-
చంద్రబాబు ఉచిత ఇసుకలో ఉచితం లేదు
-
లోకేశ్ కపట ప్రేమ!
తాడేపల్లిరూరల్: ఇసుక కార్మికులపై టీడీపీ మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేశ్ కపట ప్రేమ చూపుతున్నారు. వైఎస్సార్ సీపీ ప్ర భుత్వ హయాంలో ఇసుక కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని, భారీ యంత్రాలతో ఇసుక దోచుకుంటున్నారని ఎన్నికల వేళ పసలేని ఆరోపణలు చేశారు. టీడీపీ హయాంలో ఆ పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా ఇసుకను అమ్ముకున్న సంఘటనలు, అడ్డుకున్న అధికారులపై జరిగిన దాడులు మరిచి, మేము అధికారంలోకి వస్తే ఇసుక, భవన నిర్మాణ కార్మికులకు చేతినిండా పని కల్పిస్తామంటూ హామీ లు గుప్పిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. లోకేశ్ వ్యాఖ్యల నేపథ్యంలో 2014 నుంచి 2019 వరకు పరిణామాలను పరిశీలిస్తే... 2014కు ముందు... ఉండవల్లి ప్రకాశం బ్యారేజ్ పైభాగంలో సైతం ఇసుక కార్మికులు నీటిలోకి దిగి పారలతో ఇసుక లోడింగ్ చేసేవారు. ప్రకాశం బ్యారేజ్ దిగువ ప్రాంతంలోని పాతూరు, గుండిమెడ, చిర్రావూరు, గొడవర్రు, రామచంద్రాపురం, పెదకొండూరు, వీర్లపాలెం దళిత కుటుంబాలు ఇసుక ట్రాక్టర్లకు, లారీలకు లోడింగ్ చేసి, పొట్ట నింపుకునేవారు. 2014 తర్వాత అక్రమంగా హైదరాబాద్కు ఇసుక టీడీపీ అధికారం చేపట్టగానే ఆ పార్టీ సామాజిక వర్గానికి చెందిన నేతలు రేపల్లె నుంచి అచ్చంపేట వరకు మకాం వేశారు. దొరికిన కాడికి ఇసుక దోచుకుంటూ జేబులు నింపుకొన్నారు. కృష్ణానది ఎగువ ప్రాంతంలో ఉన్న ఇసుక కార్మికులను ఒక్కొక్కరిని తొలగించారు. అనుమతులు లేని భారీ పడవలను దించి, వాటికి ఇసుక తోడే యంత్రాలను ఏర్పాటు చేశారు. రోజుకు ఒక్కొక్క ఇసుక క్వారీ నుంచి 30 వేల టన్నుల ఇసుకను హైదరాబాద్ తదితర ప్రాంతాలకు భారీ వాహనాల్లో తరలించేవారు. ఇది గమనించిన స్థానిక నాయకులు మా ప్రాంతంలో కూడా ఇసుక తవ్వకాలు చేసుకోవచ్చని తలచారు. అంతే... భారీ యంత్రాలతో దోపిడీకి పాల్పడ్డారు. అప్పటి గుంటూరు ఎమ్మెల్యే సోదరుడిది కీలక పాత్ర ఈ దోపిడీలో అప్పటి గుంటూరుకు చెందిన ఓ ఎమ్మెల్యే సోదరుడు, నారా లోకేశ్ మిత్రుడు కీలక పాత్ర పోషించారు. చినబాబుకు సైతం భారీగా సొమ్ములు పంపారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. పాతూరు, గుండిమెడ ఇసుక రీచ్లో కార్మికులను పోలీసులతో బెదిరించి మరీ బయటకు పంపివేశారు. చిర్రావూరులో కొంతకాలం అక్కడి కార్మికులకు పని కల్పించారు. తర్వాత భారీ వాహనాల్లో ఇసుకను బయటకు తరలించాలంటే కార్మికుల వల్ల కాదని తాత్కాలికంగా మూడు రోజులపాటు క్వారీని నిలుపుదల చేశారు. అనంతరం 200 యంత్రాలు తీసుకువచ్చి ఇసుక లోడింగ్ నిర్వహించారు. దీంతో కార్మికులకు ఉపాధి కరవైంది. అధికారులను బెదిరించి... ఇసుక రీచ్ల్లో అధికారులు యంత్రాలకు అనుమతులు ఇవ్వనప్పటికీ వారిని భయభ్రాంతులకు గురిచేసి భారీగా తవ్వకాలు చేపట్టారు. అనుమతులకు మించి తవ్వకాలు వల్ల ఆ గుంతల్లో పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. వీటిని మూసివేయాలని పాతూరు, చిర్రావూరు తదితర ప్రాంతాల్లో స్థానికులు ఆందోళన చేశారు. పోలీసులచేత బెదిరించి, ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా జరిపారని నేటికీ కార్మికులు చెబుతున్నారు. -
ఇసుక లేకుండానే ఇల్లు కట్టేయొచ్చట! ఎలాగో తెలుసా..!
ఇల్లు కట్టాలంటే ముందుగా చేతినిండా దండిగా డబ్బు ఉండాలి. అప్పుడే కలల ఇంటిని నిర్మించగలం. దీనికి సిమ్మెంట్, ఇటుక, ఇసుక తదితరాలు లేకుండా ఇంటి నిర్మాణమే మొదలవ్వదు. నిజానికి ఇప్పుడు, సిమ్మెంట్, ఇటుకలు ధరలు ఏ రేంజ్లో ఉన్నాయో మనకు తెలిసిందే. ఇక అందులో ఇసుకను కొనడం ఒక ఎత్తు తరలించేందుకు మరింత డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. ఓ ఇంటి నిర్మాణానికి చాలా ఇసుక కావాల్సి ఉంటుంది. అలా ఇసుకు అవసరమే లేకుండా ఇల్లునే కట్టేయొచ్చట. ఎలాగంటే.. సహజ ఇసుకకు బదులుగా నిర్మాణాలకు ఉపయోగపడేలా ఓ సరికొత్త మెటీరియల్ను భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) శాస్త్రవేత్తలు నిర్మాణాలకు అవసరమయ్యే సహజ ఇసుక స్థానంలో కొత్త మెటీరియల్ను రూపొందించారు. నిర్మాణ పరిశ్రమలో అత్యంత కీలకమైన ఇసుక కొరత కారణాల దృష్ట్యా ఈ ఆవిష్కరణ జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీస్ (సీఎస్టీ)లోని ఒక బృందం పారిశ్రామిక వ్యర్థ వాయువులలో సేకరించిన కార్బన్ డయాక్సైడ్ (CO2) ఉపయోగించి కొత్త పదార్థాన్ని అభివృద్ధి చేసింది. తవ్విన మట్టి, నిర్మాణ వ్యర్థాలను కార్బన్ డయాక్సైడ్తో శుద్ధి చేసి ఇసుకకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చని నిర్థారించారు. ఈ కొత్త మెటీరియల్ నిర్మాణాల కారణంగా ఏర్పడే పర్యావరణ ప్రభావాన్ని తగ్గించి, నిర్మాణ నాణ్యతను మెరుగుపరుస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఆవిష్కరణకు అసిస్టెంట్ ప్రొఫెసర్ సౌరదీప్ గుప్తా నాయకత్వం వహిస్తున్నారు. దేశంలోని జీరో కార్బన్ లక్ష్యాలకు అనుగుణంగా తక్కువ కార్బన్ ప్రిఫ్యాబ్రికేటెడ్ బిల్డింగ్ ఉత్పత్తులను తయారు చేసే సాంకేతికతను అభివృద్ధి చేశామని సౌరదీప్ గుప్తా పేర్కొన్నారు. సాధారణంగా నిర్మాణ రంగాల్లో మట్టికి కార్బన్ డయాక్సైడ్ని ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఇసుక బదులుగా వాడే ఈ ప్రత్యేక మెటీరియల్ సిమెంట్, సున్నం మధ్య చర్యను మెరుగుపరుస్తుంది. ఈ ఆవిష్కరణ విజయంవంతం అయితే.. ఎంతో మందికి మేలు జరుగుతుంది. ఇసుక, కంకర, చువ్వ వీటికే లక్షలు ఖర్చు అవుతాయి.. పైగా రెండు పడకల గదుల ఇళ్లు నిర్మించాలంటే కనీసం 30 టన్నుల ఇసుక అవసరం ఉంటుంది. ఈ ఆవిష్కరణతో ఇసుకకు ప్రత్యామ్నాయం వస్తే ఖర్చు తడిసిమోపడవ్వడం తగ్గుతుంది. ఎకో ఫ్రెండ్లీగా మంచి ఇంటిని నిర్మించుకోవచ్చు కూడా. (చదవండి: ఆయుష్షులో సెంచరీ కొట్టి.. గిన్నిస్ రికార్డు కెక్కిన వృద్ధుడు!) -
ఇసుక కొరత ఉండొద్దు
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక అవసరాలకు ఇసుక కొరత లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. స్థానిక అవసరాలకు సరిపడే ఇసుక రవాణాకు అనుమతించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ శాఖ ముఖ్య కార్యదర్శి మహేశ్దత్ ఎక్కా ఉత్తర్వులు జారీ చేశారు. తమ ఇళ్ల నిర్మాణాలు, స్థానిక అవసరాలకు ఇసుక రవాణాకోసం అనుమతి ఇవ్వాలని గ్రామీణుల నుంచి ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు అందాయి. ఈ నేపథ్యంలో గ్రామాల్లో నిర్మాణాలకు ఆటంకం లేకుండా సమీపంలోని వాగులు, వంకల నుంచి ఇసుకను ఉచితంగా తీసుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అవసరమున్న వారు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల ద్వారా ఉచితంగా ఇసుకను తెచ్చుకునేందుకు అనుమతిస్తారు. అయితే నిబంధనలను ఉల్లంఘిస్తే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. గతంలోనూ వెసులుబాటు.. తెలంగాణ రాష్ట్ర ఇసుక వెలికితీత విధానం 2015 నిబంధనల ప్రకారం గతంలోనూ స్థానిక వనరుల నుంచి గ్రామాల్లో అవసరాలకు ఇసుకను తెచ్చుకోవడానికి వెసులుబాటు కల్పించారు. అయితే విచ్చలవిడి ఇసుక వెలికితీతతో భూగర్భ జల వనరులు దెబ్బతింటాయనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం స్థానిక అవసరాల కోసం ఇసుక వెలికితీత, రవాణాపై కఠినంగా వ్యవహరించడంతోపాటు ఇసుక వెలికితీత, అనుమతుల బాధ్యతను స్థానిక తహసీల్దార్లు, గ్రామపంచాయతీలకు అప్పగించింది. ఇసుక వెలికితీతకు అనువైన ప్రాంతాలను గుర్తించేందుకు రెవెన్యూ, భూగర్భ జల వనరులు, పంచాయతీ విభాగాలతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి అనుమతులు తప్పనిసరి చేసింది. మరోవైపు స్థానిక అవసరాలకు ఉపయోగించే ఇసుకకు కూడా డబ్బులు చెల్లించాలనే విధానాన్ని అనుసరించింది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం ఇకపై స్థానిక అవసరాల కోసం ఎలాంటి అనుమతులు లేకుండా డబ్బు చెల్లించకుండానే ఇసుకను తీసుకు వెళ్లడానికి అవకాశం ఏర్పడుతుంది. -
ఇసుక తవ్వకాలపై..తప్పుడు రాతలు
-
డేంజర్ లోడ్స్!
సాక్షి, హైదరాబాద్: ఇసుక అక్రమ రవాణ రహదారి భద్రతకు సవాల్గా మారింది. వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే ఇసుకలారీలు ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. ఓవర్లోడ్తో వచ్చే లారీల వల్ల రహదారులు సైతం ధ్వంసమవుతున్నాయి. ప్రతి రోజు సుమారు 5 వేల లారీలు వివిధ జిల్లాల నుంచి నగరానికి భారీ ఎత్తున ఇసుకను తరలిస్తున్నాయి. ఈ క్రమంలో మోటారు వాహన నిబంధనలకు బేఖాతరు చేస్తూ యధేచ్చగా పరిమితికి మించిన బరువుతో రోడ్లపైకి వస్తున్నట్లు రవాణాశాఖ గుర్తించింది.కృష్ణా,గోదావరి, తదితర పరీవాహక ప్రాంతాల నుంచి ఇసుకను తరలించే క్రమంలోనే కచి్చతమైన పరిమితిని విధించే అవకాశం ఉన్నప్పటికీ చాలా వరకు తూకం వేయకుండానే రోడ్డెక్కుతున్నాయి. కొన్ని లారీల్లో 25 టన్నుల వరకే అనుమతి ఉండగా అందుకు విరుద్దంగా 35 టన్నుల వరకు తరలిస్తున్నారు. 35 టన్నుల ఇసుక రవాణాకు అవకాశం ఉన్న 16 టైర్ల లారీల్లో ఏకంగా 45 టన్నులకు పైగా ఇసుకను తరలిస్తున్నట్లు అంచనా. ఓవర్లోడ్..చీకట్లో స్పీడ్ ఇలా ఓవర్లోడ్తో వచ్చే భారీ వాహనాల వల్ల తరచుగా ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో ఇసుక లారీలు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నట్లు రవాణా అధికారులు పేర్కొంటున్నారు. తెల్లవారు జామున సిటీకి వచ్చే క్రమంలో ఓవర్లోడ్ లారీలను డ్రైవర్లు అదుపు చేయలేకపోతున్నారు. వేగాన్ని నియంత్రించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతున్నాయి.ఇక ఓవర్లోడ్ వచ్చే వాహనాలను కట్టడి చేసేందుకు గ్రేటర్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు హైదరాబాద్ జేటీసీ రమేష్ తెలిపారు. తూకంలోనే మోసం... హైదరాబాద్లో భవననిర్మాణ రంగానికి ప్రతి రోజు వేల టన్నుల ఇసుకను వినియోగిస్తున్నారు.నదీతీరాల్లో లభించే సన్న ఇసుకకు నగరంలో ఎంతో డిమాండ్ ఉంది.దీంతో కృష్ణా,గోదావరి పరీవాహాక ప్రాంతాలైన పెద్దపల్లి, భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి, తదితర ప్రాంతాల నుంచి నగరానికి పెద్ద మొత్తంలో ఇసుక తరలివస్తుంది.అలాగే విజయవాడ నుంచి కూడా గుట్టుచప్పుడు కాకుండా ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం. ఇసుకను లారీల్లో నింపిన తరువాత క్వారీల్లోనే తూకం వేయవలసి ఉంటుంది. కానీ చాలా వరకు క్వారీల్లో కాంటాలు అందుబాటులో లేకపోవడం వల్ల పెద్దమొత్తంలో ఇసుకను నింపేస్తున్నారు. నిర్ధేశించిన బరువుపైన 5 శాతం వరకు అదనంగా తెచ్చేందుకు ఆర్టీఏ అనుమతిస్తుంది.ఉదాహరణకు 25టన్నులకు అవకాశం ఉన్న లారీల్లో మరో ఒకటిన్నర టన్ను అదనంగా తెచ్చేందుకు అవకాశం ఉంటుంది. కానీ కొందరు వాహన యజమానులు ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఒకటిన్నర టన్నుకు బదులు 10 టన్నులకు పైగా అదనంగా నింపేసి తరలిస్తున్నారు. క్వారీలు దాటిన 20 కిలోమీటర్ల దూరంలో కాంటాలు ఉంటాయి. కానీ ఇక్కడి వరకు వచి్చన లారీల్లో ఓవర్లోడ్ను తొలగించకుండా ఏదో ఒకవిధంగా కాంటాల నిర్వాహకులతో కుమ్మౖMð్క తప్పుడు తూకం లెక్కలతో రోడ్లపైకి వస్తున్నారు. ఇలా ఓవర్లోడ్తో వచ్చే వాహనాలను చెక్పోస్టుల వద్ద నిలిపేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ కొందరు మోటారు వాహన ఇన్స్పెక్టర్లు ఇసుక వ్యాపారాల నుంచి ప్రతి లారీకి కొంత మొత్తంగా వసూలు చేసుకొని వదిలేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ‘ఆరీ్టఏ అధికారులు బడా వ్యాపారులను వదిలేసి నిబంధనల మేరకు ఇసుకను తెచ్చే చిన్న వ్యాపారులు, లారీ డ్రైవర్లపైన మాత్రం తమ ప్రతాపాన్ని చూపుతున్నారని’ పలువురు వాహనయజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీఏ స్పెషల్ డ్రైవ్.. వివిధ దశల్లో ఏదో ఒక విధంగా తనిఖీలను తప్పించుకొని నగరానికి చేరుకొనే ఓవర్లోడ్ ఇసుక లారీలపైన ఆర్టీఏ ప్రస్తుత స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. పరిమితికి మించిన బరువుతో నగరానికి వచ్చే లారీలపైన తనిఖీలను ప్రారంభించారు.సోమవారం ఒక్క రోజే 19 వాహనాలపైన కేసులు నమోదు చేసి జరిమానా విధించినట్లు జేటీసీ రమేష్ తెలిపారు.ఓవర్లోడ్ వాహనాలపైన తనిఖీలను కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు.క్వారీల్లోంచి ఇసుకను నింపే సమయంలోనే మోటారు వాహన నిబంధనలకనుగుణంగా నింపాల్సి ఉంటుందన్నారు. -
బాబుకి ముందస్తు: ఆ మూడు కేసుల్లో జరిగింది ఇదే!
గుంటూరు, సాక్షి: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. అన్ని కేసుల్లో చంద్రబాబుకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉన్నత న్యాయస్థానం బుధవారం మధ్యాహ్నాం తీర్పు ఇచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోనూ, ఇసుక కుంభకోణం, లిక్కర్ స్కాంకు సంబంధించి రాష్ట్ర నేర దర్యాప్తు సంస్థ(సీఐడీ) చంద్రబాబుపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. విచారణ నేపథ్యంలో తనను అరెస్ట్ చేయొచ్చంటూ.. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. IRR భలే మలుపు.. టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు. ఈ కేసులో కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే. లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్లో భూములు కట్టబెట్టారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మూడుసార్లు మార్పు చేశారు. అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్ప్రోకో జరిపారు. 2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్రింగ్ అలైన్మెంట్లో మార్పులు చేశారు. ఇన్నర్ రింగ్రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు కట్టబెట్టారు. అలైన్మెంట్ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం చేకూరింది. ఇన్నర్రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్మెంట్ జరిగింది. కరకట్ట కట్టడం.. క్విడ్ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించారు లింగమనేని. కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం జరిగింది. లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసంగా.. సీఎంగా, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు కొనసాగుతున్నారు. ఇసుకను అలా.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది ఇసుక కుంభకోణం. 2014లో రాష్ట్ర విభజనకు ముందు రీచ్ల వారీగా వేలం పాటలు నిర్వహించారు. చంద్రబాబు వచ్చాక పలు మార్పులు జరిపారు. తొలుత డ్వాక్రా మహిళా సంఘాలకు రీచ్లు అప్పగిస్తున్నామని ప్రకటించారు. మహిళా సంఘాల ముసుగులో ఇసుకపై పూర్తి నియంత్రణ టీడీపీ నేతలదే కొనసాగుతూ వచ్చింది. మంత్రివర్గ ఆమోదం లేకుండానే ఇసుకపై చంద్రబాబు నిర్ణయాలు తీసుకున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, పలుకుబడి ఉన్న టీడీపీ నేతల ఇష్టారాజ్యంగా సాగింది. చంద్రబాబు ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్న కృష్ణా నదిలో కూడా భారీ ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయి. ఏపీలో 2014-19 మధ్య జరిగిన ఇసుక అక్రమాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీరియస్ అయ్యింది. చంద్రబాబు ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయల జరిమానా సైతం విధించింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఇప్పుడు టీడీపీకి మద్దతు ఇస్తున్న న్యాయవాది శ్రవణ్ కుమార్ ఆ రోజుల్లో టీడీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. కేవలం ఇసుకలోనే పదివేల కోట్ల దోపిడీ జరిగిందని ఎన్.జి.టి.కి ఫిర్యాదు చేశారు. APMDC ఫిర్యాదుతో కేసు నమోదు చేసింది నేర దర్యాప్తు సంస్థ సీఐడీ. ఈ ఇసుక అక్రమాల కేసులో ఏ2గా ఉన్నారు చంద్రబాబు. మద్యంనూ వదలని బాబు అండ్ కో ఇది కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగింది. ఇష్టానుసారంగా మద్యం కంపెనీలకు అనుమతి ఇచ్చారు చంద్రబాబు. ఆయన నిర్ణయాల వల్ల రాష్ట్ర ఖజనాకు రూ.1500 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ సైతం తేల్చింది. టీడీపీ నేతల బార్లు, డిస్టిల్లరీలకు అనుకూలంగా చంద్రబాబు నిర్ణయాలు ఉండడం గమనార్హం. ఈ కేసులో ప్రాథమిక విచారణ జరిపిన సీఐడీ.. అప్పటి ఎక్సైజ్ కమిషనర్ శ్రీనరేష్, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, సీఎం చంద్రబాబుపై కేసు నమోదు చేసింది. ఈ మూడు కేసుల్లోనూ చంద్రబాబు తరపున సీనియర్ కౌన్సిలర్ సిద్ధార్ధ్ లూధ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు ఏపీ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలను విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నేడు ఈ కేసులన్నింటిలోనూ తీర్పు వెల్లడించింది. చంద్రబాబుతో పాటు మద్యం కేసులో నిందితుడిగా ఉన్న కొల్లు రవీంద్రకు కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. -
అలరిస్తున్న ఉల్లి, ఇసుకల శాంతాక్లాజ్ శిల్పం!
క్రిస్మస్ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ బ్లూ ఫ్లాగ్ బీచ్లో ప్రపంచంలోనే అతిపెద్దదైన శాంతా క్లాజ్ను రూపొందించారు. ఉల్లిపాయలు,ఇసుక సహాయంతో సుదర్శన్ పట్నాయక్ ఈ శాంతా క్లాజ్ని తీర్చిదిద్దారు. పట్నాయక్ తనదైన శైలిలో ప్రజలకు సందేశం ఇచ్చారు. శాంతాక్లాజ్ సైకత శిల్పం ముందు క్రిస్మస్ శుభాకాంక్షలు అని రాయడంతోపాటు ఈ భూమిని సస్యశ్యామలం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేశారు. ఈ భారీ సైకత శిల్పం తయారీకి రెండు టన్నుల ఉల్లిని వినియోగించినట్లు సుదర్శన్ పట్నాయక్ తెలిపారు. ప్రతి సంవత్సరం, క్రిస్మస్ సందర్భంగా పూరీలోని బ్లూ ఫ్లాగ్ బీచ్లో విభిన్న శిల్పాలను రూపొందించడానికి ప్రయత్నిస్తుంటానని పట్నాయక్ చెప్పారు. ఈసారి ఉల్లిపాయలు, ఇసుకతో ప్రపంచంలోనే అతిపెద్ద శాంతా క్లాజ్ని తయారుచేశానని తెలిపారు. ఈ శాంతాక్లాజ్ సైకత శిల్పం 100 అడుగుల పొడవు, 20 అడుగుల ఎత్తు, 40 అడుగుల వెడల్పుతో తీర్చిదిద్దారు.ఈ సైకత శిల్పం తయారు చేసేందుకు ఎనిమిది గంటల సమయం పట్టిందని పట్నాయక్ తెలిపారు. కాగా వరల్డ్ రికార్డ్ బుక్ ఆఫ్ ఇండియా ఈసైకత శిల్పాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద శాంతాక్లాజ్ సైకత శిల్పంగా ప్రకటించింది. ఇది కూడా చదవండి: ‘వాజపాయి ప్రధాని కావడం తథ్యం’.. నెహ్రూ ఎందుకలా అన్నారు? Our World's biggest Onion and Sand installation of #SantaClaus. Set a New World record. The Chief Editor Sushma Narvekar and Senior Adjudicator Sanjay Narvekar of World Record Book of India declared it as a new world record and they presented me official certificate and a medal… pic.twitter.com/IzseZTpVsn — Sudarsan Pattnaik (@sudarsansand) December 25, 2023 -
fact check: మేలెంచినా కీడెంచుతారా!?
సాక్షి, అమరావతి : కుక్క తోక వంకరలాగే ఈనాడు రాతల్లో కూడా అంతకు మించి వంకర్లు ఉంటాయి. ప్రభుత్వానికి సంబంధించిన ఏ విషయాన్నయినా వంకర బుద్ధితో చూడడమే ఇందుకు కారణం. పేదలకు మేలు చేసేందుకు.. వారు కట్టుకునే ఇళ్లను మెరక చేసుకునేందుకు, రైతుల పొలాలకు మట్టి తోలుకునేందుకు మట్టి తరలింపులో మినహాయింపులు ఇవ్వడాన్ని సైతం తప్పన్నట్లు గుండెలు బాదుకుంటోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంచి చేసినా తప్పేనంటూ ఆ పత్రికాధిపతి రామోజీరావు వితండవాద కథనాలను ప్రచురించటం పరిపాటిగా మారింది. ప్రజలకు ఉపయోగపడేలా ఏదైనా మినహాయింపు ఇస్తే తప్పు.. ఇవ్వకపోయినా, ఏం చేయకపోయినా తప్పేనంటూ రెండు నాల్కల ధోరణితో క్షుద్ర రాతలు రాయడం ఆయనకు నిత్యకృత్యంగా మారింది. వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఎలాగైనా బురద జల్లి ప్రజల్లో అపోహలు సృష్టించడం, వారికి మేలు జరుగుతుంటే దాన్ని వక్రీకరించి ఏదో జరిగిపోతోందని గగ్గోలు పెట్టడం.. తద్వారా చంద్రబాబును గద్దెనెక్కించాలన్నది ఆయన అసలు లక్ష్యం. ఇందులో భాగమే తాజాగా సోమవారం ‘దోపిడీకి రాజమార్గం’ అంటూ మట్టి తవ్వకాలపై అతిగా ఊహించుకుంటూ ఎప్పటిలాగే అభూతకల్పనలతో ఓ కథనాన్ని చేతికొచ్చింది ఇష్టానుసారం రాసిపారేసి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు నానా ప్రయాసపడ్డారు. ఈ క్షుద్ర రాతలపై వాస్తవాల ‘ఫ్యాక్ట్చెక్’ ఏమిటంటే.. ఆమోదం పొందని ఫైలుపై సీఎంఓ ఒత్తిడా? రాష్ట్రంలో పేదలు నిర్మించుకునే ఇళ్లు, రైతుల పొలాలను మెరక చేసుకునేందుకు వీలుగా వారిపై ఎలాంటి భారం లేకుండా చిన్నతరహా ఖనిజాల వినియోగంపై మినహాయింపులకు గనుల శాఖ సదుద్దేశ్యంతో ప్రతిపాదించింది. కానీ, అక్రమార్కులకు సహకరించేలా ఖనిజ తవ్వకాలకు పలు రుసుముల మినహాయింపులు ఇస్తున్నట్లు రామోజీ పెడబొబ్బలు పెట్టారు. వాస్తవానికి ఈ ప్రతిపాదనలు ఇంకా ఆమోదం పొందలేదు. వాటిపై ఆర్థిక శాఖ నుంచి వచ్చిన అభ్యంతరాలకు గనుల శాఖ వివరణ సమర్పించింది. ఆ విషయం ఇంకా ఆర్థిక శాఖ పరిశీలనలోనే ఉంది. ఇంకా ఆమోదం పొందని ఫైలుపై సీఎంఓ ఎలా ఒత్తిడి తెచ్చిందో, దానికి ఆమోదముద్ర ఎవరు వేశారో రామోజీరావుకే తెలియాలి. అయినా.. పేదల ఇళ్లకు ‘మినహాయింపు’లను ఉచిత ఇసుకతో ఎలా పోలుస్తారు రామోజీ? అసలు మీ బాబు హయాంలో ఉచితంగా ఇసుక ఎవరికి అందింది? ఆ ముసుగులో చంద్రబాబు బినామీలు, రియల్టర్లు, కమర్షియల్ సంస్థలు, టీడీపీ నేతలకే ఆయన దోచిపెట్టిన బాగోతాలు జగమెరిగినవే కదా..! పేదలకు మేలు జరుగుతుంది.. నిజానికి.. రాష్ట్రవ్యాప్తంగా పేదలు ఒకొక్కరు 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించుకుంటున్నారు. వీరు తమ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ లక్షలాది మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. వీరంతా ఇంటిని నిర్మించుకునేందుకు కంకర, గ్రావెల్ వంటి చిన్నతరహా ఖనిజాలను వినియోగించాల్సి ఉంటుంది. దీనిపైన గనుల శాఖ వసూలు చేస్తున్న సీనరేజీ, కన్సిడరేషన్ రుసుం, డీఎంఎఫ్, మెరిట్ వంటి వసూళ్లతో పేదలపై ఆర్థికంగా భారం పడుతుంది. దీని మినహాయింపునకు ప్రభుత్వం అంగీకరిస్తే పేదలకు మేలు జరుగుతుంది. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశాల్లో చర్చించిన తర్వాతే ఈ రుసుం మినహాయింపు కోసం గనుల శాఖ ప్రభుత్వ ఆమోదానికి ప్రతిపాదనలు పంపింది. ఏటా రైతులు చెరువు మట్టిని వాడుకుంటారు.. ప్రతి ఖరీఫ్ సీజన్కు ముందు వేసవిలో రైతులు తమ పొలాల్లో మట్టిని సారవంతం చేసుకోవడం, లోతట్టు భూమిని మెరక చేసుకునేందుకు చెరువు మట్టిని సమీపంలోని పొలాల నుంచి తెచ్చుకుని వాడుకుంటారు. దీనివల్ల తిరిగి పంట వేసుకునే సమయానికి పొలం అనువుగా తయారై మంచి దిగుబడి లభిస్తుంది. తద్వారా రైతు కష్టానికి ఫలితం అందుతుంది. దీనికోసం వినియోగించే మట్టిపై కూడా గనుల శాఖ విధించే రుసుమునకు మినహాయింపులిస్తే రైతులపై ఆర్థిక భారం ఉండదు. ఈ సదుద్దేశంతోనే గనుల శాఖ వ్యవసాయ వినియోగం నిమిత్తం వాడే మట్టిపై మినహాయింపుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వాస్తవాలిలా ఉంటే.. ఒత్తిడి తెచ్చి మరీ సీఎంఓ ఆమోదముద్ర వేయించుకుందని ఈనాడు అడ్డగోలుగా ఓ కథనాన్ని అచ్చేసింది. ఇలా తప్పుడు కథనాలు ప్రచురించిన ఈనాడు పత్రికపై ఇప్పటికే ప్రభుత్వం పలు పరువు నష్టం దావాలు దాఖలు చేసింది. అయినా సరే.. రామోజీది వంకర బుద్ధి కదా.. వంకర రాతలు కొనసాగిస్తూనే ఉన్నారు. వైఎస్సార్సీపీ నేతలకు ఎలా లబ్ధి కలుగుతుంది? ఇక ఈ ప్రతిపాదనల్లో వైఎస్సార్సీపీ నేతలకు ఎలా లబ్ధి చేకూరుతుందో రామోజీరావు చెప్పాలి. పేదలు, రైతులకు మేలు చేసేలా నిర్ణయం తీసుకుంటే దానిని రాజకీయ పార్టీలకు ఎలా ఆపాదిస్తారని సాధారణ ప్రజలు మండిపడుతున్నారు. నిజానికి.. ఈ మినహాయింపుల్లేని సమయంలోనూ వీటి ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.70 కోట్ల వరకు మాత్రమే ఆదాయం వస్తుంది. అయినా సరే.. ఈ మినహాయింపులతో ఖజానాకు భారీగా నష్టం జరుగుతుందని రాద్ధాంతం చేయడం చూస్తుంటే పేదలు, రైతులపట్ల రామోజీరావుకు, చంద్రబాబుకు ఉన్న ఏహ్య భావానికి అద్దంపడుతోంది. ఆర్థిక శాఖకు పూర్తి వివరణ ఇచ్చాం పేదల ఇళ్లు, రైతుల పొలాలు మెరక చేసుకునేందుకు తరలించే మట్టి విషయంలో మినహాయింపులకు సంబంధించి ఆర్థిక శాఖ సందేహాలు, పరిశీలనలపై పూర్తి వివరణ ఇచ్చాం. గనుల శాఖలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలవల్ల ప్రతి జిల్లాకు విజిలెన్స్ స్క్వాడ్ తనిఖీలు, టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదులను స్వీకరిస్తున్నాం. వాటిపై తక్షణ చర్యల ద్వారా మైనింగ్ అక్రమాలను ఎప్పటికప్పుడు అరికడుతున్నాం. పేదలు, రైతులకు ఇచ్చిన ఈ మినహాయింపులను ఎవరైనా దుర్వినియోగం చేస్తే వారిపై కూడా చర్యలు ఉంటాయి. ఈ మినహాయింపులవల్ల మైనింగ్ రెవెన్యూలో తగ్గుదల చాలా పరిమితంగా ఉంటుంది. అక్రమాలకు ఆస్కారంలేదు కాబట్టి ఆర్థికశాఖ నుంచి ఆమోదం లభిస్తుందని భావిస్తున్నాం. ఈ ఫైలుపై గనుల శాఖ పంపిన వివరణను ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఈ ఫైలుకు ఎలాంటి ఆమోదం లభించలేదు. అయినా తప్పుడు సమాచారంతో అసత్యాలను పోగేసి ఈనాడు వార్తలు రాయడం దారుణం. – వీజీ వెంకటరెడ్డి, డైరెక్టర్, గనుల శాఖ -
చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్.. హైకోర్టు ఊహించని షాక్
-
సొరంగ బాధితుల కోసం సైకత శిల్పి ప్రార్థనలు
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలోగల సొరంగంలో కూలీలు చిక్కుకుపోయి నేటికి (బుధవారం) సరిగ్గా 11 రోజులు అయ్యింది. వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ బృందాలు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో నిర్మాణంలో ఉన్న ఈ సొరంగంలోని కొంత భాగం కూలిపోయింది. ఈ నేపధ్యంలో 41 మంది కార్మికులు సొరంగంలో చిక్కుకుపోయారు. బాధిత కార్మికులను రక్షించేందుకు ఓన్జీసీ, ఎస్జేవీఎన్ఎల్, ఆర్వీఎన్ల్, ఎన్హెచ్డీసీఎల్ బృందాలు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఒడిశాలోని పూరీ నగరానికి చెందిన సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్.. ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న కార్మికుల భద్రత, రక్షణను కాంక్షిస్తూ ప్రార్థనలు చేశారు. దీనికి ప్రతిగా ఇసుకతో ఒక కళాఖండాన్ని రూపొందించారు. సొరంగంలో చిక్కుకున్న కూలీలు సురక్షితంగా బయటపడాలని కోరుకుంటూ దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు పూజలు నిర్వహిస్తున్నారు. సిల్క్యారా టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించడమే తమ తొలి ప్రాధాన్యత అని సీఎం పుష్కర్ సింగ్ ధామి అన్నారు. ప్రధాని మోదీ స్వయంగా ఇక్కడ జరుగుతున్న సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇది కూడా చదవండి: సొరంగ బాధితులకు భారీ ఉపశమనం.. రెండు రోజుల్లో బయటకు.. #WATCH पुरी, ओडिशा: रेत कलाकार सुदर्शन पटनायक ने उत्तरकाशी में सुरंग में फंसे श्रमिकों की सुरक्षा और बचाव के लिए प्रार्थना करने के लिए रेत से एक कलाकृति बनाई। (21.11) pic.twitter.com/YSmCnML9ZY — ANI_HindiNews (@AHindinews) November 22, 2023 -
రాజకీయంగా బురద జల్లేందుకే ఇసుకపై అసత్య కథనం
-
కేబినెట్ కళ్లుగప్పి ఖజానాకు కన్నం
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో ఇసుక దోపిడీకి బరి తెగించిన మాజీ సీఎం చంద్రబాబు ఉచిత విధానం ముసుగులో నిర్భీతిగా అన్ని విధి విధానాలను ఉల్లంఘించారు. ఒకపక్క ఇసుక ఉచితమంటూనే మరోపక్క అక్రమ తవ్వకాలకు భారీ జరిమానాలంటూ మెలిక పెట్టారు. కేంద్ర ప్రభుత్వ చట్టం, గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలను తుంగలో తొక్కడంతోపాటు కేబినెట్ను చీకట్లో ఉంచి మరీ దోపిడీకి తెరతీశారు. కేబినెట్ ఆమోదం లేకుండా మొదట ఓ మెమో.. తరువాత జీవో ద్వారా ఇసుక దందాకు తెగబడ్డారు. ఇప్పుడు పారదర్శకంగా ఇసుక తవ్వకాలను నిర్వహిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వానికి రెండేళ్లలో దాదాపు రూ.770 కోట్ల మేర ఆదాయం సమకూరింది. అంటే గత సర్కారు హయాంలో దాదాపు రూ.వెయ్యి కోట్ల ఆదాయానికి ఖజానాకు చంద్రబాబు గండి కొట్టినట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వానికి రావాల్సిన ఆ ఆదాయం అంతా పచ్చ ముఠాలకు చేరిపోయింది. అంతేకాకుండా ఉచితం ముసుగులో టీడీపీ నేతలు విచ్చలవిడిగా దోపిడీ పర్వం సాగించారు. వీటిని అడ్డుకున్నందుకు ఎమ్మార్వో వనజాక్షిపై నాటి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విచక్షణా రహితంగా దాడులకు బరి తెగించారు. స్వయంగా నాటి సీఎం చంద్రబాబు కరకట్ట నివాసం పక్కనే ఇష్టారాజ్యంగా ఇసుక లూటీ జరుగుతున్నా కళ్లు మూసుకుని కూర్చోవడాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తీవ్రంగా తప్పుబడుతూ భారీ జరిమానా సైతం విధించింది. రాష్ట్ర సంపదను దోచేస్తున్నారని ఆక్షేపించినా చంద్రబాబు చలించలేదు. ఈ ఇసుక దోపిడీ కేసులో సీఐడీ తీగ లాగుతుంటే పచ్చ ముఠాల డొంక కదులుతోంది. ఆది నుంచి కన్ను 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే ఇసుక రీచ్లను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా జిల్లా, మండల మహిళా సమాఖ్యలకు అప్పగించినట్లు చంద్రబాబు కథ నడిపారు. మహిళా సమాఖ్యల ముసుగులో రెండేళ్ల పాటు భారీగా ఇసుక కొల్లగొట్టినా ఆయన సంతృప్తి చెందలేదు. కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల మేరకు 2016లో ఏపీఎండీసీ ద్వారా ఇసుక రీచ్లను వేలం వేసి ఇసుక విధానాన్ని రూపొందించారు. ఈమేరకు కేబినెట్ తీర్మానం చేసి 2016 జనవరి 1న జీవో 19 ఇవ్వగా అదే ఏడాది జనవరి 15న జీవో 20 వెలువడింది. ఈ విధానం ద్వారా కూడా మిగిలిన మూడేళ్లలో తాను ఆశించిన మేరకు ఇసుక దోపిడీ సాధ్యం కాదని భావించిన చంద్రబాబు రెండు నెలల్లోనే టెండర్ల ద్వారా ఇసుక రీచ్ కేటాయింపు విధానాన్ని పక్కన పెట్టేశారు. పచ్చ ముఠాలకే ఉచితం రాష్ట్రంలో ఇసుకను ప్రజలందరికీ ఉచితంగా ఇస్తున్నట్లు చంద్రబాబు నమ్మబలికారు. అందుకోసం కేబినెట్ ఆమోదం లేకుండా జారీ చేసిన మెమో 3066, జీవో 43 మధ్యలో మరో జీవో కూడా తెచ్చారు. 2016 మార్చి 14న జారీ చేసిన ఆ జీవో ద్వారా అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టేందుకు భారీ జరిమానాలను నిర్దేశించారు. ఇసుక ఉచితం అన్నప్పుడు ఇక అక్రమ తవ్వకాలు అనే మాటే ఉత్పన్నం కాకూడదు కదా? అంటే ఉచిత ఇసుక విధానం పేరుతో చంద్రబాబు కనికట్టు చేశారన్నది స్పష్టమైంది. ఆ పేరుతో కేవలం చంద్రబాబు బినామీలు, సన్నిహితులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇసుక రీచ్లను గుప్పిట్లో పెట్టుకున్నారు. మూడేళ్లపాటు దోపీడికి పాల్పడ్డారు. ఇతరులు ఇసుక రీచ్ల జోలికి రాకుండా కట్టడి చేసేందుకే జీవో 35 తెచ్చారు. కొసమెరుపు ఏమిటంటే జీవో 35కు కూడా కేబినెట్ ఆమోదం లేదు. ఉచిత ఇసుక విధానం పేరుతో తెచ్చిన మెమో 3066, అనంతరం జారీ చేసిన జీవోలు 35, 43లకు కేబినెట్ ఆమోదం లేదన్నది నిర్ధారణ అయింది. వాటికి సంబంధించిన నోట్ ఫైళ్లు అటు ఏపీఎండీసీలోగానీ ఇటు గనుల శాఖ, జలవనరుల శాఖ కార్యాలయాల్లోగానీ లేవని సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. ఇసుక దోపిడీ కోసం చంద్రబాబు పక్కాగా సాగించిన పన్నాగంపై పూర్తి ఆధారాలతో సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. కేబినెట్ను చీకట్లో ఉంచి.. ఉచిత ఇసుక విధానంతో దోపిడీ ఎంత ఇసుక అందుబాటులో ఉంది? ఎంత తవ్వుతున్నాం? ఎంతకు అమ్ముతున్నాం? అనే ప్రాథమిక లెక్కలతో కూడా నిమిత్తం లేకుండా యథేచ్ఛగా కాజేసేందుకు ఈ విధానాన్ని తెచ్చారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలను తుంగలోకి తొక్కారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం లేకుండానే కథ నడిపారు. అందుకోసం 2016 మార్చి 4న మెమో 3066 జారీ చేశారు. అది కూడా అప్పటికి రెండు రోజుల ముందు నుంచి అంటే 2016 మార్చి 2 నుంచే ఉచిత ఇసుక విధానం అమలులోకి వచ్చినట్లు అందులో పేర్కొనడం గమనార్హం. అప్పటివరకు కేబినెట్ ఆమోదంతో అమలులో ఉన్న ఇసుక విధానాన్ని తొలగిస్తూ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినట్లు మెమో జారీ చేశారు. ఈ మెమోకు కేబినెట్ ఆమోదం లేదు. అంటే కేబినెట్ ఆమోదంతో రూపొందించిన విధానాన్ని పక్కనపెట్టి అడ్డదారిలో మెమో ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. అక్రమంగా ఇసుక తవ్వకాలపై భారీ జరిమానాలు విధించేందుకు విధివిధానాలను నిర్దేశిస్తూ 2016లో గత సర్కారు జీవో 35 జారీ చేసింది. రెండు నెలల తరువాత అంటే 2016 ఏప్రిల్ 6న జీవో 43 వెలువరించి అప్పటివరకు మెమో ద్వారా అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానానికి రాజముద్ర వేసింది. విడ్డూరం ఏమిటంటే ఆ జీవో 43కు కూడా కేబినెట్ ఆమోదం లేదు. కేబినెట్ ఆమోదం లేకుండానే ఉచిత ఇసుక విధానాన్ని దొడ్డిదారిలో తెచ్చి ఇసుక దోపిడీకి చంద్రబాబు తెరతీశారు. చదవండి: రోత పుట్టించే రాతలు రాయడంలో పచ్చమీడియా రికార్డు -
కనీస జ్ఞానం లేకుండా రాస్తే ఎలా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారదర్శకంగా నిర్వహిస్తున్న ఇసుక గనులపై దురుద్దేశ్యంతో ప్రభుత్వంపై బురద జల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న ఈనాడు దినపత్రికపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర గనులశాఖ సంచాలకులు వీజీ వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్పై ఆ పత్రిక ‘‘ఇసుకకు టెండరు పెట్టింది సీఎంఓనా?’’ అంటూ ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవమని గురువారం ఒక ప్రకటనలో ఆయన ఖండించారు. అనుమతుల్లేకుండానే పలు జిల్లాల్లో అక్రమ దందా అంటూ అర్థంలేని రాతలు రాయడంపై ఆయన మండిపడ్డారు. నిజానికి.. ఇసుకపై రాష్ట్ర ప్రభుత్వం ఒక పారదర్శక విధానాన్ని అమలుచేస్తోందని, దానిపై అపోహలు కలిగించేలా ఇసుక తవ్వకాలు చేసే వారు సీఎంఓ పేరు చెబుతున్నారంటూ పొంతనలేని అంశాలతో అసత్య కథనాన్ని వండివార్చడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. మళ్లీ టెండర్లు అయ్యేవరకూ జేపీనే.. గతంలో రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్యాకేజీల్లో ఇసుకకు టెండర్లు నిర్వహించామని.. ఈ టెండర్లలో జేపీ సంస్థ సక్సెస్ఫుల్ బిడ్డర్గా ఎంపికైన విషయాన్ని వెంకటరెడ్డి గుర్తుచేశారు. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే గత రెండేళ్లుగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని, తిరిగి టెండర్లు నిర్వహించే వరకు ఇదే సంస్థ రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్ నిర్వహిస్తుందన్నారు. మరోవైపు.. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎంఎస్టీసీ ద్వారా ఇసుక ఆపరేషన్స్ కోసం మరోసారి టెండర్ల ప్రక్రియ జరుగుతోందని, అప్పటివరకు పాత కాంట్రాక్టింగ్ ఏజెన్సీ ద్వారానే ఇసుక ఆపరేషన్స్ జరుగుతాయని, గతంలోనూ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పినా అవే తప్పుడు కథనాలను ప్రచురించడం ఈనాడు దురుద్దేశ్యాన్ని తెలియజేస్తోందని వెంకటరెడ్డి పేర్కొన్నారు. అభూతకల్పనలతో రాయొచ్చా?.. ఇక వర్షాకాలంలో ఇసుక ఆపరేషన్స్ నిలిచిపోయినందున ఎండాకాలంలో జేపి సంస్థ ద్వారా తవ్వి, స్టాక్ యార్డ్లలో నిల్వచేసిన ఇసుక విక్రయాలు కొనసాగుతున్నాయన్నారు. అలాగే, తిరిగి ఇసుక తవ్వకాలు చేసేందుకు వీలుగా అనుమతి ఉన్న రీచ్లలో ఇసుక తవ్వకాలకు పాత కాంట్రాక్టింగ్ ఏజెన్సీ సిద్ధమవుతోందని, దీన్ని వక్రీకరిస్తూ బయటి వ్యక్తులు ఎవరో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని, సీఎంఓ నుంచి తమకు అనుమతి ఉందని వారు చెబుతున్నారంటూ ఈనాడు అభూత కల్పనలతో కథనాన్ని ప్రచురించడం ఎంతవరకు సమంజసమంటూ ఆయన ప్రశ్నించారు. ఇసుక ఆపరేషన్స్కు గనుల శాఖ నుంచి అనుమతులు మంజూరవుతాయని.. మైనింగ్ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఇది తెలుసునన్నారు. అటువంటిది సీఎంఓ అనుమతితో ఇసుక తవ్వుతున్నామని ఎవరైనా ఎలా చెబుతారని, ఒక్క ఈనాడుకు మాత్రమే ఇలా చెబుతున్నారా? అంటూ ఆయన ప్రశ్నించారు. ఒక అంశంపై రాసే సందర్భంలో కనీస పరిజ్ఞానం కూడా లేకుండా అసత్య కథనాలను ప్రచురించడాన్ని ఆయన తప్పుబట్టారు. గతంలోని అక్రమాలు ఈనాడుకు కనిపించలేదా? గతంలో ఉచిత ఇసుక విధానం పేరుతో పెద్దఎత్తున ఇసుక మాఫియా జేబులు నింపుకున్న రోజుల్లో ఈనాడుకు ఆ అక్రమాలు కనిపించలేదా అంటూ వెంకటరెడ్డి ప్రశ్నించారు. సీఎం జగన్ అత్యంత పారదర్శకంగా ఇసుక విధానాన్ని తీసుకొచ్చి, ప్రజలకు అందుబాటు ధరలో, వర్షాకాలంలోనూ ఇసుక కొరతలేకుండా ఇసుకను అందిస్తుంటే ఈనాడు తట్టుకోలేక తప్పుడు వార్తలను వండివారుస్తోందన్నారు. నిజానికి.. ఎలాంటి విమర్శలకు అవకాశంలేకుండా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ, మినీరత్నగా గుర్తింపు పొందిన ఎంఎస్టీసీ ద్వారా ఇసుక టెండర్లు నిర్వహిస్తున్నామని.. ఆసక్తి ఉన్న ఎవరైనా ఈ టెండర్లలో పాల్గొనేందుకు అవకాశముందని ఆయన పేర్కొన్నారు. వాస్తవాలిలా ఉంటే.. జిల్లాల్లో అక్రమ ఇసుక దందా జరుగుతోందని, పులివెందుల నేత సోదరుల ఆధ్వర్యంలో తవ్వకాలు జరుగుతున్నాయని.. జిల్లాకో ఇన్చార్జిని నియమించారంటూ ఈనాడు అబద్ధాలను పోగేసి అవాస్తవాలతో కూడిన కథనాన్ని ప్రచురించిందన్నారు. ఇకనైనా ఇటువంటి తప్పుడు కథనాలను మానుకోకపోతే ఈనాడుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
చంద్రబాబు ఇసుక స్కాం జరిగిందిలా.. ఆ నివేదికలో ఏముంది?
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మరో ఇద్దరు మాజీ మంత్రులు, ఒక మాజీ ఎమ్మెల్యేపైన ఇసుక కుంభకోణం కేసు నమోదు అవడం విశేషం. ఉచిత ఇసుక పేరుతో చంద్రబాబు ప్రభుత్వ టైమ్లో జరిగిన అవినీతిని ఈ ఉదంతం వెలుగులోకి తెచ్చింది. ఈ స్కామ్ వల్ల ప్రభుత్వానికి వెయ్యి కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని గనుల అభివృద్ది సంస్థ అంచనా వేసింది. సీఐడీ ఆ మేరకు కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టుకు తెలియచేసింది. బహుశా దీనికి కూడా 17ఎ వర్తింపచేయాలని, గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలని టీడీపీ డిమాండ్ చేయవచ్చు. ✍️తాము ప్రస్తుత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నందున తమపై ఇసుక కేసును బనాయించారని టీడీపీ నేతలు చేస్తున్న ప్రతి విమర్శ. ఎప్పుడు అక్రమం జరిగినా అది బయటకు రావల్సిందే కదా! టీడీపీ వారు ఆరోపిస్తేనే అవినీతి, ఏపీ ప్రభుత్వ సీఐడీ కేసు నమోదు చేస్తే అది అక్రమం అని ఎలా వాదిస్తారు?. ఇసుక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఆదాయ వనరుగా సుమారు మూడు దశాబ్దాలుగా ఉంది. 1990వ దశకం మొదట్లో సుమారు వంద కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. పంచాయతీల ద్వారా కొంత కాలం, ఆ తర్వాత కేవలం ఎడ్ల బండ్ల మీద తీసుకువెళ్లేవారికే ఉచితం అని కొంత కాలం ఇలా పలు విధానాలు అమలు జరిగాయి. కాని అప్పట్లో ఇసుకలో ఇంత అవినీతి సొమ్ము ఉందని ఊహించలేకపోయారు. ✍️2014లో రాష్ట్ర విభజనకు ముందు రీచ్ల వారీగా వేలం పాటలు జరిగేవి. చంద్రబాబు వచ్చాక అందులో పలు మార్పులు చేశారు. తొలుత డ్వాక్రా మహిళా సంఘాలకు ఈ రీచ్లు అప్పగిస్తున్నామని, తద్వారా వారికి ఇది ఉపయోగం అవుతుందని ఆయన ప్రకటించారు. నిజంగానే ఇది మహిళోద్దరణమోనని అనుకున్నారు. తీరా చూస్తే మహిళా సంఘాలను అడ్డుపెట్టుకుని అధికారంలో ఉన్న టీడీపీ నేతలు ఇసుకపై అక్రమ సంపాదనకు అది ఒక మార్గం మార్చారన్న సంగతిగా తేలింది. ఈ సంఘాల మహిళలకు కొద్దిపాటి డబ్బు ముట్టచెప్పి, టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తమ ఇష్టారాజ్యంగా ఇసుకను తరలించి అమ్ముకునేవారు. ఒకే చలాన్ పై అనేక మార్లు లారీలను తిప్పడం, తదితర అవకతవకలకు పాల్పడేవారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ✍️కారణం ఏమోకాని, ఈ పద్దతి కన్నా అసలు ఇసుక ఉచితం అని చెబితే టీడీపీ నేతలకు ఎక్కువ లాభం అనుకున్నారేమో తెలియదు కాని ఉచిత విధానం తెచ్చారు. దీనికి మంత్రివర్గ ఆమోదం లేకపోవడం కూడా గమనించాలి. పోనీ చిత్తశుద్దితో దానిని అమలు చేశారా అంటే అదీ లేదు. ఇక పూర్తిగా ఎమ్మెల్యేలు, మంత్రులు, పలుకుబడి కలిగిన టీడీపీ నేతల ఇష్టారాజ్యం అయిపోయింది. వారు ఎక్కడ కావాలంటే అక్కడ తవ్వడం, అమ్ముకోవడం చేశారు. చివరికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్న కృష్ణా నదిలో కూడా భారీ ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరిగేవి. ✍️నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీనిపై విచారణ జరిపి రాష్ట్ర ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయల జరిమానా కూడా విధించింది. ఉచిత ఇసుకలో దందా జరిగిందనడానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం అవసరం లేదు. మరో సంగతి ఏమిటంటే ఇప్పుడు టీడీపీకి మద్దతు ఇస్తున్న న్యాయవాది శ్రవణ్ కుమార్ ఆ రోజుల్లో టీడీపీ ప్రభుత్వంపై పాతికవేల కోట్ల అక్రమాలు జరిగాయంటూ దావాలు కూడా వేశారు. తర్వాత అవి ఏమయ్యాయోకాని, ఆయన మాత్రం తదుపరి టీడీపీ మద్దతుదారుగా మారారు బహుశా. ఆ శ్రవణ్ కుమారే అనుకుంటా! కేవలం ఇసుకలోనే పదివేల కోట్ల దోపిడీ జరిగిందని అప్పట్లో ఎన్.జి.టి.కి ఫిర్యాదు చేశారు. ఆ విషయాన్ని ఆ సంస్థ తన నివేదికలో కూడా తెలిపింది. చంద్రబాబు ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తే దానిపై కూడా కేసు పెడతారా అని టీడీపీ నేతలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టీడీపీ మీడియా సంస్థలు ప్రశ్నించాయి. ✍️ఈనాడు అయితే జగన్ ప్రభుత్వంపై వేల కోట్ల అవినీతి అంటూ ఆరోపణలు చేసేసింది. ఇక్కడ సంగతి ఏమిటంటే చంద్రబాబు ఉచితం ఇసుక విధానం తెచ్చినందుకు కేసు పెట్టలేదు. ఆ పేరుతో ఇసుక దందా చేసినందుకు, వందల కోట్ల అక్రమార్జన చేసినందుకు అని గుర్తుంచుకోవాలి. అప్పట్లో ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకుంటే ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు ఆమెపై దౌర్జన్యం చేయడం తీవ్ర కలకలం రేపింది. ఆ సందర్భంలో చింతమనేనిని కాకుండా వనజాక్షినే చంద్రబాబు మందలించడం కూడా విమర్శలకు గురైంది. ✍️అంతేకాదు. ఒకసారి ఈనాడు పత్రికలోనే ఏ ఏ టీడీపీ ఎమ్మెల్యే ఇసుక రీచ్లను ఎలా దోచుకుంటున్నారో వివరిస్తూ ఒక కథనాన్ని ఇచ్చింది. కాకపోతే లోపలి పేజీలో ఆ ఎమ్మెల్యేల పేర్లు రాయకుండా స్టోరీ ప్రచురించారు. బహుశా ఆయా ఎమ్మెల్యేలను బెదిరించడానికి అయి ఉండవచ్చు. ఇసుక దోపిడీ పై ప్రస్తుతం సీఐడి పెట్టిన కేసు వివరాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా టీడీపీకి మద్దతు ఇవ్వడానికి, జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడానికే ఈనాడు, తదితర టీడీపీ మీడియాలు ప్రయత్నించాయి. కొద్ది రోజుల క్రితమే బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి జగన్ ప్రభుత్వంపై ఇసుక దోపిడీ అంటూ ఆరోపణలు చేశారు. జగన్ ప్రభుత్వం ఇసుకకు సంబంధించి ఒక నిర్దిష్ట విధానం తెచ్చి ఏడాదికి 750 కోట్ల మేర ఆదాయం సమకూర్చింది. అయినా అవినీతి జరిగిందని చెబుతున్నవారు గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన దందా గురించి ఎందుకు ప్రశ్నించడం లేదో తెలియదు. చదవండి: పురందేశ్వరి గారూ.. మీది వెన్నుపోటు రాజకీయమా?’ ✍️అసలు సీఐడీ కేసులు పెట్టడమే తప్పని వీరు వాదించడం ఆరంభించారు. మరి అలాంటప్పుడు జగన్ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలపై టీడీపీ నేతలు, వారి అంతేవాసులు నిత్యం కోర్టులకు వెళ్లి ఎందుకు కేసులు వేస్తున్నారు?. వైసీపీ అసమ్మతి ఎంపీని అడ్డం పెట్టుకుని ఏకంగా జగన్ ప్రభుత్వంపై సీబీఐ విచారణ కోరుతూ పిల్ ఎలా వేశారు. అలా చేయడం రైట్ అయినప్పుడు ఇప్పుడు ఏపీ సీఐడీ వారు టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై ఆధారాలతో సహా కేసులు వేయడం ఎలా తప్పు అవుతుంది?టీడీపీ కాని, ఈనాడు వంటి మీడియా సంస్థలు కాని పరస్పర విరుద్దంగా వ్యవహరిస్తూ జగన్ ప్రభుత్వాన్ని ఏదో రకంగా బదనాం చేయాలన్న లక్ష్యంతోనే పనిచేస్తున్నాయని పదే, పదే రుజువు చేసుకుంటున్నాయి. ✍️గత ప్రభుత్వంలో ఇసుకకు సంబంధించి వేల కోట్ల అవినీతి జరిగిందన్నది పచ్చి నిజం. టీడీపీ హయాంలో వెయ్యి కోట్ల నష్టం వాటిల్లిందని కేసు పెట్టారు. దానిని రుజువు చేయడానికి సీఐడీ ఎలాంటి ఆధారాలు చూపుతుందన్నది చూడాలి. అవినీతి జరగడం వేరు. దానిని కోర్టులలో రుజువు చేయడం వేరు. ఏది ఏమైనా ఇప్పటికే పలు అవినీతి కేసులలో కూరుకుపోయిన చంద్రబాబు నాయుడిని ఈ అవినీతి ఇసుక ఎలా కప్పివేస్తుందో, దానిని ఆయన ఎలా కడుక్కుంటారో వేచి చూడాల్సిందే. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
బాబు ఉచిత ఇసుక విధానం.. పేదల కోసం కాదు.. పెద్దల కోసం
సాక్షి, అమరావతి : పేదలు ఇళ్లు కట్టుకోవడానికి దోహదపడాల్సిన ఉచిత ఇసుక విధానం ద్వారా స్మగ్లర్ల ముఠా భారీ యంత్రాలతో ఇసుకను తవ్వి పెద్దఎత్తున అక్రమార్జనకు పాల్పడిందని శ్రావణ్కుమార్ అనే న్యాయవాది తమ దృష్టికి తెచ్చిన అంశాలను జాతీయ హరిత ట్రిబ్యునల్ 2019, ఏప్రిల్ 4న ఇచ్చిన తీర్పులో ప్రముఖంగా ప్రస్తావించింది. ప్రజల ఆస్తి అయిన సహజ వనరులను ధర్మకర్తలా పరిరక్షించాల్సిన ప్రభుత్వం.. పర్యావరణ చట్టాలను తుంగలో తొక్కుతూ పూడికతీత, డ్రెడ్జింగ్ పేరుతో ఇసుకను పెద్దల ముఠా దోచుకుంటుంటే ప్రేక్షకపాత్ర వహించడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. సహజ వనరులపై ప్రజలందరికీ సమాన హక్కులు ఉంటాయనే అంశాన్ని గుర్తుచేసింది. ప్రజలకు సమాన హక్కులు ఉన్న సహజ వనరులను కొందరు పెద్దల ముఠాకే దోచిపెట్టడం సమానత్వం సిద్ధాంతాన్ని అవహేళన చేయడమేనని స్పష్టంచేసింది. ఇసుకను యథేచ్ఛగా అక్రమంగా తవ్వేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు తీవ్రంగా నష్టం చేస్తుంటే ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరించడాన్ని అప్పట్లో ఎన్జీటీ ఘాటుగా స్పందించింది. అడ్డగోలుగా ఇసుకను తవ్వేయడం ద్వారా పర్యావరణం దెబ్బతిన్నదని.. దానివల్ల ప్రజారోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడిందని తెలిపింది. ప్రజల హక్కులను ఇసుక స్మగ్లర్లు కాలరాస్తుంటే ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడంలో ఆంతర్యమేమిటని నాటి టీడీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. తక్షణమే ఇసుక అక్రమ తవ్వకాలను ఆపేయాలని 2019, ఏప్రిల్ 4న అల్టిమేటం జారీచేసింది. మహిళా సంఘాల ముసుగులో దోపిడీ.. నిజానికి.. విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం.. ఇసుక రీచ్ల నిర్వహణ, అమ్మకాలను స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ) మహిళలకు అప్పగిస్తూ తొలుత ప్రకటించింది. మహిళా సంఘాల ముసుగులో ముఖ్యనేత దన్నుతో టీడీపీ ప్రజాప్రతినిధులు ఇసుక రీచ్లను హస్తగతం చేసుకుని.. అడ్డగోలుగా ఇసుకను తవ్వేసి, అధిక ధరలకు విక్రయిస్తూ దోచుకున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో 2016, మార్చి 4న ఆ విధానాన్ని రద్దుచేసి.. ఉచిత ఇసుక ముసుగులో తమ ముఠా దోపిడీకి అప్పటి సీఎం చంద్రబాబు రాచబాట వేశారు. ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ జారీచేసిన మార్గదర్శకాలను తుంగలో తొక్కుతూ.. చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడానికి కూతవేటు దూరంలో ప్రకాశం బ్యారేజ్ జలవిస్తరణ ప్రాంతంలో కృష్ణా నదీ గర్భంలో భారీ పొక్లెయిన్లు, మర పడవలు ఏర్పాటుచేశారు. తద్వారా ఇసుకను తవ్వేసి, అధిక ధరలకు మార్కెట్లో విక్రయించిన ముఠా పెద్దఎత్తున అక్రమార్జన సాగించింది. దీనిపై 2016లోనే రైతులు ఎన్జీటీని ఆశ్రయించారు. పర్యావరణానికి తీవ్రంగా విఘాతం కలిగిస్తున్న ఇసుక తవ్వకాలను నిలిపివేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. దీనిపై విచారించిన ఎన్జీటీ.. 2017, ఫిబ్రవరి 23న ఇసుక అక్రమ తవ్వకాలను ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్జీటీ ఆదేశాలు బేఖాతరు.. అయినా.. నాటి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో రైతులు మళ్లీ ఎన్జీటీని ఆశ్రయించారు. ఇసుక అక్రమ తవ్వకాలను నిగ్గుతేల్చేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఎన్జీటీ ఓ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ 2019 జనవరి 17–18న చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడానికి కూతవేటు దూరంలో స్మగ్లర్ల ముఠా భారీ యంత్రాలతో యథేచ్ఛగా ఇసుక తవ్వుతుండటాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి.. 2019, జనవరి 21న ఎన్జీటీకి నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా తక్షణమే ఇసుక అక్రమ తవ్వకాలను ఆపేయాలని టీడీపీ సర్కార్కు అల్టిమేటం జారీచేసింది. ఇసుక అక్రమ తవ్వకాలతో పర్యావరణాన్ని దెబ్బతీసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.వంద కోట్ల జరిమానాను విధించింది. ఈ మొత్తాన్ని ఇసుక స్మగ్లర్ల నుంచే వసూలుచేసి చెల్లించాలని స్పష్టంచేసింది. ‘‘సహజ వనరులు ప్రజల ఆస్తులు. ప్రభుత్వం ప్రజల ఆస్తులకు ధర్మకర్తగా వ్యవహరించాలి. నియంత్రణ లేకుండా ఇసుకను తవ్వి ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించడం అవివేకమైన చర్య. ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వేయడంవల్ల పర్యావరణానికి తీవ్రంగా విఘాతం కలిగింది. ఇలా పర్యావరణానికి విఘాతం కలిగించిన వారి నుంచి పరిహారాన్ని వసూలుచేసి.. దానితో పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా భవిష్యత్ తరాలకు సహజ వనరులను అందుబాటులో ఉండేలా చేయడం ప్రభుత్వం బాధ్యత’’. – 2019, ఏప్రిల్ 4న ఇచ్చిన తీర్పులో జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చేసిన వ్యాఖ్య. -
చంద్రబాబు ముఠా రూ.10 వేల కోట్ల దోపిడీపై మరో కేసు
-
బుర్జ్ ఖలీఫాను మించి.. నిర్మాణ సామగ్రి ఉత్పత్తి గురించి ఆసక్తికర విషయాలు!
నిర్మాణ రంగం రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచంలో ఎన్నెన్నో అద్భుతమైన భవనాలు ఈ రోజుకీ పురుడుపోసుకుంటున్నాయి. ఇలాంటి భవనాలు లేదా నగరాల నిర్మాణానికి కావాల్సిన ప్రధానమైన ముడిపదార్ధాలు సిమెంట్, ఉక్కు (స్టీల్), ఇసుక. 2020లో ప్రపంచంలో ఈ ముడిపదార్ధాల ఉత్పత్తి ఎంత? ఏ దేశంలో ఎక్కువ ఉత్పత్తి ఉంది.. వంటి ఆసక్తికర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సిమెంట్ అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం, 2020లో అత్యధికంగా సిమెంట్ ఉత్పత్తి చేసిన దేశాల జాబితాలో చైనా (2200 మిలియన్ టన్నులు) అగ్ర స్థానంలో, రెండవ స్థానంలో భారత్ (340 మిలియన్ టన్నులు) నిలిచాయి. చివరి స్థానంలో సౌత్ కొరియా మొదలైన దేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం సిమెంట్ ఉత్పత్తి 2020లో 4.1 బిలియన్ టన్నులు. ప్రపంచలోని అన్ని దేశాలు ఉత్పత్తి చేసిన సిమెంటుతో ఒక దిమ్మె నిర్మిస్తే.. అది 1,195 మీటర్ల పొడవు, 1.7 బిలియన్ క్యూబిక్ మీటర్ల పరిమాణం ఉంటుంది. బరువు ఏకంగా 4.1 బిలియన్ టన్నులు ఉంటుంది. ఈ దిమ్మె పొడవు బుర్జ్ ఖలీఫా కంటే 365 మీటర్లు ఎక్కువ ఉంటుందన్నమాట. సిమెంట్ తయారు చేసేటప్పుడు టన్నుల కొద్దీ కార్బన్ డయాక్సైడ్ (CO2) విడుదలవుతుంది, అధిక మొత్తంలో నీరు అవసరమవుతుంది. కాంక్రీట్ ఉత్పత్తిలో అధిక కార్బన్ ఉద్గారాలు, నీటి వినియోగాన్ని తగ్గించేందుకు, స్వీడిష్ పవర్ కంపెనీ వాటెన్ఫాల్ ఓ ప్రత్యేకమైన కాంక్రీట్ మిశ్రమాన్ని అభివృద్ధి చేసింది. దీని ద్వారా CO2 ఉద్గారాలు బాగా తగ్గుతాయి. ఉక్కు (స్టీల్) సిమెంట్ తరువాత నిర్మాణానికి కావాల్సిన ముఖ్యమైన లోహం ఉక్కు. 2020లో ప్రపంచంలోని అన్ని దేశాలు కలిపి మొత్తం 180 కోట్ల టన్నుల బరువైన ఉక్కుని ఉత్పత్తి చేశాయి. అంతకు ముందు 1900 నుంచి ఉక్కు పరిశ్రమ 2500 కోట్ల టన్నుల స్టీల్ స్క్రాప్ను రీసైకిల్ చేసింది. దీని వల్ల 3500 కోట్ల టన్నుల ఇనుము వినియోగం, 1800 కోట్ల టన్నుల బొగ్గు వినియోగం తగ్గింది. ప్రపంచ దేశాల్లో ఉత్పత్తి అయిన ఉక్కుతో ఓ దిమ్మె నిర్మిస్తే.. అది 610 మీటర్ల ఎత్తు, 227.8 మిలియన్స్ ఘనపు మీటర్ల పరిమాణం, 180 కోట్ల టన్నుల బరువుతో నిర్మితమవుతుంది. ఇదీ చదవండి: గంటకు 23 మంది.. ఏడాదికి వేలల్లో.. ఆందోళనలో టెకీలు! రంగాల వారీగా రికవరీ రేట్లు ఇసుక నిర్మాణ రంగంలో మరో ముఖ్యమైన మెటీరియల్ ఇసుక, కంకర (చిన్న రాళ్లు). 2020లో ఉత్పత్తి అయిన ఇసుక 26.5 కోట్ల టన్నులు. ఇంత ఇసుకతో ఏకంగా 555 మీటర్ల ఎత్తు, 171 మిలియన్ క్యూబిక్ మీటర్ల పరిమాణంతో ఓ దిమ్మె నిర్మించవచ్చు. ప్రస్తుతం చాలా నగరాల్లో ఇసుక అవసరం లేకుండానే పెద్ద పెద్ద భవనాలను గాజు, ఇతర మెటీరియల్స్ ఉపయోగించి ఎంతో అందంగా నిర్మిస్తున్నారు. -
'ఇసుక' అనుమతులు వేగవంతం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలందరికీ అందుబాటు ధరలో ఇసుకను అందించాలని అధికారులను గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి ఆదేశించారు. పట్టా భూముల్లో ఇసుక వెలికితీతకు సంబంధించిన అనుమతులను వేగవంతం చేయాలని సూచించారు. శుక్రవారం సచివాలయంలో గనులు, భూగర్భ వనరుల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పట్నం మహేందర్రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అమల్లో ఉన్న మైనింగ్, క్వారీ లీజులు, రెవెన్యూ వసూలు తదితర అంశాలతోపాటు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అందుకోవడంలో గనుల శాఖ సాధించిన పురోగతిని పరిశీలించారు. ఖనిజాల బ్లాక్ల వేలానికి వీలుగా పర్యావరణ అనుమతులను వేగవంతం చేయాలని.. గనులు, చిన్న తరహా మైనింగ్ లీజులపై మరింత మంచి విధానం అమలు చేయాలని అధికారులకు సూచించారు. లీజులో ఉండి పని నడవని గనులను క్రియాశీలం చేయాలని, జిల్లాల వారీగా మినరల్ రెవెన్యూ పెంచాలని ఆదేశించారు. గనుల శాఖలో ఖాళీగా ఉన్న అధికారులు, సిబ్బందికి సంబంధించిన 127 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. గత ఏడేళ్లలో ఇసుక విక్రయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.5,444 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. -
పోలవరం పనులు పరిశీలించిన పీపీఏ సీఈవో
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు పనులను పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సీఈవో శివనందన్ కుమార్ మంగళవారం పరిశీలించారు. ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్) ప్రాంతంలో గోతులు పడిన ప్రదేశంలో ఇసుకతో నింపి వైబ్రో కంపాక్షన్ చేసిన పనులను ఆయన తనిఖీ చేశారు. రానున్న వరదల కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో సమీక్షించారు. ఈఎన్సీ నారాయణరెడ్డి, సీఈ సుధాకర్ బాబు, ఎస్ఈ నరసింహమూర్తి, మేఘ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. -
తన్నారు.. తిన్నారు.. చంద్రబాబు, రామోజీరావు అసలు బండారం
పోలవరం ప్రాజెక్టును తానే నిర్మిస్తానని కేంద్రం చెబితే.. వద్దు మాకు ప్యాకేజీ చాలన్నారు చంద్రబాబు. అలా చేస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగబోమని హామీనిచ్చేశారు. కేంద్రం సరేనని ప్యాకేజీలో భాగంగా పోలవరాన్ని అప్పగిస్తే.. రామోజీరావు వియ్యంకుడి కంపెనీ నవయుగకు ఎలాంటి టెండర్లూ లేకుండా నామినేషన్పై రూ.3,302 కోట్ల విలువైన పనులు కట్టబెట్టేశారు బాబు. పనిలోపనిగా యనమల రామకృష్ణుడి బావ మరిదికీ కొంత పంచారు. ఇక అందిన ప్యాకేజీలో దత్తపుత్రుడు, తోక పత్రికకు వాటా చేరిపోయింది. కాబట్టే... ఎందుకు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని వాళ్లు ప్రశ్నించలేదు. ఒక్క ఒక్కరం ముక్కా రాయలేదు. ఇదీ.. దోచుకో– పంచుకో–తినుకో అంటే! మూసేసిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ గానీ, నడుస్తున్న మార్గదర్శి చిట్స్ గానీ ఏ నిబంధననూ పాటించవు. కోట్లకు కోట్లు డిపాజిట్లు తీసుకున్నాయి. మార్గదర్శి ఫైనాన్షియర్స్పై అక్రమంగా డిపాజిట్లు వసూలు చేస్తున్నందుకు క్రిమినల్ కేసులు నడుస్తుండగా.. రూ.2వేల కోట్లు ఫైన్ కట్టాల్సిన పరిస్థితుల్లో తప్పించుకునేందుకు ఏకంగా సంస్థనే మూసేశారు. ఇక చిట్స్ సంస్థ బిడ్ పాడుకున్న వాళ్లనూ ష్యూరిటీల పేరిట నెలలకు నెలలు తిప్పుతుంది. అక్రమంగా డిపాజిట్లూ తీసుకుంటోంది. ఇలా ఏం చేసినా... చంద్రబాబు ప్రశ్నించరు. ముఖ్యమంత్రిగా ఉన్నా దాని జోలికెళ్లరు. ఇది కాదూ.. డీపీటీ అంటే!! ముఖ్యమంత్రిగా షాపుర్జీపల్లోంజీ సంస్థకు వేల కోట్ల నిర్మాణ కాంట్రాక్టులు కట్టబెట్టారు నారా వారు. ఆ సంస్థను పిలిచి... పార్టీకి కాదు, మా ‘బాబు’ గారికి ఫండ్ కావాలన్నారు బాబు పీఏ శ్రీనివాస్. డొల్ల కంపెనీలు పుట్టుకొచ్చాయి. వాటిల్లో వందల కోట్లు ప్రవహించాయి. వాటిలో కొంత రామోజీ తనయుడి వియ్యంకుడి కంపెనీకీ (ఆర్వీఆర్ ఇన్ఫ్రా) చేరాయి. అక్కడి నుంచి చంద్రబాబు జేబులోకీ కొంత మళ్లాయి. దుబాయ్లో ఆస్తులు కూడబెట్టిన బాబు... అక్కడా కొంత క్యాష్ తీసుకున్నారు మరి!. ఇదంతా సంబంధిత వ్యక్తులు స్వయంగా సంతకం చేసిన ఇన్కమ్ట్యాక్స్ అప్రైజల్ రిపోర్ట్లోనిదే!. కానీ దీని గురించి రామోజీ, ఆయన తోకపత్రిక పెన్నెత్తితే ఒట్టు. ఇదీ.. తోడు దొంగల డీపీటీ అంటే!!. రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలో ఉండగా స్కిల్ డెవలప్మెంట్ నుంచి ఫైబర్నెట్ వరకూ దోచుకో– పంచుకో– తినుకో పథకాన్ని విజయవంతంగా అమలుచేసిన దుష్ట చతుష్టయం... ఇపుడో కొత్త రాగం ఎంచుకుంది. అధికార పారీ్టయే ఇసుక తవ్వకాల్లో ‘దోచుకో, పంచుకో, తినుకో’ అన్నట్లుగా వ్యవహరిస్తోందనే కథనాలకు దిగింది. మరి ఇందులో నిజం వీసమెత్తయినా ఉందా? బాబు హయాంలో ఇసుక విషయంలో జరిగిందేంటి? ఇప్పుడు జరుగుతున్నదేంటి? ఎవరి హయాంలో దోపిడీ జరిగింది? ఎవరు పంచుకున్నారు? ఎవరు తిన్నారు? ఒకసారి చూద్దాం.. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు.. పేరుకే ఇసుక ఉచితం!!. కానీ సామాన్యులు ఒక్కరికైనా ఫ్రీగా అందితే ఒట్టు!. అంతా బాబు కనుసన్నల్లోనే. అంతా టీడీపీ నేతల చేతుల్లోనే. ఉచితం పేరిట ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా రాకుండా వేల కోట్లు దోచేసి.. పంచుకుతినేశారు. సామాన్యులకు ఉచితంగా ఇవ్వకుండా... ప్రభుత్వానికి కూడా రూపాయి రాకుండా ఇసుకను తవ్వేయటం దారుణమని భావించారు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి. అందుకే జాతీయస్థాయిలో టెండర్లు పిలిచారు. అలా టెండర్లు పిలిచే బాధ్యతను ఏకంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్టీసీకి అప్పగించారు. బహిరంగ టెండర్లలో ఇసుక తవ్వి, విక్రయించే కాంట్రాక్టును జయప్రకాశ్ గ్రూపునకు చెందిన ‘జేపీ పవర్ వెంచర్స్’ దక్కించుకుంది. దీనికోసం ఇది ఏటా ప్రభుత్వానికి రూ.750 కోట్లు చెల్లించాలి. అంటే... ఐదేళ్లలో దాదాపు రూ.4వేల కోట్లు. గతంలో ఇందులో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి రాలేదు. మరి ఈ సొమ్ము ఎక్కడికి పోయింది? ప్రజలకు కూడా ఇసుక ఫ్రీగా దొరకనప్పుడు ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు ఎవరి జేబుల్లోకి పోయింది? ఇంకెవరు... చంద్రబాబు, రామోజీ, తోకపత్రిక యజమాని, దత్తపుత్రుడు. ఈ చతుష్టయమే మొత్తం ఇసుక వ్యాపారాన్ని శాసించింది. కృష్ణానది కరకట్టపై చంద్రబాబు కట్టిన ఇంటి వెనకాల... రాత్రీపగలూ విరామం లేకుండా ఇసుక లారీలు తిరిగేవంటే ఈ దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు! అక్రమంగా తవ్వేస్తున్నారని, ఉచితం పేరిట తినేస్తున్నారని తెలుగుదేశం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను అడ్డుకోబోయిన నాటి ఎమ్మార్వో వనజాక్షిని... ఏకంగా జుట్టుపట్టుకుని ఈడ్చేశాడా ఎమ్మెల్యే. అంత దారుణం జరిగినా ‘ఈనాడు’ వ్యతిరేకించలేదు. మనవాడే కదా అని కిమ్మనకుండా ఊరుకున్నారు రామోజీ, ఆయన తోక మీడియా. ఇక చంద్రబాబు మరో అడుగు ముందుకేశారు. ఆ ఎమ్మార్వోను పిలిచి, ఎమ్మెల్యేపై ఎలాంటి ఫిర్యాదూ చేయకుండా ‘రాజీ’ కుదిర్చే ప్రయత్నం చేశారు. ఇదీ.. బాబు, ఆయన బృందం స్థాయి. ఇసుకను ఉచితంగా ఇస్తూ రామోజీరావు చెప్పినట్లుగా చంద్రబాబు మహా యజ్ఞమే చేసి ఉంటే... ఈ దౌర్జన్యాలెందుకు? ఈ దొంగ తవ్వకాలెందుకు? ఒకవేళ ఇసుక తవ్వకాలు తమ చేతుల్లోనే ఉండాలనుకుంటే జాతీయ స్థాయి టెండర్లలో రామోజీరావు కూడా పాల్గొని ఉండొచ్చుగా? ఎందుకు పాల్గొనలేదు?!. మరి ఇప్పుడెందుకీ కడుపు మంట? తమ అక్రమాలకు ఇపుడు ఫుల్స్టాప్ పడిందనేనా? వాళ్ల జేబుల్లోకి పోయిన సొమ్ము ఇపుడు నేరుగా ప్రభుత్వానికి అందుతోందనా? ఇసుక తవ్వకాలపై మరీ పనిగట్టుకుని అపోహలు రేకెత్తించేలా తరచూ రామోజీ రాస్తున్న కథనాల్లో నిజమెంత? ఒకసారి సబ్కాంట్రాక్టరుగా టర్న్కీని తప్పించారంటూ బాధ!. మరోసారి టర్న్కీ సంస్థ దోచేస్తోందని శివాలు. ఇంకోసారి ఇసుక దొరకటం లేదని బాధ! మరోసారి ఇసుక విచ్చలవిడిగా విక్రయంచేస్తున్నారని బాధ!. వీటన్నిటి వెనకా అసలు బాధ మాత్రం... తమ డీపీటీకి అడ్డుకట్ట పడిందనే!. 2 కోట్ల టన్నుల ఇసుకతో... రూ.1800 కోట్లు ఎలా సాధ్యం? ‘ఈనాడు’ వాదన ఎంత ఘోరమంటే... రాష్ట్రంలో ఇసుకను ఎడాపెడా తవ్వేస్తున్నారని... ఇష్టారాజ్యంగా విక్రయిస్తూ కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారని శుక్రవారంనాటి వార్తలో రామోజీ మండిపడ్డారు. కానీ అదే వార్తలో... తూర్పు గోదావరి జిల్లాను సబ్కాంట్రాక్టుగా తీసుకున్న వ్యక్తి... వ్యాపారం సరిగా జరగటం లేదని, తాను చెల్లించాల్సింది తగ్గించమన్నాడట. కుదరదనటంతో ఆత్మహత్య చేసుకున్నాడని కూడా రాసేశారు. ఎడాపెడా తవ్వేస్తూ కోట్లకు కోట్లు సంపాదిస్తున్నపుడు... వ్యాపారం జరగకుండా డబ్బులు చెల్లించలేని పరిస్థితి ఉంటుందా? ఏమనుకోవాలి రామోజీ మీ తెలివిని? మరో వాదన చూద్దాం. ఇసుకపై రూ.1800 కోట్లు వసూలు చేసి ప్రభుత్వానికి రూ.765 కోట్లు కట్టి మిగిలిన సొమ్ము వైఎస్సార్సీపీ నేతలు దోచుకుంటున్నారనేది ‘ఈనాడు’ కథ. నిజానికి రాష్ట్రంలో ఏటా 2 కోట్ల టన్నుల ఇసుక అవసరం. దీనికి అనుగుణంగానే తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక టన్ను ఇసుకను ఓపెన్ రీచ్లలో రూ.475కి విక్రయిస్తున్నారు. అంటే.. మొత్తంగా రూ.900 కోట్లు వస్తాయి. రాష్ట్రంలో లభ్యమయ్యే ఇసుకే 2 కోట్ల టన్నులైతే దానికి రెండు రెట్లు ఎక్కడి నుంచి వస్తుంది? ఇది తెలిసి కూడా జేపీ సంస్థ నుంచి అంతకన్నా ఎక్కువ మొత్తం చెల్లించి వైఎస్సార్ సీపీ నాయకులెందుకు సబ్కాంట్రాక్టులు తీసుకుంటారు? ఒకటీఅరా చోట్ల తీసుకున్నా అంత ఎక్కువ మొత్తం ఎలా చెల్లిస్తారు? ఇవన్నీ కాస్త ఇంగితజ్ఞానం ఉపయోగిస్తే అర్థమవుతాయి కదా రామోజీ? అక్రమ రవాణాపైనా అబద్ధాలేనా? యథేచ్ఛగా పక్క రాష్ట్రాలకు తరలించేస్తున్నారని, అధిక ధరలకు విక్రయిస్తున్నారని... ఇలా చేతికొచ్చిన అబద్ధాలన్నిటినీ రాసి పారేసింది ‘ఈనాడు’. వాస్తవానికి పక్క రాష్ట్రాలకు ఇసుక తరలిపోకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. దీనికోసమే ప్రత్యేకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)ను కూడా ఏర్పాటు చేసింది. ఎక్కడా ఇసుక ఎక్కువ రేట్లకు విక్రయించరాదన్న ఉద్దేశంతో ప్రతి వారం పత్రికల్లో స్థానికంగా విక్రయించే రేటును ప్రకటనల రూపంలో ప్రచురిస్తోంది. అక్కడే... ఒకవేళ ఎక్కువ ధరకు విక్రయిస్తే ‘సెబ్’ నెంబరుకు కాల్ చెయ్యవచ్చంటూ ఆ ఫోన్ నెంబరు కూడా ఇస్తున్నారు. ఇక వినియోగదారులు నేరుగా డిపోలు, రీచ్ల వద్దకు వెళ్ళి ఇసుక నాణ్యతను పరిశీలించి, కావాల్సినంత ఇసుకను బుక్ చేసుకునేందుకు అవకాశం కూడా కల్పించారు. ఒకవేళ ఎక్కడైనా అక్రమంగా తరలిస్తున్న వ్యవహారాలు, ఎక్కువ ధరలకు విక్రయించిన ఘటనలు జరిగితే సెబ్ తక్షణం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు కేసులు కూడా పెడుతోంది. ఇదిగో... ఈ చర్యల ఫలితంగానే ప్రభుత్వానికి భారీగా ఆదాయం రావడంతోపాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇసుక అందుతోంది. మరి ఇసుక విధానం ఇంత పారదర్శకంగా ఉన్నపుడు ‘దోచుకో.. పంచుకో.. తినుకో’ ఎలా అవుతుంది రామోజీ? అబద్ధమైనా అతికినట్లుండాలి కదా? బాబు అక్రమాలకు... ఎన్జీటీ 100 కోట్ల జరిమానా చంద్రబాబు హయాంలో ఇసుక విధానం ఎంత దారుణంగా ఉందో సాక్షాత్తూ జాతీయ గ్రీన్ ట్రిబ్యునలే తేల్చిచెప్పింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు.. సాక్షాత్తూ తన ఇంటి పక్కనే కృష్ణా నదిని తొలిచేస్తూ టీడీపీ నేతలు ఇసుకను తరలించడాన్ని ప్రోత్సహించారంటే దోపిడీ స్థాయిని అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజూ వందల లారీలు తన ఇంటి మీదుగానే అక్రమంగా తరలిపోతున్నా... వాటా వచి్చందో లేదో చూసుకున్నారు తప్ప పర్యావరణానికి జరుగుతున్న డ్యామేజీని ఆయన పట్టించుకోలేదు. దీనిపై ఢిల్లీలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) విచారణ జరిపి... అక్రమాలు ముమ్మాటికీ నిజమని తేల్చింది. టీడీపీ ప్రభుత్వానికి ఏకంగా రూ.100 కోట్ల జరిమానా విధించింది. విచిత్రమేంటంటే జాతీయ స్థాయిలో బాబు ఇసుక మాఫియా గురించి బట్టబయలైనా... కళ్లకు గంతలు కట్టుకున్న రామోజీ ఒక్క అక్షరం కూడా రాయటానికి పూనుకోలేదు. టీడీపీ హయాంలో ఇసుక అక్రమ తవ్వకాలు విచ్చలవిడిగా జరిగినా... వినియోగదారులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు ఇసుకను కొనుక్కోవాల్సి వచి్చనా ఇప్పుడు రాసిన తరహాలో రామోజీ ఎన్నడూ ఒక్క వార్త కూడా రాయలేదెందుకు? ఇసుక లారీలు పెద్ద ఎత్తున పొరుగు రాష్ట్రాలకు తరలిపోయినా... టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించినా ఎందుకు ప్రశి్నంచలేదు? తమ వాటా తమకు అందేసిందనా? అది కదా... అసలైన డీపీటీ!! సబ్ కాంట్రాక్టులు ఎవరికివ్వాలో చెప్పగలమా? వాస్తవానికి టెండర్లలో పాల్గొని దక్కించుకున్న కాంట్రాక్టరు... ఆ తరవాత టెండరు నిబంధనలను పాటిస్తూ ఎవరికి సబ్కాంట్రాక్టుకు ఇచ్చుకున్నా, తనను అలా చేయకుండా నిలువరించటం కష్టం. సబ్కాంట్రాక్టు ఎవరికివ్వాలన్నది కాంట్రాక్టరు ఇష్టం. ఎక్కడైనా.. ఎప్పుడైనా ఇదే పద్ధతి. పోనీ చంద్రబాబు హయాం చూసుకున్నా ఇదే తీరు కదా? కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీనివాస్కు ఇస్తే... ఆ శ్రీనివాస్ సదరు పనులను సీఎం రమేష్ కంపెనీకి సబ్ కాంట్రాక్టుకిచ్చాడు. మరి అప్పుడెందుకు కలమెత్తలేదు రామోజీరావు గారూ? అసలు నిజంగానే వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులే ఇసుక తవ్వకాలు, తరలింపులు చేస్తుంటే ప్రభుత్వం ఎస్ఈబీని ఎందుకు ఏర్పాటు చేస్తుంది? అక్రమంగా తరలించిన వారిపై కేసులెందుకు పెడుతుంది? ఇదంతా రామోజీరావు బుర్రకు తట్టదా? తట్టకేం... కావాలని నాలుగు రాళ్లు్ల విసిరితే సరి అనుకునే పాత్రికేయం మరి. చదవండి: ఊహించినదే వార్తలుగా.. ‘ఈనాడు’ రామోజీ ఇక మారవా? -
అక్రమాలకు అడ్డుకట్ట.. ఇసుక కోరినంత
అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ.. పారదర్శకంగా జిల్లా ప్రజలకు కోరినంత ఇసుకను జిల్లా యంత్రాంగం సరఫరా చేస్తోంది. కృష్ణా, పెన్నా తీర ప్రాంతాల నుంచి ఉప్పునీటి తాకిడి లేని ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో ఉన్న స్టాక్ పాయింట్లను రెట్టింపు చేసి భారీగా నిల్వ చేసింది. జగనన్న కాలనీలకే కాకుండా ఇతర కట్టడాలకు సరిపడా ఇసుకను సరఫరా చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో ఇసుక అక్రమార్కుల చెర నుంచి వినియోగదారులను గట్టున పడేసినట్లు అయింది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇసుక నిల్వ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటి ద్వారా అన్ని రకాల నిర్మాణాలకు ఇసుక సరఫరా చేసేలా చర్యలు తీసుకుంది. ప్రధానంగా పెన్నా నది ఇసుక సంగం రీచ్ ద్వారా జిల్లాకు సరఫరా అవుతోంది. ప్రతి నెలా 40 నుంచి 50 వేల టన్నుల ఇసుకను జిల్లాలోని వినియోగదారులకు అందించేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నారు. గతంలో ఒంగోలుతో పాటు కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెంలలో ప్రధాన ఇసుక స్టాక్ పాయింట్లు ఉండేవి. పుష్కలంగా ఇసుక నిల్వలను అందుబాటులో ఉంచేందుకు అదనంగా ఏడు స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేశారు. త్వరలో కృష్ణా నది ఇసుకను జిల్లాకు తరలించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. 500 ఇళ్లకుపైగా ఉన్న జగనన్న కాలనీలకు ప్రత్యేకంగా.. రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీలకు కూడా జిల్లా వ్యాప్తంగా ఇసుక ఉచితంగా సరఫరా అవుతోంది. అందులోనూ ప్రత్యేకంగా 500 ఇళ్లకు పైగా ఉన్న జగనన్న కాలనీల్లోనే జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులు ప్రత్యేకంగా నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేశారు. లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా ఆయా కాలనీల సమీపంలో పాయింట్లను ఏర్పాటు చేశారు. దీంతో జగనన్న కాలనీలకు సకాలంలో నాణ్యమైన ఇసుక ఉచితంగా సరఫరా చేస్తున్నారు. సింగరాయకొండలోని నిర్మిత కేంద్రం, కనిగిరి పట్టణం, పొదిలి, దర్శి, గిద్దలూరు టిడ్కో ఇళ్ల పక్కన, యర్రగొండపాలెం మండలంలోని మిల్లంపల్లి, బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండంలలో స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసి ఆయా గ్రామాల్లోని జగనన్న కాలనీలతో పాటు పరిసర ప్రాంతాల్లోని జగనన్న కాలనీలకు కూడా అక్కడ నుంచే ఇసుక సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరకే ఇసుక జిల్లాలో ఇతర కట్టడాలకు, వ్యక్తిగత గృహాల నిర్మాణాలకు ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఇసుక ఉంచేలా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసింది. పారదర్శక విధానంలో ప్రభుత్వం నిర్దేశించిన ధరకే నాణ్యమైన ఇసుకను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. జిల్లాలోని నియోజకవర్గాల వారీగా రీజనబుల్ రవాణా చార్జీలతో కలిపి టన్నుకు ప్రభుత్వం నిర్దేశించిన ధరకు సరఫరా చేస్తోంది. ఎవరైనా ఎక్కువ ధరకు ఇసుక అమ్మితే ఎస్ఈబీ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. నెలకు 20 వేల టన్నులకు పైగా... జిల్లాలో నిర్మిస్తున్న జగనన్న కాలనీలకు, ప్రభుత్వం మంజూరు చేసిన వ్యక్తిగత ఇళ్ల నిర్మాణాలకు నెలకు దాదాపు 20 వేల టన్నులకు పైగా ఇసుకను గృహ నిర్మాణ శాఖ సరఫరా చేస్తోంది. ఇంకా కొన్ని ఇళ్ల నిర్మాణాలు కోర్టు కేసుల వలన నిలిచిపోయాయి. అవి కూడా ప్రారంభమైతే మరో 5 నుంచి 10 వేల టన్నుల వరకు అదనంగా ఇసుక వాడకం పెరుగుతుంది. జిల్లాలో మొత్తం 570 జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటిలో మొత్తం ప్రస్తుతం 50,813 గృహాల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. నాణ్యమైన ఇసుకతో ఇళ్లు నిర్మించుకున్నాం గ్రామంలో జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నాం. గృహ నిర్మాణ శాఖ అధికారులు నెల్లూరు జిల్లా, సంగం ప్రాంతంలోని పెన్నా నది నుంచి తీసుకొచ్చిన ఇసుకను ఉచితంగా అందజేశారు. హాండ్లింగ్ చార్జీల కింద టన్నుకు రూ.175 చొప్పున మాత్రమే ఇచ్చిన ఇసుక తెచ్చుకున్నాం. నాణ్యమైన ఇసుక కావటంతో నిర్మాణం కూడా బాగా వచ్చింది. పటిష్టంగా నిర్మించుకున్నాం. జగనన్న కాలనీ వల్ల సొంతింటి కల నెరవేరింది. అందుకే ఇంటిపై జగనన్న ఫొటోను కూడా ఏర్పాటు చేసుకొని శాశ్వతంగా మా కుటుంబంలో జగనన్నను ఒక సభ్యునిగా చేసుకున్నాం. – ధారా నందిని భవానీ, రామాయణ కండ్రిక, పొదిలి ఇబ్బందులు లేకుండా ఇసుక సరఫరా... ప్రభుత్వం అందిస్తున్న ఇసుకను లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా సరఫరా చేస్తున్నాం. జగనన్న కాలనీలతో పాటు ప్రభుత్వం మంజూరు చేసిన వ్యక్తిగత ఇళ్లకు కూడా అందిస్తున్నాం. ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు సరఫరా చేస్తున్నాం. ప్రతి నెలా 20 నుంచి 25 వేల టన్నుల వరకు సరఫరా చేస్తున్నాం. జగనన్న కాలనీలకు అందుబాటులోనే ఇసుక సరఫరా చేస్తున్నాం. – ఈమని పేరయ్య, పీడీ, జిల్లా గృహ నిర్మాణ శాఖ -
ముందస్తు చర్యలు..మస్తుగా ఇసుక నిల్వలు
సాక్షి ప్రతినిధి, కడప : భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రెండు జిల్లాల్లోని నదులు పొంగి పొర్లాయి. దీంతో ఇసుక రీచ్లు దాదాపు మూతపడ్డాయి. అయితే ప్రభుత్వం ముందు జాగ్రత్తగా డిపోల్లో లక్షలాది మెట్రిక్ టన్నుల ఇసుకను సిద్ధంగా ఉంచడంతో ప్రస్తుతానికి కొరత లేకుండా పోయింది. అవసరమైన వినియోగదారులకు ఇసుక డిపోల నుంచే తరలిస్తున్నారు. వరద ప్రభావం తగ్గుముఖం పట్టిన వెంటనే అన్ని రీచ్ల ద్వారా 12,98,835 క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులోకి రానుంది. ∙ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు వైఎస్సార్ జిల్లాలో పెన్నా, చిత్రావతి, కుందూ, పాపాఘ్ని నదులు పొంగి ప్రవహించాయి. వీటి పరిధిలో జిల్లాలో 18 ఇసుక రీచ్లు ఉండగా, వరద ప్రభావంతో ప్రస్తుతం 15 మూతపడ్డాయి. జిల్లాలోని వెంకాయ కాలువ, ఏటూరు, గడ్డంవారిపల్లె రీచ్ల నుంచి మాత్రమే ఇసుక అందుబాటులో ఉంది. మొత్తం 18 రీచ్ల పరిధిలో 88.722 హెక్టార్ల పరిధిలో 8,43,765 క్యూబిక్ మీటర్ల ఇసుక ఉండేది. అయితే ఈ రీచ్లు మూతపడడంతో ప్రస్తుతం అందుబాటులో లేకుండా పోయింది. ప్రభుత్వం ముందస్తు చర్యగా జిల్లాలోని బద్వేలు, చిన్నచౌకు, పోరుమామిళ్ల, మైదుకూరు, పగడాలపల్లె, కమలాపురం, నందిపల్లె, పులివెందుల, కె.వెంకటాపురం, పి.అనంతపురం, నంగనూరుపల్లె డిపోలలో 5,07,476 మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులో ఉంచింది. అన్నమయ్య జిల్లాలో చెయ్యేరు, బాహుదా, మాండవ్యలు పొంగి ప్రవహించాయి. దీంతో ఆ జిల్లా పరిధిలోని 13 ఇసుక రీచ్ల్లో 11 మూతపడ్డాయి. కేవలం మందరం, గంగిరెడ్డిపల్లె రీచ్లు మాత్రమే పనిచేస్తున్నాయి. మొత్తం 13 రీచ్ల పరిధిలో 53.427 హెక్టార్లలోని రీచ్ల ద్వారా 4,55,070 క్యూబిక్ మీటర్ల ఇసుక ఉండేది. అయితే రీచ్లు మూతపడడంతో ప్రస్తుతం అక్కడి నుంచి ఇసుక తరలించడం నిలిచిపోయింది.జిల్లాలోని మంగంపేట, వెంకటరాజుపేట, రాయచోటి, మందపల్లె, టంగుటూరు, పీలేరు ఇసుక డిపోల పరిధిలో 1,77,395 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. నదుల్లో నీరు తగ్గాక రీచ్లను పునరుద్ధరిస్తాం వర్షాల నేపథ్యంలో రెండు జిల్లాల్లోని నదుల్లో నీరు పారుతుండడంతో 90 శాతానికి పైగా ఇసుక రీచ్లు మూతపడ్డాయి. అయితే వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల పరిధిలోని 19 ఇసుక డిపోల పరిధిలో ప్రస్తుతం 6,84,873 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇసుక అందుబాటులో లేదన్న ఫిర్యాదులు మాకు లేవు. నదుల్లో నీరు తగ్గిన వెంటనే రీచ్లను పునరుద్ధరిస్తాం. – పి.వెంకటేశ్వరరెడ్డి, డిప్యూటీ డైరెక్టర్, భూగర్భగనులశాఖ, కడప రెండు జిల్లాల పరిధిలో ప్రస్తుతం 19 ఇసుక డిపోల్లో 6,84,873 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. దీంతో అవసరమైన వినియోగదారులకు డిపోల నుంచి ప్రభుత్వం ఇసుకను తరలిస్తోంది. వరద ప్రవాహం తగ్గిన వెంటనే రెండు జిల్లాల్లోని 31 రీచ్ల పరిధిలో 142.149 హెక్టార్లలో 12,98,835 క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులోకి రానుంది. -
రంగు మారిన విశాఖ సాగర తీరం.. ఎందుకిలా?
విశాఖ సాగరతీరం అంటే బంగారు వర్ణంతో కనిపించే ఇసుక తిన్నెలు.. సముద్రపు నీటితో శుద్ధి చేశారా? అన్నంతగా స్వచ్ఛతను తలపించే ఒంపులు తిరిగిన చిన్న చిన్న ఇసుక దిబ్బలు.. వాటిని ఎంత సేపు చూసినా, వాటిపై మరెంత సేపు సేద తీరినా తనివి తీరని అనుభూతిని పొందుతారు పర్యాటక ప్రియులు. అలాంటి విశాఖ బీచ్ ఇటీవల తన సహజ సౌందర్యానికి భిన్నంగా కనిపిస్తోంది. సుందర సాగరతీరం ఒంటికి మసి పూసుకున్నట్టు అగుపిస్తోంది. ఔరా! ఇది మన విశాఖ బీచేనా? అనిపించేలా రూపు మారిపోయింది. – సాక్షి, విశాఖపట్నం సాక్షి, విశాఖపట్నం: కోస్టల్ బ్యాటరీ నుంచి వుడా పార్క్ వరకు బీచ్ ఎక్కడ చూసినా నల్లని ఇసుకను పరుచుకున్నట్టు దర్శనమిస్తోంది. ఇది సాగరతీరానికి వచ్చే సందర్శకులు, పర్యాటక ప్రేమికులకు తీవ్ర నిరాశను మిగిలిస్తోంది. విశాఖ బీచ్ను చూడడానికి ఎక్కడెక్కడ నుంచో నిత్యం పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇసుక తిన్నెలపై కూర్చుని తీరం వైపు నురుగలు కక్కుతూ వచ్చే కెరటాలను చూస్తూ మైమరచి పోతుంటారు. కొద్ది రోజుల నుంచి ఆ పరిస్థితి లేదు. ఇసుకంతా మురుగు పులుముకున్నట్టు ఉండడంతో బీచ్లో కూర్చుని అలలను ఆస్వాదించడానికి వీలు పడడం లేదు. దీంతో బీచ్కు వచ్చే సందర్శకుల్లో పలువురు మునుపటిలా కూర్చోకుండా నిలబడే ఉంటున్నారు. బీచ్ రోడ్డుకు అనుకుని ఉన్న గోడపై కొందరు, తీరంలో కొబ్బరిచెట్ల మధ్య ఏర్పాటు చేసిన సిమెంటు బల్లలపై మరికొందరు సేద తీరుతున్నారు. అలా అలలకు అల్లంత దూరం నుంచే బీచ్ అందాలను అరకొరగా ఆస్వాదిస్తున్నారు. దీంతో నిత్యం సందర్శకుల రద్దీతో కళకళలాడుతూ కనిపించే సాగరతీరం కళా విహీనంగా కనిపిస్తోంది. ఎందుకిలా? కొద్ది రోజుల క్రితం నుంచి సాగరతీరం కోతకు గురవుతోంది. ఈ పరిణామమే సందర్శకులకు ఇబ్బందికరంగా ఉంది. అది చాలదన్నట్టు ఇప్పుడు ఇసుక నలుపు రంగును పులుముకుంటోం ది. ఈ పరిస్థితికి సముద్రంలోకి నగరం నుంచి మురుగు నీరు వదిలిపెట్టడం, పోర్టులో బొగ్గు లోడింగ్, అన్లోడింగ్తో పాటు ఇనుప రజను వంటివి కారణమని సముద్ర అధ్యయన నిపుణులు చెబుతున్నారు. సంవత్సరంలో ఏడెనిమిది నెలలు నగరంపైకి నైరుతి గాలులే వీస్తాయి. విశాఖ నగరానికి నైరుతి దిశలోనే అనేక పరిశ్రమలున్నాయి. వాటి నుంచి విడుదలయ్యే కాలుష్య వ్యర్థాలు కూడా సముద్రంలోనే కలుస్తున్నాయి. ఇవన్నీ సముద్రం అడుగున ఉంటాయి. అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపాన్లు ఏర్పడినప్పుడు కడలి కల్లోలంగా మారుతుంది. దీంతో దిగువన ఉన్న ఈ వ్యర్థాలు పైకి, కిందకు కలుషితమవుతాయి. కెరటాల ఉధృతితో అవి ఇసుకతో సహా తీరానికి కొట్టుకు వస్తాయి. ఫలితంగా అప్పటివరకు తీరంలో గోధుమ, బంగారు వర్ణంలో ఉన్న ఇసుక నల్లగా మసి పూసినట్టుగా మారిపోతుందని ఆంధ్ర విశ్వవిద్యాలయం జియాలజీ విభాగం ప్రొఫెసర్ ఈడ్పుగంటి ధనుంజయరావు ‘సాక్షి’కి చెప్పారు. ప్రస్తుతం బీచ్లో ఇసుక నలుపు రంగులోకి మారిపోవడానికి ఇదే కారణమని తెలిపారు. కొద్దిరోజుల్లో మళ్లీ ఈ నల్లని ఇసుక కెరటాల ఉధృతికి వెనక్కి సముద్రంలోకి వెళ్లిపోతుందని, అనంతరం పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని వివరించారు. -
కళ్ళు ఉండి చూడలేని కబోది రాతలు
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
బుల్లితెర నటి కేసులో ట్విస్ట్.. ప్రియుడు సూసైడ్!
అతనితో డేటింగ్.. తొలిసారి నోరువిప్పిన ముద్దుగుమ్మ!
త్వరలో లాంచ్ కానున్న కొత్త బెంట్లీ కారు ఇదే.. ఫోటోలు
AP: ఎన్నికల హింసాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటు
ఐపీఎల్లో విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే!
Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు?
స్వాతి మలివాల్పై దాడి.. ఆమ్ ఆద్మీ సంచలన ఆరోపణలు
దేవర సాంగ్ ప్రోమో.. ఆ రోజు ఇక గూస్బంప్సే!
Sangeetha Sringeri: పునీత్ రాజ్కుమార్ సమాధి వద్ద నటి బర్త్డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ప్రతి విద్యార్ధి చదవాల్సిన బుక్ ఇది.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
తప్పక చదవండి
- Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు?
- కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!
- కేన్స్లో మెరిసిన శోభితా ధూళిపాళ..ఆ డ్రస్ ధర ఏకంగా..!
- పీఎం కుసుమ్ స్కీమ్.. రైతుకు డబుల్ ఆదాయం - ఎలా అంటే?
- అధికారులను మార్చిన చోటే అల్లర్లు: మంత్రి బొత్స
- ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
- విద్యుత్ షాక్తో ఆగిన బాలుడి గుండె.. సీపీఆర్ చేసి ప్రాణం పోసిన డాక్టర్
- T20 WC: ఇంగ్లండ్, పాక్ కాదు! టైటిల్ రేసులో ఉన్న జట్లు ఇవే: జై షా
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- ట్విటర్ నుంచి నాగబాబు ఔట్.. వారిద్దరూ వార్నింగ్ ఇచ్చారా..?
Advertisement