-
దుమ్మురేపుతున్న ‘హీరామండి’.. భన్సాలీకి భారీ రెమ్యునరేషన్?
బాలీవుడ్లో భారీ చిత్రాలకు కేరాఫ్ సంజయ్ లీలా భన్సాలీ. ఆయన సినిమాలన్నీ భారీ బడ్జెట్తో తెరకెక్కినవే. ఎంత భారీగా ఖర్చు చేస్తాడో అంతకు మించిన కలెక్షన్స్ను రాబడతాడు. అందుకు ఆయన తెరెక్కించిన ‘బాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’ చిత్రాలే నిదర్శనం. తాజాగా ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తెరకెక్కించిన తొలి వెబ్ సిరీస్ ‘హీరామండి’. ప్రముఖ ఓటీటీ సంస్థ నెటిఫిక్స్లో ఈ భారీ వెబ్సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్తో ఈ వెబ్ సిరీస్ని తెరకెక్కించాడు భన్సాలీ. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల లాంటి భారీ తారాగణంతో పిరియాడిక్ డ్రామాగా ఈ వెబ్ సిరీస్ని రూపొందించాడు.(చదవండి: 'హీరామండి' వెబ్ సిరీస్ రివ్యూ) స్వాతంత్య్రానికి పూర్వం ‘హీరామండి’ వేశ్యా వాటికలో చోటు చేసుకున్న పలు సంఘటనల ఆధారంగా తెరక్కించిన ఈ వెబ్ సీరిస్ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో దూసుకెళ్తోంది. భన్సాలీ మేకింగ్పై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ సిరీస్ కోసం భన్సాలీ చాలా కాలంపాటు కష్టపడ్డారు. అందుకు తగ్గట్టే నెట్ఫ్లిక్స్ భారీ రెమ్యునేరేషన్ ఇచ్చిందట. ఈ వెబ్ సిరీస్ కోసం భన్సాలీ దాదాపు రూ. 70 కోట్ల వరకు పారితోషికంగా తీసుకున్నట్లు బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. అలాగే ఇందులో ప్రధాన పాత్రల్లో నటించిన ఆరుగురు హీరోయిన్లకు కూడా భారీగానే రెమ్యునరేషన్ అందింట. ఈ సిరీస్లో ఫరిదాన్ పాత్రను పోషించిన సోనాక్షి సిన్హాకు అత్యధికంగా రూ. 2 కోట్ల పారితోషికంగా అప్పగించిందట నెట్ఫిక్స్. అలాగే మల్లికా జాన్ పాత్రలో నటించిన మనిషా కొయిరాలాకి కోటి రూపాయలను రెమ్యునరేషన్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో మరో కీలక పాత్రను అదితిరావు హైదరి పోషించింది. ఇందుకుగాను ఆమె రూ. కోటిన్నర వరకు తీసుకుందట. అలాగే లజ్జోగా నటించిన రిచా చంద్దా రూ. 1 కోటి, వహిదాగా నటించిన సంజీదా షేక్ రూ. 40 లక్షలు, ఆలంజేబుగా నటించిన షర్మిన్ సెగల్ రూ. 35 లక్షలు పారితోషికంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. -
Coolie: రజనీకాంత్ రెమ్యునరేషన్ అన్ని వందల కోట్లా?
కాయకష్టం చేసుకుని బతుకును భారంగా ఈడ్చే వ్యక్తినే కూలీ అంటారు. అంతే కాకుండా డబ్బు కోసం ఎలాంటి పని చేసేవారినైనా కూలీనే అంటారు. వీటిలో నటుడు రజనీకాంత్ ఏ కోవకు చెందుతారో తెలియదు గానీ, ఇప్పుడు కూలీ పేరు మాత్రం నలుమూలలా మారుమ్రోగుతోంది. సినీ పరిశ్రమలో కూలీ టైటిల్ సక్సెస్కు అడ్రస్ అనుకుంటా. హిందీలో అమితాబచ్చన్ ఇదే పేరుతో చిత్రం చేసి సక్సెస్ అయ్యారు. ఇక తెలుగులో వెంకటేశ్ నటించిన కూలీ నెంబర్ 1 చిత్రం కూడా సూపర్హిట్ అయ్యింది. అలాగే తమిళంలోనూ నటుడు శరత్కుమార్ కూలీ పేరుతో చిత్రం చేశారు.తాజాగా ఇదే టైటిల్తో సూపర్స్టార్ రంగప్రవేశం చేస్తున్నారు. అవును ఈయన కథానాయకుడిగా నటిస్తున్న 171వ చిత్రానికి కూలీ అనే టైటిల్ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. స్టార్ దర్శకుడు లోకేకనకాజ్ తెరకెక్కించబోతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్లో నిర్మిస్తోంది. ఇందులో చాలా కాలం తరువాత నటి శోభన రజనీకాంత్ సరసన నటించబోతున్నారని, మరో ముఖ్యపాత్రలో క్రేజీ నటి శృతిహాసన్, బాలీవుడ్ స్టార్ నటుడు రణ్వీర్సింగ్ నటించనున్నారని ప్రచారం జరుగుతోంది.అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను ఇది వరకే విడుదల చేయగా అందులో రజనీకాంత్ గెటప్ను చూసి ఆయన అభిమానులు ఫిదా అయ్యారు. ఇక సమీప కాలంలో చిత్ర టైటిల్తోపాటు టీజర్ను విడుదల చేశారు. కూలీ టైటిల్, టీజర్లను చూస్తుంటే సరికొత్త రజనీకాంత్ను దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరపై ఆవిష్కరించనున్నారనేది సుస్పష్టం అవుతోంది. షూటింగ్ ప్రారంభానికి ముందే ఈ కూలీ ప్రకంపనలు సృష్టిస్తోంది.లోకేష్ కనకరాజ్కు తన చిత్రాల షూటింగ్ ప్రారంభానికి ముందే టీజర్ను విడుదల చేసి, సెన్సేషనల్ క్రియేట్ చేయడం ఆనవాయితీగా మారింది. ఆ మధ్య కమలహాసన్ హీరోగా చేసిన విక్రమ్ చిత్రం టీజర్లో ఆరంబిక్కలామా అనే డైలాగ్తో టీజర్ను రూపొందించి ఎగ్జైటింగ్కు గురి చేశారు. ఆ తరువాత విజయ్తో చేసిన లియో చిత్ర టీజర్లో బ్లడీ స్వీట్ అంటూ చిత్రంపై అంచనాలను పెంచేశారు.తాజాగా రజనీకాంత్ హీరోగా చేస్తున్న కూలీ చిత్ర టీజర్లో ఏది తప్పు? ఏది ఒప్పు అనే డైలాగ్ చోటు చేసుకుంటుంది. అంతే కాకుండా కూలీ చిత్రం గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథా చిత్రం అని, ఇందులో రజనీకాంత్ మరోసారి స్మగ్లర్గా నటిస్తున్నారని అర్థం అవుతోంది. ఇకపోతే ఇది కాస్ట్లీ చిత్రం అనడానికి మరో కారణం ఈ చిత్రం కోసం రజనీకాంత్ ఏకంగా రూ. 260 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు, అలాగే దర్శకుడు లోకేష్ కనకరాజ్ రూ.60 కోట్లు పారితోషికం పుచ్చుకుంటున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇదే గనుక నిజం అయితే దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకుడు లోకేష్కనకరాజ్నే అవుతారు. కాగా కూలీ చిత్రం జూన్ నెలలో సెట్ పైకి వెళ్లనుంది. కాగా ఈ చిత్ర టైటిల్ను ప్రకటించగానే నటుడు ధనుష్ తన ఎక్స్ మీడియాలో మాస్ అని పేర్కొనడం మరో విశేషం. -
నిమిషానికి రూ.1 కోటి సంపాదిస్తున్న బ్యూటీ.. త్రిష, నయనతార కాదండోయ్ (ఫోటోలు)
-
రామాయణ...సాయి పల్లవికి రికార్డ్ స్థాయి రెమ్యూనరేషన్..
-
'ఫ్యామిలీ స్టార్' కోసం విజయ్కి భారీ రెమ్యునరేషన్.. ఎన్ని కోట్లంటే..?
‘గీతగోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ, పరశురాం కాంబినేషన్లో తెరకెక్కుతున్న రెండో చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. మే 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేది దగ్గరపడడంతో ప్రమోషన్స్లో స్పీడ్ పెంచారు మేకర్స్. ఒకపక్క దిల్ రాజు, మరోపక్క విజయ్..ఇద్దరు సినిమా ప్రచారంలో బీజీ అయ్యారు. విజయ్కి ఈ సినిమా విజయం చాలా అవసరం. అందుకే ప్రమోషన్స్ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నాడు. తన తోటి హీరోలా సహాయం కూడా తీసుకుంటున్నాడు. ఏప్రిల్ 2న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్కి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్గా రాబోతున్నట్లు సమాచారం. అలాగే మీడియా ఫ్యామిలీస్తో కలిసి ఓ ఈవెంట్ కూడా నిర్వహించబోతున్నారు. ఇలా విభిన్నమైన పద్దతుల్లో ప్రచారం నిర్వహించి, సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా కోసం విజయ్ చేస్తున్న ప్రచారం చూస్తుంటే.. భారీగానే రెమ్యునరేషన్ పుచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడిదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. రూ. 50 కోట్ల బడ్జెట్ విజయ్ దేవరకొండ కెరీర్లో భారీ విజయం సాధించిన చిత్రాల్లో గీతగోవిందం మొదటి స్థానంలో ఉంటుంది. ఈ మూవీ తర్వాతనే అటు పరశురాం, ఇటు విజయ్ కెరీర్ ఊపందుకుంది. మళ్లీ చాలా కాలం తర్వాత వీరిద్దరి కలిసి చేస్తున్న సినిమా కావడంతో ‘ఫ్యామిలీ స్టార్’పై మొదటి నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టే నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఓవరాల్గా ఈ సినిమాకు రూ. 50 కోట్ల బడ్జెట్ అయిందని టాలీవుడ్లో టాక్ నడుస్తుంది. వర్కింగ్ డేస్ ఎక్కువ అవ్వడం వల్ల బడ్జెట్ పెరిగిందట. ‘ఖుషీ’ కంటే ఎక్కువే ఈ సినిమాకుగాను విజయ్ దేవరకొండ భారీగానే పారితోషికాన్ని పుచ్చుకున్నాడట. మొత్తంగా రూ. 15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇది గత చిత్రం ఖుషీ కంటే ఎక్కువ. ఖుషీ చిత్రానికి విజయ్ రూ.12 కోట్లు తీసుకున్నాడు. అయితే ఆ చిత్రం ఓ మోస్తరు విజయం మాత్రమే అందుకుంది. అంతకు ముందు వచ్చిన లైగర్ భారీ డిజాస్టర్ అయింది. అయినా కూడా విజయ్ మార్కెట్ పడిపోలేదు. అందుకే రూ. 15 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చేందుకు వెనుకాడలేదట దిల్ రాజు. ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే.. ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మధ్యకాలంలో సోలోగా రిలీజ్ అవుతున్న ఏకైక పెద్ద సినిమా ఇదే అని చెప్పొచ్చు. తొలుత తెలుగు, తమిళ్లో రిలీజ్ చేస్తున్నారు. రెండు వారాల తర్వాత హిందీలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రం ప్రిరిలీజ్ బిజినెస్ కూడా భారీగానే అయింది. అన్ని ఏరియాల్లో కలిసి రూ. 45 కోట్ల మేర బిజినెస్ చేసిందట. గీతగోవిందం రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన కారణంగానే విజయ్ ఫ్లాప్స్లో ఉన్నా.. భారీ స్థాయిలో ప్రీరిలీజ్ బిజినెస్ అయింది. -
రెమ్యునరేషన్ పెంచేసిన త్రిష.. నయనతార కంటే ఎక్కువే!
తమిళసినిమా: నటి త్రిష తన స్నేహితురాలు, లేడీ సూపర్స్టార్ నయనతారను దాటేసి నంబర్వన్ స్థానానికి చేరుకున్నారా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఇంతకుముందు వరకూ దక్షిణాదిలోనే నంబర్వన్ కథానాయకిగా నయనతార వెలుగొందారు. ఇప్పుటికీ ఆమె ఏ మాత్రం తగ్గలేదు. అయితే నటి త్రిష క్రేజ్ మాత్రమే బాగా పెరిగింది. అంతా దర్శకుడు మణిరత్నం పుణ్యమే అని చెప్పకతప్పదు. నటి త్రిష కెరీర్ పొన్నియిన్సెల్వన్ చిత్రానికి ముందు, ఆ తరువాత అని చెప్పాలి. ఈమె నటించిన హీరోయిన్ ఓరియన్టెడ్ కథా చిత్రాలు వరుసగా అపజయం కావడంతో గ్రాఫ్ పడిపోయింది. ఒక టైమ్లో చేతిలో చిత్రాలే లేకుండా పోయాయి. అలాంటి సమయంలో మణిరత్నం కరుణించడంతో పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో యువరాణి కందవై పాత్రలో నటించే అవకాశం వరించింది. అందులో నటి ఐశ్వర్యరాయ్ కూడా నటించారు. నిజం చెప్పాలంటే ఆమెను త్రిష డామినేట్ చేశారు. రాజసం ఒలకబోసిన త్రిష నటన అందరిని ఆకట్టుకుంది. ఆ చిత్రం సూపర్హిట్ అయ్యింది. అంతే త్రిష సెకండ్ ఇన్నింగ్కు ఆ చిత్రంతోనే బీజం పడింది. ఆ తరువాత విజయ్కు జంటగా లియో చిత్రంలో నటించారు. ప్రస్తుతం అజిత్కు జంటగా విడాముయర్చి, కమలహాసన్ సరసన థగ్స్ లైఫ్, తెలుగులో చిరంజీవికి జంటగా విశ్వంభర, మలయాళంలో మోహన్లాల్కు జంటగా రామ్, నివిన్బాలీ సరసన ఐడెంటిట్టీ అంటూ స్టార్స్ సరసన భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గోట్లో కూడా ఒక ప్రత్యేక పాట, కొన్ని కీలక సన్నివేశాల్లో నటిస్తున్నారు. కాగా లియో చిత్రంలో నటించడానికి రూ.6 కోట్లు పారితోషికం పుచ్చుకున్న త్రిష, ఇప్పుడు కమలహాసన్ సరసన నటిస్తున్న థగ్స్ లైఫ్ చిత్రం కోసం ఏకంగా రూ.12 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఇంత మొత్తంలో పారితోషికాన్ని నయనతార కూడా ఇప్పటి వరకూ పొందలేదు. దీంతో ఆమెను అధిగమించిన త్రిష ఇప్పుడు నంబర్వన్ స్థానానికి ఎగబాకారన్న ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
సెకనుకు రూ.7 లక్షలు.. తెలుగు హీరోలకంటే ఎక్కువే!
పైసా..పైసా.. మంచి స్క్రిప్ట్ ఉంటే సరిపోదు. దాన్ని క్వాలిటీగా తీయాలంటే పైసా కావాల్సిందే! అయితే సినిమా నిర్మించడం కంటే అందులో నటించినవారికి ఇవ్వాల్సిన పారితోషికాలే తడిసి మోపెడవుతున్నాయి. సినిమా బడ్జెట్ అంతా ఒకెత్తు.. స్టార్స్ రెమ్యునరేషన్స్ మరో ఎత్తు అన్నట్లు మారింది పరిస్థితి! ఈ మధ్య ప్రాంతీయ సినిమా పాన్ ఇండియా సినిమాగా మారడంతో ఇతర భాషా ఇండస్ట్రీల నుంచి సెలబ్రిటీలను తీసుకొస్తున్నారు. అలా బాలీవుడ్ స్టార్స్ సౌత్ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. హిందీలో కంటే కూడా ఇతరత్రా భాషల్లోనే భారీగా అందుకుంటున్నారు. బీటౌన్ చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. దక్షిణాది సినిమాల కోసం బాలీవుడ్ తారలు అందుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో చూసేద్దాం.. జాన్వీ కపూర్ దివంగత తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సాధారణంగా ఒక్కో సినిమాకు రూ.3 కోట్లు తీసుకుంటుంది. తెలుగులో ఈమె దేవర సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ మూవీ కోసం రూ.5 కోట్లు పుచ్చుకుంటోందట. రామ్చరణ్ సినిమా కోసం ఏకంగా రూ.6 కోట్లు అందుకోనున్నట్లు తెలుస్తోంది. సైఫ్ అలీఖాన్ తెలుగు సినిమా అనగానే జాన్వీ తన రెమ్యునరేషన్ డబుల్ చేసింది. సైఫ్ అలీ ఖాన్ అయితే ఓ అడుగు ముందుకేసి ఏకంగా మూడు రెట్లు డిమాండ్ చేస్తున్నాడు. దేవరలో విలన్గా నటిస్తున్నందుకు ఏకంగా రూ.13 కోట్లు తీసుకుంటున్నాడట! బాబీ డియోల్ బ్లాక్బస్టర్ మూవీ యానిమల్లో విలన్గా నటించినందుకుగానూ నటుడు బాబీ డియోల్ రూ.4 కోట్లు తీసుకున్నాడు. ప్రస్తుతం ఇతడు సూర్య 'కంగువా'లో నటిస్తున్నాడు. ఈ చిత్రం కోసం డబల్ అంటే ఎనిమిది కోట్లు తీసుకుంటున్నాడు. ఇమ్రాన్ హష్మీ ఇమ్రాన్ హష్మీ ఈ మధ్యే బాలీవుడ్లో తన రేటు పెంచేశాడు. దీంతో తెలుగులో కూడా అదే రెమ్యునరేషన్ కంటిన్యూ చేస్తున్నాడు. పవన్ కల్యాణ్ ఓజీ సినిమాకుగానూ ఇతడు రూ.7 కోట్లు డిమాండ్ చేశాడు. సంజయ్ దత్, రవీనా టండన్ సంజయ్, రవీనా.. ఇద్దరూ కేజీఎఫ్ సినిమాలో అద్భుత నటన కనబర్చారు. రవీనా పాత్ర చిన్నది కావడంతో ఆమె రూ.2 కోట్లతో సరిపెట్టుకుంది. కానీ కల్నాయక్(సంజయ్) తన పాత్రకు తగ్గట్లు రూ.10 కోట్లు అందుకున్నాడు. అజయ్ దేవ్గణ్, ఆలియా భట్ బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయిన ఆలియా భట్ ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో కనిపించింది. కాసేపు మాత్రమే ఉండే ఈ పాత్ర కోసం రూ.10 కోట్లు తీసుకుంది. అజయ్ దేవ్గణ్ స్వాతంత్య్ర సమరయోధుడిగా నటించాడు. సినిమా మొత్తంలో కేవలం ఎనిమిది నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు. ఇందుకుగానూ అతడు రూ.35 కోట్లు తీసుకున్నాడు. అంటే సెకనుకు రూ.7.2 లక్షలన్నమాట! ఈ లెక్కన పారితోషికం విషయంలో అందరికంటే అజయే ఎక్కువ అందుకున్నట్లు కనిపిస్తోంది. చదవండి: మహానటి స్థానంలో ప్రియమణి.. ఎందుకంటే? -
ఒక్క సినిమాతో ఫుల్ క్రేజ్.. పారితోషికం పెంచేసిన బ్యూటీ!
దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెతను ఈ తరం తారలు తు.చ తప్పకుండా పాటిస్తున్నారు. మలయాళ భామ మమితా బైజు సైతం ఇందుకు మినహాయింపు కాదు. ఈ 22 ఏళ్ల బ్యూటీ క్రేజ్ దక్షిణాది మొత్తం వ్యాపిస్తోంది. 2017లో నటిగా రంగప్రవేశం చేయగా.. ఈమె నటించిన కోకో, సూపర్ శరణ్య వంటి మలయాళ చిత్రాలు విజయం సాధించాయి. ఇటీవల ఈ అమ్మడు నటించిన ప్రేమలు మూవీ మలయాళంలోనే కాకుండా, తమిళం, తెలుగు భాషల్లోనూ అనూహ్య విజయాన్ని అందుకుంది. ఆ సినిమా నుంచి అవుట్ కాగా ఆ మధ్య బాలా దర్శకత్వంలో సూర్యకు జంటగా వణంగాన్ చిత్రంలో నటించడానికి కమిట్ అయ్యింది. అయితే అనివార్య కారణాల వల్ల సూర్య ఆ చిత్రం నుంచి వైదొలిగారు. తర్వాత మమితా బైజు కూడా ఆ చిత్రం నుంచి బయటకు వచ్చేసింది. దర్శకుడు బాలా తనను కొట్టారని, చాలా సార్లు తిట్టారని ఆరోపణలు చేసింది. ఈ సంఘటన కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఇది తన కెరీర్పై ఎక్కడ ప్రభావం చూపుతుందోనని భయపడిందో ఏమోకానీ వెంటనే మాట మార్చేసింది. దర్శకుడు బాలా ఎప్పుడూ కొట్టలేదని, ఆయన దర్శకత్వంలో నటించిన సమయంలో చాలా నేర్చుకున్నానని, ఇతర చిత్రాల కారణంగా వణంగాన్ చిత్రం నుంచి తప్పుకోవలసి వచ్చిందని కవర్ చేసింది. క్రేజీ హీరోయిన్గా.. ప్రస్తుతం ఈమె జీవీ.ప్రకాశ్కుమార్కు జంటగా రెబల్ చిత్రం ద్వారా కోలీవుడ్కు పరిచయం అవుతోంది. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, శుక్రవారం తెరపైకి రానుంది. తదుపరి నటుడు విష్ణువిశాల్కు జంటగా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ప్రేమలు మూవీ తెలుగులోనూ విడుదలై మంచి వసూళ్లను సాధిస్తోంది. దీంతో మమితా బైజు దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్గా మారనున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రేజ్ను క్యాష్ చేసుకుంటోంది బ్యూటీ. మరిన్ని అవకాశాలు వస్తుండటంతో ఈ అమ్మడు తన పారితోషికాన్ని పెంచేసినట్లు టాక్. ఇప్పటివరకు ఒక్క సినిమాకు రూ. 30 లక్షలు పుచ్చుకుందట. దాన్ని కాస్తా రూ.50 లక్షలు చేసిందని ప్రచారం నడుస్తోంది. చదవండి: తమన్నా..పెళ్లెప్పుడో? -
రెమ్యునరేషన్ డబుల్ చేసిన సమంత.. వామ్మో అన్ని కోట్లా?
కొన్నేళ్ల ముందు మయోసైటిస్ వ్యాధికి గురైన సమంత.. ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. అలా అని కొత్త సినిమాలేం చేయట్లేదు. ప్రస్తుతం యాడ్స్ చేస్తూ కాస్త బిజీగా ఉంది. మరోవైపు ఈమె అప్పుడెప్పుడో నటించిన ఓ వెబ్ సిరీస్.. త్వరలో రిలీజ్ కానుంది. సరే ఇదంతా పక్కనబెడితే సమంత రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు మరోసారి టాపిక్ వచ్చింది. ఏకంగా డబుల్ చేసిందనే టాక్ వినిపిస్తోంది. (ఇదీ చదవండి: 'నేను అందంగా లేనని తెలుసు'.. సమంత షాకింగ్ కామెంట్స్!) పదేళ్లకు పైగానే ఇండస్ట్రీలో ఉన్న సమంత.. దక్షిణాదిలో దాదాపు స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్లోనూ విలన్ తరహా పాత్రతో అందరికీ షాకిచ్చింది. ఆ సిరీస్ డైరెక్టర్స్ రాజ్-డీకే తీసిన 'సిటాడెల్' ఇండియన్ వెర్షన్లోనూ సమంత లీడ్ రోల్ చేసింది. అయితే ఇందులో చేసినందుకు గానూ ఏకంగా రూ.10 కోట్ల వరకు తీసుకుందట. సమంత ఇప్పుడు సినిమాలేం చేయనప్పటికీ.. కొత్తగా వచ్చే ప్రాజెక్టులకుగానూ ఒక్కో దానికి రూ.6 కోట్ల వరకు డిమాండ్ చేస్తోందట. అలానే ఒక్కో యాడ్కి రూ.1.5 కోట్ల వరకు పారితోషికం అందుకుంటోందట. మరి వీటిలో నిజానిజాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ నిజమైతే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా సమంత నిలుస్తుంది. (ఇదీ చదవండి: సమంత జనాల్ని పిచ్చోళ్లను చేస్తోంది... డాక్టర్ ఫైర్) -
Remuneration Details: ఈ టాలీవుడ్ భామల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
-
ప్రైవేట్ జెట్, రూ.100 కోట్ల లగ్జరీ బంగ్లా, యాడ్స్తో కోట్లు, ఎవరీ ‘తార’
ఇతర రంగాలతో పోలిస్తే చిత్ర పరిశ్రమలో పురుషుల డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. తెరమీద ఎలివేషన్లు, బీజీఏంలు హీరోల కున్నంతగా హీరోయిన్లకు ఉండవు. ఇక రెమ్యునరేషన్ల సంగతి సరే సరి. అయితే ఈ అడ్డుగోడల్ని బద్దలుకొట్టి చాలా కొద్దిమంది అయినా కథానాయకలుగా, డైరెక్టరులుగా తమ సత్తాచాటుకుంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు, బాక్సాఫీసు వసూళ్లతో మేమూ సూపర్ స్టార్లమే అని నిరూపించుకుంటున్నారు. డైరెక్టర్లు, నిర్మాతల ఫేవరెట్స్గా అవత రిస్తున్నారు. అలాంటి వారిలో భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటూ లేడి సూపర్ స్టార్గా పాపులర్ అయిన నయనతార ఒకరు. పార్ట్ టైమ్ మోడల్గా మొదలై, టెలివిజన్ ప్రెజెంటర్నుంచి స్టార్ హీరోయిన్గా ఎదిగిన తార నయనతార. స్టార్ హీరోలని మించిన ఫ్యాన్ ఫాలోయింగ్, అంతకుమించిన క్రేజ్తో నయనతారనా మజాకానా అనిపించుకుంటోంది. కరియర్లో కొన్ని ఎదురు దెబ్బలు తగిలినా డిజాస్టర్స్ వెక్కిరించినా వరుస సినిమాలతో ప్రేక్షకులను మదిలో స్టార్ హీరోయిన్గా ముద్ర వేసుకుంది. తాజాగా నయన్ 50 సెకన్ల యాడ్కు రూ. 5 కోట్ల రూపాయల దాకా వసూలు చేసిందన్న వార్త హాట్ టాపిక్గా నిలిచింది. పలు మీడియా కథనాల ప్రకారం నయనతార 50 సెకన్ల ఒక కార్పొరేట్ ప్రకటన కోసం ఏకంగా రూ. 5 కోట్లు వసూలు చేసిందట. అంతేకాదు నయనతార ప్రతీ మూవీకి రూ. 10 కోట్లు వసూలు చేస్తుందనే ప్రచారం కూడా ఉంది. అంతేకాదు ముంబైలో లగ్జరీ బంగ్లాతో సహా 4 విలాసవంతమైన ఇళ్లున్నాయి. రూ 100 కోట్ల విలువైన లగ్జరీ బంగ్లాలో భర్త విఘ్నేష్తో, ఇద్దరు ప్లిలలతో నివస్తోంది. ఇంకా ఖరీదైన కార్ల కలెక్షన్, లగ్జరీ ప్రైవేట్ జెట్స్కూడా నయన్, విఘ్నేష్ సొంతం. ఇటీవల ఇద్దరూ విడిపో బోతున్నారన్న వార్తలను కూడా ఖండించారు ఈ స్వీట్ కపుల్. కాగా గత ఏడాది అట్లీ దర్శకత్వంలో వచ్చి జవాన్ మూవీతో షారుఖ్తో కలిసి బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. యాక్షన్-ప్యాక్ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టేసింది. అయితే ఆమె నటించిన అన్నపూరణి చిత్రం మాత్రం వివాదంలోచిక్కుకుంది. ఈ వివాదంపై క్షమాపణలు చెప్పినప్పటికీ ఫలితం లేకపోయింది. -
ఆరేళ్లు తీసిన సినిమా.. స్టార్ హీరోకి నో రెమ్యునరేషన్.. కారణమదే
ఒకప్పటితో పోలిస్తే తెలుగు సినిమాలో చాలా మార్పులు వచ్చాయి. రొటీన్ కమర్షియల్ కథల్ని చాలావరకు పక్కనబెట్టి సమ్థింగ్ డిఫరెంట్ ఉండే మూవీస్ తీస్తున్నారు. అలా యంగ్ హీరో విశ్వక్ సేన్ చేసిన సినిమా 'గామి'. దాదాపు ఆరేళ్ల పాటు ఈ మూవీ కోసం పనిచేసిన విశ్వక్.. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అందుకు కారణమేంటనేది కూడా చెప్పాడు. విశ్వక్ సేన్.. అఘోరా పాత్రలో నటించిన సినిమా 'గామి'. ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గర నుంచే హైప్ క్రియేట్ చేస్తూ వచ్చిన ఈ మూవీ ట్రైలర్ తాజాగా రిలీజైంది. అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. హాలీవుడ్ సినిమాల రేంజులో ఉండటం చాలామందిని ఆశ్చర్యపరిచింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి కన్నడ హిట్ సినిమా.. అందులోనే స్ట్రీమింగ్) విశ్వక్ సేన్ ఇంకా హీరోగా పెద్దగా గుర్తింపు తెచ్చుకోని టైంలో అంటే 2018లో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. క్రౌడ్ ఫండింగ్ విధానంలో కేవలం రూ.25 లక్షల పెట్టుబడితో మాత్రమే ఈ మూవీ తీయాలనేది ప్లాన్. కానీ దాదాపు ఆరేళ్ల పాటు అడపాదడపా షూటింగ్ చేసుకుంటూ వచ్చారు. అయితే పనిచేసినందుకు డబ్బులు తీసుకుంటే.. మూవీ బడ్జెట్ పెరిగిపోద్ది అనే ఉద్దేశంతోనే తాను రెమ్యునరేషన్ తీసుకోలేదని విశ్వక్ సేన్ తాజాగా ప్రెస్ మీట్లో చెప్పాడు. అయితే 'గామి' కోసం రెమ్యునరేషన్ తీసుకోనప్పటికీ.. రిలీజ్ తర్వాత వచ్చే లాభాల్లో వాటా తీసుకుంటాడని సగటు ప్రేక్షకుడు మాట్లాడుకుంటున్నాడు. ఏదేమైనా ఆరేళ్ల పాటు ఓ సినిమా కోసం కష్టపడి పారితోషికం తీసుకోకపోవడమనేది ఆసక్తకర విషయమే. మార్చి 8న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుంది. (ఇదీ చదవండి: సీక్రెట్గా టాలీవుడ్ లేడీ విలన్ నిశ్చితార్థం.. 14 ఏళ్ల ప్రేమకథ) -
హనుమాన్ ఎఫెక్ట్.. రెమ్యునరేషన్ పెంచేసిన తేజ సజ్జ!
చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాలతో అలరించిన తేజా సజ్జా..ఇప్పుడు హీరోగానూ రాణిస్తున్నాడు. జాంబిరెడ్డి సినిమాతో హీరోగా అందుకున్నాడు తేజ. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని జాంబిరెడ్డి డైరెక్టర్ ప్రశాంత్ వర్మతోనే ‘హను-మాన్’ చేశాడు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. స్టార్ హీరోల సినిమాలను సైతం వెనక్కి నెట్టి బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది. తెలుగులోనే కాదు.. తమిళ్, హిందీ, మలయాళ భాషల్లోనూ ‘హను-మాన్’ మంచి వసూళ్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.. రికార్డు సృష్టించింది. ఇక హను-మాన్ మూవీ ఊహించిదాని కంటే ఎక్కువ విజయం సాధించడంతో అటు ప్రశాంత్ వర్మ.. ఇటు తేజ సజ్జ ఫుల్ జోష్లో ఉన్నారు. పలువురు బడా నిర్మాతలు ప్రశాంత్ వర్మకు అడ్వాన్స్లు ఇచ్చేస్తున్నారు. పారితోషికం కూడా భారీగా ఇస్తామని చెబుతున్నారు. మరోవైపు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్లుగా తేజ సజ్జ కూడా తన రెమ్యునరేషన్ని పెంచేశాడట. పారితోషికం అమాంతం పెంచేసిన తేజ సాధారణంగా హిట్ రాగానే హీరోలు తమ పారితోషికాన్ని కొంచెం కొంచెం పెంచేస్తారు. ఇక హను-మాన్ లాంటి భారీ హిట్ వస్తే మాత్రం దాన్ని డబుల్ చేస్తారు. ఇప్పుడు తేజ సజ్జ అదే చేశాడట. హను-మాన్ రిలీజ్ తర్వాత తేజతో సినిమా చేయడానికి పలువురు బడా నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కొంతమంది అడ్వాన్స్లు కూడా ఇచ్చారట. హిందీ నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నాయట. దీంతో తేజ తన పారితోషికాన్ని అమాంతం పెంచేశాడట. హను-మాన్ కోసం రూ. కోటి రెమ్యునరేషన్గా తీసుకున్న తేజ.. ఇప్పుడు రూ. 5 కోట్ల డిమాండ్ చేస్తున్నాడట. మరో హిట్ వస్తేనే.. హను-మాన్తో తేజ సజ్జ స్థాయి పెరిగింది.అందులో అనుమానమే లేదు. అయితే ఈ చిత్రం ద్వారా తేజ కంటే ఎక్కువగా ప్రశాంత్ వర్మకు పేరొచ్చింది. అతని పని తీరు పట్ల విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. కథను అద్భుతంగా తీర్చి దిద్దాడని మెచ్చుకున్నారు. ఈ చిత్రం అతని కెరీర్కు బాగా ప్లస్ అయింది. తేజ సజ్జని ఈ మూవీ పాన్ ఇండియా స్టార్గా మార్చింది. ఈ ఎఫెక్ట్ కచ్చితంగా తన తదుపరి సినిమాలపై ఉంటుంది. అతని నుంచి వచ్చే సినిమాలో ఏదో వైవిధ్యం ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తారు. వారి అంచనాలకు తగ్గట్లుగా తేజ సజ్జ కథలను ఎంచుకోకపోతే కెరీర్కే ముప్పు వస్తుంది. రాబోయే సినిమా హిట్ అయితే తేజ సజ్జ కెరీర్కు కొన్నాళ్ల పాటు ఢోకా ఉండదు. ప్రస్తుతం తేజ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పై కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత బెజవాడ ప్రసన్న-నక్కిన త్రినాధరావు కాంబినేషన్లో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. -
ప్రభాస్ డూప్కి షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?
పాన్ ఇండియా హీరో అనగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చే పేరు ప్రభాస్. 'బాహుబలి' సినిమాతో తెలుగు సినిమా గురించి ప్రపంచానికి తెలిసేలా రాజమౌళి చేస్తే.. హీరోగా చేసిన ప్రభాస్ అంతకు మించిన పాపులారిటీ సంపాదించాడు. మొన్నీమధ్యే 'సలార్'తో సక్సెస్ అందుకున్న డార్లింగ్.. త్వరలో 'కల్కి' మూవీతో రాబోతున్నాడు. ఫ్యాన్స్ అందరూ ఈ సినిమా మాట్లాడుకుంటున్న టైంలో ప్రభాస్ డూప్కి ఇచ్చే రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. ఇండస్ట్రీలో దాదాపు స్టార్ హీరోలందరికీ బాడీ డబుల్ లేదా డూప్ ఉంటారు. అంటే ఫైట్ సీన్స్లో కొన్నిచోట్ల హీరోల కనిపిస్తే.. వెనక నుంచి, సైడ్ నుంచి కనిపించే కొన్ని షాట్స్లో హీరోల పోలిన వ్యక్తులని పెట్టి మేనేజ్ చేస్తారు. అలా ప్రభాస్కి కిరణ్ రాజ్ అనే వ్యక్తి డూప్గా చేస్తుంటాడు. 'బాహుబలి' సినిమా తర్వాత కిరణ్ రాజ్ కాస్తంత పాపులరాటీ తెచ్చుకున్నాడు. కొన్ని ఇంటర్వ్యూల్లోనూ కనిపించాడు. (ఇదీ చదవండి: Bramayugam Review: ‘భ్రమయుగం’ మూవీ రివ్యూ) అయితే మిగతా హీరోల డూప్స్కి సదరు సినిమాల నిర్మాతలే రెమ్యునరేషన్ ఇస్తుంటారు. కానీ ప్రభాస్ మాత్రం తన సిబ్బందితో సహా ప్రతి ఒక్కరికి తానే జీతాలు చెల్లిస్తాడు. రీసెంట్గానే ఈ విషయం బయటకొచ్చింది. అలానే డూప్గా నటించే కిరణ్ రాజ్కి ఒక్కో చిత్రానికి గానూ దాదాపు రూ.30 లక్షలు పైనే ప్రభాస్ చెల్లిస్తాడట. కొన్నిసార్లు దీనకంటే ఎక్కువే ఇవ్వొచ్చని కూడా అంటున్నారు. అయితే డూప్కి రూ.30 లక్షలు ఇస్తున్నారనే రూమర్ అనేది ఒకవేళ నిజమైతే మాత్రం షాకింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది చోటామోటా హీరోలకు కూడా ఇంత రెమ్యునరేషన్ ఇవ్వకపోవచ్చు. అలా ఇప్పుడు ప్రభాస్ డూప్కి ఇస్తున్న రెమ్యునరేషన్ ఇదేనంటూ వైరల్ అవుతున్న ఓ విషయం.. ఇప్పుడు నెటిజన్స్ షాకయ్యేలా చేస్తోంది. (ఇదీ చదవండి: Anupama Remuneration: టిల్లు కోసం రెమ్యునరేషన్ పెంచేసిన అనుపమ..) -
'టిల్లు 2'లో అనుపమ గ్లామర్ షో..
అనుపమ పరమేశ్వరన్.. ఈ పేరు చెప్పగానే క్లాస్ లుక్స్, పద్ధతిగా ఉండే పాత్రలు గుర్తొస్తాయి. కానీ అదంతా మొన్నటివరకు అని చెప్పొచ్చు. ఎందుకంటే రీసెంట్గా 'డీజే టిల్లు 2' ట్రైలర్ రిలీజైన తర్వాత అందరికీ ఒక్క నిమిషం మతి పోయింది. ఎందుకంటే హీరో సిద్ధుతో ఓ సీన్లో ఘాటైన ముద్దు సీన్లో కనిపించింది. అలానే లుక్స్ అన్నీ కూడా హాట్గానే ఉన్నాయి. చూస్తుంటే అస్సలు తగ్గినట్లు కనిపించట్లేదు. అయితే ఇలా గ్లామర్ ట్రీట్ ఇవ్వడం కోసం రెమ్యునరేషన్ కూడా గట్టిగానే అందుకుంటోందట. కేరళ కుట్టి అనుపమ.. సొంత భాషలో తీసిన 'ప్రేమమ్' మూవీతో హీరోయిన్ అయిపోయింది. 'అఆ' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత 'శతమానం భవతి', ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే తదితర చిత్రాల్లో నటించింది. వీటన్నింటిలో కాస్త సంప్రదాయంగా ఉండే పాత్రల్లో కనిపించింది. కానీ ఎక్కడా గీత దాటినట్లయితే కనిపించలేదు. (ఇదీ చదవండి: క్షమాపణ చెప్పిన '12th ఫెయిల్' హీరో.. ఆ పోస్ట్ డిలీట్) కొన్నాళ్ల ముందు 'రౌడీ బాయ్స్' సినిమాలో నటించిన అనుపమ.. కొత్త కుర్రాడు ఆశిష్తో ముద్దు సన్నివేశాలు చేసి షాకిచ్చింది. దీని తర్వాత మళ్లీ కార్తికేయ 2, 18 పేజీస్ లాంటి సినిమాల్లో కాస్త నార్మల్గా కనిపించింది. ఇప్పుడు 'డీజే టిల్లు 2' పూర్తిగా రెచ్చిపోయింది. హాట్గా కనిపించడం, ఘాటైన లిప్ కిస్ సీన్స్ చేసింది. ఈ తరహా పాత్ర అనుపమకు తొలిసారి అని చెప్పొచ్చు. అయితే ఇప్పటివరకు ఒక్కో సినిమాకు రూ.కోటి నుంచి కోటిన్నర మధ్య రెమ్యునరేషన్ తీసుకుంటున్న అనుపమ.. 'టిల్లు స్వ్కేర్' కోసం మాత్రం రూ.2 కోట్ల వరకు పారితోషికం అందుకుందట. గ్లామర్ షో చేసినందుకు ఇదా అసలు కారణమని సినీ ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ ఈ మూవీ హిట్ అయితే ఇదే మొత్తాన్ని రెమ్యునరేషన్గా తీసుకోవాలని ఈ బ్యూటీ ఫిక్స్ అయిందట. మార్చి 29న 'డీజే టిల్లు 2' థియేటర్లలోకి రాబోతుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్స్టార్ సినిమా.. అనుకున్న టైమ్ కంటే ముందే!) -
రష్మిక రెమ్యునరేషన్పై క్రేజీ రూమర్.. స్పందించిన నేషనల్ క్రష్!
ఇండియన్ క్రష్ నటి రష్మిక మందన్న. నటిగా ఏడేళ్లలోనే కథానాయకిగా అనూహ్య స్థాయికి చేరుకున్న ఈ బ్యూటీ 2016లో ఓ కన్నడ చిత్రం ద్వారా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ బెంగళూరు భామ ఆ తరువాత మలయాళం, తెలుగు, తమిళం అంటూ బహుభాషల్లో అవకాశాలను అందుకుంది. ముఖ్యంగా టాలీవుడ్ ప్రేక్షకులు ఈమెను మోసేశారు. వరుసగా స్టార్ హీరోలతో జతకట్టి క్రేజీ హీరోయిన్గా ఎదిగిపోయారు. పుష్ప చిత్రం విజయం ఈమె కెరీర్ను మార్చేసింది. దెబ్బతో బాలీవుడ్ దృష్టిలో పడింది. అక్కడ తొలి చిత్రం గుడ్బై ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా, ఇటీవల విడుదలైన యానిమల్ చిత్రం విమర్శలను మూటకట్టుకున్నా, భారీ వసూళ్లను రాబట్టుకుంది. దీంతో రష్మిక మందన క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. సాధారణంగా ఒక్క హిట్ వస్తేనే తారలు తమ పారి తోషికాన్ని పెంచేస్తారు. అలాంటిది ఈ ఇండియా క్రష్ బ్యూటీ, సక్సెస్ఫుల్ కథానాయకి పారితోషికాన్ని పెంచకుండా ఉంటారా? ఏకంగా రూ.4 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తుందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇది నిజమా, కాదా అన్నది పక్కన పెడితే రష్మిక మాత్రం అంగీకరించడం లేదు. పైగా ఈ వార్త నిజమైతే బాగుండు అంటూ సైటెర్లు వేస్తోంది. ఏదేమైనా నిప్పు లేనిదే పొగరాదుగా అంటూ నెటిజన్లు ఆమైపె ట్రోలింగ్ చేస్తున్నారు. మొత్తం మీద రష్మికపై ఈ టాపిక్ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రష్మిక మందన్న నటిస్తున్న పుష్ప–2 , ద్విభాషా చిత్రం రెయిన్బో చిత్రాలపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. Says who I wonder 🤦🏻♀️.. after seeing all of this I think I should actually consider it.. and if my producers ask why.. then I’ll just say ‘media out there is saying this sir.. and I think I should live up to their words.. what do I do?’ 🤣🤦🏻♀️ — Rashmika Mandanna (@iamRashmika) February 6, 2024 -
Kalki 2898 AD: దీపికకు భారీ రెమ్యునరేషన్.. కెరీర్లోనే తొలిసారి!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో దీపికా పదుకొణె ఒకరు. ఒకవైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ బాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం వరస పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ బీజియెస్ట్ హీరోయిన్గా మారిపోయింది. ఇప్పటికే ఈ బ్యూటీ నటించిన పఠాన్, జవాన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాయి. ఈ మధ్యే ఫైటర్ మూవీతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఆమె ‘కల్కి 2898 AD’ సినిమాలో నటిస్తున్నారు.ప్రభాస్ హీరోగా నటిస్తున్న సైంటిఫిక్ ఫ్యూచరిస్ట్ ఫిల్మ్ ఇది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. దీపికాతో పాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్తో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో నటించేందుకు దీపికా భారీగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈ మూవీ కోసం దీపికాకు రూ.20 కోట్ల పోరితోషికం అప్పజెప్పారట మేకర్స్. దీపికా కెరీర్లో ఇదే అత్యధిక రెమ్యునరేషన్ అట. గతంలో ఒక్కో సినిమాకు రూ. 12-15 కోట్ల వరకు పారితోషికం తీసుకునేదట. ఈ చిత్రాకి ఎక్కువ కాల్షీట్లు కేటాయించాల్సి రావడంతో రూ.20 కోట్ల అడిగిందట. కీలక పాత్ర కావడంతో నిర్మాతలు కూడా దీపికా డిమాండ్కి ఓకే చెప్పారని బాలీవుడ్లో టాక్ నడుస్తోంది. వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వినీదత్ నిర్మిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ సినిమా మే 9న విడుదల కానుంది. -
రెమ్యునరేషన్ పెంచేసిన రష్మిక.. తెలుగులో ఈమెనే టాప్?
ప్రస్తుతం తెలుగులో వన్ ఆఫ్ ది ట్రెండింగ్ హీరోయిన్ రష్మిక. మంచో చెడో పక్కనబెడితే ఈమె గురించి జనాలు ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటారు. ఫన్నీ ట్రోల్స్ లాంటివి కూడా చేస్తుంటారు. మొన్నీ మధ్య ఈమె పెళ్లి గురించి వార్తలు రాగా అవి కేవలం రూమర్లే అని తేలిపోయాయి. ఇప్పుడు ఈ బ్యూటీ రెమ్యునరేషన్ గురించి ఓ విషయం బయటపడింది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అయిపోయింది. కన్నడ బ్యూటీ రష్మిక.. 'ఛలో' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మిడ్ రేంజ్ హీరోలతో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. అల్లు అర్జున్ 'పుష్ప' రిలీజ్ తర్వాత మాత్రం ఈమెకు పాన్ ఇండియా లెవల్లో ఫేమ్ వచ్చింది. ఈ క్రమంలోనే దక్షిణాదితోపాటు హిందీలోనూ నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. (ఇదీ చదవండి: అందుకే ఇన్నేళ్ల తర్వాత బిడ్డకు జన్మనిచ్చాం: ఉపాసన) రష్మిక ప్రస్తుతం తెలుగులో 'పుష్ప 2'తో పాటు 'గర్ల్ ఫ్రెండ్' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలోనూ నటిస్తోంది. అయితే వీటిలో చేస్తున్నందుకు గానూ రూ.3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోందని సమాచారం. కానీ కొత్తగా అంగీకరించిన ఓ మూవీ కోసం మాత్రం రూ.4 కోట్ల వరకు డిమాండ్ చేసిందట. ఇప్పుడీ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది. ఎందుకంటే ఇప్పటివరకు సమంత, అనుష్క, పూజాహెగ్డే తదితరులు రూ.3 కోట్ల రెమ్యునరేషన్ వరకు వచ్చారు కానీ అంతకు మించి వెళ్లలేకపోయారు. కానీ రష్మిక మాత్రం అటు సినిమాలు, ఇటు రెమ్యునరేషన్ విషయంలో జోరు చూపిస్తోంది. మరో రెండు మూడు హిట్లు పడితే రష్మిక పారితోషికం ఇంకా పెరిగే ఛాన్స్ ఉందేమోనని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: సీక్రెట్గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. కుర్రాడెవరో తెలుసా?) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
ప్రభాస్ విచిత్రమైన రికార్డ్.. సెకనుకు రూ.80 లక్షల రెమ్యునరేషన్?
డార్లింగ్ ప్రభాస్ 'సలార్' మూవీతో హిట్ కొట్టాడు. డిసెంబరులో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. ఈ మధ్యే ఓటీటీలోకి కూడా వచ్చింది. ఇక్కడ కూడా ట్రెండింగ్లో ఉంటూ అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. అయితే థియేటర్లలో 'సలార్' చూస్తున్నప్పుడు గమనించని చాలా విషయాలు.. ఓటీటీలోకి వచ్చాక బయటపడ్డాయి. అలా ఇప్పుడు ప్రభాస్ సెట్ చేసిన ఓ విచిత్రమైన రికార్డ్ వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: కుమారి ఆంటీ పుడ్ బిజినెస్ క్లోజ్.. సాయం చేస్తానంటున్న తెలుగు హీరో) 'బాహుబలి' తర్వాత ప్రభాస్ నుంచి అభిమానులు చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చారు. 'సాహో' మూవీ కొంతలో కొంత పర్వాలేదనిపించింది కానీ 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' ఫ్లాప్స్గా నిలిచాయి. దీంతో అందరూ 'సలార్' మీదే ఆశలు పెట్టుకున్నారు. అలా గతేడాది డిసెంబరు 22న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. రూ.700 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. తాజాగా నెట్ఫ్లిక్స్లో రిలీజై ఇక్కడ కూడా రచ్చ లేపుతోంది. అయితే 'సలార్'లో ప్రభాస్ ఫైట్స్ అదరగొట్టినప్పటికీ.. సినిమా మొత్తం కలిపి కేవలం 2 నిమిషాల 35 సెకన్లు మాత్రమే డైలాగ్స్ చెప్పాడు. మరోవైపు ఈ చిత్రంలో నటించినందుకు గానూ రూ.125 కోట్ల పారితోషికం తీసుకున్నాడని టాక్ వినిపించింది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసి చూస్తే మాత్రం డార్లింగ్ హీరో.. సెకనుకు రూ.80, 64,516 సంపాదించినట్లే. అంటే నిమిషానికి పదులు కోట్లు అందుకున్నట్లే. మనదేశంలో ఇలా సెకనుకు లక్షలు.. నిమిషానికి కోట్లు సంపాదించిన రికార్డు ప్రభాస్దే. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?) Prabhas Dialogue time in Salaar (sped up) Roughly 4 minutes with dialogue gaps and 2:35 min without gaps... https://t.co/aHPhd30Mp5 pic.twitter.com/bxTclXjMcA — Lok (@TeluguOchu) January 21, 2024 -
రూపాయి తీసుకోకుండా సినిమా చేయనున్న మహేశ్! కారణం అదేనా?
సూపర్స్టార్ మహేశ్ బాబు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడట. అవును మీరు సరిగానే విన్నారు. ఇప్పటివరకు ప్రతి సినిమాకు కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే ఈ హీరో.. రాజమౌళితో చేయబోయే మూవీ కోసం మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయబోతున్నాడట. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అసలేం జరుగుతోంది? కారణమేంటి? మహేశ్-రాజమౌళి సినిమా చేయబోతున్నారు. ఇది అందరికీ తెలుసు. 'ఆర్ఆర్ఆర్' మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి ముందే రాజమౌళి, ఈ ప్రాజెక్ట్ని ప్రకటించాడు. భారీ బడ్జెట్తో పాన్ వరల్డ్ రేంజులో ఇది ఉండదని ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూనే ఉన్నారు. తాజాగా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిపోయినట్లు రైటప్ విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ఉగాదికి సినిమాని లాంఛనంగా ప్రారంభించే అవకాశముండొచ్చు. (ఇదీ చదవండి: సీరియల్ హీరోయిన్ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్) ఈ ఏడాది మొదలు కావడమైతే పక్కా కానీ ఎప్పుడనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ సినిమాని దాదాపు రూ.1000 కోట్ల బడ్డెట్తో నిర్మించనున్నారనే రూమర్స్ గట్టిగా వస్తున్నాయి. ఇలాంటి సమయంలో మరో క్రేజీ విషయం బయటకొచ్చింది. ఈ సినిమా కోసం మహేశ్.. ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకూడదని ఫిక్స్ అయ్యాడట. అలా అని ఫ్రీగా చేస్తాడని కాదు. రిలీజ్ తర్వాత లాభాల్లో షేర్ ఉంటుందట. రీసెంట్గా 'గుంటూరు కారం'తో ప్రేక్షకుల్ని పలకరించిన మహేశ్.. ఒక్కో సినిమాకు రూ.60-70 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటాడని టాక్. రాజమౌళితో మూవీ కోసం రూ.110 కోట్లు రెమ్యునరేషన్ అని అప్పట్లో టాక్ నడిచింది. ఇప్పుడు ప్లాన్ మారిపోయిందని.. రాజమౌళి-మహేశ్ ఇద్దరూ కూడా లాభాల్లో వాటా తీసుకుంటారని మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: పెళ్లికి రెడీ అయిపోయిన తమన్నా.. అందుకే ఇలా కనిపించిందా?) -
ఒక్కో హీరో కోట్లు తీసుకుంటున్నాడు, మాకు పెంచమని అడిగితే..
కథలో దమ్మున్నా సినిమా క్వాలిటీగా రావాలంటే నిర్మాతలు డబ్బులు ధారపోయాల్సిందే! అయితే సినిమా తీయడానికంటే అందులో నటించినవారి కోసమే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఆ రేంజులో హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్ పెరిగిపోయింది. హిట్టు పడ్డేకొద్దీ వారు ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తూ పోతున్నారు. సినిమా ఫలితాలను బట్టి కొందరు పారితోషికం వెనక్కు ఇచ్చేస్తారు, లేదంటే కొంత కోతలు పెడుతుంటారు. మరికొందరు మాత్రం రిజల్ట్ ఎలా ఉన్నా పూర్తి మొత్తం ముట్టాల్సిందేనని కరాఖండిగా చెప్తారు. ఎంత తీసుకుంటారు? తాను మాత్రం అలా చేయనంటున్నాడు బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అతడు బాలీవుడ్లో నటీనటులు, చిన్నపాటి హీరోలు అందుకుంటున్న పారితోషికం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్ నటులు సుమారు ఎంత పారితోషికం తీసుకుంటారు? అన్న ప్రశ్నకు నవాజుద్దీన్ స్పందిస్తూ.. చాలా ఎక్కువగా తీసుకుంటారని చెప్పాడు. పది కోట్ల పైనే ఉండొచ్చా? అని యాంకర్ అడగ్గా.. పదికోట్లకు అటుఇటుగా తీసుకుంటారని బదులిచ్చాడు. ఎక్కువ అడిగామంటే అంతే.. రెమ్యునరేషన్ విషయంలో బేరాలడతారా? అన్న ప్రశ్నకు తానైతే అలా చేయనని చెప్పాడు. ఇక్కడ నటుల టాలెంట్ను బట్టి వారికి ఎంత ఇవ్వాలనుకుంటే అంతే ఇస్తారు. లేదు, మాకింకా ఎక్కువ కావాలని అడిగితే.. ఏంటి? మేము చెప్పిన అమౌంట్ కన్నా ఎక్కువ తీసుకునే అర్హత నీకుందా? అని మొహం మీదే అనేస్తారు. అందుకే నేను ఎక్కువగా డిమాండ్ చేయను, ఇచ్చిందే తీసుకుంటాను. కొన్ని సినిమాలు డబ్బుల కోసమే చేశాను. మరికొన్ని పైసా తీసుకోకుండా ఫ్రీగా చేశాను. రూ.25 కోట్లు ఇచ్చినా చేయను నేను చిన్నాచితకా పాత్రలు చేయడం మానేశాను. నాకు రూ.25 కోట్లు ఇస్తామన్నా సరే అటువంటి పాత్రలు చేయను. ఇప్పటికే నా కెరీర్లో చాలా సినిమాల్లో చిన్న రోల్స్ చేశాను. ఇక చాలు. ఇకమీదట అలాంటి పాత్రలు చేయాలనుకోవడం లేదు అని చెప్పుకొచ్చాడు. కాగా నవాజుద్దీన్ సిద్ధిఖి ఇటీవలే సైంధవ్ సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం సెక్షన్ 108 సినిమా చేస్తున్నాడు. చదవండి: ఫలించిన నిరీక్షణ.. డైహార్ట్ ఫ్యాన్కు క్షమాపణ చెప్పిన కీర్తీసురేష్ విడాకులపై నిహారిక కామెంట్లు.. ఘాటుగా రియాక్ట్ అయిన మాజీ భర్త చైతన్య -
అరుంధతి @15 ఏళ్లు.. అనుష్క, సోనూసూద్ రెమ్యునరేషన్ అంత తక్కువా?
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడంతా అయితే సంక్రాంతి హంగామా నడుస్తోంది. దాదాపు ప్రతిఒక్కరూ ఫుల్ జోష్లో ఉన్నారు. ఇదే టైంలో నాలుగు సినిమాలు కూడా రిలీజయ్యాయి. వీటిలో 'హను-మాన్'కు పూర్తిస్థాయిలో పాజిటివ్ టాక్ వచ్చింది. సరే దీని గురించి కాసేపు పక్కనబెడితే ఈ పండగ టైంలో వచ్చి సెన్సేషనల్ హిట్ సాధించిన మూవీ అంటే అందరికీ గుర్తొచ్చేది 'అరుంధతి'నే. ఇప్పుడు ఈ చిత్రం 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మూవీ విశేషాలతో పాటు లీడ్ యాక్టర్స్ రెమ్యునరేషన్ సంగతి కూడా చూసేద్దాం. సంక్రాంతి పండక్కి సాధారణంగా ఫ్యామిలీ స్టోరీలతో తీసిన సినిమాల్నే రిలీజ్ చేస్తుంటారు. ఇవి కాదంటే యాక్షన్ ఎంటర్టైనర్, కామెడీ సినిమాల్ని థియేటర్లలోకి తీసుకొస్తుంటారు. అయితే ఈ పండగ హడావుడిలో చాలా అంటే చాలా అరుదుగా హారర్ మూవీస్ వస్తుంటాయి. అలా వచ్చిన చిత్రమే 'అరుంధతి'. (ఇదీ చదవండి: Salaar OTT: 'సలార్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా? స్ట్రీమింగ్ అప్పుడేనా?) తెలుగు సినిమాకు గ్రాఫిక్స్ మాయాజాలాన్ని పరిచయం చేసిన దర్శకుడు కోడి రామకృష్ణ తీసిన ఈ చిత్రం విడుదలై నేటికి 15 ఏళ్లు పూర్తయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు నందులు కైవసం చేసుకున్న 'అరుంధతి'.. టాలీవుడ్లోనే సరికొత్త రికార్డులు సృష్టించిందని చెప్పొచ్చు. ఎందుకంటే అటు ఇటుగా రూ.13 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా తీస్తే ఏకంగా రూ.70 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయట. ప్రధాన పాత్రల్లో నటించిన అనుష్క, సోనూసూద్ రెమ్యునరేషన్ గురించి తెలిస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు. సినిమా తీసే టైంలో అనుష్క కేవలం ఓ హీరోయిన్ అంతే. దీంతో ఈమెని రూ.కోటి లోపే పారితోషికం ఇచ్చేలా అగ్రిమెంట్ చేసుకున్నారు. మరోవైపు విలన్ పశుపతిగా చేసిన సోనూసూద్కి అయితే తొలుత రూ.18 లక్షలే అనుకున్నారు. కానీ ఎక్కువ రోజులు వర్క్ చేయడంతో రూ.45 లక్షలు ఇవ్వాల్సి వచ్చిందని టాక్. దీనిబట్టి చూస్తే మరీ రూ.కోటిన్నరలోపే ఇద్దరు లీడ్ యాక్టర్స్ పారితోషికం అంటే చాలా తక్కువనే చెప్పొచ్చు. (ఇదీ చదవండి: రూ.100 కోట్ల వసూళ్లు దాటేసిన 'హనుమాన్'.. ఆ విషయమైతే చాలా స్పెషల్) One and only Lady Super Star of South India cinema @MsAnushkaShetty ❤️🔥 Oka horror film tho max andhari hero la highest lepina legendary actress anushka !💥💥#15YearsForAnushkaArundhati pic.twitter.com/3XI8TGfR9O — Manjula Reddy (@Manju_Anushka) January 15, 2024 -
టాప్ లేపుతున్న 'హను-మాన్'.. రెమ్యునరేషన్ ఎవరికి ఎక్కువో తెలుసా?
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి సినిమాల హడావుడి మొదలైపోయింది. 'హను-మాన్', 'గుంటూరు కారం' చిత్రాలు థియేటర్లలోకి వచ్చేశాయి. రెండింటిని పోల్చి చూసుకుంటే చాలామంది 'హను-మాన్' వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో రెమ్యునరేషన్ టాపిక్ మరోసారి హాట్ టాపిక్ అయిపోయింది. ఇంతకీ 'హను-మాన్' టీంలో ఎవరికెంత ఇచ్చారు? 'హను-మాన్' టాక్ ఏంటి? ఈసారి సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు నిలిచాయి. వీటిలో చాలామంది మహేశ్ 'గుంటూరు కారం' హిట్ అవుతుందని అనుకున్నారు. కానీ దీనికంటే బెటర్ రివ్యూస్ ఇప్పుడు 'హను-మాన్' మూవీకి వస్తోంది. సూపర్ హీరో కాన్సెప్ట్, ఆంజనేయుడి సెంటిమెంట్తోపాటు కంటెంట్ కూడా భలే క్లిక్ అయింది. గురువారం సాయంత్రం ప్రీమియర్స్ పూర్తవగానే.. అందరూ 'జై హనుమాన్' నామజపం చేస్తున్నారు. (ఇదీ చదవండి: Hanu Man Movie Review: ‘హను-మాన్’ మూవీ రివ్యూ) అదే టైంలో దర్శకుడు ప్రశాంత్ వర్మని మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే కేవలం రూ.55 కోట్ల బడ్జెట్తో ఈ రేంజు సినిమా తీశాడంటే.. మరికాస్త బడ్జెట్ ఇచ్చుంటే వేరే లెవల్ మూవీ తీసేవాడని అనుకుంటున్నారు. సరే ఇది పక్కనబెడితే ఈ మూవీకి నటీనటులకు ఇచ్చిన రెమ్యునరేషన్.. రూ.10 కోట్లు కూడా దాటలేదనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. 'హను-మాన్' సినిమాలో హీరోగా నటించిన తేజ సజ్జా.. సెటిల్డ్ యాక్టింగ్తో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రానికి గానూ ఇతడికి రూ.2 కోట్లు ఇచ్చారట. దర్శకుడు ప్రశాంత్ వర్మ.. రూ.70 లక్షల నుంచి రూ.కోటి మధ్య పారితోషికం అందుకున్నాడట. మిగతా నటీనటుల్లో హీరోయిన్ అమృత అయ్యర్-రూ 1.5 కోట్లు, వరలక్ష్మీ శరత్ కుమార్ రూ. కోటి, వినయ్ రాయ్ రూ.65 లక్షలు, వెన్నెల కిశోర్ రూ.55 లక్షలు, గెటప్ శీను రూ.35 లక్షలు అనే టాక్ వినిపిస్తుంది. మిగతా నటీనటులకు కాస్తోకూస్తే ఇచ్చారు. మొత్తంగా చూసుకుంటే రూ.10 కోట్ల లోపే రెమ్యునరేషన్ తేల్చేశారనమాట. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు మూవీ) -
ఓటీటీలపై అగ్రతారల కన్ను.. ఈ ఏడాది అత్యధిక పారితోషికం ఎవరికంటే?
సినీ ప్రేక్షకులు ఇప్పుడంతా ఎక్కువగా ఓటీటీలపై ఆసక్తి చూపిస్తున్నారు. కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు ఎప్పటికప్పుడు ఓటీటీకి వచ్చేస్తున్నాయి. దీంతో ఓటీటీల్లో చూసేందుకే అభిమానులు మొగ్గు చూపుతున్నారు. దీంతో థియేటర్ ఆడియెన్స్తో పాటు నెటిజన్లను దృష్టిలో పెట్టుకుని సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ హీరోలు సైతం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ల్లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇటీవలే నాగచైతన్య సైతం దూత అనే వెబ్ సిరీస్లో ఎంట్రీ ఇచ్చేశారు. కాగా.. అజయ్ దేవగన్, సైఫ్ అలీ ఖాన్, తమన్నా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, సోనాక్షి సిన్హా, సమంత, రాశీఖన్నా, విజయ్ సేతుపతి లాంటి స్టార్స్ సైతం ఓటీటీ వేదికలపై మెరిశారు. అయితే ఓటీటీల్లో నటించేందుకు అగ్రతారలు పారితోషికం గట్టిగానే అందుకున్నట్లు తెలుస్తోంది. ఏ పాత్రలోనైనా సరే నటించడానికి రెడీ అంటున్నారు. బాలీవుడ్ అగ్ర నటుడు అజయ్ దేవగన్ ఓటీటీలపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. 2022లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో ప్రసారమైన క్రైమ్ థ్రిల్లర్ షో 'రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్'తో అజయ్ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఓటీటీల్లో నటించిన స్టార్స్ పరంగా చూస్తే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడు అజయ్ దేవగన్ అని లేటెస్ట్. 'రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్' 7 ఎపిసోడ్ల కోసం దాదాపు రూ.125 కోట్లు పారితోషికం తీసుకున్నారని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ లెక్కన ఒక్క ఎపిసోడ్కు రూ. 18 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. అలా ఓటీటీలో అత్యధిక పారితోషికాన్ని అందుకున్న భారతీయ నటుడిగా అజయ్ నిలిచారు. ఆ తర్వాత మరో నటుడు మనోజ్ భాజ్పేయి నిలిచారు. అమెజాన్ ప్రైమ్లో విడుదలైన 'ది ఫ్యామిలీ మ్యాన్' క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో ఆయన నటించారు. ఈ సిరీస్ రెండవ సీజన్లో మనోజ్ ఏకంగా రూ. 10 కోట్ల వరకు తీసుకున్నారని టాక్. -
టాప్ హీరో హీరోయిన్లకు చెక్! ఆ విషయంలో కష్టమే!
కాలంతో పాటు సినిమా రూపాంతరం చెందుతోందనడంలో ఎటువంటి సందేహం ఉండదు. జయాపయజాలను బట్టి చిత్ర నటీనటులు, సాంకేతిక వర్గం స్థాయి మారుతూ వస్తోంది. ముఖ్యంగా ఒక చిత్రం హిట్ అయితే అందులో నటించిన హీరో హీరోయిన్లు ఒక్కసారిగా రెమ్యునరేషన్ పెంచేస్తారన్నది తెలిసిన విషయమే. అయితే దీనికి చెక్ పెట్టే పరిస్థితి రానున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు చాలామటుకు సినిమాను కార్పొరేట్ సంస్థలే ఏలుతున్నాయి. దీంతో పలు పాత చిత్ర నిర్మాణ సంస్థలు తెరమరుగు అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కార్పొరేట్ సంస్థలు స్టార్ హీరో హీరోయిన్లకు చెక్ పెట్టనున్నట్లు సమాచారం. రెమ్యునరేషన్ డిమాండ్.. సాధారణంగా స్టార్ హీరో హీరోయిన్లు నటించిన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధిస్తాయి. దీంతో అలాంటి నటీనటులను బాక్సాఫీస్ గాడ్స్గా భావిస్తుంటారు. నిజానిజాల మాట అటు ఉంచితే ఇటీవల ఒక హీరో నటించిన చిత్రం వసూళ్లు రూ.500 కోట్లు దాటినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కలతో అలాంటి స్టార్స్కు క్రేజ్ మరింత పెరుగుతుంది. బాక్సాఫీస్ కలెక్షన్స్ను బట్టి హీరో హీరోయిన్లు తమ రెమ్యునరేషన్ను పెంచుకుంటూ పోతున్నారు. ఇందుకు కారణం కార్పొరేట్ సంస్థలే! ఆ డబ్బుతోనే ఎక్కువ చెల్లిస్తున్నారు! సాటిలైట్, ఓటీటీ సంస్థలు ఇచ్చే డబ్బుతోనే నిర్మాతలు హీరో హీరోయిన్లకు పారితోషికం పెంచేస్తున్నారు. ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్గా వెలుగొందుతున్న నటి నయనతార కూడా రూ.10 కోట్లకు పైగా పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నారని సమాచారం. అంతేకాకుండా ఈమె తన చిత్రాలకు ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా పాల్గొనేది లేదనే పలు కండిషన్లు పెడుతున్నారు. అయినా కానీ ఆమె మార్కెట్ తగ్గడం లేదు. ఇలాంటి వారికి తాజాగా కార్పొరేట్ సంస్థలు చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. 20 శాటిలైట్ హక్కులను, ఓటిటీ స్ట్రీమింగ్ హక్కులను ఇకపై అధిక ధరకు చెల్లించరాదని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. దీంతో స్టార్ హీరో హీరోయిన్ల పారితోషికం తగ్గే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. చదవండి: బెంజ్ కారు కొనేసిన మానస్.. ఫొటోలు వైరల్
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement