-
రౌడీతో రౌడీ బేబీ.. క్రేజీ కాంబినేషన్ సెట్ కానుందా..
-
రూ. 2 కోట్లు ఆఫర్ ఇచ్చినా అందుకు నో చెప్పిన సాయిపల్లవి
నటిగా తనకంటూ కొన్ని ప్రిన్సిపుల్స్ను పెట్టుకున్న హీరోయిన్ సాయిపల్లవి. ఈమె చదివింది వైద్యవిద్య అయినా అయ్యింది నటి. తొలి చిత్రంతోనే విజయంతో పాటు ప్రశంసలు అందుకున్న సాయిపల్లవి. దీంతో మలయాళం, తెలుగు, తమిళం భాషల్లోనూ నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. అయితే నటిగా కొన్ని నిర్ధిష్టమైన భావాలకు కట్టుబడి ఉన్నారు. ముఖ్యంగా గ్లామర్కు దూరంగా ఉంటడం. సహజత్వానికి ప్రాధాన్యత నివ్వడం. నటనకు అవకాశం ఉన్న పాత్రల్లోనే నటించాలనుకోవడం వంటి విషయాల్లో చాలా క్లియర్గా ఉంటారు. తన పాత్రకు అవకాశం లేకపోతే నిక్కచ్చిగా నిరాకరించేస్తుంది సాయిపల్లవి. అది ఎంత పెద్ద స్టార్ నటుడి చిత్రం అయినా సరే. అలా జరిగింది కూడా. అలాంటి నటి ఇప్పుడు సైలెంట్గా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. అదీ రామాయణ్ చిత్రంలో సీతగా నటించే అవకాశం వరించింది. ఇటీవల ఆ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి. ఆ ఫొటోలను చూస్తే సీత పాత్రలో సాయిపల్లవి ఎంతగా ఒదిగి పోయారో అని అనిపిస్తుంది. ఇకపోతే తెలుగులో నాగచైతన్య సరసన తండేల్ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే తమిళంలో శివకార్తీకేయన్కు జంటగా నటిస్తున్న అమరన్ చిత్రాన్ని పూర్తి చేశారు.కాగా నటి సాయిపల్లవికి ఇటీవల ఒక వాణిజ్య ప్రకటనలో నటించే అవకాశం వచ్చిందట. అందులో నటించడానికి రూ. 2 కోట్లు పారితోషకం ఇవ్వడానికి ఆ సంస్థ అధినేత ముందుకు రాగా సాయిపల్లవి ఆ అవకాశాన్ని వదులుకున్నారని సమాచారం. కారణం అది ఒక సౌందర్య సాధనకు చెందిన ప్రకటన కావడమేనట. అలాంటి సౌందర్య వస్తువులతో సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాదన్న ఒక్క కారణంగా అంత పారితోషాకిన్ని చెల్లిస్తానన్నా సాయిపల్లవి నో చెప్పారనే ప్రచారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. గతంలో కూడా ఆమెకు ఇలాంటి ఆఫర్లే వచ్చాయి. అప్పుడు కూడా ఆమె సున్నితంగా వద్దని చెప్పారు. -
సాయి పల్లవి బర్త్ డే.. ఆమె కోసం స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చిన టీమ్!
ఫిదా మూవీతో తెలుగువారి గుండెలు కొల్లగొట్టిన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి. తెలుగులో స్టార్ హీరోయిన్గా అభిమానుల్లో చోటు సంపాదించుకుంది. ప్రస్తుతం నాగచైతన్య సరసన తండేల్ మూవీ నటిస్తోంది. చందూ మొండేటి డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మత్య్సకారుల బ్యాక్డ్రాప్ స్టోరీతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో చైతూ మత్య్సకారుని పాత్రలో కనిపించనున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.అయితే ఇవాళ సాయిపల్లవి బర్త్ డే కావడంతో తండేల్ చిత్ర యూనిట్ స్పెషల్ వీడియోను షేర్ చేసింది. సాయి పల్లవి తెలుగు సినిమాలతో మెప్పించిన పాత్రలను వీడియోలో చూపించారు. ముఖ్యంగా తండేల్ మూవీ సెట్లో సాయిపల్లవి హావభావాలతో కూడిన స్పెషల్ వీడియో అద్భుతంగా రూపొందించారు. చివర్లో నాగచైతన్య, సాయి పల్లవి మధ్య వచ్చే సీన్తో ఆడియన్స్కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. కాగా.. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. -
Sai Pallavi Unseen Photos: హైబ్రిడ్ పిల్లా ‘సాయిపల్లవి’ బర్త్డే స్పెషల్ (ఫొటోలు)
-
Tandel: ప్రేమ కబుర్లు
మొబైల్లో ప్రేమ కబుర్లు చెబుతున్నారు సాయి పల్లవి. ‘లవ్స్టోరీ’ చిత్రం తర్వాత హీరో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’. ఈ రూరల్ బ్యాక్డ్రాప్ లవ్స్టోరీ ఫిల్మ్కు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, సత్యభామ పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారని తెలిసింది. కాగా నేడు (మే 9) సాయి పల్లవి బర్త్ డే. ఈ సందర్భంగా ‘తండేల్’ సినిమాలోని ఆమె కొత్త ఫొటోను బుధవారం విడుదల చేశారు మేకర్స్. సత్యభామ ఎవరితోనో ఫోన్లో నవ్వుతూ మాట్లాడుతున్నట్లు ఫొటోలో కనిపిస్తోంది. బహుశా రాజుతో ప్రేమ కబుర్లు చెబుతుందేమో! ఇక ఈ పాత్ర తాలూకు వీడియోను నేడు విడుదల చేయనున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూ΄÷ందుతున్న ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబరులో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. -
అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?
-
కైకేయి.. శూర్పణఖ... ఏదైనా ఓకే
‘‘రామాయణ్’ లాంటి ప్రతిష్టాత్మక చిత్రంలో నటించాలనే ఆసక్తి ఎవరికి మాత్రం ఉండదు? ఆ సినిమాలో నటించమని ఇప్పటివరకూ ఎవరూ నన్ను సంప్రదించలేదు. ఆ అవకాశం వస్తే మాత్రం నటించేందుకు నేను సిద్ధం’’ అన్నారు బాలీవుడ్ బ్యూటీ లారా దత్తా. ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారి దర్శకత్వంలో హిందీలో ‘రామాయణ్’ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మూడు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతోందని సమాచారం. కాగా ఈ చిత్రంలోని నటీనటులపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. కానీ, రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారని లీక్ అయిన ఒక ఫొటో స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో కైకేయి పాత్రలో లారా దత్తా నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై తాజాగా స్పందించారు లారా దత్తా. ‘‘రామాయణ్’లో నేను కైకేయి పాత్ర చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అవి విన్నప్పుడు సంతోషంగానే ఉంది. ఎందుకంటే.. అంత గొప్ప సినిమాలో నటించాలని ఎవరు కోరుకోరు? ఒకవేళ ఈ మూవీలో నాకు అవకాశం వస్తే కైకేయి పాత్రే కాదు.. శూర్పణఖ, మండోదరి లాంటి క్యారెక్టర్స్ చేయడానికి కూడా నేను రెడీ. ఈ మూడు పాత్రల్లో దేనికైనా నేను చక్కగా సరిపోతాను’’ అంటూ తన మనసులోని మాటని బయటపెట్టారు లారా దత్తా. మరి... ఈ మూడు ్రపాతల్లో ఏదో ఒకటి చేసే చాన్స్ లారా దత్తాకి వస్తుందా? అనేది చూడాలి. -
మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? సాయిపల్లవి ఆన్సర్ ఇదే
ప్రస్తుత జనరేషన్లో మిగతా హీరోయిన్లతో పోలిస్తే సాయి పల్లవి కాస్త డిఫరెంట్. నటన, పాత్రల ఎంపికలో ప్రత్యేకత చూపిస్తుంది. 'ప్రేమమ్' చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఇది హిట్ కావడంతో తెలుగు, తమిళం భాషల్లో ఛాన్సులు వచ్చాయి. తెలుగులో ఈమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం 'తండేల్' సినిమాలో నటిస్తున్న సాయిపల్లవి.. తమిళంలో శివకార్తికేయన్ మూవీలో చేస్తోంది. హిందీలో 'రామాయణ్' పేరుతో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీలో సీతగా నటిస్తోంది.(ఇదీ చదవండి: పెళ్లెప్పుడు అని ప్రశ్న.. హీరోయిన్ మాళవిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్)సరే ఇదంతా పక్కనబెడితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో.. తన శారీరక సౌందర్యం గురించి మాట్లాడింది. 'ప్రేమమ్' మూవీ టైంలో ముఖంపై మొటిమలు చాలా ఉండేవి. తనకు చిత్రంలో అవకాశం రావడానికి కారణమే కూడా అవే. ప్రస్తుతం మాత్రం తన ముఖంపై ఎలాంటి మొటిమలు లేవు. అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా? అని చాలామంది అడుగుతున్నారు. కానీ తాను ఎలాంటి చికిత్స గానీ థెరఫీ గానీ చేయించుకోలేదని సాయిపల్లవి చెప్పుకొచ్చింది.టీనేజ్ అమ్మాయిలకు మొటిమలు రావడం సహజమేనని చెప్పిన సాయిపల్లవి.. అవి పోవడానికి ఎలాంటి చికిత్స అవసరం లేదన్నారు. వాటంతటికి అవే పోతాయని చెప్పింది. తన ఒత్తయిన జుత్తు సీక్రెట్ గురించి చెప్పిన ఈ బ్యూటీ.. తాను ఆర్గానిక్ ఆహార పదార్థాలను తీసుకుంటానని, ఆలోవెరా జెల్స్ ఉపయోగిస్తానని తెలిపింది. (ఇదీ చదవండి: పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్) -
తండేల్ - భారీ ధరకు డిజిటల్ రైట్స్
-
సీతగా సాయిపల్లవి.. ఎంత ముద్దుగా ఉందో? ఫొటోలు వైరల్
పాన్ ఇండియా భారీ బడ్జెట్ 'రామాయణ్' షూటింగ్ మొదలైపోయింది. ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండానే షూటింగ్ మొదలుపెట్టేసినట్లు ఉన్నారు. సాయిపల్లవి సీతగా, రణ్బీర్ కపూర్ రాముడి గెటప్లో ఉన్న పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని చూసి నెటిజన్స్ తెగ మురిసిపోతున్నారు. మరీ ముఖ్యంగా సాయిపల్లవి అందానికి ఫిదా అయిపోతున్నారు.ప్రతిష్టాత్మక రామాయణం ఆధారంగా ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. దాదాపుగా ఇవన్నీ కూడా ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి. గతేడాది రిలీజైన 'ఆదిపురుష్' మాత్రం ఘోరమైన ట్రోలింగ్కి గురైంది. తాజాగా బాలీవుడ్లో రామాయాణాన్ని సినిమాగా తీస్తున్నారు. గతంలో న్యూస్ వచ్చినప్పటికీ దీన్ని ఎవరూ నిర్ధారించలేదు.శ్రీరామ నవమికి అయినా సరే అధికారిక ప్రకటన వస్తుందనుకున్నారు. కానీ అలాంటిదేం రాలేదు. కానీ ఇప్పుడు సెట్స్ నుంచి రాముడు, సీత పాత్రలకు సంబంధించిన కొన్ని పిక్స్ లీక్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఇవి సర్క్యూలేట్ అవుతున్నాయి. లుక్స్ బాగానే ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాని మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నారట. ఇందులో రావణుడిగా 'కేజీఎఫ్' ఫేమ్ యష్ కనిపించబోతున్నాడు. -
ఐటమ్ సాంగ్ కి సాయిపల్లవి ఊరమాస్ డ్యాన్స్.. వీడియో వైరల్
సాయిపల్లవి పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది ఆమె డ్యాన్సులే. ఎందుకంటే స్వతహాగా డ్యాన్సర్ అయిన ఈమె.. ఊహించని విధంగా హీరోయిన్ అయ్యింది. తెలుగులో కొన్ని సినిమాలే చేసినప్పటికీ చాలా గుర్తింపు సంపాదించింది. ఇప్పుడు సాయిపల్లవికి సంబంధించిన పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: మీరు ఎవరు అలా చెప్పడానికి? బడా నిర్మాణ సంస్థపై హీరో విశాల్ ఫైర్) తమిళ బ్యూటీ సాయిపల్లవి ఓవైపు సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూనే మరోవైపు జార్జియాలో ఎంబీబీఎస్ కూడా పూర్తి చేసింది. ఈ విషయం చాలామందికి తెలిసినా సరే అక్కడ చదువుతున్నప్పటి ఫొటోలు, వీడియోల్లాంటివి ఏం బయటకు రాలేదు. కానీ ఇప్పుడు ఓ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో భాగంగా ఫ్రెండ్స్ తో కలిసి 'షీలా కీ జవానీ' పాటకు సాయిపల్లవి డ్యాన్స్ చేసింది. ఈ వీడియోలో సాయిపల్లవి మిగతా వాళ్లని పూర్తిగా డామినేట్ చేసేసింది. బ్లర్ గా ఉండటంతో పాటు దూరం నుంచి వీడియో తీయడం వల్ల సరిగా క్లారిటీ లేదు. కానీ సాయిపల్లవి డ్యాన్స్ మాత్రం అదరగొట్టేసిందని చెప్పొచ్చు. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్న సాయిపల్లవి.. పాన్ ఇండియా 'రామాయణ'లో సీతగా కనిపించనుంది. త్వరలో అధికారిక ప్రకటన రావొచ్చు. (ఇదీ చదవండి: మలయాళ హిట్ మూవీ తెలుగులో రీమేక్.. హీరోగా స్టార్ డైరెక్టర్!) #SaiPallavi doing Sheela ki Jawani Song at her College Festpic.twitter.com/t4RaoecDmP — R a J i V (@RajivAluri) April 16, 2024 -
రామాయణ...సాయి పల్లవికి రికార్డ్ స్థాయి రెమ్యూనరేషన్..
-
సాయిపల్లవికి రికార్డ్ రెమ్యునరేషన్.. 'రామాయణ' కోసం అన్ని కోట్లా?
ప్రస్తుత జనరేషన్ లో నేచురల్ బ్యూటీ అంటే సాయిపల్లవినే. ఎందుకంటే చాలా సాధారణమైన పాత్రల్లో చేస్తూనే సూపర్ హిట్స్ కొట్టింది. ప్రస్తుతం హిందీలో భారీ బడ్జెట్ తో తీస్తున్న 'రామాయణ' మూవీలో నటిస్తోంది. అయితే ఇందులో నటిస్తున్నందుకు కళ్లుచెదిరే రెమ్యునరేషన్ తీసుకుంటుందనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి రాబోతున్న అనసూయ లేటెస్ట్ మూవీ) 'ప్రేమమ్' అనే మలయాళ మూవీతో హీరోయిన్ గా మారిన సాయిపల్లవి.. ఆ తర్వాత 'ఫిదా'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. పలు సినిమాల్లో నటించి హిట్స్ కొట్టింది. చివరగా 'విరాటపర్వం'లో కనిపించింది. ఇది వచ్చి నాలుగేళ్లుపైనే అయిపోయింది. అయితే గత రెండేళ్లుగా నటనకు బ్రేక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఈ మధ్యే మళ్లీ బిజీగా మారుతోంది. ప్రస్తుతం తమిళంలో ఓ మూవీ చేస్తున్న సాయిపల్లవి.. హిందీలో ఆమిర్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా పరిచయమవుతున్న సినిమా చేస్తోంది. అలానే రణ్ బీర్, యష్ తదితరులు నటిస్తున్న 'రామాయణ'లోనూ సీత పాత్ర చేయబోతుంది. త్వరలో ఈ ప్రాజెక్టుని అధికారికంగా ప్రకటించబోతున్నారు. సాధారణంగా ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే సాయిపల్లవి.. మూడు భాగాలుగా తీస్తున్న 'రామాయణ' కోసం మాత్రం రూ.10-15 కోట్ల వరకు తీసుకుంటుందని టాక్. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం నయనతారని దాటేసి రికార్డ్ సృష్టించినట్లే. సీత పాత్రకు ఉన్న ప్రాధాన్యం దృష్టానే తన పారితోషికాన్ని సాయిపల్లవి అమాంతం పెంచేసిందని అంటున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన రెండు హిట్ సినిమాలు.. స్ట్రీమింగ్ అందులోనే) -
'రామాయణ' సినిమా కోసం నిర్మాతగా స్టార్ హీరో.. అధికారిక ప్రకటన
మానవ సమాజ గతినే ప్రభావితం చేసిన ఒక మహత్తర కావ్యం రామాయణం. రామాయణంలోని ప్రతి సంఘటన, ప్రతి పాత్రా సమాజంపట్ల, సాటి మానవుల పట్ల మన బాధ్యతని గుర్తు చేసేవిగానే వుంటాయి. రామాయణం మధురమైన కథ. ఎన్నిసార్లు రామాయణం చదివినా, విన్నా కొత్తగా అనిపిస్తుంది. అందుకే ఇప్పటికే పలుమార్లు సినిమాగా వెండితెరపై మెరిసింది. ఇప్పుడు మరోసారి బాలీవుడ్లో 'రామాయణ' పేరుతో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. దంగల్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామాయణ' చిత్రంలో రణ్బీర్కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రావణుడిగా కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ అధికారికంగా వచ్చేసింది. రాకింగ్ స్టార్ యశ్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, అలాగే నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి 'రామాయణ' చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈమేరకు అధికారికంగా ప్రకటన వెలువడింది. నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ.. 'US, UK, ఇండియా వంటి దేశాల్లో వ్యాపారాలు చేసి, కమర్షియల్ సక్సెస్ తెచ్చుకుని, ఆస్కార్ వరుకు కూడా వెళ్లాను. నా జీవితంలో నేను చేసిన జర్నీ ప్రకారం ఇప్పుడు నేను మన దేశ ప్రగతి అయిన రామాయణాన్ని తియ్యడంలో న్యాయం చెయ్యగలను అని అనిపిస్తుంది. ఎక్కడో కర్ణాటక నుంచి ఈరోజు ప్రపంచం గర్వించే KGF 2 వరుకు, యశ్ చాలా కష్టపడ్డాడు, ఇలాంటి ఒక ప్రాజెక్ట్ను ప్రపంచ వేదిక మీద ప్రెసెంట్ చెయ్యాలి అంటే అది యశ్ లాంటి వారితోనే సాధ్యమవుతుంది.' అని ఆయన అన్నారు. యశ్ మాట్లాడుతూ... ' నాకు ఎప్పటి నుండో ఉన్న కల, మన భారతీయ సినిమాని ప్రపంచ వేదిక మీద ఉంచాలని, అందుకు రామాయణ సినిమానే కరెక్ట్ అనుకున్నాను. ఈ విషయంపై నమిత్తో నేను అనేక మార్లు చర్చించాను. కాని అంత పెద్ద సబ్జెక్టు తియ్యాలి అంటే అది మాములు విషయం కాదు, బడ్జెట్స్ కూడా సరిపోవు అందుకే నేను కూడా కో ప్రొడ్యూస్ చెయ్యాలనుకున్నాను. రామాయణానికి నా మనసులో ఒక సుస్థిర స్థానం ఉంది. దాని కోసం ఎంతైనా కష్టపడతాను. ప్రపంచ వేదికలో ప్రేక్షకులకి మంచి అనుభూతిని ఇస్తాను. నితీష్ తివారి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.' అని తెలిపారు. నమిత్ మల్హోత్రా యాజమాన్యంలోని ప్రైమ్ ఫోకస్ స్టూడియో గ్లోబల్ కంటెంట్ను సినిమా చిత్రీకరించే ఒక స్వతంత్ర నిర్మాణ సంస్థ. ప్రస్తుతం ఈ సంస్థ మూడు సినిమాల నిర్మాణంలో భాగమై ఉంది. అందులో రామాయణం కూడా ఒకటి. యశ్కు మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ అనే ప్రొడక్షన్ కంపెనీ ఉంది. ఈ బ్యానర్పై ‘టాక్సిక్’ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్తో పాటు నిర్మిస్తున్నారు. ఇప్పుడు రాయాయణ సినిమా కోసం నమిత్ మల్హోత్రాతో యశ్ చేతులు కలిపారు. -
ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఫోటోలు లీక్.. స్టార్ డైరెక్టర్ కఠిన నిర్ణయం!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న చిత్రం రామాయణం. ఈ సినిమాకు తెలుగు వర్షన్ సంభాషణలు రాసే బాధ్యతను చిత్ర బృందం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్కు అప్పగించినట్లు సమాచారం. ఈ చిత్రంలో రాముడి పాత్రలో రణ్బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి , రావణుడిగా కేజీఎఫ్ స్టార్ యశ్, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, కైకేయిగా లారాదత్తా, శూర్పణఖగా రకుల్ప్రీత్సింగ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మొత్తం మూడు భాగాలుగా తెరకెక్కించేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. పార్ట్-2 వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. గోరేగావ్ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్స్కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా వైరలయ్యాయి. గత రెండు రోజులుగా షూటింగ్ విజువల్స్ విస్తృతంగా బయటకొచ్చాయి. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న మూవీ ఫోటోలు నెట్టిం లీక్ అవ్వడంతో దర్శకుడు నితీష్ తివారీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కఠిన నిర్ణయం తీసుకున్నారని బీ టౌన్లో టాక్ వినిపిస్తోంది. ఇక నుంచి షూటింగ్ సెట్స్లో నో ఫోన్ పాలసీని అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇటీవల సోషల్ మీడియాలో లీకైన చిత్రాలలో కైకేయిగా లారా దత్తా, దశరథ్గా అరుణ్ గోవిల్ కనిపించారు. దీంతో ఆగ్రహానికి గురైన నితీశ్.. నో-ఫోన్ విధానం అమలు చేయనున్నారు. చిత్రీకరణ సమయంలో అదనపు సిబ్బంది సెట్కు దూరంగా ఉండాలని ఆదేశించారు. కేవలం సన్నివేశంలో పాల్గొనే నటీనటులు, సాంకేతిక నిపుణులు మాత్రమే సెట్లోకి అనుమతించబడతారు. కాగా.. రామాయణం కోసం రూ.11 కోట్లతో సెట్ను నిర్మించారు. త్వరలోనే రణ్బీర్ కపూర్, సాయి పల్లవి సెట్స్లో జాయిన్ కానున్నారు. యష్ జూలైలో షూటింగ్లో పాల్గొననున్నారు. Ramayana set 😻💥#RanbirKapoor #niteshtiwari pic.twitter.com/SuUzwwjyUX — Ranbir Kapoor 👑❤️ (@Khushali_rk) April 3, 2024 Shoot for The BIGGEST movie of Indian Cinema - RAMAYANA has started. 💥 Casting is already looking 🔥, I have high hopes from this one directed by very talented Nitish Tiwari 🤞#ArunGovil #LaraDutta #Ramayana #RanbirKapoor #Yash #SaiPallavi #Ramayan 🚩 pic.twitter.com/HAmguvmmFc — αbhι¹⁸ (@CricCineHub) April 4, 2024 -
మాస్ డిష్యుం
‘తండేల్’ సెట్స్లో డిష్యుం డిష్యుం అంటూ అదిరిపోయే మాస్ ఫైట్స్ చేస్తున్నాడు రాజు. నాగచైతన్య, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’. నాగచైతన్యతో ‘ప్రేమమ్ (2016)’, ‘సవ్యసాచి (2018)’ సినిమాలను తెరకెక్కించిన చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఓ భారీ మాస్ యాక్షన్ సీక్వెన్స్ను హైదరాబాద్లో చిత్రీకరిస్తున్నారు. ‘యానిమల్’ సినిమాకు చేసిన స్టంట్ కొరియోగ్రాఫర్ సుప్రీమ్ సుందర్ ఈ యాక్షన్ సీక్వెన్స్ను డిజైన్ చేస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూ΄÷ందుతున్న ‘తండేల్’లో జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి కనిపిస్తారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. -
‘రామాయణం*లోకి త్రివిక్రమ్!
మానవ సమాజ గతినే ప్రభావితం చేసిన ఒక మహత్తర కావ్యం రామాయణం. రామాయణంలోని ప్రతి సంఘటన, ప్రతి పాత్రా సమాజంపట్ల, సాటి మానవుల పట్ల మన బాధ్యతని గుర్తు చేసేవిగానే వుంటాయి. రామాయణం మధురమైన కథ. ఎన్నిసార్లు రామాయణం చదివినా, విన్నా కొత్తగా అనిపిస్తుంది. అందుకే ఇప్పటికే పలుమార్లు సినిమాగా వెండితెరపై మెరిసింది. ఇప్పుడు మరోసారి బాలీవుడ్లో 'రామయణ' పేరుతో సినిమా రానుంది. నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామాయణ' చిత్రంలో రణ్బీర్కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రావణుడిగా కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ బాలీవుడ్లో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వెర్షన్ డైలాగ్స్ రాసే బాధ్యతను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్కు మేకర్స్ అప్పగించినట్లు సమాచారం. మాటల రచయితగా ఆయనకు టాలీవుడ్లో ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు సాహిత్యంపై ఆయనకు మంచి పట్టు ఉండటంతో చిత్ర యూనిట్ ఆయన్ను సంప్రదించిందని వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది. ఈ ఏడాదిలో 'గుంటూరు కారం'తో ప్రేక్షకులను మెప్పించిన త్రివిక్రమ్ తన తదుపరి సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. కానీ అల్లు అర్జున్తో సినిమా ఉంటుందని గతంలో ఆయన చెప్పారు. అయితే బన్నీ 'పుష్ప2'తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకవేళ ఈ చిత్రం పూర్తి అయిన తర్వాత కూడా ఆయన అట్లీతో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే రామాయణ టీమ్లోకి త్రివిక్రమ్ చేరడం దాదాపు లాంఛనమే అని చెప్పవచ్చు. ఏప్రిల్ 17న శ్రీరామనవమి రోజున ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి సమాచారం వచ్చే ఛాన్స్ వుంది. -
డైరెక్షన్ పై లేడీ సూపర్ స్టార్ ఇంటరెస్ట్..?
-
Thandel Shooting Pics: సాయి పల్లవి ఒళ్లో క్యూట్ పాప.. తండేల్ షూటింగ్ ఫోటోలు
-
నిరాశే మిగిల్చనున్న రామాయణం మూవీ డైరెక్టర్
-
తొలిసారి రొమాంటిక్ సాంగ్లో సాయిపల్లవి
మావీరన్, అయలాన్ చిత్రాల విజయాలతో మంచి ఖుషీగా ఉన్న నటుడు శివకార్తికేయన్. నటనకు అవకాశం ఉన్న పాత్రలనే అంగీకరించే నటి సాయిపల్లవి. ఈ రేర్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం అమరన్. నటుడు కమలహాసన్ తన రాజకమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న అమరన్ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇందులో నటుడు శివకార్తికేయన్ సైనికుడిగా నటిస్తున్నారు. ఆయనకు సతీమణిగా సాయి పల్లవి నటిస్తున్నారు.ఈ చిత్ర షూటింగ్ కాశ్మీర్లో 3 నెలల పాటు చిత్రీకరణను జరుపుకుంది. మరో పది రోజుల చిత్రీకరణతో షూటింగ్ పూర్తి అవుతుందని యూనిట్ సభ్యుల సమాచారం. కాగా మిగిలిన షూటింగ్ చైన్నె పరిసర ప్రాంతాలలో నిర్వహించి పూర్తి చేయనున్నట్లు తెలిసింది. ఇందులోని ఒక రొమాంటిక్ గీతాన్ని శివకార్తికేయన్, సాయి పల్లవిపై చిత్రీకరించనున్నట్లు తెలిసింది. రొమాంటిక్ సాంగ్స్లలో సాయిపల్లవి ఇప్పటి వరకు కనిపించింది లేదు. కానీ ఇందులో కథ అవసరం మేరకు ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఏదేమైన సాయిపల్లవి కొన్ని బార్డర్స్ ఎప్పటికీ దాటదని తెలిసిందే.తదుపరి నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్ట్లో అమరన్ చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీంతో శివకార్తికేయన్ తదుపరి చిత్రానికి సిద్ధమయ్యారు. ఏఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రారంభమై చిత్రీకరణను జరుపుకుంటోంది. కాగా దీంతో పాటు శివకార్తికేయన్ మరో రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాజా సమాచారం.Thank you for the wishes that came in today ❤️#VirataParvam will always be close to my heart ❤️And Vennela says hi 🥰 pic.twitter.com/aS4sqnTQLR— Sai Pallavi (@Sai_Pallavi92) June 17, 2023 -
తండేల్ సెట్లో నాగ చైతన్య.. మరోసారి గొప్ప మనసు చాటుకున్న హీరో!
అక్కినేని హీరో నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న తాజా చిత్రం తండేల్. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్పై బన్నీవాసు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మత్స్యకారుల బ్యాక్ డ్రాప్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి కనిపించనున్నారు. ఇదిలా ఉండగా.. నాగచైతన్య మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తన పర్సనల్ అసిస్టెంట్ వెంకటేశ్ బర్త్ డేను సెట్లోనే సెలబ్రేట్ చేసుకున్నారు. తండేల్ మూవీ సెట్లో కేక్ కట్ చేసి అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హీరోయిన్ సాయి పల్లవి, డైరెక్టర్ చందు కూడా అతనికి విషెస్ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్గా మారింది. తన వ్యక్తిగత సిబ్బందిని కూడా సొంతవాళ్లలా చూసుకునే చైతూపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. తండేల్ మూవీ ఈ ఏడాది దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. Our Queen @Sai_Pallavi92 🥹🤍 from the sets of #Thandel movie celebrating @chay_akkineni 's assistant Venki Bday ❤️#SaiPallavi @chandoomondeti pic.twitter.com/YwbFzksCSG — SaiPallavi.Fangirl07™ (@SaiPallavi_FG07) March 10, 2024 -
పబ్లో హీరోయిన్ సాయిపల్లవి మాస్ డ్యాన్స్.. వీడియో వైరల్
హీరోయిన్ సాయిపల్లవి పేరు చెప్పగానే క్యూట్ ఫేస్, అద్భుతమైన డ్యాన్సులే గుర్తొస్తాయి. స్వతహాగా డ్యాన్సర్ అయిన ఈమె.. టీనేజ్లోనే పలు రియాలిటీ షోల్లో చేసి బోలెడంత గుర్తింపు తెచ్చుకుంది. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా సినిమాలు చేస్తున్న ఈమె ప్రస్తుతం హిందీలో ఓ మూవీ చేస్తూ బిజీగా ఉంది. అలాంటి ఈమె ఇప్పుడు జపాన్లోని ఓ పబ్లో ఊరమాస్ డ్యాన్స్ చేయడం వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: 'సలార్' విలన్ పాన్ ఇండియా మూవీ.. ట్రైలర్ ఓ విజువల్ వండర్) మలయాళ 'ప్రేమమ్' సినిమాతో హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టిన సాయిపల్లవి.. 'ఫిదా'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. పడి పడి లేచే మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం తదితర చిత్రాల్లోనూ అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. వీటితో పాటు తమిళంలోనూ పలు హిట్ మూవీస్ చేసింది. ప్రస్తుతం కెరీర్ పరంగా చిన్న బ్రేక్ తీసుకున్న సాయిపల్లవి.. తెలుగు, తమిళ, హిందీల్లో తలో చిత్రం చేస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్.. హీరోగా హిందీలో తొలి సినిమా చేస్తున్నాడు. ఇందులోనే సాయిపల్లవి హీరోయిన్. కొన్నాళ్లుగా జపాన్లో షూటింగ్ జరుగుతోంది. తాజాగా షెడ్యూల్ పూర్తవడంతో.. టీమ్ అంతా చిన్న పార్టీ చేసుకున్నారు. ఇందులో సాయిపల్లవి ఓ హిందీ పాటకు క్రేజీ స్టెప్పులేసింది. ఆ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: శరత్బాబుతో బిడ్డను కనాలనుకున్నా: సీనియర్ నటి జయలలిత) Queen Sai Pallavi Dance at #EkDin japan schedule wraps up party 🥹♥️#SaiPallavi @Sai_Pallavi92 #Japan pic.twitter.com/j10iQTYQqd — Sai Pallavi FC™ (@SaipallaviFC) March 8, 2024 -
ఏప్రిల్ 17న 'రామాయణ' ప్రకటన.. అదే రోజు ఎందుకంటే
భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా హిందీలో 'రామాయణ' అనే సినిమా రూపొందనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మూడు భాగాలుగా రానున్న ఈ చిత్రంలో రాముడి పాత్రలో రణ్బీర్ కపూర్, సీత పాత్రలో సాయిపల్లవి, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, రావణుడి పాత్రలో యశ్, శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇతిహాస గాథను తెరపై అద్భుతంగా చూపించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాది వేసవిలో ప్రారంభించాలనుకుంటున్నారట. అంతేకాకుండా ఈ భారీ ప్రాజెక్ట్కు సంబంధించిన విషయాలను శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 17న ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో తాను పోషించనున్న రాముడి పాత్ర ఆహార్యం కోసం రణ్బీర్ కపూర్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకోనున్నారని బాలీవుడ్ సమాచారం. డైలాగ్స్ స్పష్టంగా పలికేందుకు కూడా డైలాగ్ డిక్షన్లో రణ్బీర్ ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారట. ఇక ఈ సినిమాను నమిత్ మల్హోత్రా, మధు మంతెన, అల్లు అరవింద్లు భారీ బడ్జెట్తో నిర్మిస్తారనే ప్రచారం సాగుతోంది. -
నాగ చైతన్య హీరోయిన్పై సమంత కామెంట్లు
సమంత.. పరిచయం అక్కర్లేని పేరు. దక్షిణాదిలోని స్టార్ హీరోయిన్లలో ఒకరిగా తనకంటూ ఎంతో క్రేజ్, ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ బ్యూటీ బాలీవుడ్లోనూ రాణిస్తున్నారు. అయితే మయోసైటిస్ వ్యాధి వల్ల ఏడాది పాటు సినిమాల నుంచి సమంత బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. కానీ, ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చినా ఎప్పటికప్పుడు తన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ తన క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా చూసుకున్నారు సమంత. మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకుంటున్న ఆమె మళ్లీ నటించడానికి సిద్ధం అంటూ ఇటీవల తెలిపిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇదిలా ఉంటే.. హీరోయిన్ సాయిపల్లవిపై సమంత చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. సాయి పల్లవి హీరోయిన్ కాకముందు పలు డ్యాన్స్ షోలలో పాల్గొన్న సంగతి తెలిసిందే. వాటిలో ఓ షోలో సాయి పల్లవి డ్యాన్స్ చేసిన ఓ ఎపిసోడ్కు సమంత జడ్జిగా వ్యవహరించారు. ‘‘సాయిపల్లవి మంచి డ్యాన్సర్ అనే విషయం నాకు తెలుసు. గతంలో తను పాల్గొన్న ఓ డ్యాన్స్ షోకి నేను జడ్జిగా కూడా వెళ్లాను. తను డ్యాన్స్ చేస్తుంటే దృష్టి మరల్చలేక కళ్లప్పగించి అలా చూస్తూ ఉండిపోయాను. తన డ్యాన్స్ అద్భుతం’’ అన్నారు. ఇలా తోటి హీరోయిన్పై ప్రశంసలు కురిపించిన సమంతపై ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందిస్తున్నారు. ప్రస్తుతం ‘సిటాడెల్’ అనే హిందీ వెబ్సిరీస్ను పూర్తి చేసే పనిలో ఉన్నారు సమంత. నాగ చైతన్య తండేల్ సినిమాలో సాయిపల్లవి నటిస్తున్న సంగతి తెలిసిందే.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
17, 18 తేదీల్లో గైట్లో ఎస్టీయూ రాష్ట్ర స్థాయి శిక్షణ
నేడు, రేపు గురుకుల పాఠశాలల్లో సీట్ల భర్తీ
No Headline
No Headline
శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణం
శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ‘గంగుల’
కరీంనగర్లో ‘లండన్’ ఎగ్జిబిషన్
నేలకు సారం.. పంటకు ప్రాణం
పనులు సత్వరమే పూర్తి చేయాలి
బీమా చెక్కు అందజేత
తప్పక చదవండి
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- భర్తతో విడిపోయిన సీరియల్ నటి.. సోషల్ మీడియాలో పోస్ట్
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
- Virat Kohli: ఒక్కసారి క్రికెట్కు వీడ్కోలు పలికితే.. కోహ్లి నోట రిటైర్మెంట్ మాట!
- భారత సంతతి బాలుడికి దుబాయ్ పోలీసుల సత్కారం!
- IPL 2024: సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరదు.. ఆ నాలుగు జట్లే! ఫ్యాన్స్ ఫైర్
- మళ్లీ మనదే అధికారం.. చరిత్ర సృష్టించబోతున్నాం: సీఎం జగన్
Advertisement