కోసి దారుణంగా హత్య చేయగా.. భర్త అనిల్ కుమార్పై కత్తులతో దాడి చేశారు.తీవ్రంగా గాయపడిన అనిల్ కుమార్ పరిస్థితి విషమం ఉంది. ఆసుపత్రికి తరలించారు. పరారైన నిందితులు కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. బిహార్కు చెందిన దంపతులు బొల్లారంలో నివాసం ఉంటున్నారు. షాపింగ్కు వెళ్లి వస్తుండగా ఘటన జరిగింది. -
విద్యార్థి హత్య: ఎన్కౌంటర్లో నిందితుడు హతం
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ను కుదిపేసిన 11వ తరగతి విద్యార్థి సూర్య చౌహాన్ దారుణ హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ హత్యకు ప్రధాన సూత్రధారిగా ఉన్న అసద్, పోలీసుల ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు. శనివారం ఇందిరాపురం ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్ ఉద్రిక్తతకు దారితీసింది.ఎన్కౌంటర్ వెనుక ఉన్న అసలు కథమే 28న జరిగిన ఘర్షణలో సూర్య చౌహాన్ తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు. ప్రధాన నిందితుడు అసద్పై రూ. 50,000 రివార్డు ప్రకటించిన పోలీసులు, అతడి కోసం వేట మొదలుపెట్టారు. ఖోడా ప్రాంతంలో తన సహచరులను కలిసేందుకు అసద్ వస్తున్నాడనే సమాచారం అందుకున్న పోలీసులు, అప్రమత్తమై చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. మోటార్ సైకిల్పై వస్తున్న అసద్ను ఆపే ప్రయత్నం చేయగా, అతను పోలీసులపై కాల్పులు జరిపాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో అసద్కు తీవ్రగాయాలయ్యాయి, ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనలో ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా గాయపడ్డాడు.కుట్రపూరిత హత్య: కుటుంబం ఆరోపణసూర్య కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, మే 28న ఫోన్ కాల్ చేసి ఈద్ వేడుకల కోసం రమ్మని పిలిచి, అతడిని ఒకచోట బంధించి దాడి చేశారు. ఏడుగురు వ్యక్తులు కత్తులతో వెంటాడి మరీ సూర్యను పొడిచారని, తనను తాను కాపాడుకునేందుకు 200 మీటర్ల దూరం పరుగెత్తినా వదలకుండా దాడి చేశారని సోదరి ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బుల్డోజర్లతో వారి ఇళ్లను కూల్చివేయాలని బాధితుడి తల్లి సరోజ్ డిమాండ్ చేస్తున్నారు.చిన్న గొడవే ప్రాణం తీసిందిపోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం సూర్య స్నేహితులే నిందితులు. మోటార్ సైకిల్ నడపడం విషయమై జరిగిన చిన్నపాటి వాగ్వాదం పెరిగి, కోపంతో అసద్ సూర్యను నిందితులు కత్తితో పొడిచినట్లు డీసీపీ ధవల్ జైస్వాల్ తెలిపారు. ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేశామని, మిగిలిన వారి కోసం గాలింపు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో నిందితులు ఉపయోగించిన మోటార్ సైకిల్, తుపాకీని స్వాధీనం చేసుకుని సోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఇది కూడా చదవండి: అందం, హోదా.. అంతా అబద్ధమేనా? -
భర్తను చంపించి.. గుండెలు బాదుకుంది!
రోడ్డుపక్కన మంటల్లో కాలిపోతున్న స్కార్పియో వాహనం, అందులో కనిపించిన మృతదేహాలు, ఇంటివద్ద కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న భార్య.. ఆ ఘోరం చూసి అంతా అయ్యో పాపం అనుకున్నారు. గ్రామస్తులే కాదు, మొదట్లో పోలీసులు కూడా ప్రమాదమే అనుకుని జాలి చూపించారు. కానీ ఫోరెన్సిక్ దర్యాప్తులో బయటపడిన నిజాలు.. ఒక్కసారిగా అందరినీ షాక్కు గురిచేశాయి.రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లా శ్రీరాంపుర గ్రామం మే 28వ తేదీన ఉదయం సమీపంలో ఓ స్కార్పియో వాహనం మంటల్లో కాలిపోతుండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వాహనంలో మూడు కాలిన మృతదేహాలను గుర్తించారు. మరొక మృతదేహం సమీపంలోని పొలంలో లభించింది. మృతులను మాజీ సర్పంచ్ రామ్సింగ్ చౌదరి, ఆయన తల్లి పూసీదేవి, రెండో భార్య సూర్యగ్యాన్ దేవి, కుటుంబ సభ్యురాలు మహిమా చౌదరిగా గుర్తించారు. తొలుత ఇది ఘోర ప్రమాదమని భావించిన పోలీసులు.. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ పరీక్షల్లో మృతదేహాలపై పదునైన ఆయుధాలతో దాడి చేసిన గాయాలు ఉండటాన్ని గుర్తించారు. దీంతో కేసు మలుపు తిరిగింది.ఈ తరుణంలో.. దర్యాప్తు క్రమంగా కుటుంబ సభ్యుల వైపు మళ్లింది. ఇదే సమయంలో రామ్సింగ్ మొదటి భార్య సునీత చౌదరి ఇంటివద్ద తీవ్రంగా విలపిస్తూ కనిపించింది. బంధువుల మధ్య కూర్చుని కన్నీళ్లు కారుస్తూ.. గుండెలు బాదుకుంది. షాక్తో పదే పదే మూర్ఛపోసాగింది. అయితే ఆమె పర్ఫార్మెన్స్పై పోలీసులకు ఎందుకో అనుమానం వచ్చింది. భర్త రెండో వివాహం.. కుటుంబ వివాదాల నడుమ.. ఆమె అలా ప్రవర్తించడం ఆ దిశగా విచారణకు అడుగులేయించింది.అయితే పోలీసులకు సునీత ఓ స్టేట్మెంట్ ఇస్తే.. దర్యాప్తులో అదంతా తారుమారైంది. రామ్సింగ్ తన తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లాడని ఆమె చెప్పినా.. సాంకేతిక ఆధారాలు, ఇరుపొరుగువాళ్లు ఇచ్చిన స్టేట్మెంట్తో అసలు విషయం బయటపడింది.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రామ్సింగ్కు ఇద్దరు భార్యలు. ఆ ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండటం వల్ల తరచూ ఘర్షణలు జరిగేవి. అలా బుధవారం రాత్రి గొడవ తీవ్రస్థాయికి చేరింది. ఆ సమయంలో సునీత చౌదరి, ఆమె కుమార్తె సరిత, మైనర్ కొడుకు కలిసి.. తొలుత రామ్సింగ్ను హతమార్చారు. ఆపై ఆ హత్యను చూసిన రామ్సింగ్ తల్లిని చంపారు. ఆ వెంటనే రెండో భార్య కూడా చూసి ఉంటుందన్న అనుమానంతో చంపేశారు. ఈలోపు అటుగా వచ్చిన రెండో భార్య మేనకోడలిని సైతం ఎవరికైనా చెబుతుందేమోనని చంపేశారు.అనంతరం నేరాన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాలను స్కార్పియోలో వేసి హైవేపైకి తీసుకెళ్లి వాహనానికి నిప్పంటించినట్లు ఆరోపిస్తున్నారు. ఫోరెన్సిక్ ఆధారాలు, మొబైల్ డేటా, గ్రామస్తుల వాంగ్మూలాలు కలిపి చూసినప్పుడు కుట్ర మొత్తం బయటపడిందని అజ్మీర్ ఎస్పీ హర్షవర్ధన్ అగర్వాల్ తెలిపారు. చిన్నచిన్న ఆధారాలే ఈ కేసును ఛేదించాయని ఆయన చెప్పారు.ప్రస్తుతం సునీత చౌదరి, ఆమె కుమార్తె, కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ కేసులో ప్రజలను అత్యంత షాక్కు గురిచేసిన విషయం ఒక్కటే. నాలుగు హత్యలకు పాల్పడిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళే.. ఆ తర్వాత మృతుల కోసం కన్నీళ్లు కారుస్తూ, శోకసంద్రంలో మునిగిపోయినట్టు నటించిందని పోలీసులు చెబుతున్నారు. నెలల తరబడి ఎదురు చూసి..పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఈ హత్యల వెనుక కీలక పాత్ర పోషించిన వ్యక్తి కుటుంబంలోని మైనర్ కుమారుడేనని ఓ అంచనాకి వచ్చారు. కుటుంబ విభేదాలు, ముఖ్యంగా తండ్రి రెండో వివాహంపై ఇంట్లో నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతల నేపథ్యంలో అతడు ముందుగానే ఈ దాడికి సిద్ధమైనట్లు విచారణలో తేలిందని కథనాలు పేర్కొంటున్నాయి. తరచూ తల్లిని, అక్కను తండ్రి కొట్టడం భరించలేకపోయాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆన్లైన్లో పదునైన కత్తిని కొనుగోలు చేసి, దానిని కొంతకాలం ఇంట్లో దాచిపెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన రాత్రి తల్లి సునీత, అక్క సరితతో కలిసి పథకం ప్రకారమే నలుగురిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. హత్యల అనంతరం ఆధారాలు లేకుండా చేసేందుకు మృతదేహాలను స్కార్పియో వాహనంలో తీసుకెళ్లి నిప్పంటించడంలోనూ అతడు సహకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. -
ప్రియురాలిని చంపి.. భర్తకు ఫోన్ చేసిన ప్రియుడు..!
ఏలూరు టౌన్: అనుమానం పెనుభూతంగా మారింది... ఆర్థిక లావాదేవీలు, వివాహేతర సంబంధం కాస్తా... పగ, ప్రతీకారానికి దారితీశాయి... డబ్బులు ఇస్తానని నమ్మబలికి ఊరు తీసుకువెళ్ళి అత్యంత కిరాతకంగా చంపేశాడు... ఐదు రోజుల అనంతరం మృతదేహాన్ని గుంతతవ్వి పూడ్చిపెట్టాడు. ఈ ఘోరహత్యకు సంబంధించి ఏలూరు త్రీటౌన్లో నమోదైన మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులకు విస్తుగొలిపే నిజాలు వెలుగుచూశాయి. ఏలూరు త్రీటౌన్ పోలీసులు అత్యంత చాకచక్యంగా, అత్యాథునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి.. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఏలూరు పోలీస్సబ్ డివిజన్ కార్యాలయంలో ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఏలూరు త్రీటౌన్ స్టేషన్లో మిస్సింగ్ కేసు ఏలూరు శివారు శౌరీపురం గ్రామానికి చెందిన మల్లపల్లి విశాలి (36) ఏప్రిల్ 18న గుడివాడలోని బంధువుల ఇంటికి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లింది. విశాలి ఇంటికి రాకపోవటంతో భర్త, బంధువులు కంగారుపడ్డారు. ఆమె మొబైల్ ఫోన్ స్విచ్ఆఫ్ రావడంతో భర్త ఆందోళనతో ఏలూరు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు క్రైమ్నెంబర్ 81/2026, విమెన్ మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఏలూరు త్రీటౌన్ సీఐ వి.కోటేశ్వరరావు, ఎస్సై పి.రాంబాబు బృందాలుగా మహిళ కదలికలపై నిఘా ఉంచారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి దర్యాప్తు చేపట్టగా... శౌరీపురం గ్రామానికే చెందిన ఫ్రాన్సిస్ శౌరి (36) పాలవ్యాపారితో ఆమె నిత్యం ఫోన్ మాట్లాడినట్లు గుర్తించారు. మిస్సింగ్ కేసు విచారణ సమయంలో ఫ్రాన్సిస్ గ్రామంలో లేకపోవడంతో పోలీసుల అనుమానం బలపడింది. పాలవ్యాపారి ఫ్రాన్సిస్ విశాలితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ రూ.2 లక్షలు వడ్డీకి అప్పు ఇచ్చినట్లు గుర్తించారు. ఇద్దరి మద్య వివాహేతర సంబంధం కొనసాగుతూ ఉండగానే, మరోవైపు విశాలి ఇతర వ్యక్తులతో ఫోన్ మాట్లాడుతుందనే అనుమానాన్ని పెంచుకున్నాడు. ప్రియురాలిపై మోహం కాస్తా, కక్షగా మారింది. ఆమెను హతమార్చాలని పథకం రచించాడు. చున్నీతో గొంగు బిగించి... పెద్దరాయితో మోది హత్య ప్రియురాలిని హత్య చేయాలనే పధకంతో ఏప్రిల్ 18న డబ్బులు ఇస్తానని నమ్మించి విశాలిని హనుమాన్ జంక్షన్కు రావాలని చెప్పాడు. ఆమెను మోటారు సైకిల్పై నూజివీడు మండలం పల్లెర్లమూడి, పోలవరం కాలువ గట్టు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లాడు. విశాలి చున్నీతో ఆమె గొంతు బిగించి ఊపిరాడకుండా చేశాడు. కిందపడిపోయిన ఆమెపై పెద్దరాయితో ఛాతీపై బలంగా మోదాడు. కిరాతకమైన దాడిలో విశాలి ప్రాణాలు కోల్పొయింది. హత్య చేసిన అనంతరం పొదల్లో పడేసి మెల్లగా జారుకున్నాడు. ఐదు రోజుల అనంతరం ఏప్రిల్ 23న సంఘటనా స్థలానికి వెళ్లిన ఫ్రాన్సిస్ ఆమె మృతదేహాన్ని లోతుగా గుంతతవ్వి పూడ్చిపెట్టాడు. ఆమె బట్టలు, వస్తువులను దగ్ధం చేశాడు. పోలీసులు, కుటుంబ సభ్యులను తప్పుదోవ పట్టించేందుకు ఆమె బతికే ఉందనే భ్రమ కలి్పస్తూ వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ విశాలి ఫోన్ నుంచి భర్తకు వాట్సాప్ చాటింగ్ చేయటం, ఫోన్ చేసి లిఫ్ట్ చేశాక మాట్లాడకుండా ఉంటూ వారితో ఆటలాడాడు. అనంతరం ఆమె మొబైల్ ఫోన్ పగులగొట్టి, చెరువులో పడేశాడు. ఎట్టకేలకు ఛేదించిన పోలీసులు ఏలూరు త్రీటౌన్ పోలీసులు పక్కా సమాచారంతో ఈనెల 28న ఏలూరు హౌసింగ్బోర్డు కాలనీ సమీపంలో నిందితుడు ఫ్రాన్సిస్ను మోటారు సైకిల్తో అదుపులోకి తీసుకుని విచారించారు. నేరాన్ని అంగీకరిస్తూ నూజివీడు పల్లెర్లమూడి శివారులో మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ప్రదేశానికి పోలీసులు వెళ్ళిన అనంతరం నూజివీడు తహసీల్దార్ సమక్షంలో శవాన్ని వెలికితీశారు. మహిళ మిస్సింగ్ కేసును హత్య కేసు, ఆధారాల నిర్మూలన సెక్షన్లు 103(1), 238(ఏ)బీఎన్ఎస్ గా మార్పు చేశారు. బంధువుల అదనపు స్టేట్మెంట్లు రికార్డు చేసి, నేరస్థలంలో పక్కా ఆధారాలు సేకరించి, నిందితుడ్ని న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. దీంతో నిందితుడికి కోర్టు రిమాండ్ విధించిందని ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్ తెలిపారు. ఈ కేసు ఛేదించటంలో ప్రతిభ చూపిన త్రీటౌన్ సీఐ వి.కోటేశ్వరరావు, ఎస్సై పి.రాంబాబు, సిబ్బందిని ఏలూరు జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ ప్రత్యేకంగా అభినందించారు. -
మొయిజుద్దీన్ హత్య కేసును ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్: లాయర్ మొయిజుద్దీన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు హత్య కేసుకు సంబంధించి ఏడుగుర్ని అరెస్ట్ చేసినట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు. నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టిన సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. వక్ఫ్ భూముల వివాదాలే లాయర్ హత్యకు కారణమన్నారు. లం ఖాన్ కుటుంబానికి మొయిజుద్దిన్ పలు విషయాలలో అడ్డు వస్తున్నాడానే కారణంతో హత్య చేయించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు.‘మొయిజుద్దీన్ స్విమ్మింగ్కు వెళ్తుండగా హత్య చేశారు. మొయిజుద్దీన్ను హతమార్చాలని ఆలంఖాన్ నిర్ణయించుకున్నాడు. మే 23 న శాంతి నగర్ లో అడ్వకేట్ ఖాజా మొయిజుద్దిన్ను ఉద్దేశపూర్వకంగా కారుతో ఢీ కోట్టారు. వక్ఫ్ భూముల వివాదాలే లాయర్ హత్యకు కారణం. జనవరి నుంచి లాయర్ హత్యకు రెక్కీ నిర్వహించారు. 23వ తేదీన మొయిజుద్దీన్ స్విమ్మింగ్ వెళ్తుండగా హత్య చేశారు. లాయర్ను చంపేందుకు రూ. 15 లక్షలు సుపారీ ఇచ్చారు. నిందితుల నుంచి రూ. 10. 10 లక్షలు స్వాధీనం చేసుకున్నాం. ఆలం ఖాన్ కుటుంబానికి మొయిజుద్దిన్ పలు విషయాలలో అడ్డు వస్తున్నాడానే కారణంతో హత్య చేయించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. లక్డి కాపుల్, మలక్ పేట్ ప్రాంతాలకు చెందిన వక్ఫ్ బోర్డు ప్రాపర్టీకి సంబంధించి కేసులలో ఖాజా మొయిజుద్దిన్, ఆలం ఖాన్ కుటుంబానికి వివాదాలు ఉన్నాయి. హత్య చేసేందుకు గత ఆరు నెలల నుండి పలు మార్లు ప్రయత్నం చేసి చివరకు మొయిజుద్దిన్ ను హత్య చేశారు’ అని తెలిపారు. -
కడుపులో బిడ్డ తనది కాదని.. ట్విషాని మెంటల్ టార్చర్ చేసి చంపేసి..
-
మీ ఫోన్ వస్తే భయమేస్తోంది సార్..
నల్గొండ జిల్లా: ‘మీ ఫోన్ వస్తే భయమేస్తోంది సార్.. మీ వల్ల నరకం చూశాను.. అధిక వడ్డీకి అప్పులు తీసుకొని తీర్చలేకపోతున్నా.. నా కుటుంబ సభ్యులు నన్ను క్షమించాలి’అని సూసైడ్ నోట్ రాసి వ్యవసాయాధికారి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే...చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన గుంటోజు బాలరాజు (38) కొన్నేళ్లుగా కేతేపల్లి క్లస్టర్ వ్యవసాయ శాఖలో ఏఈఓగా విధులు నిర్వర్తిస్తున్నాడు. కుటుంబ అవసరాలతోపాటు వ్యవసాయం చేసేందుకుగాను కొందరి వద్ద అప్పుగా డబ్బు తీసుకొని వాటిపై అధిక వడ్డీ భారం మోస్తూ మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. బుధవారం సాయంత్రం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహానికి నల్లగొండలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించగా గురువారం ఉరుమడ్లలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమార్ తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అప్పుల మీద అప్పులు.. ఆత్మహత్యకు ముందు ఏఈఓ బాలరాజు తొమ్మిది పేజీల సూసైడ్ నోట్ రాశాడు. అందులో.. అప్పు ఇచ్చిన వారు ఫోన్ చేస్తూ ఒత్తిడి చేశారని పేర్కొన్నాడు. తాను పనిచేస్తున్న ప్రాంతంలో మరో వ్యక్తితో కలిసి పదెకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని సాగు చేయగా రూ.3 లక్షల నష్టం వచ్చిందన్నాడు. అది పూడ్చుకునేందుకుగాను ఓ చిట్ఫండ్లో పనిచేసే ఏజెంట్ ద్వారా తన తోటి కౌలుదారుతో చిట్టీ వేయించానని, అందుకు తాను ష్యూరిటీ ఉన్నానని, అతడు చిట్టీ డబ్బులు పూర్తిగా కట్టకపోవడంతో రూ.5 లక్షలు చిట్ఫండ్ కంపెనీకి తానే కట్టాల్సి వచ్చిందని నోట్లో పేర్కొన్నాడు. ఈ భారం నుంచి బయటపడేందుకు.. తెలిసిన వ్యక్తుల ద్వారా మారి్టగేజ్ లోన్లు, ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు తీసుకొని, వడ్డీలు కట్టలేక మరలా అప్పులు చేయాల్సి వచ్చిందని బాలరాజు వివరించాడు. అధిక వడ్డీలతో సామాన్య ప్రజలను మోసం చేస్తున్న వారిని వదిలిపెట్టొద్దని, కఠిన చర్యలు తీసుకోవాలని సూసైడ్ నోట్లో కలెక్టర్, ఎస్పీలను కోరాడు. -
నేపాలీ ఇదేం పని.. వీధిలో చేయిపట్టుకొని అసభ్య ప్రవర్తన.. దేహశుద్ధి
హైదరాబాద్: రాత్రివేళ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న యువతితో అసభ్యంగా ప్రవర్తించిన నేపాలీ యువకులను గురువారం అబిడ్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. బుధవారం రాత్రి బషీర్బాగ్ సీసీఎస్ కార్యాలయం ఎదురుగా ఓ యువతి ఒంటరిగా వెళుతోంది. దీంతో నేపాల్ యువకులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. యువతి గట్టిగా అరవడంతో స్థానికులు బంధించి బంధించి దేహశుద్ధి చేశారు. అనంతరం వారిని అబిడ్స్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. స్థానికంగా ఓ ఫాస్ట్ఫుడ్ కేంద్రంలో పనిచేస్తున్న సునీల్, ఉమేష్, లక్ష్మణ్, పురుషోత్తం, రామ్ నేవులుగా గుర్తించారు. -
61 ఏళ్ల వృద్ధురాలిపై సామూహిక లైంగికదాడి
తిరువొత్తియూరు: చెన్నై వేళచ్చేరిలో వృద్ధురాలిపై ఐదుగురు యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. చెన్నై వేళచ్చేరికి చెందిన 61 ఏళ్ల వృద్ధురాలు బుధవారం తెల్లవారుజామున మడిపాక్కం ప్రాంతం నుంచి వేళచ్చేరి వైపు నడిచి వెళుతోంది. బైకుల్లో వచ్చిన ఐదుగురు యువకులు వాకింగ్ ముగించుకుని వస్తున్న ఆమెతో పరిచయం చేసుకుని బైకులో ఎక్కించుకుని జన సంచారం లేని ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఐదుగురు యువకులు ఆమెపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను రోడ్డు పక్కన పడేసి అక్కడి నుంచి పారిపోయారు. రక్తగాయాలతో రోడ్డు పక్కన పడి ఉన్న ఆమెను గురువారం ఉదయం అటుగా వెళుతున్న వారు చూసి పోలీసు కంట్రోల్ రూమ్కు సమాచారం ఇచ్చారు. వేళచ్చేరి పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను ఎగ్మూర్లోని ప్రసూతి ఆస్పత్రికి తరలించారు. వేళచ్చేరి పోలీసులు, బిహార్ రాష్ట్రానికి చెందిన 15 ఏళ్ల బాలుడు సహా ముగ్గురు ఇతర రాష్ట్ర కారి్మకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారించగా, వారు ఆ ప్రాంతంలోని హోటళ్లలో పనిచేస్తున్నట్లు తెలిసింది. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఆమెను చూసి వెంబడించి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు వారు నేరం అంగీకరించారు. ఈ కేసులో సంబంధం ఉన్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు సీసీటీవీ దృశ్యాలను సేకరించి విచారణను వేగవంతం చేశారు. -
కూతురి ప్రేమ వివాహం.. మనవడిని కుక్కర్తో కొట్టి చంపిన తాత!
తమిళనాడు: నామక్కల్ జిల్లాలోని పల్లిపాలయానికి చెందిన వెంకటాచలం. ఇతని భార్య అముధ. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వెంకటాచలం మద్యపానానికి బానిసయ్యాడు. ఇతను ఇంట్లోని పాత్రలను అమ్ముతాడు. ఆ డబ్బుతో మద్యం తాగుతూ తిరుగుతాడు. ఈ క్రమంలో, అతని పెద్ద కుమార్తె మోనిషా, భవానికి చెందిన మయిలానందన్తో ప్రేమలో పడింది. తల్లిదండ్రుల వ్యతిరేకత ఉన్నప్పటికీ వీరికి వివాహం జరిగింది. ఈ పరిస్థితుల్లో, మోనిషా 10 రోజుల క్రితం తన 10 నెలల బాబు జోష్విక్తో కలిసి తల్లి ఇంటికి వచ్చింది. దీనికి వెంకటాచలం అభ్యంతరం తెలిపి, ‘ఎందుకు ఇంటికి వచ్చావు? అని అడిగి కూతురిని కొట్టి, హింసించాడు. కుక్కర్ మూత తీసుకుని మోనిషాపై విసిరాడు. అది ఆ పిల్లాడి తలపై పడడంతో, ఆ పిల్లాడు గాయపడి మరణించాడు. మోనిషా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వెంకటాచలాన్ని అరెస్టు చేశారు. -
మైనర్ బాలుడిపై పోలీస్ అధికారి లైంగిక దాడి..!
సాక్షి, చెన్నై : సమాజానికి రక్షణగా ఉండాల్సిన పోలీస్ శాఖకు చెందిన ఓ ఉద్యోగి అర్ధరాత్రి వేళ దారుణానికి ఒడిగట్టాడు. సెలవుల కోసం బంధువుల ఇంటికి వచ్చిన ఒక మైనర్ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, నోటిలో బలవంతంగా మద్యం పోసి చిత్రహింసలు పెట్టిన ఘటన చెన్నై నగరంలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి నిందితుడైన పోలీస్పై అశోక్ నగర్ పోలీసులు శరవేగంగా స్పందించి పోక్సో చట్టంలో కేసు నమోదు చేసిన అరెస్ట్ చేశారు. వివరాలు..కన్యాకుమారి జిల్లాకు చెందిన 16 ఏళ్ల బాలుడు ప్లస్–1 చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో రెండు రోజుల క్రితం తన తల్లిదండ్రులతో కలిసి చెన్నై కోడంబాక్కం ప్రాంతంలోని తన మామ ఇంటికి వచ్చాడు. కుటుంబంతో కలిసి పెరియపాలయం, సిరువాపురి ఆలయాలను సందర్శించిన అనంతరం తల్లిదండ్రులు స్వగ్రామానికి తిరిగి వెళ్లగా, ఆ బాలుడు మాత్రం మామ ఇంట్లోనే ఉండిపోయాడు. ఈనేపథ్యంలో వడపళని పోలీస్ స్టేషన్ రైటర్ పనిచేస్తున్న వేలప్పన్ తన మామకు స్నేహితుడు కావడంతో బుధవారం రాత్రి వారి ఇంటికి ఆ బాలుడు వెళ్లాడు. అక్కడ ఆ రైటర్, బాలుడి మామ కలిసి మద్యం సేవించారు. కొంత సమయం తర్వాత బాలుడి మామ మద్యం మత్తులో నిద్రపోయాడు. బెడ్ రూమ్లోకి చొరబడి దారుణం అర్ధరాత్రి సమయంలో నిందితుడు వేలప్పన్, బాలుడు టీవీ చూస్తూ పడుకున్న పడకగదిలోకి అకస్మాత్తుగా చొరబడ్డాడు. బాలుడిపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, గట్టిగా అరవకుండా ఉండేందుకు నోట్లో మద్యం పోసి క్రూరంగా ప్రవర్తించాడు. నిందితుడి క్రూరత్వం నుండి ఎలాగైనా బయటపడాలని భావించిన ఆ బాలుడు ధైర్యం చేసి, పక్కనే ఉన్న టీవీ రిమోట్తో వేలప్పన్ను బలంగా కొట్టి కిందకు తోసేశాడు. అనంతరం గదిలోంచి బయటకు పరుగెత్తుకుంటూ వచ్చేశాడు. మత్తులో కామాంధుడిగా మారిన ఆ నిందితుడు లోపల ఉంచి ఇంటికి తాళం వేశాడు. అర్ధరాత్రి వేళ భయంతో కేకలు వేస్తూ కాలినడకన సమీపంలోని అశోక్ నగర్ పోలీస్ స్టేషన్కు చేరుకుని ఆశ్రయం పొందాడు. పోలీస్ స్టేషన్లో బాలుడు ఏడుస్తూ తనకు జరిగిన అన్యాయాన్ని వివరించడంతో అధికారులు తక్షణమే స్పందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, ఇంట్లోనే బందీగా ఉన్న వేలప్పన్ను అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రాథమిక విచారణలో బాలుడిపై లైంగిక దాడి జరిగినట్లు నిరా>్ధరణ కావడంతో, నిందితుడు వేలప్పన్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. -
ఈదురుగాలులకు కూలిన బ్రిడ్జి.. ఆరుగురి మృతి
ఉత్తరప్రదేశ్ ఘోర ప్రమాదం సంభవించింది. నిర్మాణంలో ఉన్న వంతెన కూలి ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. గాయపడిన మరికొందరిని ఆస్పత్రికి తరలించగా.. వాళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండడంతో.. మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు.హమీర్పూర్ జిల్లాలో బేత్వా నది వద్ద శుక్రవారం తెల్లవారుఝామున ఈ ఘటన జరిగింది. ఈదురు గాలుల ధాటికి నిర్మాణంలో ఉన్న వంతెనలో కొంత భాగం కుప్పకూలిపోయింది. ఆ సమయంలో వంతెన కింద నిద్రిస్తున్న కార్మికుల మీద అవి పడ్డాయి. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడినవాళ్లను స్థానిక ఆస్పత్రికి తరలించారు. At least 6 people were killed after an under construction bridge collapsed in Hamirpur district of Uttar Pradesh. pic.twitter.com/2UfarN3Nm9— Piyush Rai (@PiyushRaiUP65) May 29, 2026సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బ్రిడ్జిని నాసికరంగా నిర్మించడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదే విధంగా ఆంధీ తుపాను హెచ్చరిక ఉన్నప్పటికీ కార్మికుల భద్రత విషయంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహిరించాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యానాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. తీవ్ర ఆరోఫణల నేపథ్యంలో విస్తృతస్థాయి దర్యాప్తునకు ఆయన జిల్లా పరిపాలన యంత్రాంగాన్ని ఆయన ఆదేశించారు. ఇదిలా ఉంటే.. ఇటీవలె బిహార్లోనూ ఈ తరహా ప్రమాదం ఒకటి జరిగింది. -
డీఎస్పీగా ప్రమోషన్.. ఇంతలోనే పోలీస్ అధికారి ఆత్మహత్య..!
బెంగళూరు: పోలీసు శాఖలోని ఎస్డీఆర్ఎఫ్లో ఇన్స్పెక్టర్గా పనిచేసే శ్రీశైల్ చౌగలే (37) ఆత్మహత్య చేసుకున్న ఘటన బెళగావి సిటీలో జరిగింది. బుధవారం రాత్రి విధులు ముగించుకుని చెన్నమ్మ నగరలోని ఇంటికి వెళ్లి ఉరి వేసుకున్నాడు. భార్య చూసి వెంటనే ఆయన పనిచేసే ఆఫీసుకు కాల్ చేసి చెప్పింది. సిబ్బంది, పోలీసులు చేరుకుని తలుపులు పగలగొట్టి గదిలోకి వెళ్లారు. మృతదేహాన్ని కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయాలు బహిర్గతం కాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. త్వరలో డీఎస్పీ ప్రమోషన్ ఆయన బంధువులు మాట్లాడుతూ చౌగలే ప్రతిభావంతుడైన అధికారి అని, గతంలో రిజర్వు పోలీసు సీఐగా ఉండేవాడని తెలిపారు. త్వరలోనే డీఎస్పీగా ప్రమోషన్ వస్తుందని చెప్పేవాడని, ఇంతలోనే ఘోరం జరిగిందని విలపించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
తీయని మాటలతో రూ.1.66 కోట్ల లూటీ
బనశంకరి: సిలికాన్ సిటీలో మరో భారీ సైబర్ క్రైం వెలుగులోకి వచ్చింది. డేటింగ్ యాప్ ద్వారా అపరిచిత సుందరి తీయని మాటల మాయలో పడిన టెక్కీ రూ.1.66 కోట్లు పోగొట్టుకుని లబోదిబోమంటున్నాడు. ఈ ఫ్రాడ్ బెంగళూరులో జరగ్గా, బాధితుడు ఆగ్నేయ విభాగం సైబర్క్రైం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ప్రేమ, పెళ్లి.. పెట్టుబడులు వివరాలు... సాఫ్ట్వేర్ ఇంజనీర్ సౌరవ్ దూబే నగరంలో టెక్కీగా పనిచేస్తున్నాడు. ఫిబ్రవరి 15న టంటన్ అనే ప్రముఖ డేటింగ్ యాప్లో అతనికి రియా అగర్వాల్ అనే పేరు గల యువతి పరిచయమైంది. చాటింగ్ చేసుకుంటూ స్నేహితులుగా మారారు. తరువాత రియా అతని మొబైల్ నంబరు తీసుకుని తరచూ ఆడియో, వీడియోకాల్స్ చేస్తూ దగ్గరైంది. దూబెని వివాహం చేసుకుంటానని నమ్మించింది. బాధితుడు పూర్తిగా వలలో పడిపోయాడని గ్రహించిన మోసగత్తె... ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలో కోట్లాది రూపాయలు లాభం పొందవచ్చునని, మన భవిష్యత్తుకు ఎంతో సహాయంగా ఉంటుందని ఆశపెట్టింది. యువతి మోజులో పడిన టెక్కీ ఏమాత్రం ఆలోచించకుండా మూడు నెలల అవధిలో తన బ్యాంక్ అకౌంట్ల నుంచి రూ.1.66 కోట్లను ఆమె చెప్పిన ఖాతాలకు పంపించాడు. మొబైల్ స్విచ్చాఫ్ కోట్లాది రూపాయలు సమర్పించుకున్న సౌరబ్ దూబె ఖాతాలోకి లాభాల పేరిట రూ.4,250 వచ్చాయి. దీంతో అనుమానపడిన అతడు తన పెట్టుబడి డబ్బు, లాభం వెనక్కి ఇవ్వాలని రియా అగర్వాల్ను అడిగాడు. కొన్నిరోజుల పాటు మాటలు చెప్పి తప్పించుకుంది. అతడు ఒత్తిడి తీవ్రం చేయడంతో వంచకురాలు మొబైల్ను స్విచ్చాఫ్ చేసుకుని అదృశ్యమైంది. దీంతో టెక్కీ దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. చివరకు సైబర్ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వంచకురాలు, ఆమె బ్యాంకు అకౌంట్లను కనిపెట్టే పనిలో ఉన్నారు. డేటింగ్ యాప్స్లో అపరిచితుల ప్రలోభాలకు గురికావద్దని ప్రజలకు పోలీసులు హెచ్చరించారు. -
నుజ్జునుజ్జైన కారు.. అక్కడికక్కడే ఐదుగురి దుర్మరణం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో మరోసారి ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. చిత్రదుర్గం జిల్లా తుమకుర్లహళ్లి సమీపంలో కారు–లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యిందని తెలుస్తోంది.ప్రాథమిక సమాచారం ప్రకారం.. వేగంగా వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు. క్షతగాత్రులు ఉన్నట్లయితే వారిని సమీప ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.మృతుల వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. ప్రమాదానికి అతివేగం, డ్రైవర్ నిద్రమత్తు లేదా నియంత్రణ కోల్పోవడం కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రెండ్రోజుల కిందట ఇదే జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఓకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. -
యువతికి నరకం అంటే ఏంటో చూపించిన పూజారి
ఢిల్లీకి చెందిన ఓ పూజారి (27) తన ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ను తిరస్కరించిన ఓ యువతికి నరకం చూపించాడు. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో అసభ్యకర, నగ్న మార్ఫింగ్ ఇమేజ్లు, ఫొటోలు రూపొందించాడు. ఆ పూజారి ఆన్లైన్లో మత వీడియోలు చేసేవాడు. సులభంగా దొరికే ఏఐ టూల్స్ వాడి మహిళ ఫొటోలను మార్చి, అనేక నకిలీ సోషల్ మీడియా ఖాతాల్లో అతడు అప్లోడ్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.అహ్మదాబాద్ సిటీ సైబర్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు అతడిని ఢిల్లీలో గుర్తించి, బుధవారం అరెస్టు చేశారు. మహిళలను ఆన్లైన్ వేధింపుల నుంచి కాపాడే “మిషన్ సైబర్ రక్షిక: #సెక్యూర్ హర్ స్పేస్” కార్యక్రమం కింద ఈ అరెస్టు జరిగింది.ఎలా మొదలైంది? ఆన్లైన్లో మత ప్రవచనాలు చేసే సుమిత్ నేమ్చంద్ శర్మతో గుజరాత్కు చెందిన ఓ మహిళకు సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. శర్మ మొదట ఇన్స్టాగ్రామ్లో ఆమెతో చాట్చేసి, మత విషయాలపై సంభాషణలు ప్రారంభించినట్టు సమాచారం. తర్వాత అతడు ఆమెతో స్నేహం చేయాలని ప్రయత్నించగా, మహిళ తిరస్కరించింది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. 2025 డిసెంబర్ నుంచి 2026 ఏప్రిల్ 6 వరకు అతడు ఇంటర్నెట్ ద్వారా మహిళను వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏఐతో అసభ్యకర కంటెంట్ బాధిత మహిళ శర్మతో ఫ్రెండ్షిప్ను తిరస్కరించడంతో ఆ యువతి, ఆమె తల్లి ఫొటోలను ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి డౌన్లోడ్ చేశాడు. ఫొటోల్లో దుస్తులు లేకుండా చేసే ఏఐ టూల్స్ కోసం ఆన్లైన్లో వెతికాడు శర్మ. ఆ టూల్స్ సాయంతో 100కు పైగా అసభ్యకర మార్ఫింగ్ నగ్న చిత్రాలు, వీడియోలు తయారు చేశాడు. వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేశాడు.ఆ మహిళ పేరు, ఫొటోలు వాడి శర్మ 3 నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతాలు, ఓ యూట్యూబ్ ఛానల్ సృష్టించాడు. ఏఐతో తయారైన కంటెంట్ను వాటిలో అప్లోడ్ చేసి, మహిళ, ఆమె కుటుంబ ప్రతిష్ఠ దెబ్బతినేలా కామెంట్స్ పెట్టాడు. దర్యాప్తులో పోలీసులు, ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వేదికల్లో అతడు 8 నుంచి 10 వరకు నకిలీ ఖాతాలు సృష్టించినట్టు గుర్తించారు.“నిందితుడు ఆ యువతితో పాటు ఆమె తల్లి ఏఐ మార్ఫింగ్ నగ్న ఫొటోలు, వీడియోలను నకిలీ ఖాతాల్లో అప్లోడ్ చేశాడు. మహిళను మానసికంగా వేధించి, సమాజంలో ఆమె ప్రతిష్ఠ దెబ్బతీయాలనే ఉద్దేశంతో అసభ్యకర కంటెంట్ పోస్ట్ చేశాడు” అని అధికారులు తెలిపారు.“యువతి, ఆమె తల్లి ఫొటోలను ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి డౌన్లోడ్ చేసి, గూగుల్లో ‘ఏఐ రిమూవ్ క్లోత్స్’ అని వెతికిన తర్వాత అనేక వెబ్సైట్లు వాడి, కృత్రిమ మేధ సాధనాలతో మార్ఫింగ్ నగ్న చిత్రాలు, వీడియోలు తయారు చేశాడు” అని అధికారులు తెలిపారు.ఢిల్లీలో దొరికిపోయాడు..బాధిత యువతి అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బృందాన్ని ఆశ్రయించింది. ఇన్స్పెక్టర్ ఎంహెచ్ భేటారియా నేతృత్వంలోని పోలీసు బృందం, డిజిటల్ ట్రాకింగ్, మానవ సమాచార సాయంతో ఈశాన్య ఢిల్లీలోని ఉస్మాన్పూర్లో నిందితుడి ఆచూకీని గుర్తించింది. ఆ ప్రాంతంలో పోలీసులు దాడి చేసి శర్మను అరెస్టు చేశారు. -
లేడీస్ హాస్టల్లో రహస్య ఫొటోలు.. ప్రియుడికి పంపిన మహిళ!
స్నేహితురాళ్ల అశ్లీల ఫొటోలు తీసి ప్రియుడికి పంపిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరునెల్వేలి టౌన్ ప్రాంతానికి చెందిన మకరజ్యోతి (39) అనే మహిళకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో మనస్పర్థల కారణంగా విడిపోయిన ఆమె, పాలయంకోట్టైలోని ఒక ప్రైవేట్ మహిళా హాస్టల్లో గది అద్దెకు తీసుకుని ఉంటోంది. ఆ సమయంలో కోయంబత్తూరుకు చెందిన ఒక యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. ఈ క్రమంలో హాస్టల్లో తనతో పాటు ఉంటున్న ఇతర మహిళల రోజూవారి కార్యకలాపాలను వారికి తెలియకుండానే మకరజ్యోతి సెల్ఫోన్లో రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీసినట్లు ఆరోపణలు వచ్చాయి. అలా తీసిన అశ్లీల చిత్రాలను ఆమె కోయంబత్తూరులో ఉన్న తన ప్రియుడికి పంపుతున్నట్టు తెలిసింది. హాస్టల్ యజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా, మహిళా పోలీసులు విచారణ చేశారు. విచారణలో తోటి మహిళలను అశ్లీలంగా ఫొటోలు తీసినట్లు నిర్ధారణ కావడంతో, పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. -చెన్నై -
తండ్రి మరణాన్ని తట్టుకోలేక..
రంగారెడ్డి జిల్లా: బంధాలు, అనుబంధాలే కరువైపోతున్న ఈ రోజుల్లో తండ్రి మీద ఆ కుమా రు డు పెంచుకున్న మమకారం ఏకంగా ప్రాణాలనే తీసుకునేలా చేసింది. కుమారుడిని అలా చూసిన తల్లి కూడా తనువు చాలించింది. ఈ విషాద ఘట న రంగారెడ్డి జిల్లా లష్కర్గూడ పంచాయతీ కనకదుర్గానగర్ కాలనీలో బుధవారం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లాకు చెందిన పసుల కళాధర్, కళావతి దంపతులు తమ కుమారుడు శివకుమార్తో కలిసి మేడ్చల్లో ఉండేవారు. భార్యాభర్తలిద్దరూ టైలరింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తు న్నారు. ఈ క్రమంలో అనారోగ్యానికి గురైన కళాధర్ ఆరు నెలల క్రితం మృతిచెందారు. దీంతో శివకుమార్ను తీసుకుని కళావతి లష్కర్గూడలో ఉంటున్న తన సోదరుడి వద్దకు వచ్చారు. ఇక్కడే ఓ అద్దె ఇంట్లో ఉంటూ కాలం గడుపుతున్నారు. అ యితే, తండ్రి మరణం శివకుమార్(20)కు మాన సికంగా కుంగదీసింది.తండ్రితో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ నిత్యం తల్లడిల్లేవాడు. ఈ క్ర మంలో తీవ్ర మనోవేదనతో బుధవారం ఉదయం ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డా డు. కొద్దిసేపటి తర్వాత తల్లి కళావతి(45) కొడుకు చనిపోయి ఉండటాన్ని గమనించారు. ఆరునెలల క్రితం భర్త చనిపోవడం, ఇప్పుడు కొడుకు ఆత్మహ త్య చేసుకోవడం చూసి తట్టుకోలేకపోయారు. వా రిద్దరూ లేని జీవితం ఎందుకు అనుకున్నారేమో.. ఆమె కూడా చీరతో ఉరి వేసుకుని బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. -
అప్పులుంటే.. చంపేస్తావా!
తెలిసీ తెలియని వయస్సులో ఈ చేతులే కదా మాకు గోరు ముద్దలు తినిపించాయి.. ఈ చేతులే కదా మమ్మల్ని ఆడించాయి.. ఈ చేతులే కదా మాకు నడక నేర్పించాయి.. అలాంటి ఈ చేతులతోనే మమ్మల్ని కాటికి సాగనంపుతున్నావా నాన్న అంటూ ఆ చిన్నారుల మూగరోదన ఆ తండ్రికి వినిపించలేదు.. అల్లారు ముద్దుగా పెంచి.. అడిగినవన్నీ అరచేతిలో పెట్టి.. మమ్మల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన నువ్వే.. ఏమాత్రం కనికరం లేకుండా.. కాళ్లు, చేతులు కట్టేసి.. కాటికి సాగే నంపే తరుణంలో నీ గుండె ఎంత బండలా మారింది నాన్నా.. అన్న ఆ పసిహృదయాల మౌనవేదన ఆ తండ్రికి కనిపించలేదు. ..కేవలం తాను చేసిన అప్పులకు తన భార్యాపిల్లలు ఎక్కడ బలవుతారో అన్న చిన్న కారణంతో.. ఎన్నో విజయాలు అందుకొని.. నిండు నూరేళ్లు జీవించాల్సిన మూడు నిండు ప్రాణాలను బలితీసుకున్నాడు ఓ తండ్రి. ఇంటి నిర్మాణం, వ్యవసాయంలో నష్టాలు.. వెరసీ అప్పులపాలైన ఓ కౌలు రైతు.. తన కుటుంబాన్ని తానే చిదిమేసుకు న్న విషాదకర సంఘటన తీవ్రంగా కలచివేసింది. వనపర్తి: జీవనోపాధి కోసం మామిడితోటలు లీజుకు తీసుకుని మామిడి పండ్లు విక్రయిస్తూ.. మిగతా సమయంలో తోటల సంరక్షణ చేసుకుంటూ జీవించే ఓ కుటుంబం సరైన లాభాలు లేక.. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక.. అప్పులు ఇచ్చిన వారి ఒత్తిళ్లు తట్టుకోలేక ఓ కుటుంబ పెద్ద తన భార్య, ఇద్దరు పిల్లలను నీటిలో సంపులో పడేసి ప్రాణాలు తీసి.. తానూ ఉరేసుకున్న ఉదంతం ఉమ్మడి పాలమూరు జిలాల్లో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని డోకూరు గ్రామానికి చెందిన నర్సింహులు(40) నాలుగేళ్ల క్రితం ఖిల్లాఘనపురం మండలం సల్కెలాపురం శివారులో సుమారు 50 ఎకరాల మామిడి తోటను లీజు తీసుకుని కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే ఉంటూ జీవనం సాగిస్తున్నాడు.ఈ క్రమంలో తోటల లీజు, ఇతర అవసరాల కోసం గద్వాలలో కొందరితో అప్పు చేశాడు. డోకూరులోని తన సొంత ఇంటిపై ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో రూ.లక్షల్లో అప్పు చేశాడు. ఇటీవల ఈఎంఐలు సక్రమంగా చెల్లించడం లేదని ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు ఇంటి గోడలపై ఈ ఇంటిని అప్పుకింద జప్తు చేయనున్నట్లు రాయడంతో గ్రామంలో తోటివారు, బంధువులు, సన్నిహితుల ఎదుట అవమానంగా భావించాడు. ఐపీ పెట్టే ప్రయత్నం చేశాడు. తన వద్ద ఉన్న వాహనాలు, వస్తువులను అమ్మేసి అప్పులు తీర్చే ప్రయత్నం చేశాడు. అయినా.. వడ్డీలు వసూలు చేసేవారు, ఈఎంఐలు చెల్లించాల్సిన ఫైనాన్స్ కంపెనీల నుంచి ఒత్తిడి తగ్గలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే భార్య ఎల్లమ్మ(36), కుమారుడు నిహాల్(15), కూతురు సాహితీశ్రీ(13)ల కాళ్లు, చేతులు కట్టేసి తోటలోని సంపులోకి తోసి తాను నివాసం ఉండే కంటైనర్కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పరిశీలించిన డీఎస్పీ గిరిబాబు విషయం తెలుసుకున్న వనపర్తి డీఎస్పీ గిరిబాబు ఖిల్లాఘనపురం మండలం సల్కెలాపురం గ్రామ శివారులోని మామిడి తోటకు వెళ్లి ఘటనా స్థలా న్ని పరిశీలించారు. మృతదేహాలను మహబూబ్నగర్ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించి ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.గొల్లుమన్న కుటుంబం.. తల్లిదండ్రుల చాటున నిండునూరేళ్లు జీవించాల్సిన చిన్నారులు.. ఊహించని విధంగా కన్న తండ్రే.. కాలయముడై కాళ్లు చేతులు కట్టేసి నీటి సంపులోకి తోసి ప్రాణాలు తీయడం కలకలం రేపింది. తోటలో ఆడుతూ... పాడుతూ.. సరదాగా తిరిగే చిన్నారులు విగత జీవులుగా పడి ఉండటాన్ని చూసి మామిడి తోట చుట్టుపక్కల రైతులు, కుటుంబ సభ్యులు గొల్లుమన్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం నర్సింహులు స్వగ్రామం డోకూరుకు తీసుకెళ్లారు. -
వివాహేతర సంబంధం, రూ. 2 కోట్ల బీమా కోసం..
మంచిర్యాల క్రైం: వివాహేతర సంబంధం మోజులోపడి కట్టుకున్న భర్తను ఓ భార్య తన ప్రియుడి చేత హత్య చేయించింది. ఇందుకోసం భర్త పేరిట ముందే రూ. 2 కోట్ల విలువైన బీమా పాలసీలు చేయించి వాటిని కూడా సొంతం చేసుకోవాలని పథకం రచించింది. ఆపై ఎవరికీ అనుమానం రా కుండా ఉండాలనే ఉద్దేశంతో రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది. కానీ పోలీసుల దర్యాప్తులో హత్యోదంతం వెలుగు చూడటంతో చివరకు కటకటాలపాలైంది. మంచిర్యాలలో డీసీపీ ఎగ్గడి భాస్కర్ మంగళవారం తన కార్యాలయంలో విలేకరులకు ఈ కేసు వివరాలు వెల్లడించారు. మృతుడి తల్లి ఫిర్యాదుతో.. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట గ్రామంలోని ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన సాయిని కుమార్ (40) వ్యవసాయం చేస్తూ జీవించేవాడు. అతనికి భార్య భారతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ నెల 22న రాత్రి పని నిమిత్తం బయటకు వెళ్లిన కుమార్.. ముల్కల్ల శివారులో రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు హాజీపూర్ పోలీ సులకు సమాచారం అందించారు. అయితే కుమారుడి మర ణం అనుమానాస్పదంగా ఉండటంతో తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏడాది క్రితం నుంచే.. గుడిపేటకు చెందిన రామ్మల్లేశ్ వద్ద కుమార్ గతంలో రూ. 60 వేలు అప్పు తీసుకొని తిరిగి చెల్లించలేదు. దీంతో రామ్ మల్లేశ్ తన అప్పు తీర్చాలంటూ తరచూ కుమార్ ఇంటికి వెళ్లి గొడవ చేసేవాడు. చంపుతానని కూడా బెదిరించేవాడు. ఈ క్రమంలో రామ్మల్లేశ్ భారతికి దగ్గరయ్యాడు. అప్పటికే ఆమె గుడిపేట గ్రామానికి చెందిన లగిశెట్టి సురేందర్తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలియడంతో భారతి, కుమార్ మధ్య గొడవలు జరిగాయి. దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని భారతి ఏడాది క్రితమే నిర్ణయించుకుంది. లోన్ యాప్లో అప్పు చేసి బీమా పాలసీలు.. భర్తను హత్య చేస్తే వివాహేతర సంబంధానికి అడ్డులేకుండా పోతుందని.. అదే సమయంలో భర్త పేరిట బీమా చేయిస్తే రూ. కోట్లు పొందొచ్చని భారతి భావించింది. ఇందుకోసం ఆన్లైన్ లోన్ యాప్ల ద్వారా ఏకంగా రూ. 15 లక్షలు అప్పు చేసి గతేడాది జనవరిలో భర్త కుమార్ పేరిట వివిధ బీమా కంపెనీల నుంచి సుమారు రూ. 2 కోట్ల విలువైన పాలసీలు తీసుకుంది. అనంతరం భర్త హత్యకు రూ.10 లక్షలతో రామ్ మల్లేశ్తో ఒప్పందం కుదుర్చుకుంది. హత్య చేసి దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని వారిద్దరూ పథకం వేసుకున్నారు. రామ్మల్లేశ్... తనకు పరిచయం ఉన్న మంచిర్యాల ఎల్ఐసీ కాలనీకి చెందిన శ్రీరామ్కుమార్ సాయం తీసుకున్నాడు. పథకం ప్రకారం ఈ నెల 22న రాత్రి రామ్మల్లేశ్, శ్రీరాంకుమార్లు కుమార్తో కలిసి ముల్కల్ల శివారులో మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న కుమార్ను ఇనుప సుత్తితో తలపై కొట్టి చంపారు. అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు రోడ్డు పక్కనే మోటార్ సైకిల్ పడేసి వెళ్లిపోయారు. కుమార్ మృతిచెందడం, అతని తల్లి ఈ మరణంపై అ నుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు భార్యపైనే అనుమా నం వ్యక్తం చేస్తూ ఆ కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. హత్య చేసింది రామ్మల్లేశ్, శ్రీరాంకుమారేనని.. చేయించింది భారతి అని నిర్ధారించారు. అలాగే భారతితో వివాహేతర సంబంధం కొనసాగించిన లగిశెట్టి సురేందర్పైనా కేసు నమోదు చేశారు. స్థానిక ఏసీపీ ప్రకాశ్, మంచిర్యాల రూరల్ సీఐ గోపతి రవీందర్, ఎస్సై కిరణ్కుమార్ రెండ్రోజుల వ్యవధిలోనే కేసు మిస్టరీని ఛేదించారు. మంగళవారం భారతి, రామ్మల్లేశ్, సురేందర్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శ్రీరాంకుమార్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
ఏవండీ.. ఇన్సూరెన్స్లు చేయించుకోండి
కుటుంబంలో కలతలు… సంబంధాల్లో మలుపులు… డబ్బుపై ఆశతో వేసిన ఒక పక్కా స్కెచ్ చివరికి ఓ దారుణ హత్యకు దారి తీసిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. భర్త చావును సహజ మరణంగా చూపించి కోట్ల రూపాయల బీమా సొమ్ము దక్కించుకోవాలన్న ఆ భార్య ప్లాన్ పోలీసుల దర్యాప్తుతో బెడిసి కొట్టింది. పైగా వివాహేతర సంబంధం మోజులోనే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారణ అయ్యింది. స్థానికంగా సంచలనం రేపిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల పోలీసుల సమాచారం ప్రకారం.. ఆ జంటకు పెళ్లై చాలా కాలం అయ్యి పిల్లలు ఉన్నారు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అయితే కొంతకాలంగా భార్య భర్తపై ఎప్పుడూ లేనంత ప్రేమ కురిపిస్తూ వచ్చింది. బయటకు అది ఆప్యాయతలాగే కనిపించినా… ఆ ప్రేమ ముసుగు వెనుక కుట్ర దాగి ఉందని ఆ భర్త పసిగట్టలేకపోయాడు.అయితే అప్పటికే ఓ వ్యక్తితో వివాహేతర సంబంధంలో ఉన్న సదరు మహిళ.. ప్రియుడితో కలిసి భర్తను అడ్డు తొలగించేందుకు ప్లాన్ వేసింది. ఈ క్రమంలోనే ఓ సుపారీ గ్యాంగ్కు రూ.10 లక్షలిచ్చి డీల్ మాట్లాడుకుంది. ఈ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి సహజ మరణంగా చూపించాలనుకుంది. తద్వారా భర్త పేరు మీద ఉన్న రూ.3 కోట్ల విలువైన ఇన్సూరెన్స్లు రాబట్టాలనుకుంది. అయితే ఎంత కవర్ చేసే ప్రయత్నం జరిగినప్పటికీ.. భర్త బంధువులకు అనుమానాలు పెరగడం, పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. సాంకేతిక ఆధారాలు, కాల్డేటా, ఆర్థిక లావాదేవీలు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించాయి. ప్లాన్ప్రకారం భర్తను చంపే ఉద్దేశంతోనే ఆమె.. అతని పేరి మీదట ఇన్సూరెన్స్లు తీయించినట్లు తేలింది. భార్యను ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మొత్తం కుట్రలో మరెవరి పాత్ర ఉందన్న కోణంలో లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇవాళ ప్రెస్మీట్లో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. -
అమెరికాలో భారతీయ మహిళ హత్య
అమెరికాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ స్టోర్లో గుజరాత్కు చెందిన భారతీయ మహిళ హత్యకు గురయ్యారు. మృతురాలిని బిజాపుర్ ప్రాంతంలో మెహసానా జిల్లా జంత్రాల్ గ్రామానికి చెందిన మేఘనా పటేల్గా గుర్తించారు. మేఘ్నా పటేల్ తన కుటుంబంతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు. దుకాణం (స్టోర్) లోపల దుండగుడు ఆమెపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్లో దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. ఆ వీడియోలో ఓ వ్యక్తి కస్టమర్ తరహాలో దుకాణంలోకి ప్రవేశించడం కనిపించింది. ట్రాక్సూట్, జాకెట్, గ్లోవ్స్ , ఫేస్ మాస్క్ టోపీ ధరించి ఉన్న ఆ వ్యక్తి.. మేఘ్నా పటేల్తో కొద్దిసేపు మాట్లాడిన సెకన్ల వ్యవధిలోనే ఆమెపై కాల్పులు జరిపాడు.ఆ తర్వాత అతను టేబుల్ పైనుంచి ఏదో తీసుకుని అక్కడి నుంచి పారిపోవడం కనిపించింది. ఈ కాల్పులు దోపిడీ ఉద్దేశంతోనే జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
బీఆర్ఎస్ నేత హత్య కేసును చేధించిన పోలీసులు
సూర్యాపేట: బీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరొకరు పరారీలో ఉన్నారని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ సోమవారం మీడియా సమావేశంలో తెలిపారు. పాతకక్షల నేపథ్యంలోనే మధును మట్టుబెట్టారని చెప్పారు. తన తండ్రి హత్యకు ప్రతీకారంగా ప్రధాన నిందితుడు మిద్దె జీవన్ ఈ హత్యకు పాల్పడినట్టు ఎస్పీ వెల్లడించారు. అతడికి మరో ఐదుగురు సహకరించారని చెప్పారు.కాంగ్రెస్ పార్టీ నాయకుడు మిద్దె రవీందర్ 2007లో యర్కారంలో హత్యకు గురయ్యాడు. తన తండ్రిని హత్య చేసిన మధుపై ప్రతీకారం తీర్చుకునేందుకు రవీందర్ కొడుకు జీవన్ గతంలో రెండు సార్లు హత్యాయత్నం చేసి విఫలం అయ్యాడు. తాజాగా పక్కా ప్లాన్తో మధును హత్య చేశాడు. కొంతకాలంగా సూర్యాపేట బాలాజీనగర్లో కుటుంబంతో పాటు నివసిస్తున్న మధును పథకం ప్రకారం బయటకు తీసుకొచ్చి కత్తులతో నరికి చంపారు.చేపల కూరతో పార్టీ చేసుకుందామంటూ మధును చింత సైదులు శుక్రవారం తన ఇంటికి పిలిచాడు. వీరితో పాటు మేదరి ప్రసాద్ అనే మరో వ్యక్తి కూడా ఉన్నాడు. సాయంత్రం సైదులు, ప్రసాద్తో కలిసి మధు మద్యం సేవించాడు. అతడు మత్తులోకి జారుకోగానే జీవన్కు సైదులు ఫోన్ చేశాడు. సోదరుడి వరుస అయ్యే ఆనంద్తో కలిసి మటన్ కొట్టే కత్తి తీసుకుని సైదులు ఇంటికి వచ్చాడు జీవన్. ఆ తర్వాత జీవన్, సైదులు కత్తితో మధును విచక్షణారహితంగా నరికి చంపారు. మృతదేహాన్ని గొనెసంచితో మూటగట్టి, కారులో తీసుకెళ్లి యర్కారం వద్ద కల్వర్ట్లో పడేశారు.మధు హత్యకు సహకరించిన సైదులు భార్య ముల్కలపల్లి భవానీ పరారీలో ఉందని ఎస్పీ నరసింహ తెలిపారు. మిద్దె జీవన్, చింత సైదులు, మేదరి ప్రసాద్, మిద్దె ఆనంద్, కక్కిరేణి భరత్ చంద్లను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. నిందితులతో పాటు కారు, బైక్, ఐదు ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ అన్నారు. చదవండి: వ్యవస్థ చచ్చింది.. శవమై నడిచింది! -
కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య
కృష్ణరాజపురం: బెంగళూరు నగరంలోని మహాదేవపుర నియోజకవర్గం హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న రాజేష్ ఆరాధ్య భార్య లక్ష్మీప్రియ (26) శుక్రవారం కృష్ణరాజపురలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. రాజేష్ ఆరాధ్య–లక్ష్మీప్రియల వివాహం 2023లో జరిగింది. రాజేష్ ఆరాధ్య, అతని తండ్రి పాలక్ష రాధ్య, తల్లి భాగ్యమ్మ తమ కుమార్తెను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని లక్ష్మీప్రియ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం లక్ష్మీ ప్రియ వాట్సాప్ ద్వారా తన సోదరి జయశ్రీకి ఫోన్ చేయగా ఆమె కాల్ స్వీకరించలేదు. ఆ తర్వాత రాజేష్ ఆరాధ్య ఆమెకు ఫోన్ చేసి లక్ష్మీ ప్రియ మరణించినట్లు తెలియజేశాడు. లక్ష్మీప్రియ కుటుంబ సభ్యులు వెళ్లి పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
నాతో ఉంటావా.. చస్తావా?
వికారాబాద్: ‘నాతో ఉంటావా.. లేదా చస్తావా’ అని ఓ వ్యక్తి మహిళ గొంతు కోశాడు. ఈ సంఘటన తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ పరమేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. యాలాల మండలం తిమ్మాయిపల్లికి చెందిన వివాహిత రేణుకకు.. తాండూరు పట్టణానికి చెందిన వడ్డె రాజుతో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో ఇరువురి మధ్య డబ్బుల విషయంలో గొడవ జరగగా.. ఆమె సదరు వ్యక్తికి దూరంగా ఉంటోంది. తాజాగా ఆదివారం ఎదురు పడిన వివాహితను ఆపి, తనతోనే ఉండాలంటూ బెదిరింపులకు దిగగా.. ఆమె ఎదురుతిరిగింది. దీంతో రాజు బ్లేడుతో రేణుక గొంతు కోశాడు. గమనించిన స్థానికులు బాధితురాలిని చికిత్స నిమిత్తం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. నిందుతున్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు రాజుపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
వివాహేతర సంబంధం.. ప్రియురాలి నాలుక కోసిన ప్రియుడు!
హైదరాబాద్: సహజీవనం చేస్తున్న మహిళ నాలుకను కోసేశాడు ఓ వ్యక్తి. కుషాయిగూడ ఎస్ఐ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం... కుషాయిగూడ, శుభోదయ కాలనీలో నివాసం ఉంటున్న సుజాత దినసరి కూలీ. ఆమె భర్త చనిపోవడంతో అదే కాలనీకి చెందిన నవీన్ అనే వ్యక్తితో కలిసి ఆరు నెలలుగా సహజీవనం చేస్తోంది. కూలీ పనిచేసే ఇద్దరికీ మద్యం తాగే అలవాటు ఉంది. ఈ క్రమంలో ఈ నెల 22న మద్యం మత్తులో ఉన్న వారి మధ్య గొడవ చోటుచేసుకుంది. మాటామాట పెరగడంతో ఆమె నాలుకను నవీన్ కోశాడు. ఇరుగుపొరుగు గమనించి అదే కాలనీలో ఉండే ఆమె కొడుకు డేవిడ్కు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న డేవిడ్ ఆమెను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
‘ఇదే నా చివరి రాత్రి.. నువ్వు సుఖంగా ఉండు’
హైదరాబాద్: జీవితం మీద విరక్తి చెంది ఓ యువకుడు ‘ఇదే నా చివరి రాత్రి’ అంటూ సెల్ ఫోన్లో తన స్నేహితులకు మెసేజ్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 5లో దేవరకొండ బస్తీలో నివసించే సమీర్ (20) ప్రైవేటు ఉద్యోగి. కొంతకాలంగా సమీర్ మానసిక ఆందోళనకు గురవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే శనివారం స్నేహితులకు ‘ఇదే నా చివరి రాత్రి. నువ్వు సుఖంగా ఉండు’ అంటూ చాటింగ్ చేసి ఆదివారం తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మృతిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని, ఎలాంటి కారణాలు కూడా లేవని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి మొబైల్ ఫోన్ చాటింగ్లను పోలీసులు పరిశీలించారు. -
హత్యా.. ఆత్మహత్యా?
కరీంనగర్, మానకొండూర్: డబ్బు తీసుకొని వెళ్లిన యువకుడు విగతజీవిగా కనిపించిన ఘటన తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీ శివారులోని మానేరు డ్యాం సమీపంలో జరిగింది. పోలీసులు, మృతుడి తల్లి కథనం ప్రకారం.. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధి సదాశివపల్లికి చెందిన జార్తి కనకలక్ష్మి భర్త సంపత్ గతంలో చనిపోయాడు.కనకలక్ష్మి వ్యవసాయ కూలీ పనులు చేస్తూ కొడుకు శ్రీనిధ్, కూతురును చదివిస్తోంది. శ్రీనిధ్ ఇటీవలే ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. శనివారం ఉదయం 11 గంటలకు ద్విచక్రవాహనంపై బయటకు వెళ్లాడు. కొద్ది సేపటి తర్వాత ఇంట్లో దాచిన రూ.48,000 కనిపించలేదు.అలాగే తన తల్లి మొబైల్ నుంచి శ్రీనిధ్ తన అకౌంట్కు రూ.33 వేలు బదిలీ చేసుకున్నట్లు తెలిసింది. మధ్యాహ్నం నుంచి ఫోన్ చేసినా ఎత్తలేదు. సాయంత్రం స్విచ్చాఫ్ అయింది. రాత్రి 10.30 గంటలకు శ్రీనిధ్ స్నేహితుడు వికాస్ ఫోన్ చేసి అతని గురించి అడిగాడు. స్నేహితులను విచారించగా వారు కూడా చూడలేదని చెప్పారు.ఆదివారం శవమై..ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో శ్రీనిధ్ స్నేహితులు వీక్, ప్రణయ్ ఇంటికి వచ్చి అతని గురించి అడిగి వెళ్లారు. ఉదయం 7 గంటల సమయంలో బంధువు కౌటం సంపత్, కనకలక్ష్మికి ఫోన్ చేసి రామకృష్ణకాలనీ శివారులో శ్రీనిధ్ ఉరేసుకున్నట్లు ఉందని తెలిపా డు.బంధువులు ఘటన స్థలానికి చేరుకున్నారు. శ్రీనిధ్ చేతులు అదే తాడుతో కట్టి ఉన్నాయి. ఇది ఆత్మహత్య కాదని, హత్య చేసి ఉరివేసి ఉంటారని తల్లి అనుమానం వ్యక్తం చేసింది. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్ఎండీ పోలీసులు తెలిపారు. -
అమ్మా.. పుల్లయ్య నన్ను మోసం చేశాడు..!
నంద్యాల జిల్లా: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆళ్లగడ్డ మండలం అహోబిలం గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. అహోబిలం గ్రామానికి చెందిన బేరింగుల హరిస్వామి, వెంకటలక్ష్మీల కూతురు మోహిత (30) ఇంటర్ చదువుతున్న సమయంలో ఇదే గ్రామానికి చెందిన టీడీపీ నేత పుల్లయ్య ప్రేమిస్తున్నాని వెంటపడ్డాడు. నీవు లేకుంటే చచ్చిపోతా.. నీవే సర్వస్వం అంటూ మాయమాటలు చెప్పాడు. చివరకు ఆమె ప్రేమ విషయం ఇంట్లో చెప్పడంతో అతను మంచోడు కాదు, అందులోనూ కులాలు వేరని తల్లిదండ్రులు వారించారు. దీంతో ఓ రోజు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లి పెళ్లి చేసుకుంది. ఐదేళ్లపాటు సాఫీగా సాగిన సంసారానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే ఓ సంవత్సరం నుంచి తన నిజస్వరూపాన్ని బయటపెట్టిన పుల్లయ్య అనుచరుడుగా ఉంటున్న ఓ గిరిజన యువకుడి భార్యపై మోజు పడ్డాడు. ఆమెను అతనికి దూరం చేసి అనధికారికంగా విడాకులు ఇప్పించాడు. ఆమెను హరినగరం గ్రామంలో ఉంచి సహజీవనం చేస్తున్నాడు. అయినా మనసు సంపుకుని సంసారం చేస్తున్న మోహితకు ఈ మధ్య భర్తతోపాటు ఇంట్లో ఉన్న వారి వేధింపులు అధికమవడాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఈ మధ్యనే పుట్టింటికి వెళ్లి తన తల్లితో అమ్మా.. పుల్లయ్య నన్ను మోసం చేశాడు.. నాకు బతకాలని లేదని చెప్పింది. అయితే అతను అధికార పార్టీకి చెందిన వాడు, మనం ఏమీ చేయలేము.. కేసు పెడదామన్నా మన మీదనే దాడి చేస్తారు. ఏదో విధంగా కొన్ని రోజులు సర్దుకుపోమని చెప్పి పంపారు. ఈ క్రమంలో గురువారం రాత్రి అందరూ చూస్తుండగానే విషం తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు నంద్యాల వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించింది. నా కూతురు మృతిపై అనుమానాలుపుల్లయ్య నా కుమార్తెకు మాయమాటలు చెప్పి వివాహం చేసుకున్నాడు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నా కూతురుపై వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ మధ్య మరో మహిళతో కాపురం చేస్తూ నా కూతురును కట్నం తేలదని వేధిస్తున్నాడు. ఆమెను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటానని గొడవ చేశాడు. అనుకోకుండా మందు తాగిందని, ఆసుపత్రికి తీసుకు పోతున్నామని చెప్పారు. అంతలోనే మృతి చెందిందని చెబుతున్నారు. ఈ మృతిపై అనుమానాలు ఉన్నాయి. ఒంటిపై గాయాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం నిర్వహించి నా కుమార్తె మృతికి కారణమైన ప్రతి ఒక్కరినీ శిక్షించాలి.– బేరింగుల హరిస్వామి, మృతురాలి తండ్రి -
నీ ప్రైవేటు వీడియోలు నా వద్ద ఉన్నాయి..!
కోలారు: నేటి రోజుల్లో స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు.. ఇట్టే నేరాలకు పాల్పడే సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అంతు లేకుండా పోయింది. వారి వల్ల అనేక కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ఇదే మాదిరిగా.. నీ ప్రైవేటు వీడియోలు నా వద్ద ఉన్నాయి, వాటిని ఇంటర్నెట్లో పెడతానని ఓ సైబర్ నేరగాడు బెదిరిస్తుండగా, భయాందోళనకు గురైన మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన కోలారు తాలూకాలోని ఛత్రకోడిహళ్లి గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వివాహిత (28) మృతురాలు. తాలూకాలోని బెగ్లిబెణచేనహళ్లికి యువకుడు శ్రీకాంత్ ఆమెకు పరిచయస్తుడు. సోషల్ మీడియా ఖాతాల నుంచి ఆమె ఫోటోలను సేకరించి అశ్లీలంగా మార్చాడు. వాటిని ఆమెకు చూపించి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి, వేధించి ఇప్పటికే లక్షల రూపాయలు వసూలు చేశాడు. భయాందోళనకు గురై.. కొన్నిరోజులుగా మరింతగా బెదిరించి మాంగల్యం చైను, బంగారు ఆభరణాలు కలిపి మొత్తం రూ. 30 నుంచి 40 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. శ్రీకాంత్పై మరో ఇద్దరు మహిళలను ఇదే విధంగా బెదిరించి దోచుకున్నట్లు ఆపణలు ఉన్నాయి. శ్రీకాంత్ వల్ల తన కాపురం బజారుపాలై పరువు పోతుందని ఆమె విరక్తి చెంది ఇంట్లో గదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. శనివారం ఉదయం కోలారు రూరల్ పోలీసులు గ్రామానికి వెళ్లి పరిశీలన చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం చేశారు. ఆమె కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న శ్రీకాంత్ కోసం గాలింపు చేపట్టారు. -
అర్ధరాత్రి ఆగిన ఊపిరి
సాక్షి, బళ్లారి, రాయచూరు రూరల్: బంధువుకు అనారోగ్యంగా ఉండడంతో ఉదయమే ఊరి నుంచి మరో ఊరికి వచ్చారు. అర్ధరాత్రి తిరిగి బయల్దేరారు. కొంతసేపు ఉంటే క్షేమంగా చేరేవారే. కానీ మృత్యువు లారీ రూపంలో ఎదురొచ్చి పొట్టనబెట్టుకుంది. ట్రాక్స్ క్రూయిజర్ను లారీ ఢీకొగా, 5 మంది క్షణాల్లోనే చనిపోయారు. కలబుర్గి జిల్లా చిత్తాపూర్ తాలూకా లాడ్లాపూర్ సమీపంలో జాతీయ రహదారి– 50 పై జరిగింది. తుక్కయిన క్రూయిజర్ చిత్తాపూర్ తాలూకా వాడి పట్టణం దగ్గర ఇంగళిగి గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన 5 మంది క్రూయిజర్లో యాదగిరికి వచ్చి శుక్రవారం అర్ధరాత్రి తిరిగి వెళ్తున్నారు. ఈ సమయంలో ఎదురుగా వచ్చిన తమిళనాడు లారీ అతివేగంతో ఢీకొట్టింది. ఆ ధాటికి క్రూయిజర్ గుర్తుపట్టలేనంతగా తుక్కయింది. అందులోని మహ్మద్ హుస్సేన్ (60), ఫాతిమా (40), రసూల్బీ (40), మహబూబ్ (34), టోలూసాబ్ కాశ్వర్ (27) అనే అందరూ మరణించారు. మృతదేహాలు వాహనంలో చిక్కుకుపోయాయి. ఇతర వాహనదారులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, స్థానికులతో కలిసి బయటకు తీసి సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీసులు లారీ డ్రైవరు కోసం గాలిస్తున్నారు. ఐదుమంది మరణంతో స్వగ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. -
మహిళతో అసభ్యంగా ప్రవర్తించి..సీసీ కెమెరాల్లో చిక్కి
హైదరాబాద్: రోడ్డుపై వెళుతున్న మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడిని నార్సింగి పోలీసులు గుర్తించి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈనెల 14న అలకాపూర్ టౌన్షిప్లో ఓ వ్యక్తి ప్రవర్తించిన తీరు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతోపాటు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో నార్సింగి పోలీసులు.. తీవ్రంగా పరిగణించి బాధితురాలి నుంచి 19న ఫిర్యాదు తీసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. శనివారం పుప్పాలగూడలో ఉంటున్న నిందితుడు నాగరాజు(26)ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన నిందితుడు పుప్పాలగూడలో స్థిరపడ్డాడని ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తెలిపారు. -
ఆన్లైన్లో రూమ్ను బుక్ చేసుకుని..!
శ్రీకాకుళం క్రైమ్: ఆ యువతి మూర్ఛ వ్యాధితో కొంతకాలంగా బాధపడుతోంది. దాదాపు రూ.10 లక్షలు సమకూరితే గానీ ఆరోగ్యం మెరుగవ్వదని తెలుసుకుంది. తండ్రికి స్థోమత లేకపోవడం, కుటుంబానికి భారమనుకుందో ఏమో.. స్నేహితురాలికి వాట్సాప్ మెసేజ్ ద్వారా తన బాధ పంచుకుంది. శ్రీకాకుళం నగరానికి వచ్చి ఓ హోటల్లో ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటనకు సంబంధించి రెండో పట్టణ ఈశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం రాయగడ జిల్లా గుణుపూర్కు చెందిన అభిమన్యు బెహరాకు ఇద్దరు కుమారులు, కుమార్తె కసూర్తి కుమారి బెహరా (23) ఉన్నారు. నిరుపేద కుటుంబం. కస్తూరికి చిన్నప్పటి నుంచీ మూర్ఛవ్యాధి ఉండటంతో ఎప్పుడూ ఆరోగ్యం సరిగా ఉండేది కాదు. పూర్తిగా నయం కావాలంటే రూ. లక్షలతో కూడుకున్న పని మదనపడేది. స్నేహితురాలి ఊరికని చెప్పి.. ఈ క్రమంలో గురువారం తన స్నేహితురాలి ఊరికి వెళ్తానని తండ్రితో చెప్పింది. ఉదయం 10 గంటలకు గుణుపూర్లో తండ్రి రైలు ఎక్కించారు. కస్తూరి తన స్నేహితురాలి ఇంటికి వెళ్లకుండా అప్పటికే ఆన్లైన్లో శ్రీకాకుళం విజేత హోటల్లోని రూమ్ను బుక్ చేసుకుని ఆమదాలవలసలో దిగి నగరంలోని హోటల్కు చేరింది. గురువారం మధ్యా హ్నం ఒంటి గంటకు తన స్నేహితురాలికి వాట్సాప్ మెసేజ్ చేసింది. తాను చనిపోతున్నానని, తన అనారోగ్యానికి తండ్రి రూ.10 లక్షలు ఖర్చు పెట్టడం సాధ్యం కాదన్నది ఆ మెసేజ్ సారాంశం. అదే విషయాన్ని కస్తూరి స్నేహితురాలు వెంటనే కస్తూరి తండ్రికి ఫోన్ చేసి చెప్పి మెసేజ్ ఫార్వర్డ్ చేసింది. అప్పటి నుంచి తండ్రి కస్తూరికి పలుమార్లు ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ రావడంతో స్థానికంగా ఉన్న స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళంలో లొకేషన్ చూపిండంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ఈలోగా అక్కడి వారు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు రెండో పట్టణ పోలీసులకు ఫోన్ చేయడంతో హోటల్లో ఫ్యాన్కు ఉరేసుకున్న సమాచారాన్ని చెప్పారు. హుటాహుటిన తల్లిదండ్రులు చేరుకుని బోరున విలపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఈశ్వరరావు తెలిపారు. -
మాసబ్ట్యాంక్లో దారుణం.. ప్రముఖ న్యాయవాది మృతి
హైదరాబాద్: మాసబ్ట్యాంక్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ న్యాయవాది కాజా మొయినుద్దీన్ను గుర్తుతెలియని దుండగులు కారుతో ఢీకొట్టి హత్య చేసిన ఘటన సంచలనం రేపుతోంది. శనివారం ఉదయం ఆయన తన నివాసం నుంచి కారులో బయల్దేరుతున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ధుండగులు కారుతో ఢీ కొట్టి అటాక్ చేశారు. ఈ ప్రమాదంలో మొయినుద్దీన్కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఘటన తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కామర్స్ లెక్చరర్ కామ క్రీడ.. భార్యకు రెడ్హ్యాండెడ్గా దొరికి..
సాక్షి, కృష్ణా: కామర్స్ పాఠాలు చెప్పాల్సిన లెక్చరర్.. కామ వాంఛతో మితిమీరి ప్రవర్తించాడు. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపి యువతిని లోబరచుకోవాలని ప్లాన్ చేశాడు. అతడి ప్లాన్ బెడిసికొట్టడంతో రెడ్హ్యాండెడ్గా భార్యకు దొరికిపోయాడు. దీంతో, అందరి ముందే భర్తను భార్య చితకబాదింది. యువతిని బ్లాక్మొయిల్ చేసిందుకు పోలీసులు కామర్స్ లెక్చరర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కామర్స్ లెక్చరర్ జాషువా గతంలో మచిలీపట్నంలోని ఓ మహిళా కాలేజీలో లెక్చరర్గా పనిచేసి ప్రస్తుతం అవనిగడ్డలోని ప్రభుత్వ కళాశాలలో విధుల్లో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగం కోసం ఓ యువతి.. కామర్స్ లెక్చరర్ జాషువాను ఆశ్రయించింది. దీంతో, ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపి యువతిని లోబరచుకోవాలని జాషువా ప్లాన్ చేశాడు. యువతిని మచిలీపట్నంలోని తమ రూమ్కు రావాలని కోరాడు.జాషువా వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఖంగుతిన్న యువతి.. హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ను ఆశ్రయించింది. అనంతరం, జాషువా నిజస్వరూపాన్ని లెక్చరర్ భార్యకు సమాచారమిచ్చింది. దీంతో, రంగంలోకి దిగిన జాషువా భార్య.. లెక్చరర్ బాగోతాన్ని బట్ట బయలు చేసింది. ప్లాన్ ప్రకారం.. బాధితురాలితో రూమ్లో జాషువా ఉండగా.. అతడిని రెడ్హ్యాండెడ్గా పట్టుకుని చితకబాదింది. అందరి ముందే తిక్క కుదిర్చింది. ఇక, బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు జాషువాను అదుపులోకి తీసుకున్నారు. -
బతికి ఉంటే ఇబ్బంది పెడతాడని.. భర్తను చంపేసింది
హైదరాబాద్: కుటుంబ కలహాలతో వేరుగా ఉంటున్న భార్య ఇంటికి పిల్లలను చూడటానికి వచ్చిన భర్తను తమ్ముడు, అతని స్నేహితుడితో కలిసి భార్య విచక్షణారహితంగా దాడిచేసి హత్యచేశారు. వనస్థలిపురం పోలీసులు తెలిపిన మేరకు.. వికారాబాద్ జిల్లా హజీపూర్ గ్రామానికి చెందిన గురు వెంకటేశ్ (31) బీఎన్రెడ్డినగర్లో ఉంటూ హోటల్లో పనిచేస్తున్నాడు. అయితే కుటుంబ కలహాల కారణంగా భార్య, పిల్లలు వేరుగా ఉంటున్నారు. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో వెంకటేశ్.. పిల్లలను చూసేందుకు రైతు బజార్ సమీపంలోని డబుల్బెడ్రూం నివాసాల్లో భార్య ఉంటున్న ఇంటికి వెళ్లాడు.భర్తను చూసిన స్వప్న ఇక్కడికెందుకు వస్తున్నావు అంటూ తమ్ముడు పాండుతో కలిసి మూడో అంతస్తు నుండి కిందకు తీసుకువస్తూ దాడి చేశారు. అంతటితో ఆగకుండా పాండు తన స్నేహితుడు జగదీష్ను పిలిపించుకుని ముగ్గురూ కలిసి మూకుమ్మడిగా దాడిచేశారు. స్పృహ తప్పి పడిపోవడంతో..బతికి ఉంటే మళ్లీ ఇబ్బంది పెడతాడని దాడి చేసి తీవ్రంగా కొట్టి గ్రౌండ్ఫ్లోర్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. బుధవారం ఉదయం స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు వచ్చి పరిశీలించగా అతను అప్పటికే మృతిచెందినట్లు గమనించారు. మృతుడి సోదరుడు గురు తిరుపతి ఫిర్యాదు మేరకు పోలీసులు మృతుని భార్య స్వప్న, ఆమె తమ్ముడు పాండు, అతని స్నేహితుడు జగదీష్లపై కేసు నమోదు చేశారు. పోలీసుల అదుపులో నిందితులు? నిందితులు ముగ్గురినీ పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలిసింది. హత్యకు గల కారణాలను రాబట్టేందుకు విచారిస్తున్నట్లు తెలిసింది. -
పోలీసుల అలసత్వమే ప్రాణం తీసిందా?
యువ సింగర్ ఇందర్ కౌర్ హఠాన్మరణం పంజాబ్ను ఉలిక్కి పడేలా చేసింది. వారం కిందట కిడ్నాప్కు గురైన ఆమె.. నిన్న కాలువలో శవమై కనిపించారు. దీంతో అక్కడి సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఈ కేసులో విస్తుపోయే విషయాల్ని వెల్లడించారు ఆమె కుటుంబ సభ్యులు.యశిందర్ కౌర్ అలియాస్ ఇందర్ కౌర్(29).. పంజాబీ సింగింగ్ సెన్సేషన్. ఈ నెల 13న సాయంత్రం లూథియానాలోని ఇంటి నుంచి కారులో బయటికి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చుట్టుపక్కల అంతటా జల్లెడ పట్టారు. ఈ కేసు దర్యాప్తు జరుగుతున్న క్రమంలో.. మంగళవారం సాయంత్రం నీలో కాలువలో ఆమె శవంగా తేలుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు కుటుంబ సభ్యులకు కబురు పంపి.. మృతదేహాన్ని సమ్రాలా సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఆమె మృతికి కారణాలను ఇంకా వెల్లడించలేదు. పోస్ట్మార్టం పూర్తయ్యాకే వివరాలు చెబుతామని అధికారులు అంటున్నారు. ఈలోపు ఇందర్ కుటుంబం సంచలన ఆరోపణలకు దిగింది.మోగా జిల్లా భలూర్ గ్రామానికి చెందిన గాయకుడు సుఖ్విందర్ సింగ్ అలియాస్ సుఖా ఇందర్ మృతికి కారణమంటూ ఆమె సోదరుడు జోతింధర్ సింగ్ చెబుతున్నాడు. మూడేళ్ల కిందట వీళ్లకు పరిచయమైంది. ఆ స్నేహాన్ని అడ్డుపెట్టుకుని ఆమెకు పెళ్లి ప్రతిపాదన చేశాడు సుఖా. అయితే అప్పటికే కెనడాలో అతనికి భార్యాపిల్లలు ఉన్నారు. దీంతో తిరస్కరించింది. దీంతో కోపం పెంచుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడని జోతింధర్ అంటున్నాడు. తమ సోదరి కనిపించకుండా పోయిన నాడే పోలీసులకు ఈ విషయం చెప్పామని అంటున్నాడతను. సుఖాతో పాటు అతని స్నేహితుడు కరమ్జిత్ సింగ్ కూడా ఈ నేరంలో భాగమయ్యాడు. వాళ్లు తుపాకీ చూపించి ఇందర్ను ఎత్తుకెళ్లారు. ఆ తర్వాతే ఆమె శవమై కనిపించిందని ఆరోపిస్తోంది ఆమె కుటుంబం.పోలీసుల అలసత్వమేనా?ఇందర్ కనిపించడం లేదంటూ ఆమె సోదరుడు, తండ్రి మే 13వ తేదీ రాత్రే లూథియానాలోని జమల్పూర్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. కానీ, పోలీసులు వెంటనే స్పందించలేదన్నది ఇందర్ కుటుంబం చేస్తున్న ఆరోపణ. ఉన్నతాధికారి లేడంటూ ఆ మరుసటి రోజు మధ్యాహ్నం దాకా ఎదురు చూశారు. ఆ తర్వాతే ఫిర్యాదు తీసుకుని ఆమె కోసం గాలింపు చేపట్టారు. పైగా అనుమానితుడిగా సింగర్ సుఖా పేరు చెప్పినా.. ఆ కోణంలో దర్యాప్తు జరపలేదు.ఇందర్ తిరస్కరించాక సుఖా అవమానంగా ఫీలై కెనడాకు వెళ్లిపోయాడు. అయితే పగ పెంచుకుని ఇంతటి ఘోరానికి పాల్పడతాడని ఇందర్, ఆమె కుటుంబం ఊహించలేదు. కెనడా నుంచి నేపాల్ మీదుగా భారత్కు వచ్చిన సుఖా.. నేరం చేశాక తిరిగి అదే దారిలో వెళ్లిపోయాడు. పోలీసులు తక్షణ ఫిర్యాదు స్వీకరించినా.. సకాలంలో స్పందించినా.. ఇందర్ ప్రాణాలు దక్కేవని, నేరస్తుడు చిక్కేవాడేమోనని అని బాధిత కుటుంబం వాపోతోంది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఉన్నత విచారణకు ఆదేశిస్తామని పోలీస్ శాఖ చెబుతోంది. అంతేకాదు.. వ్యక్తిగత విబేధాలతో పాటు గ్యాంగ్స్టర్ మాఫియా లింకుల కోణంలోనూ ఈ కేసు విచారణ జరుపుతామని ప్రకటించింది.ఫేమస్ అవుతున్న టైంలో.. పంజాబీ సంగీత ప్రపంచంలో ఇందర్ కౌర్ రైజింగ్ స్టార్గా గుర్తింపు తెచ్చుకుంది. ఫోక్ మ్యూజిక్కి దగ్గరగా ఉండే స్టైల్తో పాటు పాప్ కల్చర్కి కూడా అనుసంధానం చేసేది. లైవ్ పెర్ఫార్మెన్స్లు, సోషల్ మీడియా ప్రెజెన్స్ వల్ల ఆమెకు మంచి ఫ్యాన్బేస్ ఏర్పడింది. అలా అభిమానులు ఆమెను ఫోక్ క్వీన్గా పిలుచుకునేవారు. అయితే ఎంతో భవిష్యత్తు ఉన్న ఆమె హఠాత్తుగా ఇలా చనిపోవడాన్ని వాళ్లు తట్టుకోలేకపోతున్నారు.పంజాబ్లోనే ఎందుకిలా?ఇందర్ కౌర్ మరణం పంజాబ్ గ్లామర్ఫీల్డ్ను మరోసారి వార్తల్లో నిలబెట్టింది. వ్యక్తిగత విబేధాలు మాత్రమే కాదు.. అక్కడి గాయకులు, సెలబ్రిటీలు తరచుగా హింసకు గురవుతున్నారు. సిధూ మూసేవాలా, అమర్ సింగ్ చమ్కిలా వంటి ప్రముఖులు కూడా ఈ తరహా దాడుల్లోనే ప్రాణాలు కోల్పోయారు. అందుకు కారణాలను పరిశీలిస్తే..పంజాబ్లో సింగర్లు కేవలం వినోదకారులు మాత్రమే కాదు.. సామాజిక, రాజకీయ, కుల చిహ్నాలుగా ఉంటున్నారు. వీటికి తోడు పంజాబ్లో సంఘటిత నేరజాలం వినోద రంగంతో మిళితమై ఉంది. అంటే.. కొంతమంది గాయకుల పాటల్లో గన్స్, రివెంజ్, పవర్ పాలిటిక్స్ వంటి అంశాలు ఉండటం వల్ల వారు గ్యాంగ్స్టర్ కల్చర్తో అనుసంధానమైపోతున్నారు. అలా దాడులకు గురవుతూ ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. -
స్పా సెంటర్లో భార్యను చంపిన భర్త..!
హైదరాబాద్: కుటుంబ కలహాలతో పాటు అనుమానంతో భార్యను కత్తితో పొడిచి చంపాడు భర్త. ఈ ఘటన మంగళవారం గాం«దీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ బోస్ కిరణ్, ఎస్ఐ నర్సింహ, బాధితురాలి కుటుంబీకుల కథనం ప్రకారం. ఆటో డ్రైవర్ రాజు, బంగి దేబోరా (25) 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. బహదూర్పురా కిషన్బాగ్ ఎంఎన్ గూడెంలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. కవాడిగూడ ప్రధాన రహదారిలోని ఓ సూపర్ మార్కెట్ 4వ అంతస్తులోని స్పా సెంటర్లో దేబోరా బ్యూటీషియన్గా పని చేస్తోంది. కొన్నాళ్లు సాఫీగా సాగిన వీరి కాపురంలో మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. పెద్ద మనుషులు సర్ది చెప్పినా ప్రయోజనం లేకపోయింది. దీంతో వీరు ఎంఎన్ గూడెంలో వేర్వేరుగా నివసిస్తున్నారు. ఈ క్రమంలోనే భర్త వేధింపులు ఎక్కువయ్యాయంటూ రాజుపై దేబోరా అత్తాపూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం కేసు పెట్టింది. అప్పటి నుంచి రాజు కక్ష పెంచుకుని ఆమెను అంతమొందించేందుకు సమయం కోసం వేచి చూస్తున్నాడు. మంగళవారం ఉదయం దేబోరా విధుల్లో భాగంగా ఆటోలో కవాడిగూడలోని స్పా సెంటర్కు చేరుకుంది. ఆమెను వెంబడించిన రాజు కవాడిగూడకు చేరుకున్నాడు. ఆమె లిఫ్టులోకి వెళ్లగానే వెనుక నుంచి వచ్చాడు. వీరిద్దరూ లిప్టులోనే గొడవ పడుతూ 4వ అంతస్తుకు చేరుకున్నారు. ఆగ్రహానికి గురైన నిందితుడు వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె శరీరంపై అనేక చోట్ల పొడిచి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో దేబోరా మృతి చెందింది. నిందితుడు రాజు అత్తాపూర్ పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. రాజును కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లి లలిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
బిడ్డకు పాలు పట్టాల్సిన తల్లి యాసిడ్ తాగించి..
జైపూర్: బిడ్డలకు ఏ కష్టం వచ్చినా కన్న పేగు తల్లడిల్లిపోతుంది. తన బిడ్డకు చిన్న దెబ్బ కూడా తగలకుండా చూసుకుంటుంది. కంటికి రెప్పలా కాపాడుకుటుంంది. కానీ, ఓ కన్నతల్లి మాత్రం కర్కశత్వం ప్రదర్శించింది. బిడ్డను ఎత్తుకోవాల్సిన చేతులతోనే క్రూరంగా వ్యవహరించింది. ఆడుకుంటూ ఉండాల్సిన 8 నెలల పాప.. ఆ తల్లి కారణంగా ఇప్పుడు ప్రాణాల కోసం పోరాడుతోంది. బిడ్డకు పాలు పట్టాల్సిన తల్లి యాసిడ్ తాగించింది. దీంతో నోరు, ముక్కు నుంచి రక్తం కారుతూ వెంటిలేటర్పై చిన్నారి విలవిల్లాడుతోంది. ఏ పాపమూ తెలియని ఆ బిడ్డ బాధను చూసి బంధువులు తీవ్ర మనోవేదకు గురయ్యారు. రాజస్థాన్లోని ఖైర్తల్-తిజారాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎనిమిది నెలల చిన్నారి ప్రాణాల కోసం పోరాడుతోంది. ఆమె తల్లి యాసిడ్ తాగించిందని పోలీసులు మంగళవారం తెలిపారు. నోరు, ముక్కు నుంచి రక్తస్రావం అవుతున్న ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. ఆ పసికందు వెంటిలేటర్ సాయంతో చికిత్స పొందుతోందని పోలీసులు తెలిపారు.ఈ ఘటన భివాడి ప్రాంతంలో జరిగిందని పోలీసులు తెలిపారు. సోమవారం ఘటన జరిగిన సమయంలో చిన్నారి తండ్రి మోహిత్ పనికి వెళ్లాడు. ఇంట్లో చిన్నారి తల్లితో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో చిన్నారికి మహిళ బలవంతంగా యాసిడ్ తాగించిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన వెనుక కారణం ఇంకా తెలియరాలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.సోమవారం సాయంత్రం చిన్నారి పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆమెను భివాడిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వేద్ ప్రకాశ్ మంగళవారం మాట్లాడుతూ.. ఆస్పత్రి నుంచి చిన్నారి గురించి సమాచారం అందిందని తెలిపారు. తర్వాత తాను ఆస్పత్రికి వెళ్లి వివరాలు తెలుసుకున్నానని చెప్పారు.“తన భార్య కుమార్తెకు బలవంతంగా యాసిడ్ తాగించిందని తండ్రి ఆరోపించాడు. చిన్నారి వెంటిలేటర్పై ఉంది” అని ఆయన తెలిపారు. లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
భర్త.. రెండో భర్త.. ఇద్దరు ప్రియులు!
వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఏదో ఒక మూల రోజుకో దారుణం జరుగుతోంది. ప్రేమ, మోసం, హత్య, మృతదేహాన్ని దాచిపెట్టడం.. ఇలా ఒక్కో తీరు నేరాలు బయటపడుతున్నాయి. తాజాగా గుజరాత్లో బయటపడ్డ ‘శాంతిగిరి కేసు’ ట్విస్టుల మీద ట్విస్టులను ఇచ్చింది. ఈ తరహా కేసుల్లోనే ఓ కొత్తదనం చూపించింది. సురేంద్రనగర్ జిల్లాలో శాంతిగిరి గోస్వామి అనే వ్యక్తి మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. భార్య, ఆమె ప్రియుడి చేతిలోనే అతను దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు 10 నెలల తర్వాత ఈ కేసును చేధించిన పోలీసులు.. నిందితుల నుంచి విస్తుపోయే వివరాలను సేకరించారు. అసలేం జరిగిందంటే.. జాగృతి గోస్వామి అనే మహిళ సుఖ్దేవ్గిరి గోస్వామిని వివాహం చేసుకుంది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. కొంతకాలానికి ఆమె తన భర్త పెద్ద అన్న శాంతిగిరి గోస్వామితో ప్రేమలో పడింది. భర్తను, పిల్లలను వదిలి.. అతనితో పారిపోయి మరో గ్రామంలో కొత్త జీవితం మొదలుపెట్టింది. అయితే అక్కడా ఆమె బుద్ధి వక్రదారి పట్టింది. శాంతిగిరి ట్రక్ డ్రైవర్ పని కోసం తరచూ బయట ఉండేవాడు. ఈ సమయంలో కాంతిలాల్ అలియాస్ భారత్ సబారియా అనే వ్యక్తితో జాగృతి సంబంధం పెట్టుకుంది. కాంతిలాల్ ఏకంగా జాగృతి ఇంటి పక్కనే ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. శాంతిగిరి లేని సమయంలో ఇద్దరూ కలుసుకునేవారు. అయితే ఏదో ఒకరోజు తమ విషయం తెలుస్తుందని.. శాంతిగిరిని అడ్డు తొలగించుకోవాలని ఆ ప్రేమికులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో యూనిస్ అనే వ్యక్తికి 25,000 సుపారీ ఇచ్చారు. అయితే యూనిస్ ‘భలే’ మోసం చేశాడు. నిద్రపోతున్న శాంతిగిరిని ఫోటో తీసి హత్య చేశానంటూ జాగృతికి పంపాడు. అయితే మరుసటి రోజు ఉదయం భర్త బతికే ఉండడంతో జాగృతి షాక్కు గురైంది. తీరా చూస్తే యూనిస్ ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో జాగృతి, కాంతిలాల్ స్వయంగా హత్యకు ప్లాన్ చేశారు. నిద్రిస్తున్న శాంతిగిరి గొంతును కాంతిలాల్ నులిమి చంపగా.. జాగృతి దుప్పటి తోసి శబ్దం రాకుండా చేసింది. ఆపై శవాన్ని గదిలో దాచారు. ఆ తర్వాత దీపక్ అలియాస్ మున్నా అనే వ్యక్తి సహాయంతో కారులో తీసుకెళ్లి కాలువలో పడేశారు. ప్రమాదవశాత్తూ చనిపోయినట్లు కథ అల్లే ప్రయత్నం చేశారు. శాంతిగిరి కొత్త ఉద్యోగం కోసం బయటి ఊరికి వెళ్లాడని.. ఫోన్ నెంబర్ మార్చాడని అందరినీ నమ్మించారు. అలా ఎనిమిది నెలలు గడిచాయి. ఈ గ్యాప్లో కాంతిలాల్కు తెలియకుండా దీపక్తో ఆమె వ్యవహారం నడిపించింది. అయితే.. శాంతిగిరి బంధవుల ఎంట్రీతో సీన్ మారింది. జాగృతి ప్రవర్తనపై అనుమానంతో పోలీసులను ఆశ్రయించారు వాళ్లు. అలా ఈ మిస్సింగ్ మిస్టరీ కేసు.. అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్కు చేరింది. రెండు నెలల దర్యాప్తులో పక్కా ఆధారాలు సేకరించిన దర్యాప్తు బృందం.. జాగృతి, కాంతిలాల్ను అరెస్ట్ చేసింది. పరారీలో ఉన్న దీపక్ కోసం గాలింపు చేపట్టింది. -
మొయినాబాద్ ఫౌంహౌస్లో దారుణం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మొయినాబాద్లోని ఓ ఫాంహౌస్ సమీపంలో దారుణం జరిగింది. ఇద్దరు వృద్ధ మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం తాండూరులో అదృశ్యమైన ఇద్దరు మహిళలుగా పోలీసులు గుర్తించారు. ఇద్దరు మహిళలను తాండూరులో కిడ్నాప్ చేసిన దుండగులు.. దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు. మహిళల నుంచి అప్పులు తీసుకున్నవాళ్లే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. -
బండి భగీరథ్కు మరో షాక్
సాక్షి, హైదరాబాద్: మైనర్పై లైంగిక వేధింపుల కేసులో బండీ భగీరథ్కు మరో షాక్ తగిలింది. భగీరథ్ కోసం పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. హైకోర్టులో మధ్యంతర ఉపశమనం దక్కని నేపథ్యంలో.. శనివారం అతని కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాలతో గాలింపు ముమ్మరం చేశారు. మైనర్ బాలికను లైంగిక వేధించిన ఆరోపణలతో బండి భగీరథ్పై పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో కేసు (పోక్సో చట్టం కింద) నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఆ మరుసటిరోజు నుంచే(ఈ నెల 9న) భగీరథ్ ఆచూకీ లేకుండా పోయాడు. కేసు నమోదుకు ముందు చివరిసారిగా హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే.. విచారణకు తమ ఎదుటకు రావాలన్న ప్రత్యేక దర్యాప్తు బృందం పిలుపునకు కూడా అతని నుంచి సరైన స్పందన లేదు. ఈ క్రమంలో.. ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. తక్షణ ఉపశనమం విషయంలో నిరాశే ఎదురైంది. అయితే గురువారం(మే 21న) ఆ పిటిషన్పై తుది తీర్పు వెలువడనుంది. ఈలోపు..ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐదు బృందాలు భగీరథ్ కోసం ఢిల్లీ, కరీంనగర్తో పాటు హైదరాబాద్ను జల్లెడపడుతున్నాయి. శనివారం మధ్యాహ్నాం సైబరాబాద్ పోలీసులు హైదరాబాద్లోని అతని తండ్రి ఇంట్లో సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఇటు పేట్ బషీర్బాద్ పీఎస్ వద్ద భారీ బందోబస్తు కనిపిస్తోంది. దీంతో ఇవాళో రేపో భగీరథ్ను అరెస్ట్ చేస్తారని.. తనంతట తానే లొంగిపోతాడని.. ఇలా రకరకాల ఊహాగానాలు వినవస్తున్నాయి.సెన్సిటివ్ కేసు.. ఎలాపడితే అలా కుదరదు: సీఎం రేవంత్ఈ కేసు దర్యాప్తు విషయంలో వస్తున్న విమర్శలపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పందించారు. చర్యలు తీసుకునే ఉద్దేశమే లేకపోతే పోక్సో కేసు ఎందుకు పెడతామని విమర్శకులను ఆయన ఎదురు ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన వే2న్యూస్ కాంక్లేవ్–2026లో ఆయన మాట్లాడుతూ ఈ కేసులో జరిగిన పరిణామాలను పూసగుచ్చినట్లు వివరించారు. ఈ నెల 8వ తేదీన రాత్రి మైనర్ బాలిక తల్లి ఒకరు పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. ఆ మరుసటిరోజే విచారణ ప్రారంభించి సెక్షన్లు కూడా మార్చి కేసు పెట్టాం. 11న సెక్షన్లు సవరించి వెంటనే నోటీసులు జారీ చేశాం. ఇదే వ్యవహారంలో బండి భగీరథ్ కూడా కరీంనగర్లో ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదులను బేరీజు వేసుకుని అమ్మాయి స్టేట్మెంట్ను తీసుకొని నోటీసులిచ్చారు. ఈ కేసులో ఎలా పడితే ఎలా చేయడానికి వీల్లేదు. నేను సహాయ పడాలనుకుంటే పోక్సో కేసు పెట్టం కదా? బండి భగీరథ్ తండ్రికి, బీఆర్ఎస్ మధ్య ఎక్కడ చెడిందో నాకు తెలియదు. కేటీఆర్కి, బండి భగీరథ్ తండ్రికి మధ్య ఏముందో నాకు తెలియదు. కానీ ఎవరైనా తప్పు చేసిన వారిని చట్టప్రకారం శిక్షిస్తాం. సినిమా వాళ్లు, రాజకీయ నాయకులు ఎవరైనా నాకు మినహాయింపులు లేవు. ఆ అమ్మాయికి రెండు బర్త్ సర్టీఫికెట్లు ఉన్నాయి. అవన్నీ పోలీసులు విచారించాలి. ఒకరోజు ఆలస్యమైనా శిక్ష నుంచి తప్పించుకోలేరు. మేము సత్రం నడపడం లేదు.. ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. మా ప్రభుత్వం బాధితులకు 100 శాతం అండగా ఉంటుంది. కుమారుడి విషయంలో ఆ కేంద్ర మంత్రి(సహాయ) తీరు నైతికంగా సరైంది కాదు. ఆయన ధైర్యంగా ఎదుర్కోవాలి. కొడుకును తెచ్చి పోలీసులకు అప్పగించాలి అని సీఎం రేవంత్ సూచించారు. -
ప్రేమ పేరుతో నర్సును గర్భవతిని చేసిన డాక్టర్
లబ్బీపేట(విజయవాడతూర్పు): మాయమాటలు చెప్పి, శారీరకంగా లొంగదీసుకుని తనను మోసగించాడని ఓ యువతి చేసిన ఫిర్యాదు మేరకు నగరానికి చెందిన వైద్యుడిపై మహిళా పోలీసు స్టేషన్లో శుక్రవారం కేసు నమోదైంది. వివరాల ప్రకారం నూజివీడు ప్రాంతానికి చెందిన యువతి తొమ్మిదేళ్లుగా నగరంలోని వేర్వేరు హాస్పిటల్స్లో నర్సుగా పనిచేస్తోంది. 2018లో ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేసే సమయంలో అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ పామర్తి భాస్కర్ ప్రకాష్ పరిచయం అయ్యారు. ఈ క్రమంలో ఆ యువతిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా కలవగా రెండుసార్లు గర్భం దాల్చింది. ప్రకాష్ తనకు బలవంతంగా గర్భస్రావం చేసినట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని నిలదీయగా 2024 ఏప్రిల్లో ఓ ఇంట్లో తన మెడలో తాళి కట్టి దండలు మార్చుకున్నట్లు పేర్కొంది. అప్పటి నుంచి ఇద్దరం కలిసే ఉంటున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం తాను మూడవ నెల గర్భిణీ అని, కొన్ని రోజులుగా ప్రకాష్ తన వద్దకు రాకపోవడంతో విచారణ చేయగా, అతనికి ముందే పెళ్లి అయిందని, పిల్లలు కూడా ఉన్నారని తెలిసినట్లు పేర్కొంది. ఈ విషయమై డాక్టర్ భాస్కర్ ప్రకాష్ను నిలదీయగా, అతని భార్య, తల్లి తనను బెదిరించారని తెలిపింది. బాధితురాలు ఎస్సీ కావడంతో డాక్టర్ భాస్కర్ ప్రకాష్ అతని భార్య, తల్లిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు, పలు సెక్షన్లపై మహిళా పోలీస్స్టేషన్లో శుక్రవారం కేసు నమోదు చేశారు. -
బోరుబావిలో పడ్డ చిన్నారి.. రక్షించబోయి తాత మృతి
సాక్షి, నల్లగొండ: మిర్యాలగూడ మండలంలో విషాదం చోటు చేసుకుంది. నాలుగేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తూ బోరు బావిలో పడగా.. రక్షించేందుకు వెళ్లి అతని తాత మృత్యువాత పడ్డాడు. శనివారం ఉదయం యాదగిరిపల్లిలో జరిగిందీ ఘటన.. శనివారం ఉదయం వ్యవసాయ పొలం వద్ద ఉన్న మామిడి చెట్టుకు నీరు పెట్టేందుకు మనువడు, మనవరాలుతో వెంకన్న(50) వెళ్లాడు. మనవడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడ్డాడు. అది గమనించిన తాత వెంకన్న రక్షించేందుకు ప్రయత్నించగా.. బోరు అంచులో ఉన్న మట్టి కుంగిపోయి అదే గుంతలో తలకిందులుగా పడిపోయాడు. వెంటనే మనవరాలు స్థానికులను అప్రమత్తం చేసింది. దీంతో తాళ్ల సాయంతో సైదులు అనే యువకుడు లోపలికి దిగి వాళ్లను బయటకు తీశాడు. ఈలోపు స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే బోరుబావి గుంతలో ఊపిరి ఆడక వెంకన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సీపీఆర్ చేసినా ప్రయోజనం లేకపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గం మధ్యలోనే వెంకన్న కన్నుమూశాడు. చిన్నారి పరిస్థితి బాగానే ఉందని.. ప్రస్తుతం చికిత్స అందుతుందని సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
అద్దె అడిగితే గొంతు కోశాడు
సూర్యాపేట జిల్లా: అద్దె డబ్బులు అడిగినందుకు కక్ష పెంచుకుని ఒక మహిళను దారుణంగా హత్య చేసి, ఐదు తులాల బంగారు ఆభరణాలు దోచుకుపోయిన నిందితుడిని ఫోర్త్ టౌన్ పోలీసులు కేవలం రెండు గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. ఈ సంచలన కేసు వివరాలను నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర క్రైం డీసీపీ కే. లతామాధురి వెల్లడించారు. కేసు వివరాలిలా.. అక్కయ్యపాలెం, శ్రీనివాసనగర్లోని నాగ ఆనంద్ అపార్టుమెంట్లో పిల్లా పార్వతి (53) తన భర్త చంద్రశేఖర్తో కలిసి నివసిస్తున్నారు. వీరికి ఉన్న ఒక దుకాణాన్ని తాటిచెట్లపాలేనికి చెందిన గన్నవరపు రాము అద్దెకు తీసుకుని ‘దుర్గా భవానీ హెయిర్ స్టైల్స్’ షాపు నిర్వహిస్తున్నాడు. నిందితుడు రాము తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో మూడు నెలలుగా షాపు అద్దె బకాయి పడ్డాడు. ఆ అద్దె డబ్బుల కోసం పార్వతి గట్టిగా అడగడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం.. గురువారం సాయంత్రం పార్వతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి రాము లోపలికి ప్రవేశించాడు. అద్దె విషయంలో ఆమెతో గొడవపడి, అనంతరం ఆమె గొంతు నులిమి అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె ధరించిన 2.5 తులాల పుస్తెల తాడు, 2.5 తులాల నల్లపూసల దండ, చెవి దిద్దులను అపహరించి అక్కడి నుంచి పరారయ్యాడు. సాయంత్రం 6 గంటల సమయంలో భర్త చంద్రశేఖర్ ఇంటికి వచ్చి చూడగా, పార్వతి విగతజీవిగా పడి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముమ్మర దర్యాప్తు : సమాచారం అందిన వెంటనే ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి, క్రైమ్ డీసీపీ కే. లతామాధురి పర్యవేక్షణలో క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించింది. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు నిందితుడు రాముగా గుర్తించారు. నిందితుడు దొంగిలించిన బంగారు ఆభరణాలతో హైదరాబాద్కు పారిపోవడానికి రైల్వే స్టేషన్ గేటు వద్దకు చేరుకోగా, దర్యాప్తు బృందం అతడిని వెంబడించి చాకచక్యంగా అదుపులోకి తీసుకుంది. నిందితుడి వద్ద నుంచి 5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని, అతడిని రిమాండ్కు తరలించారు. నగరంలో కలకలం రేపిన ఈ కేసును కేవలం రెండు గంటల్లోనే ఛేదించిన ఈస్ట్ జోన్ క్రైమ్ సీఐ, సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తరఫున క్రైమ్ డీసీపీ అభినందించారు. -
పోక్సో కేసులో కానిస్టేబుల్కు 31 ఏళ్ల జైలు
హైదరాబాద్: బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2020లో నమోదైన పోక్సో కేసులో నిందితుడైన కానిస్టేబుల్కు పోక్సో ప్రత్యేక న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. నేరం రుజువు కావడంతో నిందితుడు వరదరాజ్ సుదేశ్కు 31 ఏళ్ల కారాగార శిక్షతో పాటు రూ.12 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. అదనంగా బాధిత బాలికకు రూ.లక్ష నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు తెలిపిన మేరకు.. 2020లో డీసీపీ కార్యాలయంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న వరదరాజ్ సుదేశ్ బోయిన్ నపల్లి తాడుబండ్ ప్రాంతంలో నివసించే ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి కోర్టులో విచారణ కొనసాగింది. ఆరు సంవత్సరాల అనంతరం నేరం నిరూపణ కావడంతో పోక్సో ప్రత్యేక న్యాయస్థానం 31ఏళ్ల జైలు శిక్ష విధించింది. -
బతికి ఉన్న భర్తకు రిప్ (RIP)..!
కర్ణాటక: నేటి డిజిటల్ యుగంలో కుటుంబ సంబంధాలు, దంపతుల మధ్య అనుబంధాలు మృగ్యమవుతున్నాయి. చిన్న కారణాలకే విడిపోతూ కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. ఇదే మాదిరిగా ఓ భార్య.. భర్తను వదిలేసి అతని ఫోటో మీద రెస్ట్ ఇన్ పీస్ (ఆర్ఐపీ) అని రాసింది. వివరాలు.. 9 ఏళ్ల కిందట ఇక్కడి సాగానహళ్ళిలోని అనూజకు శిడ్లఘట్ట తాలూకా దొడ్డతేకనహళ్ళి కుమార్తో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జల్సాలకు అలవాటు పడిన అనూజా పల్లెలో అత్తమామలను వదిలి బెంగళూరు దేవనహళ్ళిలో భర్తతో బాడుగ ఇంట్లో కాపురం ఉంటున్నారు. పుట్టింటికి వచ్చేసి పోస్టింగులు భర్త కారు డ్రైవర్ కాగా, భార్య విలాసవంత జీవనం కోసం పెద్ద మొత్తంలో అప్పులు చేశాడు. కొన్నిరోజుల కిందట అనూజ భర్తను వదిలేసి పుట్టిల్లయిన సాగానహళ్ళికు వచ్చింది. భర్త ఫోను చేసి కాపురానికి రావాలన్నా అనూజ తిరస్కరించింది. పైగా సోషల్ మీడియాలో.. భర్త ఫోటో పెట్టి రిప్ అని రాసింది. దీంతో కోద్రిక్తుడైన కుమార్ బంధుమిత్రులతో వచ్చి భార్యను నిలదీశాడు. అనూజ, ఆమె అన్న కలిసి కారంపొడి చల్లి చితకబాదడంతో కుమార్, అతని బంధువుల గాయపడ్డారు. బాధితులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులు పరారయ్యారు. -
భార్య ముందు అవమానించారని..
ముంబై: మహారాష్ట్రలో దారుణం జరిగింది. భార్య ముందు తనను అవమానించారనే కోపంతో ఓ వ్యక్తి కన్న తల్లిదండ్రులనే రోకలితో కొట్టి దారుణంగా హత్య చేసిన ఘటన.. శుక్రవారం మధ్యాహ్నం ధూలే జిల్లాలోని శిర్పూర్లోని మహావీర్ సొసైటీలో జరిగింది. తమ కుమార్తె పెళ్లి ముగించుకుని తల్లిదండ్రులు అదే రోజు ఇంటికి తిరిగి రాగా.. ఇంటికి వచ్చిన తర్వాత వారు ఏదో కారణంతో తన కుమారుడిని మందలించడమే కాకుండా.. కోడలి ముందే అతడిని తక్కువ చేసి మాట్లాడారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కుమారుడు.. ఇంట్లో ఉన్న రోకలిని తీసుకుని తన తల్లిదండ్రుల తలపై బలంగా బాదాడు.ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తల్లి రంజుదేవి మహతో, తండ్రి ఇందారామ్ మహతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటన అనంతరం నిందితుడు చందన్ ఇందారామ్ మహతో అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించగా.. గమనించిన స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఒంటరిగా ఉన్న మహిళ కాళ్లు, చేతులు కట్టేసి.. హత్య చేసి..
విశాఖ: అక్కయ్యపాలెంలో ఓ మహిళ హత్య కలకలం రేపింది. ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకున్న దుండగులు దారుణానికి తెగబడ్డారు. పార్వతి (50) అనే మహిళ కాళ్లు, చేతులు కట్టేసి, హత్య చేశారు. ఆమె ఇంట్లోని లాకర్ను బద్దలుకొట్టి బంగారం, నగదు దోచుకెళ్లారు.ఈ ఘటన ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్కయ్యపాలెం శ్రీనివాస్నగర్, పుట్ట బంగారమ్మ గుడి సమీపంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. బంగారం కోసమే ఈ హత్య జరిగి ఉంటుందనే అనుమానంతో దర్యాప్తు చేపట్టారు. -
భార్యపై అనుమానం.. గొడ్డలితో కాలు నరికిన భర్త
సంగారెడ్డి: భార్య కాలును నరికిన భర్తను పోలీసులు జైలుకు పంపించారు. బుధవారం కేసుకు సంబంధించిన వివరాలు పుల్కల్ ఎస్ఐ విశ్వజన్ వెల్లడించారు. చౌటకూర్ మండలం గంగోజీపేట గ్రామానికి చెందిన కుమ్మరి వీరమణి, దుర్గయ్య భార్యాభర్తలు. వీరిద్దరూ బతుకు దెరువు కోసం సంగారెడ్డిలోని కొత్ల చౌరస్తాలో నివాసం ఉంటున్నారు. భార్యకు వివాహేతర సంబంధం ఉందేమోనన్న అనుమానంతో తరచూ దుర్గయ్య గొడవపడేవాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఆవేశంతో దుర్గయ్య ఇంట్లో ఉన్న భార్య కుడికాలును గొడ్డలితో నరికాడు. అలాగే కుడి చేతిపై కూడా గాయపరిచి పరారయ్యాడు. తీవ్ర గాయాలైన వీరమణిని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వారి కుమారుడు హరీశ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితున్ని బుధవారం తద్ధాన్పల్లి చౌరస్తా వద్ద అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నిందితుడ్ని కోర్టులో హాజరు పరిచారు. -
సౌదీలో పునబాక మహిళ ఆత్మహత్య
తిరుపతి: మండలంలోని పునబాక గ్రామానికి చెందిన ఉయ్యాల భాస్కరయ్య, తయారమ్మ దంపతుల కుమార్తె కోనేటి మమత(36) బుధవారం సౌదీలోని జుబేల్ ప్రాంతంలో ఉంటూ కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. గతంలో తిరుపతికి చెందిన కోనేటి చెంగయ్య (విశ్రాంత ఎస్ఐ) చిన్న కుమారుడు కోనేటి కృష్ణకి మమతను ఇచ్చి వివాహం చేశారు. వీరు శ్రీకాళహస్తిలోని ఇందిరానగర్లో నివాసం ఉండేవారు.వీరికి కోనేటి రూపేష్ కోనేటి లోహిత్ కుమారులు ఉన్నారు. 2012లో కృష్ణకి సౌదీలోని సాట్రాప్ పెట్రో కెమికల్ కంపెనీలో మేనేజర్గా ఉద్యోగం రావడంతో భార్యభర్తలిద్దరు సౌదీలో నివాసం ఉంటున్నారు. తిరుపతిలో ఉన్న కుటుంబ సభ్యుల ఆస్తులకు సంబంధించి వివాదం నెలకొనడంతో మమత మనస్తాపానికి గురై భర్త ఇంట్లో లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. అయితే మృతదేహాన్ని ఇండియాకి తీసుకొచ్చి తమకు అప్పగించేలా స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
నా భర్త సరైనోడు కాదు..!
బనశంకరి: బెంగళూరులో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ సాధనాశెట్టి.. బ్లాక్మెయిల్ కేసులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రేమ పేరుతో సాధనాశెట్టిని కార్తీక్పుతా లైంగికంగా వేధించాడని అతని భార్య హర్షిత జయనగర పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడం విశేషం. అసలు దోషి తన భర్తే అని.. అక్రమ సంబంధాలు దాచి పెట్టేందుకు సాధనాశెట్టిపై ఫిర్యాదు చేశాడని ఆరోపించింది. వివరాలు.. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ సాధనాశెట్టిని వ్యాపార ప్రచారం కోసం మేకప్ క్లినిక్ యజమాని కార్తీక్పుతా కలిశాడు.తొలుత వీరి మధ్య ప్రారంభమైన స్నేహం.. ప్రేమకు దారి తీసింది. అనేకచోట్ల ఇద్దరూ తిరిగారు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో లైంగికంగా వాడుకున్నాడంటూ సాధనాశెట్టి ఇంటి వద్దకు వచ్చి గొడవ చేసింది. గత ఏడాది హైదరాబాద్లో ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో కార్తీక్పుతా.. సాధనాశెట్టి మొబైల్ చోరీకి పాల్పడ్డాడు. అంతేకాక లైంగిక సంబంధం దాచిపెట్టడానికి ప్రైవేటు ఫొటోలు, వీడియోలు పెట్టుకుని హనీట్రాప్కు పాల్పడుతోందని ఆరోపిస్తూ జయనగర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తాజాగా తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి సాధనాశెట్టిపై కార్తీక్పుతా ఫిర్యాదు చేశాడని భార్య హర్షిత చెబుతోంది. కార్తీక్పుతా బిజినెస్మెన్ కాదు. కాస్మోటిక్ మార్కెటింగ్ చేసేవాడు. యువతి ఫిర్యాదు చేస్తే ఇబ్బందులు తప్పవని హనీట్రాప్ అంటూ ముందే పోలీసులకు ఫిర్యాదు చేశాడని భార్య చెబుతోంది. -
ఢిల్లీలో మరో నిర్భయ ఘటన.. కదులుతున్న బస్సులో..
ఢిల్లీ: ఢిల్లీలోని నాంగ్లోయ్ ప్రాంతంలో దారుణం జరిగింది. స్లీపర్ బస్సులో ఓ మహిళపై సామూహిక లైంగికదాడి జరిగింది. ఈ కేసులో బస్సు డ్రైవర్, కండక్టర్ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. బస్సులో ఇద్దరు వ్యక్తులు తనపై లైంగికదాడికి పాల్పడ్డారని ఆమె పేర్కొంది. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరగ్గా.. నిందితులు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.బాధితురాలు పీతంపురలోని మంగోల్పురిలోని ఒక ఫ్యాక్టరీలో పని చేస్తోంది. మే 11వ తేదీ రాత్రి సదరు మహిళ పని ముగించుకుని ఎప్పటిలాగే నడుచుకుంటూ ఇంటికి వెళ్తోంది. ఆ సమయంలో సరస్వతి విహార్లోని బస్టాప్ వద్ద ఓ స్లీపర్ బస్సు ఆగింది. బస్సు తలుపు వద్ద నిలబడిన వ్యక్తిని ఆమె సమయం ఎంత అని అడిగింది. ఆ సమయంలో నిందితులు ఆమెను బలవంతంగా బస్సులోకి లాక్కెళ్లారు.అనంతరం నిందితులు బస్సును నాంగ్లోయ్ వైపు నడిపారు. అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలికి వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఘటన అనంతరం బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. బస్సును పోలీసులు సీజ్ చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై లోతైన దర్యాప్తు జరుగుతోందని.. అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. -
వివాహేతర సంబంధం.. భర్త, మామను హత్య చేసిన కోడలు..!
కర్ణాటక: దేశ రక్షణ కోసం పోరాడే జవాన్, మాజీ జవాన్కు సొంత ఇంట్లోనే భద్రత లేకుండా పోయింది. మూడు రోజుల క్రితం క్రిష్ణగిరి సమీపంలో కాలిన స్థితిలో బయటపడిన మృతదేహాల కేసును పోలీసులు ఛేదించారు. తండ్రీకుమారుడు హత్యకు గురికాగా, కోడలి అక్రమ సంబంధమే ఇంత ఘోరానికి కారణమని తేల్చారు. ఉలిక్కిపడిన బెల్లారంపల్లి వెప్పాలంపట్టి సమీపంలో కాలిన స్థితిలో ఇద్దరి మృతదేహాలున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సేలం డీఐజీ సంతోష్, క్రిష్ణగిరి ఎస్పీ తంగదురైలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసుకొని, దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన వ్యక్తులు క్రిష్ణగిరి సమీపంలోని బెల్లారంపల్లి గ్రామానికి చెందిన సైనికుడు మాదేశ్ (43), అతని తండ్రి, మాజీ జవాన్ సెల్లప్ప (63)గా గుర్తించారు. భర్త జమ్మూకశ్మీర్లో ఉంటే..మాదేష్ జమ్మూకశ్మీర్లో విధుల్లో ఉండేవాడు. ఈ క్రమంలో అతని భార్య భానుప్రియ (30)పై పోలీసులకు అనుమానం ఏర్పడింది. ఆమెను ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలివ్వడంతో.. పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి తమదైన శైలిలో ప్రశ్నించారు. దాంతో అసలు గుట్టును భానుప్రియ విప్పింది. బెల్లారంపల్లివాసి, జవాన్ మాదేశ్ (43) జమ్మూకశ్మీర్లో పని చేసేవాడు. ఈ క్రమంలో భానుప్రియకు స్థానికంగా ఉండే వ్యాన్ డ్రైవర్ పూవరసన్ (24) అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరి తతంగమంతా గ్రామస్థులకు తెలిసింది. భర్త మాదేశ్కు కూడా విషయం తెలియడంతో.. ఆయన ఆగ్రహంతో ఈ నెల 10వ తేదీన హఠాత్తుగా ఊరికి వచ్చి భార్యను నిలదీసి దండించాడు. భానుప్రియ ఈ సంగతిని ప్రియునికి చెప్పింది. పథకం ప్రకారం ప్రియుడు పూవరసన్ ఆ రోజు రాత్రి కత్తితో భానుప్రియ ఇంటికెళ్లి మాదేశ్పై దాడి చేశాడు. మాదేశ్ కేకలు వేయడంతో తండ్రి, మాజీ జవాన్ సెల్లప్ప బయటకొచ్చాడు. వారిద్దరిపై భానుప్రియ, ప్రియుడు కత్తులతో విరుచుకుపడి హత్య చేశారు. శవాలను వ్యాన్లో తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు నిందితులు వివరించారు. ఈ కేసు చుట్టుపక్కల గ్రామాల్లో తీవ్ర సంచలనం కలిగిస్తోంది. -
టిక్.. టిక్.. టిక్.. సినీ ఫక్కీలో టైమ్ బాంబు నిర్వీర్యం
బాంబు ఉందని సమాచారం అందుకోవడం.. ముసుగులేసుకుని స్క్వాడ్లు అక్కడికి చేరుకోవడం.. ఏ వైర్ తెంపాలో అనే ఉత్కంఠ చివరిదాకా.. ఇలాంటి సీన్లు సినిమాల్లో ఎక్కువగా చూస్తుంటాం. అయితే.. మహారాష్ట్ర పుణేలో ఈ తరహాలోనే ఓ ఘటన జరిగింది. ఓ ఆస్పత్రి ఆవరణలో లైవ్ బాంబు బయటపడడం తీవ్ర కలకలం రేపింది.పుణే సిటీలోని హడప్సర్ కామధేను ఎస్టేట్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బుధవారం ఉదయం బాంబు బయటపడింది. తొలుత అనుమానాస్పద వస్తువుగా భావించినప్పటికీ.. ఆ తర్వాత అది టైమర్ బాంబ్ అని తేలడంతో అందరి గుండెలు గుభేల్మన్నాయ్. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDDS), అగ్నిమాపక సిబ్బంది, డాగ్ స్క్వాడ్ను సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆసుపత్రి పరిసరాలను ఖాళీ చేయించి భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు.ఈ పరిణామాలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. అయితే.. పరిశీలనలో అది 7 గంటల తర్వాత పేలేలా టైమర్తో అమర్చిన లైవ్ బాంబు అని తేలింది. బీడీడీఎస్ సిబ్బంది బాంబును సురక్షిత ప్రదేశానికి తరలించి.. ఓపెన్ ఫీల్డ్లో నిర్వీర్యం చేశారు. బాంబులో తక్కువ శక్తి గల పేలుడు పదార్థం ఉందని నిర్ధారించారు."నగరంలో తక్కువ శక్తి గల IED (ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోసివ్ డివైస్) కనుగొనబడింది. దానిని నిర్వీర్యం చేశాం. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది." అని పుణే పోలీస్ కమిషనర్ నితేష్ కుమార్ తెలిపారు. క్రైమ్ బ్రాంచ్, స్థానిక పోలీసులు కలిసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. -
భర్త ఫ్రెండ్తో వివాహేతర సంబంధం..!
నెల్లూరు జిల్లా: దగదర్తి మండలం సున్నపుబట్టి గ్రామంలో మైపాటి మాధవి అనే మహిళను హత్య చేసిన కేసులో ఆమె కోడలు పద్మశ్రీని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కావలి రూరల్ పోలీస్స్టేషన్లో డీఎస్పీ రమణకుమార్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పద్మశ్రీకి అదే గ్రామానికి చెందిన తన భర్త స్నేహితుడితో వివాహేతర సంబంధం ఉంది. దీంతో అత్త మాధవి ఇలాంటి పనులు మానుకోవాలని కోడలు పద్మశ్రీకి చెప్పింది.అయినా ఆమెలో మార్పు రాకపోవడంతో కులపెద్దల వద్ద పంచాయితీ జరిగింది. వారు కూడా ప్రవర్తన మార్చుకోవాలని తెలిపారు. ఈక్రమంలో కోపోద్రిక్తురాలైన పద్మశ్రీ తన అత్తను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకుంది. మే 8వ తేదీ తన తల్లి పుచ్చలపల్లి మాధవి సహాయంతో ఇంట్లో నిద్రిస్తున్న అత్తపై దిండుపెట్టి గొంతు నులిమి హత్య చేసింది. యూట్యూబ్లో సీరియల్స్ చూసి ప్రజలు పక్కదోవ పడుతున్నారని, నేరాలు చేసిన వారు తప్పించుకునే అవకాశం లేదన్నారు. చెడు వ్యసనాలకు బానిసలు కావొద్దన్నారు. రూరల్ సీఐ శివశంకర్, ఎస్సై జంపాని కుమార్, సిబ్బందికి ఉన్నతాధికారులు రివార్డులివ్వాలని ఉన్నతాధికారులకు సిఫార్స్ చేశారు. -
నా అల్లుడు ఓ అమ్మాయిని నవ వధువు మృతి కేసులో ట్విస్ట్
-
బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్టు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపిన బండి సంజయ్ తనయుడి కేసు మరో మలుపు తిరిగేలా కనిపిస్తోంది. ఈ కేసులో భగీరథ్ను విచారించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం భావిస్తోంది. అలాగే బాధితురాలి స్టేట్మెంట్ను మరోసారి రికార్డ్ చేసే అవకాశం కనిపిస్తోంది. కేసు దర్యాప్తు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించిన మరుసటిరోజే ఈ పరిణామాలు చోటు చేసుకుంటుండడం గమనార్హం. ఈ కేసులో ఇప్పటికే బాధితురాలు, ఆమె కుటుంబం స్టేట్మెంట్లు నమోదు అయ్యాయి. అయితే సిట్ ఏర్పాటు నేపథ్యంలో మరోసారి రికార్డు చేయాలని అనుకుంటోంది. తద్వారా ఎఫ్ఐఆర్లోని సెక్షన్లు మార్చే అవకాశమూ కనిపిస్తోంది. అలాగే బండి భగీరథ్ ఆచూకీ లేకుండా పోయాడన్న ప్రచారం నేపథ్యంలో నోటీసులు ఇచ్చి మరీ విచారణ జరిపొచ్చని తెలుస్తోంది. మైనర్ బాలిక కేసుతో పాటు గతంలో జరిగిన ఘటనలు, సోషల్ మీడియా వైరల్ వీడియోల ఆధారంగా విచారణ జరిపే చాన్స్ ఉంది. అలాగే కేసుల్లో సంబంధం ఉన్నవారిని సైతం సిట్ విచారించవచ్చని తెలుస్తోంది. కేసు విచారణను వేగవంతం చేయడానికి పేట్ బషీరాబాద్ ఏసీపీ, ఇన్స్పెక్టర్లతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) చీఫ్, కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ ఇప్పటికే సమావేశం నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేశారు.ఈ కేసుపై ఆమె స్పందిస్తూ.. ‘‘పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు నంబర్ 684/2026 కింద దర్యాప్తు జరుపుతున్నాం. ఈ కేసులో అందుబాటులో ఉన్న అన్ని వివరాలను ఇప్పటికే అధ్యయనం చేశాం. చట్టప్రకారం అవసరమైన అన్ని ఆధారాలు సేకరిస్తున్నాం. ఫోన్ కాల్ డేటా, టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు ఇతర ముఖ్యమైన ఆధారాలు కూడా సమీకరిస్తున్నాం. నేరం రుజువైతే నిందితుడిని తప్పకుండా అరెస్టు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. బాధితురాలికి న్యాయం చేస్తాం’’ అని వెల్లడించారామె. -
పెళ్లి చేసుకుందామనుకున్నా.. నా మరదలినే ప్రేమిస్తావా..!
హైదరాబాద్: చిలకలగూడలో యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని తేలచ్చారు. సోమవారం అంబర్పేటలో డీసీపీ రక్షిత కె మూర్తి వివరాలు వెల్లడించారు. నామలగుండుకు చెందిన యవన్(21) చిలకలగూడకు చెందిన యువతి పాఠశాల స్థాయి నుంచే ప్రేమించుకుంటున్నారు. ఇటీవల జవహార్నగర్లో డబుల్బెడ్రూం కేటాయించడంతో అక్కడికి కుటుంబాన్ని మార్చారు. అయితే యవన్ సోదరి కుటుంబం నామలగుండు ప్రాంతంలో ఉండడంతో వస్తూ పాత స్నేహితులతో పాటు యువతితో సైతం సంప్రదిస్తున్నాడు. యువతి బావ అల్లాబోయిన సాయికిరణ్ సైతం వరసకు యువతి మరదలు కావడంతో పెళ్లి చేసుకుందమని భావించాడు. అప్పటికే సాయికిరణ్ చిలకలగూడ పోలీసు స్టేషన్ పరిధిలో రౌడిïÙటర్. దీంతో ప్రేమ వ్యవహారానికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించి కుటుంబ సభ్యులతో చర్చించారు. యవన్ను హత్య చేయడమే పరిష్కారమని భావించి పథకం వేశారు. ఈ నెల 7న స్నేహితుడు సుబ్బు ఇంటికి యవన్ వచ్చినట్లు తెలుసుకున్నారు. యవన్ను బయటకు పిలిచి దాడి చేశారు. పెళ్లి చేసుకుందామనుకుంటున్న నా మరదలిని ప్రేమిస్తావా అంటూ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. పోలీసులు విచారణ జరిపి యవన్ హత్యకు కారణమైన యువతి బావ అల్లబోయిన సాకిరణ్(27), తండ్రి రాజం నర్సింహాయాదవ్, బాబాయ్లు రాజం శ్రీశైలం యాదవ్(48), రాజం మల్లేశ్యాదవ్(48), సోదరులు రాజం పరేమేశ్ యాదవ్(19, రాజం వంశీకృష్ణ(19, రాజం మనీష్(21), వీరి స్నేహితులు సిరిగిరి రాహుల్(22), కుచ్చుల శివనందన్యాదవ్(20)తో పాటు మరో మైనర్ బాలున్ని అరెస్టు చేశారు. -
‘యావన్ను హత్య చేయడానికి కారణం అదే’
సికింద్రాబాద్: చిలకలగూడకు చెందిన యావన్ హత్య ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని సికింద్రాబాద్ డీసీపీ రక్షిత స్పష్టం చేశారు. అమ్మాయి కుటుంబ సభ్యులు ప్లాన్ ప్రకారం హత్య చేశారన్నారు. అమ్మాయి తండ్రి, బాబాయి, బావ, అన్న, కజిన్ బ్రదర్స్ కలిసి యావన్ను హత్య చేసినట్లు గుర్తించామన్నారు. మే 7వ తేదీ జరిగిన ఈ హత్య కేసుకు సంబంధించి వివరాలను డీసీపీ మీడియాకు వెల్లడించారు.మే 7 అర్ధరాత్రి యావన్ హత్య జరిగింది. ఐదు ప్రత్యేక బృందాలతో ఈ కేసు దర్యాప్తు చేసాము.. యావన్, చంద్రికలు స్కూల్ డేస్ నుండి ఫ్రెండ్స్.. గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. గతంలో అమ్మాయి కుటుంబ సభ్యులు యావన్ ను హేచ్చరించారు. హత్యకు ఐదు రోజుల ముందే హత్య కోసం నిందితులు ప్లాన్ చేసుకున్నారు. అందరూ కలిసి రెక్కి నిర్వహించారు. A1 అల్లబోయిన సాయి కిరణ్ యువతి బావ.. ప్రధాన నిందితుడు..హత్య కు ప్లాన్ చేశారు. సాయి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ కేసులో మొత్తం 10 మందిని అరెస్ట్ చేశాం. నిందితులలో ఇద్దరికి గాంజా పాజిటివ్ వచ్చింది ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులతో పాటు ఓ మైనర్ అరెస్ట్ చేశాం’ అని తెలిపారు. ప్రేమించాడని నరికి చంపారు.. -
భర్తను చంపిన కేసులో భార్య, ప్రియునికి ఉరిశిక్ష..14 లక్షల జరిమానా..!
బెంగళూరు: అనైతిక బంధానికి ఒడిగట్టిన భార్య చివరకు హత్యకూ వెనుకాడలేదు, ఫలితంగా కఠిన శిక్షకు గురైంది. అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కోపంతో హత్య చేసిన కేసులో భార్య, ఆమె ప్రియునికి శివమొగ్గ జిల్లా భద్రావతి కోర్టు మరణశిక్షతో పాటు రూ. 14 లక్షల జరిమానా విధించింది. మత్తు మందు ఇచ్చి.. వివరాలు... 2020 జనవరి 15న, భద్రావతిలోని పేపర్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సురగీ టాప్కు చెందిన ఫ్లోరా నాన్సీ అనే మహిళ, తన ప్రియుడు రాజశేఖరయ్యతో కలిసి భర్త ప్రకాష బాబుకు మత్తుమందు ఇచ్చి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అప్పటి కేసు దర్యాప్తు అధికారి, సీఐ మంజునాథ్.. దర్యాప్తును పూర్తి చేసి కోర్టుకు ఛార్జిషిట్ సమర్పించారు. భద్రావతిలోని 4వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ సాగింది. ప్రభుత్వ ప్రాసిక్యూటర్ రత్నమ్మ వాదనలు వినిపించారు. ఫ్లోరా నాన్సీ, ప్రియునికి ఉరే సరైన శిక్ష అని వాదిస్తూ ఆధారాలను సమర్పించారు. నేరం రుజువు కావడంతో జడ్జి ఇందిరా మైలస్వామి చెట్టియార్.. ఇద్దరు దోషులకు ఉరిశిక్ష విధించాలని తీర్పు చెప్పడంతో పాటు రూ.14 లక్షల జరిమానా విధించారు. మృతుని తల్లిదండ్రులకు రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు. -
ఆంటీతో యువకుడి వివాహేతర సంబంధం..!
బనశంకరి(బెంగళూరు): సహజీవన బంధాలు ఎక్కువగా విషాదంతోనే ముగుస్తున్నాయి. అలాంటి ఉదంతమే ఇది. మహిళతో కలిసి జీవిస్తున్న యువకుడు ఉరివేసుకున్న రీతిలో శవమయ్యాడు, బెంగళూరు రాజగోపాలనగర పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. వివరాలు.. చిత్రదుర్గకు చెందిన తిప్పేస్వామి(28), దావణగెరె (35) మహిళ ఒకే గార్మెంట్స్లో పనిచేస్తూ ఇన్స్టా ద్వారా పరిచయమై ప్రేమలో పడ్డారు. మహిళకు వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. భర్త , పిల్లలను వదిలిపెట్టి తిప్పేస్వామితో వచ్చేసింది. రెండునెలల క్రితం బెంగళూరు శ్రీగంధనగరలో బాడుగ ఇల్లు తీసుకుని భార్యాభర్తలం అని చెప్పి జీవిస్తున్నారు. కొంతకాలంగా మహిళ గొంతెమ్మ కోర్కెలతో తిప్పేస్వామిని ఇబ్బంది పెడుతోంది. దీంతో విరక్తి చెందిన అతడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మహిళ పరారైంది. యువకుని సంబంధీకుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు ఆ మహిళపై కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. -
దొరికిన దొంగలు?
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జువెల్లరీస్ దోపిడీ కేసు దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. చోరీ జరిగి వారం రోజులు కాగా కమిషనరేట్ పోలీసులు కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రత్యేక బృందాలు నాలుగు రాష్ట్రాల్లో వారంరోజుల పాటు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. పలుకోణాల్లో గాలింపు చర్యలు చేపట్టగా దొంగలు చోరీ చేసిన నగలను బిహార్లో విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు సమాచారం. బిహార్ నుంచి కరీంనగర్ తీసుకొస్తున్నట్లు తెలిసింది.ప్రత్యేక బృందాలతో...ఈనెల 3వ తేదీ ఆదివారం ఉదయం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్లో ఉన్న ప్రముఖ పీఎంజే జువెల్లరీస్లో బంగారం దోపిడీ, కాల్పుల ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. షాపు తెరిచేటప్పుడు, జనసంచారం లేని సమయాన్ని ఎంచుకుని దుండగులు ప్రణాళికాబద్ధంగా దాడి చేసిన విషయం తెలిసిందే. ఆయుధాలతో షోరూంలోకి ప్రవేశించి, సిబ్బందిని బెదిరించి బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ప్రతిఘటించిన సిబ్బందిపై కాల్పులు జరపగా నలుగురికి బుల్లెట్ గాయాలయ్యాయి. అనంతరం దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే నగరం నలువైపులా నాకాబందీ చేçపట్టారు. దుండగుల ప్రణాళిక, తప్పించుకున్న తీరు చూస్తే ముందస్తు రెక్కీతో జరిగిందని అంచనాకు వచ్చారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. నగరంలోని సీసీ కెమెరాల పుటేజ్ను సేకరించి, దుండగులు ఉపయోగించిన వాహనాలు, మార్గాలు, కదలికల ఆధారంగా కీలక ఆధారాలు గుర్తించారు.బిహార్లో నగలు విక్రయిస్తుండగాదర్యాప్తులో భాగంగా దొంగలు ఘటన అనంతరం కరీంనగర్ నుంచి ధర్మపురి వైపు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడికి చేరుకున్న తర్వాత వారు ఉపయోగించిన పల్సర్ బైక్ను వదిలిపెట్టి గోదావరినదిని దాటి పరారైనట్లు సీసీ కెమెరాలు, స్థానిక సమాచారంతో నిర్ధారించారు. ఈ మార్గం ద్వారా వారు మహారాష్ట్ర లేదా ఛత్తీస్గఢ్ వైపు వెళ్లి ఉండవచ్చనే అనుమానంతో ప్రత్యేక బృందాలు ఆయా రాష్ట్రాల్లో కూడా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ దోపిడీ కేసు వెనుక అంతర్రాష్ట్ర ముఠా ఉండొచ్చనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగించారు. గతంలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఇలాంటి దోపిడీ ఘటనలతో పోల్చి చూశారు. సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరా ఫుటేజ్, పాతనేరస్తులు, గతంలో దొంగతనాలకు పాల్పడిన గ్యాంగులతో విచారణ చేపట్టి నిందితుల కదలికలను, సేకరించిన సమాచారంతో బిహార్ రాష్ట్రంలో నగలు విక్రయిస్తుండగా దొంగలను పట్టుకున్నట్లు సమాచారం. వారిని అదుపులోకి తీసుకుని కరీంనగర్కు తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ అధికారులు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. -
మహబూబ్నగర్లో ఘోర ప్రమాదం
సాక్షి, మహబూబ్నగర్: జిల్లాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రేసింగ్ బైక్, కారు ఢీ కొని ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఒకరు గాయపడగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.పాలకొండ చౌరస్తాలో అర్ధరాత్రి దాటాక ఈ ఘోరం జరిగింది. కారు డివైడర్ దగ్గ యూటర్న్ తీసుకుంటుడగా.. వేగంగా దూసుకొచ్చిన బైక్ ఢీ కొట్టింది. ఈ యాక్సిడెంట్తో కారు, బైక్లు నుజ్జు నుజ్జు అయ్యాయి. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతులు మహబూబ్నగర్ న్యూప్రేమ్ నగర్కు చెందిన కుటుంబంగా గుర్తించారు. మృతుల్లో.. ఆర్షియా బేగం(30), MD. ఉజేప (7), MD. అమర్ (2).. హైదరాబాద్కు చెందిన బైకర్ యాకుబ్ అఫ్జల్ (25) ఉన్నారు. మరో మృతదేహంపై స్పష్టత రావాల్సి ఉంది. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బైక్ హర్యానా రిజిస్ట్రేషన్తో ఉంది.పోలీసుల నిర్లక్ష్యంతోనే..ఈ ఘటనలో పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డులో రాత్రి 11గం. తర్వాత నుంచి తెల్లవారుజాము దాకా బైక్ రేసింగులు జరుగుతున్నాయని.. అటుగా వెళ్లే వాహనదారుల్ని భయానికి గురి చేస్తున్నాయని.. ఎన్ని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని అంటున్నారు. సకాలంలో చర్యలు తీసుకుని ఉంటే.. ఈ ఘోరం జరిగి ఉండేది కాదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విమర్శలపై పోలీసులు స్పందించాల్సి ఉంది. -
కాకినాడలో కానిస్టేబుల్ దారుణ హత్య
సాక్షి, కాకినాడ: కాకినాడలో సంచలన ఘటన వెలుగు చూసింది. కానిస్టేబుల్ నాగేశ్వర రావు హత్య స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. కాగా, సదరు కానిస్టేబుల్ కొంత కాలంగా సస్పెన్షన్లో ఉన్నారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడలోని గాంధీనగర్ రెడ్ క్రాస్ సమీపంలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ జి.నాగేశ్వరరావు (46) సోమవారం తెల్లవారుజామున దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తి దాడిలో హత్యకు గురైనట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
భర్త కదలికలు ప్రియుడికి తెలిసేలా సీసీ కెమెరాలు
హైదరాబాద్: ఓ వ్యక్తిపై భార్యతోపాటు ఆమె ప్రియుడు హత్యాయత్నం చేశారు. ఈ సంఘటనలో పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు. పోచారం ఐటీ కారిడార్ పోలీసులు శనివారం తెలిపిన మేరకు.. చౌదరిగూడలోని విజయపురి కాలనీకి చెందిన రమావత్ సుజాత అదే కాలనీకి చెందిన జటోతు మంగిలాల్తో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. ఈ విషయం భర్త రమావత్ బిక్కుకు తెలియకుండా ఇంట్లో నాలుగు స్పై కెమెరాలను అమర్చి, భర్త కదలికలు ప్రియుడికి తెలిసేలా ఏర్పాట్లు చేసింది. ఇది తెలుసుకున్న బిక్కు తన భార్య సుజాతను గట్టిగా మందలించాడు. ఈ క్రమంలో మంగిలాల్తో సుజాత కలిసి తన భర్తను చంపేందుకు కత్తితో దాడి చేసింది. దీంతో బిక్కు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. విచారణ చేసిన పోలీసులు సుజాత, మంగిలాల్పై హత్యాయత్నం కేసు నమోదు చేసి, ఇద్దరినీ అరెస్ట్ చేసి, రిమాండ్కు పంపారు. -
‘దండుపాళ్యం’కు ఏమాత్రం తీసిపోకుండా..
ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్నా కొద్దీ.. నేరాల తీరు కూడా మారిపోతోంది. ఏ తరహాలో క్రైమ్ చేయాలి?.. చేతులకు మట్టి అంటకుండా ఎలా చూసుకోవాలి.. ఎలా తప్పించుకుని తిరగాలి.. ఒకవేళ దొరికితే అందులోంచి ఎలా బయటపడాలి.. లాంటి విషయాలను కూడా ఆన్లైన్లోనే వెతికేస్తున్నారు. ఈ క్రమంలో.. పొరుగు రాష్ట్రంలో ఓ షాకింగ్ వెలుగు చూసింది. దండుపాళ్యం బ్యాచ్కు ఏమాత్రం తీసిపోని రీతిలో ఓ ముఠా కర్ణాటక రాజధాని బెంగళూరులో అఘాయిత్యానికి పాల్పడింది. ఒంటరి మహిళపై సుదీర్ఘకాలం నిఘా ఉంచి.. డబ్బు కోసం పథకం ప్రకారం ఆమెను మట్టుపెట్టింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఏప్రిల్ 20వ తేదీన కురుబరహల్లి ప్రాంతాలో ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఓ బైక్ వేగంగా దూసుకొచ్చి ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలపాలైందామె. దీంతో అక్కడే ఉన్న కొందరు యువకులు ఆమెను హుటాహుటిన ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్లారు. రెండ్రోజుల తర్వాత.. ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది. అయితే..అది ప్రమాదవశాత్తూ జరిగింది కాదని.. పైగా ఆమెను ఆస్పత్రిలో చేర్పించే టైంలో ఘోరం జరిగిందని పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. ఈ యాక్సిడెంట్ చేసినోడే.. ఆమెను ఆస్పత్రిలో చేర్పించానంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఈ ఎపిసోడ్లో మరో కొసమెరుపు.మహాలక్ష్మి లేఅవుట్ పీఎస్ పరిధిలో మహాలక్ష్మి అనే మహిళ ఒంటరిగా ఓ అద్దె ఇంట్లో ఉంటోంది. తెలిసినవాళ్ల ద్వారా చేతన్ అనే వ్యక్తి ఆమె దగ్గర కొంత డబ్బు అప్పు తీసుకున్నాడు. అయితే ఆమె దగ్గర మరింత డబ్బు, నగలు ఉన్నట్లు భావించాడు. ఈ క్రమంలో.. స్నేహితులు రాకేష్, మంజునాథ్, చిప్స్ ప్రదీప్, యోహాన్ జాన్తో కలిసి ఓ పథకం వేశాడు.ప్లాన్ ప్రకారం.. రాకేష్ తన బైక్తో నడుచుకుంటూ వెళ్తున్న మహాలక్ష్మిని ఢీ కొట్టాడు. ఆ వెంటనే మిగతా నిందితులు ఆటోతో పాటు అక్కడికి చేరుకుని ఆమెను రక్షించడానికి ప్రయత్నించినట్లు నటించారు. ఆస్పత్రికి తీసుకెళ్లే వంకతో ఆమె పర్సులోని ఇంటి తాళం కొట్టేశాడు మంజునాథ్. ఆపై ఆమె అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లి తాళం తెరవబోయాడు. అయితే అది చూసిన ఇంటి యాజమాని అతన్ని నిలదీశాడు. మహాలక్ష్మికి యాక్సిడెంట్ అయ్యిందని.. ఆస్పత్రిలో చేర్పించామని.. ఆస్పత్రివాళ్లు ఆధార్ కార్డు అడుగుతున్నారని చెప్పాడు. దీంతో యాజమాని హుటాహుటిన మంజునాథ్తో ఆస్పత్రికి బయల్దేరాడు. ఈలోపు.. మంజునాథ్ మిగతా వాళ్లకు సమాచారం ఇవ్వడంతో తమ పథకం విఫలమైందని భావించి ఆమెను విక్టోరియా ఆస్పత్రిలో చేర్పించారు.అయితే.. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. రెండ్రోజుల తర్వాత మంజునాథ్ ఇంటి తాళం తెరవబోయిన విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు ఆ ఇంటి ఓనర్. దీంతో సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా మంజునాథ్ను.. అతనిచ్చిన సమాచారంతో మిగతా వాళ్లనూ అరెస్ట్ చేశారు. మహాలక్ష్మికి బైక్తో ఢీ కొట్టాక.. సరాసరి ట్రాఫిక్ పీఎస్కు వెళ్లిన రాకేష్ ‘‘గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిందని.. తాను ఆస్పత్రిలో చేర్పించానని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’’ అని ఫిర్యాదు చేశాడు. చివరకు పోలీసులు అసలు విషయం తేల్చేయడంతో.. దొంగతనం చేయడానికి ఆమెకు యాక్సిడెంట్ చేశామని, ప్రాణం పోతుందని అనుకోలేదని ఆ యువకులు ఒప్పుకున్నారు. దీంతో హత్య కేసు నమోదు చేసుకుని నిందితుల్ని రిమాండ్కు తరలించారు.Accident Turned Murder: Bengaluru Woman Killed in Chilling Extortion PlotA shocking and well-planned crime has come to light in Bengaluru, where a woman was deliberately killed under the guise of a road accident for financial gain.The incident occurred on April 21 on Pipe Lane… pic.twitter.com/FAJd9SOUZw— Karnataka Portfolio (@karnatakaportf) May 8, 2026 -
అల్లుడు గారు.. ఈ పెళ్లి మా అమ్మాయికి ఇష్టం లేదు..!
తిరుపతి జిల్లా: పెళ్లి చేసుకుంటానని ఓ యువకుడిని నమ్మించి...అవసరాల నిమిత్తం అతని రూ.11లక్షల 38వేలు తీసుకుని, తీరా పెళ్లి కోసం నిలదీస్తే ఇష్టం లేదని మోసం చేసిన ఓ కుటుంబంపై బాధితుడు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదైంది. బాపట్ల జిల్లా గూడపల్లి గ్రామానికి చెందిన సుజేంద్ర(35) ఏర్పేడు మండలం చింతలపాళెం డీఆర్డీవో ప్రాంగణంలో ఎస్ఎస్సీ ప్రాజెక్టు కింద డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్. సుజేంద్ర పెళ్లి సంబంధాల కోసం ప్రయత్నిస్తుండగా, తొట్టంబేడు మండలం తాటిపర్తికి చెందిన కమలాకర్, తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తానని నమ్మించి అతడి నుంచి పలుమార్లు రూ.11,38,756 నగదును ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా తీసుకున్నారు. అలాగే, రూ.2లక్షలు విలువైన రెండు ఐఫోన్లు కూడా తీసుకున్నారు. మార్చి 6న యువతితో సుజేంద్రకు నిశ్చితార్థం జరిగింది. ఏప్రిల్ 22న పెళ్లి జరిగే విధంగా లగ్న పత్రిక రాసుకున్నారు. అప్పటినుంచి పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చారు. గట్టిగా నిలదీయడంతో యువతికి పెళ్లి ఇష్టం లేదని చెప్పడంతో తాను ఇచ్చిన నగదు, రెండు ఐఫోన్లు తిరిగి ఇచ్చేయాలని బాధితుడు డిమాండ్ చేశారు. నగదు తిరిగి ఇవ్వలేమని వారు ప్లేటు ఫిరాయించారు. తనను ఉద్దేశపూర్వకంగా పెళ్లి పేరుతో నమ్మించి అధిక మొత్తంలో నగదు తీసుకుని పక్కా ప్లాన్తో మోసగించారని బాధితుడు ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో యువతి, ఆమె తల్లిదండ్రులు, సోదరునిపై ఏర్పేడు ఎస్ఐ రవికుమార్ కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
లిఫ్ట్లో ఇరుక్కొని బాలుడి మృతి
హైదరాబాద్: లిఫ్ట్లో ఇరుక్కొని ఓ బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని రామచంద్రారెడ్డినగర్ కాలనీలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పల్నాడు జిల్లా చంద్రజుపాలెంకి చెందిన వెంకటేశ్వర్లు తన కుటుంబ సభ్యులతో కలిసి రామచంద్రాపురంలో నివాసం ఉంటూ వాచ్మేన్గా ఉంటున్నాడు. రాత్రి 7గంటలకు కూతురు వర్షిత, కుమారుడు గిరివర్ధన్(4) ఆడుకుంటున్నారు. అదే సమయంలో గిరివర్ధన్ లిఫ్ట్లోకి వెళ్లగా.. మొదటి అంతస్తులోకి వెళ్లగానే పెద్ద శబ్ధం వచి్చంది. వెంటనే వెళ్లి చూడగా లిఫ్ట్లో బాలుడు ఇరుక్కొని ఉన్నాడు. తీవ్రగాయాలైన అతడిని 108 అంబులెన్స్లో పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న ఏసీపీ శ్రీనివాస్ కుమార్, ఇన్స్పెక్టర్ జగన్నా«థ్ సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
అత్తపై అల్లుడు అత్యాచారం
జోగిపేట(అందోల్): మద్యానికి బానిసై కామంతో కళ్లు మూసుకుపోయి భార్యాభర్తల మధ్య ఉన్న గొడవను సర్దిచెప్పేందుకు వచ్చిన అత్తపై సొంత అల్లుడే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం ఖాదిరాబాద్లో చోటుచేసుకుంది. సీఐ అనిల్కుమార్ చెప్పిన కథనం ప్రకారం..గ్రామానికి చెందిన మహ్మద్ గరీబ్ ప్రతీరోజు మద్యం తాగి భార్యతో గొడవ పడుతుండేవాడు. గురువారం రాత్రి ఘర్షణ పడుతుండగా సయోధ్య కుదుర్చేందుకు అత్త వచి్చంది. నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేసింది. అప్పటికే మత్తులో ఉన్న మహ్మద్ గరీబ్...భార్యను గదిలోకి నెట్టేసి గడియపెట్టి అత్తపై అత్యాచారం జరిపి బయటకు పారిపోయాడు. ఈ విషయాన్ని అత్త బయటకు వచ్చి ఇరుగుపొరుగు వారికి తెలియజేసి వట్పల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడు గరీబ్ను అదుపులోకి తీసుకుని కోర్టుకు రిమాండ్కు పంపుతున్నట్లు సీఐ అనిల్కుమార్ తెలిపారు. -
పెళ్లి భయంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య..!
అనంతపురం జిల్లా: తల్లిదండ్రులు పెళ్లి ప్రయత్నం చేస్తుండడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసిన బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామానికి చెందిన రాజేశ్వరి, రామాంజనేయుల దంపతుల కుమార్తె రూపకీర్తన(17) అనంతపురంలోని వివేకానంద జూనియర్ కళాశాలలో ఇంటర్ (ఎంపీసీ) మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల రాసిన పరీక్షల్లో ఆమె ఉత్తీర్ణత సాధించింది. వేసవి సెలవులు కావడంతో ఇంటి పట్టునే ఉంటోంది. ఈ నేపథ్యంలో మంచి సంబంధం వస్తే పెళ్లి చేసేద్దామని తల్లిదండ్రులు మాట్లాడుకుంటుండగా విన్న ఆమె అందుకు అభ్యంతరం తెలిపింది. తాను చదువుకుంటానని, ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తెలిపింది. దీంతో తల్లిదండ్రులు సర్ది చెప్పి ఇప్పట్లో పెళ్లి చేయబోమని, మంచి సంబంధాలు ఏమైనా ఉన్నాయోనని మాట్లాడుకుంటున్నట్లు తెలిపారు.అయినా తనకు పెళ్లి చేస్తారేమోననే భయంతో బాలిక ఈ నెల 6న ఇంట్లోనే గడ్డి నివారణకు ఉపయోగించే మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే అనంతపురంలోని ఓప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం బాలిక మృతి చెందింది. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు గార్లదిన్నె పోలీసులు తెలిపారు. -
53 ఏళ్ల రాధ వివాహేతర సంబంధం.. షాకింగ్ నిజాలు!
రాప్తాడు రూరల్: ఓ హత్య కేసు దర్యాప్తులో అంతకు ముందు చేసిన హత్య బయటపడడంతో పోలీసులు అవాక్కయ్యారు. వివరాలను రాప్తాడు సీఐ వెంకటేశులు శుక్రవారం వెల్లడించారు. అనంతపురం రూరల్ మండలం సిండికేట్నగర్లో నివాసం ఉంటున్న రాధ (53), చెరుకూరి ఆదినారాయణ కొంతకాలంగా సహజీవనం సాగిస్తున్నారు. రాధ కుమారుడు సందీప్కుమార్ చౌదరి తన భార్యతో కలిసి బెంగళూరులో నివాసముంటున్నాడు. అలాగే కుమార్తె కూడా భర్తతో కలసి హైదరాబాద్లో ఉంటున్నారు. ఇటీవల రాధ, ఆదినారాయణ మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో గత నెల 16న ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఆదినారాయణ టవల్ తీసుకుని రాధ మెడకు బిగించి హతమార్చాడు. అనంతరం ఆమె మొబైల్ తీసుకుని ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. మరుసటి రోజు బెంగళూరులో ఉన్న రాధ కోడలికి, హైదరాబాద్లో ఉంటున్న కుమార్తెకు ఫోన్ చేసి రాధ మృతి చెందినట్లుగా తెలపడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఆ సమయంలో కుమారుడు సందీప్కుమార్ చౌదరి ఫిర్యాదు మేరకు అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, ఆదినారాయణ కోసం గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం సిండికేట్ నగర్లో తచ్చాడుతుండగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అసలు కథ వెలుగులోకి ఆదినారాయణను విచారణ చేయడంతో సంచనాలు వెలుగు చూశాయి. వివాహేతర సంబంధం రాధ భర్త రవిచంద్రనాయుడు పసిగట్టి ఇద్దరినీ మందలించడంతో ఆదినారాయణ, రాధ ఇద్దరూ కలిసి 2025 మే 20న రాత్రి రవిచంద్రనాయుడిని హతమార్చారు. నిద్రలో ఉన్న సమయంలో ముఖంపై దిండు అదిమి ఊపిరాడకుండా చేసి చంపినట్లు నిందితుడు అంగీకరించాడు. హత్య అనంతరం అనారోగ్యంతో మృతి చెందినట్లుగా పిల్లలను నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేసేశారు. అప్పటి నుంచి రవిచంద్రనాయుడు హత్య ఉదంతం వెలుగు చూడలేదు. తాజా దర్యాప్తులో ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆదినారాయణపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. రూరల్ తహసీల్దార్, వైద్యులు, అసిస్టెంట్ సైంటిఫిక్ టీం సమక్షంలో శుక్రవారం రవిచంద్రనాయుడు మృతదేహాన్ని వెలికితీయించి పంచనామా నిర్వహించారు. ఫోరెన్సిక్ పరీక్షల కోసం అస్థికలను సేకరించి ల్యాబ్కు పంపారు. -
Telangana: కాపాడాల్సిన వారే హత్యలకు పాల్పడుతున్నారా?
సాక్షి, సిద్దిపేట: కొందరు పోలీసులు బెట్టింగ్లకు, చోరీలకు, హత్యలకు పాల్పడటం సర్వత్రా సంచలనంగా మారాయి. క్రమశిక్షణకు మారుపేరైన పోలీసులు పలువురు బలవన్మరణం, హత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యలు చేసుకోద్దు.. ఆన్లైన్లో బెట్టింగ్లు పెట్టవద్దని చెప్పేవారే తప్పుదోవ పడుతున్నారు. సమాజంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన వారే తప్పుడు మార్గంలో పయనిస్తున్నారు. ఇందుకు జిల్లాలో ఇటీవల చోటుచేసుకుంటున్న ఘటనలే నిదర్శనం. సిద్దిపేటకు చెందిన గౌటే ప్రవీణ్ సీసీఎస్లో కానిస్టేబుల్గా పని చేస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసై దాదాపు రూ.60లక్షలకుపైగా నష్టపోయారు. స్థిరాస్తి వ్యాపారి విశ్వనాథం.. బంధువు దగ్గర ప్రవీణ్ భూమిని తాకట్టు పెట్టి రూ.12లక్షల అప్పుగా ఇప్పించారు. డబ్బుల కోసం విశ్వనాథం ఒత్తిడి చేస్తుండటంతో ఈ నెల 2న కారులో కానిస్టేబుల్ ప్రవీణ్, భార్య రజిత కలిసి తీçసుకెళ్లారు. విశ్వనాథంను హత్య చేసి ఒంటిమీద ఉన్న 10తులాల బంగారు నగలను తీసుకుని.. మృతదేహాన్ని ఇమాంబాద్ వద్ద కాలువలో పడేశారు. ఇలా కానిస్టేబుల్ నేరానికి పాల్పడ్డాడు. ఇదే కానిస్టేబుల్ గత నెల 25న బొడ్డు నర్సవ్వను ఆస్పత్రికి తీసుకెళ్తామంటూ కారులో ఎక్కించుకుని ఏమార్చి బంగారు పుస్తెలతాడు దొంగిలించారు. ఏమీ తెలియనట్లుగా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయించారు. దొంగతనాల కేసు రికవరీలో సైతం చేతి వాటం ప్రదర్శించినట్లు సమాచారం. మరో కానిస్టేబుల్ బెట్టింగ్లకు పాల్పడి.. ఆన్లైన్లో బెట్టింగ్లు పెట్టి డబ్బులు పోవడంతో కానిస్టేబుల్ నరేశ్ తుపాకితో కుటుంబాన్ని మట్టుబెట్టడమే కాకుండా తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్లలో 2024 డిసెంబర్ 15న భార్య ఇద్దరు పిల్లలను తుపాకీతో కాల్చి తాను బలవన్మరణానికి పాల్పడ్డాడు. కానిస్టేబుల్ నరేశ్(35), చైతన్య(30), రేవంత్(6), రిషిత(5) ఈ ఘటనలో మరణించారు.మరో ఘటనలో.. ఓ ప్రైవేట్ కంపెనీలో పలు విడతలలో రూ.25లక్షలు వరకు పెట్టుబడి పెట్టాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులతో పాటు అప్పుపాలయ్యాడు. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో, అప్పులు ఇచి్చన వారితో గోడవలు జరగకుండా ఉండాలంటే మరణం ఒక్కటే మార్గం అని నిర్ణయించుకున్నాడు. దీంతో 2024 డిసెంబర్ 28 రాత్రి ఎలకల మందును టీలో కలుపుకుని ఇద్దరు పిల్లలతో పాటు భార్యభర్తలు తాగి ఆత్మహత్యయాత్నానికి పాల్పడ్డారు. 29న ఉదయం చూసేసరికి అందరు స్పృహలోనే ఉండటంతో పాటు పక్కగదిలో రాజన్న సిరిసిల్ల 17వ బెటాలియన్ హెడ్కానిస్టేబుల్ బండారి బాలకృష్ణ(34) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, ఇద్దరు పిల్లలు హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొంది బతికి బయటపడ్డారు. -
జూబ్లీహిల్స్.. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య దారుణ హత్య
సాక్షి, జూబ్లీహిల్స్: హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ భార్య హత్యకు గురయ్యారు. జూబ్లీహిల్స్లోని ఐఏఎస్ క్వార్టర్స్లో శుక్రవారం ఉదయం ఈ హత్య జరిగింది. వినయ్ రంజన్ ఇంట్లో పనిచేసే పని మనిషే ఆమెను హత్య చేసినట్టు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
ప్రేమించాడని చంపేశారు..!
-
ప్రియురాలు పిలిచిందని వెళ్తే..
సాక్షి, హైదరాబాద్: నగరం నడిబొడ్డున దారుణం చోటు చేసుకుంది. ఫోన్లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్న ఓ యువకుడిపై కొందరు కత్తులతో దాడి చేశారు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం రాత్రి సికింద్రాబాద్ చిలకలగూడలో జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఆల్వాల్లోని యాప్రాల్లో నివాసం ఉంటున్న యువన్.. నగర శివారులో ఓ కాలేజీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. గురువారం రాత్రి చిలకలగూడకు వచ్చి స్నేహితులతో కలిసి రోడ్డు పక్కన ఫోన్లో మ్యాచ్ చూస్తూ మునిగిపోయాడు. ఈలోపు బైకులపై వచ్చిన ఏడుగురు యువన్ను పక్కకు లాక్కెళ్లి దాడి చేశారు. ఈ పరిణామంతో ఆ యువకులు చెల్లాచెదురుకాగా.. కత్తులతో దాడి చేయడంతో తీవ్రగాయాలతో యువన్ అక్కడికక్కడే ప్రాణం విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. తల, మెడ, చేతులు మొత్తం 15 కత్తిపోట్లు పడ్డాయని వైద్యులు తెలిపారు. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తొలుత భావించగా.. తర్వాత అదే నిర్ధారణ అయ్యింది. యువన్ స్థానికంగా ఉండే ఓ అమ్మాయిని ఐదేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయంలో పెద్దలకు తెలిసి గొడవ జరగడంతో పంచాయితీ పెట్టారు. అయితే కలుద్దామని యువతి గురువారం యువన్కు మెసేజ్ చేసింది. దీంతో యువన్ చిలకలగూడకు రాగా.. తట్టుకోలేకపోయిన యువతి సోదరుడు స్నేహితుల సాయంతో ఘాతుకానికి పాల్పడ్డాడు. చిలకలగూడలో ఉద్రిక్తతయువన్ హత్య నేపథ్యంలో శుక్రవారం ఉదయం చిలకలగూడలో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. అతని తల్లిదండ్రులు, బంధువులు యువతి నివాసం ఎదుట రోడ్డు మీద బైఠాయించి న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. పోలీసులు వాళ్లకు సర్దిచెప్పే ప్రయత్నంలో తోపులాట జరిగింది. దీంతో లాఠీఛార్జ్ చేసి అందరినీ చెదరగొట్టారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో సీతాఫల్మండి, నామాలగుండు ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు.. ఘాతుకానికి పాల్పడ్డ వాళ్లలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. అలాగే యువతి కుటుంబం కూడా పోలీసుల అదుపులోనే ఉన్నట్లు తెలుస్తోంది. వస్తే చంపేస్తారని చెప్పిందా?ఏడాది నుంచి యువన్ ఆ యువతితో మాట్లాడడం లేదని సోదరి మీడియా ముందు వాపోయింది. ‘‘పెద్దల అంగీకారంతో అప్పట్లో కాంప్రమైజ్ జరిగింది. ఇద్దరి మధ్య మాటలు లేకపోవడంతో అంతా సర్దుమణిగింది అనుకున్నాం. అయితే నిన్న మా తమ్ముడు ఆమె కోసం చిలకలగూడకు వచ్చాడు. వస్తే చంపేస్తారని కూడా యువతి ఫోన్లో చెప్పింది(అందుకు సంబంధించిన కాల్ సంభాషణను బయటపెట్టారు). ఆమె సోదరి, కుటుంబ సభ్యులకు నేర చరిత్ర ఉంది. మా తమ్ముడిని అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారు. వాళ్లందరినీ ఉరి తీసి మాకు న్యాయం చేయండి’’ అని వాపోయిందామె. -
25 లక్షలిస్తే.. మా అబ్బాయి మీ అమ్మాయి జోలికి రాడు..
సాక్షి, బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రిచ్కిడ్స్ ట్రాప్ కేసు కొత్త మలుపు తిరిగింది. తనను డబ్బులు ఇవ్వాలంటూ బెదిరించాడని బాధిత బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడి తల్లితో పాటు మేనమామపై కేసు నమోదు చేశారు. దీంతో, ఈ కేసు మరో మలుపు తిరిగింది.వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్కు చెందిన ప్రముఖ వ్యాపారి మైనర్ కూతురిని కూకట్పల్లికి చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ ట్రాప్ చేసి రూ.13 లక్షల వరకు వసూలు చేశాడు. బాధిత బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు చంద్రశేఖర్ ఆజాద్తో పాటు ఆయన తల్లి మీనాకుమారి, తమ్ముడు రాజీవ్, మేనమామ తరక ప్రశాంత్, మీనాకుమారి స్నేహితుడు వినీల్చౌదరిలతో పాటు మరికొందరు స్నేహితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి చంద్రశేఖర్ ఆజాద్ను రిమాండ్కు తరలించారు. మిగతా వారందరినీ అరెస్టు చేశారు.అయితే తన కూతురి జోలికి రావద్దని, డబ్బులు డిమాండ్ చేయవద్దని బాధితురాలి తండ్రి పలుమార్లు మీనాకుమారిని బతిమలాడారు. ‘నీ కూతురి జోలికి నా కుమారుడు రాకుండా ఉండాలంటే, నీ కూతురితో మావాడు తిరగవద్దనుకుంటే రూ.25 లక్షలు ఇవ్వాలంటూ’ మీనాకుమారి బాధిరాలి తండ్రిని డిమాండ్ చేసింది. మీనాకుమారి సోదరుడు ప్రశాంత్ కూడా పలుమార్లు బాధితురాలి తండ్రికి ఫోన్ చేసి డబ్బులు ఇవ్వకుంటే నా మేనల్లుడు మీ అమ్మాయితో అలాగే తిరుగుతాడంటూ హెచ్చరించాడు. దీంతో బాధితురాలి తండ్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మీనాకుమారితో పాటు ఫ్రశాంత్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మరో యువతి ఫిర్యాదు.. సంపన్న యువతులను ట్రాప్ చేస్తూ యువతుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్న చంద్రశేఖర్ ఆజాద్ సోదరుడు రాజీవ్ పై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో మరో చీటింగ్ కేసు నమోదైంది. తనను ప్రేమ పేరుతో తిప్పుకుని తరచూ శారీరిక వాంఛలు తీర్చుకుని పెద్ద ఎత్తున డబ్బులు కూడా వసూలు చేశాడని నార్సింగ్కు చెందిన ఓ యువతి తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
అందుకే ముంబై ఫ్యామిలీ మృతి.. పుచ్చకాయేం చేయలేదని వెల్లడి
ముంబైలో గత నెల ఓ కుటుంబ సభ్యులు భోజనం చేసిన తర్వాత పుచ్చకాయ తిని మృతి చెందిన విషయం సంచలనం రేపింది. దీంతో పుచ్చకాయ తింటే మంచిది కాదంటూ వదంతులు వ్యాపించాయి. అయితే, ఆ కుటుంబంలోని నలుగురు తిన్న పుచ్చకాయలో ఎలుకల మందు ఉందని ఫోరెన్సిక్ విశ్లేషణలో బయటపడింది. ఎలుకల విషంలో సాధారణంగా వాడే జింక్ ఫాస్ఫైడ్ను ఆ పుచ్చకాయ శాంపిల్లో గుర్తించారు.ఇంట్లో మృతిచెందిన ఆ నలుగురు కుటుంబ సభ్యుల పుచ్చకాయ నమూనాలు, విసెరా నమూనాల్లో ఈ విషయాన్ని గుర్తించినట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదికలో పేర్కొన్నారు. ఆ నివేదికను గురువారం ముంబై పోలీసులకు సమర్పించారు.జింక్ ఫాస్ఫైడ్ అత్యంత విషపూరిత పదార్థమని, ఆ నలుగురి మరణాలకు అదే కారణమై ఉంటుందని ఎఫ్ఎస్ఎల్ అధికారులు తెలిపారు. జింక్ ఫాస్ఫైడ్ను ఎలుకల వంటి వాటిని నియంత్రించేందుకు వాడతారు. పొలాలు, నిల్వ ధాన్యంలోనూ ఉపయోగిస్తారు.ఓ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. “ఇవాళ నివేదిక సమర్పించాం. రెండు నమూనాల్లో జింక్ ఫాస్ఫైడ్ కనిపించింది. అవి పుచ్చకాయ, మృతిచెందిన నలుగురి విసెరా నమూనాలు. సాధారణంగా ఇది పొడి రూపంలో ఉంటుంది. ఎవరో పుచ్చకాయ కోసి, అందులో ఈ పొడి చల్లి ఉండొచ్చని భావిస్తున్నాం. ఆ తర్వాత దాన్ని తిన్నారు. అయితే అసలు ఏం జరిగిందో పోలీసులు తేలుస్తారు” అని అన్నారు.కాగా, గతనెల అబ్దుల్లా డోకాడియా (40), ఆయన భార్య నసీమ్ (35), వారి ఇద్దరు కుమార్తెలు ఆయేషా (16), జైనబ్ (13) ఏప్రిల్ 26న దక్షిణ ముంబైలోని వారి ఇంట్లో విగతజీవులుగా కనిపించారు. బంధువులకు ఇంట్లో విందు ఇచ్చిన కొన్ని గంటల తరువాత ఈ ఘటన జరిగింది. అందరూ కలిసి భోజనం చేసినప్పటికీ, అర్ధరాత్రి తర్వాత ఆ నలుగురు పుచ్చకాయ తిన్నారు.ముంబై పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ.. నివేదిక అందిందని, పుచ్చకాయలో ఎలుకల విషం ఎవరు కలిపారో ఇప్పుడు దర్యాప్తు చేస్తామని తెలిపారు. “ఇది ఆత్మహత్య? లేక హత్య? లేక వ్యవసాయ పొలంలో కలుషితమై పొడి పుచ్చకాయలోకి చేరిందా? అన్న అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం” అని చెప్పారు. -
ప్రియుడి మోజులో పడి.. రూ.12 లక్షలు ఇచ్చి..
సాక్షి, ఏలూరు: జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడి కోసం సుపారీ ఇచ్చిన భార్య.. భర్తను హత్య చేయించింది. గత నెల 17న హత్యకు గురైన ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామానికి చెందిన రెడ్డి సులేమాన్ రాజు హత్య కేసును పోలీసులు ఛేదించారు. దర్యాప్తులో భార్యే అసలు సూత్రధారిగా పోలీసులు గుర్తించారు.వడ్లమాను సచివాలయంలో పనిచేస్తున్న వెంకన్నబాబుతో సులేమాన్ రాజు భార్య దుర్గామణి అక్రమ సంబంధం పెట్టుకుంది. విషయం తెలియడంతో దుర్గారాణిని సులేమాన్ రాజు తరచూ వేధించేవాడు. భర్త పెట్టే బాధలు పడలేక చనిపోవాలనుందంటూ దుర్గామణి ప్రియుడికి చెప్పింది. సులేమాన్ రాజు అడ్డు తప్పించాలని దుర్గామణి ప్లాన్ వేసింది.తన బంధువుల సాయంతో సులేమాన్ రాజు హత్యకు వెంకన్నబాబు సుపారీ ఇచ్చారు. రూ.12 లక్షలు ఇచ్చిన దుర్గామణి, వెంకన్నబాబు.. సులేమాన్ రాజు అడ్డు తొలగించుకున్నారు. సెల్ఫోన్ పవర్ బ్యాంక్ ఛార్జింగ్ కేబుల్తో సులేమాన్ రాజును నిందితులు హత్య చేశారు. హత్య అనంతరం ఉప్పులూరు రైవస్ కాలువలో సులేమాన్ రాజు మృతదేహాన్ని పడేశారు. సులేమాన్ రాజు భార్య దుర్గామణి, వెంకన్నబాబు, మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సెల్ ఫోన్ పవర్ బ్యాంక్ ఛార్జింగ్ కేబుల్, కారు, ఐదు సెల్ ఫోన్లు, ఐదు ఖాళీ బీరు సీసాలు, రూ. 75 వేలు నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
కోల్కతా సమీపంలో కాల్పులు.. సువేందు అధికారి పీఏ హత్య
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు మరోసారి భగ్గుమన్నాయి. ఉత్తర 24 పరగణాల జిల్లా మధ్యంగ్రామ్ ప్రాంతంలో ప్రతిపక్ష నేత, బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) చంద్రనాథ్ రథ్ గుర్తు తెలియని దుండగుల కాల్పుల్లో దారుణ హత్యకు గురయ్యారు. దోహారియా ప్రాంతంలో బుధవారం రాత్రి కారులో చంద్రనాథ్ రథ్ ప్రయాణిస్తుండగా బైక్పై వచ్చిన దుండగులు అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డారు. అత్యంత దగ్గర నుంచి జరిపిన కాల్పుల్లో రథ్తో పాటు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు రథ్ను, డ్రైవర్ను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రథ్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. దాడి జరిగిన వెంటనే దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఈ సంఘటన బీజేపీకి చారిత్రాత్మక విజయాన్ని సాధించిన రెండు రోజులకే చోటు చేసుకోవడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. మధ్యంగ్రాం నియోజకవర్గంలో తృణమూల్ అభ్యర్థి రథిన్ ఘోష్, ఇతను బీజేపీకి గట్టి పోటీ ఇచ్చాడు. ఆయన 2,399 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే తరుణ్జ్యోతి తివారీ మాట్లాడుతూ, ‘మేము నిరంతరం శాంతిని కోరుకుంటున్నాం, కానీ టీఎంసీ ఈ దారుణానికి ఒడిగట్టి అతిపెద్ద తప్పు చేసింది’.. అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఘటనా స్థలికి చేరుకున్న ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పెరగడంతో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. నిందితులను గుర్తించేందుకు, హత్యకు గల కారణాలను విశ్లేషించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని సమాచారం. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ అనుచరులుగా నటిస్తూ హింసను ప్రేరేపించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇదే సమయంలో సువేందు అధికారి, భవానీపూర్ నియోజకవర్గంలో మమతా బెనర్జీని 15,000 పైగా ఓట్ల తేడాతో ఓడించి 'జెయింట్ కిల్లర్' అనే పేరును సంపాదించారు. దాంతో సువేందు అధికారిని ముఖ్యమంత్రి పదవికి ప్రధాన పోటీదారుగా భావిస్తున్నారు. -
దొంగల మాస్టర్ ప్లాన్ ఇదే..!
-
భార్య వివాహేతర సంబంధం.. కిరాతకంగా హత్య చేసిన భర్త!
కృష్ణా జిల్లా: భార్య మరొకరితో సహజీవనం చేస్తోందని తెలుసుకుని ఆమెను అతి కిరాతకంగా ఇనుప రాడ్డుతో మోది హతమార్చిన ఘటనలో నిందితులను అదుపులోకి తీసుకున్నామని గుడివాడ డీఎస్సీ పి.శ్రీనివాస్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం డీఎస్పీ నిందితుల వివరాలను వెల్లడించారు. దిమ్మిటి ప్రసన్నకుమారి(30) తన భర్త మురళీ కృష్ణతో వివాదాల కారణంగా భర్తను వదిలేసి మరో వ్యక్తితో పామర్రులో సహజీవనం చేస్తోంది. తనతో కాపురం చేయకుండా కుటుంబ పరువు తీస్తున్నట్లుగా భావించిన మురళీకృష్ణ తన అన్నదమ్ములను వెంట బెట్టుకుని ఈనెల 4వ తేదీ ఉదయం రెండు బైక్లపై పామర్రు వచ్చాడు. ప్రసన్నకుమారి ఉంటున్న ఇంటికి వెళ్లి తలుపులు బద్దలు కొట్టి ఆమెను ఇనుప రాడ్డుతో మోది చంపాడు.అనంతరం నిందితులు అక్కడ నుంచి పారిపోతూ దుస్తులు, ఆమెను చంపడానికి ఉపయోగించిన ఇనుపరాడ్డును గుడివాడ వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన పోదలలో పడవేసి వెళ్లి పోయారు. ఈ ఘటనపై మృతురాలి తండ్రి గోళ్ల రాజారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లక్ష్మీప్రసన్న కుమారిని తన అల్లుడు మురళీ కృష్ణ, అన్నయ్య రాంబాబు, మరో తమ్ముడు నాగేశ్వరరావు అలియాస్ చంటి తన అన్నయ్య రాంబాబు కుమారుడు మైనర్ అయిన మరో వ్యక్తితో కలిసి తన కుమార్తెను ఇనుప రాడ్డుతో కొట్టి చంపినట్లుగా ఆ రిపోర్టులో పేర్కొన్నారు.దీనిపై అప్పటి పామర్రు ఇన్ఛార్జి గుడివాడ టూ టౌన్ సీఐ హనీష్ కొంది మంది సాక్షులను విచారించగా తదుపరి పామర్రు సీఐగా బాధ్యతలు స్వీకరించిన సీహెచ్ నాగ ప్రసాద్ విచారణను కొనసాగిస్తూ మరి కొందరు సాక్షులను విచారించారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో పామర్రు నుంచి గుడివాడ వెళ్లే రోడ్డులో కొత్తూరు దాటిన తర్వాత కొడాలి రామేశ్వరరావు మునగతోట పక్కన నిందితులు వారు దాచిన ఇనుప రాడ్డు బట్టలు వెతుకుతుండగా, పామర్రు సీఐ సీహెచ్ నాగప్రసాద్, ఎస్ఐ కె.శ్రీనివాస్ సిబ్బందితో వెళ్లి నిందితులను పట్టుకున్నారు. ఇనుపరాడ్డు, దుస్తులు, వారు వాడిన ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. నిందితులను తదుపరి విచారణ కోసం కోర్టులో హాజరు పరుస్తామన్నారు. నిందితులపై రౌడీ షీట్ తెరుస్తామని డీఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పామర్రు సీఐ, ఎస్ఐలను ఆయన అభినందించారు. -
వివాహేతర సంబంధానికి చిన్నారి బలి
సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): వివాహేతర సంబంధం ముక్కుపచ్చలారని చిన్నారి హత్యకు కారణమైంది. వివాహితతో సహజీవనం చేస్తున్న వ్యక్తి ఆమె 18 నెలల కుమార్తెను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై విజయవాడ సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేసి నిదితున్ని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గన్నవరం, కోనయ్య చెరువు సమీపంలో నివాసం ఉండే తరుణ్ తాపీ పని చేసుకుంటూ భార్య ఆశాజ్వోతి, ఆరేళ్ల కొడుకు, 18 నెలల కూతురు హర్షితతో కలసి నివాసముంటున్నారు. ఈ క్రమంలో భర్త స్నేహితుడైన కనిజం వంశీతో ఆశాజ్యోతి వివాహేతర సంబంధం పెట్టుకుంది. నెల రోజుల క్రితం ఈ విషయం తెలియడంతో దంపతుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో ఆశాజ్వోతి హర్షితను తీసుకుని వెళ్లిపోయింది. నగరంలోని వాంబేకాలనీలోని తన పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి వంశీతో కలసి విజయవాడ, బీఆరీ్టఎస్ రోడ్డు, రామకోటి మైదానం దగ్గరలోని ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటుంది. భర్త ఎన్నిసార్లు ఫోన్ చేసినా తన పుట్టింట్లో ఉన్నట్లు చెబుతూ వస్తోంది. గత నెల 24న ఆమె గన్నవరంలోని భర్త ఇంటికి వెళ్ళి తన కొడుకుని కూడా తీసుకు వెళ్లిపోయింది. ఏప్రిల్ 29న పనికి వెళ్లే విషయంలో ఆశాజ్యోతికి వంశీకి మధ్య గొడవ జరిగింది. తీవ్ర కోపానికి గురైన వంశీ ఆడుకుంటున్న చిన్నారి హర్షితను తీవ్రంగా కొట్టాడు. పైకి ఎత్తి బలంగా గోడకేసి కొట్టడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం వంశీ అక్కడ నుంచి పరారయ్యాడు. ఆశాజ్వోతి తన భర్తకు ఫోన్ చేసి హర్షిత ఆరోగ్యం బాగోలేదని, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతోందని చెప్పింది. అనంతరం వీడియో కాల్ చేసి హర్షిత కదలటం లేదని చెప్పింది. దీంతో తరుణ్ తన సోదరుడిని పంపి వారిని తీసుకురమ్మన్నాడు. అప్పటికే ఆశాజ్యోతి ఆటోలో చిన్నారిని తీసుకుని గన్నవరంలోని ఇంటికి వెళ్ళింది. చిన్నారి ఒంటిపై రక్తపు గాయాలు కనిపించడంతో తరుణ్ గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో వంశీ తన చెల్లిని కొట్టి హత్య చేసినట్లు కుమారుడు తెలిపాడు. దీంతో పోలీసులు ఆమెను నిలదీయగా అసలు విషయం చెప్పింది. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎస్ఎన్పురం పోలీసులకు బదిలీ చేశారు. మంగళవారం వంశీని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
నువ్వంటే నాకిష్టం.. మా ఇంటికి వస్తావా..!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ‘ఎనిమిది సెమిస్టర్లు ఉంటావ్.. నీతో నేను ట్రావెల్ చేయాలనుకుంటున్నాను. నువ్వు మా ఇంటికి వస్తావా.. గోడలకు చెవులు ఉంటాయి.. ఇంటికి వస్తే పూర్తిగా మాట్లాడుతా.. నీతో పరీక్షలు బాగా రాయించాలని.. రూమ్కి ఇన్విజలేటర్గా వచ్చా... నేను నీకు చూపించినా రాయచ్చు కదా.. రాసుకునేలా అవకాశం ఇచ్చా.. ఆ మాత్రం సైకాలజీ కూడా తెలియపోతే ఎలాగే.. నువ్వు వేస్ట్ చేశావ్. నువ్వంటే ఇష్టం.. ఐ వాంట్ యూ. రేపు శ్రీకాకుళం వస్తావా. రేపు ఎన్ని గంటలకు బయల్దేరుతున్నావు. ఆర్టీసీ కాంప్లెక్స్లో రిసీవ్ చేసుకుంటా. నీఫోన్ కోసం వెయిట్ చేస్తా.. నువ్వంటే నాకిష్టం.. నువ్వు వస్తే చెప్తాను. మనమిద్దరం కలిసి ట్రావెల్ చేద్దామని. శ్రీకాకుళం వచ్చాక ఇంటికి తీసుకెళ్తా. అక్కడ ఫేస్ టూ ఫేస్ చెబుతా. జర్నీలో ట్రావెల్ను బట్టి ఇలా ఉండాలి. అలా ఉండాలి అని చెప్పగలను. అది ప్రపోర్షనల్గా కావచ్చు. పర్సనల్గా కావచ్చు. ఏదైనా కావచ్చు. నన్ను సార్ అని పిలవకే...అండి అని పిలు...’ పాఠాలు చెప్పాల్సిన ఓ అధ్యాపకుడు తన స్టూడెంట్తో జరిపిన సంభాషణ ఇది. అంబేడ్కర్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థినికి ఎదురైన చేదు అనుభవమిది.ఎచ్చెర్లలోని బీఆర్ఏయూ ప్రతిష్ట మంటగలిసిపోతోంది. కొందరు అధ్యాపకుల తీరు వల్ల మొత్తం వర్సిటీకే చెడ్డ పేరు వస్తోంది. తల్లిదండ్రుల స్థానంలో ఉండి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన కొందరు ఆ వృత్తికే చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. విద్యార్థినులను వేధిస్తూ, ప్రలోభ పెడుతూ, బెదిరింపులకు సైతం దిగుతున్నారు. తాజాగా అంబేడ్కర్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న ఓ అధ్యాపకుడు అక్కడ చదువుతున్న ఓ విద్యార్థినితో జరిపిన ఫోన్ సంభాషణ సోషల్ మీడియా వేదికగా వెలుగు చూసింది. ఈ వర్సిటీలో గతంలోనూ లైబ్రరీ సైన్సులో, లా విభాగంలో, గణిత, తెలుగు విభాగాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.ప్రలోభాలు.. ఆపై వేధింపులుఅంబేడ్కర్ యూనివర్సిటీలోని కొన్ని విభాగాల్లో కాంట్రాక్ట్ అధ్యాపకులు ఉత్తీర్ణత అయ్యేలా చూస్తామని ప్రలోభాలకు గురి చేసి, లోబర్చుకునే విధంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఇంజినీరింగ్ కళాశాలలో కమ్యూనికేషన్ ఇంగ్లిష్ (సాఫ్ట్ స్కిల్స్) బోధించే రామారావు అనే అసిస్టెంట్ కాంట్రాక్ట్ ప్రొఫెసర్ ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థినితో అసభ్యంగా మాట్లాడిన ఆడియో లీకైంది. ఈ విషయాన్ని వర్సిటీ పెద్దలు రాజీ చేశారు. అయినా ఆ అధ్యాపకుడి తీరు మారలేదు. తప్పని పరిస్థితుల్లో ఆ విద్యార్థిని విషయాన్ని తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆ తల్లిదండ్రులు వర్సిటీ వర్గాలకు తెలిసిన వారి ద్వారా తెలియజేశారు. ఈ పరిస్థితుల్లో ఈ ఆడియో క్లిప్ బయటకు వచ్చింది.గతంలోనూ..వర్సిటీలో తెలుగు, గణితం, న్యాయ, ఇంజినీరింగ్ విభాగాల్లో ఈ తరహా ఘటనలు గతంలో కూడా చోటు చేసుకున్నాయన్న వాదనలు ఉన్నాయి. ఉత్తీర్ణత కోసం, మార్కుల కోసం ట్రాప్ చేయడం, వేధింపులకు గురి చేయడం వంటివి జరిగాయన్న విమర్శలు ఉన్నాయి. ఇలాంటి ఆడియో రికార్డులు గతంలో కూడా వచ్చినప్పటికీ బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారనే వాదనలు ఉన్నాయి. వర్సిటీలో అధ్యాపకుల మధ్య విభేదాలు ఉండడం వల్ల ఇవి బయటకు వచ్చాయని లేదంటే ఈ ఆడియో క్లిప్ కూడా బయటకు రాదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఆ అధ్యాపకుడితో ఫోన్ మాట్లాడిన విద్యార్థి పక్కన మరికొందరు ఉన్నట్టు, వారిచ్చే సూచనతో సంభాషణ జరిపినట్టు ఆ ఆడియోలో రికార్డు కావడం గమనార్హం. ఆ అధ్యాపకుడు తాను మాట్లాడింది కొంత అయితే మిగతాది కలిపారని ఆరోపిస్తున్నారు.వర్సిటీలో తెలుగు, ఆంగ్లం, ఎంసీఈ, గణితం, లా విద్యార్థినులు ఇలాంటి వేధింపులకు ఎప్పటికప్పుడు గురవుతున్నారు. రెండు నెలల క్రితం ట్రిపుల్ ఐటీలో వేధింపులపై అమ్మాయిలు చేసిన ఫిర్యాదుకు ప్రత్యేక కమిటీలను వేసి వేధించిన వారిని సస్పెండ్ చేశారు. ఇప్పుడు కూడా ఇక్కడ ఇలాంటి కమిటీలను వేసి వేధింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. ఫోన్ సంభాషణ చేసిన అధ్యాపకుడిది శ్రీకాకుళం మండలంలోని ఓ గ్రామం. ప్రస్తుతం బలగ వద్ద ఉంటున్నాడు. ఓ ఆల యం ట్రస్టు మెంబర్గా కూడా కొనసాగుతున్నాడు.మాట తెచ్చిన చేటు.. బోధకుడిపై సస్పెన్షన్ వేటుసాక్షి కథనంతో కదిలిన అధికారులువిద్యార్థినితో జరిపిన అసభ్యకర ఫోన్సంభాషణపై ప్రత్యేక కమిటీ విచారణకళంకిత అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెన్షన్సస్పెన్షన్ చర్యలను ధ్రువీకరించడానికి వెనకడుగుసాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : అంబేడ్కర్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినితో ఫోన్లో అసభ్యకరంగా సంభాషణ చేసిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మజ్జి రామారావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయన బాగోతంపై విచారణ జరపాలని కూడా యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది. ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనంపై యూనివర్సిటీ అధికారులు స్పందించారు. ‘ప్రలోభాలు...బెదిరింపులు’ శీర్షికన ప్రచురితమైన కథనంతో అధికారులు కదిలారు. ఇంజినీరింగ్ కళాశాలలో కమ్యూనికేషన్ ఇంగ్లిష్ (సాఫ్ట్ స్కిల్స్) బోధిస్తున్న మజ్జి రామారావు అనే అసిస్టెంట్ కాంట్రాక్ట్ ప్రొఫెసర్ను సస్పెండ్ చేశారు. ఫోన్ సంభాషణ బయటకు రావడంతో పాటు పత్రికల్లో ప్రచురితం కావడంతో వీసీ కె.ఆర్ రజని ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ బి.అడ్డయ్యతో పాటు ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ రాజశేఖర్, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ స్వప్నవాహిణి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ అనురాధలతో కూడిన కమిటీ ప్రత్యేక సమావేశమై సస్పెండ్ చేయాలని వీసీకి రిపోర్టు అందజేశారు. దీంతో వీసీ ఆయనను సస్పెండ్ చేయడంతో విచారణకు ఆదేశించినట్టు ఉన్నత విద్యా మండలి ముఖ్య కార్యదర్శికి నివేదిక పంపిచారు. ఈ చర్యలతోనైనా అంబేడ్కర్ యూనివర్సిటీలో విద్యార్థినులపై వేధింపులు ఆగుతాయేమో చూడాలి.అంతా గుట్టుగానే..అసిస్టెంట్ ప్రొఫెసర్పై చర్యలు తీసుకున్న విషయాన్ని యూనివర్సిటీ అధికారులు గుట్టుగా ఉంచారు. సోషల్ మీడియా వేదికగా ఆడియో సంభాషణ హల్చల్ చేసి, యూనివర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగించిన విషయంపై తీసుకున్న చర్యలను బయటకు వెల్లడించకుండా మౌనంగా వ్యవహరించారు. యూనివర్సిటీ అధికారులకు ఫోన్ చేసినా స్పందించలేదు. సస్పెన్షన్ నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. వాస్తవంగా తాజాగా ఘటనలో బాధ్యులైన విద్యార్థిని ఈ వ్యవహారాన్ని గతంలోనే అధికారుల దృష్టికి వచ్చింది. రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారే తప్ప చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేశారు. అధ్యాపకుడిపై ఉన్న మమకారం ఏంటో తెలియదు గానీ అప్పట్లో తేలికగా తీసుకున్నారు. ఆ రోజే చర్యలు తీసుకుని ఉంటే యూనివర్సిటీ ప్రతిష్ట మంట గలిసేది కాదు. ఏం జరిగినా గుట్టుగా ఉంచడం ఇక్కడ పరిపాటిగా మారింది. -
దుబాయ్లో భర్త… భార్య ఇందు అనుమానాస్పద మృతి
శ్రీకాకుళం : చినపల్లివూరు గ్రామానికి చెందిన గర్తం ఇందు(25) అనే వివాహిత సోమవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. అమలపాడు పంచాయతీ చింతవానిపేటకు చెందిన ఇందుకు.. చినపల్లివూరుకు చెందిన గర్తం శంకరరావుతో 2017లో వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కవలలు (బాబు, పాప) ఉన్నారు. ఇందు తండ్రి లోకనాథం చిన్న వయస్సులోనే మృతి చెందగా తల్లి మోహిని అన్నీ తానై పెంచింది. కట్న లాంచనాలతో వివాహం చేసింది. ఇందు భర్త ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లి వస్తుంటాడు.ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం శంకరరావు దుబాయ్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ ఇందు సోమవారం రాత్రి ఉరివేసుకుంది. సమాచారం అందుకున్న తల్లి మోహిని, సోదరుడు సందీప్ హుటాహుటిన వెళ్లి విగతజీవిగా పడి ఉన్న ఇందుని చూసి బోరున విలపించారు. కాగా, ఇందు ఉరి వేసుకొని చనిపోయేంత పిరికిది కాదని, కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయని తల్లి మోహిని, సోదరుడు సందీప్ ఆరోపించారు. కొద్దిసేపటి కిందటే ఇందుతో వీడియో కాల్లో మాట్లాడామని, ఇంతలో ఏం జరిగిందో తెలియదని చెప్పారు. భర్త శంకరరావు, అత్త వరలక్ష్మి చాలా రోజులుగా తమ కుమార్తెను వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ వైకుంఠరావు తెలిపారు. -
లావుగా ఉందని భార్యకు విషమిచ్చి చంపిన భర్త
ప్రొద్దుటూరు : తన భార్య పద్మజ లావుగా ఉందని విషమిచ్చి చంపిన భర్త కిరణ్కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ విభూ కృష్ణ మంగళవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. భార్య పద్మజ లావుగా ఉందని, విపరీతమైన మాంసహారం, ఫాస్ట్ ఫుడ్ తింటుండటం గమనించిన భర్త బద్రిపల్లె కిరణ్కుమార్ భార్యకు విషమిచ్చి చంపాడన్నారు. ప్రొద్దుటూరు మండలం ఈశ్వర్రెడ్డి నగర్కు చెందిన బద్రిపల్లె కిరణ్కుమార్ 8 ఏళ్ల క్రితం ముద్దనూరుకు చెందిన పద్మజతో వివాహం అయిందన్నారు. వీరికి ఏడేళ్ల కుమార్తె ఉందన్నారు. భార్యను ప్రొద్దుటూరులోని ఈశ్వర్రెడ్డినగర్లో ఉన్న తన తల్లిదండ్రుల ఇంటికి కిరణ్ గత నెల 26న తీసుకొచ్చాడని పేర్కొన్నారు. ఇల్లరికంలో ఉన్న కిరణ్కుమార్ను చిన్న చూపు చూస్తూ అవమానకరంగా మాట్లాడుతుండే వారని, కిరణ్కుమార్ మరో మహిళను ప్రేమించినట్లు, దానివల్ల భార్యాభర్తలకు మనస్పర్థలు వచ్చాయని తెలిపారు. ఎలాగైనా భార్య పద్మజను చంపాలనుకున్న కిరణ్కుమార్ యూట్యూబ్లో వీడియోలు చూస్తుండగా, డేంజరస్ పాయిజన్ అవేలబుల్ అనే క్యాప్షన్తో వీడియోను చూసి.. అందులోని ఫోన్ నంబర్కు సంప్రదించి రూ.80 వేలు పెట్టి కొరియర్ ద్వారా విషం కొనుగోలు చేశాడన్నారు. గత నెల 29న రాత్రి 11.30 గంటల సమయంలో కవ్వాలో విషం కలిపి భార్యకు కిరణ్కుమార్ ఇచ్చి ఆమె ముఖంపై ఊపిరి ఆడకుండా తలదిండు ఒత్తి పెట్టడం వల్ల ఆమె మృతి చెందినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. విషం అమ్మిన వ్యక్తి గురించి విచారణ చేస్తున్నామని, తర్వాత విచారణలో విషం అమ్మిన వ్యక్తితోపాటు తయారు చేసిన వ్యక్తిని కూడా అరెస్టు చేస్తామని తెలిపారు. తొలుత పద్మజ మృతిని అనుమానాస్పద కేసు కింద నమోదు చేశామని, వన్టౌన్ సీఐ టీవీ కొండారెడ్డి విచారణ చేసి కేసును నిగ్గుతేల్చారన్నారు. నిందితుడు కిరణ్కుమార్ను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. సమావేశంలో వన్టౌన్ సీఐ కొండారెడ్డి, ఎస్ఐలు మధుసూదన్రెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
ప్రేమజంటకు అంతిమ వీడ్కోలు
కడప: తెలిసీ తెలియని వయసు వారిది.. చూడగానే ఒకరినొకరిపై ఆకర్షణ కలిగింది.. మెల్లగా మాట కలిసింది.. ఆపై ప్రేమ చిగురించింది.. ఊహల్లో విహరించారు.. ఊసులెన్నో చెప్పుకున్నారు.. కలిసి జీవించాలని కలలుగన్నారు.. ఏమైందో.. ఎవరి దిష్టి తగిలిందో ఏమో.. ఇద్దరి మధ్య మనస్పర్థ తలెత్తింది.. మాటల్లో తేడా వచ్చింది.. తెలియని సంఘర్షణ ఏదో ఆ లేత మనసును గాయపరిచింది. అంతే ..కలిసి జీవించాలనుకున్న వారే విడివిడిగా బలవన్మరణానికి ఒడిగట్టారు.. కన్నోళ్లకు కడుపుకోత మిగిల్చారు.. ప్రేమ జంట యోగేంద్రకుమార్వర్మ (19), హేమశ్రీ (19) విషాదగాథ ఇది.చెన్నూరుకు చెందిన వీరిద్దరూ కడప నగరంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో చదువుతుండగా కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. చిన్నపాటి మనస్పర్థలతో చిన్నవయసులో తనువు చాలించారు. మరణంలోనైనా ఒక్కటిగా సాగనంపాలని చెన్నూరు సమీపంలో ఒకే ప్రాంతంలో పక్కపక్కన ఇద్దరికీ మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. కాగా అంత బాధలోనూ రిమ్స్ సమీపంలోని డాక్టర్ ఎల్.వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారి సిఫారసు మేరకు యువకుడి తల్లిదండ్రులు కొడుకు నేత్రదానం చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. -
మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం
సాక్షి, మంచిర్యాల: జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రెండు వేర్వేరు ఘటనల్లో.. ఈదురుగాలులకు గోడలు కూలి ముగ్గురు రైతులు మరణించారు. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు కాగా.. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. లక్సెట్టిపేటలో గత రాత్రి ఘోరం చోటు చేసుకుంది. ఈదురుగాలులు, అకాల వర్షం నుండి పంటను కాపాడుకునేందుకు కొందరు రైతులు కొత్తూరు కొనుగోలు కేంద్రం వద్దకు పరుగులు తీశారు. ఆపై అక్కడే ఉన్న గోడ వద్ద నిల్చున్నారు. ఇంతలో గాలి ధాటికి గోడ మొత్తంగా కుప్పకూలిపోయింది. దండేపల్లి మండలం ముత్యంపేటకు చెందిన నిల్కి లచ్చన్న (55) , గుండారపు వెంకటేశ్ (24) అక్కడికక్కడే మరణించారు. గాయపడిన మరో ఐదుగురిని చికిత్స కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అందులో తనుగుల నాగరాజు, సీదుల హరీష్ ఈ ఇద్దరి పరిస్థితి విషమించడంతో కరీంనగర్కు తరలించారు. మరోవైపు.. గంపలపల్లి కొనుగోలు కేంద్రం వద్ద కూడా విషాదం చోటు చేసుకుంది. రైతులపై ఈదురు గాలుల ధాటికి ఒక్కసారిగా రేకుల షెడ్డు కూలింది. ఈ ఘటనలో తనుగుల అభిరాం (22) మృతి చెందాడు. గాయపడిన మరో ఇద్దరిని కరీంనగర్కు తరలించారు. అకాల వర్షాలు, ఈదురు గాలులతో జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ప్రధాన రాహదారులపై రాకపోకలు స్తంభించాయి. దీంతో పోలీసులు స్థానికుల సాయంతో చెట్లను తొలగిస్తున్నారు. మరో మూడు రోజులపాటు ఇదే తరహా వాతావరణం ఉండొచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. -
దళిత కుటుంబంపై కర్రలు, రాడ్లు, ఇటుకలతో..
ఛతర్పూర్: ఒక దళిత కుటుంబాన్ని కర్రలతో చితగ్గొట్టారు గ్రామంలోని ఐదుగురు వ్యక్తులు. మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామ దేవాలయానికి విరాళంగా పెద్దలు అడిగిన విధంగా ఆ దళిత కుటుంబం గోధుమలు ఇవ్వలేదని ఈ దాడి జరిగింది.ఛతర్పూర్లోని మహారాజ్గంజ్ గ్రామంలో స్థానికులు ఐదుగురు ఓ దళిత కుటుంబం ఇంటికి వెళ్లి దేవాలయ విరాళం పేరుతో గోధుమలు కోరారు. అయితే, ఆ కుటుంబం గోధుమలు భారీ మొత్తంలో ఇవ్వలేమని అన్నారు. దీంతో పెద్దలు ఆ దళిత కుటుంబంపై దూషణలు చేసి, ఇంటి నుంచి బయటకు లాగి, కర్రలు, ఇనుప రాడ్లు, ఇటుకలు, రాళ్లతో దాడి చేశారు. మహిళలు, పిల్లలను కొట్టారు. కుటుంబంలోని పలువురు రక్తస్రావం అయ్యి గాయపడ్డారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... ఆ కుటుంబం నుంచి డిమాండ్ చేసిన విరాళం వారి సామర్థ్యానికి మించి ఉంది. తాము చేతనైనంత ఇచ్చామని కుటుంబం తెలిపింది. "నేను గోధుమలు విరాళంగా ఇస్తే, ఏడాది మిగతా కాలం నా పిల్లలకు ఏమి తినిపిస్తాను?" అని బాధితుడు వచ్చి గోధుమలు అడిగిన వారికి చెప్పినట్లు సమాచారం.దీంతో జరిగిన ఈ దాడిలో కుటుంబంలోని ఐదుగురు గాయపడ్డారు. పోలీస్ స్టేషన్కు వెళ్లి, ఆ తర్వాత స్థానిక ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లారు. దాడికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. వీడియోలో కుటుంబంపై నిందితులు దాడి చేస్తున్నట్లు కనిపిస్తున్నారు.శ్యామ్ పటేల్, హర్దయాల్ పటేల్, కృపాల్ పటేల్, రాజా భయ్యా పటేల్, రామ్స్వరూప్ పటేల్, భగవత్దయాల్ పటేల్ తదితరులు ఈ దాడి చేశారని బాధితులు ఆరోపించారు. మిగిలిన గోధుమలను బలవంతంగా తీసుకెళ్లి అక్కడి నుంచి తరలించారని కూడా చెప్పారు. అయితే గోధుమలను తీసుకెళ్లడానికి ఉపయోగించిన వాహనాన్ని ఇంకా స్వాధీనం చేసుకోలేదని వారు అంటున్నారు.పోలీసులు ఈ కేసులో చర్యలు తీసుకున్నామని తెలిపారు. సివిల్ లైన్స్ ఇన్స్పెక్టర్ అశుతోష్ శ్రోటి ఈ వివాదం దేవాలయ విరాళంగా గోధుమలు సేకరణ సమయంలో మొదలై, తర్వాత హింసకు దారితీసిందని చెప్పారు."ఈ ఘటన దేవాలయానికి గోధుమలను విరాళం కోరడం నుంచి ప్రారంభమై, తర్వాత ఘర్షణగా మారింది. నిందితులను అరెస్ట్ చేశాం. చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటాం" అని శ్రోటి చెప్పారు. పోలీసులు ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ఐదుగురు నిందితులపై చర్యలు ప్రారంభించారు. నలుగురిని అరెస్ట్ చేయగా, ఒకరు పరారీలో ఉన్నారు. -
యూట్యూబ్లో చూసి ప్లాన్.. భార్యకు పాలకోవా తినిపించి..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరులో వివాహిత పద్మజ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. కేసు వివరాలను ఏఎస్పీ విభుకృష్ణ మీడియాకు వెల్లడించారు. భర్త కిరణ్కుమార్.. పాలకోవలో విషం కలిపి హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు. కిరణ్కుమార్ను అరెస్టు చేసిన పోలీసులు.. మీడియా ఎదుట హాజరుపరిచారు.భర్త కిరణ్.. భార్య హత్యకు యూట్యూబ్లో శోధించి ప్లాన్ వేశాడు. హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరుకు కొరియర్ ద్వారా విషం తెప్పించిన భర్త.. పాలకోవాలో విషం కలిపి భార్యకు తినిపించడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. భార్య చనిపోయిందో లేదో అనుమానంతో భర్త కిరణ్.. ఆమె ముఖంపై దిండుతో నొక్కినట్లు ఏఎస్పీ వెల్లడించారు. భార్య లావుగా ఉండటం, తనను నిత్యం అనుమానిస్తోందన్న కారణంతోనే కిరణ్ హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. -
PMJ జ్యువెలర్స్ లో దోపిడీ, బీహార్ ముఠాగా తేల్చిన పోలీసులు
-
శవం ఎదుటే ఆస్తి పంచాయితీ
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని వంజరివాడకు చెందిన రాములు, శారద దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు సంతానం. అందరికీ పెళ్లి చేశారు. కుమారుడు రాజుకు భార్య మాధురి, కొడుకు ధీరజ్ ఉన్నారు. మూడేళ్ల క్రితం రాజు అనారోగ్యంతో మృతిచెందాడు. ఆ సమయంలో రాజు పేరిట ఉన్న కారు, బంగారం, ఇతరత్రా ఆభరణాలను శారదనే తీసుకుంది. మాధురిని పుట్టింటికి వెళ్లగొట్టింది. ఉన్న ఆస్తులు, డబ్బులను ఇద్దరు కూతుళ్లకు పంచి ఇచ్చింది. మాధురికి మాత్రం ఆస్తి ఇవ్వబోనంటూ మొండికేసింది. ఈ క్రమంలో మాధురి తన కుమారుడు ధీరజ్తో కలిసి కరీంనగర్లో సోదరుడి ఇంటి వద్ద ఉంటూ.. అనారోగ్యంతో శనివారం రాత్రి మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని బంధువులు, కుటుంబ సభ్యులు ఆదివారం వంజరివాడకు తెచ్చారు. అంత్యక్రియలు నిర్వహించాలని అత్త శారదను కోరినా ఒప్పుకోలేదు. అంతేకాక నయాపైసా ఇచ్చేది లేదంటూ భీష్మించుకుంది. ఆమె ఇద్దరు కూతుళ్లు కూడా తమ తల్లిపేరిట ఉన్న ఆస్తి తమకే చెందుతుందని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో మాధురి మృతదేహాన్ని ఆమె బంధువులు, కుటుంబసభ్యులు ఇంట్లోనే పూడ్చేస్తామంటూ గుంత తవ్వారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. శారద పేరిట ఉన్న ఆస్తులను ధీరజ్కు ఇస్తామని హామీ ఇవ్వడంతో బంధువులు శాంతించారు. -
ఒకే చితిపై నవ దంపతులకు దహన సంస్కారాలు
హైదరాబాద్: బలవన్మరణానికి పాల్పడిన నవ దంపతులు కార్తీక్, మంజుల (జ్ఞాన్సిక)లకు ఆదివారం కూకట్పల్లిలోని వెంకటరావునగర్ కాలనీలోని హిందూ శ్మశాన వాటికలో కుటుంబ సభ్యులు ఒకే చితిపై దహన సంస్కారాలు చేశారు. వివాహమై రెండు నెలలు గడవక ముందే దంపతులు ఆత్మహత్య చేసుకోవటం మిస్టరీగా మారింది. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి సరదాగా ఉన్న కార్తీక్, మంజుల మరుసటి రోజు ఉదయం విగతజీవులుగా కనిపించటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆర్థిక సమస్యలు లేవని, ఆత్మహత్య చేసుకునేంత కష్టం ఏమొచ్చిందోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. పోస్ట్మార్టం నివేదిక వస్తేనే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. కాగా.. శుక్రవారం అర్ధరాత్రి తొలుత మంజుల పురుగుల మందు తాగి మృతి చెందడంతో కార్తీక్ ఉదయం ఉరి వేసుకున్నట్లు స్థానికులు భావిస్తున్నారు.చదవండి: ఐఫోన్.. ఆవేశం.. విషాదం -
ఎవండీ.. నీతో సంసారం చేయటం ఇష్టంలేదు..!
బెంగళూరు: ప్రియుడితో దిగిన ఫొటోను భార్య తన భర్తకు పంపడంతో అతను ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరకన్నడ జిల్లా దాండేలి పట్టణంలో జరిగింది. పట్టణానికి చెందిన రాఘవేంద్ర వాడకర్ మలేషియాలో ఉంటన్నాడు. వారం రోజుల క్రితం దాండేలికి వచ్చాడు. ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిన భార్య తాను.. నీతో సంసారం చేయటం ఇష్టంలేదని పేర్కొంది. మరో యువకుడితో ఆమె కలిసి ఉన్న ఫొటోను రాఘవేంద్రకు పంపించి వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంది. నీతో కలిసి జీవించడం ఇష్టం లేదని, కావాలంటే చచ్చిపో అంటూ తేల్చి చేప్పింది. దీంతో రాఘవేంద్ర బుద్ధి మాటలు చెప్పాడు. అయినా భార్య పట్టించుకోలేదు. దీంతో చాకుతో కోసుకోని వాట్సాప్లో పొటోలు పంపాడు. నీవు చచ్చినా నాకు ఎలాంటి ఇబ్బందిలేదంటూ భార్య చెప్పడంతో జీవితంపై విరక్తి చెందిన రాఘవేంద్ర ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు తన భార్య తీరు గురించి లేఖ రాశాడు. దాండేలి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
ఏం కష్టం వచ్చిందో..!
హైదరాబాద్: ఆ దంపతులకు ఏం కష్టం వచ్చిందో ఏమో బలవన్మరణానికి పాల్పడ్డారు. వివాహమైన 55 రోజులకే తనువు చాలించారు. మిస్టరీగా మారిన ఈ విషాద ఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుమ్మరి బస్తీకి చెందిన కార్తీక్ (28)కు గత మార్చి 8న ప్రశాంత్నగర్ రాజీవ్గాంధీ నగర్కు చెందిన మంజుల ఎలియాస్ జ్ఞాన్షిక (27)తో వివాహమైంది. కార్తీక్ ఐటీసీ కంపెనీలో మార్కెటింగ్ ఉద్యోగం చేస్తుండగా.. మంజుల ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేస్తున్నారు. శుక్రవారం తెలిసినవారి ఇంటిలో జరిగిన సత్యనారాయణ స్వామి వ్రతానికి మంజుల వెళ్లి వచి్చంది. అనంతరం ప్రశాంత్నగర్లో తల్లి ఇంటికి భర్తతో కలిసి వెళ్లి వచి్చంది. రాత్రి భోజనాలనంతరం కార్తీక్, మంజుల వారి గదిలో నిద్రించారు. శనివారం ఉదయం 9.30 గంటలైనా ఇంటి తలుపులు తీయలేదు. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టి చూడగా.. కార్తీక్ తలుపుపై ఉన్న వెంటిలేటర్కు వైర్తో ఉరి వేసుకున్నాడు. మంజుల బెడ్పై నోట్లో నురగలతో కనిపించింది. ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మంజుల తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దంపతులు ఆత్మహత్యకు కారణాలేమిటో తెలియడంలేదని కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. -
30 ఏళ్ల జడ్జి.. భార్యతో గొడవపడి బలవన్మరణం?
ఢిల్లీ: ‘నాన్నా బ్రతకడం కష్టంగా ఉంది. నేను ఇబ్బందుల్లో ఉన్నాను’ అని తండ్రికి ఫోన్ చేసిన ఓ 30 ఏళ్ల జ్యుడిషియల్ ఆఫీసర్.. ఆ మరుసటి రోజే శవమై పోయాడు. ఎంతటి కష్టమొచ్చిందో తెలియదు కానీ తన ఇబ్బందిని పూర్తిగా తండ్రికీ చెప్పుకోలేక, ఇటు భార్యతోనూ పూర్తిగా ఇమడలేక తనువు చాలించాడు. తాను ఇబ్బందుల్లో ఉన్నానని, బ్రతకడం చాలా కష్టంగా అనిపిస్తుందని తండ్రితో అన్నాడే కానీ, విషయం మాత్రం చెప్పలేదు. ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు ఆ న్యాయాధికారి దక్షిణ ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ ఘటన అనుమానిత ఆత్మహత్య క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వివరాల్లోకి వెళితే.. అమాన్ శర్మ.. ఉత్తర ఢిల్లీలోని కర్కర్దూమాలో డీఎల్ఎస్ఏ(డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ) సెక్రటరీగా పనిచేస్తున్నాడు. అయితే శనివారం ఆ అధికారి కాస్తా తన గ్రీన్ పార్క్ ఇంట్లో విగతజీవిగా మారిపోయాడు. తన బావ అమాన్ శర్మ.. బాత్రూమ్లో సూసైడ్ చేసుకున్నాడని బావమరిది పోలీసులకు ఫోన్ చేసి చెప్పడంతో విషయం బయటకొచ్చింది. చనిపోయే ముందు భార్యతో గొడవ.. కన్నీళ్లుఅతను చనిపోయే ముందు భార్యతో గొడవ పడినట్లు స్థానికులు చెబుతున్నారు. చుట్టుపక్కల వారు తెలిపిన సమాచారం ప్రకారం.. అతను చనిపోవడానికి కొన్ని గంటల ముందు భార్యతో గొడవ పడి విపరీతంగా ఏడ్చేశాడని పేర్కొన్నారు. భార్యాభర్తల మధ్య ఏం గొడవ జరిగిందో తెలీదు కానీ ఇద్దరు విపరీతంగా అరుచుకున్నారన్నారు. నాకు ఫోన్ చేసి ఇబ్బంది ఉందన్నాడు..తన కొడుకు చనిపోవడానికి ముందు రాత్రి ఫోన్ చేసి మాట్లాడాడని, తాను చాలా ఇబ్బందుల్లో ఉన్నట్లు తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా తెలిసింది. ‘ నేను తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా.. “నాకు జీవించడం కష్టంగా మారింది’ అని తండ్రి స్సష్టం చేశారు. అనుమానిత ఆత్మహత్యగా కేసు నమోదుఇది ఆత్మహత్యగా కనిపిస్తోంది, మేము వచ్చేసరికి ఉరి వేసుకుని వేలాడతున్నాడు.. ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు గుర్తించలేదు, అనుమానిత ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకున్నాం. అన్ని కోణాల్లో విచారణ చేపట్టాం’ అని పోలీసులు తెలిపారు. -
ప్రాణం తీసిన పాపులారిటీ భార్యపై ఈగోతో కొడవలితో హత్య
-
నన్ను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్లావు..?
విశాఖపట్నం: జాతీయ రహదారిపై చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఓ సెక్యూరిటీ గార్డు అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన భార్య గాయాలతో బయటపడింది. పీఎంపాలెం సీఐ జి.బాలకృష్ణ తెలిపిన వివరాలివి. కొమ్మాది శివశక్తినగర్కు చెందిన ఎస్.బలరామ్ (58) గాయత్రీ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటల సమయంలో ఆయన తన భార్య తులసమ్మతో కలిసి ద్విచక్ర వాహనంపై మధురవాడ నుంచి ఆనందపురం వైపు బయలుదేరారు. పరదేశిపాలెం కూడలి వద్దకు చేరుకోగానే, విశాఖ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ఆర్టీసీ నాన్స్టాప్ బస్సు వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బలరామ్కు తీవ్రమైన గాయాలు కావడంతో ఆయన సంఘటన స్థలంలోనే ప్రాణాలు వదిలారు. వెనుక కూర్చున్న భార్య తులసమ్మకు గాయాలయ్యాయి. తన కళ్ల ముందే భర్త విగతజీవిగా పడి ఉండటాన్ని చూసిన ఆమె, తీవ్ర గాయాలతో ఉన్నప్పటికీ మృతదేహంపై పడి బోరున విలపించడం సంఘటన స్థలంలో ఉన్న వారిని కంటనీరు పెట్టించింది. సమాచారం అందుకున్న పీఎంపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రురాలు తులసమ్మను చికిత్స నిమిత్తం గాయత్రీ ఆసుపత్రిలో చేర్పించారు. బలరామ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్కు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అలా భర్త డ్యూటీకి వెళ్లగానే.. ముగ్గురితో ఎఫైర్, 36మందితో..
-
గుప్త నిధి కోసం కన్నతల్లి బలి యత్నం..!
కర్ణాటక: ధనం కోసం కన్న తల్లిని బలివ్వబోయిన కర్కోటక తనయుడి ఉదంతం చామరాజనగర తాలూకా సగడే గ్రామంలో చోటు చేసుకుంది. మే 1వ తేదీన పౌర్ణమి రోజున ఒకరిని బలి ఇస్తే నిధి లభిస్తుందని స్కెచ్ గీసిన కొండయ్యన మదశెట్టి తన 80 ఏళ్ల అంధ, చెవిటి తల్లి మదమ్మ శెట్టిని బలివ్వడానికి సిద్ధమయ్యాడు. ఈ ఉదయం అతను తన ఇంట్లో 4 అడుగుల గొయ్యి తవ్వకం, అందులో ఒక మంత్రకుండం ఉంచి, నిమ్మ, పసుపు, కుంకుమపువ్వు, కలశంతో పూజ చేశాడు. దీనిపై అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. చామరాజనగర రూరల్ స్టేషన్ పోలీసులు ఇంటికి చేరుకోగానే మంత్రగత్తె పారిపోయింది. దీంతో మదశెట్టిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. నిధిని పొందడానికి ఉపయోగించిన మాయాజాలం గురించి తెలుసుకుని సగడే గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. -
ఆ నలుగురు పుచ్చకాయ తిని చనిపోలేదు!
ముంబై కుటుంబం మృతి కేసులో ట్విస్ట్ చేసుకుంది. ఆ నలుగురు పాడైపోయిన పుచ్చకాయ తినడం ద్వారా చనిపోలేదని నిర్ధారణ అయ్యింది. అయితే వాళ్ల శరీరంలోని ప్రధాన అవయవాలన్నీ మాత్రం రంగు మారినట్లు తెలుస్తోంది. దీంతో ఈ మిస్టరీ కేసు విచారణ మరో మలుపు తిరిగినట్లైంది. గత వారం ఆ కుటుంబం మటాన్ పులావ్ తిని.. ఆపై పుచ్చకాయ తిని తీవ్ర అస్వస్థకు లోనైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఒక్కొక్కరుగా చనిపోయారు. అయితే వాళ్లలో ఫుడ్ పాయిజన్ లక్షణాలు కనిపించాయన్న వైద్యుల ప్రకటనతో కలకలం రేగింది. పులావ్ తిన్న మిగతా వాళ్లకు ఏం కాకపోవడంతో.. అందరి దృష్టి పుచ్చకాయ వైపునకు మళ్లింది. బహుశా.. కలుషితమైన పుచ్చకాయ తిని వాళ్లంతా మరణించి ఉంటారన్న ప్రచారం జోరందుకుంది. సమ్మర్లో చాలా మంది తినే పుచ్చకాయ ఇంత పని చేసిందా? అనే చర్చ నడిచింది. వాటర్మిలన్ ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఇది మహారాష్ట్రలో పుచ్చకాయల సేల్ పడిపోవడానికి ఒక కారణం అయ్యింది కూడా. అయితే.. తాజాగా ఈ కేసు ఫోరెన్సిక్ నివేదిక బయటకు వచ్చింది. అందులో పుచ్చకాయలో ఎలాంటి కల్తీ ఆనవాళ్లు లేవని తేలింది. అలాగని ఇది సాధారణ ఫుడ్ పాయిజన్ అయ్యి ఉండకపోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఆ నలుగురిలో గుండె, లివర్, బ్రెయిన్, పేగులు ఆకుపచ్చరంగులోకి మారిపోయి ఉన్నాయి. దీంతో వాళ్లపై విష ప్రయోగం ఏదైనా జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే అబ్దుల్లా శరీరంలో మోర్ఫిన్ అనే శక్తివంతమైన పెయిన్కిల్లర్ ఆనవాలు లభ్యమైంది. ఇది సాధారణంగా వైద్యులు చెబితేనే వాడాలి. దీంతో ఈ అంశంపైనా అధికారులు ఇప్పుడు దృష్టిసారించారు. పోస్ట్మార్టం అనంతరం.. ఆ అవయవాలను పరీక్షల(కెమికల్) కోసం పంపారు. ఫలితాలు వచ్చాకే ఏది అనేదానిపై ఓ క్లారిటీ రానుంది. మొబైల్ రిపేర్ షాప్ నడిపించే అబ్దుల్లా డొకాదియా.. అతని భార్య, ఇద్దరు పిల్లలు. గత శనివారం రాత్రి ఇంట్లో దావత్ చేశారు. మరో ఐదుగురు బంధువుల్ని పిలిచి మటావ్ పులావ్ పెట్టారు. వాళ్లు వెళ్లిపోయాక అర్ధరాత్రి సమయంలో ఈ నలుగురు పుచ్చకాయ తిన్నారు. ఉదయం 5గం. టైంలో ఒకరి తర్వాత ఒకరికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ 12 గంటల వ్యవధిలో అంతా ప్రాణాలు కోల్పోయారు. పుచ్చకాయ ఆందోళనలపై.. మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తాజాగా ఓ ప్రకటన చేసింది. ఈ నాలుగు మరణాలకు పుచ్చకాయకు సంబంధం ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లేవని ప్రకటించింది. అయితే పుచ్చకాయ కలుషితం కాకపోతే గనుక ఎవరైనా విషాన్ని ఇంజెక్ట్ చేసి ఉంటారా? అనే కోణంలోనూ దర్యాప్తు నడుస్తోంది. ఇదీ చదవండి: పుచ్చకాయ.. ఆ టైంలో తింటేనే సూపర్! -
స్పా ముసుగులో వ్యభిచారం
గుంటూరు రూరల్: స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తులను గుంటూరు టాస్్కఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు అందిన సమాచారం మేరకు ఇన్నర్ రింగ్రోడ్డు రెడ్డిపాలెం సమీపంలో ఐరాస్పా రిలాక్స్ రెన్యూ రిజువంట్ స్పా సెంటర్లో నల్లపాడు పోలీసులతో కలిసి దాడిచేయగా మేనేజర్ సూర్యతోపాటుగా ఇతర రాష్ట్రాలకు చెందిన ఇద్ద మహిళలను, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. విచారణ నిమిత్తం నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నల్లపాడు పోలీసులు తెలిపారు. నల్లపాడు పోలీసు స్టేషన్పరిధిలోని ఇన్నర్రింగ్రోడ్డు ఫేజ్–2 చిల్లీస్ సెంటర్ ఎదురు గల స్పా సెంటర్లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం టాస్్కఫోర్స్ పోలీసు బృందం దాడిచేసి మహిళలు, పురుషులను అదుపులోకి తీసుకున్న సంఘటన శుక్రవారంచోటుచేసుకుంది. చిల్లీ సెంటర్లోని ఏ9 బ్యూటీఫుల్ సెలూన్ అండ్ స్పా –2 మసాజ్ సెంటర్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం పోలీసులు దాడిచేశారు. ఏడుగురు పురుషులు, నలుగురు మహిళలు, ఇతర రాష్ట్రానికి చెందిన ఒక మహిళ, 11సెల్ఫోన్లు, స్పా నిర్వాహకుడు ఆదినారాయణలను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
20 మంది మహిళలను లైంగికంగా వాడుకుని..!
కర్ణాటక: నకిలీ గుర్తింపుకార్డులతో మహిళలను పరిచయం చేసుకుని చనువు పెంచుకుని లైంగికంగా వాడుకున్న తర్వాత వారిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజుతున్న నిందితుడిని బెంగళూరు ఆర్ఆర్ నగర పోలీసులు అరెస్టు చేశారు. రామనగర జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు చంద్రేగౌడ అరెస్టైన నిందితుడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...చంద్రేగౌడ రామనగర చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. అయితే ఇతడు తాను లాయర్, రిపోర్టర్, పోలీస్ అంటూ పరిచయం చేసుకుని మహిళలకు వల వేసేవాడు. కొన్నాళ్లు మంచివాడిగా నటించి చనువు పెంచుకుని, తాను డివోర్స్ తీసుకున్నానని, వివాహం చేసుకుంటానని నమ్మించి చివరకు శారీరకంగా లోబర్చుకునేవాడు. ఏకాంత సమయంలో ఉన్నప్పుడు తెలివిగా ఫోటోలు, వీడియోలు తీసుకునేవాడు. తరువాత సదరు మహిళలను బ్లాక్మెయిల్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేవాడు. ఇలా సుమారు 20 మందికి పైగా మహిళలను లైంగికంగా వాడుకుని బ్లాక్మెయిల్ చేశాడని గుర్తించారు. వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించి ఒక మహిళ వద్ద రూ.5 లక్షలు వసూలు చేశాడు. అదే మహిళ ఒకసారి నిందితుడి మొబైల్ను పరిశీలించగా పదుల సంఖ్యలో మహిళల అశ్లీల వీడియోలు, ఫోటోలు కనిపించాయి. దీంతో సదరు బాధిత మహిళ ఆర్ఆర్ నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. -
ఎవరు రాశారీ మరణశాసనం?
ఖమ్మంక్రైం: కుటుంబ కలహాలు పచ్చని సంసారంలో నిప్పులు పోశాయని కొందరు.. ఇద్దరు ఆడపిల్లలు కావడంతో గొడవలు జరిగాయని మరికొందరు.. కట్నం బాకీ ఉండడమే ఘర్షణలకు కారణమని ఇంకొందరు చెబుతున్నా ఆ కుటుంబంలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు మృతి చెందడం విషాదాన్ని నింపింది. అసలు కారణాలపై స్పష్టత రాకున్నా పోలీసుల ప్రాథమిక విచారణలో కొన్ని అంశాలు బయటపడినట్లు తెలుస్తోంది. ఖమ్మంలో నివాసముంటున్న నేలకొండపల్లి మండలానికి చెందిన కణతాల రాము (30) కుటుంబంలో ఈ ఘటన చోటు చేసుకోగా.. ఆయన చిన్నకుమార్తె కూడా మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. దీంతో అసలు నిజమేమిటో మిస్టరీగానే మిగిలిపోనుంది. తొలుత ఇద్దరు.. ఖమ్మం బుర్హాన్పురంలో కణతాల రాము(30) తన భార్య రమ్య(28), కుమార్తెలు దివ్యశ్రీ (5), రితిక(3)తో నివాసముండేవాడు. గతనెల 26న ఆయన ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడం, ఆయన భార్య రమ్య ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు పరిశీలించారు. అప్పటికే రాము, దివ్య చనిపోయి మూడు రోజులు కావడంతో మృతదేహాలు కుళ్లిపోయినట్లు గుర్తించారు. అదే సమయాన రమ్య, రితిక కూడా అపస్మారక స్థితిలో ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రమ్య 30వ తేదీన, హైదరాబాద్ ఆస్పత్రికి తరలించిన రితిక గురువారం రాత్రి మృతి చెందారు. 23వ తేదీన రాము, 24న దివ్యశ్రీ రాము, దివ్యశ్రీ మృతదేహాలను గతనెల 26న(ఆదివారం) గుర్తించినా.. అంతకు మూడు రోజుల ముందే(గురువారం) రాము మృతి చెందాడని సమాచారం. మూడు రోజులుగా భార్యతో గొడవపడుతున్న రాము బయటకు వెళ్లి విషం తాగొచ్చి మృతి చెందగా, ఆయన మృతికి తానే కారణం అనుకుంటారని రమ్య భావించి పిల్లలను బయటకు పంపలేదని సమాచారం. దివ్యశ్రీ ఇంటి పక్కనే వారితో చనువుగా ఉండటం.. ఆమె బయటకు వెళ్తే రాము మృతి విషయం బయటపడుతుందనే భావనతో 24వ తేదీన నిద్రలోనే తల్లి హత్య చేసి ఉంటుందనే నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ఇక 25వ తేదీన ఇంట్లోనే మృతదేహాలతో ఉండగా.. 26వ తేదీన ఉదయం చిన్నకుమార్తెను మృతదేహాల వద్దే ఉంచి స్థానికంగా కిరాణం షాపునకు వెళ్లి ఎలుకల మందు తీసుకొచి్చ, ఓఆర్ఎస్లో కలిపి తాను తాగడమే కాక చిన్న కుమార్తె రితికకు కూడా తాగించానని చెప్పినట్లు సమాచారం. అయినా కుమార్తె మృతి చెందకపోవడంతో బలమైన వస్తువుతో ఆమె నెత్తి మీద కొట్టిందని తెలిసింది. మొదటి నుంచి కలహాలే నేలకొండపల్లి అనంతనగర్కు చెందిన రాముకు, నడిగూడెం మండలం వాయిలసింగారానికి చెందిన రమ్యతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. తొలుత నేలకొండపల్లిలో ఉన్నా ఆపై ఖమ్మంకు మకాం మార్చారు. ఆది నుంచి వీరి మధ్య ఉన్న కలహాలు రెండో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టాక పెరిగాయని తెలిసింది. కొడుకు పుడితే పుట్టువెంట్రుకల కార్యక్రమం స్వగ్రామంలో ఘనంగా నిర్వహించాలని రాము భావించగా.. బిడ్డే పుట్టడంతో ఆమెకు మూడేళ్లు నిండాక కుటుంబం మధ్యే మొక్కు తీర్చుకున్నాడు. రమ్య కుటుంబీకులను పిలవకపోవడంతో ఆమె తరచూ గొడవ పడేదని సమాచారం. అలాగే, పెళ్లి సందర్భంగా ఇస్తామన్న నగదులో రూ.లక్ష, కోదాడలో వంద గజాల స్థలం రమ్య కుటుంబీకులు ఇవ్వకపోవడం కూడా గొడవలకు కారణమని సమాచారం. మూడు రోజులు తిండి లేకుండా.. పోలీసుల విచారణలో భాగంగా గత నెల 23న రాత్రి వంట చేసిన రమ్య.. ఆ తర్వాత మళ్లీ పొయ్యి వెలిగించలేదని బూజు పట్టి ఉన్న అన్నాన్ని చూసి పోలీసులు ఈ భావనకు వచ్చారు. అంటే గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ అన్నం లేదని సమాచారం. చివరకు ఇంటి సమీపంలోని వృద్ధురాలు 26వ తేదీన ఉదయం ఇడ్లీలు తీసుకొస్తే తాను తినకపోగా.. చిన్నకూతురుకూ తినిపించలేదని తెలిసింది. ఆమెకు ఎలుకల మందు తాగించినందున ఇడ్లీ తినిపిస్తే మందు విరిగిపోతుందనే భావనకు వచి్చ నట్లు తెలుస్తోంది. అయితే, కుటుంబ కలహాలే తప్ప మరెవరికీ ఘటనలో సంబంధం లేదని పోలీసులు దాదాపు నిర్ధారణకు వచి్చనా.. నలుగురి మృతితో అసలు కారణాలు మాత్రం వారితోనే సమాధి అయినట్లయింది. కాగా, రాము, ఆయన పెద్దకుమార్తె మృతదేహాలకు స్వగ్రామమైన అనంతనగర్లో అంత్యక్రియలు నిర్వహించగా.. రమ్య మృతదేహాన్ని తీసుకురావడానికి ఆయన కుటుంబీకులు అంగీకరించలేదని సమాచారం. దీంతో మార్గమధ్యలోనే వాహనాన్ని వెనక్కి తిప్పి ఖమ్మం తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. గురువారం హైదరాబాద్లో మృతి చెందిన రితిక మృతదేహాన్ని అనంతనగర్కే తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేశారు.అన్నీ అనుమానాలే.. పోలీసులు పరిశీలించిన రోజు కుళ్లిపోయిన స్థితిలో ఉన్న రాము, దివ్యశ్రీ మృతదేహాలు బయటపడ్డాయి. రమ్య పురుగులమందు తాగి ఉండడం, రితిక తలపై గాయాలు ఉండటంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. భర్త, పెద్ద కుమార్తెను రమ్యే హత్య చేసి ఆ తర్వాత చిన్నకుమార్తె హత్యకు సైతం యతి్నంచిందని.. చివరగా తాను పురుగుల మందు తాగినట్లు భావించారు. ఆమెను ఆస్పత్రికి తరలించి కాస్త కోలుకోగానే ఆరా తీయగా కొన్ని వివరాలు చెప్పినట్లు తెలిసింది. -
వస్తున్నాయ్ ఫీలింగ్స్!
ఈ మధ్యే మా స్కూల్ రీయూనియన్ జరిగింది. నా చిన్ననాటి స్నేహితుడిని కలుసుకుని చాలాసేపు ముచ్చటించుకున్నాం. ఆ తర్వాత వాట్సాప్ చాటింగ్.. కాల్స్.. వీడియో కాల్స్. నెమ్మదిగా మా మధ్య వ్యక్తిగత విషయాలను పంచుకునేదాకా వెళ్లింది. ఇప్పుడు అతని గురించే ఆలోచనలు ఎక్కువ అవుతున్నాయి. అతనికింకా పెళ్లి కాలేదు. నా భర్త చాలా మంచోడు. అయినా కూడా ఆయన్ని, పిల్లల్ని వదిలేసి అతనితో వెళ్లిపోవాలని అనిపిస్తోంది?. అందుకు అతను కూడా సిద్ధంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. దీని నుంచి నేను ఎలా బయటపడాలి??.. ఈ తరహా కేసులు ఈ మధ్య కాలంలో పెరిగిపోతున్నాయి. స్కూల్ గెట్ టు గెదర్లో.. పాత స్నేహితుడితో మళ్లీ సంబంధం మొదలుపెట్టిన ఓ మహిళ ఘాతుకానికి పాల్పడింది. ప్రియుడితో మిగిలిన జీవితం పంచుకునేందుకు భర్త, కడుపున పుట్టిన బిడ్డలను అడ్డు తొలగించుకోవాలనుకుంది. పెరుగన్నంలో విషం పెట్టి చంపాలని చూసింది. అభం శుభం తెలియని పిల్లలు చనిపోగా.. అదృష్టవశాత్తూ భర్త భార్య స్కెచ్ నుంచి బయటపడ్డాడు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సమీపంలోని కిష్టారెడ్డిపేటలో కిందటి ఏడాది మార్చిలో ఈ ఘోరం జరిగింది. రజిత.. తన జీవితాన్ని చేజేతులారా నాశనం చేసుకుంది. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న స్రవంతి.. టెన్త్ క్లాస్ గెట్ టు గెదర్లో పాల్గొంది. అక్కడ వాట్సాప్ గ్రూప్ నుంచి నెంబర్ తీసుకుని ఓ కానిస్టేబుల్ ఆమెతో చాటింగ్ చేశాడు. మొదట్లో ఆమె పట్టించుకోలేదు. తనకూ విడాకులయ్యాయని.. మీరు నచ్చారని.. ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని నమ్మించాడు. ఆపై ఎలాగూ పెళ్లి చేసుకుంటున్నాం కదా అని గర్భవతిని చేశాడు. తీరా తాను తాను మోసపోయానని గుర్తించిన ఆమె న్యాయం కోసం రోడ్డెక్కింది. సూర్యాపేటలో కిందటి ఏడాది నవంబర్లో జరిగింది ఈ ఘటన.. తాజాగా.. సీతారాం అనే వ్యక్తి తన భార్య రేణుకా వివాహేతర సంబంధాల్ని భరించలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతని సూసైడ్ లేఖ బయటకు రావడం సంచలన చర్చకు దారి తీసింది. రెండు లక్షల జీతంతో తన భార్యను బాగా చూసుకుంటున్నప్పటికీ.. ఇతరులతో వివాహేతర సంబంధం నడిపిందని.. ఆమె ప్రైవేట్ వీడియోలు నెట్టింట చేరుకున్నాయని.. ఇంకా తాను బతికి ఎందుకని.. లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కేసులో భార్య, ఆమెతో అఫైర్లు పెట్టుకున్న వ్యక్తులనూ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె వ్యవహారం నడిపిన వాళ్లలో స్కూల్, ఇంటర్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రీయూనియన్ల, గెట్ టు గెదర్ల అసలు ఉద్దేశ్యం పాత స్నేహాలను గుర్తుచేసుకోవడం.. జ్ఞాపకాలను పంచుకోవడం. కానీ ఇప్పుడవి విపరీతాలకు దారితీస్తున్నాయి. పాత పరిచయాలు అనైతిక సంబంధాలకు దారి తీస్తూ.. కుటుంబ బంధాలను చెరిపేస్తున్నాయి. కోరికెలు గుర్రాలై పరిగెడుతూ.. ఆ స్పీడ్లో ప్రాణాలు తీయడమో లేదంటే ప్రాణాలు తీసుకోవడమో చేస్తున్నాయి. కొన్నిసార్లు అన్నిరకాలుగా మోసపోయి బాధితులుగా కూడా మిగిలిపోతున్నారు. ఈ పరిణామాలు సమాజంలో ఆందోళన కలిగిస్తోంది.సైకాలజిస్టులు చెబుతున్నది ఏమిటంటే.. రీయూనియన్లలో కలుసుకునే పాత స్నేహితులు, అప్పటి యవ్వన జ్ఞాపకాలు, భావోద్వేగాలు మళ్లీ రగిలిస్తాయి. ఆ క్షణిక ఉత్సాహం, కొత్తగా ఏర్పడిన అనుబంధం, కొందరిని వివాహేతర సంబంధాల వైపు నెడుతుంది. కానీ ఆ నిర్ణయాలు కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పిల్లల భవిష్యత్తు, జీవిత భాగస్వామి నమ్మకం, సమాజంలో గౌరవం అన్నీ ఒక్కసారిగా కూలిపోతున్నాయి. కాబట్టి.. రీయూనియన్లు జ్ఞాపకాల పండుగగా ఉండాలి. అంతేకానీ అవి కాపురాలను ముక్కలు చేసే వేదికలవ్వకూడదు. కుటుంబ బంధాలను కాపాడుకోవడం, సంబంధాలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. రీయూనియన్ల, గెట్ టు గెదర్లో కలిసే స్నేహం, జ్ఞాపకాలు ఆనందాన్ని పంచాలి కానీ జీవితాలను శిధిలం చేయకూడదంటున్నారు. -
అత్తను చంపిన అల్లుడు
మేడ్చల్ జిల్లా: మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో ఓ యువకుడు అత్తను కొట్టి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీకి చెందిన కొల్ల అరుణ(39)కు ఇద్దరు కూతుళ్లు సంతానం. చిన్న కుమార్తె కావ్య(19) గతేడాది కరీంనగర్ చందన్పూర్కు చెందిన కర్రు స్నేహిత్(28)ను ప్రేమ వివాహం చేసుకుంది. గత నెల 29వ తేదీ రాత్రి అరుణకు స్నేహిత్ ఫోన్ చేసి ‘బాసాన్లు తోమే నీ కూతురిని పెళ్లి చేసుకున్నా.. నేను పెద్ద కంపెనీలో ఆఫీసర్ని. నీ కూతురు చిన్న విషయాలకే అలుగుతుంది’ అని మాటలతో వేధించాడు. మరుసటిరోజు మధ్యాహ్నం అరుణ దుకాణానికని బయటకు వెళ్లి వస్తుండగా స్నేహిత్ ఆమెను తన బైక్పై ఎక్కించుకున్నాడు. కొద్దిసేపటికే కావ్యకు ఫోన్ చేసి.. అత్తమ్మ ఫిట్స్తో కింద పడిందని, ఆసుపత్రికి తరలించానని చెప్పాడు. ఆసుపత్రికి చేరుకున్న కావ్య.. స్నేహిత్ ప్రవర్తనలో తేడా ఉండటంతో వెంటనే చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీలోని హనుమాన్ ఆలయ సమీప సీసీ ఫుటేజీలను పరిశీలించింది. స్నేహిత్ అరుణతో గొడవ పడి హెల్మెట్తో బలంగా కొట్టగా రన్నింగ్ బైక్ పైనుంచి ఆమె కిందపడినట్లు గుర్తించింది. తలకు బలమైన గాయం కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదేరోజు అరుణ మృతి చెందింది. కావ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
అర్ధరాత్రి ఊరంతా చేతబడి.. టెన్షన్ వాతావరణం..!
అర్ధరాత్రి సమయం… ఊరు అంతా భయంతో నిశ్శబ్దంగా ఉంది… కొంతమంది గ్రామస్తులు ఒక చోట చేరి గుసగుసలు మాట్లాడుతున్నారు… నేలపై అనుమానాస్పదమైన చేతబడి గుర్తులు… చుట్టూ పొగ, చీకటి… టెన్షన్ వాతావరణం!శ్రీకాకుళం క్రైమ్/కొత్తూరు: తరాలు మారుతున్నాయి.. రోజురోజుకీ టెక్నాలజీ కొంత పుంతలు తొక్కుతోంది.. అయినప్పటికీ కొన్ని గ్రామాల్లో మూఢ నమ్మకాలు పెరుగుతున్నాయి తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. మంగళవారం వేకువఝామున కొత్తూరు మండలం గొట్టిపల్లి గిరిజన తండా గ్రామమైన చినరాజపురంలో చిల్లంగి నెపంతో సవర ఎల్లంగి, అతని భార్య గయానీలను అదే గ్రామానికి చెందిన వ్యక్తి హత్య చేసిన సంగతి తెలిసిందే. కుమార్తెకు బాగోలేకపోవడంతో.. నిందితుడు సవర తోటయ్య కుమార్తె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఎల్లంగి చిల్లంగి పెట్టాడన్న అనుమానాన్ని పెంచుకున్నాడు. ఒకానొక సమయంలో పెద్దల వద్ద పంచాయితీ సైతం నడవగా రాజీ కుదిర్చారు. అయినప్పటికీ ఆమెకు తగ్గకపోవడం, ఇటీవల తరచూ తోటయ్య కలలోకి ఎల్లంగి రావడంతో తనకు కూడా చిల్లంగి పెట్టి ఉంటాడని తోటయ్య భావించేవాడు. ఈ క్రమంలోనే మంగళవారం వేకువఝాము 4 గంటలకు ఇంటి ముందు సిమెంటు రోడ్డుపై నిద్రిస్తున్న ఎల్లంగిపై తోటయ్య గొడ్డలితో దాడి చేశాడు. పక్కనే ఉన్న ఎల్లంగి భార్య గయానీకి కూడా ఎక్కడ ఆమె బతికితే చిల్లంగి పెడుతుందేమోనని గొడ్డలితో నరికాడు. కొనవూపిరితో ఉందని భావించి సమీపంలో బండరాయి ఎత్తి ప్రాణాలు తీసి పరారయ్యాడు. గ్రామస్తుల గోప్యమేల..? వేకువఝామున హత్యలు జరిగినా రాత్రి 8 గంటల వరకు పోలీసులకు తెలియపర్చకుండా గ్రామస్తులు ఎందుకు గోప్యం పాటించారన్నది అంతుచిక్కని ప్రశ్నగానే ఉంది. కొండ ఎగువన గ్రామం ఉండటం, రాత్రి సమయంలో అజ్ఞాత వ్యక్తి సమాచారమివ్వడంతో సీఐ చింతాడ ప్రసాద్, ఎస్ఐ వెంకటేష్ తమ సిబ్బందితో అతికష్టమ్మీద వెళ్లారు. రాత్రంతా ముద్దాయి కోసం గాలించారు. కాగా హత్యల విషయం గోప్యంగా ఉంచడానికి చనిపోయిన సవర ఎల్లంగి బంధువులు నిందితుడైన కోటయ్యను సైతం చంపేసి ఒకేసారి ముగ్గురి మృతదేహాలను దహనపర్చాలనే ఆలోచన చేసినట్లు సమాచారం. పోలీసులకు తెలిస్తే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలిస్తారనే కారణంతోనే సమాచారమివ్వలేదని తెలుస్తోంది. గతంలోనూ హత్యలు.. కొత్తూరు మండలం పుల్లగూడలో ఆరేడేళ్ల క్రితం చిల్లంగి నెపంతో కొట్టి ప్రాణముంటుండగానే ఓ గిరిజన వ్యక్తిని కాల్చి చంపేశారు. గ్రామస్తులు కూడా విషయాన్ని ముందుగా బయటకు పొక్కనీయకుండా రాజీ యత్నానికే అప్పట్లో ప్రయ తి్నంచారు. రెండున్నరేళ్ల క్రితం ఎచ్చెర్ల మండలం అజ్జరాం గ్రామానికి చెందిన బోర ఈశ్వరరావుకు చిల్లంగి ఉందన్న నెపంతో దారి కాచి కొట్టి పురుగుల మందు తాగించి మెడ చుట్టూ తువ్వాలు బిగించి చంపి పడేశారు. తన కుమారుడు చావుకు ఈశ్వరరావు చిల్లంగి పెట్టడమే కారణమని భావించిన బోర ఆదినారాయణ తన సోదరుడు, మరికొందరి సహాయంతో చంపేశాడు. 2022 ఏడాదిలో గార మండలం బచ్చువానిపేటలో బచ్చు రామయ్యతాతను సొంత అన్న కొడుకే చిల్లంగి నెపంతో అంతమొందించాడు. కుటుంబసభ్యుల సహకారంతో చంపేసి గ్రామ సమీప కొర్లాం పొల్లాల్లో స్క్రూడ్రైవ్తో గొంతులో పొడిచి వెదురుకర్రతో తలపై మోది చంపి పడేశారు. అనాథలుగా పిల్లలు.. ఎల్లంగికి ముగ్గురు సంతానం. వారిలో కుమార్తెకు వివాహమవ్వగా పెద్దకుమారుడు పోడు వ్యవసాయం చేసుకుటున్నాడు. చిన్న కుమారుడు చదువుకుంటున్నాడు. వీరికి ఎటువంటి ఆధారం లేక తల్లిదండ్రులు చనిపోవడంతో అనాథలుగా మిగిలారని బంధువులు, గ్రామస్తుల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. నిందితుడు సవర తోటయ్య పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. -
కూతురి ప్రేమ పెటాకులు కావాలని క్షుద్ర పూజలు!
సాక్షి, వికారాబాద్: తన ప్రేమకు అడ్డొస్తారని భావించి తల్లిదండ్రులకు ఓవర్డోస్ ఇంజెక్షన్లు ఇచ్చి చంపింది ఓ కూతురు. జిల్లాలోని యాచారంలో కొన్ని నెలల కిందట జరిగిన ఈ ఘటన.. తెలుగు రాష్ట్రాలను నివ్వెరపోయేలా చేసింది. ఇప్పుడు అదే జిల్లాలో మరో ‘ప్రేమ విడ్డూరం’ చోటు చేసుకుంది. తాండూరులో చేతబడి కలకలం రేగింది. తన కూతురు ప్రేమ విఫలం కావాలని ఓ తల్లి ఏకంగా మంత్రగాళ్లను ఆశ్రయించింది. తీరా పూజలు జరుగుతున్న టైంలో కొందరు యువకులు అడ్డుకోవడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇందిర అనే యువతి గతకొంతకాలంగా ఓ యువకుడ్ని ప్రేమిస్తోంది. అయితే ఇది నచ్చని ఆమె తల్లి ఎలాగైనా ఆ ప్రేమ పెటాకులు చేయాలనుకుంది. తన కూతురు మనసు మారాలంటే మంత్రమే సరైన మార్గమని భావించింది. వెంటనే గుండు దేవుడు అలియాస్ గుండప్పను సంప్రదించింది. ఇద్దరూ కలిసి రాత్రిపూట నిర్మానుష్య ప్రదేశంలో పూజలకు ప్లాన్ చేశారు. పెళ్లి త్వరగా కావాలని పూజలు చేద్దామని కూతురిని ఒప్పించి కూర్చోబెట్టింది ఆ తల్లి. అయితే.. పూజలు జరుగుతున్న టైంలో అటుగా వెళ్తున్న కొందరు యువకులు అది గమనించారు. గట్టిగా నిలదీయడంతో పాటు గుండప్పకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అయితే విచారణలో అసలు విషయం వెలుగు చూసింది. దీంతో పోలీసులు ఆ తల్లిని మందలించి పంపించేశారు. -
తన హత్య గురించి ఆత్మ చెప్పిన నిజం..?
-
ఆమెకు బోర్ కొడితే చావాల్సిందే.. చరిత్రలో అత్యంత క్రూరమైన మహిళా కిల్లర్!
-
అషుపై కేసు పెట్టింది ఆమె అలా చేసినందుకే..!
-
బిర్యానీ తిన్నాక, పుచ్చకాయ తినడం ప్రమాదకరమా ?
-
ఎస్ఐ భార్య ఆత్మహత్య
బెంగళూరు: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, సజావుగా సాగిపోతున్న కుటుంబంలో చిన్న గొడవలే పెద్దవయ్యాయి. కుటుంబ కలహాలతో ఎస్ఐ భార్య ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా బీరూరు పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. బీరూరు ఎస్ఐ తిప్పేశ్ భార్య పద్మ (35) మంగళవారం రాత్రి ఇంటిలో ప్రాణాలు తీసుకుంది. బీరూరు పట్టణంలో బాడుగ ఇంటిలో తిప్పేశ్ కుటుంబం ఉంటోంది. పద్మది తుమకూరు జిల్లా కాగా, తిప్పేశ్ది దావణగెరె జిల్లా. వీరిద్దరూ ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కానీ పిల్లలను ఎక్కడ చదివించాలి, సెలవుల గురించి గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. పోలీసులు విచారణ చేపట్టారు. -
విశాఖ ఎక్స్ప్రెస్ అత్యాచార కేసులో ట్విస్ట్
సాక్షి, పల్నాడు: వివాహితకు మాయమాటలు చెప్పి ఏసీ బోగీలోకి లాక్కెళ్లి మరీ అత్యాచారం జరిపిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిత్యం ప్రయాణికులతో కిక్కిరిసి ఉండే విశాఖ ఎక్స్ప్రెస్లో అదెలా సాధ్యమైందంటూ అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే.. రైల్వే పోలీసులు ఎట్టకేలకు ఈ కేసును చేధించారు. విశాఖ ఎక్స్ప్రెస్ వివాహిత అత్యాచార కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితుడు ఏసీ బోగీలో పని చేసే కార్మికుడేనని తేలింది. ఒడిశాకు చెందిన శౌరవ్ బగ్దీ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని.. అతన్ని అరెస్ట్ చేశామని విజయవాడ రైల్వే పోలీసులు ప్రకటించారు. తాను స్టాఫ్నని చెప్పి ఆ జంటను వెంట తీసుకెళ్లాడని, వాళ్ల ఆర్థిక స్థితి చెప్పడంతో డబ్బులు కూడా వద్దన్నాడని.. ఆపై ఏమార్చి వివాహితను ఏసీ బోగీలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని పోలీసులు వెల్లడించారు.పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన భార్యభర్తలు జీవనోపాధి కోసం విశాఖకు వెళ్లారు. జెట్టిపాలెం(పల్నాడు)లో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు విశాఖ ఎక్స్ప్రెస్ జనరల్ బోగీ ఎక్కారు. కాసేపటి తర్వాత ఓ వ్యక్తి వాళ్ల దగ్గరకు వచ్చాడు. ఏసీ బోగీలో సీట్లు ఉన్నాయని.. తన వెంట రావాలని తీసుకెళ్లాడు. తీరా అక్కడికి వెళ్లాక ఒక సీటే ఖాళీగా ఉందని చెప్పడంతో భార్యను పంపించి తాను టాయ్లెట్ వద్ద కూర్చోనిపోయాడు ఆ భర్త. అయితే ఇదే అదనుగా ఆ మహిళను హెచ్1ఏ బోగీలోకి లాక్కెల్లి.. కూపే తలుపు మూసి దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటన తర్వాత నిందితుడు పారిపోగా.. భార్యభర్తలిద్దరూ రెంటచింతల పీఎస్లో ఫిర్యాదు చేసింది. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఘటనపై విజయవాడ రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో దర్యాప్తు వేగవంతం చేశారు. -
కోళ్ల ప్రాణం తీసిన డీజే సౌండ్!
బరాత్లు, ఊరేగింపుల టైంలో జోష్ కోసం చెవులకు చిల్లులు పడే రేంజ్లో డీజేలు ఏర్పాటు చేస్తుంటారు కొందరు. ఆ అత్యుత్సాహం ఒక్కోసారి విషాదాలకు.. విపరీతాలకూ దారి తీసే అవకాశమూ లేకపోలేదు. శబ్ధ కాలుష్యం వల్ల పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతుంటారు. అందుకు మూగ జీవాలు, పక్షులు కూడా మినహాయింపే కాదు. డీజే మ్యూజిక్ కారణంగా తన కోళ్లు గుండె ఆగి చనిపోయాయంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించడం చర్చనీయాంశమైంది.ఏప్రిల్ 25న ఉత్తర ప్రదేశ్ సుల్తాన్పూర్ జిల్లా రామ్భద్రపూర్వ గ్రామానికి చెందిన బాబన్ విశ్వకర్మ తన కుమార్తె వివాహాన్ని జరిపి, అత్తారింటికి పంపే సమయంలో ఊరేగింపులో డీజే ఏర్పాటు చేశారు. గ్రామం అంతా డీజే శబ్దాలతో ఊగిపోయింది. అయితే, ఆ ఊరేగింపు సబీర్ అలీ నిర్వహిస్తున్న పౌల్ట్రీ ఫారమ్ పక్కన వెళ్లింది. ఆ సమయంలో సౌండ్ కారణంగా కోళ్లు భయంతో వణికిపోయి చెల్లాచెదురయ్యాయి. చివరకు గుండె ఆగి చనిపోయాయి.సుల్తాన్పూర్లో జరిగిన ఘటన అసాధారణం కాదు. అధిక శబ్దం వల్ల కోళ్లు షాక్కు గురై చనిపోవడం శాస్త్రీయంగా సాధ్యమే. ఈ ఘటనలో మొత్తం 140 కోళ్లు చనిపోయాయని అలీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అవి చనిపోవడానికి డీజే ఆపరేటర్ కవి యాదవ్ కారణమని సబీర్ ఆరోపిస్తున్నాడు. అయితే పోలీసులు యాదవ్ను ప్రశ్నించి వదిలేశారు. అధిక శబ్దం కేవలం మనుషులకే కాకుండా జంతువులపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే ఇలాంటి డీజేలు పెట్టినప్పుడు సౌండ్ కంట్రోల్పై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతుంటారు. -
పక్కింటి మహిళపై సీఐ చిన్నమల్లయ్య అత్యాచారం
పల్నాడు జిల్లా: గతంలో పల్నాడు జిల్లా వినుకొండ సీఐగా పనిచేసిన చిన్నమల్లయ్య తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బుధవారం ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం స్థానికంగా సంచలనం సృష్టించింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... పల్నాడు జిల్లా వినుకొండ మండలం బ్రాహ్మణపల్లిలో సీఐకి చెందిన స్థలాన్ని లీజుకు తీసుకొని కోళ్ల ఫారం నిర్వహిస్తున్నామని తెలిపింది. లీజు డబ్బుల కోసం వచ్చిన చిన్నమల్లయ్య తనపై లైంగిక దాడి చేశాడని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులను కోరింది. వినుకొండ సీఐ ప్రభాకరరావు విచారణ చేపట్టారు. -
చిల్లంగి నెపంతో భార్యాభర్తల హత్య
శ్రీకాకుళం క్రైమ్: జిల్లాలోని కొత్తూరు మండలం గొట్టిపల్లి పంచాయతీ గిరిజన తండా గ్రామమైన చినరాజపురంలో చిల్లంగి నెపంతో భార్యాభర్తలను అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి గొడ్డలితో నరికి చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. కొండ ఎగువన ఉండే చినరాజపురం గ్రామంలో మంగళవారం వేకువజామున సవర కోటయ్య అనే వ్యక్తి అదే గ్రామా నికి చెందిన సవర ఎల్లంగి (50)ని గొడ్డలిలో నరకబోయాడు. సమీపంలో ఉన్న ఎల్లంగి భార్య గయాని (40) అడ్డుకోబోవడంతో ఆమెపై కూడా నిర్దాక్షిణ్యంగా గొడ్డలితో వేటువేశాడు. ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశారు. చిల్లంగి పెడుతున్నారనే అనుమానంతోనే కోటయ్య ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. వేకువజామునే హత్య జరిగిన ఊరుఊరంతా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచింది. దీంతో మంగళవారం రాత్రి వరకు పోలీసులకు సమాచారం అందలేదు. రాత్రి ఎలాగోలా సమాచారం అందుకు న్న కొత్తూరు సీఐ చింతాడ ప్రసాదరావు, తమ సిబ్బందితో కలసి కొండపైనున్న చినరాజపురం గ్రామంలోని ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. సవర ఎల్లంగి తన కుటుంబ సభ్యులకు చిల్లంగి పెట్టాడన్న అనుమానంతోనే కోటయ్య ఈ హత్య లు చేశాడని, ప్రస్తుతం నిందితుని కోసం గాలిస్తున్నామని సీఐ తెలిపారు. -
భర్తను ఏమార్చి.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం!
సాక్షి, పల్నాడు: విశాఖ ఎక్స్ప్రెస్లో మహిళపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గుర్తుతెలియని వ్యక్తి మాయమాటల్ని నమ్మి బాధిత దంపతులు వెంట వెళ్లగా.. ఏసీ బోగీలోకి తీసుకెళ్లి మరీ వివాహితపై అఘాయిత్యం జరిపినట్లు తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా జరిగిన వివరాల్లోకి వెళ్తే.. పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన భార్యభర్తలు జీవనోపాధి కోసం విశాఖలో నివాసం ఉంటున్నారు. జెట్టిపాలెంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు విశాఖ ఎక్స్ప్రెస్ ఎక్కారు. ఈలోపు జనరల్ బోగీలో ఉన్న ఆ జంట వద్దకు ఓ వ్యక్తి వచ్చాడు. ఇక్కడ ఇబ్బంది ఎందుకు పడతారని?.. ఏసీ బోసీలో ఖాళీగా ఉందని చెప్పాడు. ఆ వ్యక్తి చెప్పిన మాటలు విని వాళ్లు వెంట వెళ్లారు. అయితే ఒక సీటే ఖాళీగా ఉందని చెప్పడంతో భర్త టాయ్లెట్ వద్ద కూర్చోనిపోయాడు. మహిళను హెచ్1ఏ బోగీలోకి తీసేకెళ్లి కూపే తలుపు మూసి దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు రెంటచింతల పీఎస్లో ఫిర్యాదు చేసింది. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఘటనపై విజయవాడ రైల్వే ఓలీసులు సమాచారం అందించారు. దీంతో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
89 ఏళ్ల వయసులో గన్ పట్టుకుని తిరుగుతూ.. కాల్పులు జరుపుతూ..
అతడి వయసు 89 ఏళ్లు. ఆ వయసులో చేతిలో గన్ పట్టుకుని తిరుగుతూ కొందరిపై కాల్పులు జరుపుతూ కలకలం రేపాడు. గ్రీక్లోని అథెన్స్ నగర కేంద్రంలో ఈ ఘటన జరిగింది. సెంట్రల్ అథెన్స్లోని ఒక సొసైటీ సెక్యూరిటీ ఆఫీస్, అలాగే ఒక కోర్టు భవనంలో కాల్పులు జరిపి కొందరిని గాయపరిచాడు ఆ వృద్ధుడు. నిందితుడిని గుర్తించడానికి పోలీసులు ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాట్గన్ (ఒకేసారి అనేక గుళ్లను పేల్చే తుపాకీ)తో ఉన్న వృద్ధుడు మొదట గ్రీకు రాజధాని కేంద్రంలోని సొసైటీ సెక్యూరిటీ ఆఫీస్లో కాల్పులు జరిపి ఒక ఉద్యోగిని గాయపరిచాడు. ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు ఆ వ్యక్తికి చికిత్స అందించారు. నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.అదే వ్యక్తి తర్వాత సెంట్రల్ అథెన్స్లోని మరో ప్రాంతంలో ఉన్న కోర్టు భవనం గ్రౌండ్ ఫ్లోర్లో కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడ కూడా పలువురు గాయపడ్డారు. అధికారులు షాట్గన్ను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఈ కాల్పుల వెనుక ఉద్దేశం స్పష్టంగా లేదు. కోర్టు భవనంలో కాల్పుల తర్వాత నిందితుడు కొన్ని పత్రాలు ఉన్న కవర్లను నేలపై విసిరేశాడు.గ్రీకు జాతీయ సామాజిక భద్రత నిధి చీఫ్ అలెగ్జాండ్రోస్ వార్వెరిస్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు సెంట్రల్ అథెన్స్లోని కెరామైకోస్ ప్రాంతంలోని కార్యాలయం 4వ అంతస్తుకు వెళ్లి, ఒక ఉద్యోగిని తల దించుకో అని చెప్పిన తర్వాత కాల్పులు జరిపాడు. ఆ కాల్పులో మరో ఉద్యోగి కాలికి గాయాలయ్యాయి. నిందితుడు ట్రెంచ్కోట్ (పొడవైన కోట్)లో షాట్గన్ దాచుకున్నాడు. “అతడు లోపలికి వెళ్లి 4వ అంతస్తుకు చేరుకున్నాడు. షాట్గన్ ఎత్తి ఒక ఉద్యోగికి తల దించుకోమని చెప్పి, మరొకరిని గాయపరిచాడు” అని వార్వెరిస్ ఈఆర్టీ రేడియోకు చెప్పారు. గాయపడ్డ ఉద్యోగినే లక్ష్యంగా తీసుకుని కాల్పులు జరిపినట్లు కనిపించలేదని తెలిపారు. గాయపడ్డ ఉద్యోగిని ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలిలోనే పోలీసులు అతని కాలికి టోర్నికెట్ (రక్తస్రావం ఆపేందుకు బిగించి కట్టే పట్టు) పెట్టారు. గ్రీక్లో తుపాకీ హింస తక్కువగా ఉంటుంది. అక్కడ తుపాకులకు అనుమతులు అంత సులభంగా ఇవ్వరు. -
ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న తండ్రి
మహబూబాబాద్: తొర్రూర్ పట్టణ శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి తన ఇద్దరు కుమారులకు ఉరివేసి హత్య చేసి, అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.పోలీసులు కథనం ప్రకారం.. తండ్రి వలి తన ఇద్దరు కుమారులు విలాస్ (5), వికేష్ (3)లను పోలంలోకి తీసుకెళ్లి ఉరివేసి హత్య చేశాడు. అనంతరం అదే చోట తాను కూడా ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం వెలుగులోకి రావడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. -
ఆత్మహత్య చేసుకుంటానంటూ అషు బెదిరింపు
-
అందుకే కిరణ్కు నిప్పంటించా!
ప్రియుడ్ని ఇంటికి పిలిపించుకుని వెస్ట్రన్ స్టయిల్లో ప్రపోజ్ చేస్తానంటూ కుర్చీకి కట్టేసి మరీ తగలబెట్టి చంపేసింది ఓ ప్రియురాలు. ఈ కేసు దేశవ్యాప్తంగా.. అందునా సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారి తీసింది. ఈ కేసులో ఇప్పుడు మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తనతో వివాహానికి కిరణ్ ఒప్పుకున్నాడని నిందితురాలు ప్రేమ అలియాస్ ప్రేరణ చెబుతోంది.బెంగళూరులో ప్రియున్ని తన ఇంట్లో కుర్చీకి కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన కేసులో నిందితురాలు ప్రేమ అలియాస్ ప్రేరణ నెమ్మదిగా నిజాలు బయటపెడుతోంది. కిరణ్ను తాను చాలా ప్రేమించేదాన్నని, అయితే అతడు మాత్రం శారీరక అవసరాలు తీర్చే వస్తువుగా తనను భావించేవాడని అంటోంది.వారం కిందట(21 ఏప్రిల్) బెంగళూరు శివారులోని బైదరహళ్లి పీఎస్ పరిధిలోని అంజనానగర్లో ఈ దారుణం జరిగింది. తుమకూరుకు చెందిన కిరణ్.. నగరంలోని ఓ మొబైల్ సర్వీస్ సెంటర్లో పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న ప్రేమ(ప్రేరణ)తో ప్రేమలో పడ్డాడు. ఈ క్రమంలో మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిచింది. కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత.. కుర్చీలో కూర్చోబెట్టి ఫ్యాంట్, షర్ట్ ఊడదీసి కళ్లకు గంతలు కట్టింది. అనంతరం కాళ్లు, చేతులూ కట్టేసింది.ఆ సమయంలో కిరణ్ కంగారుపడ్డాడు. అయితే.. పాశ్చాత్య దేశాల్లో ఇలాగే చేస్తారని, తానూ అలా వినూత్నంగా ప్రేమను వ్యక్తం చేస్తానని (Love Proposal) నమ్మించింది. ఆ వెంటనే కిరోసిన్ పోసి నిప్పటించి తన మొబైల్లో రికార్డు చేసింది. స్థానికులు వచ్చేలోపే హాహాకారాలు చేస్తూ కుర్చీలోనే కిరణ్ సజీవదహనమయ్యాడు. ఘటన జరిగినప్పుడు తాను బాత్రూమ్లో ఉన్నానని, పొగ రావడంతో గమనించి బయటకు వచ్చేసరికి కిరణ్ కుర్చీలో కాలిపోయి ఉన్నాడని పోలీసులకు చెప్పింది. అయితే, ఆమె తీరుపై అనుమానంతో పోలీసులు గట్టిగా విచారించారు. దీంతో పథకం ప్రకారమే ప్రేమ అతడిని హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.నార్త్వెస్ట్ డీసీపీ డీఎల్ నగేష్ నేతృత్వంలోని టీం నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారించింది. తొలుత దూరం పెడుతున్నాడనే అతన్ని హత్య చేసిందని అంతా భావించారు. అయితే.. ‘‘కిరణ్ను తాను ఎంతో ప్రేమించానని.. కానీ, అతను తనను ఎంతో అవమానించేవాడని ప్రేమ పోలీసుల వద్ద కన్నీళ్లు పెట్టుకుంది. ‘కిరణ్ నన్ను శారీరక అవసరాల కోసం వాడుకుంటున్నాడన్న విషయం నాకు ఆలస్యంగా అర్థమైంది. పెళ్లి చేసుకుందామని అడిగా. ‘నువ్వు కులం తక్కువదానివి.. మా ఇంట్లో ఒప్పుకోరు’ అనేవాడు. ఈ విషయం ప్రేమించినప్పుడు.. కలిసి తిరిగినప్పుడు తెలియదా? అని గట్టిగా నిలదీశా. దీంతో పెద్దల్ని ఒప్పించి ఎలాగోలా వివాహం చేసుకుంటానన్నాడు. అయితే.. పెళ్లి తర్వాత కూడా కేవలం శారీరక అవసరం కోసమే తనతో ఉంటానని చెప్పేవాడు. ఆ మాట నాతోనే కాదు.. అతని స్నేహితుల వద్ద చెబుతూ నన్ను బూతులు తిట్టేవాడు. ఆ విషయం అతని స్నేహితులు రికార్డ్ చేసి పంపారు. నన్ను వాడుకుంటూ నన్నే తిట్టడం, అవమానించడం ఎంతో బాధించింది. భరించలేకపోయా.. అందుకే నిప్పు పెట్టి చంపేశా’’ అని పోలీసుల ముందు ప్రేరణ కన్నీళ్లతో నిజం ఒప్పుకుంది. -
భార్యకు ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్ వీడియోలు చూసి భర్త ఆత్మహత్య
-
మనవళ్లతో ఆడుకోవాల్సిన వయసులో.. గర్భం దాల్చింది
సిద్దిపేట జిల్లా: శిశువు మరణానికి కారణమైన దంపతులతో పాటు వారికి సహకరించిన ఆర్ఎంపీని రిమాండ్కు పంపించారు. శనివారం హుస్నాబాద్ ఏసీపీ సదానందం, సీఐ శ్రీను కేసు వివరాలు వెల్లడించారు. 2025, జులై 29న మండల పరిధిలోని కేశనాయక్ తండా శివారులోని వాగులో గుర్తు తెలియని పసికందు శవం నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చిందని పంచాయతీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అక్కన్నపేట ఎస్ఐ సీహెచ్ ప్రశాంత్, హుస్నాబాద్ సీఐ శ్రీను విచారణ చేపట్టారు. తండాకు చెందిన బానోతు లక్ష్మికి లేటు వయస్సులో ప్రెగ్నెన్సీ రాగా అప్పటికే ఆమె కూతుర్లకు పెళ్లి కావడంతో విషయం బయటకు తెలిస్తే పరువుపోతుందనే భయంతో దంపతులు ఎవరికి తెలియకుండా అబార్షన్ చేసుకోవాలనుకున్నారు. అయితే కుందానవానిపల్లికి చెందిన ఆర్ఎంపీ వంశీ సహకారంతో అబార్షన్ టాబ్లెట్స్ వేసుకోగా బతికి ఉన్న శిశువు జన్మించింది. కాగా గ్రామంలో తెలిస్తే పరువుపోతుందనే భయంతో శిశువును ఎవరికి తెలియకుండా రహస్యంగా చంపాలని నిర్ణయించుకున్నారు. దీంతో వారి ఇంటి సమీపంలోని కాలువలో పడేయగా శిశువు నీటి ప్రవాహంలో మునిగి చనిపోయినట్టు విచారణలో నిర్దారణ అయిందని తెలిపారు. ఈ కేసులో చనిపోయిన శిశువు మరణానికి కారణమైన తల్లిదండ్రులు బానోతు లక్ష్మి, రాజు, ఆర్ఎంపీ వంశీలను అరెస్ట్ చేశారు. -
తల్లి కుట్ర: చిన్న కొడుకుతో పెద్ద కొడుకు హత్యకు ప్లాన్
మంథనిరూరల్: కన్న కొడుకునే మరోకొడుకుతో అంతం చేయాలని చూసిందో తల్లి.. అర్ధ రాత్రి నిద్రిస్తున్న అన్నపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసేందుకు యత్నించిన ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం లక్కేపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. మంథని మండలం లక్కేపూర్ గ్రామానికి చెందిన కొత్త రఘుపై అతడి తమ్ముడు అనిల్ పెట్రోల్ పోసి నిప్పంటించగా తీవ్రగాయాలు కావడంతో ఎంజీఎంకు తరలించారు. బాధితుడి సోదరి పాలడుగు సౌజన్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం ప్రకారం.. రఘు తండ్రి 15ఏళ్లక్రితం చనిపోయాడు. తల్లి జ్యోతి తన తమ్ముళ్లతో కలిసి గ్రామంలోనే ఉంటున్నారు. తల్లి ప్రవర్తన బాగా లేకపోవడంతో తరచూ పెద్ద తమ్ముడు గొడవ పడుతుండేవాడు. శుక్రవారం రాత్రి సైతం గొడవ జరగడంతో తనకు అడ్డుగా వస్తున్నాడని భావించిన తల్లి.. తన చిన్న కొడుకుతో పెద్ద కొడుకును చంపాలని పథకం వేసింది. ఈ క్రమంలో అంతకుముందే తెచ్చుకున్న పెట్రోల్ను నిద్రిస్తున్న రఘుపై పోసి నిప్పంటించాడు. మంటల తీవ్రతకు అరవడంతో స్థానికులు గమనించి వెంటనే కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. విచారణ జరిపి తన పెద్ద తమ్ముడిపై హత్యాయత్నం చేసి చిన్నతమ్ముడు అనిల్, తల్లి జ్యోతిపై తగిన చర్యలు తీసుకోవాలని సౌజన్య తన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్నట్లు మంథని పోలీసులు తెలిపారు. -
జైల్లో వేసినా.. ఇట్టే మాయమైపోయే దొంగ..
-
1995లో హత్య.. అనూహ్య రీతిలో ఇప్పుడు దొరికిన యూట్యూబర్
న్యూఢిల్లీ: ఓ వ్యక్తి 31 ఏళ్ల క్రితం ఓ బాలుడిని హత్య చేశాడు. అనంతరం బెయిల్పై విడుదలై తప్పించుకు తిరుగుతున్నాడు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు అతడు పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే... నిందితుడి పేరు సలీమ్ ఖాన్. కొన్నేళ్లుగా సలీమ్ వాస్తిక్ పేరుతో జీవిస్తున్నాడు. యూట్యూబ్ ఛానెల్ నడుపుతూ పేరు తెచ్చుకున్నాడు. ‘ఎక్స్ ముస్లిం’గా తనను తాను ప్రచారం చేసుకున్నాడు.గత నెల ఘాజియాబాద్లో ఇద్దరు వ్యక్తులు సలీమ్ వాస్తిక్పై అతని ఇంట్లో కత్తితో దాడి చేశారు. సలీమ్ నాస్తిక్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసులో సలీమ్ వాస్తిక్ గురించి పోలీసులు ఆరా తీశారు. దీంతో అతడు పేరు మార్చుకుని జీవిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సలీమ్ వాస్తిక్ పాత రికార్డులు, వేలిముద్రలు, ఫొటోలను పోలీసులు పరిశీలించారు. అతడు పాత నేరస్తుడని తేల్చారు. అతడికి కిడ్నాప్, దోపిడి కోసం బెదిరింపులు, హత్య ఆరోపణలపై తిహార్ జైలులో జీవిత ఖైదు శిక్ష విధించారని తేల్చారు.1995లో బాలుడి కిడ్నాప్, హత్య ఈ హత్య కేసు 1995, జనవరి 20కి సంబంధించినది. సిమెంట్ వ్యాపారవేత్త కుమారుడు సందీప్ బన్సాల్ ఢిల్లీలో పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబం ఎంతగా వెతికినా అతడి కనుగొనలేకపోయింది. మరుసటి రోజు వ్యాపారవేత్తకు ఫోన్ కాల్ వచ్చింది. అతని కుమారుడిని అపహరించామని, సురక్షితంగా విడుదల చేయాలంటే రూ.30,000 డబ్బు ఇవ్వాలని కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. ఫ్లైఓవర్ సమీపంలో బస్సులో డబ్బు పెట్టాలని, పోలీసులకు సమాచారం ఇస్తే బాలుడిని చంపేస్తామని కిడ్నాపర్లు హెచ్చరించారు. కుటుంబం వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. గోకుల్పురి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.దర్యాప్తు సమయంలో ఆ వ్యాపారవేత్త పొరుగింటి వ్యక్తి కీలక సమాచారం ఇచ్చాడు. ఆ బాలుడు ‘మాస్టర్జీ’ అనే పొడవైన యువకుడితో ఆటోరిక్షాలో వెళ్తున్నట్లు తాను చూశానని తెలిపాడు. దీంతో పోలీసులు సలీమ్ ఖాన్ (ప్రస్తుతం సలీమ్ వాస్తిక్)ను గుర్తించారు. అతను దర్యాగంజ్లోని రామ్జాస్ పాఠశాలలో మార్షల్ ఆర్ట్స్ ఇన్స్ట్రక్టర్గా పనిచేసేవాడు. అతను నేరాన్ని ఒప్పుకొని ముస్తఫాబాద్లోని కాలువ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ బాలుడి మృతదేహం లభించింది.వాస్తిక్కు సహకరించిన అనిల్ అనే వ్యక్తికి కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బాలుడి స్కూల్ బ్యాగ్, టిఫిన్ బాక్స్, గడియారం స్వాధీనం చేసుకొని కోర్టులో సాక్ష్యాలుగా సమర్పించారు. 1997 ఆగస్టు 5న కర్కర్డూమా కోర్టు సలీమ్ ఖాన్ (అలియాస్ సలీమ్ వాస్తిక్) అనిల్ను దోషులుగా తేల్చి జీవిత ఖైదు శిక్ష విధించింది. ఇద్దరూ ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేశారు. 2000, నవంబర్ 24న సలీమ్కు తాత్కాలిక బెయిల్ ఇచ్చారు. తర్వాత అతడు పరారయ్యాడు. సలీమ్ ఆ తర్వాత సలీమ్ వాస్తిక్, సలీమ్ అహ్మద్ పేర్లతో జీవించాడు.తదుపరి 26 సంవత్సరాలు హరియాణాలోని కర్నాల్, అంబాలా ప్రాంతాల్లో దాక్కొని వార్డ్రోబ్ తయారీ పనులు చేశాడు. తర్వాత 2010లో ఘాజియాబాద్ లోని ఓ ప్రాంతానికి మారి మహిళల దుస్తుల దుకాణం ప్రారంభించాడు. సలీమ్ సామాజిక కార్యకర్తగా, యూట్యూబర్గా గుర్తింపు పొందాడు. ముఖ్యంగా ఉగ్రవాదం, మత అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు, వీడియోలతో ప్రసిద్ధి చెందాడు.జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. అతని జీవితం ఆధారంగా ఒక బాలీవుడ్ నిర్మాత బయోపిక్ తీసేందుకు నిర్ణయించాడు. ప్రాజెక్ట్ కోసం రూ.1.5 మిలియన్ అడ్వాన్స్ ఇచ్చారు. అయితే, ఈ ప్రాజెక్ట్ ప్రారంభంకాక ముందే ఇది జరగకముందే సలీమ్ అరెస్ట్ అయ్యాడు. -
ప్రియుడి పాశవికం… తల్లి, కొడుకు హత్య, చివరికి ఉరి!
అన్నానగర్: సేలం జిల్లాలోని ఓమలూరు సమీపంలో ఉన్న పొట్టి యాపురం పంచాయతీలోని కర్తనౌర్ ప్రాంతానికి చెందిన శివన్. ఇతనికి సత్య (33) అనే కుమార్తె, అశోక్ కుమార్ అనే కుమారుడు ఉన్నారు. సత్యకు 15 సంవత్సరాల క్రితం కమలాపురం పంచాయతీలోని మారియమ్మన్ కోవిల్ ప్రాంతానికి చెందిన రాజ్ కుమార్తో వివాహం జరిగింది. వీరికి మహిష(13) అనే కుమార్తె, కిశాంత్ అనే 10 ఏళ్ల కుమారుడు ఉన్నారు. మహిష సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతుండగా, కిశాంత్ 5వ తరగతి చదువుతున్నాడు. ఈ స్థితిలో సత్య తన భర్తతో కలిసి కరుత్తనూరులోని తన తండ్రి భూమిలో చెరకు మిల్లును స్థాపించి, బెల్లం తయారీ వ్యాపారంలో నిమగ్నమై ఉండేది. కరుప్పూర్లోని వెల్లలపట్టి కాలనీ నివాసి, ఆ షోరూమ్లో మేనేజర్గా పనిచేస్తున్న శక్తివేల్కు, సత్యతో అక్రమ సంబంధం ఏర్పడింది. గత 3 నెలలుగా సత్య శక్తివేల్తో సరిగ్గా మాట్లాడడం లేదు. సత్య వేరొకరితో సంబంధం పెట్టుకుని తనతో మాట్లాడడం లేదని శక్తివేల్ కూడా అనుమానించాడు. శక్తివేల్ శుక్రవారం రాత్రి సత్యను చూడటానికి ఆమె ఇంటికి వెళ్లాడు. శక్తివేల్ తలుపు తడుతూనే ఉండడంతో, కొంతసేపటికి సత్య తలుపు తెరిచింది. అతను తీవ్ర ఆగ్రహానికి గురై, ఇంట్లోని దీపాలను ఆర్పేసి, సత్యను, అతని కొడుకు కిశాంత్ను కత్తితో పదేపదే పొడిచి అక్కడినుంచి పారిపోయాడు. ఒంటి నిండా గాయాలతో సత్య కేకలు వేస్తూ తన తండ్రి ఇంటి వైపు పరుగెత్తింది. అరుపులు విని అతని తండ్రి, బంధువులు వెంటనే చూడటానికి పరుగెత్తుకొచ్చారు. ఆ సమయంలో కిశాంత్ అనే ఆ బాలుడు తల, మెడ గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. సత్య కూడా తీవ్ర గాయాలతో ఉంది. వీరిని అంబులెన్స్లో ఓమలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ బాలుడిని పరీక్షించిన వైద్యులు కిశాంత్ మరణించినట్లు ప్రకటించారు. ప్రథమ చికిత్స అనంతరం సత్యను తదుపరి చికిత్స కోసం సేలం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. చికిత్స పొందుతూ సత్య మరణించింది. సమాచారం అందుకున్న వెంటనే ఓమలూరు డీఎస్పీ సంజీవ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరారీలో ఉన్న శక్తివేల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సేలం జిల్లా, కరుపూర్, వెల్లలపట్టిలోని సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో శక్తివేల్ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. దీంతో కరుపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, శక్తివేల్ మృతదేహాన్ని స్వా«దీనం చేసుకుని, పోస్ట్మార్టం కోసం సేలం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. -
హనీట్రాప్ నిందితుడితో ఎమ్మెల్యేకి లింక్?
-
వివాహేతర సంబంధం భర్తకు తెలిసిందని..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కిరాయి హంతకుతో కలిసి భర్తను అంతం చేసేందుకు భార్య పన్నిన కుట్రను పోలీసులు విచ్ఛిన్నం చేశారు. ప్రొద్దుటూరు మండలంలోని లింగాపురం గ్రామానికి చెందిన ఈశ్వర్రెడ్డికి 15 ఏళ్ల క్రితం శిల్పారెడ్డితో వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈశ్వర్రెడ్డి వ్యవసాయం చేస్తుంటాడు. భార్యాభర్తల మధ్య ఇటీవల గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఐదు నెలల క్రితం ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో పని చేస్తున్న సుధీర్ అనే వ్యక్తి శిల్పారెడ్డికి పరిచయమయ్యాడు. కొద్ది రోజుల తర్వాత వారి పరిచయం వివాహేతర బంధంగా మారింది.ఈ విషయం కొన్ని రోజుల క్రితం శిల్పారెడ్డి భర్త ఈశ్వర్రెడ్డికి తెలిసింది. అప్పటి నుంచి వారి మధ్య గొడవలు మరింత పెరిగాయి. దీంతో శిల్పారెడ్డి ఈ విషయాన్ని ప్రియుడు సుధీర్కు తెలిపింది. ‘అలాగైతే నీ భర్తను చంపేద్దాం ఆస్తితోపాటు ఉన్న బంగారు, డబ్బు అంతా మనకే వస్తుందని’ సుదీర్ ఆమెతో అన్నాడు. అందుకు శిల్పారెడ్డి కూడా అంగీకరించింది. ఆమె రాజుపాళెంలోని రౌడీషీటర్ నవీన్ ద్వారా హిందూపురంలో ఉంటున్న లిల్లీ గ్యాంగ్ను ఆశ్రయించింది.తన భర్త ఈశ్వర్రెడ్డిని చంపేయాలని అందుకు ఎంత ఖర్చు అయినా భరిస్తానని శిల్పారెడ్డి వారితో రూ.10 లక్షల సుపారీ కుదుర్చుకుంది. ఈ క్రమంలో రూ.5 లక్షలు ఇవ్వడంతో హిందూపురానికి చెందిన కిరాయి గ్యాంగ్ బుధవారం ప్రొద్దుటూరు చేరుకున్నారు. ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో ఈశ్వర్రెడ్డిని కారుతో ఢీకొట్టి చంపేందుకు ప్రయత్నించగా అతను తప్పించుకున్నాడు. వెంటనే వన్టౌన్ పోలీసులకు ఈ విషయాన్ని తెలిపాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న వన్టౌన్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. వ్యూహం బెడిసికొట్టడంతో నిందితులు.. పోలీసులకు చిక్కారు. భార్య శిల్పారెడ్డి, ప్రియుడు సుధీర్, రౌడీ షీటర్ వినయ్, హిందూపురం కిరాయి ముఠాతో పాటు 10 మందిని అరెస్టు చేశారు. నిందితుల వివరాలను ప్రొద్దుటూరు ఏఎస్పీ విబూకృష్ణ పోలీసులు వెల్లడించారు. -
చెక్బౌన్స్ కేసులో బీజేపీ నేత సుమతి అరెస్ట్
సాక్షి, అనంతపురం: చెక్బౌన్స్ కేసులో కర్ణాటక బీజేపీ నేత సురతాని సుమతి అరెస్ట్ అయ్యారు. గురువారం కోర్టులో హాజరుపరచగా.. 14 రోజుల రిమాండ్ విధిస్తూ అనంతపురం ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణ ఒక్క రోజులో పూర్తయ్యే అంశం కాకపోవడంతో రిమాండ్ విధించినట్టు కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అనంతపురం టూటౌన్ పోలీస్ స్టేషన్లో మాధవి అనే మహిళ ఫిర్యాదు మేరకు సుమతిపై చెక్ బౌన్స్ కేసు నమోదైంది. గతేడాది సెప్టెంబర్ 12న అనంతపురం ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తాజాగా అరెస్ట్ తర్వాత రిమాండ్కు పంపింది. అయితే.. సుమతిపై ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లోని పలు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. విజయవాడ పెనమలూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి ఈ ఏడాది జనవరి 24న అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యింది. ‘వాల్మీకి’ నిధుల గోల్మాల్లో సుమతి పాత్ర!కర్ణాటక వాల్మీకి అభివృద్ధి మండలి నిధుల గోల్మాల్ వ్యవహారం కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ వ్యవహారంలో రూ.80 కోట్లు గోల్మాల్ జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ నిధులను కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు బ్యాంకు ఖాతాలకు మళ్లించినట్టు ఈడీ ఆధారాలను సేకరించింది. దీంతో అప్పటి కర్ణాటక ఎస్టీ సంక్షేమ, క్రీడా శాఖల మంత్రి బి.నాగేంద్ర పదవికి రాజీనామా చేశారు. ఈ నిధుల అక్రమాల్లో అనంతపురం జిల్లాకు చెందిన పలువురి పాత్రపైనా ఈడీ దర్యాప్తు చేసింది. డొల్ల(షెల్) కంపెనీల ఏర్పాటు చేసి బ్యాంకు రుణాలు పొందడం, సబ్సిడీ తీసుకోవడం, చివరకు కంపెనీ నష్టపోయినట్టు లేదా ప్రమాదం జరిగినట్టు చూపించి రుణాలను ఎగవేయడం వంటి అంశాలపై ఈడీ ఆరా తీసింది. కర్ణాటక వాల్మీకి అభివృద్ధి మండలి నిధుల గోల్మాల్ వ్యవహారంలోనూ సుమతి పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చాయి. -
భర్త అక్రమ సంబంధం.. బట్టబయలు చేసిన భార్య!
సాక్షి, నిజామాబాద్: భర్త అక్రమ సంబంధాన్ని భార్య బట్టబయలు చేసిన ఘటన జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కాలేజీ రోడ్డులో జరిగింది. గుత్పకు చెందిన శివ రంజనితో తన భర్త శ్రవణ్ కుమార్.. అక్రమ సంబంధం పెట్టుకున్నాడని బాధిత మహిళా సంధ్య ఆరోపిస్తోంది. ప్రియురాలు శివ రంజనితో భర్త శ్రవణ్ కుమార్ షాపింగ్ చేసి వస్తుండగా భార్య సంధ్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఇద్దరికీ దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది. వారి సెల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు.భర్త శ్రవణ్, అతని ప్రియురాలు శివరంజని ఇంటి ముందు భార్య సంధ్య ఆందోళనకు దిగింది. తాను ఉండగా మరో మహిళ తో అక్రమ సంబంధం పెట్టుకుని దుబ్బ రోడ్డులో సంసారం చేస్తున్నారంటూ బాధిత మహిళ ఆరోపిస్తుంది. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు పోలీసుల కాళ్లు పట్టుకుంది. సంఘటన స్థలానికి వచ్చిన ప్రియురాలి భర్త శ్రీధర్పై శ్రవణ్కుమార్ దాడికి పాల్పడ్డారు. ప్రియురాలి భర్త శ్రీధర్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు యత్నం
రాజానగరం: ప్రేమ పేరుతో వెంటబడి విద్యార్థినిని తీవ్ర వేధింపులకు గురి చేసిన యువకుడు.. చివరకు ఆ యువతిని హత్య చేసేందుకు యత్నించిన తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరంలో చోటు చేసుకుంది. రాజానగరం గైట్ కళాశాలలో ఎగ్జామ్ రాసేందుకు వచ్చిన విద్యార్థినిపై ఓ యువకుడు పెట్రోలక్ష పోశాడు. ఆపై నిప్పంటించేందుకు యత్నించే క్రమంలో తోటి విద్యార్థినులు అడ్డుకుని కేకలు వేయడంతో అక్కడ నుంచి యువకుడు పరార్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విద్యార్థిని ప్రేమను నిరాకరించడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు సదరు యువకుడు. ఆ యువకుడ్ని పట్టుకున్న పోలీసులు.. అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. -
20 మంది నుంచి కోటి వసూలు, సంచలన విషయాలు బయటపెట్టిన అనంతపురం DSP
-
మృగాడి వాంఛాగ్ని.. విస్తుపోయిన పోలీసులు
ప్రశాంత ఉదయం ఓ మృగాడి వాంఛాగ్నితో భయానకంగా మారింది. ఆదరించి అన్నం పెట్టిన కుటుంబానికి తీరని ద్రోహం చేశాడో దుర్మార్గుడు. కామంతో కళ్లు మూసుకుపోయి వాళ్ల బిడ్డను బలిగొన్నాడు. ఐఆర్ఎస్ అధికారి కుమార్తె హత్యాచార ఘటనతో దేశ రాజధాని ఉలిక్కి పడింది. అయితే నిందితుడు రాహుల్ మీనా చెప్పింది విని పోలీసులు సైతం విస్తుపోయారు. సీనియర్ ఐఆర్ఎస్ అధికారి కుమార్తె(22) కేసులో షాకింగ్ విషయం ఒకటి వెలుగు చూసింది. యువతి దారుణ హత్యాచారం కంటే ముందు తన సొంతూరులో మరో మహిళపైనా రాహుల్ అత్యాచారానికి తెగబడ్డాడు. ఆపై విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని ఆమెను బెదిరించాడు. అంటే.. 24 గంటలు గడవక ముందే రెండు రాష్ట్రాల్లో రెండు ఘాతుకాలకు పాల్పడ్డాడన్నమాట. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ ఆల్వార్ జిల్లా రాజ్గఢ్కు చెందిన రాహుల్ మీనా(23) తెలిసినవాళ్ల ద్వారా రికమండేషన్తో ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో పనివాడిగా చేరాడు. సర్వెంట్ క్వార్టర్స్లో అతనికి ఆశ్రయం ఇచ్చారు. ఆ సమయంలో సివిల్స్కు ప్రిపేర్ అవుతున్న అధికారి కూతురిపై కన్నేశాడు రాహుల్. అలా ఎనిమిది నెలల పాటు అదను కోసం ఎదురు చూశాడు. అయితే ఇంటి సరుకుల కోసం ఇచ్చిన డబ్బు గోల్మాల్ చేశాడని.. బయట అధికారి పేరు చెప్పి అప్పులు చేశాడని.. తేలడంతో రాహుల్ను పనిలోంచి తీసేశారు. దీంతో అతను సొంతూరికి వెళ్లిపోయాడు. అయితే అతని తప్పుడు ఆలోచనలు ఆగలేదు. దీంతో మళ్లీ ఢిల్లీకి పయనం అయ్యాడు. ఏప్రిల్ 21న.. పొరుగింట్లో మహిళ ఒంటరిగా ఉండడం గమనించి ఆపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఆమె ఒంటి నిండా పంటి గాట్లు పెట్టి చిత్రహింసలు పెట్టాడు. ఆపై విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి బయల్దేరాడు. భార్య ఒంటిపై గాయాలు గమనించిన ఆ భర్త.. ఈ ఘటనపై ఫిర్యాదు కూడా చేశాడు. ఏప్రిల్ 22న ఉదయం.. ఢిల్లీ చేరుకున్న రాహుల్.. నేరుగా ఆగ్నేయ ఢిల్లీలోని కైలాశ్ హిల్స్ అపార్ట్మెంట్కు వెళ్లాడు. ఇంతకు ముందు పని చేసిన వాడే కావడంతో సెక్యూరిటీ ఇబ్బందులేవీ అతనికి ఎదురు కాలేదు. ఆ టైంలో ఐఆర్ఎస్ అధికారి, ఆయన భార్య జిమ్కు వెళ్లారు. పని మనిషి కోసం తాళం చెవి బయట ఉంచుతారనే విషయమూ రాహుల్కు తెలుసు. తాళం తీసి లోపలికి వెళ్లిన రాహుల్ నేరుగా పైన గదిలో చదువుకుంటున్న ఐఆర్ఎస్ అధికారి కూతురి(22) దగ్గరకు వెళ్లాడు. తన కోరిక తీర్చాలని ఆమెను బతిమాలాడాడు. ఆమె ప్రతిఘటించడంతో గొంతు నులిమి బెడ్ ల్యాంప్, చేతికి దొరికిన వస్తువులతో తల మీద కొట్టాడు. రక్త స్రావంతో స్పృహ కోల్పోయిన ఆమెను మెట్ల మీద నుంచి కిందకు ఈడ్చుకొచ్చాడు. అక్కడ ఆమెపై అత్యాచారం జరిపాడు. ఆపై.. ఆమె వేలి ముద్రలతో లాకర్ తెరవడానికి ప్రయత్నించాడు. అయితే.. వేళ్లకు రక్తం ఉండడంతో అది ఓపెన్ కాలేదు. దీంతో స్క్రూ డైవర్ సాయంతో లాకర్ తెరిచి.. అందులో ఉన్నదంతా తనతో తెచ్చుకున్న బ్యాగులో నింపేసుకున్నాడు. మొబైల్ చార్జర్ కేబుల్తో యువతికి ఉరి వేసి ఊపిరి తీశాడు. యువతితో జరిగిన పెనుగులాటలో ప్యాంట్కు, షూస్కు రక్తపు మరకలు అంటడంతో.. వాటిని అక్కడే పడేసి ఐఆర్ఎస్ అధికారి కొడుకు దుస్తులు, చెప్పులు ధరించి పారిపోయాడు. రక్తపు మడుగులో దుస్తులు లేకుండా విగతజీవిగా పడి ఉన్న బిడ్డను చూసి ఆ అధికారి దంపతులు నిర్ఘాంతపోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్లో ఉదయం 6.28 గంటలకు నిందితుడు అపార్ట్మెంట్లోకి ప్రవేశించి.. సుమారు గంట తర్వాత వేరే దుస్తులు, బ్యాగుతో బయటకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం 15 బృందాలు రంగంలోకి దిగాయి. అయితే.. ఓ ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ద్వారకలో గాలింపు చేపట్టారు. చివరకు బుధవారం సాయంత్రం ఓ లాడ్జిలో దాక్కున్న రాహుల్ను అరెస్ట్ చేశారు. రాహుల్ మీనా ఫోన్లో పోర్న్ కంటెంట్ అడ్డగోలుగా ఉంది. రోడ్లపై వెళ్లే యువతులను అసభ్యంగా ఫొటోలు తీసినట్లు పోలీసులు గుర్తించారు. తనకు పోర్న్ వీడియోలు చూసే అలవాటు ఎక్కువగా ఉందని.. అందుకే ఈ నేరాలకు పాల్పడినట్లు రాహుల్ ఒప్పుకున్నాడు. రాహుల్కు బెట్టింగ్ యాప్లతో పాటు డ్రగ్స్ అలవాటు కూడా ఉందని నిర్ధారించారు. అతని నేర చరిత్ర చిట్టాను మరింత లోతుగా పరిశీలించాలని పోలీసులు భావిస్తున్నారు. -
అర్ధరాత్రి చెత్త వేయడానికి వెళ్లి... ప్రియుడితో పరార్!
యశవంతపుర( కర్ణాటక): భర్త, పిల్లలను వదిలేసి ప్రియుడితో ఉడాయించిన భార్య ఉదంతం బెంగళూరు బాగలగుంటె పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ప్రియాంక, శరత్కుమార్ అనే దంపతులు బాగలగుంటలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. శరత్ పనులకు వెళ్లిన సమయంలో ప్రియాంక కటింగ్ షాపు నిర్వహిస్తున్న ప్రభు వద్దకు వెళ్లి మాట్లాడేది. ఇదే విషయంపై ప్రయాంక, శరత్ల మధ్య గొడవ జరిగేది. ఈ నెల 11న అర్ధరాత్రి సమయంలో ఇంటిలోని చెత్తను తీసుకోని చెత్తకుండీలో వేసేందుకు వెళ్లిన ప్రియాంక తిరిగి రాలేదు. శరత్ బయటకు వెళ్లి ఆరా తీయగా ప్రభు బైక్పై ప్రియాంక వెళ్తున్నట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భోజనంలో తనకు నిద్రమాత్రలు కలిపిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. A woman who left home saying she was going to dispose of garbage has gone missing. Her husband has now made a serious allegation that she may have eloped with a known person. The incident occurred under Bagalagunte police station limits.The husband Sharaath Naik TG has been… https://t.co/xUSeaboUcj pic.twitter.com/OQIMaucxEF— Hate Detector 🔍 (@HateDetectors) April 22, 2026 -
మంజుల నువ్వు నైటీ వేసుకోవడం నాకు ఇష్టం లేదు..!
సాక్షి,కర్ణాటక: బెళగావి జిల్లాలో దారుణం జరిగింది. భార్య నిత్యం నైటీ వేసుకోవడం ఇష్టం లేని భర్త కోపోద్రీక్తుడయ్యాడు. ఇద్దరి మధ్య రగడ పతాకస్థాయికి చేరింది. నైటీ ధరించ వద్దని భార్యకు పదే పదే భర్త సూచించినా పట్టించుకోలేదని ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. దీంతో ఆ మహిళ చావుబతుకుల మధ్య కొట్టామిట్డాడుతోంది. బెళగావి జిల్లా ఖానాపుర తాలూకా నందగుండదహళ్లి గ్రామానికి చెందిన కృష్ణాజీ పాటిల్, మంజుల భార్యాభర్తలు. వీరికి ఎనిమిదేళ్ల క్రితం ఇద్దరికి వివాహమైంది. ఏడాది కాలంగా ఇంట్లో భార్య చీరకు బదులుగా నైటీ, గౌన్ వేసుకుంటూ తిరిగేది. నైటీ వేసుకోవద్దని భార్యతో అప్పుడప్పుడు గొడవపడేవాడని స్థానికులు, పోలీసులు తెలిపారు. ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో పెట్రోలు పోసి నిప్పు అంటించడంతో 80 శాతం మేర శరీరం కాలిపోయిందని, దీంతో చావుబతుకుల మధ్య మంజుల ఆస్పత్రిలో పోరాడుతోంది. ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. -
ఈ రాత్రికే నా భర్తను చంపేయండి.. 10 లక్షల సుఫారి!
ప్రొద్దుటూరు క్రైం : తన వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తనే చంపేందుకు భార్య కిరాయిహంతకులకు సుఫారి ఇచ్చిన ఘటన ప్రొద్దుటూరులో వెలుగు చూసింది. ఈ రాత్రి గడిస్తే కిరాయి హంతకుల చేతిలో భర్త హతమయ్యేవాడు. అయితే పోలీసులు ఈ విషయాన్ని పసిగట్టి సుఫారి గ్యాంగ్ ఆట కట్టించారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. ప్రొద్దుటూరు మండంలోని లింగాపురం గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి కొన్నేళ్ల క్రితం ప్రొద్దుటూరుకు చెందిన మహిళతో వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలున్నారు. భర్త వ్యవసాయం చేస్తుంటాడు. భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారు. ఈ క్రమంలో ఐదు నెలల క్రితం భార్య వైద్యం కోసం ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ ఆమెకు ఆస్పత్రిలో పని చేసే ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి పరిచయమయ్యాడు. ఇలా వారి మధ్య సాన్నిహిత్యం పెరిగి వివాహేతర సంబంధంగా మారింది. భర్తను చంపేందుకు సుఫారి.. తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని అతన్ని ఎలాగైనా హతమార్చాలని భార్య ప్రియుడితో కలిసి వ్యూహ రచన చేసింది. తనకు తెలిసిన వాళ్లు రౌడీలు ఉన్నారని, వాళ్లకు కొంత డబ్బు ఇస్తే పని ముగించేస్తారని ప్రియుడు చెప్పాడు. దీంతో మహిళ అతనికి పెద్ద మొత్తంలో బంగారంతో పాటు డబ్బు కూడా ఇచ్చింది. దీంతో ప్రియుడు రాజుపాళెంలోని ఒక రౌడీషిటర్ను ఆశ్రయించాడు. లింగాపురం వ్యక్తిని హత్య చేస్తే రూ. 10 లక్షలు ఇస్తానని చెప్పాడు. ఇందులో భాగంగా కొంత డబ్బు ఇచ్చి ఎలాగైనా ఆ వ్యక్తిని చంపాలని చెప్పాడు. అతని వద్ద సు«ఫారి తీసుకున్న రౌడీషిటర్ ప్రొద్దుటూరులోనే పాత బస్టాండు సమీపంలో ఉన్న హిందూపురం వాళ్ల వద్దకు వెళ్లాడు. జరిగిన విషయాన్ని వాళ్లకు రౌడీషిటర్ వివరించాడు. వాళ్లకు కొంత డబ్బు ఇవ్వడంతో హిందూపురంలో ఉన్న ప్రధాన కిరాయి గ్యాంగ్ను ప్రొద్దుటూరుకు పిలిపించారు. ప్రొద్దుటూరులో దిగిన హిందూపురం గ్యాంగ్.. లింగాపురం వాసిని చంపేందుకు హిందూపురం నుంచి సుఫారి గ్యాంగ్ బుధవారం సాయంత్రం ప్రొద్దుటూరులో దిగారు. ఈ రాత్రికి లేదా గురువారం ఉదయం అతన్ని చంపాలని పథకం పన్నారు. ఈ విషయం వన్టౌన్ పోలీసులకు తెలియడంతో అలర్ట్ అయ్యారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఏకకాలంలో హిందూపురం గ్యాంగ్, రాజుపాళెం రౌడీషిటర్ను, లింగాపురం గ్రామంలోని భార్యభర్తలు, ప్రియుడ్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిసింది.


