breaking news
Crime News
-
ప్రియుడి మోజులో పడి కన్నకొడుకునే చంపేసిన తల్లి!
హైదరాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని రెండేళ్ల కుమారుడిని హత్య చేసిన తల్లి, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సోమవారం కీసర పోలీస్ స్టేషన్లో ఏసీపీ చక్రపాణి వివరాలు వెల్లడించారు. సిద్దిపేట జిల్లాకు చెందిన స్వామి భార్య జ్యోతి, కుమారుడితో కలిసి చీర్యాలలోని ఈడెన్ గార్డెన్లో ఉంటున్నారు. జ్యోతికి తుర్కపల్లికి చెందిన నవీన్తో వివాహేతర సంబంధం ఏర్పడింది.గత నెల 29న నవీన్.. జ్యోతి ఇంటికి వచ్చాడు. తమ వివాహేతర సంబంధానికి కుమారుడు అడ్డుగా ఉన్నాడని జ్యోతి సహకారంతో నవీన్ బాలుడిని నేలపై బలంగా కొట్టగా మృతిచెందాడు. బాలుడు ప్రమాదవశాత్తు మంచంపై నుండి పడిపోవడం వల్ల మృతిచెందాడని నిందితురాలు భర్తను నమ్మించింది. ఆ తరువాత భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖననం బాలుడి మృతదేహాన్ని వెలికితీసి ఫొరెన్సిక్ పరీక్షలు చేశారు. పోస్టుమార్టం నివేదిక, ఇతర సాక్షాల ప్రకారం తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కీసర సీఐ ఆంజనేయులు, ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, హరిప్రసాద్ పాల్గొన్నారు. -
రేపే వివాహం.. నిప్పులు పోసిన పోకిరీ
కర్ణాటక: మైసూరు జిల్లాలోని టి.నరసిపుర తాలూకాలోని కెంపయ్యన హుండి గ్రామంలో ఘోర దుర్ఘటన జరిగింది. తల్లిదండ్రులు, కూతురు మరణ వాంగూల్మం రాసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. శివన్న–నాగరత్న దంపతులు, వారి కుమార్తె రక్షిత (20) మృతులు. అదే గ్రామానికి చెందిన ఉల్లాస్ గౌడ అనే వ్యక్తి ఈ కుటుంబాన్ని వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. విలన్.. ఉల్లాస్గౌడ శివన్న, నాగరత్న దంపతులు కూతురు రక్షితకు పెళ్లి సంబంధం కుదిర్చారు. ఈ నెల 24న ఆ యువతి వివాహానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈలోగా ఉల్లాస్గౌడ రక్షితను ప్రేమించానని, తానే పెళ్లి చేసుకుంటానని ఆమె తల్లిదండ్రులకు చెప్పాడు. కానీ రక్షిత, ఆమె తల్లిదండ్రులు అతనిని అంగీకరిచలేదు. కానీ ఆ యువకుడు రక్షితను వెంటాడుతూ వేధిస్తున్నాడు. రక్షితతో పెళ్లి నిశ్చయమైన యువకునికి చెడు సందేశాలను పంపసాగాడు.తాను ఆమెను ప్రేమించానని, నీవు పెళ్లి చేసుకోరాదని బెదిరించాడు. గ్రామంలోనూ ఇదే మాదిరిగా ప్రచారం చేయసాగాడు. దీంతో పెళ్లి రద్దయ్యే పరిస్థితి ఏర్పడింది. తీవ్ర ఆవేదన చెందిన రక్షిత, ఆమె తల్లిదండ్రులు ఆదివారం రాత్రి ఇంట్లో ఉరివేసుకున్నారు. స్థానికులు సోమవారం ఉదయం గుర్తించారు. పెళ్లి వేడుకతో కళకళలాడాల్సిన ఇల్లు స్మశానంలా ఏడుపులతో మార్మోగింది. వరుణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. జిల్లా ఎస్పీ మల్లికార్జున బాలాదండి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు వారి డెత్నోట్ను స్వా«దీనం చేసుకుని విచారణ చేపట్టారు. ఉల్లాస్గౌడను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరారు. -
ఛాతీపై కూర్చుని.. చున్నీతో గొంతు బిగించి
హైదరాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను దారుణంగా హత్య చేసింది ఓ భార్య. ఆపై ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం చేసి దొరికిపోయింది. ఎల్బీనగర్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన పోలీసుల వివరాల మేరకు.. మహబూబాబాద్ జిల్లా కొరవి మండలం తట్టుపల్లికి చెందిన బోడ నర్సింగ్ (33)కు స్వరూపతో 2008లో వివాహమైంది. ఇటీవల నర్సింగ్ ఎల్బీనగర్ ఎనీ్టఆర్ నగర్లో అద్దె ఇల్లు తీసుకుని కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. స్వరూపకు సొంత గ్రామానికి చెందిన మోహన్తో వివాహేతర సంబంధం ఉంది. ఇది నర్సింగ్కు తెలియడంతో తీవ్రంగా గొడవలు జరుగుతున్నాయి. పెద్ద మనుషులు పంచాయితీ కూడా అయింది. 3 రోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నర్సింగ్ను అంతమొందించాలని స్వరూప పథకం వేసింది. శనివారం కూడా గొడవ జరిగింది. అయితే, తర్వాత భర్తతో ఏకాంతంగా ఉన్న సమయంలో అతడి ఛాతీపై కూర్చొని చున్నీతో గొంతు బిగించి హత్య చేసింది. మృతదేహాన్ని మంచానికి చున్నీతో కట్టి ఆత్మహత్యగా నమ్మించబోయింది. డయల్ 100కు ఫోన్ చేయగా పోలీసులు వచ్చారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. ఈలోగా గోనర్సింగ్ మృతిపై అనుమానంతో అతడి అన్న బిచ్యానాయక్ ఎల్బీనగర్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు లోతుగా ఆరా తీయడంతో పాటు.. శవ పరీక్ష నివేదికతో నర్సింగ్ది ఆత్మహత్య కాదని తేలింది. కాగా, స్వరూప భర్తను చంపాక ప్రియుడికి ఫోన్ చేసి పారిపోవాలని చూసింది. పోలీస్లు ప్రత్యేక బృందంతో అల్కాపురి వద్ద ఆమెను అరెస్టు చేశారు. విచారణలో నేరాన్ని అంగీకరించింది. సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నర్సింగ్ దంపతుల పెద్ద కూతురు వరంగల్ గురుకులంలో పదో తరగతి పూర్తి చేసింది. చిన్న కూతురు హయత్నగర్లో 8వ తరగతి చదువుతోంది. -
అనకాపల్లి పరవాడ ఫార్మా సిటీలో ఘోర ప్రమాదం
సాక్షి, అనకాపల్లి: పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ్ ఎనర్జీ పరిశ్రమలో ఈ వేకువ జామున భారీ పేలుడు సంభవించింది. భారీగా మంటలు చెలరేగడంతో ఇద్దరు కార్మికులు సజీవ దహనం అయ్యారు. మంటల్లో చిక్కుకున్న మరికొందరిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పలువురికి తీవ్రగాయాలు కావడంతో మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది.మృతి చెందినవాళ్లను.. వెంకటేశ్, త్రినాథ్లుగా గుర్తించారు. ఈ ఇద్దరూ అచ్యుతాపురం వాసులుగా తెలుస్తోంది. . ప్రమాద సమయంలో విధుల్లో ఉన్న కార్మికులు తీవ్రంగా గాయపడగా, సహచరులు, అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, జిల్లా అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. రెండు ఫైరింజన్లను మంటల్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాయి. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మంట్లలో మరికొందరు చిక్కుకుని ఉంటారని భావించి.. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.పేలుడుకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించారా? లేదంటే సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనతో ఫార్మాసిటీ పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. అధికారులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. -
తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రంగంపేట మండల పరిధిలోని వడిశలేరు-రంగంపేట మధ్య ప్రయాణిస్తున్న టాటా ఏస్ వాహనం టైర్ పంచర్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు.సామర్లకోట ప్రాంతానికి చెందిన కూలీలు బాపట్ల కొల్లూరులో నిర్మాణ పనులకు వెళ్లేందుకు టాటా ఏస్ వాహనంలో బయలుదేరారు. వడిశలేరు-రంగంపేట మధ్యకు చేరుకోగానే వాహనం టైర్ ఒక్కసారిగా పంచర్ కావడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో వాహనం రోడ్డుపై బోల్తా పడింది.ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో వాహనంలో ప్రయాణిస్తున్న బాబు, మురమర్ల రాజు, కాకాడ రాజు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా సామర్లకోటకు చెందిన వాళ్లుగా గుర్తించారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.ఉదయం పనుల కోసం బయలుదేరిన కూలీలు ప్రమాదానికి గురవడంతో సామర్లకోట ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. -
బాసర ఆలయంలో భారీ చోరీ
సాక్షి, నిర్మల్: బాసరలోని ప్రసిద్ధ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో చోరీ ఘటన కలకలం రేపింది. ఆలయ ప్రాంగణంలోని మొదటి అంతస్తులో ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయాన్ని లక్ష్యంగా చేసుకున్న గుర్తుతెలియని దుండగులు వెండి కిరీటం, హుండీని అపహరించారు. ఆలయ తలుపులు పగులగొట్టి మరీ చోరీకి పాల్పడటంతో భక్తులు, ఆలయ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సోమవారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన మూడు సీసీ కెమెరాలకు ముందుగా గుడ్డలు కప్పిన దుండగులు.. అనంతరం మహంకాళి ఆలయం తలుపులు ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అమ్మవారికి అలంకరించిన వెండి కిరీటంతో పాటు హుండీని కూడా ఎత్తుకెళ్లినట్లు అధికారులు గుర్తించారు.మంగళవారం ఉదయం అభిషేక కార్యక్రమాల కోసం ఆలయ సిబ్బంది వెళ్లగా చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. తలుపులు పగిలి ఉండటంతో అనుమానం వచ్చిన సిబ్బంది లోపల పరిశీలించగా వెండి కిరీటం, హుండీ కనిపించకపోవడంతో వెంటనే ఆలయ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం అధికారులు పోలీసులను అప్రమత్తం చేశారు.ఘటన సమయంలో ఆలయ భద్రత కోసం ఆరుగురు హోం గార్డులు రాత్రి విధుల్లో ఉన్నట్లు సమాచారం. అయినప్పటికీ దుండగులు చాకచక్యంగా సీసీ కెమెరాలను నిర్వీర్యం చేసి చోరీకి పాల్పడటం భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సహాయంతో పరిశీలనలు నిర్వహించారు. సీసీ కెమెరాల ఫుటేజీ, పరిసర ప్రాంతాల దృశ్యాలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ప్రస్తుతం కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చోరీకి పాల్పడిన వారిని త్వరలోనే గుర్తిస్తామని పోలీసులు తెలిపారు. రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొందిన బాసర ఆలయంలో జరిగిన ఈ ఘటన భక్తుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. -
అమ్మా.. నా మనసు విరిగిపోయింది!
సాక్షి, విశాఖపట్నం: ముసోరీలో అనుమానాస్పద స్థితిలో మరణించిన తెలుగు టెకీ రాధా గాయత్రి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె మరణంపై ఇప్పటికే భర్త శ్రీచరణ్పై హత్య కేసు నమోదైన వేళ.. ఇప్పుడు రాధా గాయత్రి తన తల్లితో మాట్లాడినట్లు చెబుతున్న ఓ ఆడియో క్లిప్ బయటకు రావడం సంచలనంగా మారింది. అందులో భర్త ప్రవర్తనపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.ఉత్తరాఖండ్లోని ముసోరీ హిల్ స్టేషన్లో ఉన్న ఓ హోటల్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన తెలుగు సాఫ్ట్వేర్ ఉద్యోగిని రాధా గాయత్రి కేసు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు భర్త శ్రీచరణ్పై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగా.. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఆడియో క్లిప్ కేసులో మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.ఆడియోలో రాధా గాయత్రి తన తల్లితో మాట్లాడుతూ.. “నా మనసు పూర్తిగా విరిగిపోయింది.. నా మీద అనుమానం పెంచుకుంటూ, నా గురించి చెడుగా ప్రచారం చేస్తున్నాడు. నేను ఏదైనా తప్పు చేస్తే నేరుగా అడగమని మా అత్తయ్యతో కూడా చెప్పాను. నేను ఇక నా భర్తతో మాట్లాడదలుచుకోలేదు. ఏమైనా ఉంటే మా అమ్మవాళ్లతో మాట్లాడమని ఆమెతో అన్నాను. ఇన్నాళ్లు చాలా ఓపిక పట్టాను.. కానీ అన్ని హద్దులు దాటిపోయాడు” అంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లు వినిపిస్తోంది.తల్లి సంచలన ఆరోపణలురాధా గాయత్రి తల్లి సత్యవతి సంచలన ఆరోపణలు చేశారు. తన కుమార్తె మరణానికి భర్త శ్రీచరణ్నే కారణమని ఆమె మరోసారి ఆరోపించారు. పెళ్లైనప్పటి నుంచి రాధా గాయత్రిపై తీవ్ర అనుమానం పెంచుకున్న శ్రీచరణ్.. ఆమె బ్యాగులో జీపీఎస్ ట్రాకర్ పెట్టి ఎక్కడికి వెళ్తుందో గమనించేవాడని తెలిపారు. ఆఫీస్కు వెళ్లినప్పటికీ తరచూ వీడియో కాల్స్ చేస్తూ నిఘా పెట్టేవాడన్నారు. “బెడ్పై ఎవరు పడుకున్నారో చూపించు” అంటూ వీడియో కాల్స్ చేసి వేధించేవాడని ఆవేదన వ్యక్తం చేశారు.తన కుమార్తెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, అయినప్పటికీ ఆమె మృతిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కలిసి మద్యం సేవించినట్లు అసత్య కథనాలు సృష్టించి, పోలీసులను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అంతేకాకుండా భార్యాభర్తలు సన్నిహితంగా ఉన్న వ్యక్తిగత ఫొటోలను అర్ధరాత్రిళ్లు తమకు పంపడం ఏమిటని ప్రశ్నించిన సత్యవతి.. తన కుమార్తెను శ్రీచరణ్ హత్య చేశాడని ఆరోపిస్తూ పూర్తిస్థాయి విచారణ జరిపి నిజాలు వెలికితీయాలని డిమాండ్ చేశారు.తండ్రి అనుమానాలుఇదిలా ఉండగా, తన కుమార్తె మరణం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని రాధా గాయత్రి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పెళ్లైనప్పటి నుంచి శ్రీచరణ్ మానసిక వేధింపులకు గురిచేసేవాడని, ఆమెపై నిఘా పెట్టేందుకు బ్యాగులో ట్రాకర్ కూడా అమర్చాడని ఆరోపించారు. భర్త వేధింపుల గురించి గాయత్రి గతంలో పలుమార్లు తమకు చెప్పిందని వివరించారు.అంతేకాకుండా, రాధకు లోబీపీ సమస్య ఉందంటూ ప్రచారం చేస్తున్నారని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగిన రోజున శ్రీచరణ్ రక్త నమూనాలు ఎందుకు సేకరించలేదని ప్రశ్నించిన ఆయన.. హోటల్లో మత్తు పదార్థాలు కలిపిన మద్యం ఇచ్చారా? అనే కోణంలో కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.ఘటనకు ముందు 48 గంటల కాల్ డేటా, ఆర్థిక లావాదేవీలు, హోటల్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాలని కోరిన కుటుంబ సభ్యులు.. కేసును ఫోరెన్సిక్ ఆధారాలతో పూర్తిస్థాయిలో విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తన భార్య మృతికి..తనకు ఎలాంటి సంబంధం లేదని శ్రీచరణ్, అతని కుటుంబం వాదిస్తోంది.రాధా గాయత్రి తండ్రి ఫిర్యాదు, తాజాగా బయటకు వచ్చిన ఆడియో క్లిప్ నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో అసలు నిజాలు ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
రోడ్డు దాటుతుండగా విషాదం..!
వర్గల్(గజ్వేల్): బైక్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు గృహిణిని కబళించింది. ఈ దుర్ఘటన శనివారం రాత్రి మండలంలోని గౌరారం వద్ద రాజీవ్రహదారిపై చోటు చేసుకుంది. గజ్వేల్ రూరల్ సీఐ రవిరాజు, స్థానికులు కథనం ప్రకారం... గౌరారం గ్రామానికి చెందిన పూదరి వెంకటేశ్గౌడ్ ప్రైవేటు ఉద్యోగి. ఆయనకు భార్య మంజుల(37), పద్మాలుగేళ్లలోపు అనీశ్గౌడ్, శాంక్గౌడ్ ఇద్దరు కుమారులున్నారు. శనివారం రాత్రి గ్రామంలోని తమ బంధువుల ఇంటికి వెళ్లి, నడుచుకుంటూ ఇంటికి తిరిగొస్తున్నది. మామిడ్యాల కమాన్ వద్ద రోడ్డు దాటుతుండగా చేర్యాలకు చెందిన కాత అజయ్ బైక్పై హైదరాబాద్ వైపు నుంచి మితిమీరిన వేగంతో వెళ్తూ ఆమెను ఢీకొట్టాడు. ఈ ఘటనలో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందింది. అప్పటివరకు బంధుగణంతో, కుటుంబీకులతో మాట్లాడుకుంటూ సంతోషంగా గడిపిన మంజుల కొద్ది సేపట్లోనే మృతిచెందడంతో కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు చేశారు. -
NEET రీ-ఎగ్జామ్.. వెలుగులోకి భారీ కుంభకోణం!
అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించిన నీట్-యూజీ రీ-ఎగ్జామ్లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. అభ్యర్థులకు బదులుగా వేరొకరు పరీక్ష రాస్తూ పట్టుబడిన వ్యవహారాలు సంచలనంగా మారాయి. ఘటనపై అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టగా, ఒక్క బీహార్లోనే ఇప్పటివరకు 30 మందిని అరెస్ట్ చేశారు. ఈ మోసం వెనుక ఉన్న అసలు సూత్రధారులు, నెట్వర్క్ను గుర్తించే పనిలో దర్యాప్తు సంస్థలు నిమగ్నమయ్యాయి.బిహార్లో నీట్ రీటెస్ట్-2026 సందర్భంగా భారీ అక్రమాలు వెలుగు చూశాయి. పరీక్ష రాస్తున్న వారి స్థానంలో ఇతరులు హాజరయ్యిన ఘటనలు బయటపడటంతో అధికారులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో మొత్తం 30 మంది అరెస్టు కాగా, అందులో 9 మంది నకిలీ అభ్యర్థులుగా పరీక్ష రాస్తూ పట్టుబడటం కలకలం రేపింది. లఖిసరాయ్ జిల్లాలో పలు పరీక్ష కేంద్రాల్లో జరిగిన తనిఖీల్లో ఈ మోసం బయటపడింది. కేఆర్కే హైస్కూల్ పరీక్ష కేంద్రం నుంచి ఒకరు, కేంద్రీయ విద్యాలయం నుంచి ఏడుగురు, హసన్పూర్ స్కూల్ నుంచి మరో వ్యక్తి.. నకిలీగా పరీక్ష రాస్తూ పట్టుబడ్డారు. వీరంతా వేరే అభ్యర్థుల స్థానంలో పరీక్షకు హాజరైనట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనతో పాటు మరో 21 మందిని కూడా అనుమానితులుగా అరెస్టు చేశారు. వీరి పాత్ర ఈ మోసపూరిత నెట్వర్క్లో ఉందా? అనే కోణంలో అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు. మొత్తం అరెస్టుల సంఖ్య 30కి చేరగా.. ఆ సంఖ్య పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు.అరెస్టయిన వారిని ఎస్డీఎం ప్రభాకర్ కుమార్, ఎస్డీపీవో శివమ్ కుమార్ పర్యవేక్షణలో ప్రశ్నిస్తున్నారు. విచారణలో వెలుగులోకి వస్తున్న సమాచారం ఆధారంగా ప్రత్యేక పోలీసు బృందాలు సంబంధిత ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నాయి. ఈ మోసానికి వెనుక పెద్ద నెట్వర్క్ ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.లఖిసరాయ్ జిల్లా మేజిస్ట్రేట్ శైలేంద్ర కుమార్, ఎస్పీ ప్రేరణ కుమార్ ఈ కేసు విచారణను స్వయంగా పర్యవేక్షిస్తున్నారని అధికారులు తెలిపారు. మరింత మంది ఈ రాకెట్లో భాగమై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే NEET పరీక్షలో ఇలాంటి మోసాలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. పూర్తి నెట్వర్క్ను బయటకు తీసేందుకు విచారణ కొనసాగుతుండగా, మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై పరీక్ష నిర్వహణ సంస్థ ఎన్టీఏ స్పందించాల్సి ఉంది. -
చివరి క్షణాల్లో.. ‘అన్నీ సర్దేసి’ వెళ్లిపోతున్నారు!
ఆత్మహత్యకు ముందు ఆస్తుల పంపకం, అప్పుల వివరాలు, బ్యాంక్ ఖాతాల వివరాలు.. అంతెందుకు ఏటీఎం, ఫోన్పే పిన్ల సమాచారం.. డెత్నోట్లో రాసేసి మరీ వెళ్లిపోతున్న ఘటనలు ఇటీవల తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. ఆఖరికి అంత్యక్రియల ఖర్చులు కూడా కుటుంబమో, బంధువులకు భారం కాకూడదనే ఆలోచనతో చివరి క్షణాలకు ముందే అన్నీ ముందుగానే సర్దేసి వెళ్తున్నారు. ఈ మధ్యకాలంలో ఈ తరహా కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి!. ఎందుకిలా?.. మానసిక నిపుణులు ఏమంటున్నారంటే..చిత్తూరు జిల్లాలోని బంగారెడ్డి పల్లి ప్రాంతంలో దాము అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. భార్య అనారోగ్యం కారణంగా కుటుంబం ఆర్థికంగా కుంగిపోయిన పరిస్థితుల్లో ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మరణానికి ముందు ఆయన ఆస్తులు, అప్పుల వివరాలతో పాటు ఏటీఎం పిన్ నెంబర్ వంటి వ్యక్తిగత ఆర్థిక సమాచారాన్ని కూడా డెత్నోట్లో నమోదు చేసినట్లు సమాచారం. దానిని టీవీ స్క్రీన్కు అంటించారాయన.ఇలాంటి ఘటన ఒక్కటే కాదు. ఇటీవల నెల్లూరు జిల్లాలో రిటైర్డ్ టీచర్ దంపతులు కొడుకుతో సహా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కూడా చర్చనీయాంశమైంది. తాము లేకుండా చెట్టంత కొడుకు బతకలేడనే ఉద్దేశంతో అతన్ని కూడా వాళ్లు తమ వెంట తీసుకెళ్లారు. కుటుంబానికి భారంగా మారకూడదనే ఆలోచనతో వారు అంత్యక్రియల ఖర్చుల కోసం ముందుగానే ఏర్పాట్లు చేయడం, కొంత ఆస్తిని దానం చేయడం, బ్యాంక్ లావాదేవీల వివరాలు సైతం రాసి పెట్టడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి.విజయవాడ సహా కొన్ని ఇతర ప్రాంతాల్లోనూ గతంలో ఇలాంటి కేసులు వెలుగులోకి వచ్చాయి. నార్త్ ఇండియాలోనూ ఈ తరహా ఘటనలు నమోదవుతుండటంతో ఇది ఒక “కొత్త ధోరణి”గా మారుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది.ఈ ఘటనల్లో ఒక సాధారణ మానసిక నమూనా కనిపిస్తోంది.. తాము లేకపోయినా కుటుంబం/తమకు మేలు చేసిన వాళ్లు ఇబ్బంది పడకూడదు అనే భావన. ఇదే ఆలోచనలో వ్యక్తులు తమ ఆర్థిక వ్యవహారాలను చివరి క్షణాల్లో పూర్తిగా క్రమబద్ధం చేసి వెళ్తున్నారు. ఇది బయటకు చూసేందుకు బాధ్యతగా కనిపించినా, నిపుణులు మాత్రం దీన్ని తీవ్రమైన మానసిక ఒత్తిడికి సంకేతంగా భావిస్తున్నారు.ఈ తరహా ధోరణిపై మానసిక నిపుణులు స్పందిస్తూ.. ఇలాంటి పరిస్థితులు సాధారణంగా దీర్ఘకాలిక నిరాశ (depression), తీవ్ర ఆందోళన (anxiety), “నిరాశాత్మక ఆలోచనా విధానం” (hopeless thinking pattern) వల్ల వస్తాయి. సమస్యలకు పరిష్కారం కనిపించకపోవడం, అప్పుల భారం, అనారోగ్యం, కుటుంబ బాధ్యతల ఒత్తిడి.. ఇవన్నీ కలిసి వ్యక్తిని “తప్పించుకోవడమే మార్గం” అనే భావన వైపు నెట్టేస్తాయని హెచ్చరిస్తున్నారు.ఇది ఒక రకమైన కాగ్నిటివ్ టన్నెల్ విజన్ అని నిపుణులు చెబుతున్నారు. అంటే వ్యక్తి తన సమస్యలకు ఒక్కటే పరిష్కారం కనిపించడం, ఇతర సహాయ మార్గాలు కనిపించకపోవడం. ఈ దశలో సహాయం కోరే అవకాశం ఉన్నా, దాన్ని ఉపయోగించలేని స్థితి ఏర్పడుతుందని వారు వివరిస్తున్నారు.నిపుణుల హెచ్చరిక ఏంటంటే.. ఆత్మహత్యకు ముందు ఇలా అన్ని ఏర్పాట్లు చేసి వెళ్లిపోవడం బయటకు బాధ్యతగా కనిపించినా, వాస్తవానికి అది తీవ్రమైన మానసిక సంక్షోభానికి చివరి సంకేతమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఈ దశలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, సమాజం త్వరగా స్పందించడం చాలా కీలకమని సూచిస్తున్నారు.ఆర్థిక సమస్యలు, అనారోగ్యం, జీవన ఒత్తిడులు ఏవైనా కావొచ్చు. కానీ, వాటికి పరిష్కారం జీవితం ముగించడం కాదు. “అన్నీ సర్దేసి వెళ్లిపోవడం” వెనుక కనిపించని మానసిక పోరాటం ఉంటుంది. ఆ సంకేతాలను ముందుగానే గుర్తించి సహాయం అందిస్తే అనేక ప్రాణాలను కాపాడవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
బిల్డర్ను మోసం చేసిన ముగ్గురు మహిళలు
బంజారాహిల్స్: ఒక నకిలీ విల్డీల్ను సృష్టించి అసలు నిజాన్ని దాచిపెట్టి నకిలీ పత్రాల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసిన ముగ్గురు మహిళలపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్లోని వంశీరామ్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ సంస్థతో ఎం.కాంతరాజులు వారసులైన ముగ్గురు మహిళలు 2020లో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. భూమిని డెవలప్మెంట్ కోసం బిల్డర్కు ఇచ్చారు. అయితే ముగ్గురు మహిళలు కుట్రపూరితంగా వ్యవహరించారని ‘వంశీరామ్’సంస్థ ప్రతినిధి విశ్వరాజ్ మోహన్ కోర్టును ఆశ్రయించడంతో ఈ మోసం వెలుగుచూసింది. నకిలీ విల్డీడ్ సృష్టించి నిజాన్ని దాచి, ఆ నకిలీ పత్రాల ఆధారంగా 2025 జనవరిలో మూడో వ్యక్తి కి రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. నిందితులు అక్రమంగా లాభపడ్డారని వంశీరామ్ బిల్డర్స్ కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో సంతోష్కుమారి, సద్గుణ, అనురాధ అనే ముగ్గురు మహిళలపై చీటింగ్, పోర్జరీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భర్త వద్ద పనిచేసే యువకునితో అక్రమ సంబంధం..!
ఉన్నంతలో కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. ఆమె కాపురం బాగుండాలని దేవుళ్లను ప్రార్థించారు. కానీ కూతురు మాత్రం ఖతర్నాక్గా మారింది. భర్త వద్ద పనిచేసే యువకునితో అక్రమ సంబంధం పెట్టుకుని భర్తనే పరలోకానికి పంపింది. ఈ సంఘటనతో ఆమె, ప్రియుడు కటకటాల్లో ఉన్నారు. బెళగావి జిల్లా హుక్కేరి వద్ద అనైతిక బంధం, రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్త, రిటైర్డు జవాన్ సందీప్ మంజరగి (46) ని సెలైన్లో విషం ఎక్కించి హతమార్చిన భార్య సుమ కేసులో మరో విషాదం చోటుచేసుకుంది. ఈ పరిణామాలతో సమాజంలో పరువు పోయిందని తీవ్ర మనోవేదనకు గురైన సుమ తల్లి మహాదేవి (57) ఆత్మహత్య చేసుకుంది. కూతురి నిర్వాకం గురించి ముమ్మరంగా ప్రచారం సాగుతుండడం చూసిన తల్లి ఆ రోజు ఇంటి నుంచి బయటకు కూడా రావడం లేదు. తలెత్తుకోలేకపోతున్నామని కుంగిపోయింది. శనివారంనాడు హుక్కేరి తాలూకా ఘోడ గేరి గ్రామంలోని ఇంట్లో మహాదేవి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -బెంగళూరు -
బిస్కెట్లలో ఎలుకల మందు కలిపి..
ఖమ్మంక్రైం: సరైన ఉపాధి లేదు, వచ్చే డబ్బు సరిపోక ఇల్లు గడవడం ఇబ్బంది అవుతోంది.. స్వగ్రామం వెళ్లి కలోగంజి తాగుదాం... ఆ గ్రామం కూడా నగరానికి సమీపంలో ఉన్నది కదా అని ఓ వ్యక్తి తన భార్యకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించడమే పాపమైంది. అత్తగారింటికి వెళ్లడం ఇష్టం లేని ఆమె భర్తపై కక్ష సాధించడానికి బిస్కెట్లలో ఎలుకల మందు కలిపి తన ఇద్దరు కుమారులకు తినిపించి ఉసురు తీసింది. ఆపై తానూ ఎలుకల మందు మింగి ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి ఏడో డివిజన్ గుర్రాలపాడుకు చెందిన బొబ్బల లింగరాజు–స్వాతి దంపతులకు కుమారులు వేదిక్కుమార్(7), తనీష్(5) ఉన్నారు. లింగరాజు ఖమ్మంలోని ఓ సెల్ పాయింట్లో పనిచేస్తూ కుటుంబంతో కలిసి ఖమ్మం గాంధీనగర్లో నివాసముంటున్నాడు. ఇటీవల ఆయన పనిచేస్తున్న షాప్ సరిగా నడవక ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో తిరిగి గుర్రాలపాడుకు వెళ్దామని భార్య స్వాతితో చెప్పాడు. కానీ ఆమె మాత్రం ‘మీ ఊరికి రాను, ఇక్కడే ఉందాం’అంటూ చెప్పడంతో ఇద్దరి మధ్య కలహాలు మొదలయ్యాయి. ఈక్రమాన లింగరాజు మాత్రం స్వగ్రామానికి వెళ్లక తప్పదని చెబుతూ ఆదివారం సామాన్లు సర్దాలని సూచించి ఇతర ఏర్పాట్ల కోసం శనివారం గుర్రాలపాడు వెళ్లాడు. దీంతో స్వాతి తట్టుకోలేక ఎలుకల మందు తీసుకొచ్చి బిస్కెట్లలో కలిపి తన పిల్లలిద్దరికీ తినిపించింది. ఆపై తాను కూడా మందు మింగింది. ఏం జరిగిందో చెప్పకుండా...బిస్కెట్లు తిన్నాక కాసేటికి పెద్దకుమారుడైన వేదిక్ తనకు వాంతులు అవుతున్నాయని లింగరాజుకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆయన ఖమ్మం వచ్చి తొలుత మెడికల్ షాపులో ఓఆర్ఎస్ ప్యాకెట్ తెచ్చి తాగించాడు. అయినా పరిస్థితి మెరుగుపడకపోగా వేదిక్ అపస్మారక స్థితిలోకి వెళ్తుండడంతో పిల్లలను వైద్యుడి వద్దకు తీసుకెళ్లాడు. ఆ సమయంలో స్వాతి, చిన్నకుమారుడైన తనీష్ బాగానే ఉండగా, ఎలుకల మందు తినిపించిన విషయాన్ని ఆమె భర్తకు చెప్పలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లిన కొద్దిసేపటికే వేదిక్ మృతి చెందాడు, అనంతరం లింగరాజు ఇంటికి వచ్చి భార్యను నిలదీయగా అప్పుడు పిల్లలకు బిస్కెట్లలో ఎలుకల మందు కలపడమే కాక తాను కూడా మింగానని చెప్పింది. ఈ మేరకు ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా తనీష్ శనివారం అర్ధరాత్రి దాటాక మృతి చెందాడు. ఇక స్వాతికి చికిత్స కొనసాగుతుండగా, పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. -
చిత్తూరులో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుకేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి ఆత్మహత్యకు అనారోగ్య సమస్యలు, ఆర్థిక పరిస్థితులే కారణమని స్థానికులు చెబుతున్నారు. అయితే, పిల్లలతో సహా అందరూ మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా బంగారెడ్డి పల్లె గ్రామానికి దాము, నిర్మల ఇద్దరూ భార్యభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు, అయితే, నిర్మలకు అనార్యోగ సమస్యలు ఉన్నాయి. దీంతో, ఆర్థిక సమస్యలు ఎక్కువైనట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే భర్త దాము, భార్య నిర్మల ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. -
కాలేజీకెళ్లినా.. బతుకుదువు బిడ్డా!
స్టేషన్ఘన్పూర్: మరో మూడు రోజుల్లో ఆ యువకుడి జన్మదినం ఉంది. అంతలోనే అనంతలోకాకు చేరాడు. స్నేహితులతో కలిసి సరదాగా ఈతకెళ్లి బావిలో నీటమునిగి మృతి చెందాడు. ఈ ఘటన శనివారం స్టేషన్ఘన్పూర్లో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్కు చెందిన చింత రమేశ్, అమల దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు వరుణ్తేజ్(16) ఉన్నారు.ఇటీవల వరుణ్తేజ్ పాలిటెక్నిక్ ప్రవేశపరీక్ష రాసి రాంపూర్లోని వీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో సీటు పొందాడు. కాగా, శనివారం కళాశాలలో దింపి వస్తానని తండ్రి చెప్పగా ‘డాడీ మూడు రోజుల్లో బర్త్డే ఉందిగా, బర్త్డే తర్వాత కళాశాలకు వెళ్తా’ అని చెప్పి ఇంటి వద్దే ఉన్నాడు. ఈ క్రమంలో స్నేహితులు చింత ప్రభాస్, కరుణ్తేజ్, గోనెల అభిరాం, అరవింద్, ధీరజ్తో కలిసి మొత్తం ఆరుగురు స్థానిక వైకుంఠధామం సమీపాన ఉన్న గుడిసెబావిలోకి ఈతకెళ్లారు. సరిగా ఈతరాని వరుణ్తేజ్ మెళ్లగా బావి ధరి పట్టుకున్నాడు. అనంతరం ఈత కొట్టేందుకు యత్నిస్తున్న క్రమంలో స్నేహితులంతా చూస్తుండగానే అరుస్తూ నీటిలో మునిగిపోయాడు.వెంటనే వారు భయంతో బావి నుంచి బయటకొచ్చి సమీపాన ఉన్న స్థానికులు, వరుణ్తేజ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకునేలోపే నీటిలో మునిగి గల్లంతయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై వినయ్కుమార్ ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూటీమ్తో కలిసి గాలింపు చర్యలు చేపట్టినా గల్లంతైన విద్యార్థి మృతదేహం దొరకలేదు. బావి దాదాపు 100 ఫీట్లకు పైగా లోతు ఉండడం, నీరు చాలా ఉండడంతో మోటార్లతో నీటిని బయటకు తోడే చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు రాత్రి పదిగంటల సమయంలో బావిలో నీరు పూర్తిగా తోడేసి వరుణ్తేజ్ మృతదేహాన్ని వెలికితీశారు.కాలేజీకెళ్లినా బతుకుదువు బిడ్డా..కాగా, ఘటనా స్థలిలో మృతుడి తల్లిదండ్రులు, బంధువులు రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. కాలేజీకి వెళ్లినా బతికేటోడివి బిడ్డా అంటూ రోదిస్తుండగా ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. వరుణ్తేజ్ మృతితో కుటుంబంతోపాటు పట్టణంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్కుమార్ తెలిపారు. -
ఆమె తలలో బుల్లెట్టా.. ఇనుప ముక్కా? అంతుచిక్కని వైనం!
కోరుట్ల/మెట్పల్లి: వారం క్రితం ఆస్తి కోసం అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ.. ఈ గొడవలో కర్ర తగిలి ఓ మహిళకు తలపై తీవ్ర గాయాలతో రక్తస్రావమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదును యధాలాపంగా తీసుకున్న మెట్పల్లి పోలీసులు ఎప్పటిలాగే హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు పంపారు. ఆ తరువాత సదరు మహిళను ఆసుపత్రికి పంపించారు. 2 రోజులు గడిచినా మహిళ తల నుంచి రక్తస్రావం ఆగలేదు. వైద్యులకు అనుమానం వచ్చి స్కానింగ్ చేయించారు. చివరికి ఆమె తలలో ఇనుప ముక్క కనిపించడంతో నివ్వెరపోయారు. కర్రతో చేసిన గాయం అయితే ఇనుప ముక్క ఎక్కడిదన్న విషయం అంతుచిక్కని ప్రశ్నగా మారి కలకలం రేపుతోంది.వారం క్రితం గొడవమెట్పల్లి పట్టణంలోని మఠంవాడలో గొనెల రాజం–లక్ష్మి దంపతులు, ఆ పక్కనే అతడి తమ్ముడు గొనెల శంకర్, అతడి సమీప బంధువు ముత్తన్న నివాసముంటున్నారు. అన్నదమ్ములకు కొన్ని రోజులుగా ఓ భూపంచాయితీ విషయంలో గొడవలు జరుగుతుండగా.. ఈనెల 15న అర్ధరాత్రి దాటిన తరువాత గొనెల రాజం–లక్ష్మి దంపతులు, గొనెల శంకర్కు మళ్లీ గొడవ జరిగింది.ఈ గొడవలో గొనెల శంకర్, ముత్తన్న కలిసి గొనెల రాజం–లక్ష్మి దంపతులపై దాడికి పాల్పడ్డారు. లక్ష్మి తలకు తీవ్ర గాయాలు కావడంతో.. తనను కర్రతో కొట్టి చంపే యత్నం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెట్పల్లి పోలీసులు గొనెల శంకర్, ముత్తన్నపై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్కు పంపారు. లక్ష్మి తల నుంచి రక్తస్రావం ఆగకపోవడంతో.. ఈనెల 17న హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెను పరీక్షించి స్కానింగ్ తీయగా.. ఆమె తలలో బుల్లెట్టు వంటి ఇనుప ముక్క ఉందని గుర్తించి దాన్ని వెలికితీశారు.బుల్లెట్టా.. ఇనుప ముక్కా?లక్ష్మి తలపై కర్రతో దాడి చేస్తే ఆమె కంటి కింది భాగంలో బుల్లెట్టు వంటి ఇనుప ముక్క ఎందుకు దిగబడి ఉందన్న విషయంలో ఎవరికీ అంతుచిక్కడం లేదు. అర్ధరాత్రి తరువాత చీకటిలో జరిగిన గొడవలో లక్ష్మి తనపై దాడికి కర్రను ఉపయోగించారా లేదా అన్న విషయాన్ని స్పష్టంగా గమనించి ఉండకపోవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదరు ఇనుప ముక్క తపంచా నుంచి వెలువడిన బుల్లెట్టు ముక్క కావచ్చన్న అనుమానాలున్నాయి.ఇనుప ముక్క బుల్లెట్టు అయితే తపంచా ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయంలో సందేహాలున్నాయి. గొనెల శంకర్ వద్ద పని చేసే జేసీబీ డ్రైవర్లు కొందరు బీహార్, ఒరిస్సా ప్రాంతానికి చెందినవారు కావడంతో.. అక్కడి నుంచి తపంచా కొనుగోలు చేసి తెచ్చుకున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఏదైనా ఇనుప ముక్క అయితే తలలో కంటి కిందుగా లోతుకు ఎలా వెళ్లిందన్న విషయం ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయమై మెట్పల్లి సీఐ సురేశ్బాబు మాట్లాడుతూ.. తలలో నుంచి బయటపడిన ఇనుప ముక్కను ఫోరెన్సిక్ నిపుణుల వద్దకు పంపామని, ఆ తరువాత స్పష్టత వస్తుందని చెప్పారు. -
సాయికృష్ణ కేసు.. పోలీసుల అదుపులో బాషా!
సాక్షి, విజయవాడ: సాయికృష్ణ మిస్సింగ్ కేసు వ్యవహారంలో పూటకో మలుపు తిరుగుతోంది. దర్యాప్తులో భాగంగా కృష్ణలంక స్వర్గపురి శ్మశాన వాటికకు వెళ్లిన అధికారులు.. అక్కడ పని చేసే బాషా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సాయికృష్ణను లాకప్డెత్ చేసిన అనంతరం ఇక్కడే ఖననం/అంత్యక్రియలు చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.గాదె సాయికృష్ణ కేసు దర్యాప్తు నేపథ్యంలో పోలీసులు చేపట్టిన తనిఖీలు శనివారం విజయవాడ కృష్ణలంక స్వర్గపురి శ్మశాన వాటికలోని అనుమానాస్పద వ్యవహారాలను బయటకు తెచ్చాయి. అనాధ మృతదేహాల నిర్వహణలో నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలతో ఎలక్ట్రికల్ ఫర్నెస్ ఆపరేటర్ బాషాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.కృష్ణలంక స్వర్గపురిలో సాయంత్రం 6 గంటల తర్వాత దహనాలు నిర్వహించకూడదన్న నిబంధన అమల్లో ఉంది. అయితే మే నెల 23వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో రెండు అనాధ మృతదేహాలను అక్కడికి తీసుకువచ్చినట్లు తేలింది. అప్పటికే సమయం ముగిసిందని దహనానికి అవకాశం లేదని ఇంచార్జి బాషా చెప్పినప్పటికీ, పరిస్థితుల నేపథ్యంలో పోలీసుల సూచనలతో మృతదేహాలను తాత్కాలికంగా అక్కడే నిల్వచేసినట్లు సమాచారం. అనంతరం 24వ తేదీ ఉదయం దహన కార్యక్రమం నిర్వహించారు.ఈ వ్యవహారం దర్యాప్తు చేస్తున్న గాదె సాయికృష్ణ కేసుతో అనుసంధానంగా బయటపడినట్లు తెలుస్తోంది. అనాధ మృతదేహాల దహనానికి సంబంధించిన ప్రొసీజర్ను పూర్తిగా పాటించారా లేదా? రికార్డులు సక్రమంగా నిర్వహించారా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. దహనాలు, ఖననాల ముందు తప్పనిసరిగా నిర్వహించాల్సిన రికార్డులు, కృష్ణలంక పోలీసులు ఇచ్చిన అనుమతులు సరైన విధంగా ఉన్నాయా? అసలు ఆ అనుమతులు ఎవరు ఇచ్చారు? అనే విషయాల్ని అధికారులు పరిశీలిస్తున్నారు.విచారణలో భాగంగా ఎలక్ట్రికల్ ఫర్నెస్ ఆపరేటర్ బాషాను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అతడి మొబైల్ ఫోన్ను కూడా స్వాధీనం చేసుకుని సీఐ పవన్ కిషోర్ ఆధ్వర్యంలో సాంకేతికంగా పరిశీలిస్తున్నారు. శ్మశాన వాటికలో విధి నిర్వహణలో ఏమైనా లోపాలు జరిగాయా? నిబంధనల ఉల్లంఘన జరిగిందా? అనే అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. -
భార్యను నగ్నంగా ఉంచి ఎవడైనా పోలీస్ లను పిలుస్తాడా.? తల్లి షాకింగ్ కామెంట్స్
-
కొత్త మలుపు తిరిగిన చిన్నారి జానూ కేసు!
సాక్షి, కాకినాడ: తుని మండలం ఎస్.అగ్రహారంలో కనిపించకుండా పోయిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి కేసు కొత్త మలుపు తిరిగింది. అధికారిక బృందాలు దాదాపు రెండు వారాలు సెర్చ్ ఆపరేషన్ పేరిట అణువణువు జల్లెడ పట్టినా ప్రయోజనం కనిపించలేదు. దీంతో.. పోలీసులు మరో కోణంలో ఈ కేసును దర్యాప్తు చేపట్టాలని నిర్ణయించారు. ఈ నెల 6వ తేదీన ఇంటి బయట ఆడుకుంటూ.. పెంపుడు కుక్కతో పాటే కనిపించకుండా పోయింది. అప్పటి నుంచి తల్లిదండ్రులు, పోలీసులు, స్థానికులు, ప్రత్యేక బృందాలు గాలిస్తున్నా ఇప్పటికీ జానూ ఆచూకీ లభించలేదు. అయితే ఈ కేసులో ఇప్పటివరకు ప్రధానంగా సీసీ ఫుటేజ్, సెల్ఫోన్ డేటా ఆధారంగా సాగుతున్న విచారణలో తాజాగా ‘కిడ్నాప్ కోణం’పై కూడా పోలీసులు దృష్టి సారించినట్లు సమాచారం. దర్యాప్తులో భాగంగా.. ఓ కొత్త సీసీ కెమెరా ఫుటేజ్ను పోలీసులు చిన్న క్లూగా భావిస్తున్నారు. చిన్నారితో పాటు కనిపించకుండాపోయిన పెంపుడు శునకం అదే రోజు గ్రామంలోని వినాయకుని ఆలయం వద్ద తిరుగుతూ కనిపించింది. మధ్యాహ్నం 1.02 గంటల సమయంలో అది ఆందోళనగా అటు ఇటు సంచరిస్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. అయితే ఆ తర్వాత అది ఎటు వెళ్లిందో స్పష్టత రాలేదు.మూడు రోజుల తర్వాత అదే శునకం ఇంటికి తిరిగి వచ్చింది. అప్పటి నుంచి అది కనిపించన వాళ్ల మీద దాడి చేస్తూ.. విచిత్రంగా ప్రవర్తించసాగింది. వైద్యం తర్వాత అది కోలుకున్నాక జీపీఎస్ ట్రాకర్ కట్టి వదిలినా.. ఫలితం దక్కలేదు. చివరకు.. అది చనిపోయిందని పోలీసులు చెబుతున్నారు. అయితే.. కిడ్నాప్ కోణంలోనూ కేసును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికే దాదాపు 6 వేలకుపైగా ఫోన్ కాల్స్ను విశ్లేషించినట్లు తెలుస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అనుమానాస్పద వ్యక్తులపై కూడా దృష్టి పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే కొండ మీద ఉండే ముఠాల గురించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. వాళ్లు పెట్టిన కరెంట్ ఉచ్చుకి చిన్నారి చిక్కుకుందా? మరేమైనా జరిగి ఉంటుందా? అనే కోణాల్లోనూ దర్యాప్తు ముమ్మరంగా జరుపుతున్నారు. అలాగే.. జిల్లాలో ఇలాంటి కేసుల గత రికార్డులు, అనుమానితుల కదలికలు కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సంచార జాతులు, వ్యక్తులపై కూడా బృందాలు విచారణ జరుపుతున్నాయి. పిఠాపురం, కోటవురట్ల, దివి పోలవరం ప్రాంతాల్లో కూడా ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో క్లూ దక్కుతుందేమోనన్న ఆశతో.. ఏ సీసీటీవీ కెమెరాను వదిలిపెట్టడం లేదు.మరోవైపు శునకం అనారోగ్యంతో మరణించిందని చెబుతున్నా.. శవపంచనామా, పోస్టుమార్టం నివేదిక ఇంకా అందాల్సి ఉంది. ఇన్నిరోజులు గడుస్తున్నా.. ఆ రిపోర్ట్ రాకపోవడంపై స్థానికుల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. అది నిజంగా చనిపోయిందా? ఎవరైనా చంపేశారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం పోలీసులే తేల్చాలంటూ జానూ తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆ నివేదిక వస్తే కేసులో మరికొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఆ చిన్నారి జానూ కాదు!ఇదిలా ఉంటే.. తుని మార్కెట్ యార్డ్ దగ్గర గుర్తుతెలియని ఓ చిన్నారి కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేపింది. ఏడ్చుకుంటూ ఆమె ఓ మహిళ దగ్గరకు వెళ్లగా.. అనుమానంతో ఆమె పోలీసులకు అప్పగించింది. అయితే ఆ చిన్నారి జానూ కాదని పోలీసులు నిర్ధారించారు. ఈ చిన్నారి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఇక.. చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. అదే సమయంలో కొందరు వ్యక్తులు మంత్రాలు, తంత్రాల పేరుతో ఇంటికి వచ్చి తమను అయోమయానికి గురిచేస్తున్నారని చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పెంపుడు శునకం కదలికల నుంచి మొదలైన అనుమానాలు.. ఇప్పుడు కిడ్నాప్ కోణం వరకు చేరుకున్నాయి. కానీ చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ మాత్రం ఇంకా చిక్కని మిస్టరీగానే మిగిలింది. ఈ కేసులో అసలు నిజం ఎప్పుడు బయటపడుతుందన్నది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఉత్కంఠగా మారింది.ఇదీ చదవండి: పోలీసులే హంతకులైతే..? -
విశాఖ AUలో HOD లైంగిక వేధింపులు.. సంచలన ఆడియో లీక్
-
పోలీసులకు ఫిర్యాదు చేసినా.. చర్యలు తీసుకోవడం లేదంటూ
హస్తినాపురం: ఉన్నత చదువుల కోసం ఫిన్లాండ్ వెళ్లిన నగర విద్యార్థి అదృశ్యమయ్యాడు. 45 రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీటీ పర్యంతమవుతున్నారు.వనస్థలిపురం వైదేహి నగర్కాలనీకి చెందిన మర్ణత, ముత్యంరెడ్డిల కుమారుడు మణిదీప్రెడ్డి ఫిన్లాండ్ లోని ఎల్యూటీ యూనివర్సిటీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గత నెల 4న తల్లిదండ్రులతో చివరిసారిగా మాట్లాడిన మణిదీప్ మే 5 నుంచి ఫోన్చేసినా స్పందించడం లేదు. దీంతో కుటుంబ సభ్యులలో ఆందోళన మొదలైంది. ఫిన్లాండ్లోని కుమారుడి స్నేహితులు, తెలిసిన వారిని నివాస ప్రాంతానికి, కాలేజీకి పంపించినా ఎలాంటి సమాచారం లభించకపోవడంతో అక్కడ మణిదీప్రెడ్డి అదృశ్యమైనట్లు కేసు నమోదు చేశారు. ఇప్పటికైనా తమ కుమారుడు మణిదీప్రెడ్డిని క్షేమంగా తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, అధికారులను తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశంఫిన్లాండ్లో తమ కుమారుడి అదృశ్యంపై తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదంటూ మణిదీప్రెడ్డి తల్లిదండ్రులు జి.మర్ణత, ముత్యంరెడ్డిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అదృశ్యంపై వివరణ ఇవ్వాలంటూ కేంద్రానికి హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. మణిదీప్రెడ్డి అదృశ్యంపై ఇచ్చిన ఫిర్యాదుపై తీసుకున్న చర్యలు వివరించాలంటూ కేంద్రం, ఫిన్లాండ్లోని భారత రాయబార కార్యాలయం, తెలంగాణ పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్రెడ్డి విచారణ చేపట్టారు. న్యాయమూర్తి విచారణను ఈనెల 24కు వాయిదా వేశారు. -
గొంతుపై కత్తి పెట్టి.. రెచ్చిపోయిన ప్రేమోన్మాది!
గచ్చిబౌలి: ఇంట్లోకి చొరబడ్డ ఓ ప్రేమోన్మాది యువతి కుటుంబ సభ్యులపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన మేరకు.. రాయదుర్గంలోని పోచమ్మబస్తీలో నివాసం ఉండే డిగ్రీ విద్యార్థిని (20)ను పక్కింట్లో ఉండే కంచమీది గోవర్ధన్ (22) ప్రేమిస్తున్నానంటూ వేధింపులకు గురిచేస్తున్నాడు.శుక్రవారం తెల్లవారుజామున నిందితుడు పక్కనున్న భవనం పైనుంచి యువతి ఉంటున్న రెండో అంతస్తులోకి ప్రవేశించాడు. యువతి అక్క గొంతుపై కత్తి పెట్టి, అరిస్తే చంపేస్తానని బెదిరించాడు. ఆపై తల్లిదండ్రులు సత్యనారాయణ, సుజాత, యువతిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. బాధితుల కేకలు విని సత్యనారాయణ సోదరుడు అర్జున్ అక్కడికి రాగా అతనిపై కూడా దాడి చేశాడు. బాధితుల కేకలు విని స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని గోవర్ధన్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.ఐదుగురిని గాయపరచిన నిందితుడి నుంచి కత్తిని స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ వెల్లడించారు. -
GPS ట్రాకర్ పెట్టి, నా బిడ్డను నగ్నంగా గాయత్రి తల్లి చెప్పిన నిజాలు
-
సాయి కృష్ణ తల్లి స్టేట్మెంట్ రికార్డు చేసిన ACP
-
అక్కడ ప్రమాదం.. ఇక్కడ విషాదం!
రామగుండం: హైదరాబాద్ సమీపంలోని రాజీవ్ రహదారిపై తుర్కపల్లి –మురారిపల్లి మధ్య గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల కేంద్రంలోని ఒకేకుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలవడం తీవ్రవిషాదం నింపింది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఊశెట్టి గణపతి(సీనియర్ ఫుట్బాల్ క్రీడాకారుడు) చిన్నకుమారుడు చంద్రశేఖర్ హైదరాబాద్లో రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆయన భార్య రేఖ. రేఖ చెల్లెలి కుమారుడు లోహిత్(3)ను తీసుకుని తమ కారులో బుధవారం కొండగట్టు శ్రీఆంజనేయస్వామిని దర్శనం చేసుకున్నారు. అదేరోజురాత్రి కారులో హైదరాబాద్కు పయనమయ్యారు.ఈ క్రమంలో తుర్కపల్లి–మురారిపల్లి గ్రామ సమీపంలోని రాజీవ్ రహదారిపై కారు అదుపు తప్పి లారీని ఢీకొంది. ఈ ఘటనలో చంద్రశేఖర్(40) అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన భార్య రేఖ(35), చెల్లెలు కుమారుడు లోహిత్(3) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించగా.. కుటుంబసభ్యులు, బంధువులు స్వగ్రామానికి తీసుకొచ్చారు. ముగ్గురి మృతదేహాలను చూసి గ్రామస్తులు కంటతడిపెట్టారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంపై అంతర్గాంతోపాటు సమీప గ్రామాల్లోనూ విషాదం నెలకొంది. -
వనజ చితాభస్మంలో బయటపడ్డ కత్తెర
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో ఘోర ఘటన వెలుగు చూసింది. పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రికి వెళ్లిన యువతి, కడుపు నుంచి బయటపడ్డ పసికందు.. వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి బలయ్యారు!. ఈ కేసు జిల్లాలో సంచలనం సృష్టించింది. అయితే.. పుట్టెడు దుఖంలో ఆ తల్లీబిడ్డలకు బంధువులు అంత్యక్రియలు నిర్వహించగా.. చితాభస్మం నుంచి కత్తెర బయటపడడం ఒక్కసారిగా కలకలం రేపింది. గుండాల మండలం శంభూనిగూడెం గ్రామంలో జరిగిన దారుణ ఘటనలో వైద్య నిర్లక్ష్యంపై తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వనజ (20) అనే గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఈ నెల 13న గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో సాధారణ ప్రసవాన్ని ఒక నర్సు నిర్వహించారు. అయితే ఈ ప్రక్రియలో అవగాహన లోపం కారణంగా శిశువు అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో కుటుంబ సభ్యులు ఆ పసికందును ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించిందని అక్కడి వైద్యులు తెలిపారు. ఇటు తీవ్ర రక్తస్రావంతో వనజ పరిస్థితి విషమించడంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె కూడా కన్నుమూసింది. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో సంబంధిత సిబ్బందిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని.. విచారణకు ఆదేశించారు. ఈలోపు మరో ఘోరం బయటపడింది. కర్మకాండల కోసం వనజ చితాభస్మాన్ని సేకరిస్తున్న సమయంలో అందులో శస్త్రచికిత్సకు ఉపయోగించే కత్తెర బయటపడడంతో షాక్ తిన్నారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురై, ఆసుపత్రి వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తల్లి, బిడ్డ ప్రాణాలు కోల్పోయారని, చితాభస్మంలో కత్తెర బయటపడటమే దీనికి స్పష్టమైన నిదర్శనమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.మరోవైపు ఆసుపత్రి వైద్యాధికారులు మాత్రం సాధారణ ప్రసవమే జరిగిందని, చితాభస్మంలో కత్తెర ఎలా వచ్చిందో తమకు తెలియదని పేర్కొంటూ ఆరోపణలను ఖండిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు బాధ్యులైన వాళ్లపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. -
మెదక్ ఇన్స్టా లవర్ బాయ్ గేమ్ ఓవర్
సోషల్ మీడియా పరిచయాలు కొన్నిసార్లు ఎంత ప్రమాదకరంగా మారతాయో తెలిపే ఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో వెలుగులోకి వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో ఫేక్ ఐడీలతో ప్రేమ నాటకం ఆడిన ఓ కేటుగాడు, ఇద్దరు యువతులను మోసం చేసి మొత్తం రూ.12 లక్షలతో పాటు తులం బంగారం దోచుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.పోలీసులు, బాధితులు వెల్లడించిన వివరాల ప్రకారం.. టేక్మాల్ మండలం ఎల్లంపల్లి, ఏక్లాస్పూర్ గ్రామాలకు చెందిన ఇద్దరు యువతులు ఇన్స్టాగ్రామ్ ద్వారా “సాత్విక్ రెడ్డి”, “రిత్విక్ రెడ్డి” అనే పేర్లతో ఉన్న ఖాతాల ద్వారా ఓ వ్యక్తితో పరిచయం ఏర్పరుచుకున్నారు. మాటలతో నమ్మకం సంపాదించిన ఆ వ్యక్తి, తనను తాను ప్రేమలో ఉన్నవాడిగా, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు.ఈ నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వంటి కథలు అల్లుతూ దశలవారీగా వారి వద్ద నుంచి నగదు, బంగారం తీసుకున్నాడు. కొంతకాలానికి అనుమానం రావడంతో బాధితులు కుటుంబ సభ్యులకు విషయం తెలిపారు. అనంతరం ఇది పూర్తిగా మోసమని తేలడంతో టేక్మాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, ఈ ఫేక్ ఇన్స్టాగ్రామ్ ఐడీల వెనుక ఉన్నది ఎల్లంపల్లి గ్రామానికి చెందిన దుర్గయ్య అని గుర్తించారు. సోషల్ మీడియాలో హ్యాండ్సమ్ లుక్తో, వేరే పేర్లతో పరిచయాలు పెంచుకుని పలువురిని లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.సోషల్ మీడియా పరిచయాల్లో అజాగ్రత్తగా నమ్మకం పెట్టుకోవద్దని, వ్యక్తిగత సమాచారం లేదా ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
ప్రకాశం: కన్నబిడ్డల్ని కాటేసిన కుటుంబ కలహాలు..!
ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి మండలం కేవీ అగ్రహారంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి తన ముగ్గురు చిన్నారులైన కూతుళ్లను హతమార్చి, అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. కేవీ అగ్రహారానికి చెందిన సుధాకర్ కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఈ క్రమంలో తన కూతుళ్లు అచ్యుత (11), పూజిత (9), లోహిత (8)లను హతమార్చాడు. తినే తిండిలో విషం పెట్టి చంపినట్లు తెలుస్తోంది. అనంతరం సమీపంలోని పొలంలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన గురించి సమాచారం అందుకున్న స్థానికులు, బంధువులు వెంటనే అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.కుటుంబ కలహాలే కారణమా?ప్రాథమిక సమాచారం ప్రకారం కుటుంబంలో నెలకొన్న విభేదాలు, కలహాల కారణంగానే సుధాకర్ ఈ దారుణానికి పాల్పడినట్లు బంధువులు చెబుతున్నారు. అయితే అసలు కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.గ్రామంలో విషాద ఛాయలుఒకే కుటుంబంలో నలుగురు మృతిచెందడంతో గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. అల్లారుముద్దుగా పెరిగిన ముగ్గురు చిన్నారులు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలచివేసింది. ఈ ఘటన గురించి తెలిసినవారంతా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. -
సాయికృష్ణ కేసులో కీలక పరిణామం
సాక్షి, విజయవాడ: గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి కృష్ణలంక సీఐ నాగరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి పరామర్శ తర్వాతే ఈ కేసులో.. ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగాల్లో కదలికలు రావడం గమనార్హం. గురువారం రాత్రి 11గం. సమయంలో బాధితుడి తల్లి, కుటుంబ సభ్యులకు పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నుంచి పిలుపు వెళ్లింది. ఆ తర్వాతే సీఐ నాగరాజుపై ఆమె ఫిర్యాదు ఇవ్వగా.. అప్పటికప్పుడే నాగరాజుపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. ఫిర్యాదును కమిషనర్ స్వయంగా స్వీకరించి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు ఫిర్యాదు కాపీని విజయలక్ష్మికి అందజేశారు.ఈ కేసులో దర్యాప్తు పారదర్శకంగా సాగేందుకు దిశా పోలీస్ స్టేషన్ ఏసీపీ దైవ ప్రసాద్ను విచారణ అధికారిగా నియమించినట్లు విజయలక్ష్మితో సీపీ రాజశేఖర్ చెప్పినట్లు సమాచారం. అలాగే సీఐ నాగరాజుపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు కావడం గమనార్హం. క్రైమ్ నంబర్ 107/2026గా నమోదైన ఈ కేసులో .. బీఎన్ఎస్ సెక్షన్ 127(4), 127(6), 103(1)తో పాటు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 238 కింద అభియోగాలు నమోదు చేసినట్లు తెలుస్తోంది.సాయికృష్ణ అదృశ్యం వ్యవహారం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో.. ఇప్పుడు కేసు దర్యాప్తులో భాగంగా ఒక పోలీసు అధికారిపైనే కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. ఈ పరిణామం కేసు విచారణను మరింత కీలక దశకు తీసుకెళ్లింది. దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సాయికృష్ణ ఇంటికి వైఎస్ జగన్ వెళ్లడంతోనే ఉలిక్కిపడ్డ కూటమి ప్రభుత్వం.. ఆగమేఘాల మీద పోలీసు శాఖను అప్రమత్తం చేసినట్లు చర్చ నడుస్తోంది. మరోవైపు.. సస్పెండైన కృష్ణలంక సీఐ నాగరాజు అరెస్ట్ తప్పదని.. ఆ తర్వాత ఈ కేసులో మరికొంత మంది ఖాకీలపైనా చర్యలు ఉంటాయంటూ లీకులు వస్తున్నాయి. ఈ కేసులో సాయికృష్ణ అదృశ్యంపై దర్యాప్తు అధికారిగా నియమితులైన రాజమహేంద్రవరం ఎస్పీ నరసింహ కిశోర్ ఇవాళ విజయవాడ రానున్నారు. డీజీపీ హరీష్కుమార్ గుప్తా, విజయవాడ సీపీ రాజశేఖర బాబులను కలిశాకే.. కృష్ణలంక స్టేషన్కు వెళ్తారని సమాచారం. ఇదీ చదవండి: సీఐ నాగరాజు.. మాములోడు కాదు! -
దొంగిలించిన వారి నుంచి పోలీసులు ఐరన్ కడ్డీలు రికవరీ చేయాలి
-
అమ్మా నీ బిడ్డ.. జ్ఞానేశ్వరి ఇంటి వద్ద జ్యోతిష్యుడి హల్చల్
సాక్షి, కాకినాడ: రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 13 రోజులు గడిచినా ఇప్పటికీ ఆమె ఆచూకీ లభించకపోవడంతో కేసు మిస్టరీ కొనసాగుతోంది. కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండగా, పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలో ఓ జ్యోతిష్కుడు హల్ చల్ చేయడం చర్చనీయాంశంగా మారింది.తెలంగాణ గద్వాల్ నుంచి వచ్చినట్లు చెప్పుకున్న ఓ అజ్ఞాత వ్యక్తి జ్ఞానేశ్వరి ఇంటి వద్ద హడావిడి చేయడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాను జ్యోతిష్యుడినని పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి, ‘‘పాప భూదేవతలో ఉంది.. త్వరలో తిరిగి వస్తుంది’’ అంటూ చెప్పాడట. అదే సమయంలో.. కుటుంబ సభ్యులను భయపెట్టేలా, అలాగే ఆశ కలిగించేలా మాటలు చెప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.జ్ఞానేశ్వరి ఇంటి వద్ద గత రెండు రోజులుగా అతను అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో అతని ప్రవర్తనపై అనుమానాలు పెరిగాయి. “అమ్మా నీ బిడ్డ ఎక్కడ ఉంది చెప్పు” అంటూ జ్యోతిష్యుడు తరహాలో వ్యాఖ్యలు చేస్తూ కుటుంబాన్ని మరింత భావోద్వేగానికి గురిచేసినట్లు సమాచారం. దీంతో ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ నేపథ్యంలో జ్ఞానేశ్వరి తల్లి భవాని, కుటుంబ సభ్యులు ఆ వ్యక్తిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బాధను అర్థం చేసుకోకుండా ఇలా భయపెట్టే మాటలు చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. కొంతసేపు వాగ్వాదం జరిగినట్లు కూడా తెలుస్తోంది.మరోవైపు, యువతి అదృశ్యంపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జ్యోతిష్యుడి హావభావాలు, అతని నేపథ్యంపై కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం. మొత్తానికి, జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు ఒక్కసారిగా జ్యోతిష్యుడి హడావిడితో కొత్త మలుపు తిరిగి, స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. -
MS నారాయణ సాల్మన్ రాజును మించిపోయారు మంత్రిగారు
-
నాకు పెళ్లైంది.. ఇలాంటి మెసేజ్లు పంపవద్దు..!
తమిళనాడు దిండుక్కల్ జిల్లా నత్తం సమీపంలోని వేలాయుధంపట్టికి చెందిన అరవిందన్ (22) కూలీగా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన నాగలక్ష్మితో అతడు గతంలో సన్నిహితంగా మాట్లాడేవాడు. అయితే మూడు నెలల క్రితం నాగలక్ష్మికి సిరుమలై తాళకడై ప్రాంతానికి చెందిన వీరమణి (24)తో వివాహమైంది. వివాహం అనంతరం కూడా అరవిందన్ నాగలక్ష్మికి తరచూ ఫోన్ సందేశాలు పంపుతూ ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించేవాడు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన నాగలక్ష్మి, తనకు పెళ్లైందని, ఇకపై ఇలాంటి సందేశాలు పంపవద్దని హెచ్చరించింది. ఈ విషయాన్ని ఆమె తన భర్త వీరమణికి కూడా తెలిపింది. అయినప్పటికీ అరవిందన్ తన ప్రవర్తన మార్చుకోలేదు.దీంతో నాగలక్ష్మి పేరుతో వీరమణి అరవిందన్కు సిరుమలైకి రావాలని సందేశం పంపినట్లు సమాచారం. నాగలక్ష్మిని కలుసుకోవచ్చన్న ఉద్దేశంతో అరవిందన్ అక్కడికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా వీరమణి, "నా భార్యను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు" అంటూ అరవిందన్తో వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరగడంతో వీరమణి కత్తితో దాడి చేసి అరవిందన్ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.హత్య అనంతరం జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో వీరమణి మృతదేహాన్ని ఇంటి సమీపంలో గొయ్యి తవ్వి పాతిపెట్టాడు. అనంతరం చెత్తతో కప్పి ఎవరికీ తెలియకుండా దాచిపెట్టేందుకు ప్రయత్నించాడు. అయితే ఈ విషయాన్ని వీరమణి తన స్నేహితుడికి చెప్పగా, అతడు గ్రామ పెద్దలకు సమాచారం అందించాడు. వారి ఫిర్యాదు మేరకు రూరల్ డీఎస్పీ శంకర్, ఇన్స్పెక్టర్ ఉలగనాథన్ నేతృత్వంలోని పోలీసులు మంగళవారం తెల్లవారుజామున ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు.అరవిందన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దిండుక్కల్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ప్రేమించిన వ్యక్తిని మరువలేక.. యువతి ఆత్మహత్య
అల్లూరి సీతారామరాజు జిల్లా: చోడవరం మండలం అంబేరపురం గ్రామానికి చెందిన యువతి కోడూరు దివ్య (26) దేవరాపల్లిలోని తన బంధువుల ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. మంగళవారం సాయంత్రం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ వి. సత్యనారాయణ బుధవారం విలేకరులకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అంబేరుపురం గ్రామానికి చెందిన కోడూరు సన్నిబాబు కుమార్తె దివ్య విశాఖలోని బంగారు ఆభరణాల దుకాణంలో కొంత కాలంగా పని చేస్తోంది. అక్కడ ఓ యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాలకు తెలియడంతో వారంతా మాట్లాడుకొని వారి ప్రేమ వ్యవహారాన్ని ఇకపై కొనసాగించకుండా అంగీకారం కుదుర్చుకున్నారు. అప్పటి నుంచి దివ్య మానసిక ఒత్తిడికి గురైంది. ఆమె పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు వారం రోజులు క్రితం కుమార్తె దివ్యను దేవరాపల్లిలోని బంధువుల ఇంటికి తీసుకువచ్చారు. ప్రేమ వ్యవహారం విఫలమవ్వడంతో తీవ్ర మనస్తాపానికి గురైన దివ్య మంగళవారం సాయంత్రం తన బంధువుల ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నితో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి సన్నిబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
ఆ భర్త బాత్రూంలోనూ సీసీ కెమెరా పెట్టాడు!
అనుమానం అతడిని మృగంలా మార్చింది.. అదనపు కట్నం డిమాండ్లు ఆమె జీవితాన్ని భారంగా మార్చాయి. ప్రతి కదలికపై నిఘా, ప్రతి మాటపై అనుమానం, అత్తింటి వేధింపులు.. ఇలా 48 రోజుల కాపురమే ఓ నవవధువుకు నరకయాతనగా మారింది. చివరకు ఆ మానసిక వేదనను తట్టుకోలేక ఆమె బలవన్మరణానికి పాల్పడి.. తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిల్చింది.పుణే వైష్ణవి హగ్వానే కేసు ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. అరకేజీ బంగారం, నగదు, కాస్ట్లీ కారు కట్నంగా ఇచ్చినప్పటికీ.. సరిపోలేదంటూ అత్తింటి కుటుంబం వైష్ణవిని బలి తీసుకుంది. ఈ ఘటన తర్వాత.. వరకట్నం విషయంలో కొన్ని కులాల పెద్దలు ‘తల్లిదండ్రులు తమకు ఉన్నంతలోనే వివాహం చేయాలి’ అని తీర్మానాలు కూడా చేశారు. అయితే ఆ ఘటన మరువక ముందే.. అదే తరహాలో మహారాష్ట్రంలోనే మరో వరకట్న వేధింపులకు నవవధువు బలైన ఘటన చోటు చేసుకుంది. అంబర్నాథ్లో పెళ్లైన 48 రోజుల్లోనే ఓ నవవధువు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు.. దీనికి తోడు ప్రతీ చిన్న విషయానికి భర్త అనుమానించడం విశాఖ తిల్కర్(26)ను దారుణంగా కుంగదీశాయి. పోలీసులు, ఆమె కుటుంబ సభ్యులు చెబుతోంది ఏంటంటే.. విశాఖకు ఈ ఏడాది ఏప్రిల్ 30న వైద్యుడు నితిన్ తిల్కర్తో వివాహమైంది. అడిగినంత కట్నం ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు ఆమె తల్లిదండ్రులు. అయితే అత్తింట అడుగు పెట్టిన మరుసటి రోజు నుంచే ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. తాము అనుకున్నంత కట్నకానుకలు రాలేదని తల్లి, మరిది సూటిపోటి మాటలతో వేధించసాగారు. ఇటు నితిన్ కూడా చీటికి మాటికి విశాఖను అనుమానించడం మొదలుపెట్టాడు. ఇంటి లోపల, బయట.. ఆఖరికి బాత్రూమ్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి విశాఖ ప్రతి కదలికను గమనించాడట.... ఎవరితో మాట్లాడినా ప్రశ్నించడం, అనుమానించడం, దాడి చేయడం తరచూ జరిగేది. విశాఖ బలవన్మరణానికి పాల్పడే రెండు రోజుల ముందు పొరుగును ఉన్నవాళ్లతో మాట్లాడిందని నితిన్ తీవ్రంగా కొట్టాడు. అప్పటిదాకా మౌనంగా భరిస్తూ వచ్చిన ఆమె.. పుట్టింటికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. దీంతో ఆమెను ఆ నరకం నుంచి బయటపడేయాలని తల్లిదండ్రులు భావించారు. ఈలోపే.. ఏం జరిగిందో ఏమోగానీ జూన్ 16న ఆమె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై శివాజీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త నితిన్ తిల్కర్తో పాటు అతని తల్లి ఛాయా, సోదరుడు నినాద్పై మానసిక, శారీరక వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించిన అభియోగాల కింద కేసులు పెట్టారు. నితిన్ను అరెస్టు చేయగా, మిగిలిన ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది. పెళ్లై రెండు నెలలు కూడా పూర్తికాకముందే అనుమానం, నిఘా, వేధింపుల మధ్య తమ బిడ్డ జీవితం అర్థాంతరంగా ముగిసిందంటూ ఆ తల్లిదండ్రులు పెట్టిన కన్నీళ్లు పలువురిని కదిలించాయి. -
ఆరు నెలల సహజీవనం.. ఒక్క క్షణంలో విషాదాంతం
కర్ణాటక: యువతీ యువకుడు సహజీవనం చేస్తుండగా, యువతి హత్యకు గురైంది. ఈ ఘటన బెంగళూరు మల్లేశ్వరం పోలీసుస్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎన్డీ అనుషా (20)ను ఆమె ప్రియుడు శరత్ (25) హత్య చేశాడు. ఇద్దరూ కూడా హాజన్ జిల్లాలోని సకలేశపురకు చెందినవారు. శరత్ వాటర్ ట్యాంక్ డ్రైవర్గా పని చేస్తున్నాడు, ఆమె ఓ ప్రైవేటు ఉద్యోగం చేసేదని సమాచారం. ఇన్స్టాలో పరిచయం పెరిగి 6 నెలల నుంచి ఒకే గదిలో సహజీవనం ప్రారంభించారు. అయితే 13వ తేదీన ఇద్దరి మధ్య గొడవ జరిగి ఆమెను తీవ్రంగా కొట్టి గొంతు పిసికి చంపి పారిపోయాడు. తరువాత మరుసటి రోజున తనకు తెలిసిన న్యాయవాదికి చెప్పాడు. పోలీసులు వచ్చి చూడగా ఇంటికి తాళం వేసి ఉండడం బద్ధలు కొట్టి లోపలకు వెళ్లారు. అనుషా నేలపై విగతజీవిగా పడి ఉంది. ఇంటి నిర్వహణ, పనుల విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవని యజమాని మహాదేవ తెలిపాడు. నిందితుని కోసం గాలింపు చేపట్టారు. -
ధర్మస్థలపై ప్రశ్నిస్తే తప్పా?.. చిన్నయ్యతో నాకేం సంబంధం??
బెంగళూరు: ధర్మస్థల వ్యవహారంలో తన పేరును లాగుతూ చేస్తున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్రాజ్ స్పష్టం చేశారు. ధర్మస్థల ప్రతిష్ఠను దెబ్బతీయడానికి రూ.200 కోట్లు అందుకున్నానంటూ ముసుగువ్యక్తిగా గుర్తింపు పొందిన చిన్నయ్య చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.‘‘చిన్నయ్యతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఇప్పటివరకు ధర్మస్థలకు ఒక్కసారి కూడా వెళ్లలేదు. ఆలయ వ్యవహారాలతో సంబంధం ఉన్నవారిని కూడా కలవలేదు’’ అని వెల్లడించారు.బెంగళూరు ప్రెస్క్లబ్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ప్రకాశ్రాజ్.. తన సహచర కార్యకర్త గిరీశ్ మట్టణ్ణనవర్ ద్వారా చిన్నయ్య ఫోన్లో మాట్లాడాడని తెలిపారు. ‘‘ధర్మస్థల అంశంపై మాట్లాడాలని అతడు కోరాడు. అయితే ఇలాంటి విషయాలు నాతో కాకుండా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందు చెప్పాలని సూచించాను. అతని మాటలు అనుమానంగా అనిపించాయి. అందుకే ఆ సంభాషణను రికార్డు చేసి సిట్ చీఫ్కు కూడా పంపించాను’’ అని చెప్పారు.ధర్మస్థలలో వెలుగుచూసిన అనుమానాస్పద మరణాలు, బాధిత కుటుంబాలు వ్యక్తం చేసిన సందేహాల నేపథ్యంలోనే తాను స్పందించానని ప్రకాశ్రాజ్ పేర్కొన్నారు. ‘‘సామాజిక బాధ్యతతోనే ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తు జరపాలని కోరాను. ఇందులో వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలేమీ లేవు’’ అని స్పష్టం చేశారు.చిన్నయ్య ఆరోపణలపై స్పందిస్తూ, ‘‘ధర్మస్థల ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కేరళ నుంచి రూ.200 కోట్లు తీసుకున్నాననే ఆరోపణలకు ఆధారాలేంటి?’’ అని ప్రశ్నించారు. తనను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కొన్ని వర్గాల మీడియా చిన్నయ్య వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ధర్మస్థల ప్రతిష్ఠకు తాను మసి పూసేందుకు ప్రయత్నిస్తున్నానని జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరారాయన. తాను దేవాలయాలకు వెళ్లనప్పటికీ తన భార్య భక్తురాలని, ఆమె విశ్వాసాలను ఎప్పుడూ ప్రశ్నించలేదన్నారు. ధర్మస్థలలో విద్యార్థిని సౌజన్య హత్య కేసులో నిజాలు బయటపడాలని, నిందితులకు కఠిన శిక్ష పడాలని మాత్రమే తాను కోరుకుంటున్నానని స్పష్టం చేశారు.విలేకరులతో మాట్లాడిన టైంలో.. ‘అమ్ముడుబోయిన ప్రచార మాధ్యమాలు’ అంటూ చేసిన ప్రకాశ్రాజ్ చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో కాసేపు అక్కడ గందరగోళం నెలకొంది. అయితే ప్రకాశ్రాజ్ ఆ వ్యాఖ్యలపై క్షమాపణలు మాత్రం చెప్పలేదు. ఆపై వివరణ ఇస్తూ.. ఆ వ్యాఖ్యలు మీడియా మొత్తాన్ని ఉద్దేశించి చేసినవి కావని, కొందరికి మాత్రమే వర్తిస్తాయని అన్నారు. దీంతో మీడియా ప్రతినిధులు శాంతించడంతో.. ప్రెస్మీట్ కొనసాగింది.Prakash Raj called a press meet to clarify Chinnayya's claim that they had spoken during the alleged Dharmasthala hoax mass burial kconspiracy.He invited the "sold-out Godi Media."The media turned up.Then came the questions and a heated exchange. #Dharmasthala #Massburial pic.twitter.com/j8uVCMfba5— Harish Upadhya (@harishupadhya) June 17, 2026కర్ణాటకలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన ధర్మస్థల వ్యవహారం గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ ప్రాంతంలో 1995-2014 మధ్య కాలంలో పలువురు మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరిగాయని, ఆ మృతదేహాలను తానే ఖననం చేశానంటూ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చిన్నయ్య (ముసుగువ్యక్తి) సంచలన ఆరోపణలు చేయడంతో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. అయితే అనంతరం చిన్నయ్య తన వాంగ్మూలాన్ని మార్చుకుంటూ.. ధర్మస్థల ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి రూ.200 కోట్ల కుట్ర జరిగిందని, అందులో ప్రకాశ్రాజ్ సహా పలువురి పేర్లు ప్రస్తావించాడు. మరోవైపు 2012లో ధర్మస్థల సమీపంలో హత్యకు గురైన విద్యార్థిని సౌజన్య కేసులో అసలు నిందితులు శిక్ష తప్పించుకున్నారనే ఆరోపణలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ధర్మస్థల, సౌజన్య కేసులపై సమగ్ర దర్యాప్తు జరిపి నిజాలు వెలికితీయాలని ప్రకాశ్రాజ్ డిమాండ్ చేస్తున్నారు. -
రూ.4 కోట్ల నగల దోపిడీ వెనుక అసలు కథ..
గాజియాబాద్: యూపీలోని గాజియాబాద్ తనిష్క్ షోరూమ్ చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దుకాణంలో పనిచేస్తోన్న వ్యక్తే.. తన ప్రియురాలితో కలిసి ఈ చోరీకి ప్లాన్ చేసినట్లు పోలీసులు తేల్చారు. పెళ్లి కోసం ఆ వ్యక్తి.. గర్ల్ఫ్రెండ్తో కలిసి రూ.4కోట్ల విలువైన నగలు ఎత్తుకెళ్లాడు. ఈ చోరీ కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారుతనిష్క్ ఉద్యోగి నితిన్ వర్మ (23), అతని ప్రియురాలు కాజల్ వర్మ (22), అతని తండ్రి సంజయ్ వర్మ (52). జూన్ 12న రాజ్ నగర్ డిస్ట్రిక్ట్ సెంటర్లోని తనిష్క్ షోరూమ్ నుండి రూ. 4 కోట్లకు పైగా విలువైన నగలను దొంగిలించినట్లు పోలీసులు నిర్థారించారు. పెళ్లి ఖర్చుల కోసమే ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.నితిన్ ఆ షోరూమ్లో చేరి కేవలం నెల పదిహేను రోజులు మాత్రమే అయింది.. కానీ ఈ కొద్ది సమయంలోనే అతను స్టోర్ భద్రతా ఏర్పాట్లు, అత్యంత విలువైన నగలు ఎక్కడ ఉంచుతారనే విషయాలను తెలుసుకున్నాడు. ఘటనకు ఒక రోజు ముందే కాజల్తో తన పెళ్లి నిశ్చయమైందని చెబుతూ స్టోర్ సిబ్బందికి పార్టీ ఇచ్చాడు. ఆ వేడుకలో షోరూమ్ తాళాలు తన వద్దే ఉంచుకునే క్యాషియర్ గౌతమ్ రాజ్తో ఎక్కువగా మద్యం తాగిపించాడు. అనంతరం అతన్ని ఇంటి దగ్గర దింపుతానని చెప్పి.. అతని బ్యాగ్ నుండి షోరూమ్ మెయిన్ ఎంట్రన్స్ తాళాన్ని దొంగిలించాడు.మరుసటి రోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో నితిన్ తన అనుచరుడితో కలిసి షోరూమ్కు వచ్చాడు. వారు దొంగిలించిన తాళంతో షట్టర్ తెరిచి.. ఎలాంటి అనుమానం రాకుండా లోపలికి వెళ్లడం సీసీటివి ఫుటేజీలో రికార్డయింది. డీసీపీ ధవళ్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఈ దొంగతనం పూర్తి చేయడానికి కేవలం 25 నిమిషాలు పట్టింది. వారు గ్రౌండ్, సెకండ్, థర్డ్ ఫ్లోర్లను వదిలేసి.. బంగారం, వజ్రాలు, విలువైన రత్నాలు పొదిగిన నగలు ఉన్న ఫస్ట్ ఫ్లోర్ను టార్గెట్ చేశారు. నితిన్ లోపలికి వెళ్లినప్పుడు ఓ అనుచరుడు బయట నిలబడి నిఘా ఉంచాడని పోలీసులు తెలిపారు. వారు సుమారు రూ. 4 కోట్ల విలువైన నగలను సర్దుకుని, ఎవరికీ దొరక్కుండా దూరంగా పార్క్ చేసిన వాహనంలో పరారయ్యారు.ఈ దర్యాప్తులో షోరూమ్లోని తీవ్రమైన భద్రతా లోపాలు కూడా బయటపడ్డాయి. రూ.50 కోట్లకు పైగా విలువైన నగలు ఉన్నప్పటికీ.. అక్కడ ఎలాంటి అలారం సిస్టమ్ లేదు. రాత్రి వేళల్లో కేవలం ఒకే ఒక్క సెక్యూరిటీ గార్డును నియమించారు. అతను కూడా ఉదయం 7 గంటలకే డ్యూటీ నుంచి వెళ్లిపోయాడు. సీసీటీవీ విజువల్స్ను కంపెనీ హెడ్ ఆఫీస్ నుండి నిరంతరం పర్యవేక్షించాల్సి ఉన్నప్పటికీ.. నిందితులు 25 నిమిషాలకు పైగా లోపలే ఉన్నా ఈ చొరబాటును ఎవరూ గమనించలేకపోయారు.నితిన్, కాజల్ కలిసి ఈ దొంగతనానికి ప్లాన్ చేయగా.. దొంగిలించిన నగలను అమ్మడంలో సంజయ్ వర్మ సహాయం చేశాడు. తమకు వైద్య ఖర్చుల కోసం డబ్బు కావాలని అబద్ధాలు చెప్పి నిందితులు కొన్ని నగలను తక్కువ ధరలకే విక్రయించారు. ప్రస్తుతం అధికారులు రూ. 3.1 కోట్ల విలువైన దాదాపు 2 కిలోల బంగారు నగలు, రూ. 6.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. -
వాట్సాప్ స్టేటస్ విప్పిన గుట్టు!
ఒకరికొకరు జీవితాంతం తోడుంటామని ప్రమాణాలు చేసుకున్నారు. కానీ ఆ బంధం చివరికి ఓ ఊహించని క్రైమ్ కథగా మారుతుందని ఎవ్వరూ ఊహించలేదు. చిన్న రోడ్డు ప్రమాదం.. ఆసుపత్రిలో చికిత్స.. ఆ తర్వాత ఒక్కసారిగా భర్త గుండెపోటుతో మృతి చెందాడు. కన్నీళ్లతో కుప్పకూలిన ఆమె… ఆ క్షణం అది ముగింపు అనుకుంది. కానీ అదే ముగింపు కాదు. అసలు కథ మొదలు.ఈ కేసులో మలుపు తిప్పింది ఒక వాట్సాప్ స్టేటస్. సాధారణంగా కనిపించిన ఆ ఒక్క మెసేజ్ పోలీసుల అనుమానాన్ని రేకెత్తించింది. అదే ఆధారంగా సాగిన దర్యాప్తు… చివరికి ఇది ప్రమాదం కాదు పక్కా ప్లాన్తో చేసిన హత్యగా అని బయటపెట్టింది. కర్ణాటకలోని బెలగావి జిల్లాలో మాజీ ఆర్మీ జవాన్ శాండీప్ మంజర్గి మృతి కేసు.. సంచలన మలుపు తీసుకుంది. ప్రియుడితో కలిసి భార్యే ఆయన్ని.. అదీ ఆస్పత్రిలోనే హతమార్చినట్లు నిర్ధారణ అయ్యింది. మొదట ఇది గుండెపోటు వల్ల జరిగిన సహజ మరణమని వైద్య నివేదికలు పేర్కొన్నప్పటికీ.. తర్వాతి దర్యాప్తులో ఇది పక్కా ప్రణాళికతో చేసిన హత్యగా పోలీసులు తెలుసుకుని కంగుతిన్నారు. ఈ కేసులో అతని భార్య సుమ మంజర్గి, ఆమె ప్రేమికుడు పుండలిక్ దొంబార్ సహా మొత్తం తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఆస్పత్రి సిబ్బంది కూడా ఉండడం గమనార్హం.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్చి 13న శాండీప్ రోడ్డు మీద యాక్సిడెంట్ కావడంతో స్వల్పంగా గాయపడ్డాడు. మొదట ఆయన్ని హుక్కేరి ప్రభుత్వ ఆసుపత్రిలో, తరువాత జీ.జె. ఆసుపత్రికి తరలించారు. చిన్న గాయమే కావడంతో ఒకట్రెండు రోజుల్లో ఆయన డిశ్చార్జి అవుతారని కుటుంబ సభ్యులు భావించారు. అయితే రెండ్రోజుల తర్వాత.. హఠాత్తుగా ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఇది అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. దీంతో భార్య సుమ గుండెలు పగిలేలా రోదించడం అక్కడున్నవాళ్లను కంటతడి పెట్టించింది. అయితే.. శవ పరీక్షలో అతని శరీరంలో తీవ్రమైన గాయాలు లేకపోవడం.. అప్పటిదాకా సాధారణంగా ఉన్న ఆరోగ్యం హఠాత్తుగా విషమించడంతో వైద్యులు పోలీసుల వద్ద అనుమానాలను వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో.. సుమ మంజర్గి స్నేహితుడిగా చెలామణి అవుతున్న పుండలిక్ దొంబార్ తీరుపై పోలీసులకు అనుమానం మొదలైంది. ఫోన్ కాల్ డాటా ఆధారంగా.. ఇద్దరూ గంటల తరబడి మాట్లాడుకుంటున్నారని గుర్తించారు. అలాగే ‘‘యాక్సిడెంట్ తర్వాత ఇలా ఎలా జరుగుతుంది?’’ అంటూ అతను పెట్టిన వాట్సాప్ స్టేటస్ ఆ అనుమానాల్ని మరింత బలపరిచింది. వైద్యులు ఏం చెప్పారో తెలియకుండానే.. అతను శాండీప్ మరణంపై అలా ఎలా పూర్తి వివరాలను తెలుసుకోగలిగాడు అని ఆశ్చర్యపోయారు. విచారణకు పిలిచారు. ఈ క్రమంలో తమదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు విషయం ఒప్పుకున్నాడు. సుమ, పుండలిక్కు వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలోనే శాండీప్ను అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. ఈ యాక్సిడెంట్ను అవకాశంగా మల్చుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే అతడికి సెలైన్ బాటిల్ ద్వారా విషం ఇచ్చారు. తీసుకునే జ్యూస్లో నిద్ర మాత్రలు కలిపారు. అలా నిద్రలోనే శాండీప్ కన్నుమూశాడు. ఆ తర్వాత.. మరణాన్ని సహజ గుండెపోటుగా చూపించేందుకు వైద్య రికార్డులు, ఫోరెన్సిక్ రిపోర్టులు డబ్బు ఎర వేసి మార్చేశారు. దర్యాప్తులో బయటపడ్డ మరో షాకింగ్ విషయం ఏంటంటే.. శాండీప్ పేరు మీద రూ.2 కోట్ల ఇన్సూరెన్స్లు ఉండడం, ఆయన చనిపోయాక వాటిని త్వరగా క్లెయిమ్ చేసుకోవాలని సుమ చేసిన ప్రయత్నాలు. ఇక హత్య కుట్రలో ఆసుపత్రి సిబ్బంది, ల్యాబ్ సిబ్బంది, కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా భాగస్వాములైనట్లు పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ పరీక్షలపై ప్రభావం చూపేందుకు రూ.3 లక్షలకు పైగా లంచాలు ఇచ్చినట్లు కూడా అనుమానం వ్యక్తమవుతోంది. ఆధారాలు చెరిపివేయడం, టాక్సిక్ పదార్థాలు రిపోర్టుల్లో కనిపించకుండా చేయడం కోసం పెద్ద నెట్వర్క్ పనిచేసినట్లు తెలుస్తోంది.ఇన్వెస్టిగేషన్లో పోలీసులు సిరింజ్లు, విష పదార్థాల కంటైనర్లు, మొబైల్ ఫోన్లు సహా కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ కేసు కేవలం ఓ భార్య తన పప్రియుడితో కలిసి భర్తకు రాసిన మరణశాసనమే కాదు.. వ్యవస్థలోని లోపాలను బయటపెడుతూ పెద్ద చర్చకు దారి తీసింది. అన్నట్లు తెలంగాణలోని కామారెడ్డిలోనూ ఈ తరహా నేరమే ఒకటి బయటపడడం తెలిసిందే. కామారెడ్డి కేసులో ఓ వ్యక్తి హత్యను మొదట రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. అయితే పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, అది యాక్సిడెంట్ కాదని పక్కా ప్లాన్తో చేసిన హత్యగా తేలింది. భార్యకు తన భర్తను తొలగించాలనే ఉద్దేశం ఉండగా, ఆమెకు సహకరించిన ప్రియుడి పాత్ర కూడా బయటపడింది. ఇద్దరూ కలిసి హత్య చేసి, దాన్ని ప్రమాదంగా చూపించే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సీసీటీవీ ఫుటేజ్, టెక్నికల్ ఆధారాలు, పోస్టుమార్టం రిపోర్ట్లు అసలు నిజాన్ని బయటపెట్టాయి. చివరికి భార్య, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. -
నేవల్ అధికారి భార్య బలవన్మరణం
మల్కాపురం: ఒక నేవల్ ఉన్నతాధికారి భార్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేవల్ కమాండర్ విశాల్ దాబీ, ఆయన భార్య ధర్తి దాబీ గత కొంతకాలంగా నేవల్ పార్కులోని క్వార్టర్ నంబర్–3లో నివాసముంటున్నారు. ఆదివారం రాత్రి భర్త విశాల్ విధులకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ధర్తి దాబీ తన గదిలోకి వెళ్లి సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఐఎన్ఎస్ కల్యాణి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మల్కాపురం పోలీసులు సోమవారం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని ప్రాథమికంగా గుర్తించారు. కేసు నమోదు చేసి ఆమె మరణానికి గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
కొత్త ఫోన్.. కొత్త బైకు.. ప్రాణం తీసిన ఫోటోషూట్!
కీసర: బంధువులైన ముగ్గురు యువకుల్లో ఒకరు కొత్తగా స్కూటీ, మొబైల్ కొన్నారు. ఆ సంతోషంలో కలిసి ఫోటోలు దిగాలనుకున్నారు. అనుకుందే తడవుగా కొత్త బైకుపై ముగ్గురు కలిసి తిమ్మాయిపల్లి చెరువు వద్దకు వెళ్లారు. ఉత్సాహంగా నీటిలోకి దిగి ఫొటోలు దిగుతుండగా.. ఓ యువకుడి ఇయర్ బడ్స్ నీటిలో పడిపోయాయి. వాటిని తీసుకునే క్రమంలో నీట మునగగా.. మరో యువకుడు కాపాడేందుకు ప్రయతి్నంచి బురద నీటిలో మునిగిపోయాడు. వీరిని కాపాడేందుకు మూడో యువకుడు ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో ఇద్దరూ చెరువులో మునిగిపోయారు. ఈ విషాదకర ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాయిపల్లి చెరువు వద్ద చోటు చేసుకుంది.కీసర సీఐ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం బొల్లారం ఆదర్శ్నగర్కు చెందిన కెవిన్ ఆంటోని(19) కొత్త స్కూటీ, మొబైల్ ఫోన్ కొనుగోలు చేశాడు. బంధువులైన వాలెంటైన్ టోని(20), యాప్రాల్కు చెందిన అమోస్ జోసఫ్లతో కలిసి ఫొటోషూట్ చేయాలని భావించి కొత్త స్కూటీపై తిమ్మాయిపల్లి సమీపంలోని పెద్ద చెరువుకు వచ్చారు. ఈత కొట్టేందుకు ముగ్గురు చెరువులోకి దిగారు. సెల్ఫోన్తో ఫొటోలు దిగుతుండగా చెవికి పెట్టుకున్న ఇయర్ బర్డ్స్ నీటిలో పడిపోయాయి. వాటిని తీసుకునేందుకు వాలెంటైన్ టోని వెళ్లాడు. అతని వెనకాలే కెవిన్ ఆంటోని వెళ్లాడు. ఇద్దరు నీట మునిగిపోవడం గమనించిన అమోస్జోసఫ్ వారిని కాపాడేందుకు ప్రయతి్నంచాడు. అక్కడ బురదతో పాటు లోతుగా ఉండటంతో వారిద్దరూ నీట మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు చెరువు వద్దకు చేరుకుని స్థానికుల సహాయంతో కెవిన్ ఆంటోని మృతదేహాం వెలికితీశారు. గల్లంతైన వాలెంటైన్ టోని కోసం తీవ్రంగా గాలించారు. సాయంత్రం పొద్దుపోయి చీకటిగా ఉండటంతో గాలింపు కష్టమైంది. బుధవారం ఉదయం మళ్లీ గాలింపు చర్యలు చేపడుతామని సిఐ తెలిపారు. ఈ మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా మృతిచెందిన కెవిన్ ఆంటోని తల్లిదండ్రుల రోదన మిన్నంటింది. కాగా ముగ్గురు యువకులు ఇటీవలే ఇంటర్ పూర్తి చేశారు. మృతిచెందిన కెవిన్ ఆంటోని, కాపాడేందుకు యతి్నంచిన అమోస్ జోసఫ్లు ఇద్దరు అక్కాచెల్లెళ్ల పిల్లలు కాగా, గల్లంతైన వాలెంటైన్ టోని వీరికి వరుసకు బాబాయి అవుతాడని కుటుంబ సభ్యులు తెలిపారు. -
అమావాస్య రోజు పూజల కలకలం.. కంట్లో కారం కొట్టిన మహిళ!
మణికొండ: అమావాస్య రోజు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు వేశారనే అనుమానంతో ఎదురెదురు నివాసాల వారు ఘర్షణకు దిగారు. పోలీసులు తెలిపిన మేరకు.. మణికొండ శివాజీనగర్ కాలనీలో ప్రభాకర్, నర్సింహాల కుటుంబాలు ఎదురెదురుగా ఉంటాయి. ప్రభాకర్ తోబుట్టువులు సోమవారం తమ ఇంటి ముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు ఎందుకు వేశారని నర్సింహా కుటుంబ సభ్యులు నిలదీశారు.అయితే తాము వేయలేదని వాగ్వాదానికి దిగారు. ఇంతలో ప్రభాకర్ సోదరి ఉమారాణి కారం తెచ్చి నర్సింహా కుటుంబ సభ్యుల కంట్లో చల్లింది. దాంతో ఓ మహిళ తీవ్ర అస్వస్థకు గురైంది. రాయదుర్గం పోలీసులకు సమాచారం అందడంతో ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పిల్లలను చూడనివ్వడం లేదని.. తండ్రి సెల్ఫీ సూసైడ్!
కంటోన్మెంట్: సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బోయిన్పల్లి పోలీసులు తెలిపిన మేరకు.. ఓల్డ్ బోయిన్పల్లి ఘోరీ నగర్కు చెందిన గయాజుద్దీన్ ఘోరీ (30) రెండేళ్ల క్రితం వరకు ఓ కిరాణాషాపు నిర్వహించాడు. ఆ తరువాత నుంచీ ఖాళీగా ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందులకు తోడు భార్యతో గొడవలు మొదలయ్యారు.ఈ క్రమంలో భార్య పిల్లలను తీసుకుని ఉప్పుగూడలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. భార్య, భర్తల నడుమ విభేదాలు ముదరడంతో కౌన్సెలింగ్కు హాజరవుతున్నారు. తన పిల్లలను చూసేందుకు కూడా భార్య అనుమతించడం లేదంటూ గయాజుద్దీన్ కుటుంబసభ్యులతో వాపోయాడు. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనను సెల్ఫోన్లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. గయాజుద్దీన్ సోదరుడు రియాజుద్దీన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తీవ్ర విషాదం: ఆస్తుల్ని పంచేసి.. బలవన్మరణం
ఓ విశ్రాంత ఉపాధ్యాయుడి కుటుంబం అంతిమ నిర్ణయం.. అనంత విషాదంగా మారింది. మండలంలోని దువ్వూరు గ్రామంలో ఉపాధ్యాయుడిగా కొంత కాలం క్రితం ఉద్యోగ విరమణ చేసిన చీర్ల మధుసూదన్రావు (65), ఆయన భార్య రత్నావళి (60), కుమారుడు సాయి సుకృత్ (25) బలవన్మరణానికి పాల్పడిన ఉదంతం సోమవారంజిల్లాలో సంచలనంగా మారింది.సాయిసుకృత్ తిరుపతిలో ఉద్యోగం చేస్తుండగా, తల్లిదండ్రులు సైతం అక్కడే ఉంటూ శనివారం స్వగ్రామానికి రావడం, ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడడం వెనుక మానసిక మనోవేదన బలీయంగా మారడంతో శారీరకంగా బలహీనులయ్యారు. ముగ్గురు ఒకేసారి మరణించాలనే నిశ్చయంతో చేతులు, కాళ్లను కట్టేసుకుని మరీ ఫ్యాన్ ఇనుప రాడ్కు ఉరేసుకున్నారు. దీనికి ముందు తన అక్క కు ఫోన్ చేసి సోమవారం దువ్వూరుకు రావాలని, మరో అక్కకు ఫోన్ పే ద్వారా డబ్బులు పంపడం, ఆస్తులు, బంగారానికి సంబంధించి తన అక్కలు, వారి పిల్లలకు పంపకాలు చేస్తూ వీలునామా రాయడం చూస్తే ఆ దంపతులు అంతులేని మానసిక మనోవేదనకు గురయ్యారనేది స్పష్టమవుతోంది. ఆయన విశ్రాంత ఉపాధ్యాయుడు కావడంతో నెల నెలా పెన్షన్ సైతం వస్తోంది. స్వగ్రామంలో సొంతింటితోపాటు ప్లాట్లు, బంగారం, నగదుకు ఏ లోటు లేదు. కానీ కుటుంబం మొత్తం ఏకకాలంలో ఆత్మహత్యకు పాల్పడడంతో ప్రతి ఒక్కరూ విషాదంలో మునిగిపోయారు.ఆస్తులను పంపకాలు చేస్తూ వీలునామా..మృతులు ముగ్గురు తమ మరణానికి కారణం చెబుతూ రాసిన లేఖలో మానసికంగా, శారీరకంగా గట్టిగా లేమని, తమ కుమారుడి పరిస్థితి కూడా అలాగే ఉందంటూ చనిపోవాలని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు. ఆ లేఖలో తమ ఆస్తుల పంపకం చేస్తూ ఓ వీలునామా కూడా రాశారు. తమకు బుచ్చిరెడ్డిపాళెంలో రెండు ప్లాట్లు ఉన్నాయని తన భార్య రత్నావళి కోరిక మేరకు ఒక ప్లాటును నెల్లూరులోని రెడ్క్రాస్కు, మరో ప్లాట్ను తన అక్క భువనేశ్వరికి ఇవ్వాలని రాశారు. దువ్వూరులోని తన ఇంటిని మరో అక్క మంజులకు ఇవ్వాలని, తమ ఇంట్లోని 17 సవర్ల బంగారాన్ని చనిపోయిన పెద్దక్క పిల్లలకు ఇవ్వాలని కోరారు. అయితే చావులో కూడా తమ ఆస్తిలో కొంత రెడ్క్రాస్కు ఇవ్వాలని సామాజిక బాధ్యతగా మధుసూదన్రావు కుటుంబం తీసుకున్న నిర్ణయంపై బంధుమిత్రులు, స్థానికులు విషాదంలో మునిగిపోయారు.కలవరపడిన దువ్వూరు..అందరితో కలివిడిగా ఉండే మధుసూదన్రావు కుటుంబం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడంతో దువ్వూరు గ్రామం ఒక్కసారిగా కలవర పడింది. ఎన్నడూ ఎవరితోనూ వివాదాలు, మనస్పర్థలు లేని కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడంపై గ్రామం మొత్తం విషాద వదనాలతో కనిపించారు. ఆర్థిక, కుటుంబ సమస్యలు ఏమి లేకపోయినా వారు ఆత్మహత్య చేసుకోవడం స్థానికులను కలిచి వేసింది. వీరు ఆత్మహత్య చేసుకోవాలని తిరుపతిలోనే నిర్ణయించుకుని శనివారం దువ్వూరుకు వచ్చి ఉంటారని భావిస్తున్నారు. గూడూరు సబ్ డివిజన్ డీఎస్పీ గిరిధర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్పెషల్ బ్రాంచ్ సీఐ దశరథరామారావు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, క్లూస్ టీం వివరాలు సేకరించారు.చివరి శ్వాసలోనూ సేవా సంకల్పంభావిభారత పౌరుల జీవితాల్లో వెలుగులు నింపిన ఆ విశ్రాంత ఉపాధ్యాయుడు తన కుటుంబంలో చీకట్లను నింపుకున్నారు. ఉన్నతమైన ఆదర్శమైన ‘గురువు’గా ఖ్యాతి గడించి విశ్రాంత జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. ఆస్తులకు కొదవ లేదు. అనుబంధాలకు కొరత లేదు. అంతకంటే ఆర్థిక సమస్యలూ లేవు. తాను కన్న బంగారు భవిష్యత్ కలలు కల్లలుగా మారడంతో మానసికంగా, శారీరకంగా కుంగిపోయారు. బతుకులు భారంగా వెళ్లదీస్తూ.. బంధాలను జ్ఞాపకాలుగా మిగుల్చుతూ.. మరణశయ్య ఎక్కారు. ఆ కుటుంబం అంతిమ నిర్ణయం.. అనంతమైన విషాదంగా మారింది. అంతిమ ప్రయాణంలోనూ తోబుట్టువులపై ఆప్యాయతలను వీలునామా రూపంలో కనబరిచారు. చివరి కోరికలతో కన్నీరు పెట్టించి.. బతుకులను ముగించారు. -
పసిపాపతో మహిళ బిల్డింగ్పై నుంచి దూకిన కేసు.. భర్తకు రిమాండ్
హైదరాబాద్: హైదరాబాద్లో ఇటీవల హృదయవిదారక ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఒక తల్లి గుండెల్లో దాగిన బాధ ఎంత లోతుగా ఉంటుందో బయటివారికి కనిపించకపోవచ్చు. కానీ ఆ బాధ ఓ కుటుంబాన్నే శోకసంద్రంలో ముంచేసేంత తీవ్రంగా మారితే? అదే జరిగింది. మియాపూర్లో ఇటీవల జరిగిన ఓ ఘటనలో ఓ తల్లి తీసుకున్న నిర్ణయం అందరినీ కలచివేస్తుండగా, ఆమె పసిపాప భవితవ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు తాజాగా ఆమె భర్తను రిమాండ్కు తరలించారు.కేసు ఏంటి? ఓ మహిళ తన ఆరు నెలల పాపతో బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మియాపూర్లోని మయూరి నగర్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్ వద్ద చోటుచేసుకుంది. తన ఆరు నెలల పాపతో ఆరో అంతస్తు నుంచి దూకిన ఈషా సాహు (37) అక్కడికక్కడే మృతిచెందగా, గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది ఆమె పాప. రెండో కూతురు పుట్టిందని ఈషా సాహును భర్త భూపేంద్ర సాహు వేధించడమే ఈ ఘటనకు కారణమని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి భూపేంద్ర సాహును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
చిన్నారి కేసులో ఏం జరిగింది.. పాయింట్ టు పాయింట్
-
కీచక ఎస్ఐ: భర్తతో విడాకులు ఇప్పించి నాలుగేళ్లుగా..!
వరంగల్ క్రైం: ఓ వివాహితకు న్యాయం చేస్తానని నమ్మించి, పెళ్లి పేరుతో మోసం చేసి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన సీసీఎస్ విభాగ ఎస్సై రాజ్కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని హనుమకొండ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ ఆదివారం వెల్లడించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండకు చెందిన ఓ యువతి 2018లో బీ ఫార్మసీ చదువుతున్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన యువకుడిని ప్రేమించి వివాహం చేసుకుంది. అనంతరం వారికి ఓ కుమార్తె జన్మించింది. కొంతకాలానికి భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో 2022 మార్చిలో బాధితురాలు తన భర్తపై హనుమకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.ఆ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్సై రాజ్కుమార్ బాధితురాలికి న్యాయం చేస్తానని నమ్మించాడు. తనకు పరిచయం ఉన్న న్యాయవాది ద్వారా ఆమెకు భర్త నుంచి విడాకులు ఇప్పించాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి నమ్మకం సంపాదించుకున్నాడు.ఈ క్రమంలో బాధితురాలితో సన్నిహిత సంబంధం ఏర్పరచుకుని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంబంధం కారణంగా ఆమె రెండుసార్లు గర్భం దాల్చగా, అబార్షన్ చేయించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం పెళ్లి విషయాన్ని ప్రస్తావించగా రాజ్కుమార్ నిరాకరించినట్లు బాధితురాలు ఆరోపించింది.తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు హనుమకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో ప్రాథమిక ఆధారాలు లభించడంతో నిందితుడు రాజ్కుమార్పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. -
లైంగిక వేధింపులు భరించలేక.. బంధువునే చంపేశారు..!
అనంతపురం జిల్లా: బళ్లారి తాలూకా మోకా సమీపంలో ఎల్ఎల్సీ కాలువ వద్ద అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం బొల్లనగుడ్డ గ్రామానికి చెందిన బసవన గౌడ ఈనెల 7వ తేదీన హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు వారంలోనే ఛేదించారు. ఆదివారం జిల్లా ఎస్పీ సుమన్ పన్నేకర్ ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ మండలం బొల్లనగుడ్డ గ్రామానికి చెందిన బసవన గౌడ బళ్లారిలోని ఓ ప్రైవేట్ ల్యాబ్లో పని చేస్తున్నాడు. మోకా గ్రామానికి చెందిన సమీప బంధువు అయిన శ్వేతతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచే ఆమె ఫోన్ నంబర్ తీసుకుని అసభ్యకరంగా మెసేజ్లు పెట్టేవాడు. ఏడాది పాటు లైంగికంగా కూడా వేధించినట్లు సమాచారం. బసవన గౌడ చేష్టలతో విసిగిపోయిన శ్వేత.. ఈ విషయాన్ని తన భర్త అయిన దొడ్డ బసవన గౌడ దృష్టికి తీసుకెళ్లింది. శ్వేత, ఆమె భర్త దొడ్డ బసవనగౌడ, సోదరుడు విజయ్ కలసి బసవన గౌడను చంపేయాలని ప్లాన్ వేశారు. అందులో భాగంగానే ఈనెల 7వ తేదీన రాత్రి మోకా సమీపంలోని ఎల్ఎల్సీ కాలువ వద్దకు బసవన గౌడ (27)ను పిలిపించారు. అక్కడికి రాగానే తాడుతో గొంతు బిగించి హత్య చేశారు. అనంతరం ఎటువంటి ఆధారాలు లభించకుండా మృతదేహంపై పెట్రోలు పోసి నిప్పటించి కాల్చి వేశారు. ఎవరికీ అనుమానం రాకుండా నిందితులు ముగ్గురూ బెంగళూరుకు పారిపోయారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపడంతో ఈనెల 8వ తేదీన మోకా పోలీసు స్టేషన్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది. అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైన యువకుడుని ఎవరు చంపారన్న దానిపై తీవ్రంగా చర్చానీయాంశమైంది. జిల్లా ఎస్పీ సుమన్ పన్నేకర్ దిశానిర్దేశంతో స్థానిక డీవైఎస్పీ, సీఐలు, ఎస్ఐలు రంగంలోకి దిగి హత్య కేసు మిస్టరీని ఛేదించారు. కాల్ డేటా ఆధారంగా విచారణ చేపట్టడంతో బసవన గౌడ హత్య కేసులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. శ్వేత, ఆమె భర్త దొడ్డ బసవన గౌడ, సోదరుడు విజయ్ను అదుపులోకి తీసుకుని విచారించగా.. లైంగికంగా వేధించడంతో హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. ముగ్గురినీ అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇన్స్టాగ్రామ్లో చీర ఆర్డర్.. రీఫండ్ లింక్తో రూ.37 వేల టోకరా
హైదరాబాద్: ఇన్స్ట్రాగామ్ పేజీలో ఆకర్షణీయమైన ఓ చీరకు ఆర్డర్ పెడితే యువతిని సైబర్ మోసగాళ్లు లింక్ పంపించి ఖాతా ఖాళీ చేశారు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–10లోని వెంకటగిరిలో నివసించే ఓ మహిళ ఇన్స్ట్రాగామ్ పేజీ చూసి ఓ చీరను ఆర్డర్ చేసింది. అయితే చీర డెలివరీ కాకపోవడంతో వెంటనే సంబంధిత విక్రేతకు ఫోన్ చేసింది. వెంటనే అవతలి వ్యక్తి నుంచి హైదరాబాద్ సిల్క్ శారీస్ పేరుతో రీఫండ్ లింక్ వచ్చింది. ఇది నమ్మిన ఆమె వెంటనే లింక్ నొక్కగా కొద్దిసేపట్లోనే ఆమె బ్యాంక్ ఖాతా నుంచి నగదు బదిలీ అయ్యింది. దీంతో బాధితురాలు వెంటనే సిమ్కార్డును బ్లాక్ చేసింది. అప్పటికే సైబర్ మోసగాళ్లు ఆమె ఖాతా నుంచి రూ.37,447 ఖాళీ చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భర్తను వదిలి రా.. మనం పెళ్లి చేసుకుందాం..!
హైదరాబాద్: తనను పెళ్లి చేసుకోవాలంటూ వివాహితను వేధిస్తున్న ఓ వ్యక్తిపై ఫిలింనగర్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన మేరకు.. నాగర్కర్నూల్ జిల్లా అంకిరావుపల్లె గ్రామానికి చెందిన డేగరాజు (25), ఫిలింనగర్లో నివాసముంటున్న ఒక వివాహిత (24)ను కొంతకాలంగా ఫోన్ ద్వారా వేధిస్తూ అసభ్యకర మెసేజ్లు పంపుతున్నాడు. భర్తను వదిలి తనతో రావాలని, పెళ్లి చేసుకోవాలని మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తన కదలికలను గమనిస్తూ, దారిపొడవునా అడ్డగిస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించింది. నిందితుడి వల్ల తనకు ప్రాణహాని ఉందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు డేగరాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా చిక్కిన ఎస్ఐ
బెంగళూరు: రాష్ట్రంలో అవినీతి అనేది ఉండరాదని నూతన సీఎం డీకే శివకుమార్ పిలుపునిచ్చిన కొన్ని గంటల్లోనే.. రాష్ట్ర పోలీసులు అందుకు భంగం కలిగించేలా ప్రవర్తించారు. పరాయి రాష్ట్రంలో లంచం తీసుకుంటూ అక్కడి ఏసీబీకి దొరికిపోవడంతో రాష్ట్ర పోలీసుల పరువు ప్రశ్నార్థకమైంది. రూ.2 లక్షలు ఇవ్వాలని.. వరకట్నం వేధింపుల కేసులో నిందితుడిని అరెస్టు చేయడానికి రాజస్థాన్కు వెళ్లిన బెంగళూరు హెచ్ఏఎల్ పోలీస్స్టేషన్ ఎస్ఐ అనిత, హెడ్ కానిస్టేబుల్ ఉళవప్ప, కానిస్టేబుల్ యతీష్ అక్కడి ఏసీబీకి పట్టుబడ్డారు. హెచ్ఏఎల్ పీఎస్లో నమోదైన కట్నం వేధింపుల కేసులో నిందితుడు జైపూర్లో ఉన్నాడని తెలిసి అరెస్టు చేయడానికి వెళ్లారు. నిందితుని ఇంటికి వెళ్లి బేరసారాలు ప్రారంభించారు. తమకు రూ.2 లక్షల లంచం ఇస్తే, అరెస్టు చేయకుండా వెళ్లిపోతామని తెలిపారు. అంత మొత్తం ఇవ్వలేనని, కొంత ఇస్తానని చెప్పిన నిందితుడు, ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చారు. ఓ లాడ్జిలో రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా స్థానిక ఏసీబీ అధికారులు అనిత, ఇతర పోలీసులను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. వీరి బాగోతం బెంగళూరు పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. -
పెళ్లైన ఆటో డ్రైవర్తో సహజీవనం.. చివరికి విషాదం..!
బెంగళూరు: యువతితో సహజీవనం చేస్తూ ఆమెను గొంతు నులిమి కడతేర్చిన ఆటో డ్రైవర్ ఉదంతం బ్యాడరహళ్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. చిక్కగొల్లరహట్టి నివాసి చంద్రశేఖర్కు వివాహమై కుమారుడు ఉన్నాడు. ఇతను ఆటోడ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తిగరపాళ్యలో సెల్ఫోన్ షోరూమ్లో పనిచేస్తున్న మాగడి ప్రాంతానికి చెందిన భవానీ(22) అనే యువతి ఆటోలో ఎక్కిన సమయంలో పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో తిరగపాళ్యలోని అద్దె ఇంటిలో సహజీవనం చేస్తున్నాడు. అయితే చంద్రశేఖర్కు పెళ్లయ్యిందని తెలియడంతో అతన్ని దూరం పెట్టింది. మరో వైపు ఆమెకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇకపై తనవద్దకు రావద్దని భవానీ చంద్రశేఖర్కు సూచించింది. దీంతో ఈ నెల 12న ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో చంద్రశేఖర్ ఆమెకు విషం తాపించి తానూ తాగాడు. అనంతరం భవానీ గొంతునులిమి ఊపిరాడకుండా చేసి హత్యచేశాడు. అనంతరం తమ ఇద్దరి ఫొటోలను ఇన్స్టాలో అప్లోడ్ చేసి వివాహవార్షికోత్సవం అని పోస్ట్పెట్టాడు. గమనించిన భవాని కుటుంబసభ్యులు ఫోన్లో ఆమెను సంప్రదించడానికి ప్రయత్నించగా స్పందన లేకపోయింది. అనుమానం వచ్చి తిగరపాళ్యలకు వెళ్లి చూడగా భవానీ మృతి చెందింది. పోలీసులు వచ్చి స్పృహలోలేని చంద్రశేఖర్ను ఆసుపత్రికి తరలించారు. -
టిప్పర్ ఢీకొని యువకుడి దుర్మరణం!
మహబూబాబాద్ రూరల్ : టిప్పర్ ఢీకొని యువకుడు మృతిచెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహం సెంటర్ వద్ద శనివారం చోటుచేసుకుంది. టౌన్ సీఐ రఘుపతిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని కేసముద్రం మండలం బడితండాకు చెందిన భూక్య సేవియా, లలిత దంపతులకు ముగ్గురు కుమారులు భరత్, నవీన్ (22) గణేష్ ఉన్నారు. రెండో కుమారుడు నవీన్ శుభకార్యాల డెకరేషన్లు, ఈవెంట్ ఆర్గనైజింగ్ పనులతోపాటు కూలి పనులు చేస్తుంటాడు.ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోని మూడు కోట్ల సెంటర్ వైపు నుంచి కోర్టు సెంటర్ వైపు బైక్ పై వస్తున్నాడు. సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహం సెంటర్ వద్దకు నవీన్ చేరుకుంటుండగా వెనుకనుంచి టిప్పర్ వాహనం అతడిని ఢీకొట్టగా అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని టిప్పర్ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. నవీన్ మృతదేహాన్ని పోస్ట్మార్టం గదికి తరలించారు. టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని సీఐ తెలిపారు. -
ప్రియురాలితో కలసి జిమ్ ట్రైనర్ వల.. మహిళా పైలట్ను
సనత్నగర్: ప్రియురాలితో పాటు జిమ్కు వచ్చే మహిళా పైలట్ను ఒకేసారి లైంగికంగా కలుసుకోవాలని జిమ్ ట్రైనర్ పథకం వేశాడు. అందుకు ప్రియురాలిని ఒప్పించడమే కాకుండా ఆ మహిళా పైలట్ను ఒప్పించే బాధ్యతను కూడా ఆమెపై పెట్టాడు. ఇందుకు మహిళా పైలట్ నిరాకరించడంతో ఫేక్ అకౌంట్లతో సోషల్ మీడియా వేదికగా ఆమె పట్ల అసభ్యకర సందేశాలు పంపిస్తూ మానసిక క్షోభకు గురిచేశాడు. దీంతో బాధితురాలు సనత్నగర్ పోలీసులను ఆశ్రయించగా జిమ్ ట్రైనర్తో పాటు అతని ప్రియురాలిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రగడ్డ చౌరస్తా సమీపంలోని కల్ట్ ఫిట్నెస్ జిమ్ మేనేజర్, ట్రైనర్గా సంతోష్గౌడ్ వ్యవహరిస్తున్నాడు. ఇదే జిమ్కు వచ్చే మహిళా పైలట్పై కన్నేశాడు. ఆమెను లొంగదీసుకునేందుకు తన ప్రియురాలు రజనితో కలిసి పథకం వేశాడు. ప్రియురాలి ద్వారా మహిళా పైలట్పై ఒత్తిడి తీసుకువచ్చాడు. ఇందుకు బాధితురాలు నిరాకరించింది. దీంతో కక్ష పెంచుకున్న సంతోష్గౌడ్ ఇన్స్టాగ్రామ్లో నకిలీ ఖాతాలను సృష్టించి అసభ్యకర సందేశాలు పంపించాడు. వేధింపులు భరించలేక మహిళా పైలట్ సనత్నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సంతోష్గౌడ్, అతని ప్రియురాలిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
చావును ముందే ఊహించిన హరిణి.. లవర్ కి సెల్ఫీ వీడియో
-
ఏంటి నాన్నా..! పిక్నిక్ అని చెప్పి.. బిర్యానీ తినిపించి.. చివరికి మమ్మల్ని?
నిజాంసాగర్: సాగర తీరంలో ఘోరం పిల్లలను తోసేసి తనువు చాలించిన తండ్రి ‘‘ నాన్నా.. ఇంటి దగ్గర ఆడుకుంటున్న మమ్మల్ని పిక్నిక్కు వెళ్దామని నిజాంసాగర్ ప్రాజెక్టుకు తీసుకొచ్చావు. హోటల్ నుంచి బిర్యానీ తెచ్చి ఆప్యాయంగా తినిపించావు. నీళ్లలో సరదాగా ఆడించావు. ఫోన్లో సెల్ఫీ ఫొటోలు తీశావు. తెప్పపై జలాశయం మధ్యలోకి తీసుకొచ్చావు. అప్పటి వరకు మాతో బాగానే ఉన్నావు. ఏమైంది నాన్న.. అంతలోనే మా ఇద్దరినీ నీళ్లలోకి తోసేశావు. నోట్లోకి నీళ్లు పోతున్నాయ్ నాన్న.. మునిగిపోతున్నాము నాన్న.. అమ్మకు, నీకు మధ్య గొడవలైతే మేమేం పాపం చేశాం.. నీ దగ్గర డబ్బులు లేకపోతే కారం బువ్వ పెట్టినా తింటాం..మీ కడుపున పుట్టడమే మేము చేసిన నేరమా?’’ అని ఎంత వేడుకున్నాయో ఆ పసి హృదయాలు. వారి వేదన వినిపించుకోలేని స్థితిలో ఉన్నా ఆ తండ్రి.. క్షణికావేశంలో తాను సైతం నీళ్లలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.పిల్లలను తోసేసి తనువు చాలించిన తండ్రి..నిజాంసాగర్ ప్రాజెక్టు 20 గేట్ల ప్రాంతంలో ఇద్దరు పిల్లలను నీటిలో తోసేసి, తండ్రి సైతం తనువు చాలించిన ఘటన కలకలం రేపింది. పిల్లల ఆలనా, పాలన చూసుకోవాల్సిన తండ్రి తనతోపాటు తన పేగుబంధం లేకుండా చేశాడు. సంగారెడ్డి జిల్లా నిజాంపేట గ్రామానికి చెందిన బోయి కృష్ణ (34), సవిత దంపతులకు కుమారుడు రక్షిత్(9), కూతురు అనన్య(5) ఉన్నారు. సరైన ఉపాధి లేక దంపతులిద్దరూ పిల్లలతో కలిసి నాలుగు నెలల క్రితం రామచంద్రాపురానికి వలస వెళ్లారు. కృష్ణ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా సవిత హోటల్లో లేబర్ పనిచేస్తోంది. కృష్ణ మద్యం సేవించడం, సరిగా పనిచేయకపోవడంతో భార్య, భర్తలు తరుచూ గొడవలు పడేవారు.ఆర్థిక ఇబ్బందులు, పిల్లలకు చదువులకు చేతిలో డబ్బులు లేకపోవడంతో కృష్ణ జీవితంపై విరక్తి చెందాడు. గురువారం పిల్లలను పిక్నిక్కు వెళ్దామని బైక్పై నిజాంసాగర్ ప్రాజెక్టు వద్దకు తీసుకొచ్చాడు. మత్స్యకారులు ఉపయోగించే తెప్పపై ప్రాజెక్టు మధ్యభాగంలోకి వెళ్లి పిల్లలను తోసేసి, తాను సైతం నీటిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం వరకు పిల్లలతోపాటు భర్త ఇంటికి రాకపోవడంతో సవిత బంధువులకు ఫోన్ చేయగా ఆత్మహత్య విషయం తెలిసింది. నిజాంసాగర్ పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై శివకుమార్ ఘటన స్థలానికి చేరుకొని రెస్క్యూటీం, జాలర్లు కలిసి నీటిలో గాలించి ముగ్గురి మృతదేహాలు బయటికి తీశారు.ప్రాజెక్టు నీటిలో నుంచి పిల్లలు, తండ్రి మృతదేహాలను బయటికి తెస్తున్న సమయంలో కుటుంబసభ్యులు, బంధువులు గుండెలవిసెలా విలపించారు. ఆత్మహత్యకు ముందు పిల్లలతో కలిసి తండ్రి తీసిన సెల్ఫీ ఫొటోలు, మృతదేహాలను చూస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. బాన్సువాడ రూరల్ సీఐ తిరుపయ్య ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. -
తల్లిదండ్రులూ దూరం.. ప్రియుడి ఇంటి వద్ద ఏమైందో ఏమో?
కాకినాడ క్రైం: ఏమైందో ఏమో.. ప్రియుడి ఇంటి వద్ద ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. కంపా లాఫీ (17) అనే బాలిక తల్లిదండ్రులు పీతా నాగదేవి, కంపా బంగారయ్యలు విడిపోయి కుమార్తెను స్థానిక తారకరామ నగర్లో పిన్ని జయవాణి వద్ద వదిలేసి వెళ్లిపోయారు.మూడేళ్ల క్రితం నరసింహ రోడ్డుకు చెందిన తన వయసున్న బాలుడితో లాఫీకి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం పిన్ని, బాబాయ్లకు తెలియడంతో వారు మందలించారు. మనస్తాపం చెందిన బాలిక ప్రియుడి ఇంటికి వెళ్లిపోయింది. కొద్ది నెలలుగా అక్కడే ఉంటోంది.ఏసీ టెక్నీషియన్గా పనిచేస్తున్న ఆ బాలుడితో పాటు అతని తల్లి లోవలక్ష్మి ఓ టైలరింగ్ షాప్లో, తండ్రి శివకుమార్రాజు దుస్తుల దుకాణంలో పనిచేస్తున్నాడు. వీరితో పాటే లాఫీ నివసిస్తోంది. గురువారం రాత్రి శివకుమార్రాజు ఇంటికి వచ్చి చూసేసరికి అప్పటికి కుమారుడు, భార్య ఇంటికి చేరలేదు. లాఫీ ఇంట్లో ఉండడంతో తలుపు కొట్టాడు. ఎంతకీ తీయకపోవడంతో అనుమానం వచ్చి వంట గది కిటికీ లోంచి చూస్తే ఫ్యాన్కు చీరతో ఉరేసుకుని లాఫీ వేలాడుతోంది.కంగారు పడిన శివకుమార్రాజు స్థానికుల సాయంతో తలుపులు తెరిచి చూసేసరికి బాలిక అచేతనంగా ఉంది. ఆమెను జీజీహెచ్కు తరలించాడు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. లాఫీ మృతికి ఆ బాలుడితో పాటు అతడి తల్లిదండ్రులు, మరో వ్యక్తి కారణమని బాబాయ్, పిన్ని ఆరోపించారు. మృతురాలి బాబాయ్ నూకరాజు ఫిర్యాదుతో కాకినాడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కేశినేని బ్రదర్స్ వార్లో కీలక పరిణామం
బెజవాడ రాజకీయాల్లో కేశినేని సోదరుల మధ్య వివాదం మరో మలుపు తిరిగింది. ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అవినీతి బాగోతాన్ని బయటపెడుతూ మాజీ ఎంపీ కేశినేని నాని(శ్రీనివాస్) సోషల్మీడియాలో వరుస పోస్టులు చేస్తున్నది తెలిసిందే. తాజాగా ఈడీకి సైతం ఆయన ఫిర్యాదు చేయగా.. ఇప్పుడు ఆయనపైనే కేసు నమోదవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: కేశినేని బ్రదర్స్ మధ్య వివాదం మరింత ముదిరింది. తనపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న సోదరుడి వ్యవహారంపై అధికార పార్టీ ఎంపీ కేశినేని చిన్ని పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియా వేదికగా తనపై అసత్య, అనుచిత ప్రచారం జరుగుతోందని, పరువు నష్టం కలిగించేలా పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మాజీ ఎంపీ కేశినేని నానిపై పటమట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఈ వ్యవహారం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే చిన్ని అధికార కూటమికి చెందిన ఎంపీ కాగా, నాని ఇటీవల కాలంగా ప్రభుత్వ విధానాలు, స్థానిక రాజకీయ పరిణామాలపై విమర్శనాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈడీకి ఫిర్యాదు చేసిన కొద్దిరోజుల్లోనే నానిపై కేసు నమోదవడం రాజకీయ వర్గాల్లో అనుమానాలకు తావిస్తోంది.నాని అనుచరులు మాత్రం ఇది రాజకీయ ఒత్తిడిలో భాగంగా జరిగిన చర్య అని ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియా పోస్టులపై కేసులు పెట్టడం ఏంటని నిలదీస్తున్నారు. అవినీతి ఆరోపణలపై సమాధానం చెప్పాల్సింది పోయి.. ప్రశ్నించిన వారిపైనే కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వాదిస్తున్నారు. మరోవైపు ఎంపీ చిన్ని వర్గం మాత్రం సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు, అసత్య ప్రచారాన్ని సహించబోమని చెబుతోంది. -
ఎనిమిది నెలల క్రితమే హత్యకు కుట్ర..
సాక్షి, సిటీబ్యూరో: హైకోర్టు న్యాయవాది, వక్ఫ్ బోర్డ్ ప్యానెల్ సభ్యుడు ఖాజా మొయిజుద్దీన్ హత్యకేసులో ముజాహిద్ ఆలంఖాన్తో పాటు కీలక నిందితులు కిషన్ సింగ్, అభిజీత్లను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. గురువారం నుంచి మూడు రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించగా... రెండు రోజుల విచారణలో కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. మరోపక్క పరారీలో ఉన్న ఇద్దరు నిందితులు హసన్, మునీర్లపై నగర పోలీసులు లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేశారు.ముజాహిద్ ఆలంఖాన్ గతంలోనూ ఖాజా మొయిజుద్దీన్పై దాడి చేయాలంటూ పలుమార్లు కిషన్ సింగ్కు చెప్పాడు. అయితే అది సాధ్యం కాలేదు. ఓ దశలో ముజాహిద్ ఆలంఖాన్ ఓ మహిళ ద్వారా ఖాజా మొయిజుద్దీన్పై దాడి చేయించారు. ఆయన్ను తీవ్రంగా భయపెట్టాలనే ఈ పని చేయించారు. అబిడ్స్ పోలీసుల వరకు వెళ్లిన ఈ విషయం ఠాణాలో సెటిల్ అయింది.ఏడాది క్రితం ముజాహిద్, మహబూబ్ ఆలంఖాన్లు కిషన్ను పిలిచి ఖాజా మొయిజుద్దీన్తో మాట్లాడాలని, తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించాలని కోరారు. న్యాయవాది హత్య జరగడానికి దాదాపు ఎనిమిది నెలల ముందు కిషన్ సింగ్ను ఆలంఖాన్లు తమ కార్యాలయానికి పిలిచారు. ఖాజా మొయిజుద్దీన్ను హత్య చేయాలని, అయితే అది రోడ్డు ప్రమాదంలా కనిపించాలని చెప్పారు. అందుకు అవసరమైన డబ్బుతో పాటు పని పూర్తి అయిన తర్వాత కిషన్ సింగ్ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఆలంఖాన్లు హామీ ఇచ్చారు.ఖాజా మొయిజుద్దీన్ హత్య కుట్ర అమలును పర్యవేక్షించే బాధ్యతల్ని ముజాహిద్ ఆలంఖాన్ తన వద్ద పని చేసే హసన్ అలీతో పాటు మునీర్కు అప్పగించారు. హత్య చేయడానికి స్కార్పియో వాహనం కావాలంటూ కిషన్ గత ఏడాది డిసెంబర్లో ముజాహిద్కు చెప్పాడు. దీంతో ఆ వాహనం ఖరీదు చేయడానికి హసన్, మునీర్ ద్వారా రూ.2 లక్షలు కిషన్కు పంపారు.మలక్పేటలో ఉన్న పది వేల గజాల వక్ఫ్ భూమి కొత్త కమిటీ గత ఏడాది డిసెంబర్లో ఆటో ఫిన్ కంపెనీకి లీజుకు ఇచి్చంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఆలంఖాన్లు సివిల్ కోర్టును ఆశ్రయించారు. దీనికి కొనసాగింపుగా ఏప్రిల్లో ఆటోఫిన్ కంపెనీ యజమాని గౌతం చాంద్జైన్పై ఆలంఖాన్లు కేసు పెట్టగా... ఆ కంపెనీ మేనేజర్ ఎన్.నర్సింగ్రావు వీరి పైన కేసు పెట్టారు. ఈ కేసును ముజాహిద్ ఆలంఖాన్ కోర్టులో సవాల్ చేశారు. దీని విచారణ సందర్భంలో నర్సింగ్రావు తరఫున ఖాజా మొయిజుద్దీన్ హాజరుకావడాన్ని ఆలంఖాన్లు జీరి్ణంచుకోలేకపోయారు. దీంతో ఆయన హత్య కుట్ర అమలును వేగవంతం చేశారు.అప్పటికే స్కారి్పయో వాహనాన్ని అభిజిత్ తాకట్టు పెట్టగా దాన్ని వినిపించడానికి కిషన్ సింగ్ రూ.లక్ష ఇచ్చారు. న్యాయవాది ఖాజా మెహిజుద్దీన్ను మే 23 తెల్లవారుజామున హత్య చేయగా.. దానికి ఒక రోజు ముందే అభిజీత్, వినయ్, మణిదీ్వప్లు స్కారి్పయో వాహనం నెంబర్ ప్లేట్ కనిపించకుండా చేశారు. దీనికోసం దానిపై గ్రేజు, మట్టి పూశారు. ఈ వాహనాన్ని వినియోగించే అభిజీత్ మే 23న ఖాజా మొయిజుద్దీన్ను ఆయన ఇంటి వద్దే ఢీ కొట్టి చంపాడు.ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న హసన్, మునీర్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. వీరి కోసం గాలిస్తున్న పోలీసులు విదేశాలకు పారిపోయే అవకాశం లేకుండా ఎల్ఓసీ జారీ చేశారు. దీని ప్రతుల్ని దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడ రేవులకు పంపారు. ముజాహిద్, కిషన్, అభిజీత్ పోలీసు కస్టడీ గడువు ముగియనుండటంతో వీరిని శనివారం కోర్టులో హాజరుపరచనున్నారు. -
కుక్కే క్లూ అనుకున్నారు.. కానీ!
రెండేళ్ల చిన్నారి. పెంపుడు కుక్కతో ఇంటి నుంచి బయటకు వెళ్లింది. కానీ వారమైనా తిరిగి రాలేదు. తల్లిదండ్రుల కన్నీళ్లు, బంధవులు.. గ్రామస్తుల ఆందోళన, పోలీసుల విస్తృత గాలింపు.. ఏదీ ఇప్పటివరకు జ్ఞానేశ్వరి ఆచూకీని కనిపెట్టలేకపోయాయి. పెంపుడు కుక్క తిరిగి వచ్చినా.. దానికి హైటైక్ టెక్నాలజీ తగిలించి ఆచూకీ కనిపెట్టాలని ప్రయత్నించినా.. పాప జాడ మాత్రం దొరక్కపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని చిక్కుళ్ల అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ వారమైనా చిక్కలేదు. తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు..చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అలాగే 10 పోలీసు టీంలు, 40 మంది ఎస్డీఆర్ఎఫ్ బృందం.. మరికొందరు అధికారులు పాప కోసం చేపట్టిన సెర్చ్ ఆపరేషన్లో భాగమయ్యారు. అడవులు, కొండలు, గ్రామాలన్నీ నిర్విర్వామంగా జల్లెడ పడుతున్నారు. దీంతో ఈ కేసు దేశం దృష్టిని ఆకర్షించింది.ఈ నెల 6న ఇంటి బయట ఆడుకుంటూ అదృశ్యమైంది. పెంపుడు కుక్కతో కలిసి బయటకు వెళ్లిన పాప తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే.. ఈ కేసులో పెంపుడు కుక్క కీలక ఆధారంగా మారొచ్చని పోలీసులు భావించారు. అదృశ్యమైన మూడు రోజుల తర్వాత కుక్క గ్రామానికి తిరిగి వచ్చింది. అయితే ఇంటి వద్ద ఉన్న హడావుడి చూసి మళ్లీ పారిపోయింది. ఈ క్రమంలో అది పలువురిపై దాడి చేసింది. అనంతరం డాగ్ క్యాచర్ సాయంతో అతికష్టం మీద దానిని పట్టుకుని ఇంటికి తీసుకువచ్చారు. ఓ తాడుతో కట్టేసి.. దానికి పోలీసును కాపలా ఉంచారు. నీరసంగా ఉన్న దానికి.. వెటర్నరీ సిబ్బంది వైద్య సేవలు అందించి కోలుకున్న తర్వాత పోలీసులు ప్రత్యేక చర్యలకు దిగారు.పెద్దాపురం డీఎస్పీ తిలక్ పర్యవేక్షణలో పోలీస్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ, ఏఎన్ఎస్, క్యూఆర్టీ బృందాలు విస్తృత గాలింపు కొనసాగిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన జీపీఎస్ ట్రాకర్ను కుక్కకు అమర్చి వదిలారు. ట్రాకర్ ద్వారా కుక్క సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేర సంచరించినట్లు గుర్తించారు. ఆ ప్రాంతాలన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కానీ, ఎక్కడా ఏ క్లూ లభించలేదు!.ఇక చిన్నారి కాళ్లకు ఉన్న వెండి పట్టీలను గుర్తించేందుకు సిల్వర్ మెటల్ డిటెక్టర్లను వినియోగిస్తున్నారు. జ్ఞానేశ్వరి చివరిసారిగా కనిపించిన ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అయితే చిన్నారి ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలు ఆపబోమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.అదే సమయంలో కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మొబైల్ టవర్ డంప్ డేటా, కాల్ డిటైల్ రికార్డులు, సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రులకు సన్నిహితులైన వ్యక్తులతో పాటు చుట్టుపక్కలకు కొత్తగా వచ్చిన వ్యక్తులు, గంజాయి అలవాటు ఉన్న వారిపై కూడా నిఘా పెట్టారు. పగలు, రాత్రి తేడా లేకుండా గాలింపు కొనసాగుతోంది.ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చిన్నారి క్షేమంగా తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరాలని ప్రజలు ప్రార్థిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కూడా స్పందిస్తూ, జ్ఞానేశ్వరి ఆయురారోగ్యాలతో ఇంటికి చేరాలని ఆకాంక్షించారు. -
మాజీ ప్రియుడు బ్లాక్మెయిల్.. యువతిని వెంబడిస్తూ.. వేధిస్తూ
శ్రీనగర్కాలనీ: యువతితో సన్నిహితంగా దిగిన ఫొటోలు, వీడియోలతో మాజీ ప్రియుడు బ్లాక్మెయిల్ చేసిన ఘటన మధురానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. విజయవాడ కృష్ణలంకకు చెందిన యువతి టెలీకాలర్గా పనిచేస్తూ రహమత్నగర్లో నివాసముంటోంది.ప్రేమిస్తున్నానని, పెళ్ళి చేసుకుంటానని జహీర్ అబ్బాస్ అనే యువకుడు నమ్మించి ఆమెకు దగ్గరయ్యాడు. పెళ్ళికి యువతి కుంటుంబీకులు అంగీకరించారు. మరో యువతితో నిశ్చితార్ధం జరిగిన విషయాన్ని తెలుసుకున్న యువతి జహీర్ను దూరం పెట్టింది. అయితే జహీర్ యువతిని వెంబడిస్తూ.. వేధిస్తూ గతంలో సన్నిహితంగా దిగిన ఫొటోలు, వీడియోలను సోషల్మీడియాలో పోస్ట్చేస్తానని బ్లాక్మెయిల్ చేశాడు. ఆమెకు తెలిసిన వారికి ఫొన్ చేసి, మెసేజులు పంపి దుష్ప్రచారం చేశాడు. దీంతో యువతి తనకు ప్రాణహాని ఉందని మదురానగర్ పోలీసులకు పిర్యాదుచేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కాటేదాన్లో.. అస్థి పంజరం కలకలం!
మైలార్దేవ్పల్లి: మైలార్దేవ్పల్లి ఠాణా పరిధిలోని కాటేదాన్ ఓల్డ్ కర్నూలు రోడ్డులో శుక్రవారం అస్థిపంజరం కలకలం సృష్టించింది. జీహెచ్ఎంసీ సిబ్బంది మ్యాన్హోల్స్ శుభ్రపరుస్తుండగా కుళ్లిపోయిన స్థితిలో అస్థి పంజరం కనిపించింది.దీంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు సమాచారం అందించడంతో మైలార్దేవ్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం అస్థిపంజరాన్ని పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతదేహం పురుషుడిదా, మహిళదా? అనే విషయం ఫోరెన్సిక్ పరీక్షలు, దర్యాప్తు తర్వాత తేలుతుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. -
మేం జీహెచ్ఎంసీ అధికారులం.. మమ్మల్నే ఆపుతావా?
బంజారాహిల్స్: రహదారిపై అపసవ్య దిశలో రావడాన్ని నిలువరించిన ట్రాఫిక్ కానిస్టేబుల్పై దాడి చేసి అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనలో జీహెచ్ఎంసీ జూబ్లీహిల్స్ సర్కిల్–36 ఉద్యోగులిద్దరినీ శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–14లోని లూసిడ్ ఆస్పత్రి రోడ్డులో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు కార్లు, ట్యాంకర్లు, లారీలు వెళ్లకుండా నిషేధం విధించి అడ్డంగా బారికేడ్లు ఏర్పాటుచేశారు. గురువారం మధ్యాహ్నం జీహెచ్ఎంసీ జూబ్లీహిల్స్ సర్కిల్–36 శానిటేషన్ ఇన్స్పెక్టర్ అమిత్కుమార్, ఏఈ పుప్పాల ఆనంద్ కారులో ఇటువైపు వెళ్లేందుకు యత్నించారు. విధుల్లో ఉన్న బంజారాహిల్స్ ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీశైలం ఇలా వెళ్లడానికి వీల్లేదని మర్యాదగా చెప్పాడు. జీహెచ్ఎంసీ ఆఫీసర్లం.. మమ్మల్నే అడ్డుకుంటావా? అంటూ ఆనంద్ దుర్భాషలాడుతూ కానిస్టేబుల్ శ్రీశైలంపై దాడికి దిగాడు. మేం జీహెచ్ఎంసీ అధికారులం.. మమ్మల్ని ఆపే దమ్ము ఎవరికీ లేదంటూ హెచ్చరించాడు. నీ అంతుచూస్తాం.. నిన్ను ఇక్కడి నుంచి బదిలీ చేస్తామంటూ అమిత్కుమార్ సదరు కానిస్టేబుల్ను ఫొటోలు తీస్తూ బారికేడ్లను తొలగించి కారులో ఉడాయించారు. శ్రీశైలం ఫిర్యాదు మేరకు అమిత్కుమార్, ఆనంద్లపై బంజారాహిల్స్ పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 121 (1), 132, 352, 351 (2) కింద కేసు నమోదు చేశారు. శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఠాణాలోనూ వీరు ప్రతాపం చూపేందుకు యత్నించడం కొసమెరుపు. -
మొరాయించిన స్టీరింగ్.. లోయలో పడ్డ బస్సు
నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి వందల అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయాలు కాగా.. వాళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.కవ్రేపలాంచోక్ జిల్లాలో శుక్రవారం ఈ విషాద ఘటన జరిగింది. బనేపా నుంచి రోషి గ్రామీణ మున్సిపాలిటీ వైపు వెళ్తున్న ప్రయాణికుల బస్సు నమోబుద్ధ మున్సిపాలిటీ పరిధిలోని సెల్ఫీ డాండా ప్రాంతంలో అదుపుతప్పి సుమారు 300 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే.. నేపాల్ సైన్యం, పోలీసులు, సాయుధ పోలీసు బలగాలు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. లోయలో పడిపోయిన బస్సు నుంచి క్షతగాత్రులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.జిల్లా పోలీసు కార్యాలయం వివరాల ప్రకారం.. ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కొందరిని గుర్తించగా.. మరికొందరి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గాయపడిన 16 మందిని ధులిఖేల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. #Nepal | Eight dead and 15 injured in bus accident in KavreThe bus fell some 200 m off the road in Namobudhha municipality. The 15 injured are undergoing treatment at the Dhulikhel hospital.A passenger bus heading to Sungure of Roshi Rural Municipality from Banepa had met… pic.twitter.com/aWrSS4U1Wu— DD News (@DDNewslive) June 12, 2026ప్రాథమిక సమాచారం ప్రకారం బస్సు స్టీరింగ్లో సాంకేతిక లోపం తలెత్తి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఓ ప్రయాణికుడు.. బస్సు సాధారణ వేగంతోనే ప్రయాణిస్తోందని చెప్పాడు. అయితే ఓ మలుపు వద్ద ఎదురుగా వచ్చిన వాహనానికి దారి ఇవ్వడానికి ప్రయత్నించే సమయంలో బస్సు రోడ్డు నుంచి జారి లోయలోకి దూసుకెళ్లిందని చెప్పాడు.దీంతో స్టీరింగ్ జామ్ కావడం వల్లే.. డ్రైవర్ వాహనంపై కంట్రోల్ తప్పి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఏమిటన్నది దర్యాప్తు అనంతరమే వెల్లడించనున్నారు. మరోవైపు.. నిన్న నేపాల్లోని ధన్కుటా జిల్లాలో మరో బస్సు ప్రమాదానికి గురైంది. రహదారిపై బస్సు బోల్తాపడటంతో 12 మందికి గాయాలయ్యాయి. -
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య..
కురవి: కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండలంలోని నల్లెల్ల శివారు గాజ తండా జీపీ పరిధి టేకుల తండాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఇదే మండలం కంచర్లగూడెం తండా గ్రామానికి చెందిన భూక్య శాంతి కుమార్తె కల్యాణి(27)తో టేకుల తండాకు చెందిన గుగులోత్ నరేశ్కు పరిచయడం ఏర్పడింది.2017లో ప్రేమించుకున్న వీరు 2018లో వివాహం చేసుకున్నారు. ఇటీవల కుటుంబ కలహాలు ఏర్పడ్డాయి. దీంతో కల్యాణి బుధవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నిస్తున్న క్రమంలో గుర్తించిన కుటుంబీకులు, భర్త నరేశ్ హుటాహుటిన మానుకోటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.అయితే అప్పటికే కల్యాణి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న సీరోలు ఎస్సై సంతోశ్ గురువారం తండాకు చేరుకుని పరిస్థితి తెలుసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంతోష్ తెలిపారు. మృతురాలికి నాలుగేళ్ల బాబు, 11 నెలల పాప ఉంది. -
ఉత్తీర్ణత సాధించలేదని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..
మహబూబ్నగర్ క్రైం: ఇంటర్లో ఫెయిల్ కావడంతో ఓ విద్యార్థి ఆత్మహత్య కు పాల్పడిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో చోటు చేసు కుంది. వన్టౌన్ ఎస్ఐ శీనయ్య కథనం ప్రకారం.. నగరంలోని మదీ నా మజీద్ ఏరియాకు చెందిన హాబీబ్ ఉమేద్(18) నగరంలో ఓ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ చదివాడు.ద్వితీయ సంవత్సరంలో రెండు సబ్జెక్టులు ఉత్తీర్ణత సాధించకపోవడంతో ఇటీవల మళ్లీ సప్లిమెంటరీ పరీక్షలు రాశాడు. కాగా గురువారం విడుదల చేసిన ఫలితాల్లో కూడా ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తానికి గురై ఉమేద్ మధ్యాహ్నం సమయంలో ఇంట్లో దుప్పటితో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు.గమనించిన కుటుంబసభ్యులు వెంటనే జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. మృతుడి తండ్రి మక్సూద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. మక్సూద్కు ఇద్దరు కూతుర్తెలతో పాటు కొడుకు హాబీబ్ ఉమేద్ ఉన్నారు. -
రూ.20 కోసం హత్య.. ట్యాక్సీ డ్రైవర్ మృతి!
రాప్తాడు రూరల్: రూ.20 కోసం గొడవ.. ఒకరి హత్యకు దారితీసింది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు విచక్షణారహితంగా దాడి చేయడంతో ట్యాక్సీ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం రూరల్ మండలం పాపంపేటలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి. పాపంపేట జుడియో షోరూం పక్కన శేఖర్ అనే వ్యక్తి కూరగాయల దుకాణం నిర్వహిస్తున్నాడు. గురువారం మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు వచ్చి కూరగాయలు కొనుగోలు చేశారు. బిల్లు రూ.120 అయ్యింది. రూ.500 నోటు ఇవ్వడంతో శేఖర్ రూ.380 వెనక్కు ఇచ్చాడు. అయితే ఇంకా రూ.20 వెనక్కు ఇవ్వాలని ఆ ఇద్దరు యువకులు అడిగారు. ఇందుకు వ్యాపారి ఇవ్వలేదు. మాటామాటా పెరిగి శేఖర్పై దాడి చేశారు.సర్దిచెప్పేందుకు వస్తే ప్రాణం తీసేశారుకూరగాయల దుకాణం వద్ద పరిస్థితి అదుపు తప్పుతుండటంతో అక్కడే ఉన్న పాపంపేటకు చెందిన ట్యాక్సీ డ్రైవర్ బెస్త చంద్ర (55) జోక్యం చేసుకున్నాడు. ఇద్దరినీ సముదాయించి గొడవను ఆపాలని ప్రయత్నించాడు. కానీ మద్యం మత్తులో ఉన్న యువకులు విచక్షణ కోల్పోయి ముఖం, ఛాతీపై పిడిగుద్దులు గుద్దడంతో చంద్ర అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కొద్దిసేపటికే ప్రాణాలు విడిచాడు. రూ.20 చిల్లర విషయంలో మొదలైన వాగ్వాదం చివరకు ఒక కుటుంబానికి తీరని శోకం మిగిల్చింది. సమాచారం అందుకున్న చంద్ర భార్య, పిల్లలు సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ‘గొడవ ఆపడానికి వెళ్లిన మా మనిషిని ఇలా పొట్టన పెట్టుకున్నారు‘ అంటూ భార్య రోదించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.నిందితుల కోసం గాలింపుఅనంతపురం రూరల్ సీఐ శ్రీకాంత్యాదవ్, ఎస్ఐ ధరణిబాబు సమాచారం అందగానే హుటాహుటిన సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కూరగాయల వ్యాపారితో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అప్పటికే అక్కడి నుంచి పరారైన నిందితుల కోసం గాలింపు చేపట్టారు. సమీప ప్రాంతాల్లో సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించి ఆనవాళ్లు గుర్తించినట్లు తెలిసింది. -
అక్కకు స్వీట్ ఇచ్చి.. తిరిగి వెళ్తుండగా..
మూసాపేట: కొత్త ఫోన్ కొన్న తరువాత అక్కకు స్వీట్లు ఇచ్చి ఇంటికి వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.కూకట్పల్లి పోలీసులు తెలిపిన మేరకు.. ఒరిస్సాకు చెందిన రాజేష్ (30) ఇందిరానగర్లో నివాసముంటూ అడ్డా కూలీగా పనిచేస్తున్నాడు. బుధవారం కొత్త మొబైల్ ఫోన్ కొనడంతో మూసాపేటలో ఉన్న తన అక్కకు స్వీట్ బాక్స్ ఇచ్చి బైక్పై అర్ధరాత్రి బయలుదేరాడు. ఐడీఎల్ చెరువు నుంచి జాతీయ రహదారిపైకి వెళుతుండగా వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఫిబ్రవరి నెల నుంచి రాజేష్ శివమాలలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
చెంబులో 'కీ'... అదే కలిసొచ్చింది దొంగలకి
గచ్చిబౌలి: ఇంటి యజమాని నిర్లక్ష్యంతో కలశం చెంబులో లాకర్ కీ పెట్టడంతోనే హిల్రిడ్జ్ విల్లాస్లో భారీ చోరీ చోటు చేసుకుందని, ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి 7.837 కిలోల బంగారు నగలు, 1.367 కిలోల వెండి, నగదు స్వా«దీనం చేసుకున్నట్లు సైబరాబాద్ సీపీ డాక్టర్ రమేష్ తెలిపారు. గురువారం గచ్చిబౌలిలోని కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. నేపాల్లోని కైలాలి జిల్లా మోహన్యాల్కు చెందిన దంపతులు కమల్ షాహీ (32), విమల్ షాహీ (30)లు నగరంలోని గచ్చిబౌలి హిల్రిడ్జ్ విల్లా నంబర్ 73లో నివసించే ప్రకాశ్ పాయ్ వద్ద వాచ్మన్, సర్వెంటుగా చేరారు.ఇంట్లోంచి వెళ్లిన కొద్దిసేపటికే.. ఈ నెల 6న ప్రకాశ్, ఆయన భార్య వందన, కుమారుడు అభిజిత్లు ముంబై వెళ్లారు. సహ నిందితుడు సురేష్ షాహీ కొద్ది సేపటికే కిటికీ యూపీవీసీ లాక్ బ్రేక్ చేసి ఇంటి లోపలికి వెళ్లాడు. సెంట్రల్ లాక్ తీశాడు. బెడ్రూంలో లాకర్పై ఉన్న కలశం చెంబులో కీతో లాకర్ ఓపెన్ చేసి బంగారు ఆభరణాలు బయటకు తీశాడు. కమల్, విమల్ వద్ద నగలు పెట్టాడు. ఆ సమయంలోనే పక్కనున్న వారు గమనించి సురే‹Ùను సమీప విల్లాలో ఉండే ప్రకాశ్ పాయ్ కూతురు వద్దకు తీసుకెళ్లారు. ఆ రోజు రాత్రి సురేష్ మాత్రం విల్లాలో ఉన్నాడు. కమల్, విమల్ ఎన్బీటీ నగర్లోని విమల్ సోదరి కల్పన షాహీని తీసుకొని సికింద్రాబాద్ నుంచి రైలులో పరారయ్యారు. మరునాటి ఉదయం సురేష్ కూడా విల్లా నుంచి పరారయ్యాడు. ఇంటికి తిరిగి వచి్చన ప్రకాష్ పాయ్ లాకర్లో నగలు చోరీకి గురైనట్లు గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. ఫోన్ నంబర్ ఆధారంగా.. ఆరు ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే నిందితులు ఎన్బీటీ నగర్కు ఆటో వెళ్లినట్లు గుర్తించి అక్కడికి వెళ్లారు. కొత్త సిమ్ కార్డు కవర్పై ఉన్న ఫోన్ నంబర్ ఆధారంగా ఉత్తరప్రదేశ్లోని ఉదంపూర్లో నిందితులు ఉన్నట్లు గుర్తించారు. బిహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఎస్టీఎఫ్ పోలీసుల సహకారంతో కమల్, విమల్, కల్పన, పనిలో చేరి్పంచిన బిశ్వ కర్మను అరెస్ట్ చేసినట్లు సీపీ తెలిపారు. ప్రధాన సూత్రధారి సురేష్ షాహీ పరారీలో ఉన్నట్లు చెప్పారు. -
పనిమనిషి ఖాతాలో 52 లక్షలా?
ఆన్లైన్ మోసాలు రోజురోజుకూ కొత్త రూపాలు దాలుస్తున్నాయి. బ్యాంక్ లావాదేవీలు, పెట్టుబడులు, ఉద్యోగాల పేరుతో వలలు విసురుతూ సైబర్ నేరగాళ్లు అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఎంత అవగాహన పెరిగినా.. ఎంతటి ఉన్నత స్థానాల్లో ఉన్నవారైనా ఇలాంటి మోసాలకు బలవుతూనే ఉన్నారు. తాజాగా ఓ డేటింగ్ యాప్లో మొదలైన పరిచయం.. సంచలన కేసుగా మారింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ హనీట్రాప్ తరహా మోసంలో చిక్కుకున్నది సామాన్య వ్యక్తి కాదు.. ఓ మహిళా జడ్జి.హర్యానాలో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం ఇప్పుడు న్యాయ వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారింది. ఓ మహిళా జడ్జి ఇంట్లో పని మనిషి తాను డేటింగ్ యాప్లో మోసపోయానని పోలీసులను ఆశ్రయించింది. జడ్జి రిఫరెన్స్ కావడంతో ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. కానీ కేసు కోర్టుకు చేరిన తర్వాత అసలు కథ బయటపడింది. టిండర్ ద్వారా పరిచయమైన వ్యక్తి చేతిలో రూ.52 లక్షలకు పైగా మోసపోయింది పనిమనిషి కాదు.. సదరు మహిళా న్యాయమూర్తి అని తేలింది.దర్యాప్తు వివరాల ప్రకారం.. గత ఏడాది నవంబర్లో టిండర్ యాప్లో "అభిమన్యు వశిష్ఠ్" పేరుతో ఓ వ్యక్తి మహిళా జడ్జికి పరిచయమయ్యాడు. తాను కేంద్ర ప్రభుత్వంలోని ఓ రహస్య విభాగంలో పనిచేస్తున్నానని చెప్పి ఆమె నమ్మకం సంపాదించాడు. క్రమంగా ఇద్దరి మధ్య సన్నిహిత పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మబలికాడు.అతని మాటలు నమ్మిన జడ్జి.. వివిధ బ్యాంకు ఖాతాలకు రూ.52 లక్షలకు పైగా బదిలీ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అయితే చెప్పినట్టుగా లాభాలు రాకపోవడం, అతని ప్రవర్తనపై అనుమానాలు రావడంతో తాను మోసపోయినట్లు గుర్తించారు.అయితే ఈ కేసులో అత్యంత ఆసక్తికరమైన అంశం ఫిర్యాదు నమోదైన తీరు. అసలు డబ్బు జడ్జి ఖాతాల నుంచి వెళ్లినా.. ఫిర్యాదు మాత్రం ఆమె ఇంటి పనిమనిషి పేరుతో నమోదైంది. దీంతో విచారణ సందర్భంగా ఢిల్లీ కోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అసలు బాధితురాలు ఎవరో స్పష్టంగా పేర్కొనకుండా కేసు నమోదు కావడంపై ప్రశ్నలు లేవనెత్తింది.బెయిల్ పిటిషన్ను విచారించిన అదనపు సెషన్స్ జడ్జి సౌరభ్ ప్రతాప్ సింగ్ లాలేర్.. రొమాన్స్ లేదా హనీట్రాప్ తరహా మోసాల బాధితులు ఇబ్బందిగా భావించడం సహజమేనని, కానీ అందుకోసం దర్యాప్తు పారదర్శకతను పక్కనపెట్టలేమని వ్యాఖ్యానించారు.ఈ కేసులో దర్యాప్తు ఇంకా పూర్తికాలేదని కోర్టు గుర్తించింది. టిండర్ చాట్లు, పూర్తి వాట్సాప్ సంభాషణలు, కాల్ డీటెయిల్ రికార్డులు వంటి కీలక ఆధారాలు ఇంకా సేకరించలేదని పేర్కొంది. నిందితుడు కూడా తన మొబైల్ను పూర్తిగా పరిశీలనకు ఇవ్వకుండా, తనకు అనుకూలమైన కొన్ని సందేశాలు మాత్రమే సమర్పించాడని కోర్టు వ్యాఖ్యానించింది.దీంతో నిందితుడి ప్రవర్తనను "దాగుడుమూతల ఆట"గా అభివర్ణించిన కోర్టు.. బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. టిండర్, వాట్సాప్ రికార్డులను పూర్తిగా సేకరించాలని, డబ్బు బదిలీల వెనుక ఉన్న ఖాతాలు, సంస్థలను పరిశీలించాలని, నిందితుడి ఫోన్పై ఫోరెన్సిక్ విశ్లేషణను వేగవంతం చేయాలని దర్యాప్తు అధికారులను ఆదేశించింది.డేటింగ్ యాప్లో మొదలైన ఈ పరిచయం.. ప్రేమ, పెట్టుబడులు, నమ్మకం పేరుతో సాగి.. చివరకు రూ.52 లక్షల మోసం, ఫిర్యాదు చుట్టూ కొత్త ప్రశ్నలు, కోర్టు వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఈ కేసులో ఇంకా ఎలాంటి నిజాలు బయటపడతాయన్నది ఆసక్తికరంగా మారింది. -
ప్రియుడి ఘరానా మోసం.. అప్పటికే కన్నతల్లి ఘాతుకం!
కట్టుకున్న భర్తను, కన్నబిడ్డలను వదిలి ప్రియుడితో కొత్త జీవితం ప్రారంభించాలని భావించిన ఓ మహిళ.. చివరకు ఊహించని రీతిలో జైలు పాలైంది. తన సహజీవనానికి అడ్డుగా ఉందనే అనుమానంతో ఆరేళ్ల చిన్నారిని హత్య చేయడమే కాదు.. ప్రియుడి మాయమాటలకు నమ్మి జీవితాన్నే నాశనం చేసుకుంది. బెంగళూరులో సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాల్లోకి వెళ్తే..దావణగెరెకు చెందిన ప్రవీణ్, ప్రియాంక దంపతులకు 2007లో వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రవీణ్ విద్యాసంస్థ నిర్వహిస్తుండగా, ప్రియాంక న్యాయవాదిగా పనిచేస్తున్నారు. 2025 చివర్లో కుటుంబానికి చెందిన 25 ఎకరాల భూమి వివాదానికి సంబంధించిన కేసు పనిమీద బెంగళూరు వెళ్లిన ప్రియాంక.. కాలేజీ రోజుల స్నేహితుడు, ఒకప్పుడు ప్రేమించిన మోహన్ను మళ్లీ కలిసింది.తాను రూ.1,000 కోట్ల ఆస్తులున్న రియల్ ఎస్టేట్ వ్యాపారినని మోహన్ నమ్మబలికాడు. అంత ఆస్తి ఉందని చెప్పడంతో ఆమె అతనికి ఆకర్షితురాలైంది. క్రమంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. బెంగళూరు నుంచి తిరిగొచ్చిన తర్వాత భర్త ప్రవీణ్పై విడాకుల కోసం ఒత్తిడి తెచ్చిన ప్రియాంక.. చివరకు ఇంటిని విడిచి వెళ్లిపోయింది.విడిపోయిన తర్వాత పెద్ద కుమార్తె తండ్రి వద్ద ఉండగా, చిన్నారి వెన్నెల మాత్రం ప్రియాంకతో కలిసి బెంగళూరులోని సీగేహళ్లిలో అద్దె విల్లాలో నివసిస్తోంది. ఈ క్రమంలో మార్చి 24న వెన్నెల పుట్టినరోజు వేడుకలు జరిపిన ప్రియాంక.. బిర్యానీ, ఐస్క్రీం తినిపించిన తర్వాత చిన్నారిని కారులోనే వదిలేసి ప్రియుడు మోహన్తో కలిసి కాఫీ షాప్కు వెళ్లినట్లు చెప్పింది. మరుసటి రోజు వెన్నెల నిద్రలేవకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.అనారోగ్యంతో చిన్నారి మరణించిందని కుటుంబ సభ్యులకు చెప్పి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే బిడ్డ మృతిపై అనుమానంతో ప్రవీణ్ పోస్ట్మార్టం నివేదికను పరిశీలించాడు. ఆ నివేదికను విదేశాల్లో పనిచేస్తున్న తన డాక్టర్ సోదరికి చూపించగా, అందులో అనేక లోపాలు ఉన్నాయని ఆమె గుర్తించింది. దీంతో ప్రవీణ్ పోలీసులను ఆశ్రయించాడు.దర్యాప్తులో వెన్నెలది సహజ మరణం కాదని, గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. తమ భవిష్యత్తుకు చిన్నారి అడ్డుగా మారిందనే కారణంతో ప్రియాంక, మోహన్ కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. చిన్నారి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు మోహన్ను అరెస్టు చేశారు. అయితే అప్పటి నుంచి పరారీలో ఉన్న ప్రియాంకను గురువారం హాసన్లో అదుపులోకి తీసుకుని బెంగళూరుకు తరలించారు.కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ప్రియాంక, మోహన్లు కాశీలో రహస్యంగా వివాహం చేసుకున్నారట. ఆ తర్వాత దుబాయ్లో నూతన సంవత్సర వేడుకలు కూడా జరుపుకున్నారని తెలుస్తోంది. వెన్నెల కేసు దర్యాప్తులో మరో షాకింగ్ విషయం బయటపడింది. తాను కోటీశ్వరుడినని చెప్పిన మోహన్ వాస్తవానికి పెద్ద వ్యాపారి కాదని, అద్దె ఇళ్ల బ్రోకర్గా పనిచేస్తున్నాడని తేలింది. అతని మాటలు నమ్మి కుటుంబాన్ని వదిలేసిన ప్రియాంక.. చివరకు కన్నకూతురి హత్య కేసులో నిందితురాలిగా కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. -
ఢిల్లీలో మరో ఘోర అగ్నిప్రమాదం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని మరో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. దక్షిణ ఢిల్లీలోని తుగ్లకాబాద్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ బహుళ అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రులకు తరలించి సహాయక చర్యలు చేపట్టారు.తుగ్లకాబాద్లోని మాధ్యమ్ మార్గ్, నయా తారా అపార్ట్మెంట్ సమీపంలోని ఓ ఐదంతస్తుల భవనంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనం లోపల పలువురు చిక్కుకుపోయినట్లు సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు.అర్ధరాత్రి 2.35 గంటల నుంచి 2.37 గంటల మధ్య అగ్నిమాపక శాఖకు ప్రమాదంపై సమాచారం అందింది. మూడు ఫైర్ టెండర్లు, రెండు వాటర్ బౌజర్లు, శ్వాస సహాయక యూనిట్, క్విక్ రెస్పాన్స్ వాహనాలను రంగంలోకి దించారు. అనంతరం పరిస్థితి తీవ్రత దృష్ట్యా అదనపు అగ్నిమాపక వాహనాలను కూడా పంపించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో పాటు భవనంలో చిక్కుకుపోయిన వారిని రక్షించే చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో ఆరుగురిని సురక్షితంగా బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. మరో ఎనిమిది మంది గాయపడిన వారిని ఢిల్లీలోని ఎయిమ్స్ ట్రామా సెంటర్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.Delhi: A fire broke out in a multi-storey building in Tughlakabad Extension during the early hours of the day. The blaze reportedly started in the ground-floor parking area, where 7–8 motorcycles and scooters caught fire, before spreading through the building. The fire department… pic.twitter.com/rHgTcXvG8T— IANS (@ians_india) June 12, 2026అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. భవనం లోపల పార్క్ చేసిన వాహనాల వద్ద నుంచి మంటలు ప్రారంభమైనట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఉదయం 3.45 గంటల ప్రాంతంలో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురాగా, నాలుగు గంటలకు అగ్నిమాపక చర్యలు ముగిసినట్లు అధికారులు ప్రకటించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది.ఇటీవలి కాలంలో ఢిల్లీలో వరుసగా చోటుచేసుకుంటున్న భవన ప్రమాదాలు, అగ్నిప్రమాదాల నేపథ్యంలో భద్రతా ప్రమాణాలపై చర్చ మొదలైంది. గత నెలలో మాలవీయనగర్లో మూడు అంతస్తుల వాణిజ్య భవనం కూలిపోవడంతో ఆరుగురు మృతి చెందగా, జూన్ 3న హౌజ్రాణిలోని ఐదు అంతస్తుల బిల్డింగ్లో జరిగిన అగ్నిప్రమాదంలో విదేశీయులతో సహా 23 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో.. జూన్ 5 నుంచి 10 దాకా 607 ప్రదేశాలను అధికారులు తనిఖీ చేయగా, గురువారం ఒక్కరోజే మరో 47 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. దీంతో మొత్తం తనిఖీ చేసిన ప్రదేశాల సంఖ్య 654కు చేరింది. ఇదే సమయంలో మున్సిపల్ కార్పొరేషన్ 15 అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతో పాటు ఆరు భవనాలను సీజ్ చేసింది. అలాగే 61 షోకాజ్ నోటీసులు, 8 సీలింగ్ నోటీసులు, 16 కూల్చివేత ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 1 నుంచి 11 వరకు మొత్తం 179 అక్రమ నిర్మాణాలను కూల్చివేయగా, 206 భవనాలను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. భవన భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు, అగ్నిమాపక నిబంధనల పట్ల నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ ప్రత్యేక తనిఖీలు, కఠిన చర్యలు కొనసాగుతున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. -
ఫేస్బుక్లో వల.. సహజీవనం తర్వాత అసలు రంగు!
మేడిపల్లి: వివాహం చేసుకుంటానని నమ్మించి ఓ మహిళతో సహజీవనం చేసి, ఆపై రూ.40 లక్షల నగదు, రెండున్నర తులాల బంగారం తీసుకొని మోసం చేసిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. బోడుప్పల్ ఉదయ్ నగర్కు చెందిన ఒక మహి భర్తతో విభేదాల కారణంగా కొన్నేళ్లుగా వేరుగా నివసిస్తోంది.2019లో ఫేస్బుక్ ద్వారా అస్సాంలో విధులు నిర్వహిస్తున్న షేక్ మహబూబ్ హుస్సేన్ పరిచయమయ్యాడు. అది కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఆమె అతనితో కలిసి బోడుప్పల్లో సహజీవనం చేసింది. అయితే, గత ఏడాది కాలంగా మహబూబ్ హుస్సేన్ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు బాధితురాలు గుర్తించింది.ఈ విషయంపై అతడిని ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదు. పెళ్లి పేరుతో తన వద్ద నుండి రూ.40 లక్షల నగదు, రెండున్నర తులాల బంగారం తీసుకుని మోసం చేశాడని ఆరోపించింది. నిందితుడి కుటుంబ న్యాయవాది కూడా తనకు పలుమార్లు ఫోన్ చేసి బెదిరింపులకు గురిచేశాడని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
మార్కాపురం: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త అతికిరాతకంగా నరికి చంపిన సంఘటన మార్కాపురం జిల్లా కొమరోలు మండలం సర్విరెడ్డిపల్లెలో బుధవారం జరిగింది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గిద్దలూరుకు చెందిన పెయింటర్ పన్నీటి దావీదుకు సర్విరెడ్డిపల్లెకు చెందిన చిన్నప్ప కుమార్తె జ్యోతితో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో ఏడేళ్ల క్రితం జ్యోతి పుట్టింటికి వచ్చింది. డ్వాక్రా వీఓఏగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. దావీదు నెలలో ఒకటి రెండుసార్లు సర్విరెడ్డిపల్లె వచ్చి పిల్లలను చూసుకుని వెళ్తుండేవాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయాన్నే జ్యోతి బహిర్భూమికి వెళ్లిన సమయంలో చుట్టుపక్కల ప్రాంతంలో దాక్కుని ఉన్న దావీదు సంచిలో తెచ్చుకున్న గొడ్డలి తీసి భార్యను నరికేందుకు ప్రయతి్నంచాడు. జ్యోతి సోదరి గొడ్డలి దాడిని అడ్డుకునే ప్రయత్నం చేయగా పక్కకు నెట్టేసి జ్యోతి తలపై నరికాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. సంఘటన స్థలాన్ని మార్కాపురం డీఎస్పీ నాగరాజు, గిద్దలూరు సీఐ రామకోటయ్య పరిశీలించారు. మృతురాలి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మార్కాపురం ఫోరెన్సిక్ టీం ఆధారాలు సేకరించింది. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
హరిణి మృతి.. ఆ రాత్రి ఏం జరిగింది?
శ్రీకాకుళం: లింగాలవలస పంచాయతీ సోర్లిగాం గ్రామానికి చెందిన దుంపల హరిణి(24) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గ్రామస్తులు, పోలీసుల సమాచారం మేరకు.. దుంపల హరిణికి తన మేనమామ వెంకటేశ్వరరావుతో కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. హరిణి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే క్రమంలో హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటోంది. అక్కడ మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ విషయమై కుటుంబ సభ్యులకు, హరిణికి మధ్య గొడవలు జరిగాయి. అయినప్పటికీ వ్యవహార శైలిలో మార్పు రాకపోవడంతో విసిగిపోయిన బంధువులు హరిణిని గ్రామానికి రప్పించినట్లు తెలిసింది. ఈ క్రమంలో మరోసారి గొడవ జరగడంతో ఈ నెల 1న రాత్రి హరిణి ఆత్మహత్యకు పాల్పడిందంటూ 2వ తేదీ వేకువజామునే రహస్యంగా అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, హరిణికి కోచింగ్లో పరిచయమైన వ్యక్తి సమాచారం తెలుసుకుని శక్తి టీమ్కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి వివరాలు సేకరించారు. వీఆర్వో రమేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. -
వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని..
కామారెడ్డి (ఎల్లారెడ్డి): వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేసిన కేసులో భార్య, ప్రియుడిని సదాశివనగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు బుధవారం సదాశివనగర్ స్టేషన్లో వివరాలు వెల్లడించారు. మర్కల్ గ్రామానికి చెందిన కంచర్ల రాజయ్య గత నెల 22న రాత్రి వ్యవసాయ పొలానికి వెళ్తుండగా బైకు అదుపుతప్పి పడిపోయి మృతి చెందాడని భార్య కంచర్ల రేణుక సదాశివనగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా ఎస్పీ రాజేశ్చంద్ర ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణ, సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్ నేతృత్వంలో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పక్కా ప్రణాళిక ప్రకారం తలపై బలంగా కొట్టడంతోనే రాజయ్య మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో మర్కల్ గ్రామానికి చెందిన కంచర్ల గంగశేఖర్ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. గంగశేఖర్కు నాలుగు సంవత్సరాలుగా రాజయ్య భార్య రేణుకతో వివాహేతర బంధం కొనసాగుతోంది. తమ బంధానికి భర్త రాజయ్య అడ్డుగా ఉన్నాడని భావించడంతోపాటు చనిపోతే వచ్చే ఇన్సురెన్స్ డబ్బులను పొందవచ్చనే దురాశతో ఇద్దరు కలిసి రాజయ్యను హతమార్చాలని కుట్రపన్నారు. అందులో భాగంగా గత నెల 21న గంగశేఖర్ ముందస్తు ప్రణాళికతో రాజయ్యను గాంధారి ప్రాంతానికి పిలిపించాడు. మద్యం తాగించిన అనంతరం తిర్మన్పల్లి గ్రామ శివారులోని రామారెడ్డి ప్రధాన రహదారిపై రాత్రివేళ మత్తులో ఉన్న రాజయ్య తలపై గంగశేఖర్ ఐరన్ రాడ్తో బలంగా కొట్టి దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహం, ద్విచక్ర వాహనం అక్కడే పడేసి పరారయ్యాడు. పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. హత్యకు ఉపయోగించిన ఐరన్ రాడ్, ద్విచక్ర వాహనం, నిందితుల మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. నిందితులిద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు పేర్కొన్నారు. కేసును ఛేదించిన సీఐ సంతోష్ కుమార్, ఎస్సైలు పుష్పరాజ్, సిద్ధిక్, పోలీస్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. -
విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు.. సీన్ రీకన్స్ట్రక్షన్
బంజారాహిల్స్: నగల కోసం ఇంటి యజమానురాలిని దారుణంగా హత్య చేసి పరారైన నేపాలీ గ్యాంగ్లో ఓ కీలక నిందితుడితో పాటు రిసీవర్ను జూబ్లీహిల్స్ పోలీసులు పది రోజల కస్టడీకి తీసుకోగా బుధవారం వీరితో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు.గత నెల 8వ తేదీన జూబ్లీహిల్స్ ప్రశాసన్నగర్లో నివసించే విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్రంజన్ ఇంట్లో పనిచేస్తున్న నేపాల్కు చెందిన కల్పన అలియాస్ ధర్మ.. నేపాల్కే చెందిన మరో ఏడు మందిని పిలిపించి నగలు దొంగిలించి ఆయన భార్య తనూజను దారుణంగా హత్య చేసి పరారయ్యారు.నిందితుల్లో ఒకరైన సునీల్ పరియార్ను ముంబాయిలో అరెస్టు చేశారు. ఆభరణాలు కొనుగోలు చేసిన రిసీవర్ దిలీప్ను కూడా అరెస్టు చేశారు. కస్టడీలో భాగంగా వీరిద్దరినీ ప్రశాసన్నగర్లోని తనూజ హత్య చేసిన ఇంటికి తీసుకువచ్చి ఆ రోజు ఏమి జరిగిందో సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు.అవసరమైతే సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం పూణె, ముంబాయికి కూడా వెళ్లేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. -
యువతి దారుణ హత్య.. కాళ్లు, చేతులు కట్టి చెరువులో పడేశారు!
ప్రశాంతతకు మారుపేరైన పాలకొండలో ఓ గిరిజన యువతి అనుమానాస్పద మృతి ఈ ప్రాంత వాసులను ఉలిక్కిపడేలా చేసింది. ఓ గిరిజన యువతిని అత్యంత కిరాతకంగా కాళ్లు, చేతులు వెనక్కి విరిచికట్టి చెరువులో పడేసిన ఘటన బుధవారం సాయంత్రం వెలుగు చూడటంతో సర్వత్రా భయాందోళనలు నెలకున్నాయి. ఇందుకు సంబంధించి పోలీసులు, స్థానికులు అందించిన వివరాలు.. పాలకొండ మండలం తుమరాడ వయా చింతాడ గ్రామం మధ్య గల చెరువులో యువతి మృతదేహం తేలుతున్నట్లు పోలీసులకు బుధవారం సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. కాళ్లు, చేతులు వెనక్కి విరిచికట్టి చెరువులో పడేసినట్లు గుర్తించారు. అప్పటికే మండల పరిధిలో బర్నసీతంపేట గ్రామానికి చెందిన బిడ్డిక ఉషారాణి (32) కనిపించటం లేదని ఆమె తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 6వ తేదీన ఇంటి నుంచి వెళ్లిన తమ కుమార్తె తిరిగి ఇంటికి చేరకపోవటంతో తల్లిదండ్రులు చిన్నారావు, కామమ్మ పోలీసులకు బుధవారం ఉదయం తెలియజేశారు. చెరువులో యువతి మృతదేహాం ఉండటంతో పోలీసులు చిన్నారావుకు సమాచారం అందించారు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం పూర్తిగా నీటిలో నాని రూపు కోల్పోవటంతో దుస్తుల ఆధారంగా మృతురాలు తమ కుమార్తె అని నిర్ధారించారు. ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడాలనే తపనతో బీఈడీ పూర్తి చేసిన కుమార్తె ఇలా ఘోరమైన స్థితిలో శవంగా మారటంతో మృతురాలి తల్లిదండ్రులు, అన్నదమ్ములు సతీష్ సురేష్, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఆస్పత్రికి తరలించారు. వలంటీరుగా సేవలు గత ప్రభుత్వంలో గ్రామ వలంటీర్గా సేవలు అందించి మంచి పేరు తెచ్చుకున్న ఉషారాణి ఇలా చెరువులో దారుణమైన స్థితిలో శవమై కనిపించటం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలె శ్రీకాకుళంలో బీఈడీ పూర్తి చేసిన ఉషారాణి ఈ నెల 6వ తేదీన చదువుకు సంబంధించి అప్లికేషన్ పెట్టేందుకు ఇంట్లో చెప్పి పాలకొండ వెళ్లాలని తండ్రి వద్ద రూ.500 తీసుకుని వెళ్లినట్లు బంధువులు చెబుతున్నారు. తిరిగి ఇంటికి రాకపోవటంతో స్నేహితులు, బంధువుల ఇళ్లకు వెళ్లి ఉంటుందని భావించామన్నారు. శనివారం రాత్రి నుంచి తన సెల్ కూడా అందుబాట్లోకి రాలేదన్నారు. ఘటనా స్థలానికి, మృతురాలి స్వగ్రామానికి దాదాపు 15 కిలోమీటర్లు దూరం ఉంటుంది. ఉషారాణి మృతి తీరు అనుమానాలకు తావిస్తుంది. ఏం జరిగిందోగాని కాళ్లు చేతులు వెనక్కి విరిచి, తాళ్లతో కట్టి చెరువులోకి తోసేయటం వెనుక కారణాలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఇది ఒక్కరి పనేనా.. లేక ఎంతమంది ఉన్నారు... ఈ ఘటనకు కారణమేమన్న కోణాల్లో దర్యాప్తు చేపడతామని ఎస్ఐ డోల వెంకన్న తెలిపారు. మహిళలకు రక్షణ కరువు కూటమి అధికారం చేపట్టిన తరువాత మహిళలకు రక్షణకు కరువైందని మాజీ ఎమ్మెల్యే విశ్వాçసరాయి కళావతి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. రాష్ట్రంలో ప్రతి రోజు ఏదో ఒకచోట మహిళలపై అత్యాచారాలు, హత్యలు, లైంగిక వేధింపులు, దాడులు జరుగుతున్నాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గిరిజన యువతి అత్యంత దారుణంగా హత్యకు గురవడం అమానుషం అన్నారు. ఈ ప్రభుత్వం మహిళలపై దాడులు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించకపోవటంతో ఈ తరహా ఘటనలు తరచూ జరుగుతున్నాయన్నారు. ఉషారాణిని హత్య చేసిన వారిని త్వరితగతిన గుర్తించాలన్నారు. వారిని కఠినంగా శిక్షించి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ నాయకులతో పాటు గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి. భవిష్యత్లో ఈ తరహా ఘటనలు జరగకుండా చూడాలని కోరారు.పాలకొండ రూరల్/పాలకొండ: -
తుపాకీతో కాల్చుకుని మహిళ ఆత్మహత్య
కర్ణాటక: ఇంట్లో రివాల్వర్తో కాల్చుకుని మహిళ అనుమానాస్పద రీతిలో చనిపోయిన ఘటన చిక్కమగళూరు నగరంలోని హాళేనహళ్లిలో జరిగింది. వ్యాపారవేత్త రాజేంద్ర భార్య సుమ (55) గృహిణి. బుధవారం ఇంట్లో లైసెన్స్డ్ రివాల్వర్తో ఆమె కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనకు ముందు డెత్నోట్ రాసి పెట్టారు. ఘటన జరిగిన సమయంలో ఆమె భర్త బయటకు వెళ్లాడు, కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు. తుపాకీ కాల్పుల శబ్ధాలు విని స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వచ్చి చూసేసరికి ఆమె రక్తపు మడుగులో చనిపోయి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.బెయిలు రద్దు అర్జీ తిరస్కృతి యశవంతపుర: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో విడుదలైన ఐదుమంది నిందితుల బెయిల్ను రద్దు చేయాలని పోలీసుల న్యాయవాది దాఖలు చేసిన అర్జీని హైకోర్టు తిరస్కరించింది. పవన్, ధనరాజు, రాఘవేంద్ర, వినయ్, నందీశ్లకు పెద్ద ఊరట కలిగింది. ఐదుగురికీ గతంలో కింది కోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని ప్రాసిక్యూషన్ కోరింది. న్యాయమూర్తి జస్టిస్ ఎస్.రాచయ్య విచారించి రద్దు చేశారు. దర్శన్ భార్యకు వేధింపులు దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో పరప్పన సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్న ప్రముఖ నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మి సోషల్ మీడియా ద్వారా ఆకతాయిలు వేధిస్తున్నారు. ఆమెను కించపరుస్తూ అశ్లీల మెసేజ్లు పెడుతున్నారు. భర్త జైల్లో ఉంటే ఈమె మాత్రం కార్లలో షికార్లు చేస్తూ ఎంజాయ్ చేస్తోందని నానా రకాలుగా నిందిస్తున్నారు. దీంతో విసిగిపోయిన విజయలక్ష్మి బెంగళూరు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
లేడీ డాన్ నీతూభాయ్.. కిరాణా షాపు మాటున..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్ నిర్వహించింది. కిరాణా షాపు మాటున నీతూ భాయ్ గంజాయి అమ్ముతోంది. గంజాయి కోసం ఆమె ఇంటికి ఐటీ ఉద్యోగులు క్యూకట్టారు. 27 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు పట్టుబడ్డారు. గతంలోనే నీతూ భాయ్ను అరెస్ట్ చేసిన అధికారులు పీడీ యాక్ట్ పెట్టారు. జైలు నుంచి బయటకు వచ్చిన నీతూభాయ్ మళ్లి అదే గంజాయి దందా కొనసాగిస్తోంది.రోజుకు రూ.5 లక్షల నుంచి 10 లక్షల వరకు గంజాయి అమ్మకం సాగిస్తున్నట్లు సమాచారం. నానక్రాంగూడలో గంజాయి డాన్ నీతూ భాయ్ కోసం నిఘా పెట్టిన ఈగల్ ఫోర్స్.. గంట వ్యవధిలో 50 మంది ఐటీ ఉద్యోగులను అదుపులోకి తీసుకుంది. ఈగల్ ఫోర్స్ వస్తుందన్న సమాచారంతో నీతూ భాయ్ పరారైంది. -
భార్య, కుమారున్ని హతమార్చి..
కర్ణాటక: కుటుంబాన్ని ప్రాణంలా కాపాడుకోవాల్సిన ఇంటి పెద్ద హంతకుడయ్యాడు. భార్య, కుమారున్ని చంపి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. మండ్య నగరంలో దుస్తుల వ్యాపారి ఒకరు ఈ ఘోరానికి పాల్పడ్డాడు. వ్యాపారి ప్రభాకర్ (65), భార్య జ్యోతి (55), కుమారుడు సంతోష్ (30) మృతులు. ఏం జరిగిందంటే.. వివరాలు.. నెహ్రూ నగరలో ప్రభాకర్కు క్లాత్ స్టోర్ ఉంది. కుటుంబ నిర్వహణ, వ్యాపారం కోసం పెద్ద మొత్తంలో అప్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇంట్లో సోమవారం రాత్రి భోజనం చేసి పడుకున్నాక.. భార్య జ్యోతి గొంతుకు చీర బిగించి చంపబోయాడు. ఆ శబ్ధాలకు మరో గదిలో ఉన్న కుమారుడు సంతోష్ వచ్చాడు. అయినప్పటికీ ప్రభాకర్ భార్యను హతమార్చి, ఆపై కుమారున్ని కూడా అదే మాదిరిగా ప్రాణాలు తీశాడు. పక్క గదిలో నిద్రిస్తున్న కోడలికి ఇదేమీ తెలియదు. తరువాత తన బట్టల అంగడికి వచ్చి ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం కోడలు నిద్రలేచి అత్త వద్దకు వెళ్లగా ఘోరం బయటపడింది. తూర్పు పోలీసు స్టేషన్ సిబ్బంది, మండ్య ఎస్పీ శోభారాణి చేరుకుని పరిశీలించారు. పాపం.. కొత్త కోడలు ఈ ఘటనలో మరో విషాదం ఏమిటంటే.. నెల రోజుల క్రితమే సంతోష్కు ఘనంగా పెళ్లి చేయడం. అతని భార్య జీవితం కూడా ఛిన్నాభిన్నమైంది. రాత్రి తన గదినుంచి భర్త బయటకు వెళ్లిన సంగతి ఆమెకు తెలియరాలేదు. ఫ్యాన్ శబ్దం ఎక్కువగా ఉండడం వల్ల ఏ చప్పుళ్లు వినిపించలేదని ఆమె తెలిపింది. డెత్నోట్లో.. వ్యాపారంలో నష్టాలు, అప్పుల వల్ల విరక్తికి గురై ప్రభాకర్ భార్య, కొడుకును చంపేశారని ఎస్పీ శోభ తెలిపారు. ప్రభాకర్ డెత్నోట్ లభించిందని తెలిపారు. ఇంటి రుణం, నష్టాలు, ఉచిత బస్సు పథకం వల్ల తమకు వ్యాపారం బాగా తగ్గిపోయిందని లేఖలో రాశారన్నారు. -
పిల్లల సమాచారం.. సోషల్గా వద్దు!
సాక్షి, హైదరాబాద్: ‘నా బిడ్డ స్కూల్లో ఫస్ట్ వచ్చింది’, ‘ఇవాళ నా కుమారుడి పుట్టినరోజు.. ‘మా పాప అక్షరాభ్యాసం చేయించాం’, ‘మా పిల్లలను ఫలానా స్కూల్లో చేర్పించాం..’ అంటూ పిల్లలకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని సామాజిక మాధ్యమ వేదికల ద్వారా పంచుకోవడం ఇప్పటి తరం తల్లిదండ్రులకు సాధారణమైంది.అయితే ఈ చర్యలే పిల్లలను సైబర్ నేరగాళ్ల బారిన పడేలా చేస్తున్నాయని సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లల ఆన్లైన్ భద్రతపై స్కూళ్లు, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సైతం సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల చేతికి ఒక స్కూల్ వార్షికోత్సవంలో తీసిన ఫొటోలో విద్యార్థి పేరు, స్కూల్ లోగో, తరగతి వివరాలు కనిపిస్తే, సోషల్ మీడియా ద్వారా ఆ బాలుడి పూర్తి డిజిటల్ ప్రొఫైల్ను సేకరించడం సైబర్ నేరగాళ్లకు సులభమవుతుందని చెబుతున్నారు.అనంతరం ఫేక్ సోషల్ మీడియా ఖాతాల ద్వారా కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకున్నట్లు దేశంలోని సైబర్ భద్రతా సంస్థలు పలుమార్లు హెచ్చరించాయి.ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో మీ వివరాలు ఇతరులకు కనిపించకుండా ప్రైవేటు సెట్టింగ్లు పెట్టుకోవాలి.లొకేషన్ ట్యాగ్లను నిలిపివేయాలి. సోషల్ మీడియా ప్రైవసీ సెట్టింగ్స్ను కఠినంగా అమలు చేయాలి.పిల్లలకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలి. -
రెండో భార్యపై అనుమానం.. మల్కాజ్గిరిలో దారుణం
సాక్షి, హైదరాబాద్/మేడ్చల్: మల్కాజ్గిరిలో కాల్పుల కలకలం రేగింది. మూడు నెలల క్రితం భార్యను హత్య చేసేందుకు స్కెచ్ పోలీసులకు చిక్కిన ఓ భర్త.. చివరకు తన పథకాన్ని అమలు చేశాడు. మరో వ్యక్తి సాయంతో తన రెండో భార్యను తుపాకీతో కాల్చి హతమార్చాడు. బుధవారం వేకువ జామున జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల సమాచారం ప్రకారం, మల్కాజ్గిరి మారుతీనగర్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అరుణ్కుమార్కు మొదటి భార్యతో ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఆమె ఆరోగ్యం బాగోలేకపోవడంతో.. విడాకులిచ్చి ఆమె సోదరిని మరో వివాహం చేసుకున్నాడు. అయితే ఆమెకు ఇతరులతో సంబంధాలు ఉన్నాయని అరుణ్ అనుమానాలు పెంచుకోసాగాడు. ఈ కారణంగా దంపతుల మధ్య తరచూ వివాదాలు చోటుచేసుకోవడంతో.. ఆమె దూరంగా ఉండే ప్రయత్నం చేసింది. దీంతో.. భార్యను ఎలాగైనా అంతం చేయాలనే ఉద్దేశంతో అరుణ్ ముందుగానే హత్య ప్రణాళిక రూపొందించాడు. ఈ ఏడాది మార్చిలోనే బిహార్ నుంచి అక్రమంగా దేశవాళీ తుపాకీ, బుల్లెట్లు తెప్పించుకుని భార్యను చంపేందుకు సిద్ధమయ్యాడు. అంతేకాదు, తుపాకీ పేల్చడంపై ప్రాక్టీస్ కూడా చేశాడు. అయితే పక్కా సమాచారంతో చార్మినార్ టాస్క్ఫోర్స్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో అరుణ్ హత్యాయత్నం విఫలమై వార్తల్లోకి ఎక్కింది.ఆయుధ చట్టం కేసుతో కటకటాల పాలైన అరుణ్.. బెయిల్ మీద బయటకు వచ్చాడు. అయితే ఆ తర్వాత కూడా అతడి ఆలోచన మారలేదు. ఈ తెల్లవారుజామున మాట్లాడుకుందామని భార్యను బయటకు పిలిచిన అరుణ్, మరో వ్యక్తితో కలిసి ఆమెపై కాల్పులు జరిపాడు. మూడు రౌండ్లతో కాల్పులు జరపడంతో.. ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. కాల్పుల అనంతరం నిందితులు పరారయ్యారని, వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. పాతబస్తీలోని తన స్నేహితుల ద్వారా అరుణ్ తుపాకీ కొనుగోలు చేసినట్లు పోలీసులకు లీడ్ దొరికింది. ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. -
స్నేహితుడే చితకబాది.. చనిపోయాడనుకుని తొట్లో వేసి..
ముండ్లమూరు: స్నేహితుడే చితకబాది చనిపోయాడనుకుని తొట్లో వేసి వెళ్లాడు. తీవ్రగాయాలతో బతికిబయటపడిన బాధితుడు ఆస్పత్రికి చేరాడు. ముండ్లమూరు మండలంలోని సుంకరవారిపాలెం గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.. చిట్టిబోయిన వెంకట్రావు, చిట్టిబోయిన రామబ్రహ్మం స్నేహితులు, బంధువులు కూడా.వారి మధ్య ఏం జరిగిందో ఏమోగానీ.. సుంకరవారిపాలెంలోని తన ఇంట్లో వెంకట్రావు ఉండగా, స్నేహితుడు రామబ్రహ్మం మోటార్ సైకిల్పై వచ్చి నీతో పని ఉంది అంటూ సోమవారం రాత్రి 9 గంటల సమయంలో తీసుకెళ్లాడు. సుమారు ఐదు కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి నాయుడుపాలెం పొలాల్లోని ఎత్తిపోతల పథకం వద్ద మద్యం సేవించారు.అనంతరం ఇద్దరూ అద్దంకి వెళ్లి పొద్దుపోయిన తర్వాత నాయుడుపాలెం పొలాల్లోనే ట్యాంకు దగ్గరకు వచ్చారు. వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదుగానీ.. రామబ్రహ్మం రాయితో వెంకటరావుపై తీవ్రంగా దాడి చేశాడు. చనిపోయాడనుకుని నీటి తొట్టిలో పడేసి వెళ్లిపోయాడు. తెల్లవారేసరికి తీవ్ర గాయాలతో ఉన్న వెంకట్రావుకు మెలకువ వచ్చింది. పూరిమెట్ల వైపు ఒక పశువుల షెడ్డు దగ్గరకి అతి కష్టం మీద వెళ్లి అక్కడున్న వారికి విషయం చెప్పి తన బంధువులకు సమాచారం ఇచ్చాడు.తీవ్రంగా గాయపడిన వెంకట్రావును బంధువులు వెళ్లి చికిత్స నిమిత్తం అద్దంకి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు జీజీహెచ్కి అతన్ని తరలించారు. దాడి జరిగిన విషయం అద్దంకి పోలీసులకు తెలియజేయగా, కేసు నమోదు చేసి ముండ్లమూరు పోలీసులకు పంపారు. వారి మధ్య ఏం జరిగిందనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. -
గుండెపోటుతో విద్యార్థి మృతి!
గుత్తి: అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు విగతజీవిగా పడి ఉండడాన్ని ఆ తల్లి తట్టుకోలేకపోయింది. ‘నా కొడుకు ఇంకా బతికే ఉన్నాడు. మీరంతా అబద్ధాలు చెబుతున్నారు’ అంటూ తడారిన గుండెతో ఆమె మాట్లాడిన మాటలతో అక్కడున్న వారందరి కళ్లలో నీళ్లు తిరిగాయి. ‘యా అల్లా.. ఎంత పనిచేశావయ్యా’ అంటూ చూసిన వారందరూ కంటతడి పెట్టుకున్నారు.గుండెపోటుతో 7వ తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన పట్టణంలో విషాదం నింపింది. వివరాలిలా ఉన్నాయి. గుత్తిలోని కటిక బజారులో నివాసముండే జలాల్, హసీనా దంపతులకు ఇద్దరు కుమార్తెల తర్వాత మహమ్మద్ యాసిన్ జన్మించాడు. ఒక్కగానొక్క కుమారుడు కావడంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఏడో తరగతి పూర్తి చేసుకున్న యాసిన్ (13) 8వ తరగతిలోకి అడుగు పెట్టాల్సి ఉంది.మంగళవారం తెల్లవారుజామున తమ ఇంటి వద్ద ఉన్న బాత్ రూమ్లో కాలు జారి కింద పడిన యాసిన్ను వెంటనే తల్లిదండ్రులు అనంతపురం తీసుకెళ్లగా.. కాసేపటికే మృతి చెందాడు. గుండెపోటు కారణంగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నిన్నటి దాకా ఎంతో ఆనందంగా తమ ముందు తిరిగిన యాసిన్ మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. -
తండ్రి కళ్లెదుటే ముగ్గురు కొడుకులు మృతి..
భైంసా/బాసర: తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు మంగళవారం నిర్మల్ జిల్లా బాసరకు వచ్చిన ఓ కుటుంబంలోని ముగ్గురు అన్నదమ్ములు.. పుణ్యస్నానాల కోసం గోదావరిలో దిగి గల్లంతై మృత్యువాతపడ్డారు. హైదరాబాద్లోని కాచిగూడ చెప్పల్ బజార్ ప్రాంతంలో నివసించే నీలి నాగభూషణ్కు నీలి చంద్రశేఖర్ (38), రాంచందర్ (36), మల్లేశ్కుమార్ (31) కుమారులు ఉన్నారు.రెండో కుమారుడైన రాంచందర్–అశ్విని దంపతుల కుమారులు వసంత్ (6), విజయ్ (2)కు అక్షరాభ్యాసం చేయించేందుకు మంగళవారం మధ్యాహ్నం వారంతా బాసర చేరుకున్నారు. అధిక మాసం సందర్భంగా గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయానికి వెళ్లి అక్షరాభ్యాసాలు చేయించాలని అనుకున్నారు.ఈ క్రమంలో నదిలోకి దిగిన చంద్రశేఖర్, రాంచందర్, మల్లేశ్కుమార్ లోతు ఎక్కువగా ఉన్న చోటుకు వెళ్లారు. అయితే తొలుత ఒకరు నీటిలో మునిగిపోతుండటంతో మిగిలిన ఇద్దరు అతన్ని కాపాడే ప్రయత్నంలో వారు కూడా గల్లంతయ్యారు. దీంతో ఒడ్డుపై ఉన్న మిగిలిన కుటుంబీకులు హాహాకారాలు చేయడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు ఈ ఘటనపై అధికారులకు సమాచారం ఇచ్చారు. తొలుత రెస్క్యూ సిబ్బంది సుమారు రెండు గంటలపాటు గాలించినా గల్లంతైన సోదరుల జాడ తెలియలేదు.చివరకు బాసరకు చెందిన గంగపుత్రులు నదిలో గాలించి ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. కళ్లెదుటే ముగ్గురు కొడుకులు గల్లంతు కావడాన్ని చూసిన తండ్రి నాగభూషణ్ కుప్పకూలిపోగా మిగిలిన కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. మృతదేహాలను సీఐ దీపక్ భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు సోదరులు కాచిగూడ రైల్వేస్టేషన్లో చిరు వ్యాపారం చేసుకొనేవారు. -
భార్య వివాహేతర సంబంధం.. మనస్తాపంతో భర్త ఆత్మహత్య
కరీంనగర్ జిల్లా : ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య మరోవ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్లో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బండి రాజు(35)కొమురంభీమ్ జిల్లా ఆసిఫాబాద్ ప్రాంతానికి చెందిన ఓ మహిను ప్రేమించి 8 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు జన్మనించారు. అదేగ్రామానికి చెందిన మండల రవీందర్తో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇది సరైన పద్ధతి కాదని రాజు తన భార్యతోపాటు రవీందర్నూ పలుమార్లు మందలించినా తీరు మారలేదు. ఈక్రమంలో ఆర్నెల్లక్రితం తన ఇద్దరు పిల్లలను తీసుకుని తన స్వస్థలం వెళ్లిపోయింది. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టించినా, మందలించినా రవీందర్ తీరు మారకపోగా.. తన భార్యను తరచూ కలుసుకోవడంతో అవమానంగా భావించి మనస్తాపంతో రాజు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆగ్రహించిన మృతుడి కుటుంబ సభ్యులు ఇందుకు కారణమని భావించి రవీందర్ ఇందిఎదుట మృతదేహతో ధర్నా చేశారు. ఆత్మహత్యకు కారణమైన మృతుడి భార్యతోపాటు రవీంరద్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న మంథని సీఐ రాజు, ముత్తారం, రామగిరి ఎస్సైలు రవికుమార్, శ్రీనివాస్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోలీస్స్టేషన్ వద్దకు తరలించారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. -
భర్తను వదిలి బంగారం, డబ్బుతో వెళ్లిపోయిన భార్య..
వరంగల్ జిల్లా: భార్య.. భర్తను వదిలి డబ్బులు, బంగారం, ఇతర సామగ్రితో వెళ్లిపోయింది. ఈ∙ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింతనెక్కొండలో చోటు చేసుకుంది. కుటుంబీకులు, స్థానికుల కథనం ప్రకారం... పుట్ట నరేశ్ అనే వ్యక్తి ప్రైవేట్ ఎలక్ట్రీషియన్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గీసుగొండ మండలం మునుగొండకు చెందిన గుల్లపల్లి గాయత్రితో మార్చి 15, 2026న వివాహం జరిగింది. కాగా, ఇంట్లో ఎవరూ లేని సమయంలో గాయత్రి సోమవారం గూడ్స్ వాహనాన్ని రప్పించి ముగ్గురు వ్యక్తులతో కలిసి ఇంటిలోని ఐదు తులాల బంగారం, రూ.2.5లక్షల నగదు, ఇతర సామగ్రి తీసుకుని వెళ్లిపోయింది. దీంతో భార్య కోసం వెతికిన నరేశ్ ఆమె ఆచూకీ లభించకపోవడంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అనంతరం ఆదివారం అవమాన భారం భరించలేక పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన స్థానికులు హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పతికి తరలించారు. ప్రస్తుతం నరేశ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. -
అతనితో శారీరక సంబంధం పెట్టుకో.. బాలికకు వీఆర్వో ఒత్తిడి..!
అనకాపల్లి జిల్లా: మండలంలో ఓ గ్రామానికి చెందిన బాలికను ఒక వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకోమని బలవంతం చేసిన మహిళా వీఆర్వోపై కేసు నమోదు చేసినట్టు యలమంచిలి రూరల్ ఎస్ఐ ఎం. ఉపేంద్ర తెలిపారు. వివరాలివి. ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక హాస్టల్ ఉండి చదువుకుంటోంది. వేసవి సెలవులకు ఇంటికి వచ్చిన ఆ బాలికకు సమీపంలో ఉన్న మహిళా వీఆర్వో బొల్లం పార్వతి ఒక వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకోమని చెప్పింది. అందుకు బాలిక నిరాకరించడంతో మహిళా వీఆర్వో, ఆమె అక్క సింగారపు అప్పలనర్సలు చెడు ప్రచారం చేయసాగారు. బాలికకు వేరొక వ్యక్తితో శారీరక సంబంధం ఉన్నట్టు వదంతులు సృష్టించి ప్రచారం చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది తెలిసిన బాలిక మనస్థాపం చెందడంతో విషయం తెలుసుకున్న బాలిక తల్లి ఈ నెల 6వ తేదీన యలమంచిలి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయలేదు. దీంతో సోమవారం జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేయడంతో వీఆర్వోపై కలెక్టరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
60 ఏళ్ల వయసులో జల్సాలు..! స్నేహితుడిని నమ్మించి..
బంజారాహిల్స్: 60 ఏళ్ళ వయసులో జల్సాలకు అలవాటుపడ్డాడు..పేకాటకు బానిసై అప్పులు చేశాడు.. వాటిని చెల్లించేందుకు నమ్మిన స్నేహితుడినే నట్టేట ముంచి బంగారు నగలతో ఉడాయించాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.పోలీసులు తెలిపిన మేరకు.. నిజామాబాద్ జిల్లాకు చెందిన చిన్నయ్య అలియాస్ రాములు(60) పేకాటకు బానిసై జల్సాలకు అలవాటు పడి అందరి వద్ద అప్పులు చేశాడు. వీటిని తీర్చడానికి మోసాలకు తెగబడ్డాడు. ఈ నేపథ్యంలోనే అమీర్పేట్లోని ఓ హాస్టల్లో ఉంటూ బస్టాప్లలో అపరిచితులను పరిచయం చేసుకొని స్నేహం నటించి వారితో రాకపోకలు సాగిస్తూ వారి కదలికలు గమనిస్తుండేవాడు. గచ్చిబౌలికి చెందిన ఆర్అండ్ బీ రిటైర్డ్ ఉద్యోగి రాజామ్ రాజయ్య ప్రకాశ్ను ఇలాగే పరిచయం చేసుకొని 62 గ్రాముల బంగారంతో ఉడాయించాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి 57.66 గ్రాముల బంగారంతోపాటు ఒక మొబైల్ ఫోన్ను రికవరీ చేసి రిమాండ్కు తరలించారు. -
అనుమానాస్పద స్థితిలో తండ్రి, కుమారుడు మృతి
నల్లగొండ : నల్లగొండ జిల్లా కేంద్రంలోని కనకదుర్గ కాలనీలో సోమవారం తండ్రి, కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మండలం అప్పాజీపేట గ్రామ పంచాయతీ పరిధిలోని మిర్లోనిగూడెం గ్రామానికి చెందిన పబ్బతిరెడ్డి లింగారెడ్డి(45) విద్యుత్ శాఖలో జూనియర్ లైన్మెన్గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య కవిత, ఇద్దరు కుమారులు ప్రశాంత్రెడ్డి, ప్రణీత్రెడ్డి(14) ఉన్నారు. లింగారెడ్డి కుటుంబంతో కలిసి నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో కనకదుర్గ కాలనీలో నివాసముంటున్నారు. లింగారెడ్డి పెద్ద కుమారుడు ప్రశాంత్రెడ్డి ఇటీవల పదో తరగతి పూర్తిచేసి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటరీ్మడియట్లో చేరాడు. సోమవారం ఉదయం ప్రశాంత్రెడ్డిని హాస్టల్లో వదిలిరావడానికి లింగారెడ్డి భార్య కవిత హైదరాబాద్కు వెళ్లింది. అదే సమయంలో లింగారెడ్డి తండ్రి సత్తిరెడ్డి వ్యవసాయ పనుల నిమిత్తం స్వగ్రామమైన మిర్లోనిగూడెం వెళ్లగా.. ఇంట్లో లింగారెడ్డి, అతడి చిన్న కుమారుడు ప్రణీత్రెడ్డి మాత్రమే ఉన్నారు. మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్లో ఉన్న కవిత తన చిన్న కుమారుడు ప్రణీత్రెడ్డికి ఫోన్ చేసి అన్నం తిన్నావా అని అడగగా.. తిన్నానని సమాధానం ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సాయంత్రం 4 గంటల సమయంలో కవిత ఇంటికి చేరుకునేసరికి గేటుకు లోపలి నుంచి బేడం వేసి ఉంది. ఎంత పిలిచినా భర్త, కుమారుడు స్పందించకపోవడంతో పక్కింటి బాలుడి సహాయంతో గేటు తెరిపించి లోపలికి వెళ్లి చూడగా భర్త, కుమారుడు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి కుప్పకూలిపోయింది. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వన్టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్రెడ్డి పోలీస్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రణీత్రెడ్డి తలపై తీవ్ర గాయాలు ఉండగా, ఇంట్లో టీవీ స్టాండ్పై సుత్తి కనిపించింది. మరోవైపు లింగారెడ్డి నోటి నుంచి నురగలు రావడంతో పాటు పక్కనే పురుగుల మందు డబ్బా లభించింది. అయితే కొడుకును సుత్తితో కొట్టి హత్య చేసిన అనంతరం లింగారెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. సుత్తిపై ఉన్న వేలిముద్రలతో పాటు మృతుల వేలిముద్రలను కూడా సేకరించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
నేరాలు చేసి నేపాలీలు పరార్!
సాక్షి, సిటీబ్యూరో: రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య కేసులో నిందితులైన ఏడుగురు నేపాలీల్లో ఒక్కరే చిక్కారు. సూత్రధారి, కీలక నిందితురాలు కల్పన సహా మిగతవారు పరారీలోనే ఉన్నారు.ఈ ఒక్క కేసులోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన నేపాలీ సంబంధిత నేరాల్లో నిందితులుగా ఉండి, పరారీలో ఉన్న వారి సంఖ్య 170గా తేలింది. నేపాలీ నేరగాళ్ల కోసం హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనర్ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం పరిశీలనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వీరిని పట్టుకోవడానికి సమన్వయంతో, సాంకేతికంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.ఈ నేపాలీ నేరగాళ్లు సంపన్నుల ఇళ్లల్లో పని వాళ్లు, వంట వాళ్లు, వాచ్మెన్లుగా చేరుతున్నారు. తొలినాళ్లలో నమ్మకంగా పనిచేసినా.. ఆపై అదును చూసుకుని పంజా విసురుతున్నారు. సరైన సమయంలో తమ ముఠాకు చెందిన మిగిలిన వారిని రంగంలోకి దింపుతున్నారు. అంతా కలిసి తమ ‘పని’ పూర్తి చేసుకున్న తర్వాత ముందు నగరం..ఆపై దేశం దాటేస్తున్నారు. కల్పన కూడా నేపాల్ చేరినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ కేటుగాళ్లు నేరం చేసిన వెంటనే తమ సెల్ఫోన్లు, సిమ్కార్డులు ధ్వంసం చేసేసి ఎలాంటి ఆధారాలు లేకుండా చేస్తున్నారు. ఫలితంగా పోలీసులకు వీరి ఆచూకీ కనిపెట్టడం పెద్ద సవాల్గా మారుతోంది.రెండు రకాల వ్యూహంతో ముందుకు..వాంటెడ్గా ఉన్న నేపాలీలను పట్టుకోవడానికి పోలీసులు రెండు రకాలైన వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. సాంకేతిక నిఘా ఉంచడంతో పాటు సరిహద్దుల్లో ఉండే ఇమ్మిగ్రేషన్ చెక్పోస్టులు, ఇతర విభాగాలతో సమన్వయం ఏర్పాటు చేసుకుంటున్నారు. మరోపక్క ఈ నేరగాళ్ల వివరాలు, ఆచూకీ చెప్పాల్సిందిగా కోరుతూ ఆయా అసోసియేషన్లు, యూనియన్లతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆచూకీ తెలిసినప్పటికీ నేపాల్లోకి ప్రవేశించి, వీరికి అరెస్టు చేసుకురావడానికి అనేక అడ్డంకులు ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరిస్తున్నామని అధికారులు చెప్తున్నారు.బెయిల్ వస్తే మళ్లీ దొరకరు... ప్రస్తుతం రాష్ట్ర పోలీసులకు వాంటెడ్గా ఉన్న 170 మందీ నేరం చేసిన వెంటనే పరారు కాలేదు. వీరిలో కొందరు అరెస్టయి.. బెయిల్పై వచి్చ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ష్యూరిటీలు ఇచి్చన వారికీ వీరి వివరాలు తెలియట్లేదు. శిక్షల నుంచి తప్పించుకోవడానికి ఈ పంథా అనుసరిస్తుండటంతో వీరిపై కోర్టులు నాన్–బెయిలబుల్ వారెంట్లు జారీ చేస్తున్నాయి.కీలకంగా వ్యవహరిస్తున్న జీవన్... రాష్ట్రంలో నేపాలీలకు ఉద్యోగాలు ఇప్పించడం, నేరాలు చేయించడంలో జీవన్ అనే నేపాలీ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతడు ఓ దళారిగా వ్యవహరిస్తూ సంపన్నుల ఇళ్లల్లో నేపాలీలను పనిలో పెడుతున్నాడు. ఆపై పథక రచన చేసి, మిగతవారిని రంగంలోకి దింపి టార్గెట్ చేసిన ఇంట్లో నేరం చేయిస్తున్నాడు. పథకం సిద్ధమైన తర్వాత నేరం జరగడానికి ముందు తొలుత అతగాడే నేపాల్ వెళ్లిపోతాడు. అతని సహచరులు ఇక్కడే ఉండి ప్రణాళికను అమలు చేస్తారు. కొన్నాళ్లకు మరో పేరుతో వస్తున్న జీవన్ నేర పంథా కొనసాగిస్తున్నాడని పోలీసులకు ఆధారాలు లభించాయి. అతడి కోసం ఆరా తీస్తున్నారు. -
బీమా చేయించి.. చంపేశారు!
నారాయణపేట: ఇన్సూరెన్స్ చేయించినవారే..రూ.50 లక్షల జీవిత బీమా సొమ్మును కాజేయాలనే దురాశతో పథకం ప్రకారం హత్య చేసి.. దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి తప్పించుకోవాలని ప్రయత్నించారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నారాయణపేట డీఎస్పీ నల్లపు లింగయ్య సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు.మరికల్ మండల కేంద్రానికి చెందిన రైతు బోడి రాజు (44)కు మక్తల్ పట్టణానికి చెందిన ఆనంపల్లి భాస్కర్ దూరపు బంధువు. మక్తల్ మండలం జక్లేర్ గ్రామానికి చెందిన అల్లెం నాగరాజు ఇన్సూరెన్స్ ఏజెంట్లతో కమీషన్ ఒప్పందం చేసుకొని అందరితో బీమా చేయిస్తుంటాడు. అదే తరహాలో తనకు పరిచయం ఉన్న ఆనంపల్లి భాస్కర్ సహాయంతో బోడి రాజుతో రూ.50 లక్షలకు ఇన్సూరెన్స్ పాలసీ చేయించారు.రాజు వద్ద డబ్బు లేకున్నా.. తర్వాత ఇవ్వమని చెప్పి నిందితుడు నాగరాజే తొలిఏడాది పాలసీ డబ్బులు కట్టాడు. ఫోన్నంబర్ పాలసీదారుడు రాజుది కాకుండా నాగరాజు తన ఫోన్ నంబర్ ఇచ్చాడు. అయితే బీమా డబ్బు సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆనంపల్లి భాస్కర్తోపాటు గుడిగండ్ల గ్రామానికి చెందిన సిరిగిరి భాను ప్రకాశ్తో కలిసి పథకం వేశారు. అందులో భాగంగా జూన్ 3న సాయంత్రం రాజును తమ వెంట తీసుకెళ్లారు. ఆయనకు బాగా మద్యం తాగించిన అనంతరం సామన్పల్లి గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆ ముగ్గురు కట్టెలు, రాళ్లతో దాడి చేశారు.ప్రమాదంగా నమ్మించే యత్నం.. దాడి అనంతరం తీవ్ర గాయాలతో ఉన్న బోడి రాజును భాను ప్రకాశ్కు చెందిన కారులో హైదరాబాద్లోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం మృతుడి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి, దండు చౌరస్తా సమీపంలో రోడ్డు ప్రమా దం జరిగిందని, చికిత్స పొందుతూ మరణించినట్టు సమాచారం ఇచ్చారు.జూన్ 4న కుటుంబ సభ్యులు మక్తల్ పోలీస్స్టేషన్లో రోడ్డు ప్రమాద మరణంగా ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన మక్తల్ పోలీసులు అనుమానాస్పద అంశాలపై దృష్టి సారించారు. కారు డ్రైవర్ సిరిగిరి భానుప్రకాశ్ను అదుపులోకి తీసుకొని విచారించగా.. దండు చౌరస్తా వద్ద ఎ లాంటి రోడ్డు ప్రమాదం జరగలేదని తేలింది.అనంతరం నిందితులను లోతుగా విచారించగా, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం పన్నిన హత్య కుట్ర వెలుగులోకి వచి్చంది. పోలీసుల విచార ణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించినట్టు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అల్లెం నాగరాజు, సిరి గిరి భాను ప్రకాశ్, ఆనంపల్లి భాస్కర్లను అరెస్ట్ చేశారు. -
హైదరాబాద్లో రెచ్చిపోయిన మరో నేపాలీ గ్యాంగ్
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో నేపాల్ గ్యాంగ్ దోపిడీకి పాల్పడింది. గచ్చిబౌలి హిల్ రిడ్జ్ విల్లాలో నివాసం ఉంటున్న వ్యాపారి ఇంట్లో సుమారు కేజీ బంగారం, వజ్రాలను ఎత్తుకెళ్లారు. ఆ ఇంట్లో పనిచేసే నేపాల్ దంపతులే చోరీ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. నెల రోజుల క్రితమే వ్యాపారి ఆ దంపతులను పనిలో పెట్టుకోగా, ఇటీవల వ్యాపారి కుటుంబం ముంబై వెళ్లి తిరిగి వచ్చేసరికి చోరీ జరిగింది.ఇంట్లో తాళాలు పగలగొట్టినట్లు ఎలాంటి గుర్తులు లేకపోవడంతో మొదట వారు చెప్పకుండా వెళ్లిపోయారని భావించారు. పూజ గదిలోని విగ్రహానికి ఉన్న బంగారు గొలుసు, తదుపరి జరిపిన తనిఖీల్లో మరికొన్ని ఆభరణాలు మాయమైనట్లు గుర్తించిన వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందాలు.. నిందితుల కోసం గాలిస్తున్నాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.కాగా, గత నెల 8వ తేదీన ప్రశాసన్నగర్లోని విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్రంజన్ భార్య తనూజరంజన్ను దారుణంగా హత్య చేసి బంగారు నగలతో ఉడాయించిన నేపాలీ గ్యాంగ్లో ఒక నిందితుడిని, నగలు కొనుగోలు చేసిన రిసీవర్ను ఇటీవల జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితురాలు కల్పన అలియాస్ ధర్మతో పాటు మరో ఐదుగురు పోలీసుల కళ్లుగప్పి నేపాల్లోకి అడుగుపెట్టారు.చోరీకి గురైన సొత్తులో కొంత మాత్రమే రికవరీ అయ్యింది. మిగతా సొమ్ముతో పాటు ప్రధాన సూత్రధారులైన నేపాలీ గ్యాంగ్ ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ఈ ఘటనకు పాల్పడ్డ నేపాలీ గ్యాంగ్ సునీల్ పెరియార్తో పాటు రిసీవర్ దిలీప్లను పది రోజుల కస్టడీకి తీసుకున్నారు. వీరిని మరింత లోతుగా విచారించనున్నారు. ఆ రోజు జరిగిన ఘటనతో పాటు హత్య చేసిన అనంతరం ఎక్కడెక్కడికి వెళ్లారు.. తదితర వివరాలు సేకరించనున్నారు. ఇప్పటికే పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. ఇంతలోనే నగరంలోని . గచ్చిబౌలి హిల్ రిడ్జ్ విల్లాలో మరో నేపాలీ గ్యాంగ్ దోపిడీకి పాల్పడటం కలకలం రేపుతోంది. -
అడవిలో చెట్టుకు ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్య!
గోవిందరావుపేట: చెట్టుకు ఉరి వేసుకుని ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కర్లపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలోని టేకులకుంట గొత్తికోయ గుంపులో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది.స్థానికులు, బంధువుల సమాచారం మేరకు మృతులను కాశపు కోమల (18), కోరం ఇరవయ్య (18)గా గుర్తించారు. వీరిద్దరూ గొత్తికోయ తెగకు చెందినవారని తెలిసింది. ప్రేమ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల కిందట ఇప్పపువ్వు సేకరణ కోసం అడవిలోకి వెళ్లిన యువతి, యువకుడు తిరిగి ఇంటికి రాలేదని బంధువులు తెలిపారు.కాగా, కర్లపల్లి శివారులోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఒకే చెట్టుకు వేలాడుతున్న రెండు మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పస్రా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అనంతరం పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆత్మహత్యకు గల కచి్చతమైన కారణాలు, ఇతర వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. -
ప్రేమపేరుతో యువకుడి వేధింపులు.. తాళలేక యువతి ఆత్మహత్య
జగిత్యాల క్రైం: ప్రేమపేరుతో ఓ యువకుడి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల రూరల్ మండలం అనంతారం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై ఉమాసాగర్ వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన సైదు శ్రీలత (20) జగిత్యాల పట్టణంలో ఇటీవలే డిగ్రీ పూర్తి చేసింది.ఈ క్రమంలో మూడేళ్లుగా జగిత్యాల రూరల్ మండలం సంగంపల్లి గ్రామానికి చెందిన అంకతి రాజు ప్రేమ పేరుతో శ్రీలతను వేధిస్తు న్నాడు. తనకు ఇష్టం లేదని చెప్పినా వినకుండా వెంటపడుతుండటంతో శ్రీలత మూడేళ్ల కిందటే ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. కుటుంబసభ్యులు కాపాడారు.అయినప్పటికీ యువకుడి వేధింపులు తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు అతడిని మందలించారు. అయినా మార్పు రాకపోగా.. సోమవారం శ్రీలతకు ఫోన్ చేసి తీవ్ర వేధింపులకు గురిచేయడంతో మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి సత్తయ్య ఫిర్యాదు మేరకు రాజుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. -
భర్తను ముక్కలు ముక్కలుగా నరికి సూట్కేస్లో కుక్కింది.!
పెరంబూర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారమ్పై సూట్కేసులో దొరికిన కుళ్లిపోయిన తల చేతులు కాళ్లు లేని మృతదేహం కేసును చెన్నై పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం, కుటుంబ కలహాల నేపథ్యంలోనే భార్య తన ప్రియుడితో కలిసి భర్తను అత్యంత క్రూరంగా హత్య చేసి, శవాన్ని ముక్కలుగా నరికినట్లు దర్యాప్తులో తేలింది. తల కాళ్లు, చేతులు లేక పోవడం, మొండెం మాత్రం ఉండటంతోకేసు పోలీసులకు సవాలుగా మారింది. అయితే మృతదేహంపై ఉన్న బ్రాండెడ్ బట్టల బార్కోడ్ ఆధారంగా దర్యాప్తు చేయగా, ఆ దుస్తులను కొనుగోలు చేసిన షాపును గుర్తించారు. దీనిని ఇద్దరు వ్యక్తులు కొనుగోలు చేసినట్లు తెలింది. కాల్ డేటా రికార్డ్, వాట్సాప్ లోకేషన్ ఆధారంగా నిందితులు తేనాంపేట, టి.నగర్ పరిసరాలలో ఉన్నట్టు గుర్తించారు. హత్యకు గల కారణాలు.. పోలీసుల విచారణలో మరణించిన వ్యక్తి అస్సాంకు చెందిన అమీర్ గుర్తించారు. నిందితురాలు రోకిమాకు అస్సాంలోనే మొదటి వివాహమై ఒక కుమార్తె ఉంది. మొదటి భర్తతో విడిపోయిన తర్వాత ఆమె అమీర్ అలీని రెండో పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ 2022 నుండి తేనాంపేటలోని థామస్ రోడ్ హౌసింగ్ బోర్డు క్వార్టర్స్లో నివసిస్తున్నారు. అయితే అమీర్ అలీకి ఇతర మహిళలతో ఉన్న సంబంధాల కారణంగా భార్యాభర్తల మధ్య నిరంతరం గొడవలు జరిగేవి. ఈ క్రమంలో రోకిమాకు టి.నగర్లో కూరగాయల దుకాణం నడుపుతున్న అస్సాంకు అష్రఫ్ (31)తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త వేధింపుల గురించి రోకిమా అతడికి చెప్పగా పథకం ప్రకారం మట్టుబెట్టినట్టు తేలింది. హత్య తర్వాత తన భర్త అమీర్ అలీ స్వయంగా పెట్టినట్లుగా.. తనకు ఇక బతకాలని లేదు, ఎవరూ వెతకవద్దు అని హిందీలో ఒక నకిలీ సందేశాన్ని అతడి ఫెస్బుక్లో రోకిమా పోస్టు చేసింది. మానసిక క్షోభతో∙అమీర్ ఎక్కడికో వెళ్లిపోయాడని బంధువులను నమ్మించేందుకే యత్నించింది.శవాన్ని ముక్కలుగా నరికి.. పథకం ప్రకారం, జూన్ 4వ తేదీ రాత్రి అమీర్ అలీ నిద్రపోతున్న సమయంలో రోకిమా, ఆమె ప్రియుడు అష్రఫ్ అతని గొంతు కోసి హత్య చేశారు. అతని తల, చేతులు, కాళ్లను ముక్కలుగా నరికారు. మొండెం భాగాన్ని ఒక ప్రైవేట్ ఆసుపత్రి కవర్లో చుట్టి సూట్కేసులో కుక్కారు. జూన్ 5వ తేదీ రాపిడో ఆటోలో ప్రయాణించి ఆ సూట్కేసును పెరంబూర్ రైల్వే స్టేషన్లో వదిలేశారు. కాగా, నరికిన చేతులు, కాళ్లను ఒక కాలువలో వేయగా, తలను మాత్రం చెంగల్పట్టు జిల్లా పరిధిలోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో పూడ్చిపెట్టారు. కాగా భర్త శరీర బాగాలను నరికేటప్పుడు ఆనందంగా భార్య ఆనందంతో సెల్ఫీలు తీసుకోవడం గమనార్హం.-సాక్షి, చెన్నై -
బిర్యానీ గొడవ.. దంపతుల ఆత్మహత్య
విశాఖపట్నం: రామాటాకీస్ వెనుక వైపున గల శ్రీనగర్లో నివాసముంటున్న దంపతులు బలరాం (33), ప్రియాంక (27) ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ద్వారకా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా కళింగపటా్ననికి చెందిన వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకుని, బతుకుతెరువు కోసం విశాఖ వచ్చి స్థిరపడ్డారు. వెల్డింగ్ పనులు చేసే బలరాం మద్యానికి బానిసై తరచూ భార్యను వేధిస్తుండటంతో ప్రియాంక గతంలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో బలరాం బిర్యానీ కావాలని పట్టుబట్టడంతో ప్రియాంక తల్లి బయటకు వెళ్లగా, ఆమె తిరిగి వచ్చేసరికి దంపతులిద్దరూ ఇంట్లో విగతజీవులుగా పడి ఉన్నారు. సమాచారం అందుకున్న నైట్ రౌండ్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. అయితే బలరామే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్నాడా, లేక ప్రియాంక బలవన్మరణానికి పాల్పడటంతో భయపడి బలరాం ఆత్మహత్యకు ఒడిగట్టాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కళ్లెదుటే తల్లిదండ్రులు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడడంతో వారి నాలుగేళ్ల కుమారుడు అనాథగా మిగిలిపోయాడంటూ ప్రియాంక తల్లి రోదించడం స్థానికులను కలచివేసింది. -
మోహన్ నా కూతురు అందంగా లేదు.. వేరే సంతానం కావాలి..!
బెంగళూరు: కన్నకూతురినే పొట్టనబెట్టుకున్న తల్లి ఉదంతం అంతటా చర్చనీయాంశమైంది. బెంగళూరు కాడుగోడిలో ఆరేళ్ల బాలిక వెన్నెల అనుమానాస్పద మృతి కేసులో ఆమె తల్లి, ప్రియునిపై అనుమానాలు బలపడ్డాయి. మార్చి 24 తేదీన బాలిక అనుమానాస్పద రీతిలో చనిపోయింది. తల్లి ప్రియాంక పుట్టిన రోజు వేడుకలను కోలారు వద్ద ఓ కెఫెలో జరుపుకొంది, అక్కడ వెన్నెలా కేక్ తిని కారులో నిద్రపోగా ఉదయానికి చనిపోయిందని తెలిపింది. మోహన్ అనే రియల్టర్తో ప్రియాంక జీవిస్తోంది. భర్త ప్రవీణ్ను వదిలేసిన ప్రియాంక లగ్జరీ లైఫ్ కోసం తపించేది. సంతోషానికి అడ్డు అని.. కొన్ని నెలల కిందట మోహన్ను కాశీలో రహస్యంగా పెళ్లి చేసుకుంది. సంతానం కావాలని అనుకున్నారు. తమ సంతోషాలకు వెన్నెలా అడ్డుగా ఉందని, పైగా బాలిక అంద విహీనంగా ఉందనే కారణంతో బాలిక గొంతు పిసికి చంపారనే అనుమానాలున్నాయి. ప్రియాంక కు హొసకోటే వద్ద ఐదు ఎకరాలు భూమి ఉండగా, అందులో వాటా ఇవ్వాల్సి వస్తుందనేది కూడా హత్యకు కారణమని భావిస్తున్నారు. మోహన్ను కాడుగోడి పోలీసులు అరెస్ట్చేసి విచారిస్తున్నారు. బాలిక చనిపోయిన రోజున ఆమె దుస్తులు మార్చారని సీసీ కెమెరాలలో వెల్లడైంది. కాగా ప్రియాంకను అరెస్టు చేశారా, పరారీలో ఉందా అనేది తెలియడం లేదు. -
మామిడిపండ్లు తిన్న అనంతరం అమ్మాయి మృతి
హైదరాబాద్: మామిడిపండ్లు తిని అనుమానాస్పద స్థితిలో ఓ బాలిక మృతి చెందింది. నారాయణగూడ ఎస్ఐ సాయి సందీప్ తెలిపిన మేరకు.. బీదర్ చెందిన వైజినాథ్, ఇందుమతి దంపతులు విఠల్ వాడిలో ఉంటున్నారు. నివారం వారి బంధువు రేణుక నారాయణగూడలోని జలమండలి సమీపంలో మామిడి పండ్లను కొనుగోలు చేసుకుని వీరి ఇంటికి వచ్చింది. ఇందుమతితో పాటు నలుగురు కుమార్తెలు ఆదివారం తిన్నారు. అయితే అందరికీ వాంతులు, విరేచనాలు కావడంతో కాచిగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. మూడో కుమార్తె భువనే శ్వరి(17) దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. -
లోన్ యాప్ వేధింపులు.. వివాహిత ఆత్మహత్య
మేడ్చల్ జిల్లా: లోన్ యాప్ వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. నేరేట్మెట్ పోలీసులు తెలిపిన మేరకు..రేవంత్కుమార్, దేవనందిని (25) దంపతులు నేరేడ్మెట్లో నివాసముంటున్నారు. ఈ నెల 7న రేవంత్కుమార్ బయటకు వెళ్లిన అనంతరం భార్యకు ఫోన్ చేశాడు. ఆమె స్పందించకపోవడంతో ఇంటికి వచ్చి చూడగా బెడ్ రూమ్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని కనిపించింది. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి ఫోన్ను పరిశీలించగా ఓ గుర్తు తెలియని లోన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నట్లు గుర్తించారు. తరచూ ఫోన్ చేసి వేధింపులకు గురిచేసినట్లు విచారణలో తేలింది. ఇదిలా తండ్రి వెంకట్రెడ్డి మాత్రం.. భర్త, అత్తమాల వేధింపుల వల్లనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని వాపోయాడు. -
హత్య కేసులో కొడుకు, కూతురుకు ఉరి
మల్కాజిగిరి: ఏడేళ్ల క్రితం తండ్రిని చంపిన కేసులో కొడుకు, కూతురుకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ కోర్టు ఉరిశిక్ష విధించింది. హతుడి భార్య గంగాబాయి(65)కి వయసురీత్యా జీవిత ఖైదు విధించింది. ఈమేరకు కొడుకు కిషన్ (47) కూతురు ప్రపుల్ల (36)కు ఉరిశిక్ష ఖరారు చేస్తూ జడ్జి వి.బాలభాస్కర్ రావు తీర్పు వెలువరించారు. సోమవారం మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ బి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్టకు చెందిన కిషన్ మారుతీ సుతార దక్షిణ మధ్య రైల్వేలో గూడ్స్ ట్రైన్ డ్రైవర్గా పనిచేసి వీఆర్ఎస్ తీసుకుని మల్కాజిగిరిలో ఎన్ఏ కృష్ణానగర్లో ఇల్లు కొనుగోలు చేశాడు. అక్కడ భార్య గంగాబాయి, కొడుకు కిషన్, కూతురు ప్రపుల్లతో నివాసముంటున్నాడు. మరో కూతురు అనుపమ వివాహం కావడంతో వేరుగా ఉంటున్నది. కిషన్ ఖాళీగా ఇంటి వద్దనే ఉంటూ తన జల్సాలకు డబ్బుల కోసం తండ్రిని వేధించేవాడు. అతనికి సోదరి ప్రపుల్ల, తల్లి గంగాబాయి వత్తాసు పలికేవారు. ప్రపుల్ల కూడా పీజీ చేసినా ఉద్యోగం లేక ఖాళీగా ఉండటంతో తండ్రి మందలించేవాడు. ఇది వారికి నచ్చలేదు. పింఛను మొత్తాన్ని కూడా ప్రపుల్ల పేరు మీద మార్చాలని ఒత్తిడి చేయడంతో మారుతీ ఒప్పుకోక పోవడంతో అతన్ని అడ్డు తొలగించాలని నిర్ణయించుకున్నారు. తండ్రిని చంపడానికి ప్రపుల్ల యూట్యూబ్లో చూసి ఒక పథకం రచించి విషయాన్ని తల్లి, సోదరుడుతో పంచుకొంది. ఉమ్మెత్త చెట్టు గింజలను నూరి ఆ పొడిని ఆహారంలో కలిపి విషప్రభావంతో చనిపోయేలా చేసి తర్వాత మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా నరికి బయట నాలాలో పడేద్దామని చెప్పింది. ఆవిధంగా పలుమార్లు ఆహారంలో ఉమ్మెత్త చెట్టు గింజల పొడిని ఆహారంలో కలిపి మారుతీకి ఇవ్వగా 2019 ఆగష్టు 16న మృతి చెందాడు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి బకెట్లలో ఉంచి పూజగదిలో దాచివుంచారు. జన సంచారం ఉండటంతో రెండు రోజులు అలాగే ఉంచారు. దుర్వాసన రాకుండా అగరబత్తీలు వెలిగించి, సెంట్ చల్లి జాగ్రత్తపడ్డారు. జనసంచారం తగ్గడంతో 18వ తేదీన బయటకు తీసుకొని రావడంతో ఒక్కసారిగా దుర్వాసన వచి్చంది. దీంతో స్థానికులు గుమిగూడటంతో విషయం బయటపడ్డది. పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదుచేసి నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో సోమవారం తీర్పు వచి్చంది. -
Big Update: ఒక్కొక్కరుగా బయటకొస్తున్న బాధితులు, మోసాల చిట్టా లీక్..
-
రహస్య వీడియోలతో వేధింపులు.. అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య
కర్ణాటక: స్నానం చేస్తున్న మహిళ ఫోటో, వీడియోలను చిత్రీకరించుకుని వేధించడమే కాకుండా రూ.17 లక్షల నగదు వసూలు చేసిన నేపథ్యంలో జీవితంపై విరక్తి చెందిన ఆ మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరంలోని ఉణకల్లో జరిగింది. వివరాలు.. సుధ మృతురాలు. సిద్దారూఢ, అరుణ, మీనాక్షి, మల్లికార్జున, వీరప్ప, ప్రకాష్ బసవలింగప్ప, శివానంద, గిరిజాలపై కేసు నమోదైంది. సుధ ప్రస్తుతం ఉణకల్లో నివసిస్తూ సవదత్తి మునవళ్లిలో అంగన్వాడీ టీచర్గా పని చేస్తోంది.రెండేళ్ల క్రితం ఇంట్లో స్నానం చేస్తుండగా ఫొటో, వీడియో తీసుకొని ఆమెపై నిందితులు వేధింపులకు పాల్పడి ఆమె నుంచి క్రమంగా రూ.17 లక్షల మేర వసూలు చేశారు. అంతేగాక చెక్ బౌన్స్ కేసులో సవదత్తి కోర్టు ద్వారా కూడా ఆమెను మనోవేదనకు గురి చేశారు. వారి వేధింపులు భరించలేక ఉణకల్లోని అద్దె ఇంట్లో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు విద్యానగర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
రాజకీయ నేత ఇంట్లో రూ.కోటిన్నర చోరీ?
సనత్నగర్: ఓ రాజకీయ నాయకుడి ఇంట్లో భారీ చోరీ జరిగిందంటూ జరిగిన ప్రచారం సనత్నగర్ ప్రాంతంలో కలకలం రేపింది. ఏకంగా కోటిన్నర రూపాయలు చోరీకి గురైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తింది. అయితే ఈ విషయంపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జెక్కాలనీలో ప్రాంతంలో ఉండే ఓ రాజకీయ పార్టీ నేత ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బు కనిపించడం లేదంటూ సదరు నాయకుడు సనత్నగర్ పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వివరాల గురించి ఆరా తీసినట్లు సమాచారం. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారించగా చివరికి ఆ రాజకీయ నేత కుమార్తె డబ్బులు తీసినట్లు తెలిసింది. ఇంట్లో త్వరలో జరిగే వివాహం నిమిత్తం నగదు జమ చేసి కోటిన్నర రూపాయల వరకు అల్మారాలో దాచి ఉంచారు. శుక్రవారం కొంత నగదు వేరే వారికి ఇవ్వాల్సి ఉండగా అల్మరాలో నుంచి డబ్బును తీసుకునేందుకు చూడగా అందులో నగదు కనిపించలే దు. దీంతో కంగారు పడి ఆ రాజకీయ నేత పోలీసులకు విషయం తెలపగా వారు వచ్చి విచారణ జరిపారు. చివరకు తమ కుమార్తెనే నగదు తీసినట్లు తెలియడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఇది తమ కుటుంబ వ్యవహారమని, తామే చూసుకుంటామని సదరు రాజకీయ నేత చెప్పడంతో పోలీసులు వెనుదిరిగారు. దీనిపై ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు కూడా ఇవ్వలేదు. -
భార్య గొంతు కోసి చంపేశాడు
హైదరాబాద్: కుటుంబ కలహాలతో భార్యను కత్తితో పొడిచి చంపేశాడు భర్త. ఈ ఘటన బహదూర్పురా పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కిషన్బాగ్కు చెందిన సులేమాన్ బిన్, నిషాత్ ఫాతిమా (28) దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సులేమాన్ భార్యతో నిత్యం గొడవపడేవాడు. ఈ క్రమంలోనే అతడు రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యతో గొడవ పడుతుండడంతో గతంలో మహిళా పోలీస్స్టేషన్లో కేసు నమోదయ్యింది. పెద్దలు సర్దిచెప్పడంతో బాగా చూసుకుంటానని చెప్పిన సులేమాన్ మళ్లీ గొడవ పడుతుండేవాడు. ఆదివారం మధ్యాహ్నం కిషన్ బాగ్లోని ఇంటికి కత్తితో వచి్చన సులేమాన్, పిల్లలను వేరే గదిలో ఉంచి, భార్య నిషాత్ ఫాతిమా గొంతుకోసి బయటి నుంచి గడియపెట్టి పారిపోయాడు. నిషాత్ పాతిమా తల్లి సాయంత్రం ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఇంటికి వచ్చి చూడగా కూతురు విగతజీవిగా కనిపించింది. సమాచారం అందుకున్న బహదూర్పురా పోలీసులు ఆధారాలను సేకరించారు. ఘటనా స్థలాన్ని ఫలక్నుమా ఏసీపీ జావెద్ పరిశీలించారు. నిషాత్ ఫాతిమా తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే నెపంతో..
మెదక్: మరో మహిళతో వివాహేత ర సంబంధం పెట్టుకు న్నాడనే నెపంతో కట్టు కున్న భార్య, ఆమె తల్లి దండ్రులు, తమ్ముడితో కలిసి భర్తను దారుణంగా కొట్టి చంపారు. ఈ ఘటన ఆదివారం మెదక్ జిల్లా మెదక్ మండలంలో వెలుగులోకి వచ్చింది.ర్యాలమడుగు గ్రామానికి చెందిన పుంటికూర కుమార్గౌడ్ (50) ఆర్మీలో జవాన్గా విధులు నిర్వహిస్తు న్నారు. అతనికి కొల్చారం మండలం వరిగుంతం గ్రామానికి చెందిన పద్మతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారిద్దరి మధ్య గొడవ కారణంగా కొన్ని నెలలుగా విడిగా ఉంటున్నారు. కుమార్గౌడ్ పట్టణంలోని మిలిటరీ కాలనీలో ఉంటున్నారు.మరో మహిళతో అతడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే నెపంతో శనివారం రాత్రి అతడి భార్య పద్మ, ఆమె తల్లిదండ్రులు రామకృష్ణగౌడ్–ఎల్లమ్మ, సోదరుడు సంతోష్తో పాటు మరికొందరు కుమార్గౌడ్పై విచక్షణారహితంగా ఇనుప రాడ్స్, కర్రలతో కొట్టి చంపారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పద్మతో పాటు ఆమె తల్లిదండ్రులు, తమ్ముడిని పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. -
నీతో ఏకాంతంగా ఉన్న ఆ ఇద్దరు మహిళలు ఎవరు? అంటూ హత్య
మెదక్: వివాహేతర సంబంధం మరో వ్యక్తి ప్రాణాలు తీసింది. భార్య కళ్లుగప్పి మరో ఇద్దరు మహిళలతో సన్నిహిత సంబంధం పెట్టుకున్నాడో వ్యక్తి. ఆ విషయాన్ని గుర్తించిన భార్య ఆగ్రహంతో ఊగిపోయింది. తన తల్లిదండ్రులు, సోదరుడి సాయంతో భర్తను అక్కడికక్కడే చంపేసింది. మెదక్, మిలిటరీ కాలనీలో ఓ ఆర్మీ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధం కారణంగా పొన్నం కుమార్ను అతడి భార్య, అత్త, మామ, బావమరిది హత్య హత్యచేశారు. ఇంట్లో ఇద్దరు మహిళలతో పొన్నం కుమార్ ఏకాంతంగా ఉండగా అతడి భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఆ ఇద్దరు మహిళలు ఎవరంటూ ఆగ్రహంతో పొన్నం కుమార్ను హత్య చేసి, అనంతరం మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్లో నిందితులు నలుగురు లొంగిపోయారు. ఉత్తరాఖండ్లో ఆర్మీ ఉద్యోగిగా పని చేస్తున్న కుమార్.. ప్రస్తుతం సెలవులు ఉండడంతో ఇంటికి వచ్చాడు. ఈ నెల 10న విధులకు తిరిగి వెళ్లాల్సి ఉండగా హత్యకు గురయ్యాడు. -
మహిళను చంపడానికి 1,400 కి.మీ ప్రయాణించి..
కోల్కతా: పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ దంపతులు ఢిల్లీలోని ఓ ప్రొఫెసర్ను హత్య చేసేందుకు 1,400 కిలోమీటర్లు ప్రయాణించారు. ఆస్తి వివాదమే ఈ హత్యకు కారణమని ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీ యూనివర్సిటీలోని శివాజీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న దేబోస్మితా పాల్ హత్య కేసును పోలీసులు కేవలం 3 రోజుల్లో ఛేదించారు.తూర్పు ఢిల్లీలోని వసుంధర ఎన్క్లేవ్లో ఉన్న సత్యం అపార్ట్మెంట్స్లో బుధవారం దేబోస్మితా పాల్ మృతదేహం కనిపించింది. ప్రాథమిక దర్యాప్తు అనంతరం పోలీసులు పశ్చిమ బెంగాల్లోని బర్దమాన్ చేరుకుని రామ్ప్రసాద్ దాస్, బంశ్రీ దాస్ను అరెస్టు చేశారు.పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. వారి మైనర్ కుమారుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. దంపతులను స్థానిక కోర్టులో హాజరుపరచనున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం వారిని ఢిల్లీకి తీసుకెళ్లేందుకు పోలీసులు ట్రాన్సిట్ రిమాండ్ కోరే అవకాశం ఉందని వారు తెలిపారు.అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. నిందితులు బర్దమాన్ లో ఉంటారు. బాధితురాలిని కలవాలనే నెపంతో వారు ఢిల్లీకి వచ్చారు. 2022లో వివాహ జీవితం ప్రారంభమైన ఐదేళ్ల తరువాత దేబోస్మితా పాల్ తన భర్త నుంచి విడిపోయింది. ఆమె ఆ ఫ్లాట్లో ఒంటరిగా ఉండగా, ఆమె భర్త బెంగళూరులో ఉన్నాడు.బుధవారం నిందితులు మాస్కులు ధరించి ఆమె ఫ్లాట్కు వచ్చిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. వారు కొన్ని సంచులతో ప్రైవేట్ క్యాబ్లో వచ్చి, మెట్లు ఎక్కి 6వ అంతస్తుకు చేరుకున్నారు. అనుమానం రాకుండా ఉండేందుకు తమ మైనర్ కుమారుడిని కూడా వెంట తీసుకువచ్చారు. స్నేహపూర్వకంగా ఇంట్లోకి ప్రవేశించి, తమ వెంట తెచ్చుకున్న ఆయుధంతో ప్రొఫెసర్ను హత్య చేసినట్లు అధికారులు తెలిపారు.దుస్తులు మార్చుకున్న తరువాత సుమారు 30 నిమిషాలకే వారు తిరిగి వచ్చి, కింద వేచి ఉన్న క్యాబ్లో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సోర్సెస్ వెల్లడించాయి. క్యాబ్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని, ప్రయాణ వివరాల ఆధారంగా ప్రయాణికుల గుర్తింపును పోలీసులు నిర్ధారించారు.బుధవారం ఆ హౌసింగ్ సముదాయాన్ని సందర్శించిన 200 మందిలో 13 మందిని అనుమానితులుగా గుర్తించి ప్రశ్నించారు. 7 పోలీసు బృందాలు 4 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి, వందల మందిని విచారించాయి. దీంతో కేసు ఛేదించగలిగారు. చివరకు నిందితులను బర్దమాన్లో అరెస్టు చేసి విచారిస్తున్నారు.ఎందుకు చంపారు? బాధితురాలికి పశ్చిమ బెంగాల్లో తన మాతామహుడి మరణం అనంతరం వారసత్వంగా వచ్చిన ఓ ఆస్తి ఉంది. దాన్ని విలువ కోట్లాది రూపాయలు. నిందితులు ఆ ఇంటిలో అద్దెదారులుగా ఉండేవారు. ఆ ఆస్తిని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇల్లు ఖాళీ చేయాలని దేబోస్మితా పాల్ వారిపై ఒత్తిడి తెస్తోంది. ఆస్తిని సొంతం చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఆమెను హత్య చేయాలని దంపతులు పథకం రచించినట్లు అధికారులు తెలిపారు.దేబోస్మితా సోదరి దేవరతి గురువారం పోలీసులకు సమాచారం ఇచ్చింది. తన సోదరి మృతిచెందినట్లు తెలిపింది. ఫ్లాట్కు బయట నుంచి తాళం వేసి ఉందని పోలీసులు తెలిపారు. సోదరికి పలుమార్లు ఫోన్ చేసినా స్పందన రాకపోవడంతో దేవరతి తలుపు పగులగొట్టి లోపలికి ప్రవేశించింది.లోపల దేబోస్మితా పాల్ మృతదేహం కనిపించింది. ఆమె తలపై లోతైన గాయం, మణికట్టులో కోసిన రక్తనాళాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇంట్లో నగలు, నగదు యథాతథంగా ఉండటంతో దోపిడీ ఆనవాళ్లు కనిపించలేదని చెప్పారు. -
భర్తను కాదని.. కాలేజీ ఫ్రెండ్తో వివాహేతర సంబంధం..!
అక్రమ సంబంధం మోజుతో ఓ తల్లి ఎవరూ చేయరాని అకృత్యానికి పాల్పడింది. ప్రియునితో వెళ్లిపోయిన తల్లి.. ఆ తరువాత కూతురిని కడతేర్చింది. ఈ దారుణం బెంగళూరు కాడుగోడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. బాలిక హత్యపై భార్య ప్రియాంక, ఆమె ప్రియుడు మోహన్ పై తండ్రి ప్రవీణ్ ఫిర్యాదు చేశారు. దావణగెరెకు చెందిన ప్రవీణ్, బెంగళూరువాసి ప్రియాంకకు 2007లో వివాహం జరిగింది. ఈ దంపతులకు 17, 5 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం, ప్రియాంక కాలేజీ ప్రియుడు మోహన్తో అక్రమ సంబంధం ఏర్పడింది. దీని గురించి భర్త ప్రశ్నించగా, ప్రియాంక విడాకులు కావాలని పట్టుబట్టింది. చివరకు కుమార్తెలతో వెళ్లిపోయింది. హఠాత్తుగా బాలిక మృతి.. మార్చి 24న చిన్న కూతురు ఆకస్మాత్తుగా మరణించింది. ఏమైందని భర్త వెళ్లి ప్రియాంకను అడగ్గా, బిర్యానీ తింటూ చనిపోయిందని ఒకసారి, ఐస్ క్రీమ్ ఇచ్చి, ఏసీ వేసి కారులోనే పడుకోబెడితో మరణించిందని మరోసారి చెప్పింది. బాలిక నల్లగా ఉందని తరచూ తల్లి సతాయించేదని తెలిసింది. కుమార్తెను కొట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ప్రియుడు మోహన్ను అరెస్టు చేయగా, ఇంతలో తల్లి పరారైంది. - బెంగళూరు -
భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్య
హైదరాబాద్: ప్రియుడు నిత్యం వేధిస్తుండటంతో ఓ యువతి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ బాలరాజు తెలిపిన మేరకు.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మొల్లి దుర్గ(23) నానక్రాంగూడలోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో టెలీకాలర్గా పని చేస్తోంది. షాబాద్ మండలం అంతారం గ్రామానికి చెందిన సాయి కుమార్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ సహజీవనం చేయాలని నిర్ణయించుకున్నారు. నెల రోజులనుంచి ఇద్దరూ కేశవ్నగర్లో ఉంటున్నారు. ప్రియురాలిపై అనుమానం పెంచుకున్న సాయి కుమార్ కొద్ది రోజులుగా వేధిస్తున్నాడు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో మద్యం తాగుతూ సాయికుమార్ గొడవకు దిగాడు. తీవ్ర మనస్తాపానికి గురైన దుర్గ ఐదో అంతస్తుపై నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానికులు సిటిజన్ హస్పిటల్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. దుర్గ తల్లి దుబాయ్కి వెళ్లింది. మేనమామ దేవరంపల్లి రవి కుమార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు సాయి కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. -
‘నా భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నావా’
పరకాల: ల్యాబ్ టెక్నీషియన్ షరిఫోద్దీన్ అనుమానాస్పద మృతి మిస్టరీ వీడింది. రోడ్డు ప్రమాదం కాదు.. హత్య అని తేల్చిన పోలీసులు నిందితుడు టీస్టాల్ నిర్వాహకుడు జట్టబోయిన సందీప్(31)ను అరెస్ట్ చేశారు. షరిఫోద్దీన్ భార్యతో నిందితుడికి ఉన్న వివాహేతర సంబంధం వ్యవహారమే ఈ హత్యకు దారి తీసినట్లు పరకాల ఏసీపీ సతీశ్బాబు తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ ఈ హత్య కేసు వివరాలు వెల్లడించారు. పరకాలలోని ఓ ఇంట్లో ల్యాబ్టెక్నీషియన్ ఎండీ షరిఫోద్దీన్ అద్దెకు ఉంటున్నాడు. హనుమకొండలోని ఓ ల్యాబ్లో పనిచేస్తున్నాడు. రోజూ డ్యూటీకి వెళ్లే సమయంలో తన భార్యకు టిఫిన్ ఇచ్చిరావాలని సమీపంలోని టీ స్టాల్ నిర్వాహకుడు సందీప్కు చెప్పేవాడు. సందీప్ రోజూ వెళ్లి టిఫిన్లు ఇచ్చే క్రమంలో అతడి భార్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. చివరికి తను చెప్పకపోయినా సందీప్ ఇంటికి వెళ్తున్నట్లు తెలుసుకున్న షరీఫొద్దీన్ ఈ నెల2న ఉదయం అతడి దగ్గరికి వెళ్లి ఈ రోజు నీతో మాట్లాడే పని ఉందని, డ్యూటీకి వెళ్లి వచ్చిన తర్వాత కలుస్తానని చెప్పాడు. తమ వివాహేతర సంబంధం తెలిసిపోయిందని గ్రహించిన సందీప్ అతని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. సాయంత్రం షరిఫోద్దీన్ ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే సందీప్ వేరేవ్యక్తి ఫోన్ నుంచి వాట్సాప్ కాల్ చేసి వెల్లంపల్లి రోడ్డులోని ఓ బ్రిక్స్ షెడ్డు వద్దకు రావాలని చెప్పాడు. అక్కడికి బయల్దేరిన షరీఫోద్దీన్ మార్గమధ్యలో ఓ వైన్స్ వద్ద రెండు బీర్లు కొనుక్కొని వెళ్లగా ఇద్దరు కలిసి తాగారు. మళ్లీ అతనే వెళ్లి ఇంకో రెండు బీర్లను తీసుకురాగా వాటిని తాగుతూ ‘నా భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నావా’ అంటూ సందీప్పై షరీఫోద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన సందీప్ పక్కనే ఉన్న కర్రతో షరీఫోద్దీన్ తలపై బలంగా కొట్టడంతో చనిపోయాడు. రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు నమ్మించేందుకు మృతదేహాన్ని అతడి వాహనంపైనే అడ్డుగా పెట్టుకొని రోడ్డు మీదికి తీసుకొచ్చి ఎవరూ లేని సమయంలో పడేసి వెళ్లిపోయాడు. రక్తపు మరకలతో ఉన్న షర్ట్ను తన ఇంటి పక్కనున్న బాత్రూం వెనుకాల కాల్చిపడేశాడు. మిగతా దుస్తులను పిండిన దుస్తుల్లో కలిపి హత్య వ్యవహారాన్ని దాచే ప్రయత్నం చేశాడు. మృతుడి సోదరుడు రజాక్ ఇది హత్యగా అనుమానిస్తూ విచారణ చేయాలని ఫిర్యాదు చేయడంతో సీరియస్గా తీసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. సందీప్ ఈ హత్య చేసినట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. కేసును వేగవంతంగా ఛేదించి నిందితుడిని అరెస్టు చేసిన సీఐ క్రాంతికుమార్, ఎస్ఐలు రమేశ్, పవన్, పోలీసు సిబ్బందిని ఏసీపీ అభినందించారు. -
భర్త చనిపోయిన బాధలో ఉంటే.. ఆమెపై కన్నేశాడు
విశాఖపట్నం: మరణించిన స్నేహితుడి భార్యను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు జిల్లా మహిళా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎస్.దామోదరరావు శుక్రవారం తీర్పు వెలువరించారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్.వి.రమణ తెలిపిన వివరాల ప్రకారం.. జ్ఞానాపురంలో కె.ప్రసాద్ అనే వ్యక్తి భార్య లక్ష్మి, పిల్లలతో కలిసి జీవించేవాడు. ప్రసాద్ స్నేహితుడైన ధనాల అరుణ్కుమార్ (30) కూడా అదే ప్రాంతంలో నివసించేవాడు. 2019లో ప్రసాద్ అనారోగ్యంతో మరణించాడు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న లక్ష్మిపై నిందితుడు కన్నేశాడు. తన కోరిక తీర్చాలంటూ వేధించడం ప్రారంభించాడు. బాధితురాలు నిరాకరించడంతో ఆమెను బెదిరింపులకు గురిచేశాడు. దీనిపై బాధితురాలు 2021 ఏప్రిల్లో కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టులో నేరం రుజువు కావడంతో నిందితుడు అరుణ్కుమార్కు మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.200 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. -
ఊహించని మలుపు.. ఒకే కుటుంబంలో 9 మంది మృతి
ఇంటి పెద్దను కోల్పోయిన బాధలో ఉన్న ఆ కుటుంబాన్ని ఊహించని ప్రమాదం కబళించింది. అంత్యక్రియలు, అస్థికల నిమజ్జనం పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం బారినపడింది. దీంతో ఆ కుటుంబంలోని తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో.. మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది.పంజాబ్లోని ఫిరోజ్పూర్-ఫజిల్కా రహదారిపై ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. జలాలాబాద్కు చెందిన ఓ కుటుంబంలో ఇంటి పెద్ద(మహిళ) మరణించింది. దీంతో అంత్యక్రియలు, అనంతర కర్మలు పూర్తి చేసుకుని ఆ కుటుంబం పికప్ వాహనంలో స్వగ్రామానికి తిరుగు ప్రయాణమైంది. కుటుంబ సభ్యులు, బంధువులు కలిపి మొత్తం 28 మంది వాహనంలో ఉన్నట్లు సమాచారం.గత అర్ధరాత్రి దాటిన తర్వాత వాహనం ఫిరోజ్పూర్-ఫజిల్కా మార్గంలో ప్రయాణిస్తుండగా ఓ ప్రమాదకర కొండ మలుపు వద్ద ఎదురుగా వస్తున్న భారీ ట్రైలర్తో కొట్టింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. పికప్ వాహనం అధిక వేగంతో వెళ్తుండటంతో డ్రైవర్ మలుపు వద్ద వాహనాన్ని అదుపు చేయలేకపోయినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ట్రైలర్ను తప్పించుకునే అవకాశం లేకపోవడంతో రెండు వాహనాలు బలంగా ఢీకొన్నాయి.ఢీకొట్టిన తీవ్రతకు పికప్ వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాదం జరిగిన వెంటనే ముగ్గురు పురుషులు, ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించగా.. చికిత్స పొందుతూ మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది.ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు, అత్యవసర సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనంలో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసి సమీప ఆస్పత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన పలువురిని ఫరీద్కోట్లోని ప్రత్యేక వైద్య కేంద్రాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో అతివేగం, ఇరుకు రహదారి, ప్రమాదకర మలుపు కలిసి ప్రమాదానికి కారణమైనట్లు అనుమానిస్తున్నారు. స్థానికులు కూడా ఇదే మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఫిరోజ్పూర్-ఫజిల్కా రహదారిలోని ఈ భాగం చాలా కాలంగా ప్రమాదాల కేంద్రంగా మారిందని, రహదారి విస్తరణ చేపట్టాలని పలుమార్లు ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.#BREAKING SEVEN TO NINE killed and 15 injured in Ferozepur, Punjab, when a truck collided with a jeep carrying a family to immerse ashes. SSP Bhupinder Singh confirmed. #Punjab #Ferozepur #RoadAccident @PunjabPoliceInd https://t.co/3CbYUL1g3A pic.twitter.com/k8W1AxtjUP— jarvis ☠️ (@Vishii14) June 6, 2026 -
బుర్ఖాలో వచ్చాడు.. నడకతో దొరికిపోయాడు
స్నేహితుడి మెడలో ఐదు తులాల బంగారంపై కన్నేశాడు. ఎలాగైనా కాజేయాలని నెలల తరబడి ఎదురు చూశాడు. యూట్యూబ్లో వీడియోలు చూసి ఏం చేయాలి.. ఎలా తప్పించుకోవాలి అని స్కెచ్ గీశాడు. ప్లాన్ అమలు చేసే టైంలో.. కంగారుపడడంతో ఊహించనిది జరిగింది. అయినా బెదరలేదు. ఎవరికీ అనుమానం రాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు. చివరకు.. సీసీటీవీలో దొరికిన ఒక చిన్న క్లూ చివరకు అతడిని కటకటాల వెనక్కి నెట్టింది.ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన ప్రకాశ్ చంద్ర గుప్తా కంప్యూటర్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. అతనికి మోహిత్ ద్వివేది అనే వ్యక్తితో 18 ఏళ్ల స్నేహం ఉంది. అయితే ఆ స్నేహానికే చివరికి డబ్బు, బంగారం చిచ్చుపెట్టాయి. ప్రకాశ్ ధరించే సుమారు రూ.5 లక్షల విలువైన బంగారు గొలుసుపై మోహిత్ కన్నేశాడు. దానిని ఎలాగైనా దోచుకోవాలని నిర్ణయించుకున్న అతడు ముందుగానే పథకం రచించాడు.ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న మే 31 రాత్రి ప్రకాశ్ తన కోచింగ్ సెంటర్లోనే ఉన్నాడని తెలుసుకుని అక్కడికి వెళ్లాడు. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు బుర్ఖా ధరించడంతో పాటు మహిళలు ఉపయోగించే ఆభరణాలు, చెప్పులు కూడా వేసుకున్నాడు. అనంతరం కోచింగ్ సెంటర్లోకి ప్రవేశించి ప్రకాశ్పై దాడికి దిగాడు. బంగారు గొలుసు లాక్కునే ప్రయత్నంలో ఇద్దరి మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది.ఈ క్రమంలో ప్రకాశ్ను బలంగా తోసేయడంతో అతడు నేలపై పడిపోయి తలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం కారణంగా అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మోహిత్ బంగారు గొలుసుతో పాటు మరో బంగారు బ్రాస్లెట్ను కూడా తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. మరుసటి రోజు ఉదయం ప్రకాశ్ కుటుంబ సభ్యులు అతడి మృతదేహాన్ని రక్తపు మడుగులో గుర్తించారు. తొలుత పోలీసులు ప్రమాదవశాత్తూ పడిపోవడం వల్ల మరణించి ఉండొచ్చని భావించారు. అయితే బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో చోరీ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.దర్యాప్తులో భాగంగా పోలీసులు పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఒక చోట ఒకరు బుర్ఖాలో వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. అయితే ఆ మనిషి నడక మాత్రం తేడాగా కనిపించింది. దీంతో బుర్ఖాలో ఉంది మహిళ కాదేమోనని అనుమానపడ్డారు. అలాగే.. అక్కడి నుంచి సుమారు 100 సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ ఆ ముసుగు వ్యక్తి కదలికలను ట్రాక్ చేశారు. చివరకు ఒక కారులో.. బుర్ఖా మార్చుకుంటూ ఆ వ్యక్తి బయటపడ్డాడు. అది మోహిత్ అని గుర్తించి షాక్ తిన్నారు.పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించిన మోహిత్.. హత్య తర్వాత కూడా ఎలాంటి అనుమానం రాకుండా మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించినట్లు వెల్లడైంది. అంతేకాకుండా నేరం జరిగిన మరుసటి రోజే ఓ పోటీ పరీక్షకు హాజరై, తర్వాత లక్నోకు వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. ఈ ఘటనతో ప్రకాశ్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. "18 ఏళ్ల స్నేహాన్ని డబ్బు కోసం బలి చేశాడు. ఇంత దారుణంగా మోసం చేస్తాడని ఊహించలేదు" అని మృతుడి సోదరుడు ఆవేదన వ్యక్తం చేశాడు. -
రహస్య గదులు.. స్పా ముసుగులో వ్యభిచారం..!
సాక్షి, హైదరాబాద్: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిబంధనలు ఉల్లంఘిస్తూ, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న అక్రమ స్పా సెంటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్ఓటీ) సమన్వయంతో కమిషనరేట్ పరిధిలోని 113 స్పా సెంటర్లలో విస్తృత తనిఖీలు చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ కార్యకలాపాలు సాగిస్తున్న 46 సెంటర్ల నిర్వాహకులు, మేనేజర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఆయా సెంటర్లు ప్రధానంగా అనుమతులు లేకపోవడం, రహస్య గదుల ఏర్పాటు, గుర్తింపు కార్డులు సేకరించకపోవడం, నేమ్బోర్డులు ప్రదర్శించకపోవడం, రికార్డుల నిర్వహణ లోపం వంటి ఉల్లంఘనలకు పాల్పడినట్లు కమిషనర్ బి. సుమతి శుక్రవారం మీడియాకు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), వ్యభిచార నిరోధక చట్టం (ఐటీపీఏ) ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. భవన యజమానులు తమ ప్రాంగణాలను స్పా నిర్వహణకు అద్దెకు ఇచ్చే ముందు అద్దెదారుల వివరాలను పూర్తిగా సరిచూసుకోవాలని, అక్రమ కార్యకలాపాలకు తావిస్తే యజమానులపై కూడా చర్యలు ఉంటాయని కమిషనర్ హెచ్చరించారు. #Hyderabad:Major crackdown on #spacentres in #Malkajgiri#Police inspected 113 spa centres and booked 46 cases for violations including #hiddenrooms without #transparentdoors, failure to collect #customerIDproofs, lack of permissions and poor record maintenance.Cases have… pic.twitter.com/yz44plNGKq— NewsMeter (@NewsMeter_In) June 5, 2026 -
లైంగిక ఆరోపణలు.. లొంగిపోయిన చిన్నమల్లయ్య
సాక్షి, పల్నాడు: ఏపీలో సంచలనం రేపిన వినుకొండ మాజీ సీఐ చిన్నమల్లయ్య వ్యవహారం కీలక మలుపు తిరిగింది. లైంగిక ఆరోపణల కేసు నేపథ్యంలో నెలకు పైగా అజ్ఞాతంలో ఉన్న ఆయన.. ఎట్టకేలకు ఈ వేకువ జామున పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు.బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన ధనలక్ష్మి అనే మహిళ తనపై అత్యాచారం చేశాడని చిన్నమల్లయ్యపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తన కుటుంబం నిర్వహిస్తున్న నాటు కోళ్ల ఫారం వ్యవహారంలో పరిచయం ఏర్పడిన సీఐ చిన్నమల్లయ్య.. తనను బెదిరించి లైంగికంగా వేధించడమే కాకుండా అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయడంతో విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆరోపణలు వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీస్ శాఖ స్పందించింది. చిన్నమల్లయ్యను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసు తీవ్రత దృష్ట్యా ప్రత్యేక దర్యాప్తు ప్రారంభమైంది. ఈలోపు.. చిన్నమల్లయ్య కనిపించకుండా పోవడంతో ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే సమయంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం, పోలీస్ శాఖ తీరు తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా.. ఆయన్ని విధుల నుంచి తొలిగిస్తూ పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇటు మొదట హైకోర్టులో, ఆ తర్వాత సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కోర్టుల నుంచి ఊరట లభించకపోవడంతో చిన్నమల్లయ్యపై ఒత్తిడి మరింత పెరిగింది. ఒకవైపు పోలీసుల గాలింపు, మరోవైపు కోర్టుల్లో ఎదురుదెబ్బలు, ఉద్యోగం కోల్పోయిన పరిణామాల మధ్య చిన్నమల్లయ్య చివరకు బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆయన వినుకొండ పోలీస్ స్టేషన్కు చేరుకుని లొంగిపోయినట్లు స్పష్టమవుతోంది. అనంతరం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని తదుపరి న్యాయపరమైన ప్రక్రియను ప్రారంభించారు. -
సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఫోన్ సంభాషణలు
-
అమీర్పేట ప్రమాదం.. స్పాట్కు ‘హైడ్రా’ రంగనాథ్
హైదరాబాద్: అమీర్పేట మైత్రివనం సిగ్నల్ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇంత భారీ ప్రమాదం జరిగి 24 గంటలు గడుస్తున్నా.. ఎలా జరిగింది? అనేదానిపై పోలీసులు కచ్చితమైన ఓ అంచనాకు రాలేకపోయారు. ఈ క్రమంలో.. ఫోరెన్సిక్ టీం శుక్రవారం మరోసారి ఆధారాలు సేకరించే ప్రయత్నం చేసింది. మరోవైపు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ‘‘మంటల్లో బిల్డింగ్ దాదాపుగా కాలిపోయింది. కాంప్లెక్స్కు ఎంట్రీ, ఎగ్జిట్లు సరిగ్గా లేవు. అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం జరగలేదు. పక్కన మెస్ నుంచి మంటలు వ్యాపించాయని కొందరు అంటున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందని మరికొందరు అంటున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనేది దర్యాప్తు పూర్తైతేనే తెలుస్తుంది.. .. మెట్రో నిర్మాణం తర్వాతే ఈ కాంప్లెక్స్ కట్టారని అంటున్నారు. ఫుట్పాత్, నాలా ఆక్రమణలు జరిగాయా? అనే దానిపై దృష్టిసారించాం. అలాగే.. బిల్డింగ్ అనుమతలు, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించారా? అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. నాలా ఆక్రమణ ఉంటే కచ్చితంగా కూల్చేస్తామని అన్నారాయన. ఈ ప్రమాదం నేపథ్యంలో.. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని భవనాలపై హైడ్రా తరఫున ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారాయన. ఇదిలా ఉంటే.. మైత్రివనం చౌరస్తాలోని మెట్రో పిల్లర్ నెంబర్ 1043 వద్ద శ్రీనివాసనగర్ వెస్ట్ కమాన్ను ఆనుకుని ఉన్న కేఎస్సార్ మాల్ కాంప్లెక్స్లో గురువారం మధ్యాహ్నాం అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం ధాటికి 20కి పైగా దుకాణాలు ఖాళీ బూడిదయ్యాయి. సుమారు కోటిన్నర రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. అయితే రెండో అంతస్తులో షార్ట్సర్క్యూట్ జరిగి ఈ ఘోరం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. -
లవర్స్ కోసం.. కుళాయిలు కొట్టేశారు
ప్రేమలో పడితే కొన్నిసార్లు ఆలోచనలకన్నా కోరికలే ముందుకు నడిపిస్తాయి. ప్రియురాళ్లకు గిఫ్ట్గా ఐఫోన్ ఇవ్వాలన్న చిన్న ఆశ ఆ యువకులను పెద్ద నేరం వైపు నెట్టేసింది. కానీ వారు వేసిన ప్లాన్ మాత్రం చివరికి ఊహించని మలుపు తిరిగి కటకటాల పాలు జేసింది.ఇద్దరు యువకులు తమ గర్ల్ఫ్రెండ్స్కు ఐఫోన్లు కొనివ్వాలనే ఉద్దేశంతో ఏకంగా రూ.6.5 లక్షల విలువైన లగ్జరీ డిజైనర్ ట్యాప్స్ను ఓ గోడౌన్ నుంచి దొంగిలించారు. కానీ ఆ ఖరీదైన వస్తువులు చివరికి కేవలం రూ.20 వేలకే స్క్రాప్ డీలర్కు అమ్మేయడం ఈ కేసులో మరో ట్విస్ట్గా మారింది.ఓ గోడౌన్ యజమాని ఫిర్యాదుతో ఈ దొంగతనం వెలుగులోకి వచ్చింది. మే 27–28 మధ్య రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గోడౌన్ పైకప్పులోని టిన్ షీట్లు తొలగించి లోపలికి ప్రవేశించి ఖరీదైన సానిటరీ వేర్ను ఎత్తుకెళ్లారు. గోల్డ్ టోన్, రోజ్ గోల్డ్, సిల్వర్ ఫినిష్ ఉన్న ప్రీమియం ట్యాప్స్ సహా మొత్తం రూ.6.5 లక్షల విలువైన వస్తువులు చోరీ అయ్యాయి.కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు 20కి పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. స్థానిక సమాచారం, టెక్నికల్ ఇన్పుట్స్ ఆధారంగా కేవలం 12 గంటల్లోనే కేసును ఛేదించారు. విచారణలో ఇద్దరు మైనర్లు సహా ఒక ప్రధాన నిందితుడు పట్టుబడ్డాడు. ప్రశ్నించగా షాకింగ్ నిజం బయటపడింది గర్ల్ఫ్రెండ్స్కు ఐఫోన్లు కొనాలన్న కోరికతోనే ఈ దొంగతనం చేశామని వారు ఒప్పుకున్నారు. దొంగిలించిన ఖరీదైన ట్యాప్స్ను కేవలం రూ.20 వేలకే అమ్మినట్లు కూడా తేలింది. ఆ వస్తువులు కొనుగోలు చేసిన 38 ఏళ్ల ఇర్ఫాన్ అలీని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ కోసం వేసిన “కాస్ట్లీ స్కెచ్” చివరికి చీప్ బేరంలో ముగిసి, పోలీసులు కేసును ఛేదించడంతో కథ ముగిసింది. నాగ్పూర్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
ప్రేమలో గొడవ.. ప్రేయసిపై ఘాతుకం
ప్రేమ సంబంధం.. బెడిసి కొట్టి రక్తసిక్తమైంది. ప్రేమోన్మాదానికి మరో యువతి బలైంది. ఆఫీస్లో.. అదీ తోటి ఉద్యోగులు చూస్తుండగానే ఘాతుకానికి పాల్పడ్డాడు ఓ కిరాతకుడు. ఆపై తన గొంతు కోసుకుని బలవన్మరణానికి ప్రయత్నించాడు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ ఘోరం వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్లోని మొహాలీ నగరంలో గురువారం సాయంత్రం ఘోరం జరిగింది. ఓ ప్రైవేట్ కంపెనీ కార్యాలయంలో సహోద్యోగి చేతితో యువతి దారుణ హత్యకు గురైంది. అక్కడే ఉన్న కొందరు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆ ఉన్మాది ఆగలేదు. అనంతరం నిందితుడు తన గొంతును తానే పలుమార్లు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. డింపుల్ ఓ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. అక్కడే పని చేసే హర్విందర్ మాన్ అలియాస్ హ్యారీతో మూడేళ్లుగా రిలేషస్షిప్లో ఉంది. అయితే.. కొన్నిరోజులుగా ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. హ్యారీ డింపుల్ను బతిమాలుతూ వచ్చాడు. ఈ క్రమంలో బ్రేకప్ను వెనక్కి తీసుకునేందుకు డింపుల్ అంగీకరించలేదు. పైగా హెచ్ఆర్కు ఫిర్యాదు చేయడంతో అతనికి నోటీసులు ఇచ్చారు. దీంతో.. గురువారం సాయంత్రం సుమారు 7:40 గంటల సమయంలో నిందితుడు ఆఫీస్లోకి వచ్చాడు. అప్పటికే తన డెస్క్ వద్ద పని చేస్తున్న డింపుల్పై వెనుక నుంచి దాడి చేసి కత్తితో పొడిచాడు. ఆమె ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీసినా.. నిందితుడు వెంటాడుతూ జుట్టు పట్టుకుని లాగుతూ మరింతగా దాడి చేశాడు.కార్యాలయంలో ఉన్న సిబ్బంది అతడిని ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యారు. ఈ దాడిలో డింపుల్కు 20 కత్తిపోట్లు పడ్డట్లు సమాచారం. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఆ తర్వాత నిందితుడు అదే కార్యాలయంలోకి వెళ్లి తన గొంతును తానే పలుమార్లు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.తీవ్ర భయాందోళనకు గురైన ఉద్యోగులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి ఇద్దరినీ సమీపంలోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే డింపుల్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. నిందితుడి ఒంటిపై 30 కత్తి పోట్లు ఉన్నాయని.. ప్రస్తుతం అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. డింపుల్ కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు."Rejected Lover Stabs Ex-Girlfriend to Death Inside Mohali Office, Then Attempts Suicide"#Mohali, #Punjab - In a shocking case of suspected rejection-driven violence, a 30-year-old woman named Dimple was stabbed to death by her former boyfriend inside a private Packers & Movers… pic.twitter.com/GRXcNOjG8f— Siraj Noorani (@sirajnoorani) June 5, 2026 -
ఒంటరి మహిళపై అన్నదమ్ముల అఘాయిత్యం
పల్నాడు: వివాహితపై లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరిపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. సత్తెనపల్లి రూరల్ సీఐ పి.కిరణ్ తెలిపిన వివరాలు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళపై అదే గ్రామానికి చెందిన కొత్తపల్లి సుధాకర్, అతడి సోదరుడు శ్రీను గ్రామ శివారులోని పొలాల్లో బుధవారం రాత్రి ఒంటరిగా ఉన్న సమయంలో లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు బాధితురాలు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
ఢిల్లీలో మరో అగ్నిప్రమాదం
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతంలో మరోసారి అగ్నిప్రమాదం కలకలం రేగింది. ఇటీవల ఢిల్లీలోని మాలవీయ నగర్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం ఇంకా మరువక ముందే.. తాజాగా నోయిడాలోని ఓ ఎత్తైన అపార్ట్మెంట్లో మంటలు చెలరేగడం ఆందోళన కలిగిస్తోంది.నోయిడాలోని ఐవీ కౌంటీ (Ivy County) అపార్ట్మెంట్ సముదాయంలోని 12వ అంతస్తులో ఉన్న ఓ ఫ్లాట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు తీవ్రరూపం దాల్చడంతో భవనం పైభాగం నుంచి భారీగా పొగలు ఎగసిపడ్డాయి. దట్టమైన పొగతో పరిసర ప్రాంతాలు కమ్ముకుపోవడంతో నివాసితులు భయాందోళనలకు గురయ్యారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. భవనంలోని ఇతర ఫ్లాట్లలో ఉన్న వారిని అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం.A fire broke out at the IVY County residential complex in Sector 75, Noida, raising serious concerns about the city’s firefighting preparedness. According to residents, fire brigade hoses were unable to project water beyond the sixth floor. pic.twitter.com/YnFPXZvW3N— Sanjay Kishore (@saintkishore) June 5, 2026ఇటీవల ఢిల్లీలోని మాలవీయ నగర్లో జరిగిన అగ్నిప్రమాదంలో 21 ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై విచారణ కొనసాగుతున్న వేళే, తాజాగా నోయిడాలో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం భవనాల అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది.ప్రస్తుతం మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా, ప్రాణనష్టం సంభవించిందా అనే విషయాలపై అధికారులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భార్య గొంతు కోసి హత్య
హైదరాబాద్: కుటుంబ కలహాలతో ఓ భర్త.. భార్య గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన కూకట్పల్లి పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. బోరబండకు చెందిన షేక్ రహీం (32)తో సుమేరా బేగం (23)కు 2024లో వివాహం జరిగింది. వీరికి 20 నెలల కుమారుడు ఉన్నాడు. కైత్లాపూర్లోని ఇందిరమ్మ కాలనీలో వీరు నివాసం ఉంటున్నారు. ఇటీవల దంపతుల మధ్యగొడవలు జరుగుతున్నాయి. రెండు నెలల క్రితం ఏప్రిల్లో సుమేరా బేగం భర్తపై గృహహింస కేసు పెట్టింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. గురువారం ఉదయం భార్యా భర్తలు గొడవపడసాగారు. ఈ క్రమంలో భర్త షేక్ రహీం కూరగాయల కత్తితో సుమేరా బేగం గొంతు కోశాడు. దీంతో ఆమె మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని స్వా«దీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి భర్త షేక్ రహీంను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఫోన్ చేసి తమ్ముడికి సమాచారమిచ్చి..
ఒంగోలు టౌన్: ఆ యువకుడు ఆ ఇంటికి పెద్ద కుమారుడు. తల్లిదండ్రుల సంపాదన అంతంతమాత్రమే కావడంతో కుమారుడిగా బాధ్యత నెత్తిమీద వేసుకున్నాడు. ఇంకా చదువుకోవాలని ఉన్నా.. పదో తరగతి వరకే చదివాడు. తమ్ముడిని, చెల్లిని చదివించాలని కలలుగన్నాడు. కానీ, ఆ కలలు తీరకుండానే లోకం విడిచాడు. రోడ్డు ప్రమాదం ఆ ఇంటిని అంతులేని విషాదంలో నింపింది.బాధిత కుటుంబం కథనం ప్రకారం... ఒంగోలు నగరానికి చెందిన కడియం గోపి, శ్రావణి దంపతులకు ముగ్గురు సంతానం. గోపి ఆటో డ్రైవర్, శ్రావణి ఇళ్లలో పనిమనిషిగా చేస్తూ పిల్లలను చదివించుకుంటున్నారు. పెద్ద కుమారుడు లోకేష్ (21) పదో తరగతి వరకే చదువుకున్నాడు. తనకు బాగా చదువుకోవాలని ఉన్నప్పటికీ కుటుంబం గడిచే పరిస్థితి లేకపోవడంతో కష్టంగానే చదువు మానుకుని పనులకు వెళ్లడానికి సిద్ధమయ్యాడు.త్రోవగుంటలోని ఒక మోటారు సైకిల్ కంపెనీలో పనికి చేరాడు. తమ్ముడు, చెల్లెలు చదువుతుంటే సంతోషించేవాడు. ఎప్పుడూ సాయంత్రం 6 గంటల తర్వాత ఇంటికి వచ్చే లోకేష్.. మంగళవారం పని ఎక్కువగా ఉందని ఇంటికి రాలేదు. బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో తమ్ముడికి ఫోన్ చేశాడు. ఇంటికి వచ్చే దారిలో దశరాజుపల్లి ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద తనకు ప్రమాదం జరిగిందని, వెంటనే రావాలని చెప్పాడు. ఆ మాటలు పూర్తి కాకుండానే ఫోన్ స్విచాఫ్ అయింది.ఆందోళన చెందిన లోకేష్ కుటుంబ సభ్యులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే రోడ్డు మీద లోకేష్ నిర్జీవంగా పడి ఉన్నాడు. దాంతో కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. వారి ఆవేదనతో చూపరుల గుండెలు సైతం తరక్కుపోయాయి. లోకేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఒంగోలు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అమీర్పేట అగ్నిప్రమాదం: భారీగా ట్రాఫిక్జామ్
సాక్షి, హైదరాబాద్: అమీర్పేటలో గురువారం మధ్యాహ్నాం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మైత్రివనం సిగ్నల్ సమీపంలోని ఓ షాపింగ్ మాల్ అగ్నికి ఆహుతైంది. అమీర్పేట మెట్రో జంక్షన్కు 100 అడుగుల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ప్రమాదంతో అమీర్పేట చుట్టుపక్కల ఏరియాల్లో భారీగా ట్రాఫిక్జామ్ అయ్యింది.అమీర్పేట మెట్రో స్టేషన్ వద్ద పిల్లర్ నెంబర్ 1043 వద్ద శ్రీనివాసనగర్ వెస్ట్ కమాన్ను ఆనుకుని ఉన్న కేఎస్సార్ షాపింగ్ మాల్ కాంప్లెక్స్ నుంచి మంటలు మొదలైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆపై మంటలు వేగంగా వ్యాపిస్తూ చుట్టుపక్కల దుకాణాలకు వ్యాపించడం మొదలుపెట్టాయి. ప్రమాదం ధాటికి షాపింగ్ మాల్ పూర్తిగా దగ్ధమైంది. రెండు, మూడు అంతస్థుల్లోని సుమారు 20 దుకాణాలు ఖాళీ బూడిదయ్యాయి. పక్కనే ఉన్న ఓ మెస్కు మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ ప్రమాదంలో అమీర్పేట-మైత్రివనం ఏరియాలో దట్టమైన పొగ అలుముకుంది. సహాయక చర్యల నేపథ్యంలో.. అమీర్పేట నుంచి ఎస్సార్ నగర్ వెళ్లే వైపు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సిటీ బస్సులు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. వాటర్ ట్యాంకర్లు, ఆరు ఫైరింజన్లు మంటల్ని అదుపు చేసే రెస్క్యూలో పాల్గొంటున్నాయి. ప్రాణ నష్టం తప్పినప్పటికీ.. భారీగా ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియ రావాల్సి ఉంది.మెట్రో సేవలకు అంతరాయం!మైత్రివనం దగ్గర అగ్నిప్రమాదంతో మెట్రో రైళ్ల సేవలకు అంతరాయం ఏర్పడినట్లు సమాచారం అందుతోంది. ప్రమాదం జరిగిన ప్లేస్ మెట్రో ట్రాక్కు సమీపంలో ఉండడం, పిల్లర్కు సైతం మంటలు అంటుకోవడం.. ఫైరింజన్లతో అక్కడ సహాయక చర్యలు కొనసాగుతుండడం మెట్రో రైళ్లలో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సజ్జనార్ ట్వీట్మైత్రివనం సిగ్నల్ దగ్గరి అగ్నిప్రమాదంపై నగర కమిషనర్ సీవీ సజ్జనార్ ట్వీట్ చేశారు. అమీర్పేటలోని శ్రీనివాసనగర్ వెస్ట్, మెట్రో పిల్లర్ నంబర్ A1043 సమీపంలో ఉన్న కెఎస్సార్ ఫ్యాషన్స్లో అగ్నిప్రమాదం సంభవించిందని.. అత్యవసర సహాయక చర్యల కారణంగా, అమీర్పేట నుండి ఎస్సార్ నగర్ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని.. దీనివల్ల ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యిందని.. వాహనదారులు ఈ మార్గంలో ప్రయాణించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్, అత్యవసర సిబ్బందికి సహకరించాలని కోరారాయన. ట్రాఫిక్ అలర్ట్!అమీర్పేటలోని శ్రీనివాసనగర్ వెస్ట్, మెట్రో పిల్లర్ నంబర్ A1043 సమీపంలో ఉన్న కెఎస్సార్ ఫ్యాషన్స్లో అగ్నిప్రమాదం సంభవించింది. అత్యవసర సహాయక చర్యల కారణంగా, అమీర్పేట నుండి ఎస్సార్ నగర్ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది, దీనివల్ల ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్…— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) June 4, 2026 -
ఢిల్లీ హోటల్ ఘటన: సిలిండర్ పేలుడు కాదంట!
ఢిల్లీ: మాలవీయా నగర్లోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంపై.. ప్రాథమిక దర్యాప్తులో కీలక అంశాలు వెలుగు చూశాయి. అగ్ని ప్రమాదానికి సిలిండర్ బ్లాస్ట్ కారణం కాదని పోలీసులు ధృవీకరించారు. దీంతో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ఘోరం జరిగి ఉండొచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి.మొదట్లో ఈ అగ్ని ప్రమాదం ఎల్పీజీ సిలిండర్ పేలుడు వల్ల జరిగిందా? అనుమానం వ్యక్తమైంది. కానీ దర్యాప్తు బృందాలు ఆ కోణాన్ని ప్రస్తుతం పూర్తిగా తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. ఘటన స్థలాన్ని పరిశీలించిన తర్వాత సిలిండర్ పేలుడు జరిగినట్లు సూచించే ఎలాంటి ఆధారాలు లభించలేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో గ్యాస్ ఎక్స్ప్లోషన్ కారణమన్న వాదన బలహీనపడింది.దర్యాప్తులో బయటపడిన మరో ముఖ్య విషయం ఏమిటంటే.. హోటల్లో రెండు వేర్వేరు కిచెన్లు ఉండటం. వాటిలో ఒకటి భవనం బేస్మెంట్లో ఉండగా, మరొకటి పై అంతస్తులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ రెండు కిచెన్లలోనూ అనేక ఎల్పీజీ సిలిండర్లు నిల్వ ఉన్నప్పటికీ, అవి ఏదీ పేలిన ఆనవాళ్లు మాత్రం కనిపించలేదని ప్రాథమిక తనిఖీల్లో తేలింది.ఈ పరిస్థితుల నేపథ్యంలో మంటలు ఎలా ప్రారంభమయ్యాయి, ఏ ఎలక్ట్రికల్ పాయింట్ నుంచి షార్ట్ సర్క్యూట్ జరిగిందన్న అంశాలపై దర్యాప్తు బృందాలు మరింత లోతుగా పరిశీలిస్తున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. బ్రేక్ఫాస్ట్ కోసం వంటమనిషి(చెఫ్) ఎలక్ట్రిక్ స్టవ్ వినియోగ సమయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతానికి షార్ట్ సర్క్యూట్ కోణమే ప్రధాన అనుమానంగా కొనసాగుతోంది. అయితే, ఇది తుది నిర్ధారణ కాదని, ఫోరెన్సిక్ నివేదిక తర్వాతే పూర్తి స్పష్టత రానుందని అధికారులు పేర్కొంటున్నారు.దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్ హౌజ్రాణి ప్రాంతంలో ఉన్న ఫ్లరిష్ స్టే బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ హోటల్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. బుధవారం ఉదయం 8.50 గంటల సమయంలో ప్రారంభమైన మంటలు క్షణాల్లో భవనం అంతటా వ్యాపించడంతో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో భారతీయులతో పాటు ఆఫ్రికా, తుర్క్మెనిస్థాన్కు చెందిన విదేశీయులు కూడా ఉన్నారు. గురుగ్రావ్కు చెందిన 8 మంది కుటుంబ సభ్యులు మరణించారు. మరో 35 మంది గాయపడగా, వారిలో 19 మంది పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. భవనంలో ఒకే ఎగ్జిట్ ఉండటం, అనుమతులకు మించి గదులు నిర్వహించడం, బేస్మెంట్తో సహా అనధికార నిర్మాణాలు ఉండటం వల్ల ఎక్కువ మంది బయటపడలేకపోయారని అధికారులు చెబుతున్నారు. కొందరు కిటికీల నుంచి దూకి ప్రాణాలు కాపాడుకోగా, ఒక మహిళ తన చిన్నారితో సహా మూడో అంతస్తు నుంచి దూకిన ఘటన కూడా చోటుచేసుకుంది. ఈ హోటల్ ప్రభుత్వ B&B పథకం కింద నడుస్తుండగా, కేవలం ఆరు గదుల అనుమతి ఉన్నా 25 గదుల వరకు నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పరారీలో ఉన్న హోటల్ యాజమానిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేయగలిగారు. ప్రమాద సమయంలో తాను అక్కడే ఉన్నానని.. భయంతో పారిపోయానని చెబుతున్నాడతను. -
శివ.. ది ‘గాంజా’ ట్రాన్స్పోర్టర్! నా దారిలో నో టోల్గేట్!
సాక్షి, రంగారెడ్డి: అంతరాష్ట్ర గంజాయి ట్రాన్స్పోర్టర్గా మారిన ఓ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) కానిస్టేబుల్ సరుకు సరఫరాలో తనదైన పంథాను అనుసరిస్తున్నాడు. ఎక్కడా టోల్గేట్ దాటకుండా నాలుగు రాష్ట్రాల్లోని గమ్యాలకు చేరుతున్నాడు. అక్కడ ఉన్న డ్రగ్ పెడ్లర్స్కు సరుకు అప్పగిస్తున్నాడు. ఈ పంథాలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నిందితుడిని జూబ్లీహిల్స్ టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఇతడి నుంచి రూ.79 లక్షల విలువైన 158 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ వెల్లడించారు.ఇల్లు కట్టి ఇరుక్కుపోయిన వైనం...ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడానికి చెందిన పనగూడు శివకృష్ణ 2009లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్లో (ఎన్డీఆర్ఎఫ్) డిప్యుటేషన్పై ఉన్న శివ కేరళంలో పని చేసేవాడు. అక్కడి ఉట్టూరులో విలాసవంతమైన ఇల్లు కట్టిన శివ అప్పుల్లో మునిగిపోయాడు. ఇదిలా ఉండగా... మోతుగూడానికి చెందిన కొందరి ద్వారా ఇతడికి సీలేరు కేంద్రంగా గంజాయి పండించే వారితో పరిచయం ఏర్పడింది. అప్పులు తీర్చుకోవడంతో పాటు తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం గంజాయి ట్రాన్స్పోర్టర్గా మారాడు. సరుకు తీసుకువెళ్లడానికి డిక్కీ పెద్దగా ఉంటుందనే ఉద్దేశంతో కేరళంలో చేవ్రొలెట్ కంపెనీ కారు ఖరీదు చేశాడు. దాని డిక్కీలో సరుకు సర్దుకుని సీలేరు నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఉన్న పెడ్లర్స్కు సరఫరా చేస్తున్నాడు.దూరమైనా టోల్గేట్లు దాటడు...ఏదైనా ఓ ప్రాంతానికి గంజాయి తీసుకువెళ్లాలంటే ఆ గమ్యస్థానానికి దారితీసే మార్గాలను గూగుల్ మ్యాప్స్ ద్వారా అధ్యయనం చేస్తాడు. కాస్త దూరం ఎక్కువైనప్పటికీ ఎక్కడా టోల్గేట్ దాటకుండా జాగ్రత్తపడతాడు. తన కదలికలు బయటపడకూడదనే ఉద్దేశంతో ఇలా చేస్తుంటాడు. ఒక్కో ట్రిప్కు రూ.5 నుంచి రూ.6 లక్షలు ఆర్జిస్తున్నాడు. 2023లో ఇతడిపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మాపేట ఠాణాలో కేసు నమోదైంది. ఆ కేసులో జైలుకు వెళ్లి వచ్చినా తన పంథా మార్చుకోని శివ నెట్వర్క్ మరింత విస్తరించుకుని దందా కొనసాగిస్తున్నాడు. రెండు నెలల క్రితం టాస్క్ఫోర్స్ పోలీసులు అంబర్పేటలో ఓ డ్రగ్ పెడ్లర్ని పట్టుకున్నారు. ఇతడి విచారణలో శివ పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ సీహెచ యదేందర్, ఎస్సై డి.రవి రాజ్ నేతృత్వంలోని బృందం బుధవారం ఎస్సార్నగర్ పరిధిలో అతడి పట్టుకుంది. ఈసారి ఇతడు షోలాపూర్ వెళ్తున్నాడని అధికారులు చెప్తున్నారు.ప్రతి నెలా కనీసం మూడు ట్రిప్పులు..తనకు వచ్చే ఆర్డర్స్ ఆధారంగా శివ ప్రతి నెలా కనీసం మూడు ట్రిప్పులు వేసి సరుకు సరఫరా చేస్తుంటాడు. సీలేరుతో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాల నుంచి సరుకు తీసుకునే ఇతగాడు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ప్రయాణం ప్రారంభిస్తాడు. మరుసటి రోజు అదే సమయానికి గమ్యానికి చేరుకుంటాడు. ఆయా రహదారుల్లోని టోల్గేట్స్ను తప్పించుకు తిరిగే ఇతగాడు మిగిలిన చోట్ల పోలీసులు ఆపితే తన సీఐఎస్ఎఫ్ గుర్తింపు కార్డు చూపించి బయటపడతాడు. 2023లో కేసు నమోదైన నాటి నుంచి ఇతడు సస్పెన్షన్లో ఉన్నట్లు డీసీపీ రఘునాథ్ చెప్పారు. -
అదే ఆ కుటుంబానికి ఆఖరి కాల్!
ఢిల్లీలోని మాలవీయ నగర్ ప్రాంతంలో జరిగిన ఘోర హోటల్ అగ్నిప్రమాదంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించిన విషయం కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. తండ్రి చికిత్స కోసం ఆసుపత్రికి దగ్గరగా ఉండాలని గుర్గ్రామ్ నుంచి వచ్చిన ఆ కుటుంబం.. అనూహ్య రీతిలో ప్రాణాలు పొగొట్టుకోవడం గమనార్హం. సౌత్ ఢిల్లీలోని ఫ్లారిష్ స్టే బీ అండ్ బీ హోటల్లో మంగళవారం ఉదయం సుమారు 8.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఐదు అంతస్తుల ఇరుకైన భవనంలో మంటలు వేగంగా వ్యాపించడంతో లోపల ఉన్నవారికి బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 21 మంది మృతి చెందగా, వారిలో 9 మంది భారతీయులు, 12 మంది విదేశీయులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.మరణించిన భారతీయుల్లో ఎనిమిది మంది ఒకే కుటుంబానికి చెందినవారని గుర్తించారు. గుర్గ్రామ్ సెక్టార్ 46కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ వివేక్ అగర్వాల్ (48), ఆయన భార్య తరణి అగర్వాల్, తల్లి ప్రేమలత అగర్వాల్, ఇద్దరు కుమార్తెలు జివిషా (ఏంజెల్), వర్య (పర్ల్)తో పాటు మరో ఇద్దరు బంధువులు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. మొత్తం రెండు తరాలు ఈ ప్రమాదంలో తుడిచిపెట్టుకుపోయాయి.ఈ కుటుంబం ఢిల్లీకి రావడానికి కారణం అత్యంత హృదయ విదారకం. వివేక్ తండ్రి రాధేశ్యామ్ అగర్వాల్ (80లు) శ్వాస సంబంధిత వ్యాధితో సాకేత్లోని మ్యాక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా, ఆయనకు దగ్గరగా ఉండేందుకు కుటుంబం సమీపంలోని హోటల్లో బస చేసింది. తండ్రిని చూసుకోవాలన్న ఉద్దేశంతో వచ్చిన ఈ ప్రయాణం ఒక్కసారిగా శాశ్వత విషాదంగా మారింది.తరుణి అగర్వాల్ వైపు నుంచి వచ్చిన మరో ముగ్గురు బంధువులు కూడా అదే హోటల్లో ఉండగా మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం ఎనిమిది మంది ఒకే కుటుంబం నుంచి మరణించారు. మరింత హృదయ విదారకంగా, చికిత్స పొందుతున్న రాధేశ్యామ్ అగర్వాల్ వద్దకే తన భార్య, కుమారుడు, కోడలు, మనవళ్లు, బంధువుల మృతదేహాలు చేరిన పరిస్థితి కుటుంబాన్ని పూర్తిగా కుదిపేసింది.ఈ ఘటనలో మరణానికి ముందు జరిగిన చివరి క్షణాలు కూడా వెలుగులోకి వచ్చాయి. కుటుంబ సభ్యుడు పునీత్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం, మంటల సమయంలో వివేక్ అగర్వాల్ చివరిసారిగా ఫోన్ చేసి “బహుశా మేము బతకలేము” అని చెప్పినట్లు తెలిపారు. తడి రుమాలు ముఖానికి పెట్టుకోవాలని సూచించినా.. పరిస్థితి వేగంగా దారుణంగా మారిందని ఆయన పేర్కొన్నారు.ప్రాథమిక దర్యాప్తులో హోటల్లో తీవ్ర భద్రతా లోపాలు ఉన్నట్లు బయటపడింది. ఒకే ప్రవేశ–నిష్క్రమణ మార్గం ఉండడం, చిన్న కిటికీలు, సరైన ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవడం వల్ల అనేక మంది బయటకు రాలేకపోయారు. కొన్ని కిటికీలు మూసివేయబడినట్లు కూడా గుర్తించారు.అంతేకాకుండా హోటల్ అనుమతి ఉల్లంఘనలు కూడా బయటపడ్డాయి. బీ అండ్ బీ విధానంలో ఆరు గదులకు మాత్రమే అనుమతి ఉండగా, అక్కడ 25 గదులు నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు. గ్రౌండ్ ఫ్లోర్లో అనుమతి లేకుండా రెస్టారెంట్ నడపడం, బేస్మెంట్లో సరైన ఎగ్జిట్ లేకపోవడం, భవనం చుట్టూ గుంపుగా ఉండటం, విద్యుత్ తీగల అడ్డంకులు కూడా రక్షణ చర్యలకు ఆటంకంగా మారినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో హోటల్ యజమానిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు.మొత్తం ఘటనలో గుర్తింపు సమస్యలు కూడా కుటుంబాలను తీవ్రంగా బాధిస్తున్నాయి. తీవ్రంగా కాలిపోయిన మృతదేహాలను ఫోటోల ఆధారంగా గుర్తించడం కూడా సాధ్యం కావడం లేదని బంధువులు చెబుతున్నారు. ఆసుపత్రుల వద్ద కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు, కన్నీరు.. హృదయాలను కలిచివేస్తున్నాయి. -
సిట్ ఎదుట హాజరైన పారిజాత దంపతులు
బడంగ్పేట్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బడంగ్పేట్ కార్పొరేషన్ మాజీ మేయర్ చిగురింత పారిజాత, నర్సింహారెడ్డి దంపతులు బుధ వారం సిట్ ఎదుట హాజర య్యారు. బీఆర్ఎస్ నేతలైన వీరు 2022లో ఆపార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. పారిజాత ప్రస్తుతం పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు.బీఆర్ఎస్లో ఉన్న సమయంలో పారిజాతతో పాటు ఆమె భర్త ఫోన్లు ట్యాప్ అయినట్లు అధికారులు గుర్తించారు. బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఇరువురి మాటలను రికార్డు చేశారు. ఫోన్ల ట్యాపింగ్తో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను బాధితులు వివరించగా, వాటిని రికార్డు చేసినట్లు పోలీసులు తెలిపారు.తాము ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని అనుకున్నప్పటి నుంచి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు చేయడానికి ఫోన్ ట్యాపింగే కారణం కావచ్చన్నారు. 2 రోజుల క్రితం సిట్ అధికారులు చెప్పే వర కూ ఈ విషయం తమకు తెలియదన్నారు. సిట్ అధి కారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పామన్నారు. -
NRI : అమెరికాలో రోడ్డు ప్రమాదం..
సాక్షి, హైదరాబాద్/మన్సూరాబాద్: మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ సతీమణి డాక్టర్ సుచియాష్కీ అమెరికాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తమ చిన్న కుమార్తె డాక్టర్ గగనయాష్కీని బోస్టన్లోని హార్వర్డ్ యూనివర్సిటీ అనుబంధ ఆసుపత్రిలో ఎండీ కోర్సులో జాయిన్ చేసి న్యూయార్క్కు వస్తుండగా భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు.ప్రమాద సమయంలో వర్షం కురుస్తుండటంతో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టిందని, ఈ ప్రమాదంలో డాక్టర్ సుచియాష్కీకి పక్కటెముకలు విరిగిపోయాయని వెల్లడించారు. ప్రస్తుతం ఆమె స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. కాగా, మధుయాష్కీ కూడా అమెరికాలోనే ఉన్నారు. చిన్న కుమార్తె డాక్టర్ గగన న్యూయార్క్ మెడికల్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా, కాన్వొకేషన్కు హాజరయ్యేందుకు యాష్కీ దంపతులు అమెరికా వెళ్లారు.కుమార్తెను ఎండీ కోర్సులో జాయిన్ చేసి వచ్చే సమయంలో సుచి ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో వేరే కారులో మధుయాష్కీ కూడా ఉన్నారని, భార్యకు ప్రమాదం జరిగిన నేపథ్యంలో గురువారం ఇండియాకు రావాల్సిన యాష్కీ, అక్కడే ఉండిపోయారని కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ ఫోన్లో మధుయాష్కీని పరామర్శించారు. -
ఐసీయూలో మంటలు.. పలువురి సజీవదహనం!
పాట్నా: దేశ రాజధాని ఢిల్లీలోని హోటల్ అగ్నిప్రమాదం విషాదం మరువకముందే బిహార్లో మరో ఘోర ఘటన చోటుచేసుకుంది. ముజఫర్పూర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు సజీవ దహనం అయినట్లు సమాచారం. మరికొందరికి గాయాలు కాగా.. అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.ప్రసాద్ ఆస్పత్రి ఐదో అంతస్తులో ఉన్న ఐసీయూ విభాగంలో గురువారం తెల్లవారుజామున మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. క్షణాల్లోనే దట్టమైన పొగ భవనం అంతటా వ్యాపించడంతో రోగులు, వారి బంధువులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పొగ కారణంగా పలువురు శ్వాస తీసుకోలేక అపస్మారక స్థితికి చేరుకున్నట్లు సమాచారం.అగ్నిప్రమాదం విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, అత్యవసర సేవల బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను అత్యవసరంగా ఇతర ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదంలో ఇప్పటిదాకా ముగ్గురు మరణించినట్లు సమాచారం అందుతోంది.मुजफ्फरपुर के प्रसाद हॉस्पिटल के ICU में लगी भीषण आग ने दिल दहला दिया। हादसे में 3 लोगों की मौत की खबर है, जबकि कई मरीज आग की चपेट में आए। अस्पतालों में सुरक्षा व्यवस्था और फायर सेफ्टी मानकों पर गंभीर सवाल खड़े हो गए हैं।दिवंगतों के परिजनों के प्रति संवेदना। प्रशासन से निष्पक्ष… pic.twitter.com/0gZPFHnnb2— Indian Observer (@ag_Journalist) June 4, 2026ప్రాథమిక విచారణలో.. షార్ట్సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల అసలు కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఢిల్లీ మాలవీయ నగర్లోని హోటల్లో జరిగిన అగ్నిప్రమాదంలో 21 మంది మరణించిన ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన నేపథ్యంలో, తాజాగా బిహార్లో ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఈ విషాదం మరింత కలకలం రేపుతోంది.కీలకాంశాలుబిహార్లోని ముజఫర్పూర్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదంఐసీయూ విభాగంలో ప్రారంభమైన మంటలుముగ్గురు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం!20 మందికి పైగా రోగులను సురక్షితంగా బయటకు తెచ్చారుపలువురి పరిస్థితి విషమం.. మృతుల సంఖ్య పెరిగే చాన్స్షార్ట్సర్క్యూట్ కారణమై ఉండొచ్చని అనుమానంకొనసాగుతున్న సహాయక చర్యలు.. ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభం -
మోనాలిసా దంపతులకు ఊరట
కొచ్చి: కుంభమేళాలో పూసలు అమ్ముతూ సోషల్ మీడియాలో వైరల్గా మారిన మోనాలిసా భోస్లేకు, ఆమె భర్త మహ్మద్ ఫర్మాన్ ఖాన్కు ఊరట లభించింది. వాళ్లను అరెస్ట్ చేయొద్దని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కేరళ హైకోర్టును ఆదేశించింది. ఈ క్రమంలో అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.మోనాలిసా మైనర్ అని, ఆమెను కిడ్నాప్ చేశారనే ఆరోపణలు.. అలాగే ఈ వివాహం చట్టబద్ధం కాదనే మధ్యప్రదేశ్ పోలీసుల అభ్యంతరాల నేపథ్యంలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ అభియోగాలను తోసిపుచ్చుతూ అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ మోనాలిసా, ఫర్మాన్ కేరళ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం.. నెలరోజుల పాటు ఫర్మాన్ ఖాన్ను అరెస్ట్ చేయొద్దని మద్యప్రదేశ్ పోలీసులను ఆదేశించింది. ఈలోగా.. అక్కడి కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోవాలని ఈ జంటకు కోర్టు సూచించింది. 2025 కుంభమేళా సందర్భంగా పూసలు విక్రయిస్తూ వైరల్ అయిన మోనాలిసా భోస్తే Monalisa Bhosle ఈ ఏడాది ప్రారంభంలో కేరళలో మహమ్మద్ ఫర్మాన్ ఖాన్ను వివాహం చేసుకుంది. మతాంతర వివాహం కావడంతో ఈ వ్యహారం పెను దుమారం రేపింది. అయితే మోనాలిసా వివాహం సమయంలో కేవలం 16 ఏళ్ల వయస్సులోనే ఉన్నారని ఆరోపణలు రావడంతో వివాహ చట్టబద్ధతపై వివాదం చెలరేగింది. దీంతో పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసే అవకాశాలపై కూడా చర్చ జరిగింది. ఇక మోనాలిసా తండ్రి పోలీసులకు కిడ్నాప్ ఫిర్యాదు చేయడంతో ఫర్మాన్ ఖాన్పై కేసు నమోదైంది. తాము ఎలాంటి అక్రమానికి పాల్పడలేదని, మోనాలిసా మైనర్ కాదని దంపతులు కోర్టులో వాదించారు. మరోవైపు మధ్యప్రదేశ్ ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాదులు, మోనాలిసా వయస్సుకు సంబంధించిన పత్రాల్లో ఫోర్జరీ జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఆమె జననం 2009 డిసెంబర్లో జరిగిందని, దంపతులు చెబుతున్నట్లుగా 2008 జనవరిలో కాదని వాదించారు. అయితే ఈ ఆరోపణలను మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ తరఫు న్యాయవాదులు ఖండించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి కౌసర్ ఎడప్పగత్.. ఒక నెలపాటు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.ఇదీ చదవండి: కేరళలో ఉండడం మీ అదృష్టం! -
ఢిల్లీ మృత్యుకేళి: ప్రాణాల కోసం పై నుంచి దూకారు..!
న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్లో బుధవారం ఉదయం జరిగిన ఘోర అగ్నిప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. హౌజ్రాణి ఏరియాలోని ఓ హోటల్లో భారీగా మంటలు చెలరేగడంతో 21 మంది మృతి చెందారు. పలువురికి గాయాలు కాగా.. 40 మందికిపైగా సురక్షితంగా బయటపడినట్లు అధికారులు తెలిపారు. చికిత్స పొందుతున్నవాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే.. ప్రమాద సమయంలో హృదయ విదారక దృశ్యాలు ఇప్పుడు నెట్టింటకు చేరాయి.మంటలు వేగంగా వ్యాపించడంతో రెస్టారెంట్ అంతా దట్టమైన పొగతో నిండిపోయింది. దీంతో లోపల చిక్కుకున్న అతిథులు భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు భవనం పైఅంతస్తుల నుంచి కిందకు దూకిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ వీడియోలో ఓ విదేశీయుడు, ఓ మహిళ ఉన్నారు. వాళ్ల పరిస్థితి ఏంటన్నది తెలియరావడం లేదు. మరికొందరు కూడా ప్రాణాలు అరచేత పట్టుకుని భవనం నుంచి బయటపడే ప్రయత్నాలు చేశారు. వాళ్లలో విదేశీయులే ఎక్కువగా ఉన్నారు. కింద నిల్చున్న స్థానికులు తమ ఫోన్లలో ఆ దృశ్యాలు బంధించారు.VIDEO | Death toll in fire in restaurant in south Delhi's Malviya Nagar goes up to 21, many of those killed are foreigners: officials. Latest visuals from incident spot.#DelhiNews #MalviyaNagarHotelFire(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/8QS1kYrx4v— Press Trust of India (@PTI_News) June 3, 2026ఉదయం సుమారు 9 గంటల సమయంలో అగ్నిప్రమాద సమాచారం అందడంతో ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పది కంటే ఎక్కువ ఫైర్ ఇంజిన్లు, ప్రత్యేక రక్షణ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. పొగతో నిండిపోయిన భవనంలోకి ప్రవేశించి చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చారు.Delhi hotel fire: woman seen jumping off building#MalviyaNagar #DelhiFire pic.twitter.com/4LoMU1ypqF— Anil Thakur (अनिल ठाकुर) (@Anil_NDTV) June 3, 2026నిబంధనలకు విరుద్ధంగా..!ఈ ఘటనలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ ప్రభుత్వ 'బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్' పథకం కింద కేవలం ఆరు గదులు నిర్వహించేందుకు మాత్రమే అనుమతి పొందిన లెమన్ గ్రీన్ హోటల్.. నిబంధనలకు విరుద్ధంగా 25 గదులు నడుపుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. బేస్మెంట్లో కూడా గదులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీంతో భవన భద్రతా ప్రమాణాలు, అనుమతుల ఉల్లంఘనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.Delhi Hotel Fire: Death Toll Rises to 21 in Malviya Nagar Tragedy#MalviyaNagar #DelhiFire pic.twitter.com/3lEpgIKWBM— Anil Thakur (अनिल ठाकुर) (@Anil_NDTV) June 3, 2026#दिल्ली: मालवीय नगर के होटल में लगी आग पूरी इमारत में फैली, दर्दनाक हादसे में 10 लोगों की जलकर मौत #Malviyanagar #Delhifire #Breaking pic.twitter.com/zymTBTdWQt— Journalist Ravendra kumar (@Chhotukingoffi1) June 3, 2026అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. హోటల్ యాజమాన్యం అగ్నిమాపక భద్రతా నిబంధనలు పాటించిందా? అనుమతులకు మించి కార్యకలాపాలు నిర్వహించిందా? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.ఇదీ చదవండి: ఢిల్లీ ప్రమాదం.. ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ -
ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 21 మంది దుర్మరణం!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో బుధవారం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మాలవీయ నగర్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్లో మంటలు చెలరేగి 21 మంది దుర్మరణం పాలయ్యారు. రెస్టారెంట్లో పలువురు చిక్కుకుని ఉండడం.. మరికొందరికి తీవ్ర గాయాలు కావడంతో మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.హౌజ్రాణి ఏరియాలోని లెమన్ గ్రీన్ రెస్టారెంట్లో ఉదయం 8గం.50ని సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో కస్టమర్లు, హోటల్లో బస చేసినవాళ్లు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే అప్పటికే భారీ నష్టం జరిగిందని తెలుస్తోంది. #DELHI-साकेत प्रेस एन्क्लेव के सामने, मालवीय नगर के हौज रानी स्थित एक होटल में लगी भीषण आग ।लाल डोरा क्षेत्र में तेजी से बन रहे बहुमंजिला होटलों की अग्नि सुरक्षा, आपातकालीन पहुंच और नियामक निगरानी पर गंभीर सवाल खड़े कर दिए हैं।#DelhiFire #MalviyaNagar #Saket #FireSafety pic.twitter.com/2gtCHzJfg9— Payall Singhh (@PayallSingh13) June 3, 2026మంటలు భారీగా ఎగసి పడడంతో.. దట్టమైన పొగతో రెస్టారెంట్ అలుముకోవడంతో.. ఊపిరాడక చాలా మంది చనిపోయారు. ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రయత్నించిన పలువురి సాహసాలు వీడియో రూపంలో బయటకు వచ్చాయి. మృతుల్లో ఎక్కువగా విదేశీయులు ఉన్నట్లు సమాచారం అందుతోంది.ప్రాథమిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు 21 మంది మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. గాయపడిన మరో 30 మందిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పది ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి. రెస్టారెంట్లో మరికొందరు చిక్కుకుని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని ఓ ఉన్నతాధికారి మీడియాకు వెల్లడించారు. మృతుల్లో.. సౌతాఫ్రికా, సోమాలియా, గల్ఫ్ వాసులు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.दिल्ली के मालवीय नगर में एक रेस्ट्रां में लगी आग हादसे में 10 लोगों की मौत की खबरबेसमेंट में फंसे तीन नाइजीरियन नागरिकों को रेस्क्यू कर बाहर निकाला गया।#DELHIFIRE#MALVIYENAGAR#RESTRAURENTFIRE pic.twitter.com/GVD3yKxmXR— Vivek Shukla (@anchorviveks) June 3, 2026ప్రధాని దిగ్భ్రాంతి.. ఎక్స్గ్రేషియా ప్రకటన మాలవీయ నగర్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అధికారులు అందిస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు. అలాగే ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఒక్కరి కుటుంబానికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇక గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ప్రధాని వెల్లడించారు.The loss of lives due to a fire incident in Malviya Nagar, Delhi is tragic. My condolences to those who have lost their loved ones. Wishing a speedy recovery to the injured. Authorities are providing all possible assistance to those affected. An ex-gratia of Rs. 2 lakh from…— PMO India (@PMOIndia) June 3, 2026 -
కేరళలో ఉండడం మీ అదృష్టం!
కొచ్చి: కుంభమేళా సోషల్ మీడియా సెన్సేషన్ మోనాలిసా భోస్లే కేసులో కేరళ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మోనాలిసా, ఆమె భర్త మహ్మద్ ఫర్మాన్ ఖాన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై మంగళవారం కేరళ హైకోర్టులో విచారణ ముగిసింది. బుధవారం(ఇవాళ) ఈ కేసు తీర్పు వెలువడే అవకాశం కనిపిస్తోంది. అయితే నిన్న తీర్పు రిజర్వ్ చేసే సమయంలో జడ్జి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.విచారణలో భాగంగా న్యాయమూర్తి కౌసర్ ఎడప్పగత్ “మీరు కేరళలో ఉన్నందుకు అదృష్టవంతులు” అని వ్యాఖ్యానించారు. దానికి మొనాలిసా తరఫు న్యాయవాది.. అందువల్లే వీళ్లు ఇంకా బతికి ఉన్నారు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యపై నెట్టింట దుమారం రేగింది. జడ్జి వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే..న్యాయ వర్గాల ప్రకారం కోర్టు ఉద్దేశం కేసుపై ప్రత్యక్ష అభిప్రాయం వ్యక్తం చేయడం కాకుండా, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఈ కేసు చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలు, ఒత్తిళ్లు, భద్రతా పరిస్థితులను పరోక్షంగా సూచించడమేనని భావిస్తున్నారు. కేరళలో న్యాయ ప్రక్రియ తక్కువ ఒత్తిడితో, మరింత నిష్పక్షపాత వాతావరణంలో సాగుతోందన్న సందేశాన్ని ఆ వ్యాఖ్య ద్వారా ఇచ్చినట్లుగా విశ్లేషణలు వెలువడుతున్నాయి.ఈ కేసు ఒక సాధారణ వివాహ వివాదం నుంచి ఇప్పుడు ఇంటర్ఫెయిత్ వివాహం, వయస్సు నిర్ధారణ(ఆమె మైనర్ అనే ఆరోపణలు), ఫోర్జరీ ఆరోపణలు, కిడ్నాప్ కేసులు వంటి పలు తీవ్రమైన ఆరోపణలతో కేరళ-మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య పెద్ద న్యాయ వివాదంగా మారింది. మోనాలిసా వివాహం, ఆమె వయస్సు నిర్ధారణ, మతాంతర వివాహ చట్టబద్ధతతో పాటు పలు రాష్ట్రాల్లో నమోదైన క్రిమినల్ కేసులు వంటి పలు క్లిష్ట అంశాలు ఒకేసారి విచారణ జరిగాయి.ఇక మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తమపై వివిధ వర్గాల నుంచి బెదిరింపులు, ఒత్తిళ్లు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. మరోవైపు మధ్యప్రదేశ్ ప్రభుత్వం మాత్రం వయస్సు తప్పుడు నమోదు, ఫోర్జరీ ఆరోపణలు సహా కేసు తీవ్రమని వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కేసు కేవలం వ్యక్తిగత వివాదంగా కాకుండా రెండు రాష్ట్రాల అంశంగా మారింది. తీర్పుపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. -
‘నా ఆత్మహత్యకు డీఎస్పీ, ఎస్ఐలే కారకులు’
కర్ణాటక: ఓ వ్యక్తి డీఎస్పీ, ఎస్ఐల పేర్లు డెత్నోట్లో రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెళగావి జిల్లా గోకాక్ తాలూకా బెండిగేరి గ్రామంలో చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన రవీంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇచ్చిన అప్పులు తిరిగి ఇవ్వలేదని మనోవేదనకు గురై ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇచ్చిన అప్పులను తిరిగి ఇవ్వమన్నందుకు ప్రాణాలు తీస్తామని బెదిరించారన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు రవీంద్ర డెత్ నోట్లో పేర్కొన్నాడు. అంతేగాక పోలీసులు కూడా తన పట్ల అన్యాయంగా నడుచుకున్నారని ఆయన పేర్కొనడంతో కేసు కలకలం సృష్టిస్తోంది. లక్ష్మణ చందరిగి, భరమప్ప పూజారిలకు రూ.8 లక్షలు అప్పు ఇచ్చాను. అయితే ఆ డబ్బును లక్ష్మణ్, భరమప్ప తిరిగి ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వమని అడిగితే చంపుతామని బెదిరించారు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని ఎస్ఐ ఆనంద్, డీఎస్పీకి విజ్ఞప్తి చేసినా కూడా వారు స్పందించలేదని, వారు కూడా వారిలానే తనను చంపుతామని బెదిరించారని రవీంద్ర ఆత్మహత్యకు ముందు రాసిన డెత్నోట్లో వివరించారు. ఘటనా స్థలాన్ని మూడలిగి పోలీసులు పరిశీలించారు. రవీంద్ర భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
కాగితాలు ఏరుకునే వ్యక్తి పేరిట.. బీమా మోసం!
సుల్తాన్బజార్: చనిపోయిన వ్యక్తి పేరు మీద రూ.5 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని బీమా డబ్బులు కాజేయాలని చూసిన ఓ ముఠా గుట్టును సుల్తాన్బజార్ పోలీసులు రట్టు చేశారు. చాదర్ఘాట్ వద్ద కాగితాలు ఏరుకుంటూ బతికే తలారి వెంకటయ్య అనే వ్యక్తి 2023 జనవరి 9న విద్యుదాఘాతంతో చనిపోయాడు.ఈ మరణాన్ని క్యాష్ చేసుకోవాలనుకున్న బోడ శ్రీకృష్ణ అనే వ్యక్తి స్టార్ హెల్త్ ఏజెంట్ మల్దే మహేష్, సేల్స్ మేనేజర్ మడసిరావార వంశీకృష్ణలతో కుమ్మకై పక్కా స్కెచ్ వేశాడు. 2024 డిసెంబర్లో వెంకటయ్య పేరు మీద స్టార్ హెల్త్ యాక్సిడెంటల్ డెత్ పాలసీ తీసుకున్నారు. మృతుడి బావమరిదినంటూ శ్రీకృష్ణ నామినీగా నమోదు చేసుకున్నాడు. 2025 ఏప్రిల్ 28న ప్రమాదం జరిగినట్లుగా పోలీసుల పాత ఎఫ్ఐఆర్, పోస్టుమార్టం, ఇన్వెస్ట్ రిపోర్టులను ఫోర్జరీ చేశారు.క్లైమ్ కోసం దరఖాస్తు చేయగా స్టార్ హెల్త్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ మహ్మద్ అబ్దుల్ బారీ చేసిన అంతర్గత విచారణలో బండారం బయటపడింది. పాలసీ తీసుకోవడాని కంటే ముందే వెంకటయ్య చనిపోయాడని తేలడంతో 2026 మే 14న సుల్తాన్బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడికి తరలించారు. ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి, ఏసీపీ మత్తయ్య పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ నరేష్, ఎస్ఐ వేణు ఈ కేసును ఛేదించారు. -
రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం
సిద్దిపేటఅర్బన్: రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం చెందగా, కారులో ఉన్న కొడుకు, కోడలుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి శివారులో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. త్రీటౌన్ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన కొలిపాక రవిచంద్రకాంత్ (49) కుటుంబంతో కలిసి పదేళ్ల క్రితం సిద్దిపేటకు బతుకుదెరువుకు వచ్చాడు. గోల్డెన్ ఫ్రేమ్స్ పేరిట ఫ్లెక్సీ ప్రింటింగ్, ఫొటో ఫ్రేమ్స్ నిర్వహిస్తున్నాడు. ఇతనికి భార్య సునీత (45), కుమారుడు అజయ్, కూతురు ఉన్నారు. అజయ్కు ఏడాదిన్నర క్రితం పెళ్లి జరిగింది. వేసవి కావడంతో స్వగ్రామం మణుగూరుకు నాలుగు రోజుల క్రితం వెళ్లారు. మంగళవారం ఉదయం 4.30 గంటలకు కారులో సిద్దిపేటకు బయల్దేరారు. ఉదయం 9గంటల ప్రాంతంలో మిట్టపల్లి శివారులోకి రాగానే వేబ్రిడ్జి పక్కన నిలిపిన ఇసుక లారీని వెనక నుంచి ఢీకొట్టడంతో కారు సగ భాగం చొచ్చుకెళ్లింది. దీంతో కారు నడుపుతున్న రవిచంద్రకాంత్, అతని భార్య సునీత అక్కడికక్కడే మృతి చెందారు. వెనక సీట్లో కూర్చున్న కొడుకు అజయ్, కోడలు అర్చన తలకు తీవ్ర గాయాలు కాగా కుడి కాలు కూడా విరిగింది. స్థానికులు వెంటనే క్షతగాత్రులను సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తీసుకెళ్లారు. అర్చన తండ్రి అంకం ప్రకాశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
పశ్చాత్తాపంతో 40 ఏళ్ల తర్వాత లొంగిపోయిన కిల్లర్
తిరువనంతపురం: నాలుగు దశాబ్దాల క్రితం జరిగిన ఒక దారుణ హత్య ఉదంతం ఇప్పుడు హంతకుడి ఆత్మప్రబోధంతో బయటపడింది. కేరళలో 40 ఏళ్ల క్రితం జరిగిన హత్య మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్కు వచ్చి, ఆ హత్యను తానే స్వయంగా చేశానని తెలియజేసి లొంగిపోయాడు. కోజికోడ్ జిల్లా కూడరంజికి చెందిన 55 ఏళ్ల మహమ్మద్ అలీ గత ఏడాది పోలీసులను ఆశ్రయించాడు. 1980ల కాలంలో తాను రెండు హత్యలు చేశానని, తనను అరెస్ట్ చేయాలని కోరాడు.అవి తాను తెలియక చేసిన తప్పులని, ఇప్పుడు పశ్చాత్తాపంతో లొంగిపోతున్నానని మీడియాకు తెలిపాడు. కోర్టు విధించే ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధమని ప్రకటించాడు. అయితే ఈ వింత కేసును ఛేదించడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. మహమ్మద్ అలీ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం.. 1986లో కూడరంజి వద్ద బాధితుడు తనపై లైంగిక దాడికి ప్రయత్నించగా, ఆత్మరక్షణ కోసం అతడిని నీటిలో ముంచి చంపేశానన్నాడు. ఈ క్లూ ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించగా, డిసెంబర్ 1986లో ఒక పత్రికలో వచ్చిన వార్త కీలకమైంది. కూడరంజి మిషన్ హాస్పిటల్ వెనుక పొలాల్లో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమైనట్లు ఆ వార్త సారాంశం.తిరువంబడి పోలీసులు 1980ల కాలంలో మలబార్ ప్రాంతంలో నమోదైన మిస్సింగ్ కేసుల డేటాను పరిశీలించారు. సుదీర్ఘ శాస్త్రీయ విచారణ అనంతరం ఆ మృతుడు కన్నూర్ జిల్లా ఇరిట్టికి చెందిన మోహనన్గా గుర్తించారు. నిందితుడి వాంగ్మూలానికి, ఘటనా స్థలాలకు సరిగ్గా సరిపోలడంతో ఈ కేసును ధృవీకరించారు. కాగా, 1989లో కోజికోడ్ బీచ్లో చేసినట్లు చెబుతున్న మరో హత్యకు సంబంధించిన వివరాలను, బాధితుడి గుర్తింపును కనుగొనేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.ఇది కూడా చదవండి: ‘నీట్’ టెన్షన్: ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తూనే.. -
చినికి చినికి చివరికి హత్యగా!
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు న్యాయవాది, వక్ఫ్ బోర్డు ప్యానెల్ సభ్యుడు ఖాజా మొహిజుద్దీన్ హత్య కేసు దర్యాప్తులో అనేక కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన వివాదాలు, విలువైన స్థిరాస్తులు తమ చేయి దాటిపోతున్నాయనే ఉద్దేశంతోనే ఆలంఖాన్లు ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు వెల్లడైంది. మలక్పేట, లక్డీకాపూల్ల్లోని ముంతాజ్ యార్ ఉద్ దౌలా వక్ఫ్తోపాటు మల్లేపల్లిలో ఉన్న మదర్సా ఏ ఎజాజ్ వక్ఫ్ ఆస్తులకు సంబంధించి ఖాజా మొహిజుద్దీన్కు తండ్రీకుమారులైన మహబూబ్ ఆలంఖాన్, ముజాహిద్ ఆలంఖాన్ వర్గాల మధ్య ఏళ్లుగా విభేదాలు నెలకొన్నాయి.13 ఏళ్లుగా వివాదాలు.. ఈ రెండు సంస్థలకు చెందిన స్థిరచరాస్తులు, విద్యాసంస్థల పరిపాలన, నిర్వహణను చేతుల్లోకి తీసుకునే అంశంపై 13 ఏళ్లుగా వివాదాలు నడిచాయి. ఈ నేపథ్యంలోనే మజ్లిస్ ఏ ఉమ్నాగా పిలిచే ముంతాజ్ యార్ ఉద్ దౌలా వక్ఫ్ మేనేజింగ్ కమిటీ 2013లో మహబూబ్ ఆలంఖాన్ను సెక్రటరీ పోస్టు నుంచి తొలగించింది. దీంతో మహబూబ్ ఆలంఖాన్ 17 మంది సభ్యులతో ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కతీ ప్రెసిడెంట్తో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు. ఈ రెండు కమిటీలు ఒకదానిపై మరోటి హైకోర్టులో అనేక రిట్ పిటిషన్లు ఫైల్ చేసుకున్నాయి.రాజీ చేసినా.. 2023లో కొందరు ఈ రెండు గ్రూపుల మధ్య రాజీ చేసి క్రిమినల్, సివిల్ పిటిషన్లు ఉపసంహరించునేలా చేశారు. దీంతో మహబూబ్ ఆలంఖాన్ ముంతాజ్ యార్ ఉద్ దౌలా వక్ఫ్కు సెక్రటరీగా పునర్ నియమితులై 2025 ఫిబ్రవరి వరకు కొనసాగారు. ఆర్థిక అవకతవకలపై మరోసారి మహబూబ్ ఆలంఖాన్కు షోకాజ్ నోటీసులు జారీ చేసిన ముంతాజ్ యార్ ఉద్ దౌలా వక్ఫ్ మేనేజింగ్ కమిటీని రద్దు చేసింది. ఆ సమయంలో 2025 నుంచి 2027 వరకు చెల్లుబాటు అయ్యేలా ఏర్పడిన కొత్త కమిటీకి ఖాజా మొహిజుద్దీన్ ట్రెజరర్గా నియమితులయ్యారు. దీంతో మరోసారి హైకోర్టులో మహబూబ్ ఆలంఖాన్కు వ్యతిరేకంగా పిటిషన్లు ఫైల్ అయ్యాయి. వాటికి ఖాజా మొహిజుద్దీన్ వకాల్తా తీసుకున్నారు.వకాల్తా.. ఆర్థికంగా దివాలా.. 2013లో ఉస్మాన్ ఖాన్, కిషన్సింగ్ అలియాస్ పప్పుతో కలిసి మహబూబ్ ఆలంఖాన్ లంగర్హౌస్ ప్రాంతానికి చెందిన ఒక మహిళ ద్వారా ఖాజా మొహిజుద్దీన్పై అత్యాచారం కేసు నమోదు చేయించారు. దర్యాప్తు అనంతరం ఈ కేసును పోలీసులు మూసివేశారు. మొహిజుద్దీన్ వకాల్తా కారణంగా తాము ఆర్థికంగా నష్టపోతున్నామని, అనేక వక్ఫ్ ఆస్తులు చేయి దాటిపోతున్నాయని భావించిన ఆలంఖాన్లు అతడిని అంతం చేయాలని కుట్ర పన్నారు.అనుమానం రాకుండా రోడ్డు ప్రమాదంగా కనిపించేలా హత్య చేయించాలని నిర్ణయించుకున్నారు. ఈ బాధ్యతల్ని తమ వద్ద పని చేసే హసన్ అలీతోపాటు ముజాహిద్ ఆలంఖాన్కు పరిచయస్తుడైన మునీర్లకు అప్పగించారు. కిషన్సింగ్ని కూడా భాగస్వామిని చేశారు. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం కస్టడీకి అప్పగించాల్సిందిగా నాంపల్లి పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోపక్క పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసమూ గాలిస్తున్నారు. -
స్పాట్ పెట్టేస్తున్నాయ్.. సైబరాబాద్ పరిధిలో 43 బ్లాక్స్పాట్లు!
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 43 ప్రమాదకర ప్రాంతాలు (బ్లాక్ స్పాట్స్) ప్రాణాంతకంగా మారాయి. గత మూడేళ్లలో 320 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 251 మంది మరణించారు. మూల మలుపులు, అసంపూర్ణ రహదారి పనులు, వెలుతురు సరిగా లేకపోవడం, వాహనాల మార్గానికి అడ్డంగా చెట్లు ఉండటం వంటి కారణాలుగా గుర్తించారు. అనేక ప్రమాదకర ప్రాంతాల చుట్టూ నివాస కాలనీలు, వాణిజ్య సంస్థలు, పెట్రోల్ బంక్లు, మెట్రో కారిడార్లు ఏర్పడ్డాయి. దీంతో ఆయా మార్గాలలో పాదచారులు, స్థానిక ప్రయాణికులు నిత్యం రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు.ట్రాఫిక్ పోలీసు అధికారులు, శాంతి భద్రతల పోలీసు స్టేషన్లు, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు, రోడ్ ఇంజినీరింగ్ ఏజెన్సీల బాధ్యులు బ్లాక్ స్పాట్లను తనిఖీ చేసి నివేదిక రూపొందించారు. గుర్తించిన ప్రమాదకర ప్రాంతాల్లో 90 శాతానికి పైగా మేడ్చల్ జోన్ పరిధిలోకి వస్తాయి. 50 శాతానికి పైగా ప్రమాదకర ప్రాంతాలలో ఎన్హెచ్–65 మార్గం అత్యంత ప్రమాదకరమైందిగా గుర్తించారు. 43 బ్లాక్ స్పాట్లలో 22 ముంబై హైవే (ఎన్హెచ్–65)కి చెందినవే ఉండటం గమనార్హం.అత్యంత ప్రభావిత ప్రాంతాలివీ..పటాన్చెరు శాంతి నగర్ కమాన్ నుంచి బజాజ్ ఎల్రక్టానిక్స్ మార్గం అత్యంత ప్రభావితమైన ప్రాంతాలలో ఒకటి. ఇక్కడ 24 ప్రమాదాలు జరగగా.. 11 మంది మరణించారు.పటాన్చెరులోని ఇస్నాపూర్ క్రాస్ రోడ్లో అలాగే ఆర్సీపురంలోని శ్రీమణికాంత షాపింగ్ కాంప్లెక్స్ నుంచి ఏషియన్ జ్యోతి థియేటర్ వరకు ఒక్కో మార్గంలో 10 మరణాలు సంభవించాయి.పటాన్చెరులోని నోవాపన్ టీ–జంక్షన్ మరో ప్రమాదకర ప్రాంతంగా నిలిచింది. ఇక్కడ 10 రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మరణించారు.ఎన్హెచ్–765డీ పై కుత్బుల్లాపూర్ ఎక్స్ రోడ్ నుంచి మాంగల్య షాపింగ్ మాల్ వరకు ఉన్న మార్గంలో 16 ప్రమాదాల్లో 10 మంది మృత్యువాత పడ్డారు. గండిమైసమ్మ ఎక్స్ రోడ్లో 14 ప్రమాదాల్లో 14 మంది చనిపోయారు.ఎన్హెచ్–65తో పాటు అధికారులు ఎన్హెచ్–44 నాగ్పూర్ రోడ్డుపై 7, ఎన్హెచ్–765డీ మెదక్–నర్సాపూర్ రోడ్డుపై 6, స్టేట్ హైవే (ఎస్హెచ్–1) రాజీవ్ రహదారిపై ఒకటి, నల్లగండ్ల ఫైఓవర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మెయిన్ గేట్ నుంచి ఓల్డ్ ముంబై హైవే వరకు ఉన్న మార్గంలో 5 ప్రమాదాలతో సహా 7 ప్రమాదకర ప్రాంతాలను గుర్తించారు.ఎన్హెచ్–44పై రేకులబాయి క్రాస్ రోడ్, భారత్ పెట్రోల్ మధ్య మార్గంలో 11 ప్రమాదాల్లో 11 మంది చనిపోయారు. మేడ్చల్లోని ఎస్సీ హోటల్, సంప్రదా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి మధ్య మార్గంలో 10 యాక్సిడెంట్లలో 8 మంది మృత్యువాత పడ్డారు.కారణాలివీ..అసంపూర్తిగా ఉన్న నిర్మాణ పనుల వల్ల అనేక మార్గాలు ప్రభావితమయ్యాయి. రోడ్లను తవ్వి చాలాకాలం పాటు అసంపూర్తిగా వదిలేశారు. రోడ్లపైనే నిర్మాణ సామగ్రి పెట్టడం, దెబ్బతిన్న క్యారేజ్వేలు, పాక్షికంగా పూర్తి చేసిన రోడ్డు పనులు అనేక ప్రాంతాలలో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.రోడ్డు పక్కన ఉన్న చెట్లు క్యారేజ్వేల పైకి చొచ్చుకురావడం, చెట్లు ఎండిపోయి అనేక ప్రాంతాలలో క్యారేజ్వేలకు అడ్డుగా ఉన్నట్లు తనిఖీలలో పోలీసులు గుర్తించారు. మూలమలుపులు, ఎత్తుపల్లాలు ఉండటం, రాత్రి వేళల్లో ఆయా మార్గాలలో వీధి దీపాలు లేకపోవడం, ఉన్నా వెలుతురు సరిగా లేకపోవడం. రాత్రి వేళల్లో అధిక వేగంతో వాహనాలు తిరిగే హైవే మార్గాలలో హెచ్చరిక బోర్డులు లేకపోవడం. -
ఆఖరి స్టెప్తోనే ముగిసిన జీవితం..పెళ్లి వేడుకలో విషాదం
చిలకలూరిపేటటౌన్: పెళ్లి వేడుకలో ఆనందంగా చిందేస్తూ, ఆ నవ్వుల మధ్యే ఓ నిండు ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోయిన హృదయవిదారక సంఘటన చిలకలూరిపేట మండలం దండమూడి గ్రామంలో చోటుచేసుకుంది. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బాపట్ల మండలం రేకులగడ్డకు చెందిన ఏసోబు (62)కు చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి గ్రామానికి చెందిన భాగ్యమ్మతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు సంతానం లేదు. ఈ క్రమంలోనే దండమూడి గ్రామంలో బంధువుల ఇంట్లో జరిగిన ఓ వివాహ వేడుకకు ఈ దంపతులు హాజరయ్యారు. పెళ్లి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన డీజే పాటలకు అక్కడి వారంతా ఉత్సాహంగా నృత్యాలు చేస్తుండటంతో ఏసోబు కూడా వారితో కలిసి ఆనందంగా చిందేశాడు. అయితే దురదృష్టవశాత్తూ వెల్లకిలా పడిపోయాడు. కింద పడే క్రమంలో తలకు తీవ్ర గాయాలవ్వడంతో అపస్మారక స్థితికి చేరుకున్న ఆయనను బంధువులు హుటాహుటిన చిలకలూరిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ఏసోబు ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అప్పటివరకు పెళ్లి సందడితో కళకళలాడిన ఆ గ్రామంలో విషాదం నెలకొంది. బిడ్డలు కూడా లేని తనకు ఆఖరి శ్వాస వరకు తోడుగా ఉంటాడనుకున్న భర్త ఇలా మధ్యలోనే దూరమయ్యాడయ్యా.. అంటూ భాగ్యమ్మ కన్నీటి రోదన చూపరులను సైతం కంట తడిపెట్టించింది. -
బాలిక గర్భం కేసులో సంచలనం.. అసలు నిందితుడు తండ్రి
తమిళనాడు: వేలూరు సమీపంలోని పాఠశాల విద్యార్థి ని కన్న తండ్రే బెదిరించి గర్భం చేసిన సంఘటన సంచలనం రేపింది. వేలూరు తాలూకాకు చెందిన 13 సంవత్సరాల బాలిక వేలూరులోని ప్రభుత్వ పాఠశాలలో గత విద్యా సంవత్సరం ఎనిమిదో తరగతి చదివింది. ఈ నేపథ్యంలో గత నెల 25వ తేదీన బాలికకు ఉన్నపళంగా అనారోగ్యం క్షీణించింది. దీంతో కుటుంబ సభ్యులు బాలికను వేలూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు బాలిక రెండు నెలలు గర్భం దాల్చినట్లు నిర్ధారించారు. వీటిపై ఆసపత్రి నిర్వాహకులు బాలిక మైనర్ కావడంతో వేలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేలూరు మహిళా పోలీసులు బాలిక వద్దకు చేరు కొని విచారణ జరపగా ఆ సమయంలో ఆ బాలిక కాట్పాడికి చెందిన ఒక యువకుడిని ప్రేమించినట్లు అతను వివాహం చేసుకుంటానని మాయ మాటలు చెప్పి గర్భం చేసినట్లు తెలిపింది. దీంతో పోలీసులు ఆ యువకుడిని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసేందుకు అతని వివరాలు, ఫొటో, చిరునామా వివరాలు అడిగారు. ఆ సమయంలో బాలిక మాటలు తడబడుతూ సరైన సమాధానం చెప్పలేదు. దీంతో అనుమానించిన పోలీసులు బాలిక వద్ద సమగ్రమైన విచారణ చేపట్టారు. ఆ సమయంలో తన తండ్రి పెయింటర్గా పనిచేసేవాడని రాత్రి వేళల్లో మద్యం మత్తులో తన తల్లి నిద్రించిన సమయంలో తనను బెదిరించి అత్యాచారం చేసినట్లు తెలిపింది. ఈ విషయాన్ని బయటకు చెపితే కుటుంబంలోని అందరినీ హత్య చేస్తానని బెదిరించినట్లు తెలిపింది. అదే విధంగా తన కన్న తండ్రి కారణంగా తాను గర్భం దాల్చిన విషయాన్ని బయట పెట్టకూడదనే కారణంతోనే కాటా్పడిలోని ఒక యువకుడిపై చెప్పినట్లు తెలిపింది. దీంతో పోలీసులు బాలిక తండ్రిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న తండ్రి కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. కన్న కుమార్తెను తండ్రే బెదిరించి గర్భం చేసిన సంఘటన వేలూరు పట్టణంలో సంచలనం రేపింది. -
మహిళా ఉద్యోగి ఫొటోలు పోస్టు చేసిన ఏఓ అరెస్ట్
జనగామ: జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో పనిచేస్తు న్న ఓ మహిళా ఉద్యోగి ఫొటోలను అనుమతి లేకుండా తీసి, నకిలీ ఖాతా ద్వారా అసభ్యకర వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పోస్టు చేసిన కేసులో అదే కార్యాలయంలో ఏఓగా పనిచేస్తున్న విజయ్రెడ్డిని అరెస్టు చేసి, రిమాండ్ పంపించినట్టు సీఐ సత్యనారాయణరెడ్డి సోమవారం తెలిపారు. సీఐ మాట్లాడుతూ విజయ్రెడ్డి తన సోషల్ మీడియా ఖాతా నుంచి ఆమె ఫొటోలను పోస్టు చేసి, అవమానకరమైన కామెంట్లతో గౌరవానికి భంగం కలిగించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు స్పష్టం చేశారు. మహిళల పై కార్యాలయాల్లో జరిగే లైంగిక వేధింపులను నిరోధించే పోష్ చట్టం–2013 ప్రకా రం ఇది శిక్షార్హమైన నేరమని తెలిపారు. దర్యాప్తులో సేకరించిన డిజిటల్ ఆధారాలు, సోషల్ మీడియా పోస్టులు, ఇతర సాక్ష్యాల ఆధారంగా నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ తరలించినట్టు పేర్కొన్నారు. -
మత్తులో 2 హత్యలు..
కంటోన్మెంట్, బంజారాహిల్స్: గంజాయి మత్తులో ఓ యువకుడు కత్తితో పొడిచి మరో యువకుడిని, మద్యం మత్తులో ఓ వ్యక్తి స్నేహితుడిని చంపేశారు. మారేడ్పల్లి సంజీవయ్యనగర్ బస్తీ వాసి, ఫ్లవర్ డెకరేటర్ శ్రావణ్ (22)ను అదే ప్రాంతానికి చెందిన నిఖిల్ (23) అంతమొందించాడు.బీటెక్ ఆపేసి గంజాయికి బానిసైన నిఖిల్... శ్రావణ్ బంధువుల యువతిని అసభ్య సైగలతో వేధిస్తున్నాడు. శ్రావణ్, నిఖిల్ మధ్య 2 నెలల క్రితం గొడవ జరిగింది. ఆదివారం రాత్రి యువతిని నిఖిల్ మళ్లీ వేధించాడు. ఆమె తండ్రి మందలించగా గొడవ మొదలైంది. అప్పుడే ఇంటికి వస్తున్న శ్రావణ్ నిలదీయగా... కోపోద్రిక్తుడైన నిఖిల్ కత్తితో 8 సార్లు పొడిచాడు. గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా శ్రావణ్ చనిపోయాడు. నిఖిల్ గంజాయి తాగడంతో పాటు అమ్ముతుంటాడని, ఆ మత్తులోనే హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు బేంగపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి తెలిపారు.బంజారాహిల్స్ రోడ్ నం11 లోని బోళానగర్ బస్తీకి చెందిన మహ్మద్ ఇమ్రాన్ (32), రౌడీషీటర్ అహ్మద్ హుస్సేన్ స్నేహితులు. ఆటో నడుపుతుంటారు. ఖాలిద్ సయీద్ జావీద్, హైదర్ షరీఫ్, అన్వర్, మతీన్తో కలిసి హయత్ ప్లేస్ హోటల్ గల్లీలో ఆటోలోనే ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మద్యం తాగారు. ఖాళీ బీరు సీసాలను హుస్సేన్ రోడ్డు పక్కన పడేశాడు. అలా నిర్లక్ష్యంగా పడేస్తే ఎవరికైనా గుచ్చుకుంటాయని ఇమ్రాన్ మందలించాడు. హుస్సేన్ కోపంతో నాకే నీతులు చెబుతావా? అంటూ దాడికి దిగాడు. అరగంట పాటు పిడిగుద్దులు కురిపించుకున్నారు. కుప్పకూలిన ఇమ్రాన్ మృతి చెందాడు. -
‘ధురంధర్’ దెబ్బకు దావూద్ ముఠాలో కలకలం.. మన దేశంలోకి..
ముంబై: డీ-కంపెనీని బాలీవుడ్ స్పై థ్రిల్లర్ ధురంధర్ మూవీ తీవ్ర ఆగ్రహానికి గురిచేసినట్లు సమాచారం. పాకిస్థాన్లో ఉంటూ అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నడిపిస్తున్న ఈ ముఠా ధురంధర్ సినిమా విజయానంతరం ముంబైలో తన గ్రౌండ్ నెట్వర్క్ను యాక్టివేట్ చేసినట్లు సోర్సెస్ తెలిపాయి.రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన ధురంధర్ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో బడే సాహెబ్ అనే పాత్ర కనిపిస్తుంది. మరణశయ్యపై ఉన్న ఆ పాత్రను దావూద్ను పోలి ఉన్నట్లు చూపించారు. దీనివల్ల దావూద్ ఇప్పటికీ బతికే ఉన్నాడని ప్రజలను నమ్మించాల్సిన అత్యవసర పరిస్థితి డీ-కంపెనీకి ఏర్పడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.షకీల్ ముఠాకు నియామకాల బాధ్యత కొత్త ఉగ్ర కుట్రలో భాగంగా కొత్త సభ్యులను సమీకరించడం ముఠా ముందున్న తొలి సవాలు. నియామక ప్రక్రియ బాధ్యతను షకీల్ ముఠాకు అప్పగించినట్లు సోర్సులు తెలిపాయి. పాకిస్థాన్ ఐఎస్ఐకి ఈ కొత్త సభ్యులకు శిక్షణ ఇవ్వడం, ఆయుధాలు అందించడం వంటివి చేయనుందని చెప్పాయి. ఉగ్ర ప్రణాళిక అమలు బాధ్యతను షూటర్ మున్నా జింగాడాకు అప్పగించినట్లు తెలిపాయి.ఈ ఆపరేషన్ వెనుక అసలు కారణాన్ని కొత్త సభ్యులకు చెప్పలేదని సోర్సెస్ తెలిపాయి. ముంబై నుంచి జాగ్రత్తగా ఎంపిక చేసిన వీరిని, బాంద్రా గరీబ్ నగర్లో అక్రమ మసీదుపై జరిగిన బుల్డోజర్ చర్యను చూపించి రెచ్చగొట్టినట్లు వెల్లడించాయి.ఇటీవల ఢిల్లీ పోలీసులు ఒక ఉగ్ర ప్రణాళికను భగ్నం చేసి, ఐఎస్ఐకి ముంబై అండర్వరల్డ్తో ఉన్న సంబంధాన్ని బయటపెట్టిన నేపథ్యంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అండర్వరల్డ్ కార్యకలాపాలు, వసూళ్ల వ్యవహారాల్లో ప్రభావం క్రమంగా తగ్గుతున్న వేళ, డీ-కంపెనీ ఆకస్మిక కదలికలు మనుగడ కోసం చేస్తున్న ప్రయత్నమై ఉండవచ్చని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.తమ ప్రభావాన్ని మళ్లీ పెంచుకునేందుకు, ఐఎస్ఐ సాయంతో భారతదేశంలో భారీ దాడి చేయాలని లేదా ఓ వీఐపీని లక్ష్యంగా చేసుకోవాలని దావూద్ ముఠా ప్రణాళికలు రచిస్తున్నట్లు సోర్సెస్ తెలిపాయి.ఇలాంటి ఉగ్ర ప్రణాళికలకు ఆశ్రయం ఇవ్వడంలో పాకిస్థాన్ పాత్ర నిరంతరంగా కొనసాగుతోందని పేర్కొన్నాయి. అయితే కీలక అరెస్టులు సకాలంలో జరుపుతూ భారత దర్యాప్తు సంస్థలు ఇలాంటి ప్రయత్నాలను భగ్నం చేస్తున్నాయని సోర్సెస్ తెలిపాయి. -
వివాహమైన 18 రోజులకే విషాదం!
పటాన్చెరు టౌన్: పెళ్లయిన 18 రోజులకే నవ వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా, కోట్పల్లి మండలం బీరోల్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ (28)కు పటాన్చెరుకు చెందిన రేణుకతో మే 13న వివాహం జరిగింది. కాగా ఐదు రోజుల క్రితం పటాన్చెరు డివిజన్ పరిధిలోని గోకుల్నగర్లో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు.ఈ క్రమంలో శనివారం రాత్రి శ్రీకాంత్ సెల్ఫోన్లో ఉన్న వాయిస్ రికార్డ్ విషయంలో భార్య రేణుక ఇష్టం వచి్చనట్టు అతడ్ని తిట్టింది. దీంతో శ్రీకాంత్ అతని సోదరుడు శ్రీశైలానికి జరిగిన విషయం చెప్పడంతో ఉదయం మాట్లాడుదామని చెప్పాడు. భార్యతో గొడవపడిన శ్రీకాంత్ వేరే రూమ్లోకి వెళ్లి ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. ఆదివారం ఉదయం రూమ్ నుంచి బయటికి రాకపోవడంతో వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ముగ్గురు స్నేహితులను కాపాడి! చివరికి..
అబ్దుల్లాపూర్మెట్: అమెరికాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన ముగ్గురు స్నేహితులను కాపాడిన అనురూప్రెడ్డి.. నీట మునిగి మృతి చెందాడు.మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కోడూరి రాజేందర్రెడ్డి–దుర్గాభవాని దంపతులు కొన్నేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కవాడిపల్లి గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు. వారికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఆశ్రిత్రెడ్డితోపాటు అనురూప్రెడ్డి (22) సైతం ఐదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లారు. అనురూప్రెడ్డి యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్లో ఇటీవల మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాడు.శనివారం లూసియానాలోని టోరోడో పార్క్లో ఉన్న సెబాన్ రివర్లో సరదాగా స్నేహితులతో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈత కొట్టే సమయంలో అతనితోపాటు మరో ముగ్గురు స్నేహితులు ఉన్నారు. హఠాత్తుగా ముగ్గురూ లోతు ప్రదేశంలోకి వెళుతూ రక్షించండి అంటూ కేకలు వేశారు. అనురూప్రెడ్డి ఒక్కొక్కరిని పైకి లాగుతూ ఒడ్డుకు చేర్చారు. తను పైకి వచ్చే క్రమంలో చెరువులో ఉన్న ఫిషింగ్ వైర్ కాలికి చుట్టుకోవడంతోపాటు నీటి ప్రవాహం పెరగడంతో పైకి రాలేకపోయాడు. అక్కడున్న వారు రక్షించే ప్రయత్నం చేసినా, అప్పటికే నీటిని ఎక్కువగా మింగడంతో మృత్యువాత పడ్డాడు.ఉన్నత చదువుల కోసం వెళ్లిన కుమారుడు ఇలా విగతజీవిగా మారుతాడని అనుకోలేదని కుటుంబ సభ్యులు దు:ఖసాగరంలో మునిగారు. అనురూప్రెడ్డికి ఫొటోగ్రఫీ ఎంతో ఇష్టమని, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడని అతని సోదరుడు తెలిపారు. టీం ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ, ఇండియన్ ఎంబసీ, లూసియానా కాన్సులేట్ సంయుక్త సహకారం అందించి వారం రోజుల్లో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్టు సమాచారం. -
‘వీళ్లసలు మనుషులేనా?’.. పోలీసుల ముందే చితకబాదారు
మొదట అది సాధారణ మరణం అనుకున్నారు. తినేటప్పుడు ఊపిరాడక చిన్నారి ప్రాణాలు కోల్పోయాడని స్వయంగా తల్లే చెప్పడంతో అంతా అదే నిజమనుకున్నారు. కానీ పోస్టుమార్టం నివేదిక వెన్నులో వణుకు పుట్టించే విషయాల్ని బయటపెట్టింది. పోలీసులు సైతం ఆ నివేదిక చూసి షాక్కు గురయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. అలా ఆ చిన్నారి కేసు యావత్ సమాజాన్ని కుదిపేసిన ఘటనగా మారింది. పట్టరాని కోపంతో.. అదీ పోలీసుల సమక్షంలోనే జనాలు నిందితుల మీద దాడి చేసే దాకా తీసుకెళ్లింది.. కేరళలోని తిరువనంతపురం జిల్లా నెడుమంగాడ్లో.. ఏడాదిన్నర వయసున్న అర్షిద్ మరణం అందరితో ‘అయ్యో పాపం’ అనిపిస్తోంది. భోజనం చేస్తుండగా.. దగ్గు, వాంతులు చేసుకుంటూ ఆ చిన్నారి అస్వస్థతకు గురయ్యాడని.. ఆస్పత్రికి తరలిస్తే చికిత్స పొందుతూ కన్నుమూశాడని తల్లి అఖిల(24) మీడియా ముందు వాపోయింది. అయితే ఆమె కన్నీళ్లంతా కట్టుకథ అని తేలడానికి 24 గంటలు కూడా పట్టలేదు. అర్షిద్ మాములు చిన్నారేం కాదు. కొన్ని నెలల కిందట.. రెండు చేతులకు బ్యాండ్లతో తల్లి చంకలో సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యాడు. ఆడుకుంటుండగా సైకిల్ మీద నుంచి పడిపోయాడని చెబుతూ.. ఆమె పలువురి సాయం కోరడం నెట్టింట వైరల్ అయ్యింది. అలా ఆ తల్లికి చాలామంది డబ్బు కూడా పంపించారు. కట్ చేస్తే.. మే 29వ తేదీన ఆ చిన్నారి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. Tragic incident from God’s own countryHere is a 2-week-old video of 1-and-a-half-year-old Arshad with both hands fractured. In the video, his mother Akhila lies, claiming he broke his hands by falling off a bicycle.Tragically, little Arshad passed away 2 days ago at the… pic.twitter.com/j1WnUTE2fU— Revolutionary Monk (@RevolutionMonk) May 31, 2026అన్నం తింటుండగా ఆ చిన్నారి అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో అఖిల, ఆమె స్నేహితుడు అష్కర్ అర్షిద్ను హుటాహుటిన పనవూర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో తిరువనంతపురంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆలస్యం అయ్యింది. ఈలోపు ఒంటిపై గాయాలు కనిపించడంతో పోలీసులు అనుమానంతో పోస్టుమార్టం నిర్వహించారు. అందులో షాకింగ్ విషయాలు బయటపెట్టాయి. అర్షిద్ ఒంటిపై సుమారు 50కి పైగా గాయాల గుర్తులు ఉన్నట్లు ప్రాథమిక నివేదిక వెల్లడించింది. తలతో పాటు శరీరంలోని పలు భాగాల్లో అంతర్గత రక్తస్రావం జరిగినట్లు గుర్తించారు. అంతేకాదు.. సిగరెట్లతో ఒంటి నిండా కాల్చిన గాయాలు ఉండడం వైద్యుల్ని విస్మయానికి గురిచేసింది. పైగా ఈ గాయాలు ఒక్కరోజులో జరిగినవి కావని.. చాలా కాలంగా కొనసాగుతున్న హింసకు సంబంధించినవని తేల్చారు.నెలల వయసు నుంచే..అఖిల కడుపుతో ఉన్నప్పుడు ఆమె భర్త అఖిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఆమె అష్కర్(31) అనే వ్యక్తితో సహజీవనం మొదలుపెట్టింది. ఈ సంబంధం కారణంగానే ఆమె పుట్టిన బిడ్డను తల్లికి అప్పగించింది. అయితే అఖిల భర్త తరఫున బంధువుల అభ్యంతరాలతో తిరిగి చిన్నారిని తన దగ్గరకు తెచ్చుకుంది. అప్పటి నుంచే చిన్నారి అర్షిద్కు వేధింపులు మొదలయ్యాయి. ఆ సమయంలోనూ శరీరంపై తరచూ గాయాలు కనిపించేవని.. అడిగితే గాయాలపాలవుతున్నాడని చెప్పేదని అఖిల తల్లి పోలీసులకు చెబుతోంది. అంతేకాదు.. మే నెలలో వైరల్ అయిన వీడియోను కూడా అర్షిద్ అమ్మమ్మ గుర్తు చేసింది. మనవడి చేతులు విరిగిన సందర్భంలోనూ కూతురు, ఆమె ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించింది. ఇక.. చుట్టుపక్కల వాళ్లు చిన్నారి గుక్కపట్టి ఏడ్వడంపై చాలాసార్లు అఖిలను నిలదీసినట్లు చెబుతున్నారు. ఆగ్రహంతో దంచి కొట్టారు!పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాత పోలీసులు కేసును అనుమానాస్పద మృతి నుంచి హత్య కేసుగా మార్చారు. కేసు తీవ్రత దృష్ట్యా మే 30న అఖిల, అష్కర్లను అరెస్ట్ చేశారు. చిన్నారిపై నిరంతరం హింస కొనసాగుతున్న విషయం తెలిసినా తల్లి అడ్డుకోలేదని, అధికారులకు సమాచారం ఇవ్వలేదని స్పష్టమైంది. అందుకే ఆమెపైనా హత్య కేసు నమోదు చేశారు. అంతేకాదు.. గతంలో చేతులు విరిగిన ఘటనలోనూ ఆమె ప్రమేయం ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక ఆదివారం అష్కర్ను ఘటనాస్థలికి తీసుకెళ్లి సాక్ష్యాలు సేకరిస్తుండగా.. స్థానికులు ఆగ్రహంతో అతనిపై దాడి చేశారు. ఆ సమయంలో పోలీసులు కూడా వాళ్లను నిలువరించలేపోయారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిందితులిద్దరినీ కఠినంగా శిక్షించాలని అర్షిద్ అమ్మమ్మ, నాన్నమ్మ, తాతలు.. స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ అర్షిద్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.തിരുവനന്തപുരം നെടുമങ്ങാട് ഒന്നര വയസ്സുകാരൻ കൊല്ലപ്പെട്ട സംഭവത്തിൽ പ്രതികളിൽ ഒരാളായ അഷ്കറുമായി തെളിവെടുപ്പ് നടത്തുന്നതിനിടെ പ്രതിയെ കയ്യേറ്റം ചെയ്ത് നാട്ടുകാർ #nedumangad #ashkar #crime #kerala pic.twitter.com/4MEuPTbAXl— DD News Malayalam (@DDNewsMalayalam) May 31, 2026


