-
USA: బొమ్మ శవాలతో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసన
న్యూయార్క్: గాజాలోని పాలస్తీనియన్లకు అనుకూలంగా ఇజ్రాయెల్ను వ్యతిరేకిస్తూ.. అమెరికాలోని యూనివర్సిటీల విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. మిచిగాన్ విశ్వవిద్యాలయంలో పరిపాలన బోర్డులో పనిచేసే ఓ అధికారిణి సారా హబ్బర్డ్ ఇంటి ముందు విద్యార్థుల నిరసన కలకలం రేపింది. ఆమె ఇంటి ముందు సుమారు 30 విద్యార్థి నిరసనకారులు.. మూడు టెంట్లు వేసి.. నకిలీ శవాలు( బొమ్మలు), రక్తం మరకలతో కూడిన చిన్న పిల్లలు బొమ్మలను పెట్టి వెళ్లిపోయారు.pic.twitter.com/5eAWgS4hIT— Sarah Hubbard, Regent @umich (@RegentHubbard) May 15, 2024 వాటిని గమనించిన సారా హబ్బర్డ్ ఈ విషయాన్ని వరసు ట్వీట్లతో సోషల్మీడియాలో తెలిపారు. ‘బుధవారం ఉదయం 5.54 గంటలకు సుమారు 30 మంది ఇజ్రాయెల్ వ్యతిరేక మిచిగాన్ యూనివర్సిటీ విద్యార్థి నిరసనకారులు నేను ఉండే ఇంటిలోకి ప్రవేశించారు. ఇంటి ముందు మూడు టెంట్లు వేశారు. విచిత్రమైన బొమ్మలు, షీట్లు, మరికొన్ని వస్తులు పెట్టారు. యూనివర్సిటీలో పనిచేసే ప్రభుత్వ అధికారి ప్రైవేట్ ఇంటి ముందు ఇలా నిరసన తెలపటం ఆమోదయోగ్యం కాదు. ఈ విధంగా చేస్తే.. వారు అనుకున్న లక్ష్యాన్ని సంతృప్తి పరుచుకోలేరు’ అని సారా హబ్బర్డ్ ‘ఎక్స్’లో తెలిపారు.Nah. Those are sheets. The stuffed animals and doll crib are toys. https://t.co/5PJXixbgi6 pic.twitter.com/QDUsnNNIvG— Sarah Hubbard, Regent @umich (@RegentHubbard) May 15, 2024ఇక మరోవైపు.. ఇజ్రాయెల్ వ్యతిరేక విద్యార్థి నిరసనకారుల బృందం ఇర్విన్లోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఉండే ఓ భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో యూనివర్సిటీ అధికారులు క్లాస్లను రద్దు చేసి.. పోలీసులకు సమాచారం అందించారు. గాజాలో హమాస్ బలగాలు లక్ష్యంగా అమాయకులైన పాలస్తీనా పౌరులై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో పెద్ద ఎత్తున ఏప్రిల్లో నిరసనలు మొదలయ్యాయి. ఈ నిరసన పాల్గొన్న పలువురు విద్యార్థులు అరెస్ట్ అయ్యారు. -
‘పీఓకే’లో ఆందోళనలపై మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు
కోల్కతా: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) ఎప్పటికీ భారత్దేనని విదేశాంగశాఖ మంత్రి ఎస్.జైశంకర్ పునరుద్ఘాటించారు. ప్రస్తుతం పీఓకేలో జరుగుతున్న ఆందోళనలపై కోల్కతాలో బుధవారం(మే15) జరిగిన ఓ కార్యక్రమంలో జైశంకర్ స్పందించారు.పీఓకేలో ఉన్న ప్రజలు తమ జీవన ప్రమాణాలు, జమ్మూకాశ్మీర్లో ఉన్న ప్రజల జీవన స్థితులతో పోల్చుకుంటున్నారన్నారు. ‘పీఓకేలో ప్రస్తుతం ఆందోళనలు జరుగుతున్నాయి. వాటికి గల కారణాలు విశ్లేషించడం అంత సులభం కాదు.అయితే పీఓకే ప్రజలు తమ జీవన పరిస్థితులను జమ్మూ కాశ్మీర్ ప్రజల జీవన ప్రమాణాలతో పోల్చుకుంటున్నారని నా అభిప్రాయం. తాము వివక్షకు గురవుతున్నామని పీఓకే ప్రజలు భావిస్తున్నట్లున్నారు’అని జైశంకర్ అన్నారు. కాగా, ఇటీవల పెరిగిపోయిన ఆహారం, ఇంధన, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని పీఓకే ప్రజలు ఆందోళన బాట పట్టారు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసులపై దాడికి దిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. -
పీఓకేలో తీవ్ర ఘర్షణలు
ఇస్లామాబాద్: ఆందోళనకారులకు, భద్రతా సిబ్బందికి మధ్య ఘర్షణలతో పాకిస్తాన్ ఆక్రమిత కాశీ్మర్(పీఓకే) అట్టుడికిపోతోంది. శనివారం మొదలైన రగడ ఆదివారం మరింత ఉధృతమైంది. గోధుమ పిండి ధరలు విపరీతంగా పెరగడం, విద్యుత్ చార్జీలు మండిపోతుండడం పట్ల జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరలు తగ్గంచాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. వారిని అడ్డుకొనేందుకు ప్రయతి్నంచిన భద్రతా సిబ్బందిపై తిరగబడుతున్నారు. తుపాకులతో కాల్పులు తెగబడుతున్నారు. ఆదివారం పీఓకేలోని ఇస్లాంగఢ్లో జరిగిన కాల్పుల్లో ఒక పోలీసు అధికారి మరణించారు. 100 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో ఎక్కువ మంది పోలీసులే ఉన్నారు. పీఓకేలో పలు ప్రాంతాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపివేశారు. తాజా పరిస్థితిపై సమీక్షించేందుకు పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. పీఓకేలో పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ చెప్పారు. -
పీవోకేలో భగ్గుమన్న నిరసనలు
మిర్పూర్: పన్నుల పెంపు, నిరసనకారుల అరెస్టులపై పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో శుక్రవారం నిరసనలు భగ్గుమన్నాయి. మిర్పూర్ జిల్లా దద్యాల్ తహశీల్ పరిధిలో నిరసనకారులు భద్రతా బలగాలపై రాళ్లు రువ్వడంతోపాటు వారితో తలపడ్డారు. బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించి వారిని చెదరగొట్టాయి. కొన్ని టియర్ గ్యాస్ తూటాలు సమీపంలోని పాఠశాల ఆవరణలో పడగా విద్యార్థినులు గాయపడ్డారు.పెరుగుతున్న ధరలు, పన్ను భారం, విద్యుత్ కొరతకు సంబంధించి ఫిబ్రవరిలో కుదిరిన ఒప్పందాన్ని ప్రభుత్వం అమలు చేయనుందుకు ఆగ్రహిస్తూ జమ్మూకశ్మీర్ జాయింట్ ఆవామీ కమిటీ 10వ తేదీన శుక్రవారం బంద్కు, 11న లాంగ్ మార్చ్కి పిలుపునిచి్చంది. దీంతో, భద్రతా బలగాలు గురువారం కమిటీ నాయకులు సహా 70 మందిని అదుపులోకి తీసుకున్నాయి. -
Israel-Hamas war: వర్సిటీల్లో 2,300 దాటిన అరెస్టులు
న్యూయార్క్: గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దాడులు ఆపాలంటూ అమెరికావ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న నిరసనలు ఆగట్లేవు. పోలీసులు వర్సిటీల్లో ఆందోళనకారులను చెదరగొట్టి తాత్కాలిక శిబిరాలను ధ్వంసం చేస్తున్నారు. ఏప్రిల్ 17న కొలంబియా వర్సిటీలో మొదలై అమెరికాలో 44 విశ్వవిద్యాలయాలు/ కాలేజీలకు పాకిన ఈ విద్యార్థి ఉద్యమంలో ఇప్పటిదాకా 2,300 మందికిపైగా ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్చేశారు. శుక్రవారం న్యూయార్క్ యూనివర్సిటీలో టెంట్లను ఖాళీచేసి వెళ్లాలని నిరసనకారులను పోలీసులు హెచ్చరించారు. స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్లో 133 మందిని అరెస్ట్చేశారు. -
Israel-Hamas war: అమెరికా వర్సిటీల్లో నిరసనల హోరు
వాషింగ్టన్: గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడులను వ్యతిరేకిస్తూ అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల నిరసనలు నానాటికీ ఉధృతరూపం దాలుస్తున్నాయి. పాలస్తీనియన్లకు సంఘీభావంగా ర్యాలీలు కొనసాగుతున్నాయి. పోలీసులు అరెస్టులు చేస్తున్నా నిరసనకారులు వెనక్కి తగ్గడం లేదు. న్యూయార్క్, కాలిఫోరి్నయా, మిస్సోరీ, ఇండియానా, మసాచుసెట్స్, వెర్మాంట్, వర్జీనియా తదితర ప్రాంతాల్లో ఆంక్షలను సైతం లెక్కచేయకుండా విద్యార్థులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. వర్సిటీ క్యాంపస్ల్లో శిబిరాలు వెలుస్తున్నాయి. గాజాపై దాడులు వెంటనే నిలిపివేయాలని, కాల్పుల విరమణ పాటించాలని, పాలస్తీనియన్లకు మానవతా సాయం అందించాలని నినదిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కొన్ని యూనివర్సిటీల్లో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 900 మందికిపైగా విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా, యూనివర్సిటీ ఆఫ్ లాస్ ఏంజెలెస్–కాలిఫోర్నియా(యూసీఎల్ఏ)లో ఇజ్రాయెల్ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య తాజాగా ఘర్షణ చోటుచేసుకుంది. రెండు వర్గాల విద్యార్థులు పరస్పరం వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరినొకరు నెట్టేసుకున్నారు. అధికారులు రంగంలోకి దిగి వారికి నచ్చజెప్పారు. -
Israel-Hamas war: పాలస్తీనియన్లకు అమెరికా విద్యార్థుల సంఘీభావం
వాషింగ్టన్: గాజాలోని పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ సైన్యం దాడులను వ్యతిరేకిస్తూ అమెరికాలో విద్యార్థుల నిరసనలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. గాజాలో మారణహోమాన్ని వెంటనే ఆపాలని, ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ విశ్వవిద్యాలయాల్లో ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. వందలాది మంది ర్యాలీల్లో పాల్గొంటున్నారు. పాలస్తీనియన్లకు సంఘీభావం తెలియజేస్తున్నారు. ముందస్తుగా అనుమతి లేకుండా వర్సిటీ ప్రాంగణాల్లో శిబిరాలు ఏర్పాటు చేసుకొని, నిరసనల్లో పాల్గొంటున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. తాజాగా యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోరి్నయా యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో ఒక్కరోజే 100 మందికిపైగా విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో గతవారం విద్యార్థుల ఆందోళన ప్రారంభమైంది. క్రమంగా దేశవ్యాప్తంగా ఇతర యూనివర్సిటీలకు వ్యాపించింది. -
టీడీపీ హత్యా రాజకీయాలపై.. ఎగసిన నిరసన
సాక్షి, అమరావతి/నెట్వర్క్ : సీఎం వైఎస్ జగన్పై హత్యాయత్నానికి తెగబడటాన్ని నిరసిస్తూ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. స్కూలు పిల్లల నుంచి వృద్ధులు, అభిమానులు, మహిళలు, పార్టీ నేతలు పెద్దఎత్తున నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీలు నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్, జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్ పోద్బలంతోనే ఈ హత్యాయత్నం జరిగిందని మండిపడ్డారు. ప్రజాక్షేత్రంలో జగన్ను ఎదుర్కోలేక.. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు వస్తున్న ప్రజాస్పందనను చూసి ఓర్వలేక.. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించడం ఖాయమనే అక్కసుతోనే సీఎంపై హత్యాయత్నానికి పురిగొలిపారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అనేకచోట్ల చంద్రబాబు దిష్టిబొమ్మలను దగ్థం చేశారు. ఇందులో భాగంగా.. సీఎంపై హత్యాయత్నాన్ని ఖండిస్తూ ఆదివారం తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెంలో హోంమంత్రి తానేటి వనిత నేతృత్వంలో పార్టీ శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రిని రాజకీయంగా ఎదుర్కోలేకే దాడిచేయడం బాధాకరమని మంత్రి అన్నారు. దండకున్న తీగ గుచ్చుకుని గాయమైనట్లు కొంతమంది వక్రీకరిస్తున్నారని.. తీగ గుచ్చుకుని గాయమైతే వెనుకనున్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్కు ఎలా గాయమైందని ప్రశ్నించారు. ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే కార్యాలయం వద్ద జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి, నాయకులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కుక్కునూరు మండలం కివ్వాక గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. భీమడోలు మండలం కోడేరుపాడు గ్రామంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం మర్రితిప్ప వద్ద చీఫ్ విప్, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కాకినాడ రూరల్ మండలంలో పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ప్రత్తిపాడులో ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, పెద్దాపురం నియోజకవర్గ అభ్యర్థి దవులూరి దొరబాబు సామర్లకోటలో, పి.గన్నవరంలో జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే అభ్యర్థి వేణుగోపాలరావు, జగ్గంపేట, తునిలో పార్టీ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. హత్యాయత్నానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. జగన్ను టచ్ చేశారు పుట్టగతులుండవు : మంత్రి ‘కొట్టు’ సీఎం జగన్ని దాడి ద్వారా టచ్ చేశారు, ఈ కుట్రకు పాల్పడిన వారికి పుట్టగతులుండవని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ హెచ్చరించారు. తాడేపల్లిగూడెంలో ఆయన నల్లరిబ్బన్లు ధరించి విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్ను ఎదుర్కోలేక పిరికిపంద చర్యలకు పాల్పతున్నారన్నారు. ఆయనకు వస్తున్న జనాదరణను తట్టుకోలేక ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇక సీఎంపై దాడి ముమ్మాటికీ చంద్రబాబు పనేనని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకులో ఆరోపించారు. పేదలకు సంక్షేమం, విద్య, వైద్యం ఉచితంగా అందిస్తున్నందుకు జగన్పై దాడులు చేయిస్తావా చంద్రబాబూ అని నిలదీశారు. వంగవీటి రంగాను అత్యంత కిరాతకంగా చంద్రబాబు అంతమొందించాడని, నేడు అదే కోవలో ప్రయత్నాలు చేస్తున్నాడని మండిపడ్డారు. విజయనగరంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జామి మండలంలోని పీతలపాలెంలో ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, పార్వతీపురం మన్యం జిల్లాలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్రాజు, ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి, పాలకొండలో ఎమ్మెల్యే కళావతి నల్లబ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా నిరసన తెలిపారు. సీఎంపై జరిగిన దాడి అమానుషమని, ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు హేయమైనవని కోలగట్ల అన్నారు. సీఎం జగన్పై జరిగిన దాడికి నిరసనగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో స్పీకర్ తమ్మినేని సీతారాం, నరసన్నపేటలో ధర్మాన కృష్ణదాస్లు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సోంపేటలో జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, కొత్తూరులో ఎమ్మెల్యే రెడ్డిశాంతి నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. చంద్రబాబు కేడర్ను రెచ్చగొడుతున్నారు ఇక సీఎం జగన్పై దాడికి నిరసనగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్దఎత్తున నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. ఒంగోలులో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, మేయర్ గంగాడ సుజాత.. సింగరాయకొండలో మంత్రి ఆదిమూలపు సురేష్, చీమకుర్తిలో మంత్రి మేరుగ నాగార్జున, కంభంలో ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి, మార్కాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు, కనిగిరిలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. చంద్రబాబు పదేపదే తన కేడర్ను రెచ్చగొడుతున్నారని, ఇది హేయమైన చర్య అని బాలినేని, ఆదిమూలపు, మేరుగ నాగార్జున ఆరోపించారు. చీరాల, అద్దంకి, పర్చూరు, అధికార పార్టీ అభ్యర్థులు కరణం వెంకటేష్, పానెం హనిమిరెడ్డి, ఎడం బాలాజీ, వేమూరు అభ్యర్థి వరికూటి అశోక్బాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఎంపీ మోపిదేవి వెంకటరమణ, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, రేపల్లె అభ్యర్థి ఈవూరి గణేష్లు ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని ఖండించారు. ఉమ్మడి విశాఖలో ఆగ్రహ జ్వాలలు.. ఉమ్మడి విశాఖ జిల్లా మర్రిపాలెంలో వైఎస్సార్సీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి ఆడారి ఆనంద్కుమార్, ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. ఎండాడలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, మేయర్ గొలగాని హరివెంకట కుమారి, ఎమ్మెల్సీ రవీంద్రబాబు ఆధ్వర్యంలో మౌన దీక్ష నిర్వహించగా.. విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. గాజువాకలో మంత్రి అమర్నాథ్ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. చంద్రబాబు నీచరాజకీయాలు చెల్లవని.. ఇలాంటి దాడులను తాము సహించబోమన్నారు. అనకాపల్లి జిల్లా మునగపాకలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. పాయకరావుపేటలో ఎమ్మెల్యే అభ్యర్థి, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, పార్టీ శ్రేణులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల వ్యాప్తంగా.. జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే, విప్ సామినేని ఉదయభాను, తిరువూరులో ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాసు, మైలవరంలో ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు యాదవ్, విజయవాడ పశ్చిమంలో ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్, సెంట్రల్ నియోజకవర్గంలో డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ, కార్పొరేటర్లు, విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇక మచిలీపట్నం, అవనిగడ్డ, గన్నవరం, గుడివాడ, పామర్రు, పెడన, పెనమలూరు నియోజకవర్గాలోనూ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పెనమలూరు మండలం గంగూరులో మంత్రి జోగి రమేష్, పామర్రులో ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. గుంటూరులో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో.. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా, ఇక్కడి ప్రస్తుత అభ్యర్ధి షేక్ నూరిఫాతిమా ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. పొన్నూరులో ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ, గుంటూరులో ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, మచిలీపట్నం పోర్టు ట్రస్టు ఎండీ మేకతోటి దయాసాగర్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి బలసాని కిరణ్కుమార్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇతర మండలాల్లోనూ నల్లబ్యాడ్జీలతో నిరసనలు చేశారు. అలాగే, సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు నాయకత్వంలో నల్లకండువాలు ధరించి ర్యాలీ నిర్వహించారు. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నరసరావుపేటలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అమరావతిలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు రాస్తారోకోలు, కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. రొంపిచర్ల, వినుకొండలోనూ ఆందోళనలు చేశారు. ఇది ముమ్మాటికీ కూటమి కుట్రే ఇదిలా ఉంటే.. సీఎంపై హత్యాయత్నం ముమ్మాటికీ ప్రతిపక్ష పార్టీల కుట్రేనని తుడా చైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్రెడ్డి ఆరోపించారు. చంద్రగిరిలో ఆయన కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఇందులో పాల్గొన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి సతీమణి లక్ష్మి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి కూడా హాజరయ్యారు. అలాగే, హత్యాయత్నాన్ని ఖండిస్తూ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్, మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ ఆధ్వర్యంలో తిరుపతిలో నల్ల కండువాలు, నల్లబ్యాడ్జీలు ధరించి పెద్దఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. జగనన్నకు హాని జరిగితే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని వారన్నారు. ఇక అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో ప్రభుత్వవిప్ కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. సీఎంపై హత్యాయత్నం వెనుక కుట్రకోణం ఉందన్నారు. వైఎస్సార్ జిల్లా వేంపల్లెలో శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీ‹Ùకుమార్రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. మరోవైపు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు కూడా తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆదివారం రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, తాడిపత్రి, శింగనమల, గుంతకల్లు, అనంతపురం, రాప్తాడు నియోజకవర్గాల్లో భారీఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అలాగే శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి, ధర్మవరం, కదిరి, హిందూపురం, మడకశిర, పెనుకొండ నియోజకవర్గాల్లోనూ నిరసనలు జరిగాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి శాంతియుత ఆందోళనలు జరిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనూ జనాగ్రహం పెల్లుబికింది. ఆత్మకూరు పట్టణంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి ఆధ్వర్యంలో.. ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్రెడ్డి ఆధ్వర్యంలో నల్లరిబ్బన్లను ధరించి నిరసన వ్యక్తంచేశారు. నెల్లూరు నగరంలోనూ నిరసన ర్యాలీలను నిర్వహించారు. -
చంద్రబాబుకు నిరసన సెగ.. టీడీపీ శ్రేణుల ఆందోళన
సాక్షి, తూర్పుగోదావరి: ఏపీ టీడీపీ రాజకీయ కూటమి సీట్ల పంచాయితీపై ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబుకు తాజాగా నిరసన సెగ తగిలింది. చంద్రబాబు ఎదుటే పార్టీ కోసం కష్టపడిన వారిని సీటు ఇవ్వాలని టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. కాగా, నల్లజర్ల పర్యటనలో భాగంగా చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. కూటమిలో టికెట్ల కేటాయింపుపై టీడీపీ శ్రేణులు భగుమంటున్నాయి. నల్లజర్లలో చంద్రబాబు బస చేసిన ప్రాంతంలో పోలవరం టికెట్ టీడీపీకే కేటాయించాలంటూ పార్టీ నేతలు నిరనస చేపట్టారు. ఈ సందర్బంగా పార్టీలో కష్టపడిన వారికి మాత్రమే టికెట్ కేటాయించాలని నినాదాలు చేశారు. బోరగం శ్రీనివాస్కి టికెట్ కేటాయించాలని ఆయన వర్గీయలు ఆందోళనకు దిగారు. తక్షణమే పోలవం అభ్యర్థిని మార్చాలని నినాదాలు చేశారు. -
Pawan Kalyan: ‘ఎక్కడ ప్రచారం చేస్తే బెటర్!’
హైదరాబాద్, సాక్షి: ఏపీలో ఎన్నికల ప్రచారం హీటెక్కనుంది. ఇప్పటికే అధికార, ప్రధాన ప్రతిపక్షం ఎన్నికల ప్రచారంలోకి దిగాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం పేరిట సభలు పెడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీల సంగతి సరేసరి. ఇక జనసేన పవన్ కల్యాణ్ నేటి నుంచి ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్నాడు. ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా పవన్ మళ్లీ వారాహి యాత్ర చేపట్టబోతున్నాడు. గతంలో.. వారాహి పేరుతో విడతల వారీగా రాష్ట్రం తిరుగుతానంటూ హడావిడి చేసిన పవన్, చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆ వాహనాన్ని పక్కన పడేశారు. ఇక ఈ ఎన్నికల్లో కూటమి తరఫున 21 అసెంబ్లీ, రెండు ఎంపీ సీట్లు దక్కించుకున్న పవన్.. ఇంకా మూడు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానానికి అభ్యర్థుల్నే ఖరారు చేయలేదు. ఈలోపే ఎన్నికల ప్రచారంలోకి దిగుతుండడం గమనార్హం. రాజీనామాల పర్వం జనసేన టికెట్లకు సంబంధించి పలుచోట్ల రగడ నడిచింది. పవన్ తనకు మాటిచ్చి తప్పారని.. అలాంటి నిలకడలేని మనిషితో కొనసాగలేనంటూ ముమ్మిడివరం జనసేన ఇంచార్జ్ పితాని బాలకృష్ణ జనసేనకు గుడ్బై చెప్పారు. ఇక రాజోలులో దేవ వరప్రసాద్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి బొంతు రాజేశ్వరరావు సిద్ధమయ్యారు. పవన్ పోటీ చేస్తున్న పిఠాపురంలోనే జనసేనకు రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు మాకినేని శేషు కుమారి. మరోవైపు టికెట్ దక్కకపోవడంతో కాకినాడ సిటీలో స్తబ్దంగా మారిపోయారు జనసేన ఇంచార్జ్ ముత్తా శశిధర్. ఇక.. జనసేన నాయకుల పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసి మరీ పార్టీకి రాజీనామా చేశారు కాకినాడ మాజీ మేయర్ కవికొండల సరోజ. ఇంకోవైపు.. పవన్ కళ్యాణ్ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేసి జగ్గంపేటలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు పాఠం శెట్టి సూర్యచంద్ర. నిరసనలు తప్పవా? పవన్ తన వారాహి యాత్రను ఇవాళ పిఠాపురంలో ప్రారంభించబోతున్నాడు. ఇక్కడి నుంచే పవన్ పోటీ చేస్తున్నాడన్నది తెలిసిందే. అయితే పవన్ ఎన్నికల ప్రచారానికి జనసేన నుంచే ఓవైపు అసమ్మతి.. మరోవైపు నిరసనలు సెగలు తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీ తొలి నుంచి ఉన్నవాళ్లకు పవన్ మొండి చేయి చూపించాడు. ధన బలం ఉన్న నేతలకే సీట్లు ఇచ్చాడనే విమర్శను ఎదుర్కొంటున్నాడు. మరోవైపు వలస నేతలకు టికెట్లు ఇవ్వడాన్ని కూడా కేడర్ భరించలేకపోతుంది. పోతిన మహేష్ లాంటి నమ్మకస్తుడికి అసలు టికెట్ దక్కకపోవడంపై కేడర్ రగిలిపోతోంది. దీంతో పవన్ ప్రచారానికి ఆయా చోట్ల ఆటంకాలు ఎదురు కావొచ్చని తెలుస్తోంది. ఇన్ని ప్రతికూలతల నడుమ.. పవన్ తన ప్రచారాన్ని ఎలా కొనసాగిస్తారు? అనే ఆసక్తి నెలకొంది. మరోవైపు పిఠాపురంలో తనకు మొదటి నుంచి పోటీగా వస్తున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మను చల్లబర్చడంలో పవన్ సక్సెస్ అయ్యాడు. ఇవాళ వర్మ ఇంటికి వెళ్లిన పవన్.. తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలనే ఎంచుకుని.. పర్యటన, సభలు నిర్వహించాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. -
పసుపు పార్టీ ఉక్కిరిబిక్కిరి
సాక్షి, నెట్వర్క్: విపక్ష కూటమిలో ఏర్పడిన టికెట్ల ముసలం చల్లారేలా కన్పించడం లేదు. టికెట్ల కేటాయింపులో న్యాయం జరగలేదని ఎక్కడికక్కడ తెలుగు తమ్ముళ్లు నిరసనలు, ర్యాలీలతో రోడ్డెక్కుతున్నారు.టీడీపీ ఆఖరి జాబితాపై పార్టీలో అసంతృప్తి వెల్లువెత్తింది. అభ్యర్థులను మార్చాలంటూ ప్లెక్సీలు చించుతూ కరపత్రాలు తగలబెట్టారు. నెల రోజుల క్రితం గుమ్మనూరు జయరాంను చంద్రబాబు, లోకేశ్ తిట్టని తిట్టు లేదు. ఇప్పుడు ఆయనకే అనంతపురం జిల్లా గుంతకల్లు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. అనంతపురం అర్బన్ స్థానంలో సీనియర్ నేత ప్రభాకర్ చౌదరిని కాదని దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కు టికెట్ కేటాయించారు. ఈ నేపథ్యంలో గుంతకల్లు, అనంతపురం నియోజకవర్గాల్లో అసంతృప్తి జ్వాలలు రగులుకున్నాయి. జయరాంకు టికెట్ కేటాయించినట్లు ప్రకటించగానే జితేందర్గౌడ్ వర్గీయులు ఆగ్రహించి పార్టీ కార్యాలయంలో ఫర్నీచర్ ధ్వంసం చేశారు. చంద్రబాబు చిత్రపటాన్ని చెప్పులతో కొడుతూ జయరాంకు పార్టీ అమ్ముడు పోయిందంటూ నినాదాలు చేశారు. అనంతపురం అర్బన్లో తన పేరు లేకపోవడంతో ప్రభాకర్ చౌదరి తన అనుచరులతో స్థానిక రామ్నగర్లోని పార్టీ కార్యాలయంలో ఫర్నిచర్ను బయటపడేసి కార్యకర్తలతో నిప్పు పెట్టించారు. ఫర్నీచర్ మొత్తం మంటల్లో కాలిబూడిదైంది. పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పేశారు. ఫ్లెక్సీలు, ఫొటోలు, కరపత్రాలు మంటల్లో కాలిపోయాయి. చంద్రబాబు ఫ్లెక్సీలు, కరపత్రాలకు నిప్పు పాడేరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా కిల్లు రమేష్ నాయుడును ఆ పార్టీ అధిష్టానం ప్రకటించడంతో తెలుగు తమ్ముళ్లు ఆందోళనకు దిగారు. టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి టికెట్ రాకపోవడంతో ఆమె అనుచరులు శుక్రవారం రాత్రి చంద్రబాబు ఫొటోలతో ఉన్న టీడీపీ ఫ్లెక్సీలు, కరపత్రాలకు నిప్పంటించారు. రమేష్నాయుడుకు సహకరించేది లేదని అధిష్టానాన్ని హెచ్చరించారు. పాడేరు టికెట్ సీనియర్ నేత ఎంవీవీ ప్రసాద్కు కేటాయించకపోవడంపై శుక్రవారం కొయ్యూరులో టీడీపీ శ్రేణుల ఆందోళన చేపట్టారు. టీడీపీ ఫ్లెక్సీలను తగులబెట్టారు. సత్యవేడు నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలం మాకొద్దంటూ అసమ్మతి నాయకులు శుక్రవారం ఎన్ఆర్ఐ రమే‹Ùబాబు నేతృత్వంలో తిరుపతిలో సమావేశమయ్యారు. ఆదిమూలంకు సహకరించబోమని, ఇప్పటికైనా కొత్త అభ్యర్థిని ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. చీపురుపల్లి టికెట్ను కిమిడి కళా వెంకటరావుకు కేటాయించడంతో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున తన పదవులకు రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. ఎంతో కష్టపడి పని చేసిన తనను కాదని వేరే ఎవరినో తెచ్చి పెట్టాల్సిన పనేముందని ప్రశ్నించారు. భవిష్యత్ కార్యాచరణ రెండు రోజుల్లో వెల్లడిస్తానన్నారు. నాగార్జున వెంటే మండల నాయకులు రాజీనామాల బాటలో నడిచారు. నాగార్జున నివాసం వద్ద చంద్రబాబు ఫొటోలతో ఉన్న కరపత్రాలను దహనం చేశారు. అనంతరం మూడు మండలాల నాయకులు, కార్యకర్తలు పట్టణంలోని మూడు రోడ్ల జంక్షన్కు చేరుకుని విజయనగరం–రాజాం ప్రధాన రహదారిపై చంద్రబాబు ఫొటోలతో ఉన్న కరపత్రాలను తగలబెట్టి వ్యతిరేక నినాదాలు చేశారు. నెల్లిమర్లలో గరంగరం ‘టీడీపీలో సొమ్ము ఉన్నవాళ్లకే సీట్లు ఇస్తారా? ఇదెక్కడి న్యాయం? నాలుగేళ్లు ఇంట్లో కూర్చొన్న గంటా శ్రీనివాసరావుకు రూ. కోట్లు ఉన్నాయని భీమిలి టికెట్ ఇచ్చారు. ప్రతి రోజూ పార్టీ కోసం కష్టపడిన నాలాంటి వాళ్లను పక్కనబెట్టారు’ అని విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కర్రోతు బంగార్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. భోగాపురం మండలం పోలిపల్లిలో సాయంత్రం అత్యవసరంగా సమావేశమయ్యారు. నెల్లిమర్ల టికెట్ తనకేనని అరచేతిలో వైకుంఠం చూపించిన పార్టీ అధిష్టానానికి బుద్ధి చెప్పాలని, స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేయాల్సిందేనని వారంతా బంగార్రాజుకు మద్దతు పలికారు. నెల్లిమర్ల టికెట్ జనసేనకు ఇచ్చేశారని, న్యాయం చేయాలని అడిగితే భీమిలి పంపిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. తీరా ఇప్పుడు ఆ భీమిలి సీటు గంటా శ్రీనివాసరావుకు ఇచ్చేశారని, విజయనగరం లోక్సభ టికెట్ నాన్లోకల్ వ్యక్తి కలిశెట్టి అప్పలనాయుడికి కట్టబెట్టారని బాధపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో మొదట నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరు ప్రకటించి తర్వాత టికెట్ బీజేపీకి కట్టబెట్టడంతో నాలుగు రోజులుగా తీవ్ర స్థాయిలో నిరసన తెలుపుతున్నారు. ఏకంగా ఆ పార్టీ జెండాలను, కరపత్రాలను తగులబెట్టి అధినేత తీరుపై ఆగ్రహావేశాలతో మండిపడ్డారు. అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమవుతున్న నల్లమిల్లిని బుజ్జగించేందుకు టీడీపీ అధిష్టానం రాయబారానికి దిగినా చర్చలు సఫలం కాలేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని నల్లమిల్లి నిర్ణయించుకున్నట్లు సమాచారం. మూడు పార్టీలు.. మూడు దారులు అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె టీడీపీలో అసంతృప్తులు, వర్గపోరు ముదిరింది. శుక్రవారం నియోజకవర్గంలో జరిగిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలకు మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గంతోపాటు సీనియర్ నేతలు కన్నెత్తి చూడలేదు. మరోవైపు నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీ జనసేన పొత్తు జాడ కనిపించడం లేదు. ప్రచార కరపత్రాలు, బ్యానర్లలో జనసేన నాయకులు పేర్లు, ఫోటోలు లేకపోవడంపై బి.కొత్తకోట మండలం గట్టులో జరిగిన కార్యక్రమంలో జనసేన నాయకులు టీడీపీ నేతలను నిలదీశారు. కరపత్రాలను చింపేశారు. రాయచోటికి చెందిన మాజీ జెడ్పిటీసీ సుగవాసి బాలసుబ్రమణ్యంను రాజంపేట టీడీపీ అభ్యర్థిగా అధిష్టానం ఖరారు చేయడంతో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడ్డాయి. సుగవాసి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ తమ్ముళ్లు ఆందోళనకు దిగారు. టీడీపీ కరపత్రాలను కాల్చివేశారు. క్లస్టర్ ఇన్చార్జితో సహా పదిమంది బూత్ కన్వినర్లు పార్టీకి రాజీనామా చేశారు. బత్యాల చంగల్రాయుడును రాజంపేట టీడీపీ అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు కుట్రలో బీజేపీ పడిందని బీజేపీ నాయకులు పనతల సురేష్ ఆరోపించారు. టీడీపీ అభ్యర్ధిగా ఉన్న రోశన్నకు బీజేపీ కండువాను కప్పి ఆయనకు సీటును కేటాయించడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు. అసలు రోశన్నకు బీజేపీలో సభ్వత్వమే లేదన్నారు. ఏ అర్హతతో రోశన్నకు టికెట్ కేటాయించారని మండిపడ్డారు. గంటాకు సహకరించబోం..జనసేన నేతలు, వీరమహిళలు ‘జనసేన ఆవిర్భావం నుంచి నిరంతరం కష్టపడ్డాం. డబ్బు వృథా చేసుకున్నాం. భీమిలి నియోజకవర్గంలో జనసేనపార్టీ బలోపేతానికి ఎంతగానో కష్టపడితే నేడు టీడీపీ అభ్యర్థికి టికెట్ ఇవ్వడం ఏంటని భీమిలి నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ పంచకర్ల సందీప్ను జనసేన నాయకులు, వీరమహిళలు ప్రశ్నించారు. శుక్రవారం సాయంత్రం ఎండాడ పార్టీ కార్యాలయంలో సందీప్ సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ కోసం తాను కష్టపడి ప్రభు త్వంపై ఎన్నో పోరాటాలు చేశానని అయితే పార్టీ ఆదేశానుసారం ఉమ్మడి అభ్యర్థిగా గంటాను ప్రకటించారని సందీప్ చెప్పగా ఒక్కసారిగా జనసేన నాయకులు ఆందోళనకు దిగారు. భీమిలి టికెట్ జనసేనకేనని ఎదురుచూశామని, టీడీపీకి ఎలా కేటాయి స్తారని, పార్టీ కోసం ఇన్నాళ్లు కష్టపడిన మా భవిష్యత్తు ఏంటని నిలదీశారు. టీడీపీ అభ్యర్థి గంటాకు తాము మద్దతు ఇవ్వబోమ ని స్పష్టం చేశారు. గంటా ఎక్కడి వాడు. ఎప్పు డు ఏ నియోజకవర్గంలో ఉంటాడో తెలియదు. ఎక్కడ నుంచి పోటీ చేస్తాడో తెలీ దు. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాడో కూడా తెలియదు. అలాంటి వ్యక్తికి తాము ఎలా మద్దతు ప్రకటించాలని ప్రశ్నించారు. గంటాకు మద్దతు ప్రకటించలేమని వారు తేల్చి చెప్పేశారు. మూడు రోజులు సమయం ఇస్తున్నామని, అభ్యర్థిని మార్చకుంటే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. -
స్వేచ్ఛా మార్కెట్ పరిష్కారం కాదు!
గతేడాది కనీసం 65 దేశాలలో రైతులు నిరసనలు చేపట్టారు. ఖండాంతరాలలో జరిగిన ఈ నిరసనలు ప్రధానంగా పంటల ధరలు, అధిక ఉత్పత్తి వ్యయం, చౌకైన దిగుమతులు, ప్రోత్సాహకాల ఉపసంహరణ, స్థానిక సమస్యలకు వ్యతిరేకంగా సాగాయి. నిజానికి వ్యవసాయ సంక్షోభం కొనసాగడానికి స్వేచ్ఛా మార్కెట్లే కారణం. మార్కెట్లకు విజ్ఞత ఉంటే, రైతులు నష్టపోవడానికి కారణమే లేదు. ఆర్థిక వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉందో చెప్పడానికి రైతుల నిరసనలు నిదర్శనం. చట్టబద్ధమైన కనీస మద్దతు ధర అనేది భారతీయ రైతులకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాగుదారులకు కూడా అనుసరణీయ మార్గం. వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా పేదరికంలో ఉంచిన ఆర్థిక రూపకల్పనను సమూలంగా సరిదిద్దడానికి ఇదే సమయం. భారతదేశంలో, ఐరోపాలోని కొన్ని ప్రాంతాల్లో రైతుల తిరగబడటాన్ని ప్రపంచం గమ నిస్తోంది. 2023 జనవరి నుండి కనీసం 65 దేశాలలో రైతులు నిరస నలు చేపట్టారు. కనీవినీ ఎరుగని నిరసనల వెల్లువ వెనుక కారణాలు వేరువేరుగా ఉన్నప్పటికీ, వాటన్నింటినీ కలిపే సాధారణ సూత్రం ఒకటే: నియంత్రణ లేని మార్కెట్ ఆర్థిక వ్యవస్థ వైఫల్యం.రైతులు తమ అసంతృప్తిని వెళ్లగక్కేందుకు ఉపయోగించే పదాలు ఒక దేశం నుండి మరొక దేశానికి భిన్నంగా ఉండవచ్చు. కానీ అంత ర్లీన సందేశం ఒకటే: వ్యవసాయ ఆదాయాన్ని పెంచడంలో మార్కెట్లు విఫలమయ్యాయి. భారతదేశ రైతులు కనీస మద్దతు ధరను చట్ట బద్ధమైన హక్కుగా కోరుకుంటుండగా, యూరోపియన్ రైతులు తమ ఉత్పత్తులకు సరైన విలువను డిమాండ్ చేస్తున్నారు. కెన్యాలో బంగా ళాదుంపల ధర పతనం, నేపాల్లో కూరగాయల ధరలు తక్కువగా ఉండటంతో పాటు జర్మనీ, ఫ్రాన్స్ , బెల్జియంతో సహా యూరప్లోని అనేక దేశాలలో ఉత్పత్తి వ్యయం పెరగడం, చౌక దిగుమతులు, ఉత్పత్తి ధరలు పడిపోవడాన్ని కూడా నిరసనలు హైలైట్ చేశాయి. స్పెయిన్ లోని రైతులు నాలుగు లక్షల లీటర్ల పాలను వీధుల్లో పారబోశారు. మలేషియా సాగుదారులు తక్కువ వరి ధరలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఫ్రాన్స్ లో, అధ్యక్షుడు మాక్రాన్ తో ఇటీవల జరిగిన సమావేశంలో చిన్న రైతుల ప్రముఖ సంస్థ అయిన ‘కాన్ఫెడరేషన్ పేసన్’... రైతులకు సామాజిక రక్షణ కల్పించడంతో సహా హామీ ఇవ్వబడిన వ్యవసాయ ధర కంటే తక్కువ ధరకు కొనుగోళ్లను అనుమతించకూడదనే వాగ్దానాన్ని కోరింది. వాణిజ్య సరళీకరణను కూడా రైతులు వ్యతిరేకించారు.జర్మనీ, ఫ్రాన్స్ , రొమేనియా, ఇటలీ, పోలాండ్లలో రైతులు ఉక్రె యిన్ నుండి వచ్చే చౌక దిగుమతులకు వ్యతిరేకంగా నిరసనలు నిర్వ హించారు. పైగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను సమీక్షించాలని కోరుతున్నారు. వారు హైవేలను అడ్డుకున్నారు, దిగుమతి చేసుకున్న వ్యవసాయ ఉత్పత్తులను తీసుకువెళుతున్న ట్రక్కులను నిలిపివేశారు, చాలా చోట్ల దిగుమతి చేసుకున్న ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. ఫ్రాన్స్ లో, చౌకైన చేపల దిగుమతులకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు, మత్స్యకారులు ఓడరేవుల వద్ద నిరసన తెలిపారు. ఇది వ్యవ సాయ జీవనోపాధిని నాశనం చేస్తుందని వారు చెప్పారు. భారతదేశం విషయానికి వస్తే, ప్రపంచ వాణిజ్య సంస్థ నుండి భారత్ వైదొలగా లని నిరసన తెలుపుతున్న రైతులు తమ డిమాండ్ను పునరుద్ఘాటించారు. ‘డౌన్ టు ఎర్త్’ మ్యాగజైన్ సంకలనం ప్రకారం, యూరప్లోని 24 దేశాలు రైతు నిరసనలను ఎదుర్కొంటుండగా, ఆఫ్రికాలో 12, ఆసియాలో 11, దక్షిణ, ఉత్తర, మధ్య అమెరికాల్లో ఎనిమిదేసి దేశాలు, ఓషియానియాలో రెండు దేశాలు గత సంవత్సరం రైతు ప్రదర్శనల వల్ల ప్రకంపించిపోయాయి. ఐరోపాలో, స్వతంత్ర పాన్–యూరోప్ మీడియా నెట్వర్క్ అయిన ‘యూరాక్టివ్’ 2024 జనవరి–ఫిబ్రవరిలో తాజా దశ నిరసనలపై చేసిన అధ్యయనం... రైతులకు న్యాయమైన, లాభదాయకమైన ధర కోసం బలమైన డిమాండ్ ఉంటోందని తెలిపింది. ప్రధానంగా ఫ్రాన్స్ , జర్మనీ, స్పెయిన్, ఇటలీ నుండి ఈడిమాండ్ వెలువడింది. బెల్జియం రైతులు ఆహార గొలుసు విధానంలో కూడా రక్షణ కోరుకుంటున్నారు. నికర సున్నా ఉద్గారాలను సాధించే ప్రయత్నంలో యూరోపియన్ కమిషన్ విధించడానికి ప్రయత్నిస్తున్న కఠినమైన పర్యావరణ నిబంధనలపై కూడా వారి కోపం నిర్దేశితమైంది. వ్యవసాయ రంగంపై వాణిజ్య ప్రభావం యూరోపియన్ యూనియన్ రైతులకు ఆందోళన కలిగిస్తోంది. జర్మన్ రైతుల ప్రద ర్శనలు... వ్యవసాయ వాహనాలకు ఇంధనంపై పన్ను మినహాయింపులను ఉపసంహరించుకోవడం గురించి సాగాయి (దీనిని జర్మనీ దశలవారీగా రద్దు చేయడానికి అంగీకరించింది); ‘నైట్రేట్ డైరెక్టివ్’ లాంటి కఠినమైన పర్యావరణ నిబంధన లతోపాటు తక్కువ ధరలను భర్తీ చేయడానికి ప్రోత్సాహకాల డిమాండ్పై దృష్టి సారించాయి. సారాంశంలో, ఖండాంతరాలలో జరిగిన ఈ నిరసనలలో చాలా వరకు ప్రధానంగా పంటల ధరలు, అధిక ఉత్పత్తి వ్యయం, చౌకైన దిగు మతులు, ప్రోత్సాహకాల ఉపసంహరణ, స్థానిక సమస్యలకు వ్యతి రేకంగా ఉన్నాయి. వ్యవసాయాన్ని మార్కెట్ల చేతుల్లోకి వదిలేయడం వల్ల వ్యవ సాయ రంగానికి మేలు జరగలేదు. ప్రపంచవ్యాప్తంగా రైతుల నిరస నలే ఇందుకు నిదర్శనం. ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు ఉద్దేశపూర్వ కంగా ఆహార ధరలు తక్కువగా ఉండేలా చూసుకున్న ఆధిపత్య ఆర్థిక ఆలోచనకు భారతీయ వ్యవసాయం బలయ్యింది. ఇది కాలం చెల్లిన విధానం. మారుతున్న వాస్తవాలకు అనుగుణంగా ఆర్బీఐ తన స్థూల ఆర్థిక విధానాలను పునఃసమీక్షించే సమయం ఆసన్నమైంది. 2022– 23 గృహ వ్యయ సర్వే ప్రకారం, ప్రతి కుటుంబం మీద గృహం, ఆరోగ్యం, విద్యపై నిరంతరం పెరుగుతున్న వ్యయంతో భారం పడి నప్పటికీ, ఆహారంపై ఖర్చు గణనీయంగా తగ్గింది. కఠినమైన స్థూల ఆర్థిక నియంత్రణ నుండి వ్యవసాయ ధరలకు అవసరమైన దిద్దుబాటు చర్యల ఆవశ్యకతను నొక్కిచెప్పిన క్షణం, దానికి బలమైన వ్యతిరేకత వస్తుంది. ‘ఇది అధిక ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది, తద్వారా మార్కెట్ వక్రీకరణలు జరుగుతాయని మేము హెచ్చరించాము’ అంటూ గ్యారెంటీ ధర కావాలని రైతులు పునరుద్ఘాటించినప్పుడల్లా విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ ఒక కార్పొరేట్ వైఫల్యం ఫలితంగా కోవిడ్ మహమ్మారి సంవత్సరాల్లో ద్రవ్యోల్బణం 57 శాతం పెరిగి, 2023లో 53 శాతం చుట్టూ చేరిన ప్పుడు మాత్రం అదే ఆర్థిక ఆలోచన స్పష్టంగా నిశ్శబ్దంగా ఉంది. వ్యవసాయ ధరలను స్థిరీకరించడానికి అనేక దశాబ్దాలుగా అనేక ప్రోత్సాహకాలు, దేశీయ మద్దతు యంత్రాంగాలు ప్రయత్నించిన ప్పటికీ, వాస్తవికత ఏమిటంటే వ్యవసాయ కష్టాలు ప్రపంచవ్యాప్తంగా మరింత తీవ్రమవుతున్నాయి. వ్యవసాయంలో మార్కెట్ సంస్క రణలు అరువు తెచ్చుకున్న అమెరికాలో కూడా స్వేచ్ఛా మార్కెట్ రూపకల్పన అనేది చిన్న రైతులను వ్యవసాయం నుండి ఎలా బయటకు నెట్టిందో, వారిని కష్టాల బాటలో ఎలా వదిలివేసిందో, పొలంలో విధ్వంసాన్ని ఎలా సృష్టించిందో ‘నాసా’ మాజీ శాస్త్రవేత్త వేదవ్రత పెయిన్ దర్శకత్వం వహించిన ‘డెజా వు’ డాక్యుమెంటరీ చూపిస్తుంది. కాబట్టి స్వేచ్ఛా మార్కెట్ పరిష్కారం కాదు. నిజానికి వ్యవసాయ సంక్షోభం కొనసాగడానికి ఇదే కారణం. మార్కెట్లకు విజ్ఞతఉంటే, సమర్థతకు ప్రతిఫలమివ్వగలిగితే, వ్యవసాయం నష్టపోయే ప్రతిపాదనగా ఉండటానికి కారణమే లేదు. ఆర్థిక వ్యవస్థ ఎంతలోప భూయిష్టంగా ఉందో చెప్పడానికి ప్రపంచవ్యాప్తంగా రైతుల నిరసనలు నిదర్శనం. వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా పేదరికంలో ఉంచిన ఆర్థిక రూపకల్పనను సమూలంగా సరిదిద్దడానికి ఇది సమయం. చట్టబద్ధమైన కనీస మద్దతు ధర అనేది భారతీయ రైతులకు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాగుదారులుఅందరికీ వర్తించే మార్గం. మార్కెట్లు తదనుగుణంగా సర్దుబాటు అవుతాయి. - వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు , దేవీందర్ శర్మ - ఈ–మెయిల్: hunger55@gmail.com -
నిరసనలు.. నిలదీతలు.. ప్రశ్నల వర్షం
మంగళగిరి : మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్కు నిరసనలు, నిలదీతలు తప్పడం లేదు. మంగళగిరి పట్టణంలో రెండు రోజుల కిందట ముస్లిం మైనార్టీ నాయకులను లోకేశ్ కలవగా.. బీజేపీతో నేరుగా పొత్తు పెట్టుకున్న మీకు మైనార్టీలు ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించడంతో ఆయన నీళ్లు నమిలిన విషయం తెలిసిందే. తాడేపల్లి ఎన్టీఆర్ కట్ట మీద ఆదివారం ప్రచారానికి వెళ్లగా అక్కడా స్థానికులు లోకేశ్ను నిలదీశారు. కరోనా సమయంలో ఏమయ్యారు? పుష్కరాల సందర్భంగా తొలగించిన కుటుంబాలకు మీ తండ్రి పట్టాలు ఎందుకు ఇవ్వలేదు? తాడేపల్లి దేవదాయ, నీటి పారుదల శాఖ స్థలాల్లో ఎన్నో ఏళ్లుగా ఉంటున్న వారికి ఇప్పుడు పట్టాలు ఇస్తామంటున్నారు.. అందుకు చట్టాలు అంగీకరిస్తాయా? అంగీకరిస్తే 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న మీ తండ్రి చంద్రబాబు ఎందుకు ఇవ్వలేదు? అంటూ.. నిలదీయడంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక లోకేశ్ వెనుదిరిగారు. స్థానికుల నుంచి నిరసనలు, నిలదీతలు ఎదురవుతుండటంతో స్థానిక నాయకులు కూడా ప్రచారానికి డుమ్మా కొడుతున్నారు. ఇలా మాజీ ఇన్చార్జి పోతినేని శ్రీనివాసరావుతో పాటు పలువురు నాయకులు ప్రచారంలో పాల్గొనకపోవడం గమనార్హం. చివరకు లోకేశ్ అపార్ట్మెంట్లలో ప్రచారానికే పరిమితమయ్యారు. పోలీసులతో లోకేశ్ వాగ్వాదంమంగళగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్ ఆదివారం పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎన్నికల విధుల్లో భాగంగా పోలీసులు ఉండవల్లి సెంటర్లో వాహన తనిఖీ చేపట్టారు. అదే మార్గంలో వెళ్తున్న లోకేశ్ వాహనాలను ఆపి తనిఖీ నిర్వహించారు. ఈ రోజు ఇప్పటికే రెండు సార్లు తన వాహనాలను తనిఖీ చేశారని, ముఖ్యమంత్రి వాహనాన్ని తనిఖీ చేశారా? ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు వాహనాలను తనిఖీ చేశారా? అంటూ పోలీస్ అధికారితో వాగ్వాదానికి దిగారు. ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు అన్ని వాహనాలనూ తనిఖీ చేస్తున్నామని పోలీసు అధికారి బదులిచ్చారు. -
టీడీపీలో ఆగ్రహ జ్వాల
సాక్షి నెట్వర్క్: టీడీపీలో మూడోవిడత టికెట్ల జాబితాపై ఆపార్టీ శ్రేణుల్లో ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. టికెట్ మంటలు రాజుకుంటున్నాయి. ఇప్పటికే టికెట్ వస్తుందని ఆశపెట్టుకున్నవారంతా జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో ఆందోళనబాట పట్టారు. తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. వారి అనుయాయులు పార్టీ జెండాలను, ఫ్లెక్సీలను మంటల్లో వేసి తగులబెట్టారు. మొత్తమ్మీద రాష్ట్ర వ్యాప్తంగా తలెత్తిన వ్యతిరేక పవనాలు పార్టీ అధిష్టానం కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. శ్రీకాకుళంలో గుండ లక్ష్మీదేవి, పాతపట్నంలో కలమట వెంకటరమణను కాదని రూ. కోట్లు ముట్టచెప్పినవారికి టికెట్లు ఇచ్చారంటూ టీడీపీలోని సీనియర్ కేడర్ రగిలిపోయింది. పార్టీ కరపత్రాలు, బ్రోచర్లు, ఇతరత్రా మెటీరియల్ను తగలబెట్టి తమ నిరసన తెలియజేశారు. ‘తెలుగుదేశం పార్టీ వద్దు.. సైకిల్ గుర్తు అసలొద్దు.. టీడీపీ జెండాలు.. చంద్రబాబు అజెండా మనకొద్దు’ అంటూ శ్రీకాకుళంలో ఆ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శ్రీకాకుళంలో సీనియర్ నాయకుడు గుండ అప్పల సూర్యనారాయణ, లక్ష్మీదేవి దంపతులకు పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని, ఆమెకు సీటు రాకుండా అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడు అడ్డుకున్నారని తెలుగు తమ్ముళ్లు ఒంటి కాలితో లేచారు. ఏ మాత్రం పట్టులేని గొండు శంకర్కు టికెట్ ఇచ్చి, సీనియర్లకు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. చంద్రబాబు, లోకేశ్ ఫొటోలను ధ్వంసం చేసి, మంటల్లో తగలెట్టారు. రానున్న ఎన్నికల్లో ఎంపీ రామ్మోహన్నాయుడిని ఓడించి తీరుతామని శపథం చేశారు. ఈ సందర్భంగా ఇండిపెండెంట్గా పోటీ చేయాలని గుండ ఫ్యావిులీపై అనుచరులంతా ఒత్తిడి చేశారు. లేదంటే వైఎస్సార్సీపీలో చేరాలని కోరారు. శుక్రవారం సాయంత్రం తన అనుయాయుల అభీష్టం మేరకు ఇండిపెండెంట్గా పోటీకి దిగనున్నట్టు మాజీ శాసనసభ్యురాలు గుండ లక్ష్మీదేవి ప్రకటించారు. అప్పలసూర్యనారాయణ కూడా ఇండిపెండెంట్గా ఎంపీగా బరిలోకి దిగాలని కార్యకర్తలు కోరగా ఆదివారం దీనిపై నిర్ణయం తీసుకుందామని చెప్పారు. పాతపట్నంలో మూకుమ్మడి రాజీనామాలు పాతపట్నంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణకు చంద్రబాబు మొండి చేయి చూపడంతో ఆయన అనుచరులు మండిపడ్డారు. పది కార్లు వేసుకుని, పదిమందిని వెంట బెట్టుకుని, నియోజకవర్గంలో షో చేసిన మామిడిగోవిందరావుకు టికెట్ ఇవ్వడంపై వారు నిరసన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో టీడీపీ ఎలా గెలుస్తుందో చూస్తామని సవాల్ చేశారు. ఈ సందర్భంగా పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలం, ఎల్ఎన్పేట, కొత్తూరులో కలమటకు మద్దతుగా రోడ్డెక్కి టీడీపీ ఫ్లెక్సీలు, కరపత్రాలను తగలబెట్టారు. పార్టీ మండలాధ్యక్షులు సైతం రాజీనామా చేశారు. చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడు తదితరుల ఫ్లెక్సీలను మంటల్లో దహనం చేశారు. నిరసన ర్యాలీలు చేసి, కలమట అనుచరులంతా మూకుమ్మడిగా పార్టీకి రాజీనామాలు చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర కార్యదర్శి పదవికి గొంపకృష్ణ రాజీనామా విజయనగరం జిల్లా శృంగవరపుకోట అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పేరును ఖరారు చేయడంతో ఇప్పటివరకూ అక్కడి టికెట్కోసం ఎదురుచూసిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ అసంతృప్తితో రగిలిపోయారు. పార్టీ పదవికి రాజీనామా చేసి, ఇండిపెండెంట్గా బరిలో దిగనున్నట్టు ప్రకటించారు. ఆయనతో పాటు వేపాడ, కొత్తవలస, జామి మండలాల టీడీపీ అధ్యక్షులు గొంప వెంకటరావు, గొరపల్లి రాము, లగుడు రవికుమార్, విశాఖ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు రాయవరపు చంద్రశేఖర్, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గుమ్మడి భారతి వారి పదవులకు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం తన అభిమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో గొంపకృష్ణ మాట్లాడుతూ ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతానని ప్రకటించారు. టీడీపీ కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి ఉన్న తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తును పెయింట్తో చెరిపేశారు. అమలాపురంలో అసంతృప్తి జ్వాలలు అమలాపురం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా అయితాబత్తుల ఆనందరావును, పార్లమెంట్ అభ్యర్థిగా గంటి హరీష్ను పార్టీ అధిష్టానం ఎంపిక చేయడంపై అక్కడి నాయకులు మండిపడుతున్నారు. ఆనందరావుకు సీటు రాకుండా రాజప్ప సోదరుడు నిమ్మకాయల జగ్గయ్యనాయుడు ఆధ్వర్యంలో పరమట శ్యామ్కుమార్ గట్టి ప్రయత్నం చేశారు. అయినా ఆయనకే టికెట్ కేటాయించడంతో నాయకులు, కార్యకర్తలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఎన్నికలలో తగిన గుణపాఠం చెబుతామని వారు హెచ్చరించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన వారిలో జనసేన నాయకులు కూడా ఉండటం గమనార్హం. ఆదిమూలంను మార్చాలని డిమాండ్ తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోనేటి ఆదిమూలంను ప్రకటించడంపై సత్యవేడు, నాగలాపురం మండలాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మదనంబేడులో శుక్రవారం సాయంత్రం పంచాయతీ పరిధిలో తెలుగు తమ్ముళ్లు నిరసన తెలిపారు. ఆదిమూలం టీడీపీ కార్యకర్తలపై చిన్నపాటి గొడవలను భూతద్దంలో చూపించి అట్రాసిటీ కేసులు పెట్టించారని గుర్తుచేశారు. అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేశారు. నాగలాపురంలో కూడా పలువురు తెలుగు తమ్ముళ్లు ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు. రగిలిపోతున్న పోతిన మహేష్ విజయవాడ వెస్ట్ నుంచి సీటు ఆశిస్తున్న పోతిన మహేష్ భంగపాటుకు గురయ్యాడు. కానీ పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయిస్తున్నట్లు పవన్ తేల్చి చెప్పారు. ఈ ప్రకటనతో కంగుతిన్న మహేష్ డివిజన్ ఇన్చార్జిలు, కార్యకర్తలతో సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ నమ్మించి మోసం చేశారని, ఇలాగైతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని హెచ్చరికలు పంపారు. పురందేశ్వరి కోసం మమ్మల్ని బలి చేస్తారా? విపక్ష కూటమిలో రాజమహేంద్రవరం పార్లమెంటరీ స్థానం అభ్యర్థిత్వం కలకలం రేపుతోంది. టీడీపీ ప్రకటించిన మూడో జాబితాలో టీడీపీ నేత బొడ్డు వెంకట రమణ చౌదరి పేరు లేకపోవడంపై ఆ వర్గం నేతలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. జనసేన కోసం ఇప్పటికే రాజానగరం ఎమ్మెల్యే సీటును త్యాగం చేసిన ఆయనకు.. ఇప్పుడు బీజేపీ కోసం ఎంపీ స్థానం వదుకోవాల్సి వస్తుందన్న ఆందోళన నెలకొంది. ఎంపీ టికెట్ అయినా వస్తుందనుకుంటే అదీ దక్కే అవకాశం కనిపించకపోవడంతో ఆ వర్గం టీడీపీ అధినేతపై మండిపడుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిని రాజమహేంద్రవరం ఎంపీగా బరిలోకి దింపేందుకు కమలనాథులు పావులు కదుపుతూండటంతో తన రాజకీయ భవిష్యత్తు ఏమిటని ఆయన కార్యకర్తల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని నమ్ముకుంటే నట్టేట ముంచారని ఆయన పేర్కొన్నట్టు తెలిసింది. ఎక్కడ ‘పుట్టా’వో మాకెందుకు? ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా, టీటీడీ మాజీ చైర్మన్, కడప జిల్లా టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు పుట్టా మహేష్ను ఎంపిక చేయడంపై అక్కడి బీజేపీ నేతలు మండిపడుతున్నారు. టికెట్ ఇస్తామని సింగపూర్లో ఉన్న తనను రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఆర్థికంగా ఉపయోగించుకున్నారని, టీడీపీ జెండా మోయటానికే జనాలు ముందుకు రాని సందర్భంలో ఏడాది పాటు కష్టపడి పనిచేశానని ఎన్ఆర్ఐ గోరుముచ్చు గోపాల్ యాదవ్ చెప్పారు. తన అసంతృప్తిని వీడియో రూపంలో విడుదల చేశారు. బీసీలంటే యనమల కుటుంబం ఒక్కటేనా, ఆయన కుటుంబంలోనే మూడు టికెట్లు ఇస్తారా, మిగతా వెనకబడిన కులాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చాలా గ్రేట్ అని.. ఆయన ధైర్యాన్ని ఎప్పుడూ మెచ్చుకుంటానని, తాను ఆయనపై ఏమైనా విమర్శలు చేసి ఉంటే పార్టీ పరంగా తప్ప వేరేగా కాదని వివరించారు. ఈ నెల 25న కామవరపుకోటలో దగాపడ్డ బీసీ సోదరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ‘కడప నేత వద్దు– స్ధానిక బీజేపీ నేతలకే టికెట్ ఇవ్వాల’ని పార్లమెంట్ బీజేపీ కన్వీనర్ గాది రాంబాబు, దెందులూరు, చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్లు, పార్టీ వివిధ విభాగాల నేతలు విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. స్థానిక అశోక్ నగర్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ ఏలూరు టికెట్ విషయంలో బీజేపీ రాష్ట్ర, జాతీయ నాయకత్వాలు పునరాలోచన చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా కామవరపుకోట చెక్పోస్ట్ సెంటర్లో గోరుముచ్చు గోపాల్ యాదవ్ మద్దతుదారులు శుక్రవారం రాత్రి టైర్లకు నిప్పంటించి నిరసన తెలిపారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. -
ఆందోళనలు, అరెస్టులు
న్యూఢిల్లీ: ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ అరెస్ట్ను నిరసిస్తూ ఆ పార్టీ నేతలు, ఢిల్లీ రాష్ట్ర మంత్రులు బీజేపీకి వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలు, నిరసనలతో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీలో ఆందోళనకు దిగిన ఆప్ నేతలను పోలీసులు అరెస్ట్చేశారు. శుక్రవారం ఢిల్లీలో ఆప్, బీజేపీ ప్రధాన కార్యాలయాలు ఉన్న పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ సమీప ఐటీఓ ఇంటర్సెక్షన్ కూడలి వద్దకు ఆప్ నేతలు, కార్యకర్తల పెద్ద సంఖ్యలో చేరుకుని మోదీ సర్కార్ వ్యతిరేక నినాదాలు చేశారు. ‘అరవింద్ మీరు సంఘర్షణను కొనసాగించండి. మేం మీకు తోడుగా ఉంటాం’ అని నినదించారు. ట్రాఫిక్ స్తంభించడంతో ధర్నాకు దిగిన వారిని పోలీసులు చెదరగొట్టే ప్రయత్నంచేశారు. అక్కడే ఆందోళనకు దిగిన ఢిల్లీ రాష్ట్ర మంత్రులు ఆతిశీ, సౌరభ్ భరద్వాజ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని బస్సుల్లో వేరే చోట్లకు తరలించారు. దీంతో తమ నేతలను విడుదలచేయాలంటూ మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలుచేశారు. పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ సహా మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలను అదుపులోకి తెచ్చేందుకు పారామిలటరీ సిబ్బందిని రంగంలోకి దింపారు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ను విధించారు. ఐటీవో స్టేషన్ను సాయంత్రందాకా ఢిల్లీ మెట్రో రైల్ మూసేసింది. ఈడీ ప్రధాన కార్యాలయం, బీజేపీ ఆఫీస్ల వద్ద భారీగా బలగాలను మొహరించారు. ‘‘తప్పుడు కేసులతో నిన్న సీఎంను అరెస్ట్చేశారు. ఈరోజు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని అరెస్ట్ చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే’’ అంటూ మంత్రులు ఆతిశీ, సౌరభ్ మండిపడ్డారు. కస్టడీలో కేజ్రీవాల్కు రక్షణేది: ఆతిషి ధర్నాకు ముందు మంత్రి ఆతిషి పత్రికాసమావేశంలో మాట్లాడారు. ‘‘సీఎం హోదాలో కేజ్రీవాల్ చుట్టూ నిరంతరం జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉండేది. ఇప్పుడు ఈడీ కస్టడీలో కేంద్రం ఆయనకు అంతటి భద్రత కల్పిస్తోందా? ఆయన భద్రతకు జవాబుదారీ ఎవరు? ఈడీ ఆఫీస్ లాకప్లోకి ఎవరెవరు వస్తున్నారు? అక్కడ ఉన్న భద్రతా ఏర్పాట్లపై కేంద్రం ప్రకటన చేయాలి’ అని ఆతిషి డిమాండ్ చేశారు. -
నేడు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలపై బీజేపీ ప్రభుత్వం తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తూ, ప్రజా స్వామ్య హక్కులను కాల రాస్తోందని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యద ర్శివర్గ సభ్యులు ఎన్.బాలమల్లేశ్, ఎస్.వీరయ్య మండిప డ్డారు. వామపక్ష పార్టీల సమావేశం శుక్రవారం ఎంబీ భవన్లో జరిగింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ నిరంకుశ ధోరణులను సమావేశం తీవ్రంగా ఖండించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా శనివారం ఉద యం 11 గంటలకు హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో నిరసన కార్యక్రమం ఉంటుందని తెలిపా రు. స్వచ్ఛందంగా పనిచేసే ఈడీ, ఐటీ, సీబీఐలను తమ జేబు సంస్థలుగా కేంద్రం వాడుకుంటోందని మండిపడ్డారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చట్ట ఉల్లంఘనలు జరుగుతున్నా పట్టించుకోకుండా, బీజేపీయేతర రాష్ట్రాల్లో మాత్రం కక్షపూరితంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష పార్టీల నా యకులను భయభ్రాంతులకు గురిచేస్తోందని విరుచుకుపడ్డారు. అందులో భాగంగానే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తోపా టు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితలను అరెస్టు చేసిందన్నారు. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసి ఎన్నికల్లో దెబ్బతీయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర నాయకులు డీజీ నరసింహారావు, సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ నాయకులు రమ, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు గోవర్ధన్, ఎంసీపీఐ(యు) నాయకులు వనం సుధాకర్, ఎస్ యూసీఐ(యు) నాయకులు తేజ, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు కోటేశ్వరరావు, సీపీఐ (ఎంఎల్) నాయకులు ప్రసాద్ పాల్గొన్నారు. -
ఆందోళనలతో ‘కూటమి’ కుతకుత
సాక్షి, నరసరావుపేట, నరసరావుపేట రూరల్/డోన్/కాళ్ల/డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ)/వెంకటగిరి రూరల్ (తిరుపతి జిల్లా)/శ్రీకాళహస్తి (తిరుపతి జిల్లా)/దేవరపల్లి: టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో ఆగ్రహజ్వాలలు ఎగసిపడుతున్నాయి. సీనియర్ నాయకులు తమకు టికెట్ రాలేదని మండిపడుతున్నారు. తమ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని కార్యకర్తలూ నిరసనలకు దిగుతున్నారు. ఆత్మహత్యలకూ వెనుకాడబోమని అధినాయకత్వాలను హెచ్చరిస్తున్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా టీడీపీ ఇన్చార్జి చదలవాడ అరవిందబాబును ప్రకటించడానికి టీడీపీ అధిష్టానం మీనమేషాలు లెక్కిస్తోందని నిరసిస్తూ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పులిమి వెంకటరామిరెడ్డి విలేకరుల సమక్షంలోనే పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నరసరావుపేట మండలం పాలపాడులోని తన స్వగ్రహంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన అధిష్టానం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మధ్యే పార్టీలో చేరిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అరవిందబాబుకు టికెట్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని విమర్శించారు. ఇంకా పార్టీలో చేరని జంగా కృష్ణమూర్తి, మరో ఎన్ఆర్ఐకి టికెట్ ఇప్పించేందుకు ఆయన పైరవీలు చేస్తున్నారని ఆరోపించారు. బీసీ ద్రోహి శ్రీకృష్ణదేవరాయలు అని మండిపడ్డారు. అనంతరం పక్కనే ఉన్న పురుగుమందు డబ్బాను అందుకుని తాగారు. కార్యకర్తలు ఆయనను నరసరావుపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఇదంతా చదలవాడ ఆడిస్తున్న డ్రామా అని ప్రత్యర్థివర్గాలు ఆరోపిస్తున్నాయి. కేఈ, కోట్లది చీకటి ఒప్పందం కేఈ, కోట్ల కుటుంబాలు చీకటి ఒప్పందం కుదుర్చుకొని తాము మాత్రమే డోన్ రాజకీయాలను శాసించాలనే విధంగా ప్రవర్తిస్తున్నాయని టీడీపీ డోన్ నియోజకవర్గ ఇన్చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి మండిపడ్డారు. నంద్యాల జిల్లా ప్యాపిలిలో ఆయన విలేకరుల తో మాట్లాడారు. మూడేళ్ల క్రితం కోట్ల, కేఈ కుటుంబాలు డోన్ టీడీపీ ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పుకుంటే తాను పార్టీని బతికించానని, రెండున్నరేళ్ల క్రితమే తనను అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు మాట తప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ మోసం చేసింది : శివరామరాజు పశ్చిమగోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు తెలిపారు. కాళ్ల మండలం పెదఅమిరం గ్రామంలో బుధవారం జైన్ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా టీడీపీకి సేవ చేస్తే తనను అధిష్టానం మోసం చేసిందని విమర్శించారు. కష్టపడిన వారికి గుర్తింపు లేదు టీడీపీలో కష్టపడి పనిచేసిన వారికి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ బొలిగర్ల మస్తాన్యాదవ్ విమర్శించారు. తిరుపతిజిల్లా వెంకటగిరి పట్టణంలోని తనచారిటబుల్ ట్రస్టు కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గంలో పార్టీ కోసం సేవ చేస్తే చివరకు టికెట్ ఇవ్వలేదని పేర్కొన్నారు. మస్తాన్ యాదవ్ టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీకి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మద్దిపాటిని మార్చకుంటే బరిలోకి రెబల్ తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి మద్దిపాటి వెంకట్రాజును మార్చకుంటే పార్టీలో తిరుగుబాటు తప్పదని కార్యకర్తలు హెచ్చరించారు. బుధవారం నల్లజర్లలోని ప్రియాంక కన్వెన్షన్ హాల్లో మద్దిపాటి వ్యతిరేకవర్గం సమావేశమైంది. మద్దిపాటిని మార్చకుంటే రెబల్ అభ్యర్థిని బరిలో దింపుతామని అలి్టమేటం జారీ చేశారు. బొజ్జలకు మద్దతు లేదు బొజ్జల సుదీర్రెడ్డికి తాము మద్దతివ్వలేదని మాజీ ఎమ్మెల్యేలు ఎస్సీవీ నాయుడు, సత్రవాడ మునిరామయ్య స్పష్టం చేశారు. ఎస్సీవీ నాయుడు స్వగృహంలో బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సు«దీర్రెడ్డి తమను కలిశారని, అయితే మద్దతిస్తున్నట్టు ఆయనకు తాము చెప్పలేదని పేర్కొన్నారు. తానూ చంద్రబాబును కలిసి ఎమ్మెల్యే టికెట్ కోరతానని స్పష్టం చేశారు. బలిచ్చే మేకపోతు మాకొద్దు విశాఖ దక్షిణ జనసేన టికెట్ వంశీకృష్ణ శ్రీనివాస్కు ఇవ్వొద్దంటూ కార్పొరేటర్ సాధిక్ వర్గీయులు పట్టుబడుతున్నారు. దీంతో సాధిక్ కార్యాలయం వద్ద వంశీకృష్ణ శ్రీనివాస్, సాధిక్ వర్గీయులు బుధవారం బాహాబాహీకి దిగారు. పరస్పరం దాడులకు సిద్ధమయ్యారు. దీంతో సాధిక్, వీరమహిళలు నడిరోడ్డుపై ఆందోళనకు దిగారు. ‘‘బలిచ్చే మేకపోతు మాకొద్దు’’ అంటూ ఓ మేకను తీసుకొచ్చి వినూత్నంగా నిరసన తెలిపారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పారు. -
బాబుపై తిరుగుబావుటా
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: టీడీపీ టికెట్ల మంటలు ఇప్పట్లో చల్లారేలా లేవు. టికెట్లు రాని టీడీపీ సీనియర్లు రగిలిపోతున్నారు. చంద్రబాబుపై తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. పొత్తులు, సామాజిక సమీకరణాల పేరుతో తమ గొంతు కోశారని మండిపడుతున్నారు. పలు నియోజకవర్గాల్లో ఆందోళనలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారు. చంద్రబాబు తన వద్దకు పిలిపించుకుని బుజ్జగించినా వారు వినడంలేదు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివరామరాజు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయనకు సర్దిచెప్పేందుకు టీడీపీ ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. కృష్ణా జిల్లా పెడన సీటును ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో ఉన్న మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. ఉత్తరాంధ్రలో కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తిలు సీటు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పెందుర్తి సీటును జనసేనకు కేటాయించడాన్ని తప్పుపడుతూ బండారు సత్యనారాయణమూర్తి ఎవరికీ అందుబాటులోకి లేకుండాపోయారు. ఎచ్చెర్ల సీటును కళా వెంకట్రావుకు ఇవ్వడానికి అంగీకరించకపోవడంతో ఆయన భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. గంటా శ్రీనివాసరావు అడుగుతున్న సీటును ఇవ్వకపోవడంతో ఆయన ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. కళా వెంకట్రావు, గంటాను విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని చంద్రబాబు చెప్పగా.. ఆ సీటు ఆశిస్తున్న కిమిడి నాగార్జున అసంతృప్తితో రగిలిపోతున్నారు. మైలవరం, పెనమలూరులో తేలని పంచాయితీ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పెనమలూరు, మైలవరం సీట్లు కాకరేపుతున్నాయి. పెనమలూరు సీటు ఇవ్వడంలేదని చెప్పడంతో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రచారం కూడా ప్రారంభించారు. ఆ సీటు దేవినేనికి ఇస్తారని ప్రచారం జరుగుతుండడంతో ఆయన మండిపడుతున్నారు. మైలవరం వసంత కృష్ణప్రసాద్కి ఇస్తానని చెప్పినా ఖరారు చేయకపోవడం, దేవినేని, వసంత మధ్య పోటీ పెట్టడంతో అక్కడ గందరగోళం నెలకొంది. అనంతపురం జిల్లా ధర్మవరం సీటును బీజేపీకి ఇవ్వడాన్ని పరిటాల శ్రీరామ్ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వరదాపురం సూరికి తన సీటు ఇవ్వడాన్ని శ్రీరామ్ తప్పుపడుతున్నారు. టీడీపీ, జనసేన మధ్య తేలని పంచాయితీ అమలాపురం నియోజకవర్గంలో టీడీపీ–జనసేన మధ్య వివాదం రోడ్డున పడింది. టికెట్ జనసేనకే ఇవ్వాలని ఆ పార్టీ నియోజకవర్గ నాయకులు రెండు రోజులుగా అమలాపురంలో ఆందోళన చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా అయితాబత్తుల ఆనందరావు, మాజీ ఎంపీ బుచ్చి మహేశ్వరరావు కుమార్తె పాము సత్యశ్రీ పేరుపై అభిప్రాయ సేకరణ చేపట్టారు. మరోవైపు సీటు తమకే ఇవ్వాలంటూ జనసేన నేతలు, కార్యకర్తలు అమలాపురంలో రోడ్డెక్కారు. అమలాపురం గడియారం స్తంభం సెంటర్లో జరిగిన ధర్నాలో పార్టీ అల్లవరం మండల అధ్యక్షుడు బాలయోగిఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్యహత్యాయత్నానికి పాల్పడ్డారు. అప్రమత్తమైన తోటి నాయకులు, కార్యకర్తలు బాలయోగిని అడ్డుకున్నారు. రాజోలులో రోడ్డెక్కిన జనసేన బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ శనివారం రోడ్డెక్కింది. పార్టీ టికెట్ దేవ వరప్రసాద్కు ఇస్తారనే ప్రచారంతో ఆందోళన నిర్వహించారు. స్థానికుడు కాని వరప్రసాద్కు టికెట్టు ఇస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. బొంతు రాజేశ్వరరావుకే టికెట్టు ఇవ్వాలని నినాదాలు చేశారు. పార్టీ నాయకులు మలికిపురం కూడలి వరకూ ర్యాలీ నిర్వహించారు. బండారుకు టికెట్ ఇవ్వాల్సిందే.. పెందుర్తి టికెట్ను టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి కేటాయించాలని పార్టీ కార్యకర్తలు శనివారం వెన్నలపాలెంలో నిరసన చేపట్టారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద బండారుకు అనుకూలంగా నినాదాలు చేశారు. గౌరవం లేని చోట ఉండను గౌరవం లేనిచోటు ఉండకూడదని నిర్ణయించుకున్నానని, అవమానాల మీద అవమానాలు భరించలేనని సూళ్లూరుపేట టీడీపీ నేత వేనాటి రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో లోకేశ్ జోక్యం పెరిగాక తన సొంత సామాజికవర్గాన్ని పెంచుకునేందుకు తమను అవమానాలకు గురి చేస్తున్నారని అన్నారు. శనివారం సూళ్లూరుపేట టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ 42 ఏళ్లుగా టీడీపీకి సేవచేశామన్నారు. టీడీపీలో కులపిచ్చి పెరగడం వల్ల ఇమడలేని పరిస్థితుల్లో పార్టీని వీడుతున్నట్లు చెప్పారు. గుమ్మనూరుకు టికెట్ ఇస్తే సహించేది లేదు: జితేంద్రగౌడ్ ఎక్కడి నుంచో వచ్చి నియోజకవర్గంలో పెత్తనం చెలాయిస్తామంటే సహించబోమని, మాజీ మంత్రి గుమ్మనూరుకు టికెట్ ఇస్తే ఊరుకునేది లేదని అనంతపురం జిల్లా గుంతకల్లు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్.జితేంద్రగౌడ్ హెచ్చరించారు. శనివారం గుంతకల్లులో మాట్లాడుతూ.. ఈ ఐదేళ్లు టీడీపీ కోసం కష్టపడ్డామని, ఇందుకు గుర్తింపుగా గుంతకల్లు అసెంబ్లీ టికెట్ ఇస్తారన్న ఆశాభావంతో ఉన్నానన్నారు. చేనేతలకు అన్యాయం: నిమ్మల చేనేతలకు సీట్ల కేటాయింపులో చంద్రబాబు అన్యాయం చేశారని మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం శ్రీసత్యసాయి జిల్లా గోరంట్లలో హిందూపురం పార్లమెంట్ పరిధిలోని పలు మండలాలకు చెందిన టీడీపీ ముఖ్య నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. నిమ్మలకు టికెట్ నిరాకరించడాన్ని నాయకులు తప్పుబట్టారు. టికెట్ ఇవ్వని పక్షంలో పార్టీకి రాజీనామా చేసి.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని కోరారు. -
భగ్గుమన్న పొత్తు బంధం..
సాక్షి నెట్వర్క్: పొత్తులతో ఎన్నికల గోదారి ఈదాలన్న చంద్రబాబు ఎత్తుగడ టీడీపీ పుట్టి ముంచుతోంది. ఇప్పటికే మూడు గ్రూపులు ఆరు కుంపట్లుగా రచ్చ రచ్చగా ఉన్న టీడీపీ పరిస్థితి తాజాగా మిత్రపక్షాలు జనసేన, బీజేపీలకు సీట్ల కేటాయింపుతో పూర్తిగా రోడ్డున పడింది. చంద్రబాబు గురువారం తమ పార్టీ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటించగానే భగ్గుమన్న టీడీపీ తమ్ముళ్లు అధినేతపై నిప్పులు చెరిగారు. పార్టీ కోసం శ్రమించిన వారిని పక్కనపెట్టి డబ్బు మూటలతో దిగిన ప్యారాచూట్ నాయకులకు టికెట్లు కేటాయించారని మండిపడ్డారు. పార్టీకోసం పనిచేసిన వారిని పక్కనపెట్టి కేవలం డబ్బులకే ప్రాధాన్యత ఇచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్పై దుమ్మెత్తిపోశారు. టికెట్ల కేటాయింపులో మరోసారి పునరాలోచించాలని లేనిపక్షంలో పార్టీని ఓడించేందుకైనా వెనుకాడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ప్లెక్సీలు చించివేసి ర్యాలీలు నిరసనలు తెలిపారు. కొందరు నాయకులు రాజీనామాలు చేశారు. చంద్రబాబు చేసిన మోసానికి ఆగ్రహించిన కార్యకర్తలు రోడ్లపై టైర్లను కాల్చి ఆందోళనలు నిర్వహించారు. మొత్తంగా టీడీపీ రెండో జాబితా ప్రకటించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగింది. పిఠాపురంలో అసమ్మతి సెగ కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ ప్రకటించిన పది నిమిషాలకే అక్కడ టీడీపీలో అసమ్మతి అగ్గి రగిలింది. మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు టికెట్టు నిరాకరించడంపై ఆ పార్టీ వర్గాలు పిఠాపురంలో గురువారం తీవ్ర స్థాయి ఆందోళనకు దిగాయి. పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద వర్మ అనుచరులు, ఆ పార్టీ నేతలు చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ జెండాలు, బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ పత్రికలు తగులబెట్టారు. వర్మకు టికెట్టు ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపి, రెబల్గా పోటీ చేయిస్తామని గతంలోనే వారు ప్రకటించారు. అధిష్టానం తన నిర్ణయం మార్చుకోపోతే టీడీపీకి మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని, సానుకూల నిర్ణయం ప్రకటించేంత వరకూ టీడీపీ జెండాలు సైతం పట్టుకోబోమని ఇటీవల చెప్పారు. తామంతా రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామంటూ సంతకాలు సేకరించారు. ఈ నేపథ్యంలో పవన్ ప్రకటనతో భగ్గుమన్న టీడీపీ నేతలు చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను తీవ్ర పదజాలంతో దూషించారు. ఇప్పటి వరకూ సీటు వర్మదే అంటూ నమ్మబలికిన చేతకాని లోకేశ్ ఇప్పుడు మాట మార్చి తమను మోసం చేశాడంటూ పలువురు మహిళా నేతలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెండు రోజుల్లో క్యాడర్తో సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వర్మ ప్రకటించారు. పార్టీని నమ్ముకుని ఇప్పటి వరకూ సేవ చేస్తే తనకు కాకుండా ఎవరో స్థానికేతరుడికి సీటు కేటాయించడం దారుణమంటూ పవన్ కల్యాణ్ను స్థానికేతరుడని పరోక్షంగా విమర్శించారు. తాను స్థానికుడినని పవన్ స్థానికేతరుడని చెబుతూ ఎవరి కోసమో తన సీటును బదలాయించడం చంద్రబాబు తీసుకున్న తప్పుడు నిర్ణయమని అన్నారు. కొవ్వూరులో జవ‘హరీ’ టీడీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కేఎస్ జవహర్కు అధిష్టానం మొండిచెయ్యి చూపించింది. కొవ్వూరు టికెట్టు తనకే కేటాయిస్తారని ఇన్నాళ్లూ ధీమాగా ఉన్న ఆయనకు పరాభవం తప్పలేదు. గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు కొవ్వూరు టికెట్టు ఖరారు చేయడం ఆయన కంగు తిన్నారు. కొవ్వూరులోని జవహర్ నివాసానికి ఆయన వర్గీయులు గురువారం పెద్ద ఎత్తున చేరుకున్నారు. చంద్రబాబుతో ఉన్న టీడీపీ ఫ్లెక్సీలు, బ్యానర్లు చించివేసి నిరసన తెలిపారు. కొవ్వూరు సహా 175 స్థానాల్లో వైఎస్సార్ సీపీ విజయకేతనం ఎగురవేయడం ఖాయమంటూ పలువురు టీడీపీ పార్టీ కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. రోడ్డుపై టైర్లు తగులబెట్టారు. సీటు దక్కకపోవడంతో జవహర్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. కనీసం జిల్లాలో ఎక్కడో ఒకచోట సర్దుబాటు చేస్తారన్న ఆశ కూడా పోయింది. దీంతో జవహర్ వర్గీయులు అధిష్టానం తీరుపై అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. టికెట్పై ఎటువంటి సానుకూల స్పందనా రాకపోవడంతో జవహర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అనంతరం జవహర్ మీడియాతో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ తాను కొవ్వూరు నుంచే పోటీ చేస్తానని ప్రకటించడం టీడీపీలో ప్రకంపనలు రేపుతోంది. గత ఎన్నికల్లో గోపాలపురంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి తలారి వెంకట్రావు చేతిలో ఘోర ఓటమి పాలైన ముప్పిడి వెంకటేశ్వరరావుకు కొవ్వూరు టికెట్టు ఖరారు చేసిన అధిష్టానంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. కొవ్వూరు టీడీపీ అభ్యర్థిగా ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రకటించిన తొలి రోజే గ్రూపు రాజకీయాలు భగ్గుమనడం, జవహర్ వర్గీయులు నిరసనలకు దిగడంతో టీడీపీ శ్రేణుల్లో అయోమయంలో పడ్డారు. టీడీపీ నేత పెండ్యాల అచ్చిబాబు, ద్విసభ్య కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, కంఠమణి రామకష్ణలు చంద్రబాబును మంగళవారం రాత్రి కలిసి, అభ్యర్థిని ఖరారు చేశారు. డబ్బు మూటలకు అధిష్టానం అమ్ముడుపోయిందని పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలువురు నాయకులు ఇప్పటికే పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారు. భగ్గుమన్న కొమ్మాలపాటి వర్గం పల్నాడు జిల్లా పెదకూరపాడు స్థానం భాష్యం ప్రవీణ్కు కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కొమ్మాలపాటి శ్రీధర్ అనుచరులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. టికెట్ కొమ్మాలపాటికే కేటాయిస్తారని ముందుగా గుంటూరులోని ఆయన నివాసానికి గురువారం ఉదయం అనుచరులు భారీగా చేరుకుని స్వీట్లు, బాణసంచా సిద్ధం చేసుకున్నారు. చివరికి టికెట్ భాష్యం ప్రవీణ్కు కేటాయిస్తున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా కొమ్మాలపాటి శ్రీధర్ వర్గీయులు ఆందోళన చేపట్టారు. ఈ సమయంలో భాష్యం ప్రవీణ్ కొమ్మాలపాటి ఇంటికి చేరుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అచ్చంపేటకు చెందిన టీడీపీ కార్యకర్తలు ప్రవీణ్పై ఆగ్రహాం వ్యక్తం చేశారు. టికెట్ కేటాయించకముందే నియోజకవర్గంలో ప్లెక్సీలు, వాల్పోస్టర్లుతో హడావుడి ఎందుకు చేశారు అని ప్రశ్నించారు? స్థానికేతరుడు అంటూ నినాదాలు చేశారు. దీంతో ప్రవీణ్ కూడా టీడీపీ కార్యకర్తలపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. మీకెందుకు ఏమైనా ఉంటే మేము మేము చూసుకుంటాం.. మీరెవ్వరు అంటూ గట్టిగా అరవడంతో కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. టికెట్ దక్కకపోవడం పట్ల కొమ్మాలపాటి తన ముఖ్య అనుచరుల వద్ద జరిగిన అన్యాయంపై వాపోయారట. వరుసగా నాలుగు పర్యాయాలు పెదకూరపాడులో టీడీపీ ఓడిపోతూ అభ్యర్థులు కరువైన సమయంలో 2009లో అభ్యర్థిగా పోటీ చేసి గెలిచానని, పార్టీ కోసం 18 సంవత్సరాలు కష్టపడితే ఇదేనా నాకు దక్కిన గౌరవం అంటూ ఆవేదన చెందారట. పార్టీ కోసం ఎంతో డబ్బు ఖర్చు చేసినా చంద్రబాబు కనీసం పిలిచి మాట్లాడకపోవడం అన్యాయమన్నారట. నియోజకవర్గ ప్రజలకు కతజ్ఞతలు తెలిపి శ్రీధర్ హైదరాబాద్ వెళ్లిపోయారు. పెనమలూరు టీడీపీలో టికెట్ రచ్చ కష్ణా జిల్లా పెనమలూరు టీడీపీలో టికెట్ రచ్చ తార స్థాయికి చేరింది. అక్కడ టీడీపీ ఇన్చార్జి బోడె ప్రసాద్కు సీటు నిరాకరించడంపై ఆ పార్టీ శ్రేణులు అధిష్టానాన్ని దుమ్మెత్తి పోశాయి. అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మండల పార్టీ అధ్యక్షులు నుంచి బూత్ కన్వినర్ల వరకూ రాజీనామాలు చేస్తామని ప్రకటించారు. ఓ కార్యకర్త ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునే యత్నం చేశాడు. సీటు బోడెకు కాని పక్షంలో స్థానికులకు ఇవ్వాలని, దిగుమతి నేతలను ఒప్పుకునేది లేదంటున్నారు. చంద్రబాబు కుటుంబం మినహా వేరెవరు పోటీ చేసినా తాను కూడా పోటీ చేస్తానని కరాఖండీగా చెప్పారు. ఈ విషయంపై అధిష్టానంతో తేల్చుకుందామని శ్రేణులకు సూచించారు. తాను టీడీపీ పార్టీకి ఎనలేని కషి చేశానని, తనకు అసెంబ్లీ టికెట్ ఇవ్వనందున టీడీపీ బీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఐవీఆర్ఎస్ సర్వేలో తనకు అనుకూలంగా ఉన్న టికెట్ ఇవ్వకుండా ఎందుకు నిరాకరించారో తెలియటం లేదన్నారు. నాలుగున్నర ఏళ్లుగా పార్టీ కార్యక్రమాలు అన్ని విజయవంతం చేశానని, తనను మేకను బలిచ్చినట్లు బలిస్తే ఊరుకునేది లేదన్నారు. తనను టీడీపీ బహిష్కరించినా చంద్రబాబునాయుడు ఫోటో పెట్టుకోని టీడీపీ బీ అభ్యర్థిగా పోటీ చేస్తానని అన్నారు. చివరి వరకు చంద్రబాబు, లోకేశ్ ఆశీస్సులు ఉంటాయని భావిస్తున్నానని అన్నారు. సీటు తనకే వస్తుందన్న ధీమాతో ఉన్న బోడెకు సీటు లేదని అధిష్టానం తేల్చిచెప్పేసింది. బోడె ఇసుక అక్రమ తవ్వకాలు, మట్టి విక్రయాలను ప్రోత్సహించారనే అభియోగాలున్నాయి. దొంగ పరీక్ష కేసులు, కాల్మనీ, సెక్స్రాకెట్ విమర్శలు బురదలా అంటుకున్నాయి. వీటికి తోడు కార్యకర్తలను కలుపుకుని వెళ్లటంలో వైఫల్యం చెందారన్నది మరో కారణం. ప్రధానంగా పార్టీలో నెలకొన్న వర్గపోరు గెలుపు ఓటములపై ప్రభావం పడుతుందని టీడీపీ అధిష్టానం గుర్తించింది. మిత్రపక్షమైన జనసేనలోని వర్గాలతోనూ సఖ్యత లేదన్న ప్రచారం లేకపోలేదు. పెందుర్తిలో కార్యకర్తల తీవ్ర నిరసన పెందుర్తిలో బండారుకు టీడీపీ టికెట్ కేటాయించకపోవడంపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు గురువారం తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సబ్బవరం, పెందుర్తి, పరవాడ మండలాల నుంచి అధిక సంఖ్యలో తరలిరావడంతో వెన్నలపాలెంలోని బండారు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పలువురు నాయకులు, కార్యకర్తలు రాజీనామా చేస్తామని ప్రకటించారు. తీవ్ర మనస్తాపంలో గండి బాబ్జీ విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిసింది. రెండో జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. బాబ్జీ విశాఖ దక్షిణ లేదా మాడుగుల నుంచి టికెట్ ఆశించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ–జనసేన–బీజేపీ పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడం, మాడుగుల టికెట్ను తెలుగుదేశం పార్టీ పైల ప్రసాద్కు కేటాయించడంతో గండి బాబ్జీకి అవకాశం దక్కలేదు. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్టు సమాచారం. రంపచోడవరంలో ఆగ్రహ జ్వాలలు రంపచోడవరం టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఆపార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మిరియాల శిరీషాదేవి పేరు ప్రకటించడంతో టీడీపీ నాయకులు వర్గాలుగా విడిపోయారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి కాకుండా పైరవీలు చేసిన వారికి టికెట్ ఇవ్వడం అన్యాయమని వారంతా ధ్వజమెత్తారు. గురువారం రంపచోడవరంలో మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి నివాసంలో టీడీపీ నాయకులు సమావేశమయ్యారు. అనంతరం వంతల రాజేశ్వరికి టీడీపీ టికెట్ ఇవ్వాలని రోడ్డుపై నిరసనకు దిగారు. టికెట్ విషయంలో నియోజకవర్గంలో ఎవరిని సంప్రదించకుండా ఆమెకు టికెట్ ఏవిధంగా ఇచ్చారని మండిపడ్డారు. ఐదేళ్లపాటు కష్టపడి తిరిగిన వంతల రాజేశ్వరికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరించారు. అభ్యర్థి ఎంపికలో టీడీపీతో సంబంధం లేని మాజీ ఎంపీ పెత్తనమేంటని వారు ధ్వజమెత్తారు. టీడీపీలో కష్టపడి పనిచేసిన వారికి న్యాయం జరగదు అనడానికి ఈ పరిణామమే ఒక ఉదాహరణ అన్నారు. పార్టీ అధిష్టానంతో అమీతుమీ తేల్చుకునేందుకు వంతల రాజేశ్వరి నాయకత్వంలో పార్టీ శ్రేణులు శుక్రవారం విజయవాడ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. టికెట్ విషయంలో మార్పు లేకపోతే పార్టీ కోసం పనిచేసేది లేదని వారు బహిరంగంగా చెబుతున్నారు. మరోవైపు శిరీషా దేవి పేరు ప్రకటించిన వెంటనే రంపచోడవరం నుంచి గెద్దాడ వరకు ఉన్న ఆమె ఫ్లెక్సీలను కొంతమంది చింపేశారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు శీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నం బాబురమేష్ స్తబ్ధతగా ఉన్నారు. వీరు టికెట్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బీసీలకు చంద్రబాబు ద్రోహం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె టీడీపీ నేతలు మండిపడ్డారు. టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డిపై మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గీయుల వ్యతిరేకత తీవ్రస్థాయికి చేరుకుంటోంది. పదిరోజులుగా ఆందోళనలతో నిరసనలు వ్యక్తం చేస్తున్న శంకర్ వర్గం టీడీపీ శ్రేణులు గురువారం చంద్రబాబుకు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో గళమెత్తారు. నియోజకవర్గంలోని బి.కొత్తకోట, కురబలకోట, పెద్దమండ్యం మండలాల్లో రోడ్లపైకి వచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబుపై మండిపడ్డారు. రోడ్లపై రాస్తారోకోలు నిర్వహించి అభ్యర్థి జయచంద్రారెడ్డిని తప్పించాలని, శంకర్కు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేసారు. బీసీలపై మాటలకే పరిమితమని చంద్రబాబు నిర్ణయం బట్టి స్పష్టమైందని నాయకులు పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఐదేళ్లు పార్టీకోసం శ్రమించిన శంకర్ను నమ్మించి నట్టేట ముంచేసిన చంద్రబాబు తప్పును సరిదిద్దుకోవాలని కోరారు. లేనిప„ýక్షంలో తంబళ్లపల్లెలో టీడీపీకి పుట్టగతులు లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఉమ్మడిచిత్తూరుజిల్లాలో ఉన్న ఏకైక బీసీ నాయకుడు శంకర్కు టికెట్ లేకుండా చేయడం బీసీలకు ద్రోహం చేయడమేనని ప్రశ్నించారు. సర్వేల్లో పదిశాతానికి మించి మద్దతు పొందని జయచంద్రారెడ్డిని ఎలా ఎంపిక చేసారని నిలదీశారు. బీసీలకు న్యాయం చేసేలా శంకర్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించకపోతే పార్టీని ఓడించి సత్తా చాటుతామని హెచ్చరించారు. పోల్ మేనేజ్మెంట్ కన్వినర్ కుడుం శ్రీనివాసులు, పెద్దమండ్యం మండల కన్వినర్ జిట్టా వెంకటరమణ, పెద్దతిప్పసముద్రంలో కట్టా సురేంద్రనాయుడు, ఈశ్వరప్ప, కురబలకోటలో లక్ష్మణ్, తిమ్మయ్య ఆధ్వర్యంలో ఈ ఆందోళనలు జరిగాయి. రగులుతున్న మంత్రాలయం మంత్రాలయం టికెట్ తిక్కారెడ్డికి కాకుండా ఇటీవలే పార్టీలోకి వచ్చిన ఎన్.రాఘవేంద్రరెడ్డికి ప్రకటించడంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కోసిగి మండల కేంద్రంలో తిక్కారెడ్డి అనుచరులు టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేశారు. పన్నెండేళ్లు శ్రమించినా తిక్కారెడ్డికి టిక్కెట్ కేటాయించలేదని వారు వాపోతున్నారు. టికెట్ కేటాయింపులో అన్యాయం జరిగిందని నాయకుల్లో అసంతృప్తి జ్వాలలు ఎగసి పడుతున్నాయి. చంద్రబాబు నిర్ణయంపై అనుచరవర్గం మండిపడుతున్నారు. బాలనాగిరెడ్డి టీడీపీని వీడిన తర్వాత పార్టీకి నాయకత్వం కరువైన సమయంలో తిక్కారెడ్డి పార్టీ బాధ్యతలు చేపట్టారు. టీడీపీ క్యాడర్, కార్యకర్తలను కాపాడుకుంటూ పార్టీ కోసం శక్తివంచన లేకుండా శ్రమించారు. దాదాపు 12 ఏళ్లుగా పార్టీ మనుగడకు తనవంతు కృషి చేశారు. 2019 ఎన్నికల్లోనూ ఖగ్గల్ గ్రామంలో ప్రవేశించగా సొంత గన్మెన్ల కాల్పుల్లో కాలితొడ భాగంలో బుల్లెట్లు దిగి గాయపడ్డారు. స్ట్రెచర్ పైనే ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయనకు మొండి చేయి ఎదురవడంతో పార్టీ శ్రేణులు రగిలిపోతున్నారు. తిరుపతిలో లోకల్.. నాన్ లోకల్ వార్! రెండు రోజుల క్రితం తిరుపతి అభ్యర్థిగా చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ పేరును ఖరారు చేసినట్లు పవన్ కళ్యాణ్ మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ పరిణామాన్ని తిరుపతి టీడీపీ, జనసేన నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. చిత్తూరుకు చెందిన నాన్ లోకల్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు సీటు ఇవ్వడానికి వీల్లేదంటున్నారు. ఆరు నెలల కిందటే జనసేనతో పొత్తు ఉంటుందన్న సమాచారంతో తిరుపతి సీటును జనసేనకే కేటాయిస్తారనే అంచనాలు మొదలయ్యాయి. అయితే తిరుపతిలో అధికార పార్టీ అభ్యర్థిని జనసేన నాయకులు ఢీ కొనలేరన్న అభిప్రాయం వ్యక్తం అయ్యింది. ఈ పరిస్థితుల్లో తిరుపతి సీటు టీడీపీకే దక్కుతుందనే ప్రచారం జరిగింది. ఈలోపు సీట్ల సర్దుబాటు జరగడంతో తిరుపతి సీటు జనసేనకు కేటాయించారు. ఎలాగైనా చిత్తూరు నుంచే పోటీ చేయాలని భావించిన ఆరణి టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడ టికెట్ నిరాకరించడంతో జనసేన కండువా కప్పుకుని తిరుపతి టికెట్ కోసం భారీగా ముడుపులు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే పవన్ ఆరణిని తిరుపతి జనసేన అభ్యర్థిగా ఖరారు చేశారని ప్రచారం జరుగుతోంది. దీంతో టీడీపీ, జనసేన నాయకులు ఏకమై జనసేన అధినేతకు హెచ్చరికలు పంపారు. -
ఆగ్రహ‘సేన’
సాక్షి, అమరావతి/కడియం/గోకవరం/అమలాపురం/అంబాజీపేట: పొత్తులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు విదిల్చిన 24 సీట్లను తీసుకునేందుకు అంగీకరించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు. రోడ్లపైకి వచ్చి నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. దీంతో ఈనెల 24న సీట్ల ప్రకటన తర్వాత హైదరాబాద్ వెళ్లిన ఆయన అక్కడే ఉండిపోయారు. శ్రేణులకు ముఖం చాటేశారు. దీంతో జనసేన పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం చల్లారడం లేదు. నాలుగు రోజులుగా నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలోనూ పవన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం పలుచోట్ల ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం టీడీపీ అభ్యర్థి మహాసేన రాజేష్ నిర్వహించిన టీడీపీ–జనసేన సమన్వయ కమిటీ సమావేశం రసాభాసగా మారింది. అంబాజీపేటలో జరిగిన ఈ సమావేశాన్ని జనసేన కార్యకర్తలు ముట్టడించి వీరంగం సృష్టించారు. కుల్చిలను, బల్లలను గాల్లోకి ఎగరేశారు. టీడీపీ అమలాపురం పార్లమెంట్ ఇన్చార్జి గంటి హరీష్ కారు అద్దాలు ధ్వంసం చేశారు. గతంలో సోషల్ మీడియా వేదికగా జనసేన నాయకులు, కార్యకర్తలను బూతులు తిట్టిన రాజేష్కు మద్దతు తెలిపేది లేదని తేల్చిచెప్పారు . ఈ విషయంమై గంటి హరీష్ ను రెండు రోజుల క్రితం పి.గన్నవరంలో జనసేన నాయకులు నిర్బంధించారు. రాజేష్ అభ్యర్థిత్వాన్ని టీడీపీ శ్రేణులూ అంగీకరించడం లేదు. దీంతో అధిష్టానం సూచనతో రాజేష్ సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గాల జోనల్ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు ఆధ్వర్యంలో అంబాజీపేట వాసవీ కన్యకాపరమేశ్వరీ కల్యాణ మంటపంలో జరిగిన సమావేశపు హాలులోకి జనసైనికులు దూసుకువచ్చి ‘రాజేష్ గో బ్యాక్’ అని నినాదాలు చేశారు. టీడీపీ నాయకులతో వాగ్వావాదానికి దిగడంతో గలాభా సృష్టించారు. పోలీసుల రంగప్రవేశంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం రంగారావు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ, జనసేన పార్టీల శ్రేణుల నుంచి సేకరించిన అభిప్రాయాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళతానన్నారు. చివరకు హరీష్ మాట్లాడుతూ ‘నా కారు అద్దాలు పగల కొట్టారా? ఆ విషయం నా దృష్టికి రాలేదే’అని చెప్పడం కొసమెరుపు. కాకినాడ జిల్లా జగ్గంపేట సీటును టీడీపీకి కేటాయించడాన్ని నిరసిస్తూ అక్కడి జనసేన ఇన్చార్జి పాఠంశెట్టి సూర్యచంద్ర తన కుటుంబ సభ్యులతో కలిసి నాలుగు రోజులుగా ఆమరణ దీక్ష కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయినా పొత్తు ధర్మంగా కనీసం టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ జనసేన నాయకుల వద్దకు రాకపోవడాన్ని జనసైనికులు తప్పుబడుతున్నారు. నెహ్రూకు ఎట్టిపరిస్థితుల్లోనూ సహకరించేది లేదని సూర్యచంద్ర స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నెహ్రూ, ఆయన తనయుడు నవీన్ తీరును తప్పుబట్టారు. తమను పాలేరుల్లా చూస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గ సీటును టీడీపీకి కేటాయించనున్నారన్న ప్రచారం నేపథ్యంలో మంగళవారం జనసేన నాయకులు కడియం నుంచి రాజమండ్రి బస్టాండ్ వరకు పాదయాత్ర నిర్వహించారు. సీటును జనసేన నేత కందుల దుర్గేష్కే కేటాయించాలని డిమాండ్ చేశారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట సీటును టీడీపీకి కేటాయించడాన్ని నిరసిస్తూ స్థానిక జనసేన ఇన్చార్జి బండారు శ్రీనివాసరావు మంగళవారం జరిగిన టీడీపీ–జనసేన ఉమ్మడి సమావేశానికి దూరంగా ఉన్నారు. -
సందేశ్ఖాలీలో పెల్లుబికిన నిరసనలు
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ షేక్, సోదరుడు సిరాజ్, వారి అనుచరులు తమపై లైంగిక దాడులకు పాల్పడి భూములను లాక్కున్నారంటూ పశి్చమబెంగాల్లోని సందేశ్ఖాలీలో కొద్దిరోజులుగా మహిళలు చేస్తున్న నిరసనలు మరింత ఎక్కువయ్యాయి. సందేశ్ఖాలీలోని ఝుప్ఖాలీ ప్రాంతంలోకి పోలీసులు రాకుండా ఆందోళనకారులు రోడ్లుపై దుంగలతో నిప్పుపెట్టారు. తృణమూల్ కాంగ్రెస్ నేతల ఆస్తులను తగలబెట్టారు. ఇన్నిరోజులైనా షాజహాన్, అతని అనుచరులను అరెస్ట్చేయకపోవడంపై పోలీసుల నిర్లిప్త వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. బెల్మాజూర్ దగ్గరి ఫిషింగ్యార్డ్ నిర్మాణాలను తగలబెట్టారు. పోగొట్టుకున్న భూములు, గౌరవాన్ని తిరిగి పొందేందుకు, పోలీసుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ ఆందోళనలు చేపట్టామని స్థానికులు చెప్పారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. ఆందోళనలను అడ్డుకున్న పోలీసులు కొందరిని అరెస్ట్చేసి తీసుకెళ్లేందుకు ప్రయతి్నంచగా మహిళలు పోలీసు వాహనాలకు అడ్డంగా పడుకున్నారు. ‘షాజహాన్ను అరెస్ట్చేసే దమ్ములేని మీరు మా వాళ్లను ఎలా తీసుకెళ్తారు? మా మనుషుల అండలేకుండా మాకు రక్షణ ఎలా ఉంటుంది?’ అని ఒక మహిళ పోలీసులను నిలదీసింది. దీంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. -
ఆగ్రహంతో రగిలిపోతున్న గూగుల్ ఉద్యోగులు.. కంపెనీకి చుక్కలు!
ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్పై ఆ కంపెనీ ఉద్యోగులు అసంతృప్తి, ఆగ్రహాలతో రగిలిపోతున్నారు. ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని గూగుల్ ఇటీవల ప్రకటించిన లేఆఫ్ల్లో సుమారు 15,000 మందిని తొలగించింది. ఈ తొలగింపులను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ జనవరి 18న యునైటెడ్ స్టేట్స్లోని ఐదు గూగుల్ క్యాంపస్లలో నిరసన ప్రదర్శనలను నిర్వహించింది. తొలగింపులను సమర్థించుకోవడానికి కంపెనీ చెబుతున్న కారణాలను బోగస్గా పేర్కొంటూ వాటిని సవాలు చేయడం ఈ నిరసనల లక్ష్యం అని బిజినెస్ ఇన్సైడర్ నివేదించింది. అసంతృప్త ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్.. గత సంవత్సరంలో తొలగింపుల వల్ల దాదాపు 15,000 మంది ఉద్యోగులపై ప్రభావం పడినట్లు వెల్లడించింది. ఇదే జనవరి 18న యూఎస్ అంతటా ఐదు గూగుల్ క్యాంపస్లలో నిరసనలు చేపట్టేందుకు యూనియన్ను ప్రేరేపించింది. లేఆఫ్ల కారణంగా కొంతమంది జాబ్స్ పోవడమే కాకుండా ఉన్న ఉద్యోగులపై ప్రభావం గురించి సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ కమ్యూనికేషన్కు నాయకత్వం వహించే స్టీఫెన్ మెక్ముర్ట్రీ ఆందోళన వ్యక్తం చేశారు. లేఆఫ్లు ఉద్యోగులపై పనిభారాన్ని పెంచడమే కాకుండా విస్తృతమైన ఆందోళనను కలిగిస్తున్నాయన్నారు. పెరుగుతున్న విమర్శలకు గూగుల్ ప్రతిస్పందిస్తూ తమ చర్యలు "కంపెనీ అతిపెద్ద ప్రాధాన్యతలు, రాబోయే ముఖ్యమైన అవకాశాలలో బాధ్యతాయుతంగా పెట్టుబడి పెట్టడం"లో భాగమని పేర్కొంది. సంస్థాగత మార్పులలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని తొలగింపులు ఉన్నట్లు చెబుతోంది. కంపెనీ లోపల, వెలుపల కొత్త ఉద్యోగాలు పొందడంలో బాధిత ఉద్యోగులకు సహాయం చేయడానికి నిబద్ధతతో ఉన్నట్లు గూగుల్ పేర్కొంటోంది. -
Russia: రష్యాలో పెద్ద ఎత్తున ఆందోళనలు.. కారణమిదే
మాస్కో: మైనారిటీ ఉద్యమ నేత ఫెయిల్ అల్సినోవ్కు మద్దతుగా రష్యాలో వందల మంది ఆయన మద్దతు దారులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. బాష్కోర్టోసాన్ ప్రాంతంలో అల్సినోవ్ కోసం భారీ సంఖ్యలో మద్దతుదారులు నిరసనకు దిగారు. వీరిలో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన నిరసనకారులు వెంటనే ఆందోళన విరమించాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఉన్నతాధికారులు హెచ్చరించారు. పోలీసులకు, నిరసనకారులకు వాగ్వాదం, తోపులాట జరుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్సినోవ్కు మద్దతుగా ఇది ఈ వారంలో ఆందోళకారులు చేసిన మూడవ నిరసన కావడం గమనార్హం. విద్వేషాలు రెచ్చగొట్టిన కేసులో అల్సినోవ్కు ఇటీవలే నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. బాష్కిర్ మైనారిటీ వర్గానికి అల్సినోవ్ ఒక హీరో. వారి భాష, సంస్కృతి కోసం అల్సినోవ్ తీవ్ర ఉద్యమం చేశాడు. బాష్కిర్ వర్గం వారు పవిత్రంగా భావించే కొండపై మైనింగ్ జరగకుండా 2020లో ఉద్యమం నడిపి విజయవంతమయ్యాడు. రష్యా అధ్యక్ష ఎన్నికలు మార్చిలో జరగనుండగా ఈ నిరసనలు జరుగుతుండటం గమనార్హం. In #Ufa, #Bashkortostan republic, #Russia, some 1,000 people joined a #protest rally in support of imprisoned activist Fail Alsynov; police are reportedly detaining protesters. pic.twitter.com/u0rn8HBchD — Alex Kokcharov (@AlexKokcharov) January 19, 2024 ఇదీచదవండి.. గాజాలో పేలిన యూనివర్సిటీ భవనం -
బెంగళూరులో టెన్షన్.. టెన్షన్
బెంగళూరు: కన్నడనాట మరోసారి భాష ప్రతిపాదిత ఆందోళనలు మొదలయ్యాయి. నేమ్ బోర్డులు ఇతర భాషల్లో ఉండడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. కెంపెగౌడ ఎయిర్పోర్టు ముందు కన్నడ సంఘాలు ఉద్యమం మొదలుపెట్టాయి. కొన్ని హోటల్స్పై దాడులకు దిగాయి. దీంతో బెంగళూరు అంతటా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎయిర్పోర్ట్ బయట కన్నడ కాకుండా(ನಾಮ ಫಲಕಗಳು ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತ್ರ) ఇంగ్లీష్, హిందీ భాషల్లో నేమ్ ప్లేట్లు ఉంచడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది కన్నడ రక్షా వేదిక. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఆందోళకు దిగింది. కెంపెగౌడ ఎయిర్పోర్ట్ బయట ఇతర భాషల నేమ్ బోర్డుల్ని ధ్వంసం చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారుల్ని నిలువరించి.. పరిస్థితి అదుపుచేసే యత్నం చేస్తున్నారు. #WATCH | Bengaluru: Kannada Raksha Vedhike holds a protest demanding all businesses and enterprises in Karnataka to put nameplates in Kannada. pic.twitter.com/ZMX5s9iJd0 — ANI (@ANI) December 27, 2023 ఈ మధ్యే యునెస్కో కెంపెగౌడ విమానాశ్రయానికి మోస్ట్ బ్యూటీఫుల్ ఎయిర్పోర్టుగా గుర్తింపు ఇచ్చింది. ఈలోపే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. మరోవైపు బెంగళూరు వ్యాప్తంగా హోటల్స్పైనా కన్నడ సంఘాలు దాడులకు దిగాయి. ఇంగ్లీష్లో నేమ్ ప్లేట్స్ ఉన్న హోటళ్లలోకి దూసుకెళ్లాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇదిలా ఉంటే.. దుకాణాలకు ఫిబ్రవరి చివరికల్లా కన్నడ భాషలో నేమ్ ప్లేట్స్ గనుక ఉండకపోతే చట్ట పరమైన చర్యలు తప్పవంటూ Bruhat Bengaluru Mahanagara Palike (BBMP) హెచ్చరించింది కూడా. -
పండుగ వేళ నిరసనల హోరు..వెలవెలబోయిన ఐకానిక్ క్రిస్మస్ ట్రీ!
క్రిస్మస్ వేడుకలతో హోరెత్తిపోవాల్సిన పాలస్తీనా నగరాలు నిర్వికారంగా మారాయి. అందులోకి క్రీస్తూ నడయాడిన ప్రాంతంగా పేరుగాంచిన పాలస్తీనా పర్యాటకుల సందడితో కళకళలాడాల్సిన వీధులన్నీ ముళ్లకంచెలు, శిథిలాలతో దర్శనమిస్తున్నాయి. కొందరు నిరసనకారులు యుద్ధానికి విరామం ప్రకటించి క్రిస్మస్ వేడకలకు అనుమతి ఇవ్వాలని వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేయడం గమనార్హం. అయితే వాటిని కూడా అధికారులు అడ్డుకుని దొరికిని వారిని దొరికినట్టుగా అరెస్టు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో శాన్ఫ్రాన్సిస్కోలో శనివారం పాలస్తీనాలో జరిగిన నిరసనల్లో ఒక నినాదం అందర్నీ ప్రముఖంగా ఆకర్షించింది. మారణహోమంలో ఎప్పటిలానే కిస్మస్ ఉండదు అనే నినాదం అందర్నీ ఆలోచింపచేసేలా ఉంది. ఈ నినాదాలతో యూనియన్ స్కేర్ వద్ద ఉన్న ప్రసిద్ధ ఐకానిక్ క్రిస్మస్ చెట్టు పైకి ఓ నిరసనకారుడు ప్లకార్డులు, జాతీయ జెండాతో పైకెక్కుత్తున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఇజ్రాయెల్ హామాస్ యుద్ధం కారణంగా వేడుకలును నిషేధించారు అధికారులు. దీంతో వేలామంది నిరసకారులు వ్యతిరేకిస్తూ రోడ్లమీదకు వచ్చి నిరసనలు చేశారు. అలానే క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా జరిగే యూనియన్ స్కేర్ వద్ద మరింతగ నిరసనలు జరిగాయి. అందులోనూ సుమారు 83 అడుగుల ఎత్తైన క్రిస్మస్ చెట్టువద్దకు పెద్ద ఎత్తున నిరసకారుల వచ్చారు. అందులో ఒక నిరసనకారుడు శనివారం మధ్యాహ్నాం రెండు గంటల ప్రాంతంలో ఆ చెట్టును ఎక్కుతూ నిరసనలు చేయడగమే గాక, అతనికి మద్దతు తెలుపుతూ మరికొంతమంది నిరసకారులు నిరసనలు చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో అల్లకల్లోలం, విధ్యంసానికి తెగబడిన అనేకమంది నిరసకారులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. Pro-Palestine protestor climbs on Christmas tree in Union Square, San Francisco pic.twitter.com/irUAdDgXep — Raw Reporting (@Raw_Reporting) December 24, 2023 నిజానికి హమాస్ మిలిటెంట్ల భరతం పట్టడమే లక్ష్యంగా గాజా స్ట్రిప్పై వైమానిక, భూతల దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ సైన్యం. దీన్ని ఓ సీక్రెట్ ఆపరేషన్లా చేపట్టి హమాస్ మిలిటెంట్లను తుదముట్టించడం లేదా బంధీలుగా పట్టుకోవడం చేయాల్సింది. ఇలా నేరుగా యుద్ధానికే తెగబడితే చాలావరకు సాధారణ పౌరులు, అమాయక ప్రజలే బలవ్వుతారు. ఎందరో అనాథలవుతారు. ఈ విధ్వసం అమాయక ప్రజలను బలిగొనడం కంటే జరిగే ప్రయోజనం శూన్యం. యుద్ధంతో దేన్ని నివారించలేం. దాని వల్ల కలిగే ప్రయోజనం కూడా ఏం ఉడదు. వెనుదిరిగి చూసినా.. లేదా ఆత్మ పరిశీలన చేసుకున్నా ఎందుకోసం ఈ యుద్ధం చేశాం అని అనిపించక మానదు. ఎవరు నష్టపోయారు? ఏం మిగిలింది? అంటే.. చెప్పేందుకు కూడా ఏం ఉండదు. తెలివైన వాడు ఎప్పుడు తనకు దెబ్బ తగలకుండా ప్రత్యర్థి ఆటను కట్టించగలగాలే గానే నేరుగా యుద్ధానికి కాలు దువ్వి తనని తన దేశాన్ని దెబ్బతినేలా చేయకూడదు. ప్రపంచ దేశాలన్నే ఈ విషయమే ఘంటా పథంగా చెబుతున్నా వినకుండా ముందుగా రష్యా ఉక్రెయిన్పై యుద్ధానికి సై అంది. ప్రపంచదేశాలన్ని నెత్తినోరుకొట్టుకుని చెప్పినా వినలేదు. చివరికీ జనాభా తగ్గి.. సైనం కొరత ఏర్పడి, నానా అగచాట్టు పడుతోంది రష్యా. అది మరవక మునుపై ఈ హామాస్ యుద్ధం. నిజానికి డిసెంబర్ నెల వచ్చేటప్పటికీ క్రిస్మస్ వేడుకలతో హోరెత్తాల్సిన పాలస్తీనా నగరం శిథిలా నగరంగా మారపోయింది. పర్యాటకుల సందడితో మంచి ఆదాయాలను ఆర్జిస్తూ ఉండాల్సిన టైం తనకు తానే ఆర్థిక పరిస్థితిపై గండి కొట్టుకునేలా చేసింది ఈ యుద్ధం. నిజానికి పాలస్తీనా హమాస్ మిలిటెంట్లను అంతం చేస్తుందా లేక తనకు తానుగా యుద్ధం పేరుతో ఆర్థిక పరంగా, అభివృద్ధిపరంగా వెనకబడిపోతుందా అనేది కాలం తప్పక తెలియజేస్తుంది. ఆ తర్వాత తప్పిదమని తెలుసుకున్నా.. చేయాల్సిందేముండదు. ఇది దేశ పరంగానే కాదు ఓ కుటుంబ పరంగానైనా సరే ఏ వివాదాన్నైనా సంయమనంతో సమస్యను క్లియర్ చేసుకుంటూ పోవాలే తప్ప యుద్ధోన్మాదంతో మాత్రం కాదు. (చదవండి: మగువ కన్నీళ్ల వాసన పురుషుడులోని దూకుడుతనాన్ని తగ్గిస్తుందా? పరిశోధనలో షాకింగ్ విషయాలు)
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
బేబీ హీరోయిన్ ఫోన్ కాల్.. 'లవ్ మీ' చెప్పాలంటూ హీరోను!
టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని
నన్ను భయపెట్టిన బౌలర్ అతడే: రోహిత్ శర్మ
విశాఖలో జూన్ 9న సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణం: మంత్రి బొత్స
హైదరాబాద్లో యూఎస్ఏఐడీ ఇండియా డైరెక్టర్
బ్లింకిట్ సీఈవోను కదిలించిన సామాన్యుడి తల్లి సూచన.. అదేంటంటే!
ఆ నొప్పి నరకం : ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి? పిల్లలు పుట్టరా?
వేడుకగా చెన్నకేశవస్వామి కల్యాణం
రోడ్డు ప్రమాదంలో తహసీల్దార్కు గాయాలు
ప్రజలకు తాటిపర్తి కృతజ్ఞతలు
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఇంకొక్కటి.. అలా అయితే టాప్-2లో సన్రైజర్స్! నేరుగా..
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement