-
ఈ పిల్లాడు.. టీమిండియా నయా సూపర్స్టార్? గుర్తుపట్టారా?
-
Saina Nehwal: రాజస్తాన్ రాయల్స్ జట్టుతో సైనా నెహ్వాల్.. ఫొటోలు వైరల్
-
Saina Nehwal: జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలంటున్న సైనా నెహ్వాల్
-
మహిళలపై ఎమ్మెల్యే అలాంటి వ్యాఖ్యలు.. సైనా నెహ్వాల్ ఆవేదన
బీజేపీ మహిళా అభ్యర్థిపై కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే షామనూరు శివశంకరప్ప చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం రేగింది. దావణగెరె స్థానం నుంచి బరిలో బీజేపీ అభ్యర్థికి "వంటగదిలో వంట చేయడం మాత్రమే తెలుసు" అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపైన స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ స్పందించింది. స్త్రీలను వంటగదికే పరిమితం చేయాలి అనే వ్యాఖ్యలకు కలత చెందిన సైనా నెహ్వాల్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఒక పోస్ట్ చేసింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన స్త్రీద్వేషపూరిత వ్యాఖ్యలు బాధాకరం. ఆడపిల్లలు అన్నిరంగాల్లో దూసుకెళ్లాలని కలలు కంటున్నప్పుడు ఇలా అనడం సమంజసం కాదు. ఒకవైపుకు మహిళామణులను ఒక శక్తిగా భావిస్తున్నారు. మోదీ సర్కార్ మహిళల కోసం అనేక రిజర్వేషన్ బిల్లులు తీసుకువస్తున్నారు. అలాంటి సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు తగదని అన్నారు. దావణగెరె స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ఎంపీ జీఎం సిద్దేశ్వర భార్య గాయత్రి సిద్దేశ్వరను బరిలోకి దింపింది. ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన కోడలు ప్రభా మల్లికార్జున్ కోసం ఆయన ప్రచారం చేస్తున్న సందర్భంగా శివశంకరప్ప ఈ వ్యాఖ్యలు చేశారు. గాయత్రి సిద్దేశ్వరను ఉద్దేశించి ఎమ్మెల్యే శామనూరు శివశంకరప్ప మాట్లాడుతూ.. ‘ఆమె ఎన్నికల్లో గెలిచి (ప్రధాని) మోదీకి కమలం అందించాలనుకుంటోందని మీ అందరికీ తెలుసు. ముందు దావణగెరె సమస్యలను అర్థం చేసుకోవాలి. ఈ ప్రాంతంలో మేము అభివృద్ధి పనులు చేశాం. ఆమెకు మాట్లాడటం తెలియదు. కిచెన్లో వంట చేయడం మాత్రమే తెలుసని అన్నారు. “Woman should be restricted to the kitchen"- This is what a top Karnataka leader Shamanur Shivashankarappa ji has said . This sexist jibe at @bjp4india candidate from Davanagere Gayathri Siddeshwara ji is least expected from a party that says Ladki Hoon Lad Sakti Hoon When I… — Saina Nehwal (@NSaina) March 30, 2024 -
అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో బ్యాడ్మింటన్ జోడీ సైనా నెహ్వాల్- పారుపల్లి కశ్యప్ (ఫొటోలు)
-
పర్ఫెక్ట్ అంబానీ వెడ్డింగ్: భర్తతో కలిసి సైనా సందడి (ఫొటోలు)
-
Anant -Radhika: రాయల్ టెంట్ అదుర్స్! వీడియో షేర్ చేసిన సైనా
Anant Ambani Radhika Pre Wedding: అంబానీల వారసుడు అనంత్- రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సెలబ్రిటీ లోకం తరలివెళ్లింది. క్రీడా, సినీ ప్రముఖులు గుజరాత్లో సందడి చేస్తూ అంబానీ కుటుంబ సంబరాల్లో పాలు పంచుకుంటున్నారు. హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్- పారుపల్లి కశ్యప్దంపతులు కూడా జామ్నగర్కు విచ్చేశారు. ఈ నేపథ్యంలో సైనా.. ‘‘పర్ఫెక్ట్ అంబానీ వెడ్డింగ్’’ పేరిట తాము ఉండబోయే రాయల్ టెంట్ టూర్ వీడియో షేర్ చేసింది. ముందస్తు పెళ్లి వేడుకల కోసం వచ్చే అతిథుల కోసం దాదాపు అరవై దాకా ఈ టెంట్లు వేయించినట్లు తెలుస్తోంది. పచ్చని మైదానంలో ఆహ్లాదకర వాతావరణంలో నిర్మించిన ఈ తాత్కాలిక నివాసాన్ని నాలుగు గదులుగా విభజించారు. ఇందులో లివింగ్ ఏరియా, మాస్టర్ బెడ్రూం హైలైట్గా నిలిచాయి. ఇండోర్ ప్లాంట్లను కూడా జతచేసి మనసుకు హాయి కలిగించేలా.. అన్ని రకాల సదుపాయాలతో వీటిని తీర్చిదిద్దారు. సైనా నెహ్వాల్ షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.. టాలీవుడ్ నుంచి రామ్చరణ్- ఉపాసన దంపతులు కూడా అంబానీ ముందస్తు పెళ్లి వేడుకల్లో పాల్గొనేందుకు జామ్నగర్కు వెళ్లారు. చదవండి: ‘రాజు- రాణి వచ్చేశారు’.. అనంత్- రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలకు కోహ్లి?! నిజం ఇదే View this post on Instagram A post shared by SAINA NEHWAL (@nehwalsaina) -
సైనా నెహ్వాల్ గ్యారేజిలో చేరిన కొత్త అతిథి - వీడియో వైరల్
ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ 'సైనా నెహ్వాల్' ఇటీవల తన గ్యారేజిలో ఓ ఖరీదైన జర్మన్ లగ్జరీ కారుని చేర్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సైనా నెహ్వాల్ కొన్న కారు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన 'AMG GLE 53 4MATIC+ Coupe'. దీని ధర రూ.1.8 కోట్లు. బాలీవుడ్ నటి సుస్మితా సేన్ తరువాత ఈ కారుని కొన్న వ్యక్తి 'సైనా నెహ్వాల్' కావడం విశేషం. కారు డెలివరీకి సంబంధించిన ఫోటోలను ఈమె తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా షేర్ చేసింది. మెర్సిడెస్ ఏఎంజీ జీఎల్ఈ దేశీయ మార్కెట్లో ఖరీదైన కార్ల జాబితాలో ఒకటైన 'మెర్సిడెస్ ఏఎంజీ జీఎల్ఈ' మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 3.0 లీటర్ 6 సిలిండర్ ఇన్లైన్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్ ఇంజన్ ఉంటుంది. ఇంజన్ గరిష్టంగా 435 పీఎస్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో జతచేయబడి ఉంటుంది. ఈ కారు 5.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 249 కిమీ. ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడం.. ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో రెండు 12.3 ఇంచెస్ డిస్ప్లేలు ఉంటాయి. ఒకటి ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, మరొకటి డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. వీటితో పాటు ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, 13 స్పీకర్ బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్, రిమోట్ ఇంజిన్ స్టార్ట్, పనోరమిక్ సన్రూఫ్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ కూడా ఇందులో లభిస్తాయి. View this post on Instagram A post shared by SAINA NEHWAL (@nehwalsaina) -
బంజారాహిల్స్లో కెఫేలో సందడి చేసిన తారలు (ఫొటోలు)
-
రిటైర్మెంట్ ఆలోచన లేదు: సైనా నెహ్వాల్
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే అవకాశాలు తక్కువగానే ఉన్నప్పటికీ... ఇప్పట్లో ఆటకు వీడ్కోలు పలికే ఆలోచన లేదని భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ స్పష్టం చేసింది. మోకాలి గాయంతో బాధపడుతున్న 33 ఏళ్ల సైనా గత జూన్ నుంచి అంతర్జాతీయ టోర్నీలకు దూరంగా ఉంది. ఫలితంగా ఒకప్పుడు ప్రపంచ నంబర్వన్గా ఉన్న ఆమె ప్రస్తుతం 55వ ర్యాంక్కు పడిపోయింది. ‘ప్రపంచ చాంపియన్ ఆన్ సె యింగ్, తై జు యింగ్, అకానె యామగుచిలాంటి స్టార్స్తో తలపడాలంటే కేవలం ఒక గంట శిక్షణ సరిపోదు. పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించాకే మళ్లీ బరిలోకి దిగుతాను. ప్రతి ప్లేయర్ రిటైర్ అవుతాడు. నా విషయంలో మాత్రం వీడ్కోలు పలికేందుకు తుది గడువు పెట్టుకోలేదు’ అని 2019లో చివరిసారి అంతర్జాతీయ టోర్నీ టైటిల్ గెలిచిన సైనా వ్యాఖ్యానించింది. -
అప్పుడు వాళ్లు అలా! ఇప్పుడు వీరిలా.. తలెత్తుకునేలా చేశారు.. శెభాష్!
Independence Day 2023: ఝాన్సీ లక్ష్మీబాయి.. బేగం హజ్రత్ మహల్.. అనీ బిసెంట్.. కమలా నెహ్రూ.. సరోజిని నాయుడు.. ఇలా ఎంతో మంది వీరవనితలు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని మహిళలు ఎవరికీ తీసిపోరని నిరూపించారు. స్వేచ్ఛా వాయువులు పీల్చేందుకు బ్రిటిషర్లతో జరిగిన మహాసంగ్రామంలో తాము సైతం అంటూ ముందడుగు వేసి జాతిని బానిస సంకెళ్ల నుంచి విముక్తి చేయడంలో కీలక పాత్ర పోషించారు. వారి స్ఫూర్తితో మరెంతో మంది స్త్రీమూర్తులు వంటింటి నుంచి బయటకు వచ్చి విద్య, వైద్యం సహా అన్ని రంగాల్లో తమ ప్రాతినిథ్యం ఉండేలా అడుగులు వేశారు. అయితే, నేటికీ స్వతంత్ర భారతంలో ఆడపిల్లలపై వివక్ష ఇంకా కొనసాగుతుండటం విచారకరం. అమ్మాయి పుట్టిందంటే మహాలక్ష్మి ఇంట్లో అడుగుపెట్టిందని సంతోషంతో స్వాగతాలు పలికేది కొందరైతే.. తల్లి కడుపులో ఉండగానే ఆడ శిశువులను చిదిమేసే కిరాతకులలు ఎందరో! మహిళల ఆహారపుటలవాట్లు మొదలు వస్త్రధారణ, చేయాల్సిన ఉద్యోగం గురించి కూడా తామే నిర్ణయించే ఈ పురుషాధిక్య ప్రపంచంలో.. అసమానతలను అధిగమించి ‘విశ్వవేదిక’పై సత్తా చాటడటమంటే మామూలు విషయం కాదు. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి క్రీడల్లో తలమానికమైన ఒలింపిక్స్లో భారత జాతి గర్వపడే విజయాలు సాధించిన బంగారు తల్లుల గురించి తెలుసుకుందాం! కరణం మల్లీశ్వరి ఒలింపిక్స్లో మొట్టమొదటి పతకం సాధించిన భారత మహిళగా ఆంధ్రప్రదేశ్కు చెందిన కరణం మల్లీశ్వరి చరిత్ర సృష్టించింది. సిడ్నీ ఒలింపిక్స్- 2000లో వెయిట్లిఫ్టింగ్ 54 కేజీల విభాగంలో కాంస్యం సాధించింది. తద్వారా వెయిట్లిఫ్టింగ్లో ఒలింపిక్ మెడల్ సాధించిన మొట్టమొదటి ప్లేయర్గా రికార్డులకెక్కింది. సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్లో భారత్కు తొలి పతకం అందించిన ప్లేయర్గా సైనా నెహ్వాల్ పేరు చరిత్రలో నిలిచిపోయింది. లండన్ ఒలింపిక్స్-2012లో ఈ మాజీ వరల్డ్ నంబర్ 1.. కాంస్య పతకం గెలిచింది. అంతకు ముందు బీజింగ్-2008, ఆ తర్వాత 2016- రియో ఒలింపిక్స్లోనూ ఆమె భారత్కు ప్రాతినిథ్యం వహించింది. మేరీ కోమ్ భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్. 2012 లండన్ ఒలింపిక్స్లో దేశానికి కాంస్యం అందించింది. బాక్సింగ్లో భారత్ తరఫున తొలి పతకం గెలిచిన మహిళా బాక్సర్గా చరిత్రకెక్కింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో కాంస్య గెలిచిన విజేందర్ సింగ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత బాక్సర్గా నిలిచింది ఈ మణిపురీ ఆణిముత్యం. పీవీ సింధు ఒలింపిక్స్లో తెలుగు తేజం పూసర్ల వెంకట సింధుది అసాధారణ విజయం. 2016 రియో ఒలింపిక్స్లో ఫైనలిస్టు అయిన బ్యాడ్మింటన్ స్టార్ సింధు.. రజత పతకం సాధించింది. ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళా క్రీడాకారిణిగా నిలిచింది. ఇక 2020 టోక్యో ఒలింపిక్స్లోనూ సింధు మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. గతంలో సిల్వర్ గెలిచిన ఆమె.. ఈసారి కాంస్యంతో సరిపెట్టుకుంది. అయితే, ఒలింపిక్స్లో వరుసగా రెండు పతకాలు గెలిచిన తొలి భారత ప్లేయర్గా రికార్డులకెక్కడం విశేషం. సాక్షి మాలిక్ 2016 రియో ఒలింపిక్స్లో రెజ్లింగ్ విభాగంలో సాక్షి మాలిక్ భారత్కు కాంస్యం అందించింది. 58 కేజీల విభాగంలో మెడల్ గెలిచింది. తద్వారా ఒలింపిక్స్లో పతకం సాధించిన భారత తొలి మహిళా రెజ్లర్గా చరిత్ర సృష్టించింది. మీరాబాయి చాను 2016లో నిరాశను మిగిల్చిన వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను.. టోక్యో 2020 ఒలింపిక్స్లో మాత్రం సత్తా చాటింది. 49 కేజీల విభాగంలో వెండి పతకం గెలిచింది. తద్వారా ఒలింపిక్స్లో వెయిట్ లిఫ్టింగ్లో.. సిల్వర్ మెడల్ సాధించిన తొలి ప్లేయర్గా రికార్డు సాధించింది. లవ్లీనా బొర్గొహెయిన్ అసామీ బాక్సర్ లవ్లీనా బొర్గొహెయిన్ 2020 టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం గెలిచింది. కనీస వసతులు లేని గ్రామం నుంచి వచ్చిన లవ్లీనా తన ప్రతిభతో తమ ఊరి పేరును ప్రపంచానికి తెలిసేలా చేసింది. చదవండి: దూకుడు నేర్పిన దాదా.. భారత క్రికెట్కు స్వర్ణయుగం.. అగ్రశ్రేణి జట్లకు వణుకు -
కశ్మీర్ ట్రిప్లో బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్.. వైరల్ ఫొటోలు
-
Thailand Open 2023: సింధు, శ్రీకాంత్లకు చుక్కెదురు
బ్యాంకాక్: థాయ్లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, సమీర్ వర్మ, ప్రియాన్షు రజావత్, మిథున్ మంజునాథ్... మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, మాళవిక తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. మరోవైపు కిరణ్ జార్జ్, లక్ష్య సేన్, సైనా నెహ్వాల్, అష్మిత చాలిహా తొలి రౌండ్లో గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్కు కిరణ్ షాక్ పురుషుల సింగిల్స్లో 26వ ర్యాంకర్ వెంగ్ హాంగ్ యాంగ్ (చైనా)తో జరిగిన మ్యాచ్లో 21వ ర్యాంకర్ శ్రీకాంత్ 8–21, 21–16, 14–21తో ఓడిపోయాడు. సాయిప్రణీత్ 14–21, 16–21తో క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో, ప్రియాన్షు 19–21, 10–21తో ఎన్జీ జె యోంగ్ (మలేసియా) చేతిలో, సమీర్ వర్మ 15–21, 15–21తో జొహాన్సన్ (డెన్మార్క్), మిథున్ (భారత్) 21–17, 8–21, 15–21తో కున్లావుత్ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయారు. ప్రపంచ 59వ ర్యాంకర్ కిరణ్ జార్జ్ 21–18, 22–20తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, 2018 ప్రపంచ చాంపియన్షిప్ రన్నరప్ షి యు కి (చైనా)పై సంచలన విజయం సాధించగా... లక్ష్య సేన్ 21–23, 21–15, 21–15తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ)పై కష్టపడి గెలిచాడు. 26 నిమిషాల్లోనే... దాదాపు రెండు నెలల తర్వాత మరో అంతర్జాతీయ టోర్నీలో బరిలోకి దిగిన భారత స్టార్ సైనా నెహ్వాల్ తొలి రౌండ్లో కేవలం 26 నిమిషాల్లో 21–13, 21–7తో వెన్ జు జాంగ్ (కెనడా)పై గెలిచింది. మరో మ్యాచ్లో క్వాలిఫయర్ అష్మిత 21–17, 21– 14తో భారత్కే చెందిన మాళవికను ఓడించింది. తొమ్మిదేళ్ల తర్వాత... కెనడా ప్లేయర్, ప్రపంచ 15వ ర్యాంకర్ మిచెల్లి లీతో జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ లో ప్రపంచ 13వ ర్యాంకర్ పీవీ సింధు 8–21, 21–18, 18–21తో ఓటమి చవిచూసింది. మిచెల్లి చేతిలో సింధు ఓడిపోవడం తొమ్మిదేళ్ల తర్వాత ఇదే తొలిసారి. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 21–13,18–21, 21–17తో రస్ముస్ జెర్ –సొగార్డ్ (డెన్మార్క్) జోడీపై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. -
ఆసియా క్రీడలకు సైనా దూరం! కారణమిదే
న్యూఢిల్లీ: భారత మహిళా స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఈ ఏడాది సెప్టెంబర్–అక్టోబర్లలో చైనాలో జరిగే ఆసియా క్రీడలకు దూరం కానుంది. ఈ మెగా ఈవెంట్లో పాల్గొనే భారత బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక కోసం ఈనెల 4 నుంచి 7 వరకు హైదరాబాద్లో నిర్వహించనున్న సెలెక్షన్ట్రయల్స్ టోర్నీలో సైనా నెహ్వాల్ పాల్గొనడంలేదు. ‘ఫిట్నెస్ సంబంధిత సమస్యల కారణంగా సైనా ట్రయల్స్లో బరిలోకి దిగడంలేదు. సైనాతోపాటు పురుషుల డబుల్స్ జోడీ కుశాల్ రాజ్, ప్రకాశ్ రాజ్ కూడా ట్రయల్స్ టోర్నీ నుంచి వైదొలిగారు’ అని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) కార్యదర్శి సంజయ్ మిశ్రా తెలిపారు. చదవండి: ‘బ్రిజ్భూషణ్ను రక్షించే ప్రయత్నమిది’ న్యూఢిల్లీ: తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగిస్తున్న భారత అగ్రశ్రేణి రెజ్లర్లకు అన్ని వైపుల నుంచి సంఘీభావం లభిస్తోంది. తాజాగా కాంగ్రెస్ నేత, భారత మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ కూడా వేదిక వద్దకు వచ్చి తన మద్దతు ప్రకటించాడు. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ సింగ్ను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అతనిపై చర్యకు వెనుకాడుతోందని సిద్ధూ విమర్శించాడు. ‘ఎఫ్ఐఆర్ ఎందుకు ఆలస్యం చేశారు. అందులో వివరాలు ఎందుకు బయటపెట్టడం లేదు. దానిని బలహీనంగా తయారు చేశారని అర్థమవుతోంది. అన్నీ దాచేసి బ్రిజ్భూషణ్ను రక్షించే ప్రయత్నమే ఇదంతా. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తే ఇప్పటి వరకు అరెస్ట్ ఎందుకు చేయలేదు. విచారణ నిష్పక్షపాతంగా జరగాలి’ అంటూ సిద్ధూ వ్యాఖ్యానించాడు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా కూడా రెజ్లర్లకు సంఘీభావం పలకగా... రేడియోలో ‘మన్కీ బాత్’ కాదు, రెజ్లర్ల వద్దకు వచ్చి వారి మన్కీ బాత్ వినాలని ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్ సూచించారు. మరోవైపు తనను ఉరి తీసినా పర్వాలేదని, రెజ్లింగ్ పోటీలు మాత్రం ఆగరాదని బ్రిజ్భూషణ్ అన్నాడు. ‘గత నాలుగు నెలలుగా రెజ్లింగ్ కార్యకలాపాలు ఆగిపోయాయి. పిల్లల భవిష్యత్తుతో ఆడుకోకండి. తక్షణం ఎవరి ఆధ్వర్యంలోనైనా క్యాడెట్ నేషనల్స్ నిర్వహించండి. లేదంటే వయసు పెరిగి కుర్రాళ్లు అవకాశం కోల్పోతారు. నన్ను ఉరి తీయండి కానీ ఆట మాత్రం ఆగవద్దు’ అని బ్రిజ్భూషణ్ చెప్పాడు. -
సైనా, సాయిప్రణీత్ ఓటమి
న్యూఢిల్లీ: ఓర్లియాన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ లో భారత స్టార్స్ సైనా నెహ్వాల్, సాయిప్రణీత్ నిరాశ పరిచారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సైనా 16–21, 14–21తో తుర్కియే షట్లర్ నిష్లిహాన్ యిగిట్ చేతిలో... పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సాయిప్రణీత్ 20–22, 17–21తో లీంగ్ జున్ హావో (మలేసియా) చేతిలో ఓడిపోయారు. -
Hyderabad : ‘టీచ్ ఫర్ చేంజ్’ ఈవెంట్లో సెలబ్రిటీల తళుకులు (ఫొటోలు)
-
సైనాకు చేదు అనుభవం
జకార్తా: ఈ ఏడాది ఆడుతున్న మూడో టోర్నమెంట్లోనూ భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ప్రిక్వార్టర్ ఫైనల్ దశను దాటలేకపోయింది. మలేసియా ఓపెన్లో తొలి రౌండ్లో, ఇండియా ఓపెన్లో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిన సైనా... తాజాగా ఇండోనేసియా మాస్టర్స్ సూపర్–500 టోర్నీలోనూ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 28వ ర్యాంకర్ సైనా 15–21, 7–21తో ప్రపంచ 11వ ర్యాంకర్ హాన్ యు (చైనా) చేతిలో పరాజయం పాలైంది. కేవలం 29 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో సైనా ఏ దశలోనై చైనా ప్లేయర్కు పోటీనివ్వలేకపోయింది. తొలి గేమ్లోనైతే సైనా ఆరంభంలోనే వరుసగా 10 పాయింట్లు కోల్పోయి 0–10తో వెనుకబడిపోయింది. క్వార్టర్స్లో లక్ష్య సేన్ ఇక రెండో గేమ్లో సైనా తొలుత వరుసగా మూడు పాయింట్లు, అనంతరం వరుసగా ఎనిమిది పాయింట్లు సమర్పించుకొని కోలుకోలేకపోయింది. పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 19–21, 21–8, 21–17తో ఎన్జీ జె యోంగ్ (మలేసియా)పై గెలుపొందాడు. చదవండి: పోటీకి సిద్ధమైన రెజ్లర్లు ఈ ఏడాది తొలి అంతర్జాతీయ టోర్నీ జాగ్రెబ్ ఓపెన్ గ్రాండ్ప్రిలో బరిలోకి దిగేందుకు భారత అగ్రశ్రేణి రెజ్లర్లు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు క్రొయేషియాలో జరిగే ఈ టోర్నీలో టోక్యో ఒలింపిక్స్ పతక విజేతలు బజరంగ్, రవి కుమార్, దీపక్ పూనియాలు పోటీపడనున్నారు. వీరితోపాటు మహిళా స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, అన్షు మలిక్ బరిలోకి దిగనున్నారు. ఒకవైపు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ కమిటీ ఏర్పాటు కాగా.. మరోవైపు ఈ మేరకు రెజ్లర్లు టోర్నికి సిద్ధం కావడం విశేషం. చదవండి: Team India: అలా అయితే ఆ రెండు జట్లను బ్యాన్ చేయాలి! క్రికెట్ను భ్రష్టు పట్టించేవాళ్లు అక్కడ లేరు Sania Mirza: సానియా మీర్జా భావోద్వేగం.. ఓటమితో ముగింపు! కెరీర్లో ఎన్ని గ్రాండ్స్లామ్ టైటిళ్లు అంటే? -
భారత్ పోరాటం ముగిసె...
న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరుగుతున్న ఇండియా ఓపెన్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ఆటగాళ్ల పోరాటం ప్రిక్వార్టర్స్లోనే ముగిసింది. పురుషుల సింగిల్స్లో డిఫెండింగ్ చాంపియన్ లక్ష్యసేన్, మహిళల సింగిల్స్లో వెటరన్ స్టార్ సైనా నెహ్వాల్ పరాజయం పాలయ్యారు. పురుషుల డబుల్స్లో సాత్విక్ గాయంతో వైదొలగగా... కృష్ణ ప్రసాద్–విష్ణువర్ధన్ గౌడ్ జోడీ ఓడిపోయింది. మహిళల డబుల్స్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జంట కూడా నిరాశపరిచింది. గురువారం జరిగిన పోటీల్లో ప్రపంచ 12వ ర్యాంకర్, ఏడో సీడ్ లక్ష్యసేన్ 21–16, 15–21, 18–21తో ప్రపంచ 20వ ర్యాంకర్ రస్మస్ గెమ్కే (డెన్మార్క్) చేతిలో కంగుతిన్నాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో సైనా 9–21, 12–21తో ఒలింపిక్ చాంపియన్ చెన్ యు ఫె (చైనా) ధాటికి నిలువలేకపోయింది. మహిళల డబుల్స్ ప్రి క్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా జాలీ జంట 9–21, 16–21తో ఆరో సీడ్ జాంగ్ షు జియాన్–జెంగ్ యు (చైనా) ద్వయం చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్లో గరగ కృష్ణప్రసాద్–విష్ణువర్ధన్ గౌడ్ జోడీ 14–21, 10–21తో లియాంగ్ వి కెంగ్– వాంగ్ చాంగ్ (చైనా) ద్వయం చేతిలో ఇంటిదారి పట్టింది. సాత్విక్ సాయిరాజ్ తుంటిగాయం వల్ల చిరాగ్ షెట్టితో కలిసి బరిలోకి దిగలేకపోయాడు. దీంతో చైనాకే చెందిన లియు చెన్–జువాన్ యి జంట వాకోవర్తో ముందంజ వేసింది. -
సింధు ఇంటికి... సైనా ముందుకు
న్యూఢిల్లీ: ఈ ఏడాది వరుసగా రెండో అంతర్జాతీయ టోర్నీలోనూ భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. గతవారం మలేసియా ఓపెన్ టోర్నీలోనూ సింధు తొలి రౌండ్లోనే ఓటమి పాలైంది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 45 నిమిషాల్లో 12–21, 20–22తో ప్రపంచ 30వ ర్యాంకర్ సుపనిద కటెథోంగ్ (థాయ్లాండ్) చేతిలో పరాజయం పాలైంది. గత ఏడాది ఇండియా ఓపెన్లో సెమీఫైనల్లో సుపనిద చేతిలోనే ఓడిపోయిన సింధుకు ఈసారీ అదే ఫలితం ఎదురైంది. మరోవైపు భారత్కే చెందిన మరో స్టార్ సైనా నెహ్వాల్ తీవ్రంగా శ్రమించి తొలి రౌండ్ అడ్డంకిని అధిగమించింది. ప్రపంచ 24వ ర్యాంకర్ మియా బ్లిచ్ఫెల్ట్ (డెన్మార్క్)తో 63 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో సైనా నెహ్వాల్ 21–17, 12–21, 21–19తో విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. లక్ష్య సేన్ శుభారంభం పురుషుల సింగిల్స్లో డిఫెండింగ్ చాంపియన్ లక్ష్య సేన్ (భారత్) శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో లక్ష్య సేన్ 21–14, 21–15తో భారత్కే చెందిన హెచ్ఎస్ ప్రణయ్ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరాడు. గతవారం మలేసియా ఓపెన్ తొలి రౌండ్ లో ప్రణయ్ చేతిలో ఎదురైన ఓటమికి ఈ విజయంతో లక్ష్య సేన్ బదులు తీర్చుకున్నాడు. సాత్విక్ జోడీ ముందంజ పురుషుల డబుల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపి యన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–13, 21–15తో మాథ్యూ–క్రిస్టోఫర్ గ్రిమ్లే (స్కాట్లాండ్) జోడీపై గెలిచింది. మరో మ్యాచ్లో పంజాల విష్ణువర్ధన్ గౌడ్–గరగ కృష్ణప్రసాద్ (భారత్) జోడీ 21–11, 23–25, 21–9తో రూబెన్ జిలీ–టియెస్ వాన్ డెర్ (నెదర్లాండ్స్) ద్వయంపై నెగ్గింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జంట 22–20, 17–21, 21–18తో మార్గోట్ లాంబర్ట్–ఆనీ ట్రాన్ (ఫ్రాన్స్) జోడీపై గెలుపొందగా... సిక్కి రెడ్డి–శ్రుతి మిశ్రా (భారత్) ద్వయం 17–21, 19–21తో లిండా ఎఫ్లెర్–ఇసాబెల్ (జర్మనీ) జోడీ చేతిలో ఓడిపోయింది. చదవండి: IND vs NZ 1st ODI: టీమిండియాతో తొలి వన్డే.. న్యూజిలాండ్కు బిగ్ షాక్ -
సింధు పునరాగమనం
కౌలాలంపూర్: గాయంతో ఐదు నెలలు ఆటకు దూరంగా ఉన్న భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు కొత్త ఏడాదిని ఘనంగా ప్రారంభించాలనే పట్టుదలతో ఉంది. నేటి నుంచి జరిగే మలేసియా ఓపెన్ సూపర్–1000 టోర్నీతో 2023 బ్యాడ్మింటన్ సీజన్ ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులందరూ బరిలోకి దిగుతున్నారు. మహిళల సింగిల్స్లో భారత్ తరఫున పీవీ సింధు, ఆకర్షి కశ్యప్, సైనా నెహ్వాల్, మాళవిక ... పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, లక్ష్య సేన్ పోటీపడుతున్నారు. గత ఏడాది ఆగస్టులో కామన్వెల్త్ గేమ్స్లో చివరిసారి బరిలోకి దిగిన సింధు మహిళల సింగిల్స్లో భారత్కు స్వర్ణ పతకాన్ని అందించింది. ఆ తర్వాత చీలమండ గాయంతో ప్రపంచ చాంపియన్షిప్తోపాటు ఇతర టోర్నీలకు ఆమె దూరంగా ఉంది. సింధు బుధవారం జరిగే తొలి రౌండ్లో మూడుసార్లు ప్రపంచ చాంపియన్, రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత కరోలినా మారిన్ (స్పెయిన్)తో తలపడుతుంది. పురుషుల సింగిల్స్లో మంగళవారం తొలి రౌండ్ మ్యాచ్లో కెంటా నిషిమోటో (జపాన్)తో కిడాంబి శ్రీకాంత్ ఆడతాడు. 12 లక్షల 50 వేల డాలర్ల (రూ. 10 కోట్ల 29 లక్షలు) ప్రైజ్మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 87,500 డాలర్ల చొప్పున (రూ. 72 లక్షలు) అందజేస్తారు. -
సెలెక్షన్ ట్రయల్స్కు సైనా దూరం
న్యూఢిల్లీ: వచ్చే నెలలో దుబాయ్లో జరిగే ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్షిప్లో పాల్గొనే భారత జట్టును ఎంపిక చేసేందుకు ఈరోజు సెలెక్షన్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. ర్యాంకింగ్ ఆధారంగా మహిళల సింగిల్స్లో పీవీ సింధును నేరుగా జట్టులో ఎంపిక చేయగా... రెండో బెర్త్ కోసం సైనా నెహ్వాల్, ఆకర్షి కశ్యప్, మాళవిక బన్సోద్లను భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) సెలెక్షన్ ట్రయల్స్కు ఆహ్వానించింది. అయితే తాము సెలెక్షన్ ట్రయల్స్కు హాజరు కాలేమని సైనా, మాళవిక ‘బాయ్’కు సమాచారం ఇచ్చారు. సైనా, మాళవిక వైదొలిగిన నేపథ్యంలో ఈ ట్రయల్స్కు అష్మిత చాలియాను ‘బాయ్’ ఎంపిక చేసింది. అష్మిత, ఆకర్షి మధ్య జరిగే ట్రయల్స్ మ్యాచ్లో గెలిచిన వారికి జట్టులో రెండో సింగిల్స్ ప్లేయర్గా స్థానం లభిస్తుంది. 32 ఏళ్ల సైనా గత ఏడాది 14 అంతర్జాతీయ టోర్నీలలో పాల్గొని ఒక్క దాంట్లోనూ క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయింది. ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్షిప్లో భారత్ నుంచి 14 మంది బరిలోకి దిగనున్నారు. ర్యాంకింగ్ ఆధారంగా పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్... పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టిలను నేరుగా జట్టులోకి ఎంపిక చేశారు. మిగతా బెర్త్ల కోసం నేడు ట్రయల్స్ను ఏర్పాటు చేశారు. -
సంపాదించిన ప్రతీ రూపాయి ఇంట్లోకే: సైనా నెహ్వాల్
-
'దేశానికి గోల్డ్ మెడల్ తీసుకురా అన్నప్పుడు నవ్వుకున్నా'
గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆధ్వర్యంలో జరిగిన 'ఉమెన్ ఇన్ మెడిసిన్ కాంక్లేవ్' కార్యక్రమంలో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ముఖ్య అతిథిగా పాల్గొంది. ఈ సందర్భంగా మహిళలు క్రీడల్లో రాణించడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.'' దేశంలో పాపులర్ క్రీడగా పేరున్న క్రికెట్తో బ్యాడ్మింటన్ను పోల్చలేము. అయితే చిన్నప్పటి నుంచి బ్యాడ్మింటన్పై ఇష్టం పెంచుకున్న నాకు తల్లిదండ్రుల నుంచి మంచి సపోర్ట్ లభించింది. అయితే బ్యాడ్మింటన్లోనూ మహిళలు, పురుషులకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. మాతో పోలిస్తే పురుషుల బ్యాడ్మింటన్కు కాస్త క్రేజ్ ఎక్కువ. అలాంటి స్థితిలోనూ నేను బ్యాడ్మింటన్లో రాణించడం సంతోషంగా అనిపించింది. తొమ్మిది, పదేళ్ల వయస్సు నుంచి రెగ్యులర్గా బ్యాడ్మింటన్ టోర్నీల్లో పాల్గొనేదాన్ని. ఆ టోర్నమెంట్లో ఇచ్చిన రూ.500, 1000 ప్రైజ్మనీ.. ఇలా ఒక్క రూపాయి వచ్చిన ఇంట్లోనే ఇచ్చేదాన్ని. అంతర్జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్లో పతకాలు అనగానే మొదటగా కొరియా,చైనా, జపాన్ పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి. ఎందుకంటే ఆయా దేశాల్లో బ్యాడ్మింటన్ ఆటలో కత్తిలాంటి ప్లేయర్లు తయారవుతున్నారు. కానీ మన దేశంలో అలా కాదు. క్రికెట్ లాంటి పాపులర్ గేమ్ వెనుక బ్యాడ్మింటన్ లాంటివి చిన్న గేమ్స్గా చూస్తారు. అయితే నా తండ్రి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొడితే చూడాలని ఉందని ఒకరోజు అన్నాడు. అది విన్న నాకు నవ్వు వచ్చింది. కానీ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని బ్యాడ్మింటన్లో రాణించాలని నా తండ్రి బలంగా కోరుకున్నాడు. అలా ఇవాళ మీ ముందు ఉన్న సైనా నెహ్వాల్ ఈరోజు స్టార్ బ్యాడ్మింటన్గా పేరు సంపాదించింది. ఇక కెరీర్లో ఎన్నో టైటిల్స్ గెలిచినప్పటికి ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్లో పతకం సాధించడం గర్వంగా అనిపించేది. ఈరోజు మహిళలు పురుషులతో సమానంగా రాణించడం చూస్తే ప్రపంచంతో పోటీ పడి పరుగులు తీస్తున్నామన్న విషయం స్పష్టమవుతోంది'' అంటూ చెప్పుకొచ్చింది. చదవండి: తన ముఖం కూడా చూడను! నాడు భోరున ఏడ్చేసిన సైనా! రూ. 2500 కూడా.. -
తన ముఖం కూడా చూడను! నాడు భోరున ఏడ్చేసిన సైనా! రూ. 2500 కూడా..
Saina Nehwal Successful Journey- Interesting Facts In Telugu: ‘మళ్లీ అమ్మాయేనా.. నేను దాని మొహం కూడా చూడను పో’.. ఆ వృద్ధురాలు చేసిన కటువైన వ్యాఖ్యకు ఉన్నత విద్యావంతుడైన ఆమె కుమారుడు కనీసం జవాబు కూడా ఇవ్వలేకపోయాడు. ఆ ఇంట్లో ఏడేళ్ల క్రితం అమ్మాయి పుట్టింది. ఇప్పుడు మనవడు కావాలని నానమ్మ ఆశించింది. అయితే అది జరగలేదు. పురుషులు, మహిళల నిష్పత్తిలో దేశంలోనే ఎక్కువ అంతరం ఉండే, ఆడపిల్లల పట్ల తీవ్ర వివక్ష చూపించే రాష్ట్రం హర్యానాలో.. అదీ అమ్మాయిలు పుట్టగానే నొసలు చిట్లించడమనేది ఎక్కువ మందికి అలవాటుగా ఉన్న హిస్సార్లో ఆమె ప్రవర్తన కొత్తగా అనిపించలేదు. చివరకు నెలరోజుల తర్వాత కొడుకు బతిమాలితే గానీ తన మనవరాలిని ఆమె చూడలేదు. కానీ అందులో ప్రేమ లేదు! ఆ సమయంలో తల్లికి ఏమీ చెప్పలేకపోయిన ఆ పాప తండ్రి మనసులో గట్టిగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన రెండో కూతురును మాత్రం అందరికంటే ప్రత్యేకంగా పెంచాలని, ఆమెను చూసి మున్ముందు అందరూ గర్వపడాలని భావించాడు. అందుకు ఆయన ఎంచుకున్న మార్గం క్రీడలు! ఆ హిస్సార్ బిడ్డ తర్వాతి రోజుల్లో హైదరాబాదీగా మారి ప్రపంచ బ్యాడ్మింటన్పై తనదైన ముద్ర వేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఆమే సైనా నెహ్వాల్... భారత మహిళల బ్యాడ్మింటన్కు టార్చ్బేరర్లా నిలిచిన స్టార్ షట్లర్. అమ్మా నాన్న అండతో.. వ్యవసాయ శాస్త్రవేత్త అయిన తండ్రి హర్వీర్ సింగ్ ఉద్యోగరీత్యా హైదరాబాద్ చేరడంతోనే సైనా ఆటకు పునాది పడింది. సరదాగా కరాటే నేర్చుకున్నా.. స్విమ్మింగ్, సైక్లింగ్ ఎన్ని చేసినా అవి ఆమెను ప్రొఫెషనల్ ప్లేయర్గా మార్చలేవని తండ్రికి అనిపించింది. పైగా కరాటే నేర్చుకుంటున్న సమయంలో ఒక మోటార్ బైక్ను కొందరు విద్యార్థుల చేతుల మీదుగా తీసుకుపోవాలని ఇన్స్ట్రక్టర్ సూచించాడు. అది తన వల్ల కాదంటూ కరాటేను వదిలేసేందుకే సైనా సిద్ధమైంది. దాంతో కెరీర్లో ఎదిగే ఆటను ఆయన గుర్తించాడు. ఎనిమిదేళ్ల వయసులో సైనా చేతికి బ్యాడ్మింటన్ రాకెట్ ఇచ్చాడు. షటిల్ ఆటపై ఆయనకు ఉన్న ప్రత్యేక ఆసక్తి కూడా అందుకు కారణం కావచ్చు. సైనా తల్లి ఉషారాణికి రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో ఆడిన అనుభవమూ ఉండటంతో ఇంట్లోనే అదనపు ప్రోత్సాహం కూడా లభించింది. దాంతో ఆట మొదలైంది. ఫలితాల గురించి ఆలోచించే పరిస్థితి ఎనిమిదేళ్ల పాపకు రాకూడదని భావించిన హర్వీర్ ఏ దశలోనూ విజయాలు, పరాజయాల గురించి ఆ చిన్నారితో మాట్లాడలేదు. నువ్వు ఆడుతూ ఉండు చాలు అంతా నేను చూసుకుంటాను అనే భరోసాను మాత్రం కల్పించాడు. ‘ఒక ప్లేయర్ పెద్ద స్థాయికి చేరాలంటే ఆ ప్లేయర్ ఎంత బాగా ఆడతాడనేది కాదు. ప్లేయర్తో పాటు కూడా తల్లిదండ్రులు ఎంత సమయం వెచ్చిస్తారనేది ముఖ్యం. మీరు మీ పిల్లల కోసం ఎంత సమయం ఇవ్వగలరు’.. ఏదైనా ఆటలో శిక్షణ కోసం అకాడమీకి వెళితే కోచ్ల నుంచి సాధారణంగా అందరికీ ఎదురయ్యే ప్రశ్నే ఇది. హర్వీర్కూ ఇదే ఎదురైంది. నేను ఎంత సమయమైనా ఇస్తానని ఆయన చెప్పాడు. రాజేంద్రనగర్లోని తన ఇంటి నుంచి ఎల్బీ స్టేడియం వరకు కోచింగ్కు వస్తూ, పోతూ సుమారు 25 కిలోమీటర్ల ప్రయాణంలో చేతక్ స్కూటర్పైనే నిద్ర కూడా! ఇదే తరహాలో ఆమె శిక్షణ సాగింది. సైనా ప్లేయర్గా ఎదుగుతున్న సమయంలో తన ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చినా, హైదరాబాద్ నుంచి వెళ్లాల్సి రావడంతో తండ్రి వాటిని వదులుకున్నాడు. కూతురు కోసం దేనికైనా సిద్ధపడిన ఆయన ఆశలను సైనా వమ్ము చేయలేదు. ఎవరి వల్లా కాలేదు కోట్లాది రూపాయల ఆదాయం, ఇళ్లు, కార్లు, విలాసవంతమైన జీవితం.. సాధారణంగా పెద్ద స్థాయిలో ఉన్న ఆటగాళ్ల గురించి అందరిలో ఉండే భావనే ఇది. కానీ ఆ స్థాయికి చేరేందుకు వారు పడిన కష్టం, శ్రమ మాత్రం బయటకు కనిపించదు. సైనా నేపథ్యం పేదదేమీ కాకపోవచ్చు. అయినా సరే ఒక ప్లేయర్గా మారే కోణంలో చూస్తే ఆర్థికపరమైన అడ్డంకులు తలుపు తడుతూనే ఉంటాయి. రాకెట్ కొనుగోలు మొదలు టూర్లు, ఎక్కడో జరిగే టోర్నీలకు హాజరయ్యేందుకు అయ్యే ఖర్చులు చూస్తే పరిధి దాటుతూనే ఉంటాయి. సైనాకు 9 ఏళ్ల వయసులో ఓ అండర్ 10 టోర్నీలో ఆడేందుకు మొదటిసారి ఖరీదైన రాకెట్ను (1999లో రూ. 2,700) కొనిచ్చాడు తండ్రి. అయితే చెన్నైలో జరిగిన ఈ టోర్నీ సందర్భంగా దానిని ఆమె పోగొట్టుకుంది. ఆ సమయంలో భోరున ఏడ్చేసిన సైనాను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. అందుకే స్పోర్ట్ అథారిటీ ఇచ్చిన రూ. 700 స్కాలర్షిప్, కొన్నాళ్ల తర్వాత పెట్రోలియం బోర్డు అందించిన రూ. 2,500 స్కాలర్షిప్ కూడా ఆమెకు బంగారంలా అనిపించాయి. తన భార్య ఆరోగ్యం బాగా లేదంటూ హర్వీర్ ఆరు సార్లు పీఎఫ్ ఖాతానుంచి సైనా ఆట కోసమే డబ్బులు డ్రా చేయాల్సి వచ్చింది. అయితే ఆ కష్టం ఎప్పుడూ వృథా కాలేదు. నడిచొచ్చిన విజయాలు సైనా విజయప్రస్థానంలో ఎప్పుడూ పెద్దగా ఆటుపోట్లు ఎదురు కాలేదు. అద్భుతమైన ఆట, కఠోర శ్రమ, తొందరగా నేర్చుకునే తత్వం, తప్పులను వెంటనే సరిదిద్దుకునే అలవాటు సైనాను శిఖరానికి తీసుకెళ్లాయి. జూనియర్ స్థాయిలో సైనా పదునైన ఆట గురించి ఎన్ని విశేషణాలతో ప్రశంసించినా తక్కువే. ప్రత్యర్థులకు అందనంత రీతిలో, తిరుగులేని ప్రదర్శనతో ఆమె దూసుకుపోయింది. 15 ఏళ్ల వయసులో సీనియర్ స్థాయిలో న్యూఢిల్లీలో తొలి టైటిల్ (ఆసియా శాటిలైట్) గెలిచిన తర్వాత సైనా ఎక్కడా ఆగలేదు. తర్వాతి ఏడాది ప్రతిష్ఠాత్మక 4 స్టార్ ఫిలిప్పీన్స్ ఓపెన్ గెలిచిన తర్వాత సైనా సత్తా ఏమిటో బ్యాడ్మింటన్ ప్రపంచానికి తెలిసింది. 2008లో వరల్డ్ జూనియర్ చాంపియన్గా నిలిచిన తర్వాత ప్రతిష్ఠాత్మక విజయాలు సైనా ఖాతాలో వచ్చి చేరాయి. చాలెంజర్ టోర్నీలు, గ్రాండ్ ప్రి, గ్రాండ్ ప్రి గోల్డ్, సూపర్ సిరీస్, సూపర్ సిరీస్ ప్రీమియర్... ఇలా పేరు ఏదైతేనేం విజేత సైనా మాత్రమే. తన అంతర్జాతీయ కెరీర్లో అత్యుత్తమ స్థాయిలో 24 అంతర్జాతీయ టైటిల్స్ సైనా గెలుచుకుంది. ఇందులో 10 సూపర్ సిరీస్లే ఉన్నాయి. ఇండోనేసియా, సింగపూర్, హాంకాంగ్, డెన్మార్క్, ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, చైనా ఓపెన్, ఇండియన్ ఓపెన్.. వేదికలు మారడమే తప్ప విజయాలు మాత్రం తనవే. కొన్ని ఘనతలు... ►ఒలింపిక్ కాంస్య పతకం ►వరల్డ్ చాంపియన్షిప్లో ఒక రజతం, ఒక కాంస్యం ►కామన్వెల్త్ క్రీడల్లో రెండు స్వర్ణాలు ►ఆసియా క్రీడల్లో కాంస్యం ►ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో రజతం ► సూపర్ సిరీస్ ఫైనల్స్లో రజతం భారత ప్రభుత్వం పౌర పురస్కారాలు ► పద్మశ్రీ, పద్మభూషణ్లతో పాటు క్రీడా పురస్కారాలు అర్జున, ఖేల్రత్నలతో సైనా నెహ్వాల్ను గౌరవించింది. ఆ పతకం ఒక మణిహారం.. 2012 ఆగస్టు 4.. సైనా నెహ్వాల్ ఉజ్వల కెరీర్ను శిఖర స్థాయిలో నిలిపిన విజయం. లండన్ ఒలింపిక్స్లో ఆమె మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. తద్వారా బ్యాడ్మింటన్లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా నిలిచింది. వ్యక్తిగతం.. 2018లో.. సహచర బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ను సైనా వివాహమాడింది. ఆమె కెరీర్ విశేషాలతో ‘సైనా’ అనే బయోపిక్ కూడా వచ్చింది. అమోల్ గుప్తే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సైనా పాత్రలో పరిణీతి చోప్రా నటించింది. -మొహమ్మద్ అబ్దుల్ హాది చదవండి: KL Rahul: అతడిని ఎందుకు తప్పించారో తెలీదు! పంత్ దరిద్రం నీకు పట్టుకున్నట్టుంది! బాగా ఆడినా.. ఇదేం పోయే కాలమో! Cristiano Ronaldo: మ్యాచ్ ఓడిపోయి బాధలో ఉంటే బికినీలో అందాల ప్రదర్శన? -
తొలి రౌండ్లోనే సైనా నెహ్వాల్ ఓటమి
హైలో ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్, ప్రపంచ మాజీ నంబర్వన్ సైనా నెహ్వాల్కు తొలి రౌండ్లోనే ఓటమి ఎదురైంది. జర్మనీలో బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో సైనా 15–21, 8–21తో బుసానన్ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ 19–21, 21–19, 21–16తో లీ యాంగ్–లు చెన్ (చైనీస్ తైపీ) ద్వయంపై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. చదవండి: Ind Vs Ban: కోహ్లి ఫేక్ ఫీల్డింగ్ చేశాడంటూ ఆరోపణలు.. లేదంటే విజయం తమదేనన్న బంగ్లా క్రికెటర్
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- తొమ్మిది సీట్లు పక్కా.. ఒకటి ఎక్స్ట్రా!
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement