-
అవుటా? నాటౌటా?.. సంజూకు షాకిచ్చిన బీసీసీఐ
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్కు ఊహించని షాక్ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ సందర్భంగా సంజూ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి.. అతడికి జరిమానా విధించింది. అసలేం జరిగిందంటే.. అరుణ్ జైట్లీ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్ ఢిల్లీతో మంగళవారం తలపడింది. టాస్ గెలిచిన రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్.. పంత్ సేనను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. దంచికొట్టిన ఢిల్లీ ఓపెనర్లుఓపెనర్లు జేక్ ఫ్రేజర్-మెగర్క్(20 బంతుల్లో 50), అభిషేక్ పోరెల్(36 బంతుల్లో 65), ఆరో నంబర్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ (20 బంతుల్లో 41) అద్భుత ఇన్నింగ్స్ ఆడారు.ఫలితంగా ఢిల్లీ జట్టు..నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 221 పరుగులు సాధించింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ఆదిలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోవడంతో వన్డౌన్ బ్యాటర్ సంజూ శాంసన్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు.అవుటా? నాటౌటా?మొత్తంగా 46 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 86 పరుగులు చేసి జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో సంజూ అవుటైన తీరు వివాదానికి దారితీసింది.రాజస్తాన్ ఇన్నింగ్స్లో పదహారో ఓవర్లో ఢిల్లీ పేసర్ ముకేశ్ కమార్ బౌలింగ్కు వచ్చాడు. అతడి బౌలింగ్లో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన సంజూ.. బంతిని గాల్లోకి లేపగా బౌండరీ లైన్ వద్ద షాయీ హోప్ క్యాచ్ పట్టగా ఫీల్డ్ అంపైర్ అవుటిచ్చాడు.చిర్రెత్తిపోయిన సంజూ.. అంపైర్తో వాగ్వాదంఅయితే, ఆ సమయంలో షాయీ హోప్ బౌండరీ లైన్ తాకినట్టుగా కనిపించింది. రివ్యూ వెళ్లగా.. థర్డ్ అంపైర్ కూడా సంజూ అవుటైనట్లు ప్రకటించాడు. అదే సమయంలో ఢిల్లీ డగౌట్ నుంచి ఆ జట్టు యజమాని పార్థ్ జిందాల్ సైతం అవుట్ అంటూ అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో చిర్రెత్తిపోయిన సంజూ శాంసన్ అంపైర్లతో వాదనకు దిగాడు. ఈ నేపథ్యంలో క్రమశిక్షణా చర్యల కింద బీసీసీఐ అతడి మ్యాచ్ ఫీజులో 30 శాతం మేర కోత విధించింది. ఇక ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్తాన్ రాయల్స్ మీద 20 పరుగుల తేడాతో గెలిచింది. ప్లే ఆఫ్స్ రేసులో తామూ ఉన్నామంటూ దూసుకువచ్చింది.చదవండి: యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే: ప్రీతి జింటాGame of margins! 😮A splendid catch that raises the 𝙃𝙊𝙋𝙀 for the Delhi Capitals 🙌Sanju Samson departs after an excellent 86(46) 👏Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #DCvRR pic.twitter.com/rhLhfBmyEZ— IndianPremierLeague (@IPL) May 7, 2024 -
ఆకాశమే హద్దుగా అరంగేట్ర బౌలర్.. కేవలం 17 పరుగులిచ్చి..
వెస్టిండీస్తో తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తద్వారా సొంతగడ్డపై మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మెల్బోర్న్ వేదికగా అరంగేట్ర బౌలర్ జేవియర్ బార్ట్లెట్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆసీస్ గెలుపులో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా తరఫున ఇద్దరు యువ పేసర్లు లాన్స్ మోరిస్, జేవియర్ బార్ట్లెట్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. ఇక టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆతిథ్య జట్టు ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్కు జేవియర్ ఆది నుంచే చుక్కలు చూపించాడు. తొలుత ఓపెనర్లు జస్టిన్ గ్రీవ్స్(1), అలిక్ అథనాజే(5)ల పనిపట్టిన ఈ రైటార్మ్ పేసర్.. కెప్టెన్ షాయీ హోప్(12) రూపంలో మరో కీలక వికెట్ దక్కించుకున్నాడు. జేవియర్ దెబ్బకు బ్యాటింగ్ ఆర్డర్ కకావిలమైన వేళ వన్డౌన్ బ్యాటర్ కేసీ కార్టీ 88 పరుగులతో సత్తా చాటాడు. అతడికి తోడుగా రోస్టర్ చేస్ కూడా అర్ధ శతకం(59)తో మెరిశాడు. మిగతా వాళ్లలో ఒక్కరుకూడా చెప్పుకోగదగ్గ స్కోరు చేయలేదు. జేవియర్ అత్యధికంగా నాలుగు వికెట్లు దక్కించుకోగా.. సీన్ అబాట్, కామెరాన్గ్రీన్ రెండేసి వికెట్లు కూల్చారు. ఆడం జంపాకు ఒక వికెట్ దక్కగా.. అబాట్ కేసీ కార్టీని రనౌట్లో భాగమయ్యాడు. ఈ క్రమంలో 48.5 ఓవర్లలో 231 పరుగులు చేసి విండీస్ ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాకు కరేబియన్ పేసర్ మాథ్యూ ఫోర్డ్ ఆదిలోనే షాకిచ్చాడు. అతడి బౌలింగ్లో ఓపెనర్ ట్రవిస్ హెడ్ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వికెట్ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్ జోష్ ఇంగ్లిస్ మాత్రం తగ్గేదేలే అన్నట్లు బ్యాట్ ఝులిపించాడు. 43 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఏకంగా 65 పరుగులు రాబట్టాడు. ఇక వన్డౌన్ బ్యాటర్ కామెరాన్ గ్రీన్ 77, కెప్టెన్ స్టీవ్ స్మిత్ 79 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. విండీస్ విధించిన 232 పరుగుల లక్ష్యాన్ని 38.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి ఛేదించింది ఆస్ట్రేలియా. ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపు జెండా ఎగురవేసింది. ఈ మ్యాచ్లో జేవియర్ బార్ట్లెట్ తొమ్మిది ఓవర్లు బౌల్ చేసి కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 4న సిడ్నీలో రెండో వన్డే జరుగనుంది. -
ఇంగ్లండ్ను చిత్తు చేసిన వెస్టిండీస్.. 24 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
బార్బడోస్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో 4 వికెట్ల తేడాతో వెస్టిండీస్ విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్ను 2-1తో విండీస్ కైవసం చేసుకుంది. కాగా కరేబియన్ దీవుల్లో ఇంగ్లీష్ జట్టుపై విండీస్ వన్డే సిరీస్ను సొంతం చేసుకోవడం 24 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. విండీస్ చివరగా తమ స్వదేశంలో 1998లో ఇంగ్లండ్పై వన్డే సిరీస్ విజయం సాధించింది. తాజా విజయంతో 24 ఏళ్ల నిరీక్షణకు వెస్టిండీస్ తెరదించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వర్షం కారణంగా మూడో వన్డేను 40 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ డకెట్(71) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. విండీస్ బౌలర్లలో మాథ్యూ ఫోర్డే, జోషఫ్య తలా 3 వికెట్లు పడగొట్టగా.. షెపెర్డ్ రెండు వికెట్లు సాధించాడు. అనంతరం విండీస్ టార్గెట్ను డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 188గా నిర్ణయించారు. 188 లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 31.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కరేబియన్ బ్యాటర్లలో ఆథనాజ్(45), కార్టీ(50) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో విల్ జాక్స్ 3 వికెట్లు.. అటిక్కినిసన్ 2, ఆహ్మద్ ఒక్క వికెట్ పడగొట్టారు. సిరీస్ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన విండీస్ కెప్టెన్ షాయ్ హోప్కు మ్యాన్ ఆఫ్ది సిరీస్ అవార్డు దక్కింది. -
రాణించిన కర్రన్, బట్లర్.. విండీస్పై ప్రతీకారం తీర్చుకున్న ఇంగ్లండ్
ఆంటిగ్వా వేదికగా వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ తొలి వన్డేలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుని మూడు మ్యాచ్ల సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. ఇంగ్లండ్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 39.4 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. సామ్ కర్రన్, లివింగ్స్టోన్ చెరో 3 వికెట్లు.. అట్కిన్సన్, రెహాన్ అహ్మద్ తలో 2 వికెట్లు పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్లో కెప్టెన్ షాయ్ హోప్ (68), షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (63) అర్ధసెంచరీలతో రాణించారు. తొలి వన్డేలో మెరుపు శతకంతో విండీస్ను గెలిపించిన హోప్ ఈ మ్యాచ్లోనూ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం 203 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. విల్ జాక్స్ (73), కెప్టెన్ జోస్ బట్లర్ (58 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో 32.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. జాక్స్, బట్లర్లతో పాటు హ్యారీ బ్రూక్ (43 నాటౌట్) కూడా రాణించాడు. విండీస్ బౌలర్లలో గుడకేశ్ మోటీకి రెండు, రొమారియో షెపర్డ్, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్లకు తలో వికెట్ దక్కింది. నిర్ణయాత్మకమైన మూడో వన్డే డిసెంబర్ 9న జరుగనుంది. -
ఇంగ్లండ్పై శతక్కొట్టిన విండీస్ కెప్టెన్.. ఇదంతా ధోని వల్లే అంటూ!
West Indies vs England, 1st ODI: ఇంగ్లండ్తో తొలి వన్డేలో వెస్టిండీస్ కెప్టెన్ షాయీ హోప్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అజేయ శతకంతో అదరగొట్టి జట్టును గెలుపుతీరాలకు చేర్చాడు. ఆంటిగ్వా వేదికగా ఆదివారం జరిగిన వన్డేలో మొత్తంగా 83 బంతులు ఎదుర్కొన్న షాయీ హోప్.. 4 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 109 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. తద్వారా ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో విండీస్కు 1-0 ఆధిక్యం అందించాడు. ఈ నేపథ్యంలో విజయానంతరం తన అద్బుత ఇన్నింగ్స్ గురించి షాయీ హోప్ మాట్లాడుతూ.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి క్రెడిట్ ఇచ్చాడు. ‘‘నా సెంచరీ జట్టు విజయానికి కారణమైనందుకు సంతోషిస్తున్నా. మేము మ్యాచ్ గెలవడం ఆనందంగా ఉంది. కొన్నాళ్ల క్రితం నేను ఎంఎస్ ధోనితో మాట్లాడాను. అనుకున్న దాని కంటే ఎక్కువ సేపు క్రీజులో ఉండేందుకు ప్రయత్నించమని చెప్పాడు. కీలక సమయంలో వికెట్ కాపాడుకోవడం ముఖ్యమన్నాడు. ఈరోజు అలాగే ఆడాను. షెఫర్డ్ కూడా అద్భుత ఇన్నింగ్స్తో మెరిశాడు. విజయంతో సిరీస్ను ఆరంభించడం సంతోషం. తదుపరి మ్యాచ్లోనూ ఇదే ఫలితం పునరావృతం చేయాలని భావిస్తున్నాం’’ అని షాయి హోప్ పేర్కొన్నాడు. క్యాచ్లు డ్రాప్ చేయడం వంటి తప్పులు రిపీట్ చేయకుండా జాగ్రత్తపడతామని పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్తో తొలి వన్డేలో ఆతిథ్య వెస్టిండీస్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఇంగ్లండ్ విధించిన 326 పరుగుల లక్ష్యాన్ని 48.5 ఓవర్లలోనే ఛేదించింది. సిక్సర్తో విండీస్ విజయాన్ని ఖరారు చేసిన కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ షాయి హోప్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చదవండి: T20: గిల్కు ఇకపై గట్టి పోటీ.. వరల్డ్కప్లో ఆడాలంటే! Scenes in Antigua after the win!🇦🇬#WIvENG #WIHomeforChristmas pic.twitter.com/H68vzqu0Yo — Windies Cricket (@windiescricket) December 3, 2023 -
WI VS ENG 1st ODI: విరాట్ రికార్డును సమం చేసిన షాయ్ హోప్
విండీస్ వన్డే జట్టు సారధి షాయ్ హోప్ పరుగుల యంత్రం విరాట్ కోహ్లి, విండీస్ బ్యాటింగ్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ పేరిట ఉన్న ఓ రికార్డును సమం చేశాడు. వన్డేల్లో అత్యంత వేగంగా (114 ఇన్నింగ్స్లో) 5000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్, వివ్ రిచర్డ్స్లతో కలిసి సంయుక్తంగా మూడో స్థానాన్ని ఆక్రమించాడు. ఇంగ్లండ్తో నిన్న (డిసెంబర్ 3) జరిగిన తొలి వన్డేల్లో అజేయ మెరుపు శతకంతో (83 బంతుల్లో 109 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) విరుచుకుపడిన హోప్ ఈ ఘనతను సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా ఈ మార్కును తాకిన రికార్డు పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ పేరిట ఉంది. బాబర్ కేవలం 97 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనత సాధించాడు. బాబర్ తర్వాత ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు హషీమ్ ఆమ్లా ఉన్నాడు. ఆమ్లా 101 ఇన్నింగ్స్ల్లో ఈ ఫీట్ను సాధించాడు. ఇదిలా ఉంటే, స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో భాగంగా నిన్న జరిగిన తొలి మ్యాచ్లో వెస్టిండీస్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. షాయ్ హోప్ సూపర్ సెంచరీతో విండీస్ను గెలిపించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 325 పరుగులకు ఆలౌట్ కాగా.. విండీస్ మరో ఏడు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి, సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో బ్రూక్ (72 బంతుల్లో 71; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), సాల్ట్ (45), క్రాలే (48), సామ్ కర్రన్ (28), బ్రైడన్ కార్స్ (31 నాటౌట్) పర్వాలేదనిపించగా.. విండీస్ ఇన్నింగ్స్లో హోప్తో పాటు అలిక్ అథనాజ్ (66), రొమారియో షెపర్డ్ (49), బ్రాండన్ కింగ్ (35), షిమ్రోన్ హెట్మైర్ (32) రాణించారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే డిసెంబర్ 6న జరుగనుంది. ఇంగ్లండ్ జట్టు ఈ పర్యటనలో 3 వన్డేల సిరీస్తో పాటు 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కూడా ఆడనుంది. -
WI VS ENG 1st ODI: శతక్కొట్టిన హోప్.. విండీస్ రికార్డు విజయం
వన్డే క్రికెట్లో వెస్టిండీస్ తమ రెండో అత్యుత్తమ లక్ష్య ఛేదనను నమోదు చేసింది. 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో నిన్న (డిసెంబర్ 3) జరిగిన తొలి మ్యాచ్లో విండీస్ 326 పరుగుల భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. వన్డే క్రికెట్లో విండీస్ అత్యుత్తమ లక్ష్యఛేదన రికార్డు 328 పరుగులుగా ఉంది. 2019లో ఐర్లాండ్పై విండీస్ ఈ ఫీట్ను (47.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి) సాధించింది. 2023 వన్డే వరల్డ్కప్కు అర్హత సాధించలేకపోయిన విండీస్కు తదనంతరం దక్కిన తొలి విజయం ఇదే కావడం విశేషం. మ్యాచ్ విషయానికొస్తే.. తొలి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 325 పరుగులు చేసి ఆలౌట్ కాగా.. విండీస్ మరో ఏడు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి, సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రాణించిన బ్రూక్.. మిడిలార్డర్ ఆటగాడు హ్యారీ బ్రూక్ కీలక ఇన్నింగ్స్తో (72 బంతుల్లో 71; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో ఇంగ్లండ్ 300 పరుగుల మార్కును దాటగలిగింది. బ్రూక్తో పాటు ఫిలిప్ సాల్ట్ (45), జాక్ క్రాలే (48), సామ్ కర్రన్ (28), బ్రైడన్ కార్స్ (31 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కెప్టెన్ జోస్ బట్లర్ (3) నిరాశపరిచాడు. విండీస్ బౌలర్లలో రొమారియో షెపర్డ్, గుడకేశ్ మోటీ, ఒషేన్ థామస్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. అల్జరీ జోసఫ్, యానిక్ కారియా చెరో వికెట్ దక్కించుకున్నారు. శతక్కొట్టిన హోప్.. 326 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన విండీస్.. షాయ్ హోప్ శతక్కొట్టడంతో (83 బంతుల్లో 109 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) 48.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. హోప్తో పాటు అలిక్ అథనాజ్ (66), రొమారియో షెపర్డ్ (49) రాణించగా.. బ్రాండన్ కింగ్ (35), షిమ్రోన్ హెట్మైర్ (32) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్, రెహాన్ అహ్మద్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. బ్రైడన్ కార్స్, లివింగ్స్టోన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే డిసెంబర్ 6న జరుగనుంది. ఇంగ్లండ్ జట్లు ఈ పర్యటనలో 3 వన్డేల సిరీస్తో పాటు 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కూడా ఆడనుంది. -
వెస్టిండీస్ కెప్టెన్ విధ్వంసకర సెంచరీ.. 9 ఫోర్లు, 8 సిక్స్లతో! వీడియో వైరల్
కరేబియన్ ప్రీమియర్ లీగ్-2023లో వెస్టిండీస్ వన్డే కెప్టెన్, గయానా అమెజాన్ వారియర్స్ స్టార్ బ్యాటర్ షాయ్ హోప్ విధ్వంసం సృష్టించాడు. ఈ లీగ్లో భాగంగా సోమవారం ఉదయం బార్బడోస్ రాయల్స్, గయానా అమెజాన్ వారియర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో గయానా బ్యాటర్ షాయ్ హోప్ మెరుపు సెంచరీతో చెలరేగాడు. కేవలం 41 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను హోప్ అందుకున్నాడు. ప్రత్యర్ధి జట్టు బౌలర్లను హోప్ ఊచకోత కోశాడు. ముఖ్యంగా గయానా ఇన్నింగ్స్లో 10 ఓవర్ వేసిన రహ్కీమ్ కార్న్వాల్ బౌలింగ్లో హోప్ ఆకాశమే హద్దుగా చేలరేగిపోయాడు. ఆ ఓవర్లో 4 సిక్స్లు, రెండు ఫోర్లతో ఏకంగా 32 పరుగులు రాబట్టాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో హోప్ 9ఫోర్లు, 8 సిక్స్లతో 106 పరుగులు చేశాడు. హోప్ అద్బుత సెంచరీ ఫలితంగా గయానా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బార్బడోస్ రాయల్స్ 6 వికెట్లు కోల్పోయి 138 పరుగులకే పరిమితమైంది. దీంతో 88 పరుగుల తేడాతో గయానా అమెజాన్ వారియర్స్ ఘన విజయం సాధించింది. బార్బడోస్ రాయల్స్ బ్యాటర్లలో వికెట్ కీపర్ బ్యాటర్ క్లార్క్(54) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. గయానా బౌలర్లలో కెప్టెన్ ఇమ్రాన్ తహీర్ మూడు వికెట్లు పడగొట్టగా.. మోటీ రెండు వికెట్లు సాధించాడు. చదవండి: నాకు ఒక మెసేజ్ వచ్చింది.. అందుకే సిరాజ్కు మళ్లీ బౌలింగ్ ఇవ్వలేదు: రోహిత్ శర్మ RIDICULOUS SCENES!!! Shai Hope hits Rahkeem Cornwall for 32 in the over to reach his first CPL 💯 🙌 - A clear winner for Republic Bank Play of the Day#CPL23 #GAWvBR#CricketPlayedLouder #BiggestPartyInSport #RepublicBank pic.twitter.com/NCYi5OZerX — CPL T20 (@CPL) September 18, 2023 -
టాస్ గెలిచిన విండీస్.. ప్రయోగాలు వదలని టీమిండియా
టీమిండియా, వెస్టిండీస్ల మధ్య ట్రినిడాడ్ వేదికగా నిర్ణయాత్మక మూడో వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది. రెండో వన్డేలో ఓటమి పాలైన టీమిండియా ప్రయోగాలను కొనసాగించింది. రెండో వన్డేకు దూరంగా ఉన్న రోహిత్, కోహ్లిలకు జట్టు మేనేజ్మెంట్ ఈ మ్యాచ్కు కూడా విశ్రాంతినిచ్చింది. రోహిత్ గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో కీలకమైన మూడో వన్డేలో బరిలోకి దిగనుంది. అయితే టీమిండియా ఈ మ్యాచ్కు రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఉమ్రాన్ మాలిక్ స్థానంలో జైదేవ్ ఉనాద్కట్.. ఆల్రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ తుది జట్టులోకి వచ్చారు. ఇక విండీస్ మాత్రం సేమ్ జట్టుతోనే బరిలోకి దిగింది. తొలి రెండు వన్డేల్లో చెరొకటి గెలిచి 1-1తో సమంగా ఉన్న విండీస్, టీమిండియాల్లో మూడో వన్డే ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. రెండో వన్డేలో ఓడినా ప్రయోగాలు ఆపని టీమిండియా మూడో వన్డేలో నెగ్గి సిరీస్ కైవసం చేసుకుంటుందా అన్నది చూడాలి. భారత్(ప్లేయింగ్ XI): ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్ వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, అలిక్ అథానాజ్, షాయ్ హోప్(కెప్టెన్/వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, కీసీ కార్టీ, రొమారియో షెపర్డ్, యానిక్ కరియా, అల్జారీ జోసెఫ్, గుడాకేష్ మోటీ, జేడెన్ సీల్స్ చదవండి: హెచ్సీఏ నిర్వాకం.. జట్టులో అవకాశమిస్తామంటూ లక్ష వసూలు నిబంధనలు గాలికి.. మగ షూటర్ల గదిలో మహిళా షూటర్లు! -
90 పరుగుల వద్ద తొలి వికెట్.. 181 పరుగులకు ఆలౌట్.. చిత్రంగా విండీస్ మాత్రం!
West Indies vs India, 2nd ODI- ICC ODI WC 2023- బ్రిడ్జ్టౌన్: స్వదేశంలో త్వరలో జరిగే వన్డే ప్రపంచకప్నకు ముందు కరీబియన్ పర్యటనకు వచ్చిన భారత జట్టు టెస్టు సిరీస్ గెలిచేంత వరకు బాగానే ఉంది. కానీ మెగా టోర్నీ సన్నాహాకమైన కీలక వన్డే సిరీస్లో టీమిండియా ఆట ఏమాత్రం బాగోలేదు. తొలి వన్డేలో అర్థంలేని ప్రయోగాలను రెండో వన్డేలోనూ చేసింది. మొదటి మ్యాచ్లో గెలిచేందుకు కష్టపడింది. కానీ రెండో మ్యాచ్లో టీమిండియా ఎంత కష్టపడినా నెగ్గలేకపోయింది. తమ కెరీర్లో ఆఖరి వన్డే ప్రపంచకప్ అనుకుంటున్న కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిలకు ప్రతీ మ్యాచ్ కీలకం కాగా... వీళ్లిద్దరు విశ్రాంతి పేరిట దూరమైన వైనం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కానేకాదు. అందుకేనేమో మెగా ఈవెంట్కు అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్ జట్టు చేతిలో టీమిండియా అపహాస్యం కావాల్సి వచ్చింది. ఇషాన్ ఒక్కడే భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ రెండో వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో విండీస్ చేతిలో పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత్ 40.5 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (55 బంతుల్లో 55; 6 ఫోర్లు, 1 సిక్స్), శుబ్మన్ గిల్ (49 బంతుల్లో 34; 5 ఫోర్లు) మాత్రమే బాగా ఆడారు. టీమిండియా పసలేని బౌలింగ్పై.. తర్వాత పసలేని బౌలింగ్పై సులువైన లక్ష్యాన్ని వెస్టిండీస్ 36.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసి ఛేదించింది. కెప్టెన్ షై హోప్ (80 బంతుల్లో 63 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు), కీసీ కార్టీ (65 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు) విండీస్ను గెలిపించారు. భారత బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్నకు వికెట్ దక్కింది. సిరీస్ విజేతను నిర్ణయించే వన్డే మంగళవారం(ఆగష్టు 1) టరోబాలో జరుగుతుంది. శార్దుల్ రాణించినా... భారత బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ తన పేస్తో నిప్పులు చెరిగాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో జోరుమీదున్న ఓపెనర్లు మేయర్స్ (28 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్లు), బ్రాండన్ కింగ్ (23 బంతుల్లో 15; 3 ఫోర్లు)లను అవుట్ చేశాడు. కాసేపటికే వన్డౌన్లో వచి్చన అతనెజ్ (6)కూ శార్దుల్ క్రీజులో నిలిచే అవకాశమివ్వలేదు. 72 పరుగులకే టాపార్డర్ వికెట్లన్నీ పడ్డాయి. 90 పరుగుల వద్ద తొలి వికెట్ను కోల్పోయి.. చిత్రంగా విండీస్ మాత్రం వంద పరుగుల్లోపు మరో వికెట్ హెట్మైర్ (9) రూపంలో పడింది. కుల్దీప్నకు ఈ వికెట్ దక్కింది. 17 ఓవర్లలో విండీస్ స్కోరు 91/4. ఈ దశలో భారత్కు గెలిచే అవకాశం కనిపించింది. కానీ కెపె్టన్ షై హోప్, కార్టీతో కలిసి ప్రత్యర్థి జట్టుకు ఆ చాన్సు ఇవ్వకుండా క్రీజ్లో పాతుకుపోయాడు. ఈ క్రమంలో హోప్ 70 బంతుల్లో అర్ధసెంచరీ సాధించగా... ఇద్దరు కలిసి అబేధ్యమైన ఐదో వికెట్కు 91 పరుగులు చేశారు. ఈ మ్యాచ్ విచిత్రమేంటంటే... భారత్ 90 పరుగుల వద్ద తొలి వికెట్ను కోల్పోయి 181 పరుగులకు ఆలౌటైంది. కానీ అదే విండీస్ 91 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయాక మళ్లీ వికెట్నే చేజార్చుకోలేదు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: 181; వెస్టిండీస్ ఇన్నింగ్స్: బ్రాండన్ కింగ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) శార్దుల్ 15; మేయర్స్ (సి) ఉమ్రాన్ (బి) శార్దుల్ 36; అతనెజ్ (సి) ఇషాన్ (బి) శార్దుల్ 6; షై హోప్ (నాటౌట్) 63; హెట్మైర్ (బి) కుల్దీప్ 9; కార్టీ (నాటౌట్) 48; ఎక్స్ట్రాలు 5; మొత్తం (36.4 ఓవర్లలో 4 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–53, 2–54, 3–72, 4–91. బౌలింగ్: హార్దిక్ పాండ్యా 6.4–0–38–0, ముకేశ్ 3–0–17–0, ఉమ్రాన్ మాలిక్ 3–0–27–0, శార్దుల్ ఠాకూర్ 8–0–42–3, కుల్దీప్ యాదవ్ 8–0–30–1, జడేజా 6–0–24–0, అక్షర్ పటేల్ 2–1–4–0. చదవండి: చరిత్ర సృష్టించిన శుబ్మన్ గిల్.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా! కావాలనే రోహిత్, కోహ్లి లేకుండా! మ్యాచ్ ఓడిపోతేనే! ఆసియా కప్ తర్వాత ఇద్దరూ అవుట్? 4 Overs. 16 Runs. 3 Wickets! Shardul Thakur's first spell 🔥 from yesterday 😮#INDvWIAdFreeonFanCode #INDvWI pic.twitter.com/iQU260e4TI — FanCode (@FanCode) July 30, 2023 -
మేం కసితో ఆడాం.. నాకు ముందే తెలుసు! తర్వాతి మ్యాచ్ కూడా: హోప్
వెస్టిండీస్ క్రికెట్ జట్టు చానాళ్ల తర్వాత అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. బార్బోడస్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్లో విండీస్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బౌలింగ్లో భారత్ను కట్టడిచేసిన కరేబియన్లు.. అనంతరం బ్యాటింగ్లో కూడా సత్తా చాటారు. తొలుత టీమిండియా.. విండీస్ బౌలర్ల ధాటికి భారత్ 40.5 ఓర్లలోనే 181 పరుగులకు కుప్పకూలింది. ఇషాన్ కిషన్ (55), శుబ్మన్ గిల్(34) రాణించారు. విండీస్ బౌలర్లలో రొమారియో షెఫర్డ్, గుడకేశ్ మోతీ తలా మూడు వికెట్లు సాధించారు. అనంతరం 182 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్. 36.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విండీస్ బ్యాటర్లలో కెప్టెన్ హోప్ (63 నాటౌట్), కార్టీ(48) పరుగులతో రాణించారు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ స్పందించాడు. తమ బౌలర్లు అద్భుతంగా రాణించారని అతడు కొనియాడాడు. "మనం ఫిప్టీలు, సెంచరీలు చేసినా జట్టు విజయం సాధించకపోతే సంతృప్తి ఉండదు. కానీ ఈ మ్యాచ్లో నా ఫిప్టీతో పాటు విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా భారత్ వంటి క్వాలిటీ బౌలింగ్ ఎటాక్ను ఎదుర్కొవడం అంత ఈజీ కాదు. ఈ మ్యాచ్లో మా బాయ్స్ అద్భుతంగా రాణించారు. మేము పూర్తి కసితో ఆడాం. మేము ఒక యూనిట్గా రాణిస్తే ఫలితం మాకు అనుకూలంగా ఉంటుందని నాకు ముందే తెలుసు. ఈ విన్నింగ్ క్రెడిట్ బౌలర్లకు ఇవ్వాలనుకుంటున్నాను. ప్రస్తుతం మా ఖాతాలో ఒక్క విజయం ఉంది. మేము సిరీస్ సొంతం చేసుకోవాలంటే ఆఖరి మ్యాచ్లో కచ్చితంగా గెలవాలి. చివరి మ్యాచ్లో గెలిచేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తామని" పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో హోప్ పేర్కొన్నాడు. చదవండి: #Stuart Broad: ప్రీ మెచ్యూర్ బేబీ.. ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టం! అయినా క్రికెట్ ప్రపంచంలో రారాజు -
Ind vs WI: కెప్టెన్గా హార్దిక్ పాండ్యా.. రోహిత్ శర్మ అవుట్
West Indies vs India, 2nd ODI: బార్బడోస్ వేదికగా టీమిండియా రెండో వన్డేలో వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుందని అంచనా వేసిన విండీస్ సారథి షాయీ హోప్... తొలుత భారత జట్టును బ్యాటింగ్కు ఆహ్వానిస్తున్నట్లు తెలిపాడు. బౌలింగ్లో రాణించి టీమిండియా బ్యాటర్లపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. రోమన్ పావెల్, డ్రేక్స్ స్థానంలో అల్జారీ జోసెఫ్, కార్టీ తుది జట్టులోకి వచ్చినట్లు వెల్లడించాడు. రోహిత్, కోహ్లి లేకుండానే రెండో వన్డేలో స్టార్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లేకుండానే టీమిండియా బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా పగ్గాలు చేపట్టాడు. రోహిత్, కోహ్లి స్థానాల్లో సంజూ శాంసన్, అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చినట్లు పాండ్యా తెలిపాడు. 1-0తో ఆధిక్యంలో.. కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడే నిమిత్తం టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25లో తొలి సిరీస్లో విండీస్తో తలపడ్డ రోహిత్ సేన 1-0తో ట్రోఫీ గెలిచింది. మలి టెస్టులోనూ గెలిచి విజయాన్ని పరిపూర్ణం చేసుకోవాలని భావించగా వర్షం అంతరాయం కలిగించడంతో డ్రాగా ముగిసిపోయింది. ఈ క్రమంలో జూలై 27న ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరుగగా.. టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడు మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం 1-0తో ఆధిక్యంలో ఉంది. ఇక బార్బడోస్లో తొలి వన్డేలో జట్టులో స్థానం దక్కించుకోలేకపోయిన సంజూ శాంసన్కు రెండో మ్యాచ్లో అవకాశం వచ్చింది. తుది జట్లు టీమిండియా శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్. వెస్టిండీస్ బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, అలీక్ అథనాజ్, షాయ్ హోప్(వికెట్ కీపర్/కెప్టెన్), షిమ్రాన్ హెట్మైర్, కీసీ కార్టీ, రొమారియో షెఫర్డ్, యాన్నిక్ కరియా, గుడకేష్ మోటీ, అల్జారీ జోసెఫ్, జేడెన్ సీల్స్. చదవండి: బీటెక్ చదివిన టీమిండియా స్టార్.. ధోని, కోహ్లిలతో పాటు! ఆస్తి 100 కోట్లు! -
టాస్ గెలిచిన టీమిండియా.. ఇషాన్ కిషన్ వైపే మొగ్గు
వెస్టిండీస్తో మొదలైన తొలి వన్డేలో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. విండీస్తో ముగిసిన టెస్టు సిరీస్ను 1-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ప్రాక్టీస్గా ఈ వన్డే సిరీస్ని ఉపయోగించుకోనుంది. కాగా తుది జట్టు ఎలా ఉండబోతుందో ముందే అంచనాకు వచ్చినప్పటికి వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్, సంజూ శాంసన్లలో ఎవరు ఉంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే రోహిత్ శర్మ ఇషాన్ కిషన్వైపే మొగ్గుచూపాడు. ఇటీవలే ముగిసిన రెండో టెస్టులో ఇషాన్ కిషన్ ఫిఫ్టీతో మెరిసిన సంగతి తెలిసిందే. ఈ ప్రదర్శనను దృష్టిలో పెట్టుకొనే ఇషాన్కు అవకాశమిచ్చినట్లు తెలుస్తోంది. ఇక బౌలింగ్లో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల కాంబినేషన్తో బరిలోకి దిగింది. రెండో టెస్టులో ఆకట్టుకున్న ముకేశ్ కుమార్ వన్డేల్లో అరంగేట్రం చేయనుండగా.. ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్లు పేస్ విభాగాన్ని నడిపించనుండగా.. వీరికి తోడుగా ఆల్రౌండర్ హార్దిక్ ఉన్నాడు. ఇక స్పిన్నర్ల విభాగంలో కుల్దీప్ యాదవ్ చోటు దక్కించుకోగా జడేజా మరో స్పిన్నర్గా ఉన్నాడు. టెస్టు సిరీస్ ఓడినప్పటికి వెస్టిండీస్ వన్డే జట్టు మాత్రం కాస్త సీనియర్లతో నిండిఉంది. ఇటీవలే వరల్డ్కప్ క్వాలిఫయర్స్లో రాణించిన కెప్టెన్ షెయ్ హోప్ సహా కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, డొమినిక్ డ్రేక్స్ , షిమ్రోన్ హెట్మైర్, రోవ్మెన్ పావెల్లు జట్టులో ఉన్నారు. వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): షాయ్ హోప్ (వికెట్ కీపర్/కెప్టెన్), కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, అలిక్ అథానాజ్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్మాన్ పావెల్, రొమారియో షెపర్డ్, యానిక్ కరియా, డొమినిక్ డ్రేక్స్, జేడెన్ సీల్స్, గుడాకేష్ మోటీ భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్ India vs West Indies, 1st ODI: India Opt To Field vs West Indies, Mukesh Kumar To Debut#INDvsWI #ODIs #BCCI #Cricket #debu pic.twitter.com/pTx9hbPji4 — Smart Locus (@SmartLocusIN) July 27, 2023 చదవండి: కోహ్లి గురించి ప్రశ్న.. విసుగెత్తిపోయిన రోహిత్! ఘాటు రిప్లైతో నోరు మూయించాడు! Japan Open 2023: క్వార్టర్స్కు దూసుకెళ్లిన లక్ష్యసేన్, సాత్విక్-చిరాగ్ జోడి -
అప్పుడలా జరిగింది.. ఇప్పుడు వేరు! మేమేంటో ప్రపంచానికి చూపిస్తాం: విండీస్ కెప్టెన్
West Indies vs India, 1st ODI: టీమిండియాతో వన్డే సిరీస్తో తిరిగి ఫామ్లోకి వస్తామని వెస్టిండీస్ కెప్టెన్ షాయీ హోప్ ఆశాభావం వ్యక్తం చేశాడు. జట్టులో ఉన్న లోపాలు సరిచేసుకుని, సమస్యలు అధిగమించి ముందుకు సాగుతామని పేర్కొన్నాడు. కాగా రెండుసార్లు వన్డే వరల్డ్కప్ చాంపియన్ అయిన విండీస్ ఈసారి మెగా టోర్నీకి అర్హత సాధించలేకపోయిన విషయం తెలిసిందే. టాప్-8లో నేరుగా అడుగుపెట్టలేకపోయిన షాయీ హోప్ బృందం.. జింబాబ్వే వేదికగా జరిగిన క్వాలిఫయర్స్ ఆడింది. ఈ క్రమంలో యూఎస్ఏ, యూఏఈ, నేపాల్ వంటి పసికూనలపై గెలిచిన విండీస్.. జింబాబ్వేతో మ్యాచ్లో ఓడి పరాజయాల ఖాతా తెరిచింది. ఘోర పరాభవం అనంతరం.. వర్షం కారణంగా నెదర్లాండ్స్తో మ్యాచ్ టై కావడం.. ఆపై సూపర్ ఓవర్లో ఓటమి, ఆ తర్వాత స్కాట్లాండ్ చేతిలో చిత్తైన నేపథ్యంలో టాప్-2లో నిలవాలన్న వెస్టిండీస్ ఆశలకు గండిపడింది. ఆపై ఒమన్పై గెలిచినా ఫలితం లేకుండా పోయింది. శ్రీలంక, నెదర్లాండ్స్ టాప్-10లో అడుగుపెట్టగా.. విండీస్ ఇంటిబాట పట్టింది. ఈ క్రమంలో ఘోర పరాభవం తర్వాత పటిష్ట టీమిండియాతో సొంతగడ్డపై వన్డే సిరీస్ ఆడనుంది. బార్బడోస్ వేదికగా గురువారం (జూలై 27)న మొదటి మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్కు ముందు మీడియాతో మాట్లాడిన విండీస్ సారథి షాయీ హోప్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మేమేంటో ప్రపంచానికి చూపిస్తాం ‘‘తిరిగి పుంజుకోవడానికి ఇదో మంచి అవకాశంగా భావిస్తున్నాం. వైవిధ్యమైన వన్డే ఫార్మాట్లో మా నైపుణ్యాలు ప్రదర్శించి.. మేం చేయగలమో ప్రపంచానికి చూపించే మరో అవకాశం దొరికింది. జింబాబ్వేలో జరిగిన వరల్డ్కప్ క్వాలిఫయర్స్లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. అలా అయితే విజయం మాదే లోపాలు సరిచేసుకుని మళ్లీ కొత్తగా మా ప్రయాణాన్ని మొదలుపెట్టాలనుకుంటున్నాం. ప్రతిసారి అందరికీ గెలిచే అవకాశం రాకపోవచ్చు. అయితే, లక్ష్యాన్ని చేరుకునేందుకు మనం చేసే ప్రయత్నాల్లో మాత్రం లోపం ఉండకూడదు. అనుకున్న ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తే కచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంటుంది’’ అని షాయీ హోప్ సానుకూల దృక్పథంతో మాట్లాడాడు. అతడు తిరిగి రావడం సంతోషం ఇక షిమ్రన్ హెట్మెయిర్ జట్టులోకి తిరిగి రావడంపై స్పందిస్తూ.. ‘‘బౌలర్లపై విరుచుపడుతూ దూకుడగా బ్యాటింగ్ చేయగల సత్తా అతడికి ఉంది. ఏ క్షణంలోనైనా మ్యాచ్ను ఒంటిచేత్తో మలుపు తిప్పగలడు. మా జట్టులో ఉన్న నిజమైన ఇంపాక్ట్ ప్లేయర్ అతడు. హెట్మెయిర్ జట్టులోకి రావడం సంతోషంగా ఉంది’’అని షాయీ హోప్ పేర్కొన్నాడు. కాగా కెప్టెన్గా షాయీ హోప్నకు స్వదేశంలో తొలి వన్డే ఇది. చదవండి: ఏడాదికి 50 కోట్ల సంపాదన! మరి.. ధోని సొంత అక్క పరిస్థితి ఎలా ఉందంటే! -
రెండు ప్రపంచకప్లలో ఎదురేలేని గెలుపు! కానీ ఇప్పుడు.. విండీస్ దుస్థితికి కారణాలివే
వెస్టిండీస్... ప్రపంచ క్రికెట్ను శాసించిన జట్టు. కరీబియన్ బౌలింగ్ అంటేనే బ్యాటర్లు బెంబేలెత్తేవారు. తొలి రెండు ప్రపంచకప్ (1975, 1979) టోర్నీలను ఎదురేలేకుండా గెలుచుకుంది. మూడో ప్రపంచకప్లో రన్నరప్గా నిలిచింది. అయితే ఇది గతం. ఇంతటి ఘన చరిత్ర కలిగిన జట్టు ఇప్పుడు భారత్కు రావడం లేదన్నది వర్తమానం. అంటే వన్డే ప్రపంచకప్కు కరీబియన్ జట్టు దూరమైంది. క్వాలిఫయింగ్ దశలోనే ఇంటికెళ్లనుంది. ఇది విండీస్ అభిమానులకే కాదు... క్రికెట్ విశ్లేషకులకు పెద్ద షాక్! ICC Cricket World Cup Qualifiers 2023- హరారే: వెస్టిండీస్ ప్రపంచకప్ ముచ్చట జింబాబ్వేలో జరుగుతున్న క్వాలిఫయర్స్లోనే ముగిసిపోయింది. వన్డే మెగా టోరీ్నలో ఆడే అర్హత కోల్పోయింది. ‘సూపర్ సిక్స్’ దశలో స్కాట్లాండ్ చేతిలో పరాభవంతో కరీబియన్ జట్టు ని్రష్కమణ అధికారికంగా ఖరారైంది. శనివారం జరిగిన కీలక మ్యాచ్లో స్కాట్లాండ్ ఏడు వికెట్ల తేడాతో విండీస్పై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ 43.5 ఓవర్లలో 181 పరుగులకే కుప్పకూలింది. టాపార్డర్లో బ్రాండన్ కింగ్ (22 బంతుల్లో 22; 5 ఫోర్లు) రెండు పదుల స్కోరు చేస్తే మిగతా ఇద్దరు చార్లెస్ (0), బ్రూక్స్ (0) ఖాతానే తెరువలేదు. కెప్టెన్ షై హోప్ (13), కైల్ మేయర్స్ (5) చెత్తగానే ఆడారు. 60 పరుగులకే టాప్–5 వికెట్లను కోల్పోయిన విండీస్ కష్టాల్లో పడింది. ఈ దశలో నికోలస్ పూరన్ (43 బంతుల్లో 21; 2 ఫోర్లు) పెద్దగా మెప్పించలేదు. తలరాతను తలకిందులు చేశాడు షెఫర్డ్ (43 బంతుల్లో 36; 5 ఫోర్లు)తో కలిసిన హోల్డర్ (79 బంతుల్లో 45; 3 ఫోర్లు, 1 సిక్స్) వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఏడో వికెట్కు 77 పరుగులు జోడించి ఆదుకున్నాడు. స్కాట్లాండ్ బౌలర్లలో మెక్ములెన్ 3, క్రిస్ సోల్, మార్క్వాట్, క్రిస్ గ్రీవ్స్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన స్కాట్లాండ్ 43.3 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసి గెలిచింది. ఓపెన్ మాథ్యూ క్రాస్ (107 బంతుల్లో 74 నాటౌట్; 7 ఫోర్లు), మెక్ములెన్ (106 బంతుల్లో 69; 8 ఫోర్లు, 1 సిక్స్) రెండో వికెట్కు 125 పరుగులు జోడించి విండీస్ ‘కప్’ రాతను కాలరాశారు. కరీబియన్కు ఎందుకీ దుస్థితి? జింబాబ్వేకు వచి్చన వెస్టిండీస్ జట్టులోని సభ్యుల్లో ప్రపంచకప్కు అర్హత సాధించాలి... భారత్కు వెళ్లాలి అన్న కసి, పట్టుదల కనిపించనే లేదు. అవే ఉంటే ఫీల్డింగ్ ఇంత ఘోరంగా చేయరు. బౌలింగ్ ఎంత పేలవం అంటే... నెదర్లాండ్స్తో కీలకమైన సూపర్ ఓవర్లో బౌండరీలు దాటే ఆరు బంతులు (4, 6, 4, 6, 6, 4; హోల్డర్ బౌలర్) వేయరు. నిలకడేలేని బ్యాటింగ్తో ఆడరు. ఇలా అన్ని రంగాల్లో చెత్త ప్రదర్శన వల్లే రెండుసార్లు ‘విజేత’ తాజా ‘అనర్హత’ అయ్యింది. ఇప్పుడు మిగతా ‘సూపర్ సిక్స్’ దశలో ఒమన్, శ్రీలంకలతో ఆడి ఇంటికెళ్లిపోవడమే మిగిలింది. వెస్టిండీస్ అంటేనే ఒకప్పుడు అరివీర భయంకర బౌలర్లు, దంచికొట్టే బ్యాటింగ్ ఆజానుబాహులు గుర్తొచ్చేవారు. కానీ ప్రస్తుతం నామమాత్రంగా జాతీయ జట్టుకు ఆడే ఆటగాళ్లు... ఫ్రాంచైజీ లీగ్ల్లో మాత్రం మెరిపించే వీరులు కనబడుతున్నారు. విండీస్ బోర్డు కుమ్ములాటలు, ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులపై తరచూ పేచీలతో స్టార్ ఆటగాళ్లంతా టీమ్ స్పిరిట్ మరిచి వ్యక్తిగతంగా కలిసొచ్చే టి20 లీగ్లపై కష్టపడటం నేర్చారు. దీంతో అసలైన సంప్రదాయ క్రికెట్ (టెస్టు), పరిమిత ఓవర్ల ఆట (వన్డే)లను పట్టించుకోవడం మానేశారు. జట్టుగా పట్టుదలతో ఆడటం అనే దాన్నే మర్చిపోయారు. ఇప్పుడు కరీబియన్ ఆటగాళ్లంతా ఐసీసీ తయారు చేసిన భవిష్యత్ పర్యటనల కార్యక్రమం (ఎఫ్టీపీ)ను పూర్తి చేస్తున్నారు. కానీ విండీస్ భవిష్యత్తుకు అవసరమైన షెడ్యూల్ను ఎప్పుడో పక్కన బెట్టేశారు. అందువల్లే వెస్టిండీస్ జట్టుకు ఈ దుస్థితి దాపురించింది. చదవండి: మా ఓటమికి ప్రధాన కారణం అదే.. ఒకవేళ అలా జరిగి ఉంటే: విండీస్ కెప్టెన్ -
మా ఓటమికి ప్రధాన కారణం అదే.. ఒకవేళ అలా జరిగి ఉంటే: విండీస్ కెప్టెన్
ICC Cricket World Cup Qualifiers 2023- Scotland Beat West Indies by 7 wkts: ‘‘ఆది నుంచే మా స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయాం. ఈ టోర్నీ సవాలుతో కూడుకున్నదని తెలుసు. నిజానికి ఈ మ్యాచ్లో మేము టాస్ గెలిస్తే బాగుండేది. ఇలాంటి పిచ్ మీద ఏ కెప్టెన్ అయినా టాస్ గెలిస్తే ముందుగా బౌలింగే ఎంచుకుంటాడు. ఆ విషయంలో మాకేదీ కలిసిరాలేదు. క్యాచ్లు వదిలేయడాలు, మిస్ఫీల్డింగ్ తీవ్ర ప్రభావం చూపుతాయి. ఆటలో ఇవన్నీ సహజమే! కానీ ప్రతిసారీ వందకు వంద శాతం ఎఫర్ట్ పెట్టలేము కదా! ఆటలో ఇవన్నీ సహజమే! వాస్తవానికి టోర్నీ ఆరంభానికి ముందే.. స్వదేశంలోనే మేము పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాల్సింది. సరైన సన్నాహకాలు లేకుండా నేరుగా వెళ్లి గొప్పగా ఆడాలంటే అన్నివేళలా కుదరకపోవచ్చు. గెలవాలనే పట్టుదల, కసి మిగిలిన మ్యాచ్లలో గెలిచైనా మా అభిమానులకు కాస్త వినోదం పంచుతాం. జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదువ లేదు. కానీ నిలకడగా ఆడలేకపోవడమే మా కొంపముంచింది. స్కాట్లాండ్ జట్టు అద్భుతంగా ఆడింది. ముఖ్యంగా వాళ్ల బౌలర్లు మెరుగ్గా రాణించారు. గెలవాలనే పట్టుదల, కసి వారిలో కనిపించాయి. మేము వాళ్లను చూసి చాలా నేర్చుకోవాల్సి ఉంది. తిరిగి వెళ్లిన తర్వాత డారెన్ సామీతో కలిసి మా జట్టులోని లోపాలను సరిచేసుకోవడంపై దృష్టి సారిస్తాం’’ అని వెస్టిండీస్ కెప్టెన్ షాయీ హోప్ ఉద్వేగపూరితంగా మాట్లాడాడు. స్కాట్లాండ్ చేతిలో ఓడి రెండుసార్లు చాంపియన్ అయిన విండీస్ జట్టు వన్డే వరల్డ్కప్-2023లో క్వాలిఫయర్స్లోనే ఇంటిబాట పట్టింది. జింబాబ్వేలో జరిగిన సూపర్ సిక్సెస్ దశలో స్కాట్లాండ్తో మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. వరల్డ్కప్ రేసు నుంచి అవుట్ తద్వారా భారత్ వేదికగా అక్టోబరు 5 నుంచి మొదలుకానున్న ప్రపంచకప్-2023లో అడుగుపెట్టే అర్హత కోల్పోయింది. మాజీ చాంపియన్ ఇలా అవమానకరరీతిలో నిష్క్రమించడం అభిమానుల హృదయాలను ముక్కలు చేస్తోంది. మా ఓటమికి ప్రధాన కారణం అదే ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం విండీస్ సారథి షాయీ హోప్ మాట్లాడుతూ.. టాస్ ఓడిపోవడం తీవ్ర ప్రభావం చూపిందన్నాడు. హరారేలో శనివారం నాటి మ్యాచ్లో తాము తొలుత బ్యాటింగ్ చేయాల్సి రావడంతో భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ ఓటమికి పరోక్షంగా టాస్ ఓడటమే కారణమని అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో స్కాట్లాండ్ బౌలర్లు అద్భుతంగా ఆడారని ప్రశంసించిన హోప్.. తమ జట్టులో గొప్ప ఆటగాళ్లు ఉన్నా ఫలితం లేకుండా పోయిందని వాపోయాడు. టోర్నీ మొత్తం తమకు నిరాశనే మిగిల్చిందని ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా సూపర్ సిక్సెస్లో విండీస్కు ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. జూలై 5న ఒమన్, జూలై 7న శ్రీలంకతో వెస్టిండీస్ తలపడాల్సి ఉంది. ఈ రెండు నామమాత్రపు మ్యాచ్లలో గెలిచైనా గౌరవప్రదంగా స్వదేశానికి తిరిగి వెళ్లాలని కరేబియన్ జట్టు భావిస్తోంది. స్కాట్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ స్కోర్లు: టాస్: స్కాట్లాండ్- బౌలింగ్ వెస్టిండీస్- 181 (43.5) స్కాట్లాండ్- 185/3 (43.3) విజేత: ఏడు వికెట్ల తేడాతో స్కాట్లాండ్ గెలుపు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: బ్రాండన్ మెక్ములెన్ (3 వికెట్లు, 69 పరుగులు). చదవండి: పచ్చగడ్డి.. పులి.. సింహం! అవును.. నువ్వు గాడిదవే! మా కోహ్లి ఎప్పటికీ కింగే! పసికూన చేతిలో చిత్తు! వరల్డ్కప్ నుంచి అధికారికంగా అవుట్ -
డేంజర్ జోన్లో విండీస్.. వరల్డ్కప్కు క్వాలిఫై అవుతుందా?
రెండుసార్లు ప్రపంచకప్ విజేత.. అరవీర భయంకరమైన బౌలర్లు.. అదే స్థాయిలో ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడిన బ్యాటర్లు.. నాలుగు దశాబ్దాల పాటు క్రికెట్ను శాసించిన వైనం. ఇప్పుడు అదంతా గతం. తాజాగా వన్డే వరల్డ్కప్కు అర్హత సాధించడం కోసం వరల్డ్కప్ క్వాలిఫయర్ పోరులో ఆడాల్సిన దుస్థితి వెస్టిండీస్కు ఎదురైంది. అయితే శనివారం జింబాబ్వేతో జరిగిన లీగ్ మ్యాచ్లో వెస్టిండీస్ 35 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇదే ఓటమి ఆ జట్టును డేంజర్ జోన్లో పడేసింది. క్వాలిఫయర్ టోర్నీలో భాగంగా లీగ్ దశలో సాధించిన విజయాల ఆధారంగా వచ్చే పాయింట్లు సూపర్ సిక్స్లో లెక్కిస్తారు. సూపర్ సిక్స్ దశకు చేరుకోవడంలో విఫలమైన జట్లపై సాధించిన పాయింట్లు మినహా, ప్రతి జట్టు గ్రూప్ దశలో సాధించిన పాయింట్లు సూపర్ సిక్స్ దశకు బదిలీ చేయబడతాయి. ఈ దశ మ్యాచ్లు అయిపోయే సరికి టాప్ 2లో ఉన్న జట్లు భారత్ వేదికగా జరిగే ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్-2023కు అర్హత సాధిస్తాయి. ఇక మ్యాచ్లో విండీస్ ఓడినప్పటికి సూపర్ సిక్స్ దశకు చేరుకున్నా రెండు పాయింట్లు మాత్రం కోల్పోయింది. ఇది సూపర్సిక్స్ దశలో ఇబ్బంది పెట్టేలా కనిపిస్తోంది. లీగ్లో వెస్టిండీస్ తన చివరి మ్యాచ్ను నెదర్లాండ్స్తో ఆడుతుంది. ఒకవేళ మ్యాచ్లో గెలిస్తే గ్రూప్-ఏ నుంచి టాప్-2గా అడుగుపెడుతుంది. ఇక జింబాబ్వే తన ఆఖరి పోరులో అమెరికాను ఎదుర్కొంటుంది. ఏదైనా సంచలనం నమోదైతే తప్ప జింబాబ్వే గ్రూప్ టాపర్గా సూపర్ సిక్స్ దశకు చేరుకుంటుంది. ఎందుకంటే జింబాబ్వే గ్రూప్ టాపర్గా ఉంటుంది కాబట్టి విండీస్ సూపర్ సిక్స్ దశలో అన్ని మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది. ఒక్క మ్యాచ్ ఓడినా ఆ జట్టు వన్డే వరల్డ్కప్కు అర్హత సాధించడంలో విఫలమవుతుంది. చదవండి: 'అమ్మా నన్ను మన్నించు'.. హాకీ దిగ్గజం ధనరాజ్ పిళ్లై గొడవపడ్డ భారత్, నేపాల్ ఆటగాళ్లు.. తప్పు మనోడిదేనా! -
సెంచరీలతో కదం తొక్కిన హోప్, పూరన్.. విండీస్ ఖాతాలో భారీ విజయం
వరల్డ్కప్ క్వాలిఫయర్స్ 2023లో వెస్టిండీస్ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. నేపాల్తో ఇవాళ (జూన్ 22) జరిగిన మ్యాచ్లో విండీస్ 101 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ షాయ్ హోప్ (129 బంతుల్లో 132; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), టీ20 స్పెషలిస్ట్ నికోలస్ పూరన్ (94 బంతుల్లో 115; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీలతో కదంతొక్కి విండీస్ గెలుపులో ప్రధాన పాత్ర పోషించారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. 55 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో జత కలిసిన హోప్, పూరన్ జోడీ నాలుగో వికెట్కు 216 పరుగుల భారీ భాగస్వామ్యాని జోడించి తమ జట్టు భారీ స్కోర్ చేయడానికి బాటలు వేశారు. ఆఖర్లో రోవ్మన్ పావెల్ (29), జేసన్ హోల్డర్ (16 నాటౌట్) బ్యాట్ ఝులిపించారు. ఫలితంగా విండీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 339 పరుగుల భారీ స్కోర్ చేసింది. నేపాల్ బౌలర్లలో లలిత్ రాజ్బంశీ 3.. కరణ్, గుల్షన్ ఝా, సందీప్ లామిచ్చేన్, దీపేంద్ర సింగ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నేపాల్.. విండీస్ బౌలర్లు జేసన్ హోల్డర్ (10-0-34-3), అల్జరీ జోసఫ్ (10-0-45-2), కీమో పాల్ (10-1-63-2), అకీల్ హొస్సేన్ (10-1-49-2), కైల్ మేయర్స్ (6.4-0-37-1) ధాటికి 49.4 ఓవర్లలో 238 పరుగులకే అలౌటై ఓటమిపాలైంది. నేపాల్ ఇన్నింగ్స్లో ఆరిఫ్ షేక్ (63) అర్ధసెంచరీ సాధించగా.. గుల్సన్ ఝా (42), రోహిత్ పౌడెల్ (30), ఆసిఫ్ షేక్ (28), కరణ్ (28), దీపేంద్ర సింగ్ (23) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ మ్యాచ్లో గెలుపుతో విండీస్ గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకగా.. ఆడిన 3 మ్యాచ్ల్లో రెండింటిలో ఓటమిపాలైన నేపాల్ నాలుగో స్థానానికి పడిపోయింది.గ్రూప్-ఏలో ఇవాళే జరిగిన మరో మ్యాచ్లో యూఎస్ఏను మట్టికరిపించిన నెదర్లాండ్స్ మూడో ప్లేస్కు చేరుకోగా.. ఆడిన 2 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధించిన జాంబాబ్వే.. విండీస్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. ఆడిన 3 మ్యాచ్ల్లో ఓటమిపాలైన యూఎస్ఏ ఐదో స్థానంలో నిలిచి, టోర్నీ నుంచి నిష్క్రమించే స్థితికి చేరింది. గ్రూప్-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్లో ఒమన్ (2 మ్యాచ్ల్లో 2 విజయాలు) టాప్లో ఉండగా.. శ్రీలంక (2), స్కాట్లాండ్ (2), ఐర్లాండ్ (0), యూఏఈ (0) వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో నిలిచాయి. ఈ టోర్నీలో ఫైనల్కు చేరే రెండు జట్లు ఈ ఏడాది చివర్లో భారత్లో జరిగే వన్డే వరల్డ్కప్కు అర్హత సాధిస్తాయి. -
నయా రన్ మెషీన్ షాయ్ హోప్.. దిగ్గజాల సరసన చోటు
వెస్టిండీస్ వన్డే జట్టు కెప్టెన్ షాయ్ హోప్ అత్యంత అరుదైన జాబితాలో చేరాడు. వరల్డ్కప్ క్వాలిఫయర్స్-2023లో భాగంగా నేపాల్తో ఇవాళ (జూన్ 22) జరుగుతున్న మ్యాచ్లో శతక్కొట్టం (129 బంతుల్లో 132; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ద్వారా విరాట్ కోహ్లి, మైఖేల్ బెవాన్, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోని, జో రూట్ లాంటి దిగ్గజ క్రికెటర్ల సరసన చేరాడు. నేపాల్తో మ్యాచ్లో సెంచరీ చేయడం ద్వారా హోప్ మరోసారి వన్డేల్లో 50కిపైగా యావరేజ్ సాధించాడు. కనీసం 100 వన్డేలు ఆడి 50 అంతకంటే ఎక్కువ సగటు కలిగిన క్రికెటర్ల జాబితాలో పైన పేర్కొన్న దిగ్గజాలు మాత్రమే ఉన్నారు. హోప్ 110 మ్యాచ్ల్లో 105 ఇన్నింగ్స్లు ఆడి 50.26 సగటున 4674 పరుగులు చేశాడు. ఈ జాబితాలో విరాట్ అందరికంటే ఎక్కువగా 274 వన్డేల్లో 57.3 సగటున 12898 పరుగులు చేశాడు. విరాట్ తర్వాత ఆసీస్ మాజీ ఆల్రౌండర్ మైఖేల్ బెవాన్ (232 వన్డేల్లో 53.6 సగటున 6912 పరుగులు) అత్యధిక సగటు కలిగి ఉన్నాడు. ఆ తర్వాత ఏబీ డివిలియర్స్ (228 వన్డేల్లో 53.5 సగటున 9577 పరుగులు), ఎంఎస్ ధోని (350 మ్యాచ్ల్లో 50.6 సగటున 10773 పరుగులు), జో రూట్ (158 వన్డేల్లో 50 సగటున 6207 పరుగులు) ఉన్నారు. తాజాగా హోప్ వీరి సరసన చేరాడు. నేపాల్తో మ్యాచ్లో సెంచరీ కొట్టడం ద్వారా హోప్ వన్డేల్లో తన 15వ శతకాన్ని నమోదు చేశాడు. 2019 వన్డే వరల్డ్కప్ తర్వాత ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులు (47 ఇన్నింగ్స్ల్లో 2153 పరుగులు), హోప్ అత్యధిక సెంచరీలు (9), అత్యధిక హాఫ్ సెంచరీలు (18) చేసిన రెండో బ్యాటర్గా హోప్ రికార్డుల్లోకెక్కాడు. ఇటీవలికాలంలో హోప్ ప్రదర్శన చూసాక ఇతన్ని అందరూ నయా రన్ మెషీన్ అని అంటున్నారు. ఇదిలా ఉంటే, నేపాల్తో మ్యాచ్లో హోప్తో పాటు నికోలస్ పూరన్ (94 బంతుల్లో 115; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీ చేయడంతో విండీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 339 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనలో నేపాల్ తడబడుతుంది. 44 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసి ఓటమి దిశగా సాగుతుంది. -
విండీస్ బ్యాటర్ల శతకాల మోత.. పూరన్ ఊచకోత
CWC Qualifiers 2023 WI VS NEP: వరల్డ్కప్ క్వాలిఫయర్స్ 2023లో భాగంగా నేపాల్తో ఇవాళ (జూన్ 22) జరుగుతున్న మ్యాచ్లో విండీస్ బ్యాటర్లు శతకాల మోత మోగించారు. కెప్టెన్ షాయ్ హోప్ (129 బంతుల్లో 132; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) వన్డేల్లో భీకర ఫామ్ను కొనసాగిస్తూ కెరీర్లో 15వ శతకాన్ని నమోదు చేయగా.. టీ20 స్పెషలిస్ట్ నికోలస్ పూరన్ (94 బంతుల్లో 115; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) నేపాల్ బౌలర్లను ఊచకోత కోస్తూ విధ్వంసకర శతకాన్ని బాదాడు. ఫలితంగా విండీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. నేపాల్ బౌలర్లలో లలిత్ రాజ్బంశీ 3.. కరణ్, గుల్షన్ ఝా, సందీప్ లామిచ్చేన్, దీపేంద్ర సింగ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్కు ముందు యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లో అతి కష్టం మీద 39 పరుగుల తేడాతో విజయం సాధించిన విండీస్.. పాయింట్ల పట్టికలో (గ్రూప్-ఏ) జింబాబ్వే తర్వాత రెండో స్థానంలో కొనసాగుతుంది. గ్రూప్-బిలో ఆడిన 2 మ్యాచ్ల్లో గెలుపొందిన ఒమన్ టాపర్గా, శ్రీలంక, స్కాట్లాండ్ 2, 3 స్థానాల్లో నిలిచాయి. 2019 వరల్డ్కప్ తర్వాత హోప్ను మించినోడే లేడు.. విండీస్ వన్డే జట్టు కెప్టెన్ షాయ్ హోప్ వన్డేల్లో భీకర ఫామ్ను కొనసాగిస్తున్నాడు. 2019 వన్డే వరల్డ్కప్ తర్వాత అతను పట్టపగ్గాలు లేకుండా పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో హోప్ ఏకంగా 9 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు బాది, అత్యధిక పరుగులు (47 ఇన్నింగ్స్ల్లో 2153 పరుగులు) సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. హోప్కు కాస్త దగ్గరగా వచ్చిన బ్యాటర్ ఎవరైనా ఉన్నాడంటే అది బాబర్ ఆజమ్ అని చెప్పాలి. బాబర్ 28 ఇన్నింగ్స్ల్లో 1876 పరుగులు చేసి హోప్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. -
కోహ్లి, బాబర్ ఆజమ్లను మించిపోయిన వెస్టిండీస్ కెప్టెన్
వెస్టిండీస్ వన్డే జట్టు కెప్టెన్ షాయ్ హోప్ గత కొంతకాలంగా భీకర ఫామ్లో ఉన్నాడు. ఈ మధ్యకాలంలో (2019-2023) అతను వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా అవతరించాడు. వరల్డ్ క్లాస్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, బాబర్ ఆజమ్లను సైతం అధిగమించాడు. 2019 వన్డే వరల్డ్కప్ నుంచి నిన్నటి వరల్డ్కప్-2023 క్వాలిఫయర్స్ మ్యాచ్ల వరకు తీసుకుంటే.. హోప్ 46 ఇన్నింగ్స్ల్లో ఏకంగా 2021 పరుగులు చేశాడు. కోహ్లి, బాబర్ ఆజమ్లు సైతం ఈ మధ్యకాలంలో అన్ని పరుగులు చేయలేదు. కోహ్లి 37 ఇన్నింగ్స్ల్లో 1612 పరుగులు చేస్తే.. బాబర్ ఆజమ్ 28 ఇన్నింగ్స్ల్లో 1876 పరుగులు చేశాడు. 2019-2023 జూన్ మధ్యకాలంలో హోప్ తర్వాత బాబర్ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. వీరి తర్వాత పపువా న్యూ గినియా బ్యాటర్ అస్సద్ వాలా (47 ఇన్నింగ్స్ల్లో 1620 పరుగులు) మూడో స్థానంలో, విరాట్ కోహ్లి నాలుగో స్థానంలో, నమీబియా క్రికెటర్ గెర్హార్డ్ ఎరాస్మస్ (38 ఇన్నింగ్స్ల్లో 1577 పరుగులు) ఐదో స్థానంలో నిలిచారు. ఇదిలా ఉంటే, వరల్డ్కప్ క్వాలిఫయర్స్ 2023లో భాగంగా నిన్న (జూన్ 18) యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లో షాయ్ హోప్ (54) సహా జాన్సన్ ఛార్లెస్ (66), రోప్టన్ ఛేజ్ (55), జేసన్ హోల్డర్ (56), నికోలస్ పూరన్ (43) రాణించడంతో విండీస్ 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ వీరంతా రాణించడంతో 49.3 ఓవర్లలో 297 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఛేదనలో యూఎస్ఏ 7 వికెట్లు కోల్పోయి 258 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. గజానంద్ సింగ్ (101 నాటౌట్) వీరోచిత శతకంతో పోరాడి విండీస్కు అంత సులువుగా విజయాన్ని దక్కనీయ లేదు. అతనికి ఆరోన్ జోన్స్ (23), షయాన్ జహంగీర్ (39), నోస్తుష్ కెంజిగే (34) సహకరించారు. విండీస్ బౌలర్లలో కైల్ మేయర్స్, అల్జరీ జోసఫ్ తలో 2 వికెట్లు, జేసన్ హోల్డర్, రోస్టన్ ఛేజ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. కాగా, వన్డే వరల్డ్కప్లో బెర్తు కోసం విండీస్.. మరో 9 జట్లతో కలిసి వరల్డ్కప్ క్వాలిఫయర్స్లో తలపడుతున్న విషయం తెలిసిందే. -
పసికూనపై విండీస్ ప్రతాపం.. శతక్కొట్టిన కింగ్
మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం యూఏఈలో పర్యటిస్తున్న వెస్టిండీస్ జట్టు షార్జా వేదికగా నిన్న (జూన్ 4) జరిగిన తొలి మ్యాచ్లో ఘన విజయం సాధించి, సిరీస్కు శుభారంభం చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ 47.1 ఓవర్లలో 202 పరుగులు చేసి ఆలౌట్ కాగా.. విండీస్ 35.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి, 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. బ్రాండన్ కింగ్ సూపర్ శతకం (112 బంతుల్లో 112; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) సాధించి విండీస్ను గెలిపించాడు. అతనికి షామార్ బ్రూక్స్ (58 బంతుల్లో 44; 5 ఫోర్లు) జత కలిశాడు. యూఏఈ ఇన్నింగ్స్లో అలీ నసీర్ (58), అరవింద్ (40) రాణించగా, మిగతా వారంతా విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో కీమో పాల్ 3, డొమినిక్ డ్రేక్స్, ఓడియన్ స్మిత్, కారియా తలో 2 వికెట్లు, రోస్టన్ ఛేజ్ ఓ వికెట్ పడగొట్టారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే జూన్ 6న షార్జాలోనే జరుగనుంది. చదవండి: గెలవలేమని తెలిసినా సెంచరీ కోసం అలా.. చివరికి పరువు పాయే..! -
WC Qualifier 2023: జట్టును ప్రకటించిన వెస్టిండీస్.. విధ్వంసకర ఆటగాడికి నో ఛాన్స్
భారత్ వేదికగా జరగననున్న వన్డే ప్రపంచకప్-2023కు వెస్టిండీస్ జట్టు నేరుగా అర్హత సాధించకపోయిన సంగతి తెలిసిందే. జూన్లో జింబాబ్వే వేదికగా జరగనున్న వరల్డ్కప్ క్వాలిఫియర్ మ్యాచ్ల్లో వెస్టిండీస్ ఆడనుంది. ఈ క్రమంలో క్వాలిఫియర్ రౌండ్ మ్యాచ్లకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు బ్రాండెన్ కింగ్ సారధ్యం వహించనుండగా.. వైస్ కెప్టెన్గా రోవ్మన్ పావెల్ వ్యవహరించనున్నాడు. అదే విధంగా దాదాపు ఏడాది తర్వాత ఆ జట్టు ఆల్రౌండర్ కీమో పాల్కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. మరోవైపు జింబాబ్వేతో టెస్టు సిరీస్లో ఆకట్టుకున్న స్పిన్నర్ గుడాకేష్ మోటీకి కూడా ఈ జట్టులో చోటు దక్కింది. కాగా ఈ జట్టులో విధ్వంసకర ఆటగాడు షెమ్రాన్ హెట్మైర్కు చోటు దక్కపోవడం గమానార్హం. ఇక వరల్డ్కప్ క్వాలిఫియర్ జట్టుతో పాటు యూఏఈతో వన్డే సిరీస్కు కూడా జట్టును విండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్కు ఐపీఎల్-2023లో భాగంగా ఉన్న విండీస్ ఆటగాళ్లు దూరం కానున్నారు. ఈ సిరీస్ ఆరంభసమయానికి ఐపీఎల్ పూర్తి అయినప్పటికీ.. తమ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని విండీస్ సెలక్టర్లు నిర్ణయించారు. ఈ సిరీస్ జూన్ 5 నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచ కప్ క్వాలిఫైయర్ కోసం వెస్టిండీస్ జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్), రోవ్మన్ పావెల్ (వైస్ కెప్టెన్), షమర్ బ్రూక్స్, యానిక్ కరియా, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడాకేష్ మోటీ, కీమో పాల్, నికోలస్ పూరన్, రొమారియో షెపర్డ్ యూఏఈ వన్డేలకు వెస్టిండీస్ జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్), బ్రాండన్ కింగ్ (వైస్ కెప్టెన్), అలిక్ అథానాజ్, షమర్ బ్రూక్స్, యానిక్ కరియా, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, డొమినిక్ డ్రేక్స్, కావెం హాడ్జ్, అకీమ్ జోర్డాన్, గుడాకేష్ మోటీ, కీమో పాల్, రేమోన్ రీఫెర్, ఓడియన్ స్మిత్, డెవాన్ థామస్ -
విండీస్ ఘన విజయం; కెప్టెన్ ఒక్కడే ఆడితే సరిపోదు
సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్లో వెస్టిండీస్ శుభారంభం చేసింది. శనివారం జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవరల్లో 8 వికెట్ల నష్టానికి 335 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ షెయ్ హోప్ (115 బంతుల్లో 128 పరుగులు, 5 ఫోర్లు, ఏడు సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా.. రోవ్మన్ పావెల్ 46, బ్రాండన్ కింగ్ 30, కైల్ మేయర్స్ 36 పరుగులు చేశారు. ప్రొటీస్ బౌలర్లలో గెరాల్డ్ కొట్జే మూడు వికెట్లు పడగొట్టగా.. ఫొర్టున్, షంసీ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం 339 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 41.4 ఓవర్లలో 287 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ బవుమా(118 బంతుల్లో 144 పరుగులు) తన కెరీర్లో ఎప్పటికి గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. అయితే కెప్టెన్ ఒక్కడే ఆడితే సరిపోదు.. డికాక్(48 పరుగులు) మినహా బవుమాకు సహకరించేవారు కరువయ్యారు. టోని డి జార్జీ 27 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో అకిల్ హొసెన్, అల్జారీ జోసెఫ్లు చెరో మూడు వికెట్లు తీయగా.. ఓడెన్ స్మిత్, యానిక్ కారియా, కైల్ మేయర్స్ తలా ఒక వికెట్ తీశారు. తొలి వన్డే వర్షార్పణం కావడంతో రెండో వన్డేలో గెలిచిన విండీస్ 1-0తో ఆధిక్యంలో ఉంది. ఇక చివరిదైన మూడో వన్డే మార్చి 21న(మంగళవారం) జరగనుంది. కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్న షెయ్ హోప్ను ప్లేయర్ ఆఫ్ ది అవార్డు వరించింది. చదవండి: 36 బంతుల్లో 99 పరుగులు; ఒక్క పరుగు చేసుంటే చరిత్రలో -
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. విండీస్ జట్టు ప్రకటన! నాలుగేళ్ల తర్వాత బౌలర్ రీఎంట్రీ
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు ఇప్పటికే తమ జట్టును ప్రకటించిన క్రికెట్ వెస్టిండీస్.. తాజాగా వన్డే, టీ20 సిరీస్లకు కూడా రెండు వేర్వేరు జట్టులను ఎంపిక చేసింది. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల సుదీర్ఘ సిరీస్లో ప్రోటీస్తో విండీస్ తలపడనుంది. ఫిబ్రవరి 28 నుంచి జరగనున్న తొలి టెస్టుతో విండీస్ పర్యటన ప్రారంభం కానుంది. అదే విధంగా మార్చి 16న విండీస్-ప్రోటీస్ మధ్య జరగనున్న తొలి వన్డేతో పరిమిత ఓవర్ల సిరీస్ మొదలుకానుంది. ఇక వన్డేల్లో షాయ్ హోప్ తొలిసారిగా విండీస్ జట్టుకు నాయకత్వం వహించనుండగా.. రోవ్మన్ పావెల్ అతడికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. మరోవైపు టీ20ల్లో కరీబియన్ జట్టుకు పావెల్ సారథ్యం వహిచంనుండగా.. అతడికి డిప్యూటీగా కైల్ మేయర్స్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇది ఇలా ఉండగా.. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఫాస్ట్ బౌలర్ షానన్ గాబ్రియేల్ తిరిగి విండీస్ వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. 34 ఏళ్ల గాబ్రియేల్ గతేడాది ఆఖరిలో జరిగిన సూపర్-50 వన్డే కప్లో గాబ్రియేల్ అద్భుతంగా రాణించాడు. ఈ నేపథ్యంలోనే అతడికి సెలక్టర్లు మళ్లీ పిలుపునిచ్చారు. గాబ్రియేల్ చివరగా 2019 వన్డే ప్రపంచకప్లో విండీస్ తరపున ఆడాడు. వెస్టిండీస్ వన్డే జట్టు షాయ్ హోప్ (కెప్టెన్), రోవ్మన్ పావెల్ (వైస్ కెప్టెన్), షమర్ బ్రూక్స్, యానిక్ కారియా, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, షానన్ గాబ్రియేల్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్, రొమారియో షెపర్డ్, ఓడియన్ స్మిత్ వెస్టిండీస్ టీ20జట్టు రోవ్మన్ పావెల్ (కెప్టెన్), కైల్ మేయర్స్ (వైస్కెప్టెన్), షమర్ బ్రూక్స్, యానిక్ కారియా, జాన్సన్ చార్లెస్, షెల్డన్ కాట్రెల్, జాసన్ హోల్డర్, అకేల్ హోసిన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఒబెడ్ మెక్కాయ్, నికోలస్ పూరన్, రేమాన్ రీఫర్, రొమారియో షెపర్డ్ చదవండి: IND vs AUS: టీమిండియాను ఓడించడానికి సాయం చేస్తా.. ఒక్క రూపాయి కూడా వద్దు!
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
జగన్ ప్రభుత్వంలోనే బ్రాహ్మణులకు గుర్తింపు
ముస్లింలపై కూటమి కుట్ర
ఆ ఇంటికి నవరత్నాలే జీవనాధారం
నేడు పిఠాపురానికి సీఎం జగన్
కూటమిలో కుమ్ములాట
ఆర్ట్స్ కళాశాలలో సర్టిఫికెట్ కోర్సులు
వైఎస్సార్ సీపీ కార్యకర్తపై దాడి
ఓటమి భయంతో దాడులకు తెగబడుతున్న టీడీపీ
గాండ్ల, తెలుకుల, దేవతెలుకులకు సముచిత స్థానం
మద్యం అక్రమ రవాణాపై కేసులు
తప్పక చదవండి
- సీఎం జగన్కు ఇంత మంది శత్రువులు ఎలా అయ్యారు?
- టీ20లలో సరికొత్త చరిత్ర.. బాబర్ ఆజం ప్రపంచ రికార్డు
- నీతో ప్రచారం చేస్తే నా ఓటమి ఖాయం... కేశినేని చిన్ని
- పశ్చిమలో వెంకన్న సైలెంట్.. అనుచరుల ఆగ్రహం
- కుప్పంలో టీడీపీ గూండాయిజం
- HYD: ఏపీకి క్యూ కట్టిన ప్రజలు.. పలుచోట్ల ట్రాఫిక్ జాం
- 'డబుల్ ఇస్మార్ట్' తర్వాత ఆ ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్న 'రామ్'
- గీతాంజలి పిల్లల పేరిట రూ.20లక్షలు ఎఫ్డీ
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
Advertisement