-
నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి లు చెప్పేవి అన్ని అబద్ధాలే..
-
అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు
-
ఏపీ రాజకీయాలపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
ఒళ్ళు దగ్గర పెట్టుకో చెల్లెమ్మ.. షర్మిల, సునీతలకు స్ట్రాంగ్ వార్నింగ్
-
కూటమి బండారం మేనిఫెస్టో తో బట్టబయలు
-
ఫేక్ వీడియో పై అమిత్ షా సంచలన కామెంట్స్
-
PM Narendra Modi: చచ్చినా వదలరట!
అంబికాపూర్/సాగర్: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారసత్వ పన్నుతో ప్రజల నడ్డి విరవడం తథ్యమని ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ఆరోపణలు చేశారు. బతికున్నంత కాలం ప్రజలను పన్నులతో పీడించడమే గాక మరణించిన తర్వాత కూడా వదలకుండా లూటీ చేసే కుట్రలకు పదును పెడుతోందని మండిపడ్డారు.కాంగ్రెస్ నేత సామ్ పిట్రోడా తాజాగా సంపద పంపిణీ గురించి మాట్లాడుతూ అమెరికాలో అమల్లో ఉన్న వారసత్వ పన్ను గురించి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శమన్నారు. ‘‘మరణించిన వారి ఆస్తులపైనా కాంగ్రెస్ పంజా (హస్తం గుర్తునుద్దేశించి) విసరనుంది. వారసత్వంగా పిల్లలకు దక్కకుండా లాగేసుకోనుంది. ‘జిందగీ కే సాథ్ భీ... జిందగీ కే బాద్ భీ... (బతికున్నప్పుడు కూడా, చనిపోయాక కూడా)’.ఇదే కాంగ్రెస్ నయా దోపిడీ మంత్రం!’’ అని ఎల్ఐసీ పాపులర్ స్లోగన్ అన్వయిస్తూ ప్రధాని దుయ్యబట్టారు. ‘‘సమాజంలో సంపద పునఃపంపిణీ అనే ముసుగులో ప్రజల స్థిర చరాస్తులను జీవితాంతమూ, మరణించిన తర్వాతా అడ్డంగా లూటీ చేయడమే కాంగ్రెస్ విధానం. ఆ క్రమంలో చివరికి వారసత్వ ఆస్తులను కూడా వదలిపెట్టడం లేదు. కాంగ్రెస్ తాలూకు ఈ రహస్య అజెండాను, పిట్రోడా వ్యాఖ్యలు బయటపెట్టాయి.మన సామాజిక, కుటుంబ విలువలకు కాంగ్రెస్ పూర్తిగా దూరమైపోయింది. అందుకే ప్రజల జీవితాంతం పొదుపు చేసి తమ వారసులకు అందజేయాలనుకునే సొమ్మును కూడా చట్టబద్ధంగా లాగేసుకోవాలని కుట్ర చేస్తోంది. ఆ పార్టీ చేస్తున్న ఇలాంటి ప్రమాదకర ఆలోచనలన్నీ ఎన్నికల వేళ ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి’’ అని బుధవారం ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్ ఎన్నికల ర్యాలీలో మోదీ తూర్పారబట్టారు. మధ్యప్రదేశ్లోని సాగర్, హర్దా ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు. ఆయన ఏం మాట్లాడారంటే...చట్టబద్ధంగా దోచేస్తారు ‘‘మీ (ప్రజల) ఆస్తులను, మీ పిల్లల హక్కులను కాజేయడానికి కాంగ్రెస్ పథకం వేసింది. జనం ఆస్తులను, పిల్లల కోసం జీవితాంతం కష్టపడి పొదుపు చేసుకున్న మొత్తాలను చట్టబద్ధంగా దోచేయజూస్తోంది. మధ్యతరగతి ప్రజలపై, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకొనేవారిపై మరింత పన్ను విధించాలని కాంగ్రెస్ యువరాజు (రాహుల్) సలహాదారు (పిట్రోడా) అంటున్నారు.గతంలో యువరాజు తండ్రికి కూడా ఆయనే సలహాదారు. కాంగ్రెస్ అధికారంలోకొస్తే తల్లిదండ్రుల నుంచి సంతానానికి వారసత్వంగా వచ్చే ఆస్తులపై కచ్చితంగా పన్ను విధిస్తుంది. అప్పుడిక తల్లిదండ్రుల ఆస్తులు పిల్లలకు బదిలీ కావాలంటే పన్ను కట్టాల్సిందే. బతికున్నంత కాలమూ మీనుంచి వీలైనంతగా పన్నులు పిండుతారు. మరణించాక వారసత్వ పన్ను విధిస్తారు!ఓబీసీలకు కాంగ్రెసే అతి పెద్ద శత్రువు‘‘మతపరమైన రిజర్వేషన్ల నుంచి వెనక్కి తగ్గే ఉద్దేశం కాంగ్రెస్కు లేదు. అధికారంలోకి వస్తే ఎస్టీ, ఎస్టీల రిజర్వేషన్లను తగ్గించి, స్వీయ రాజకీయ లబ్ధి కోసం మరో వర్గానికి వర్తింపజేస్తుంది. ఇందులో సందేహం లేదు. కర్ణాటకలో గతంలో కాంగ్రెస్ హయాంలో రాజ్యాంగానికి, అంబేడ్కర్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మతాధారంగా రిజర్వేషన్లు అమలు చేశారు.అక్కడ బీజేపీ అధికారంలోకి అవి రద్దయ్యాయి. కొన్ని నెలల క్రితం కర్ణాటకలో మళ్లీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పెద్ద పాపం చేసింది. ముస్లింల్లోని అన్ని వర్గాలను ఓబీసీ కేటగిరీలో చేర్చి దొడ్డిదారిన రిజర్వేషన్లు ఇచ్చేసింది. దీనివల్ల ఓబీసీ కేటగిరీలోని ఇతర కులాలకు అన్యాయం జరుగుతోంది. కాంగ్రెస్ ఆడుతున్న ఈ ప్రమాదకరమైన ఆటతో భవిష్యత్తు తరాలు నాశనమవుతాయి. దేశమంతటా కర్ణాటక మోడల్ అమలు చేయడానికి కుట్ర పన్నింది’’ రాజ్యాంగమంటే కాంగ్రెస్కు లెక్కలేదు ‘‘ఎన్నికల్లో నెగ్గడానికి ఓటు బ్యాంకు రాజకీయాలనే నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ మతాధారితంగా రిజర్వేషన్లు అమలు చేయాలని భావిస్తోంది. దేశంలో కాంగ్రెస్ నేతృత్వంలో బలహీన ప్రభుత్వం అధికారంలోకి రావాలని కొన్ని శక్తులు కోరుకుంటున్నాయి. బలమైన ప్రభుత్వముండి దేశం స్వావలంబన సాధిస్తే తమ దుకాణం మూత పడుతుందని ఆ శక్తులు భయపడుతున్నాయి. కాంగ్రెస్ది ముమ్మాటికీ ముస్లిం లీగ్ ఆలోచనా ధోరణే. ఆ పార్టీ మేనిఫెస్టో ముస్లింలీగ్ సిద్ధాంతాలకు నకలు.మతాధారంగా రిజర్వేషన్లు ఉండొద్దని రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు అంబేడ్కర్ భావించారు. దళితులకు, గిరిజనులకే రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ రాజ్యాంగాన్ని, అంబేడ్కర్ ఆశయాలను కాంగ్రెస్ లెక్కచేయడం లేదు. కొన్నేళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మతాధారంగా రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ ప్రయతి్నంచింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లలో కోత విధించి, మతం ఆధారంగా ఓ వర్గానికి 15 శాతం రిజర్వేషన్లు ఇస్తామని గట్టిగా వాదించింది. 2009, 2014 మేనిఫెస్టోల్లో ఇదే అంశాన్ని చేర్చింది’’‘ఇండియా’ వస్తే ఏడాదికో ప్రధానికేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వం కొలువుతీరితే ప్రతి ఏడాదికో ప్రధాని మారతారని మోదీ ఎద్దేవా చేశారు. నాయకత్వ సమస్యను పరిష్కరించుకోవడానికి ఇండియా కూటమి ఈ ఫార్ములాను అమలు చేస్తుందన్నారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాలో ఏడాదికో ప్రధాని మారితే ప్రపంచం దృష్టిలో మనం నవ్వులపాలవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పాలన వస్తే ప్రజలకు ఒకటి కంటే ఎక్కువ కార్లు, మోటార్ సైకిళ్లు, ఇళ్లుంటే ప్రభుత్వపరమవుతాయన్నారు. -
రామోజీ రావు మార్గదర్శి స్కామ్ పై ఉండవల్లి సంచలన విషయాలు
-
సుజనా చౌదరి ఆస్తి విలువ 34 లక్షలు...కొమ్మినేని సంచలన విషయాలు
-
వైఎస్ విమలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
పింఛన్ల లబ్ధిదారులపై అక్కసు వెళ్లగక్కుతున్న టీడీపీ నేతలు
-
ఇంత కులపిచ్చా ?
-
పట్నం మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన కామెంట్స్..
-
ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సాయం బాపురావు సంచలన వ్యాఖ్యలు
-
పవన్ కు పంచ్
-
జనం గుండెల్లో జగన్..కాళ్లు పట్టుకునే స్థితిలో చంద్రబాబు
-
నమ్మించి మోసం చేశారు..నటి సంచలనం
-
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ సంచలన వ్యాఖ్యలు
-
మాజీ మంత్రి నారాయణ ఉమనైజర్.. పొంగూరు ప్రియ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: నారాయణ ఒక ఉమనైజర్.. అతడిని ఎవరు నమ్మొద్దంటూ మాజీ మంత్రి నారాయణపై ఆయన మరదలు పొంగూరు ప్రియ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. క్యాన్సర్తో బాధపడుతున్నా.. నేను చాలా ఆవేదనతో ఈ వీడియో పెడుతున్నాననంటూ సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేశారు. సొంత కుటుంబ సభ్యులనే వేధిస్తున్న మాజీ మంత్రి నారాయణను నెల్లూరు ప్రజలు నమ్మి దయచేసి మోసపోవద్దు. ఇంట్లో ఆడవాళ్లని వేధిస్తూ టార్చర్కు గురిచేసే నారాయణ ప్రజలకు ఏం చేస్తాడంటూ ప్రియ ప్రశ్నించారు. పెళ్లయిన రెండో రోజు నుంచే బావ నారాయణ లైంగిక వేధింపులు మొదలుపెట్టాడని.. ఆయనకు లొంగకపోవడంతో 29 ఏళ్లుగా ఆయన పెట్టే బాధలు భరిస్తున్నానని.. ఆయన స్త్రీలోలుడు. నారాయణ విద్యా సంస్థల్లో పనిచేసే కొందరు మహిళలు ఆయన దగ్గరకు వెళ్లాల్సిందే. సోదరి వరుసైన వారు స్నానం చేస్తున్నప్పుడు బాత్రూమ్లోకి తొంగి చూసేవాడు. ఈ విషయం మొదట్లో వాళ్ల వాళ్లే చెప్పారు. తాను లొంగకపోవడంతో వేధింపులు ప్రారంభించాడని గతంలో కూడా ఆమె ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఆమె రాయదుర్గం పోలీస్స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసింది. ఇదీ చదవండి: ‘గ్లాసు’కు రేటు కట్టిన మాజీ మంత్రి నారాయణ -
చప్పట్లు కాదు..చెప్పులతో కొట్టాలి..చంద్రబాబుపై మంత్రి కాకాని ఫైర్
-
జూ.ఎన్టీఆర్ వస్తే లోకేష్ పని అయిపోయినట్టే..!
-
కేసీఆర్ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
-
అఖిలప్రియపై ఏవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, నంద్యాల జిల్లా: రాజకీయంగా ఎంతో ప్రతిష్ట కలిగిన ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీ వర్గపోరు తారాస్థాయికి చేరింది. అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య వర్గపోరు ముదిరింది. ఈ క్రమంలో అఖిలప్రియపై ఏవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఆదేశిస్తే ఆళ్లగడ్డ నుంచి పోటీకి సిద్ధమని, అఖిలప్రియకు సీటు ఇస్తే సహకరించే ప్రసేక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ నేతలు భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బా రెడ్డి కుటుంబాల మధ్య వివాదాలు కొనసాగుతోన్న విషయం విదితమే. మరోవైపు, అవకాశవాద రాజకీయాలతో గెలుపొందాలని చూస్తున్న టీడీపీ- జనసేన.. వచ్చే ఎన్నికల్లో పొత్తులతోనే ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. టీడీపీతో జట్టు కట్టడంపై జనసేన నేతలు, శ్రేణులు ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు పవన్పై పెదవి విరుస్తున్నారు. ఇటు బాబుకు సైతం వర్గపోరు, పొత్తుల పొట్లాటతో మళ్లీ పాత కథే పునరావృతమవుతందనే బెంగ పట్టుకుంది. దీంతో ఇరుపార్టీల నేతలు ఎడమొహం, పెడమొహం పెడుతున్నారు. తాజాగా బాబు చేపట్టిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభ సాక్షిగా టీడీపీ, జనసేన వర్గ విభేదాలు బయటపడ్డాయి. మంగళవారం జరిగిన ఆళ్లగడ్డ చంద్రబాబు సభకు ముందే టీడీపీ, జనసేన నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. చంద్రబాబు సభకు రాకూడదని ఏవీ సుబ్బారెడ్డికి మాజీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: లోకేష్, చంద్రబాబుపై కేశినేని నాని ఆసక్తికర కామెంట్స్ -
కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు
ఎన్టీఆర్, సాక్షి: పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పార్టీ అధినేత చంద్రబాబు ముగ్గురు పెద్ద మనుషులతో చెప్పించారు. అలాగని.. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనొద్దని చెప్పే అధికారం ఎవరికీ లేదు అని టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు. పార్టీ అధిష్టానం తనను దూరం పెడుతున్న పరిణామాలపై శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ►తిరువూరు సభకు నన్ను రావొద్దన్నారు.. నేను వెళ్లడం లేదు. నా మైండ్ సెట్ అభిమానులందరికీ తెలుసు. అభిమానుల మైండ్ సెట్ నాకు తెలుసు. మా వాళ్లందరికీ క్లారిటీ ఉంది నేను టీడీపీ పార్టీకి ఓనర్ ను కాదు. చెప్పాల్సిన టైమ్ వచ్చినప్పుడు అన్నీ చెబుతా. తినబోతూ రుచులెందుకు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటా. కాలమే అన్నింటిని నిర్ణయిస్తుంది.. అని అన్నారాయన. ►ఎవరు గెలుస్తారో.. ఎవరు ఓడాతారో ప్రజలే నిర్ణయిస్తారు. నన్ను నమ్ముకుని కొన్ని వేల మంది ఉన్నారు. అందరి మనోభావాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటా. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పార్టీ అధినేత ముగ్గురు పెద్ద మనుషులతో చెప్పించారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు సరే. కానీ, ఎంపీగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనొద్దని చెప్పే అధికారం ఎవరికీ లేదు. ►నేను ఎన్ని అవకాశాలు వచ్చినా పార్టీ కోసమే నిలబడ్డా. కానీ, ఎప్పుడూ పార్టీ మారాలనుకోలేదు. చంద్రబాబుకి నేను వెన్నుపోటు పొడవలేదు. పొడిచి ఉంటే ఇంకా మంచి పదవిలో ఉండేవాడినేమో. పార్టీ పంపించిన ముగ్గురు పెద్దమనుషులు చెప్పిందే నేను పోస్టులో పెట్టా. నాదగ్గరికి ఆ ముగ్గురు వచ్చిపుడు మరో ముగ్గురు సాక్షులు కూడా వచ్చారు అని కేశినేని నాని వివరించారు. ►నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసైనా గెలుస్తా. ఆ విషయంలో సందేహం లేదు. రాబోయే ఎన్నికల్లో నేను విజయవాడ నుంచే పోటీచేస్తా. కచ్చితంగా మూడవ సారి గెలుస్తా. వసంత కృష్ణప్రసాద్ నేను మంచి స్నేహితులం. ఆయన పార్టీకి ఆయన కష్టపడ్డారు.. నా పార్టీకి నేను కష్టపడ్డా. అలాగని కొండపల్లి ఎన్నికల్లో మేం కలిసి పనిచేయలేదు కదా అని కేశినేని నాని అన్నారు. -
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఊళ్లకు పోటెత్తిన ఓటర్లు!
Lok Sabha Election 2024: రాయ్బరేలీ కోసం మేము.. అదానీ, అంబానీ కోసం మోదీ
ఇదేందయ్యా వెలగపూడి?
5 వేల మందితో బందోబస్తు
ఎన్నికల సామగ్రి తరలింపు
ప్రయాణికుల కోసం ఎన్నికల స్పెషల్ రైలు
పశ్చిమలో ‘గణ’ంగా ప్రలోభాలు
ఓటేసే ముందు.. ఒక్క క్షణం ఇంటి నుంచి బయలుదేరినప్పుడు నీ పరిసరాలు చూడు
ఏజెంట్లకు సూచనలివే..
ప్రత్యేక ఆకర్షణగా పింక్ పోలింగ్ స్టేషన్
తప్పక చదవండి
- నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత
- పల్నాట పచ్చ మూక బీభత్సకాండ
- వెచ్చని హృదయ రాగ సందేశం
- Lok Sabha Election 2024: రాయ్బరేలీ కోసం మేము.. అదానీ, అంబానీ కోసం మోదీ
- Lok Sabha Election 2024: నాలుగో దశలో 67.70% పోలింగ్
- Lok Sabha Election 2024: ఓటేస్తే ఉచిత బైక్ రైడ్
- Lok Sabha Election 2024: ఇండోర్లో ఉచిత పోహా, జిలేబీ..
- వందొస్తే టాప్ కాలేజీల్లో సీఎస్సీ!
- చురుగ్గా రబీ ధాన్యం సేకరణ
- Lok Sabha Election 2024: ఐదో విడతలోనూ మహిళలు అంతంతే
Advertisement