-
అచ్చం ఆ హీరోయిన్లా... సాహో బ్యూటీ ఫన్నీ రియాక్షన్!
కెమెరామెన్లలో ఐపీఎల్ కెమెరామెన్స్ ప్రత్యేకం.. వీరు గ్రౌండ్లో ఆటపై ఎంత దృష్టిపెడతారో, ఆ ఆటను వీక్షించేందుకు వచ్చిన అందమైన అమ్మాయిలపైనా అంతే దృష్టి సారిస్తారు. ఎప్పటికప్పుడు కొత్త అందాలను వెలుగులోకి తీసుకువస్తుంటారు. స్టేడియంలో సెలబ్రిటీలు దాగి ఉన్నా సరే.. వారిని ఇట్టే పట్టేసుకుంటారు. అలా ఇటీవల ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య పోటీ జరిగింది. అచ్చం హీరోయిన్లా.. ఈ మ్యాచ్లో ఓ అందమైన యువతిని హైలైట్ చేసి తనను కాస్తా వైరల్ చేశారు. చాలామంది ఆమెను హీరోయిన్ శ్రద్ధా కపూర్తో పోల్చారు. ఇది చూసిన శ్రద్దా కపూర్ సోషల్ మీడియాలో ఫన్నీగా స్పందించింది. అచ్చం తనలాగే ఉన్న ఆ అమ్మాయి ఫోటో షేర్ చేస్తూ.. 'హేయ్, అది నేనే' అని నవ్వుతున్న ఎమోజీ షేర్ చేసింది. ఇకపోతే హీరోయిన్కు జిరాక్స్లా ఉన్న ఆమె పేరు ప్రగతి. హీరోయిన్తో కలిసి.. ఒక్క మ్యాచ్తో వైరలైపోయిన ఈ బ్యూటీ మనిద్దరం కలిసి మ్యాచ్ చూద్దాం కదా.. అంటూ శ్రద్దా కపూర్ను ట్యాగ్ చేసింది. మరి ఆమె ఏమని స్పందిస్తుందో చూడాలి! శ్రద్ధా కపూర్ విషయానికి వస్తే.. ఆమె చివరగా తు ఝూటీ మే మక్కర్ అనే హిట్ మూవీలో నటించింది. ప్రస్తుతం స్త్రీ 2 అనే హారర్ మూవీ చేస్తోంది. ఈ చిత్రం ఆగస్టు 31న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: రూ.3 కోట్ల లగ్జరీ కారు కొన్న బిగ్ బాస్ విన్నర్! -
అలాంటి డ్రెస్లో శ్రద్ధాదాస్ హోయలు..కలర్ఫుల్గా కనిపించిన మంచులక్ష్మి!
మెరుపులాంటి డ్రెస్లో శ్రద్ధాదాస్ హోయలు.. సండే మూడ్లో శ్రద్ధా కపూర్... కలర్ఫుల్ డ్రెస్లో మంచులక్ష్మి స్మైలీ లుక్స్.. బాలీవుడ్ భామ దియా మీర్జా ట్రెండీ పోజులు బ్లాక్ డ్రెస్లో శ్రియా శరణ్ బోల్డ్ లుక్స్.. View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Dia Mirza Rekhi (@diamirzaofficial) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) -
‘సాహో’ హీరోయిన్తో ప్రేమలో పడ్డ శ్రేయస్ అయ్యర్?!
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ముందు రంజీ బరిలో దిగడం.. ఆ తర్వాత భారత జట్టులోకి రావడం.. ఆడిన రెండు మ్యాచ్లలో విఫలం కావడం.. ఆపై మళ్లీ రంజీ టోర్నీ ఆడేందుకు వెళ్లడం వంటివి జరిగాయి. ఈ పరిణామాల క్రమం మధ్యలో అయ్యర్.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయాడు కూడా!.. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డాడన్న విమర్శల నేపథ్యంలో బోర్డు అయ్యర్పై వేటు వేసినట్లు తెలిసింది. అయితే, ఈసారి కెరీర్ పరంగా కాకుండా.. వ్యక్తిగత విషయాల నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ పేరు తెరమీదకు వచ్చింది. ఆమెతో డేటింగ్ అంటూ రూమర్లు శ్రేయస్ అయ్యర్ స్నేహితుల జాబితాలో ఓ కొత్త అమ్మాయి చేరినట్లు సమాచారం. అయితే, ఆమెతో కేవలం ఫ్రెండ్షిప్ వరకే అయ్యర్ పరిమితం కాలేదని.. డేటింగ్ కూడా చేస్తూ పరస్పర అభిప్రాయాలు పంచుకుంటూ.. తమ బంధాన్ని మరో లెవల్కు తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యాడని గాసిప్ రాయుళ్లు కథనాలు అల్లేస్తున్నారు. వదంతులకు కారణం ఇదే? ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్. సాహో సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించిన అందాల తార. ఇక శ్రద్ధాతో అయ్యర్ పేరును ముడిపెట్టి కథనాలు రావడానికి కారణం.. ఇటీవల వాళ్లిద్దరు ఓ యాడ్లో కలిసి కనిపించడం.. అదే విధంగా ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరు ఫాలో కావడమే. ఇద్దరు సెలబ్రిటీలు.. అందునా ఓ స్టార్ క్రికెటర్.. ఓ టాప్ హీరోయిన్ ఇలా ఒకరినొకరు ఫాలో కావడంతో నెటిజన్లు ఇలా తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇద్దరూ సీక్రెట్గా డేటింగ్ చేస్తున్నారంటూ అభిప్రాయపడుతున్నారు. వాళ్లంతా బీ-టౌన్ అల్లుళ్లే కాగా క్రికెట్కు, బాలీవుడ్కు విడదీయరాని అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. నవాబ్ అలీ పటౌడీ ఖాన్ నుంచి విరాట్ కోహ్లి.. మొన్నటికి మొన్న కేఎల్ రాహుల్ దాకా.. బాలీవుడ్ నటీమణులను పెళ్లాడిన క్రికెటర్లు చాలా మందే ఉన్నారు. ఏమో శ్రేయస్ అయ్యర్ కూడా ఆ జాబితాలో చేరినా ఆశ్చర్యపడనక్కర్లేదంటున్నారు నెటిజన్లు! అన్నట్లు శ్రద్ధ ఇటీవలే తన 37వ పుట్టినరోజు జరుపుకోగా.. అయ్యర్కు ఇప్పుడు 29 ఏళ్లు! చదవండి: #DhanashreeVerma: అతడితో అలా చహల్ భార్య ధనశ్రీ వర్మ ఫొటో.. -
ఒకపుడు కాఫీ షాప్లో పనిచేసింది..ఒక్క సినిమాతో కలలరాణిగా.. ఎవరీ స్టార్ కిడ్?
యాక్టింగ్లోకి రాకముందు చాలామంది మోడల్గా లేదా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి ఒక్కో మెట్టూ ఎదుగుతూ స్టార్ ఇమేజ్ సంపాదించు కుంటారు. అదే అప్పటికే స్టార్లుగా, సూపర్ స్టార్లుగా పేరు సంపాదించిన వారి పిల్లలైతే ఎలాంటి ఇబ్బందీ లేకుండానే చాలా గ్రాండ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారు. అలాంటి స్టార్ కిడ్స్ను అటు ఇండస్ట్రీ, ఇటు ప్రేక్షకులు కూడా బాగానే ఆదరిస్తారు. మరికొంతమంది . కానీ ప్రముఖ నటుడు కూతురు మాత్రం దీనికి భిన్నం. గ్లామరస్ షోబిజ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ముందు ఆమె ఏం చేసిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఆ నటుడు ఎవరు? ఆయన కూతురు ఎవరు? ఈ వివరాలన్నీ తెలియాలంటే మీరు స్టోరీ చదవాల్సిందే. బాలీవుడ్లో విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు శక్తి కపూర్. విలనిజాన్ని పండించడంలో తనదైన ముద్ర వేసుకున్న నటుడు ఆయన. ఆయన ముద్దుల తనయ శ్రద్ధా కపూర్. 1987, మార్చిలో పుట్టింది. సూపర్ స్టార్ కుటుంబం నేపథ్యం, అందం, ప్రతిభ రెండూ ఉన్నప్పటికీ శ్రద్ధా తొలి చిత్రం (2010లో "తీన్ పట్టి" ) ఫ్లాప్ అయ్యింది. దాదాపు మూడేళ్ల తరువాత గానీ హీరోయిన్గా గుర్తింపు రాలేదు. కానీ 2013లో ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఈ భామ. ఆషికీ సినిమాకు సీక్వెల్గా వచ్చిన ఆషికీ 2 సినిమా ఆరోహి పాత్రతో ఒక్కసారిగా యూత్ కలల రాణిగా అవతరించింది. బాలీవుడ్లో టాప్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరుగా నిలిచింది. ఒక్కో సినిమాకు సుమారు 5 కోట్ల రూపాయలదాకా తీసుకుంటుందని సమాచారం. పెళ్లికిచ్చిన రిటర్న్ గిఫ్ట్ చూసి అతిథులు ఫిదా : ఫాదర్ ఐడియా అదిరింది! "ఏక్ విలన్,’’ "హైదర్", "ABCD", "బాఘీ", "హాఫ్-గర్ల్ఫ్రెండ్" “సాహో” (2019),చిచోరే, “స్ట్రీట్ డ్యాన్సర్” (2020),'తూ ఝూతీ మై మక్కార్' (2023) లాంటి పలు సినిమాల్లో నటించింది. అనేక అవార్డులు, ప్రశంసలను అందుకుంది. "లవ్ కా ది ఎండ్" చిత్రంలో ఉత్తమ నటిగా స్టార్డస్ట్ సెర్చ్లైట్ అవార్డును అందుకుంది. 2014లో మోస్ట్ సెర్చ్డ్ సెలబ్రిటీల మెకాఫీ జాబితాలో 6వ స్థానంలో నిలిచింది. శ్రద్ధా మంచి గాయని కూడా శ్రద్ధా కపూర్ నటన మాత్రమేకాదు పాటలు పాటడంలో కూడా దిట్ట. దివంగత గాయని లతా మంగేష్కర్ , ఆశా భోంస్లేల నుంచి శ్రద్ధాకు వారసత్వంగా వచ్చిన ప్రతిభ ఇదని భావిస్తారు. శ్రద్దాకు చిన్నప్పటి నుంచి పాటలు పాడడం, నటించడం అంటే ఆసక్తి ఉండేదట. సినిమా డైలాగులు రిహార్సల్ చేస్తూ బాలీవుడ్ పాటలకు అద్దం ముందు డ్యాన్స్ చేస్తూ ఉండేదట. అలాగే తండ్రితో పాటు వివిధ షూటింగ్ లొకేషన్లకు కూడా వెళ్లేది. అలా నటనపై ఆసక్తి ఉన్నప్నపటికీ సినిమాల్లోకి రాకముందే తన చదువును పూర్తి చేయాలని భావించింది. అందుకే పదహారేళ్ల వయసులో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ చిత్రంలో ఆఫర్ వచ్చిన ఆఫర్ను తిరస్కరించింది. శ్రద్ధా బోస్టన్ విశ్వ విద్యాలయంలో సైకాలజీ చదువుతున్న క్రమంలో ఆమె అక్కడ కాఫీ షాప్లో కూడా పనిచేసిందని చెబుతారు. శ్రద్ధా ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్లు దాటిపోయింది. హారర్ కామెడీ , డ్యాన్స్ డ్రామా జానర్తో చిత్రాలతోపాటు, గాయనిగా కూడా తనను తాను నిరూపించుకుంటోంది. స్త్రీ-2 తోపాటు ప్రస్తుతం రెండు-మూడు సినిమాలున్నాయని, ఈ ప్రాజెక్ట్లు టైమ్ ట్రావెల్, పురాణాల ఆధారంగా ఉంటాయని ఇటీవల శ్రద్ధా కపూర్ ప్రకటించింది. సోషల్ మీడియా క్రేజ్ ఇన్స్టాలో 86.8 మిలియన్లు, ట్విటర్లో 14.3 మిలియన్ల ఫాలోయర్లుఉన్నారంటేనే సోషల్ మీడియాలో ఆమెకున్న క్రేజ్ను అర్థం చేసు కోవచ్చు. నటనతో పాటు అనేక పాపులర్ బ్రాండ్లకు అంబాసిడర్గా ఉన్న శ్రద్ధా ప్రస్తుత నికర విలువ దాదాపు రూ. 123 కోట్లుగా అంచనా. -
పూజా హెగ్డే గ్లామర్ ట్రీట్... అలాంటి డ్రస్లో 'మన్మథుడు' బ్యూటీ!
మత్తెక్కించే కళ్లతో మాయ చేస్తున్న హీరోయిన్ శ్రద్ధా కపూర్ డిజైనర్ డ్రస్లో హిట్ సినిమాల హీరోయిన్ శ్రుతిహాసన్ బాయ్ ఫ్రెండ్తో కలిసి హీరోయిన్ రెబా బర్త్ డే సెలబ్రేషన్స్ అమెరికాలో చిల్ అవుతున్న 'హనుమాన్' బ్యూటీ అమృత అయ్యర్ స్పా చేయించుకున్నానని చెబుతూ మహేశ్ భార్య నమ్రత పోస్ట్ థైస్ చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న బుట్టబొమ్మ పూజాహెగ్డే సింగింగ్ టాలెంట్ బయటపెట్టిన హాట్ బ్యూటీ అషూరెడ్డి సున్నుండలు చేస్తూ బిజీబిజీగా ఉన్న యాంకర్ అనసూయ వీపు అందాలు చూపిస్తూ మాయ చేస్తున్న 'మన్మథుడు' బ్యూటీ View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by JOE (@joemonjoseph) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Anshu Saggar (@actressanshuofficial) -
ఫ్రెండ్ పెళ్లిలో చిందేసిన బాలీవుడ్ బ్యూటీ.. మరి నీ పెళ్లెప్పుడో?
ఇప్పటి పెళ్లిళ్లు తూతూమంత్రంగా జరగడం లేదు. హల్దీ, సంగీత్, డెస్టినేషన్ వెడ్డింగ్.. ఇలా రకరకాల పేర్లు, ఈవెంట్లతో ధూమ్ధామ్గా జరుపుకుంటున్నారు. సెలబ్రిటీల పెళ్లిళ్లయితే చెప్పనక్కర్లేదు. సెలబ్రిటీల దగ్గర పనిచేసేవారు కూడా బాగానే సంపాదిస్తూ అంతే గ్రాండ్గా పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ దగ్గర పనిచేసే ఆమె హెయిర్ స్టైలిస్ట్ నిఖితా మీనన్ పెళ్లి పీటలెక్కింది. గోవాలో ఆమె పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎనర్జీ డ్యాన్స్ ఈ క్రమంలో అక్కడ పెళ్లికూతురితో పాటు తన ఫ్రెండ్స్తో కలిసి హిందీ పాటకు స్టెప్పులేసింది శ్రద్ధా కపూర్. పింక్, ఆరెంజ్ కలర్ లెహంగా ధరించిన ఈ బ్యూటీ ఎంతో ఎనర్జీగా డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు శ్రద్ధా ఎంత సంతోషంగా, హుషారుగా డ్యాన్స్ చేస్తుందో.. అందరూ పెళ్లి చేసుకుంటున్నారు.. మరి నువ్వెప్పుడు ముహూర్తం పెట్టించుకుంటావ్? అని కామెంట్లు చేస్తున్నారు. సాహోతో తెలుగులో పరిచయం కాగా గతంలో స్త్రీ(2018) సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శ్రద్ధా కపూర్ ఇప్పుడు దాని సీక్వెల్లో నటిస్తోంది. రాజ్కుమార్ రావు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 31న విడుదల కానుంది. అమర్ కౌశిక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే సాహో సినిమాతో ఈ బ్యూటీ తెలుగువారికీ దగ్గరైంది. View this post on Instagram A post shared by Gaurav (Shraddha Kapoor Fanpage) (@teamshraddhakusa) View this post on Instagram A post shared by Gaurav (Shraddha Kapoor Fanpage) (@teamshraddhakusa) View this post on Instagram A post shared by Gaurav (Shraddha Kapoor Fanpage) (@teamshraddhakusa) View this post on Instagram A post shared by Nikita Menon (@nikitamenon1) చదవండి: ఓటీటీలో మలయాళ బ్లాక్బస్టర్ మూవీ.. తెలుగులోనూ చూడొచ్చు! -
మిస్టర్ పొలిశెట్టి బర్త్డే స్పెషల్ ఫోటోలు
-
క్రిస్మస్ ఎనర్జీ
క్రిస్మస్ సెలబ్రేషన్స్కు సంబంధించి బాలీవుడ్ సెలబ్స్ సందడి సోషల్ మీడియాలో కనిపిస్తోంది. పాత, కొత్త అనే తేడా లేకుండా తారల క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. తారలలో కొందరు తమ క్రిస్మస్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. క్రిస్మస్ తన ఫేవరెట్ ఫెస్టివల్ అని చెబుతోంది బాలీవుడ్ కథానాయిక జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ‘క్రిస్మస్కు సంబంధించి బాల్యజ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. పిల్లలకు బాగా నచ్చే పండగ ఇది. నా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎక్కువగా బహ్రెయిన్లో జరిగాయి. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది అక్కడే. చిన్నప్పుడు క్రిస్మస్కు ముందురోజు రాత్రి బొమ్మల దుకాణంలో అందమైన బార్బీ బొమ్మను చూశాను. అది నాకు బాగా నచ్చింది. అదేరోజు అర్ధరాత్రి ప్రార్థనల తర్వాత శాంటా క్లాజ్ నుంచి అచ్చం అలాంటి బొమ్మే అందింది. ఓ మై గాడ్, శాంటా ఈజ్ సో కూల్ అనుకున్నాను’ అంటూ గత జ్ఞాపకాల్లోకి వెళ్లింది ఫెర్నాండేజ్. ‘క్రిస్మస్ ఎనర్జీ’ పేరుతో క్రిస్మస్ జ్ఞాపకాల ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేయడంలో ముందుంటుంది శ్రద్ధా కపూర్. -
సొగసైన కారుపై 'సాహో' భామ
-
Shraddha Kapoor: లంబోర్గిని కారు కొన్న శ్రద్ధా కపూర్ (ఫోటోలు)
-
నాలుగు కోట్ల కారు కొన్న స్టార్ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్!
2010లో టీన్ పట్టి చిత్రంలో ఓ చిన్న పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చిన భామ శ్రద్ధా కపూర్. లవ్ కా ది ఎండ్ సినిమాలో హీరోయిన్గా కనిపించింది. ఆ తర్వాత ఆషికి-2 చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనంతరం హైదర్, ఏక్ విలన్, ఏబిసిడి, భాగీ చిత్రాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఈ ఏడాది రణ్బీర్ కపూర్ సరసన తూ ఝూతీ మైన్ మక్కర్ చిత్రంలో నటించింది. తాజాగా ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేసింది. (ఇది చదవండి: స్టార్ కమెడియన్ కూతురు బర్త్ డే.. హాజరైన అగ్ర హీరోలు!) అత్యంత ఖరీదైన లంబోర్గిని హురాకేన్ టెక్నికా అనే మోడల్ కారును సొంతం చేసుకుంది. దసరా సందర్భంగా లగ్జరీ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ కారు విలువ దాదాపు రూ.4 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని శ్రద్ధా కపూర్ ఫ్రెండ్ సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ సందర్భంగా పలువురు బాలీవుడ్ తారలు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాగా.. ప్రస్తుతం ఆమె రాజ్ కుమార్ రావు సరసన స్ట్రీట్-2 చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని 2018లో వచ్చిన హారర్ కామెడీ చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కిస్తున్నారు. (ఇది చదవండి: 'పదేళ్ల పనిని వారంలో చేశారు'.. ఆ డైలాగ్పై నటుడి ప్రశంసలు!) View this post on Instagram A post shared by Pooja Choudary (@poojachoudary_9) -
‘మహాదేవ్’ లూటీ రోజుకు రూ.200 కోట్లు
మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారిన వ్యవహారమిది. బాలీవుడ్ ప్రముఖ నటులకు ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. యాప్పై దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గత నెలలో భారత్లో 39 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. రూ.417 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లు, ఆభరణాలు, నగదు స్వా«దీనం చేసుకుంది. యాప్ కోసం ప్రచారం చేసిన బాలీవుడ్ నటులు రణబీర్ కపూర్, శ్రద్ధ కపూర్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే నలుగురి నిందితులను అదుపులోకి తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ యాప్ బాగోతం బయటపడింది. ► ఛత్తీస్గఢ్లోని భిలాయి పట్టణానికి చెందిన సౌరభ్ చంద్రశేఖర్, రవి ఉప్పల్ దుబాయ్లో మకాం వేసి, మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ను ఆపరేట్ చేస్తున్నారు. ► కొత్తకొత్త వెబ్సైట్లు, చాటింగ్ యాప్ల ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తారు. ఆన్లైన్లో బెట్టింగ్ల్లో భారీగా లాభాలు వస్తాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. ► తమ వలలో చిక్కిన కస్టమర్లతో వాట్సాప్లో గ్రూప్లు ఏర్పాటు చేస్తారు. వారితో నేరుగా ఫోన్లలో మాట్లాడరు. వాట్సాప్ ద్వారానే సంప్రదిస్తుంటారు. ► కస్టమర్లను బెట్టింగ్ యాప్లో సభ్యులుగా చేర్చి, యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తారు. తర్వాత వారితో నగదు జమ చేయించుకుంటారు. ఈ వ్యవహారాన్ని మహాదేవ్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్లు పర్యవేక్షిస్తుంటారు. ఈ డబ్బంతా తప్పుడు పత్రాలతో తెరిచిన యాప్ నిర్వాహకుల బినామీ బ్యాంకు ఖాతాల్లోకి చేరుతుంది. ► యాప్లో బెట్టింగ్లు కాస్తే తొలుత లాభాలు వచి్చనట్లు నమ్మిస్తారు. దాంతో కస్టమర్లో ఆశ పెరిగిపోతుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేలా అతడిని ప్రేరేపిస్తారు. చివరకు అదంతా నష్టపోయేలా బెట్టింగ్ యాప్లో రిగ్గింగ్ చేస్తారు. మళ్లీ కొత్త బకరా కోసం వేట మొదలవుతుంది. ► మహాదేవ్ బెట్టింగ్ యాప్ సంపాదన ప్రతిరోజూ రూ.200 కోట్లు ఉంటుందని ఈడీ దర్యాప్తులో తేలింది. ► భారత్, మలేసియా, థాయ్లాండ్, యూఏఈలో మహాదేవ్ యాప్నకు వందలాది కాల్ సెంటర్లు ఉన్నాయి. ప్రధాన కార్యాలయం యూఏఈలో ఉంది. నాలుగు దేశాల్లో పెద్ద సంఖ్యలో బినామీ బ్యాంకు ఖాతాలు తెరిచారు. ► భారత్లోని 30 కాల్ సెంటర్లను అనిల్ దమానీ, సునీల్ దమానీ నిర్వహిస్తున్నారు. వీరిద్దరిని ఈడీ అరెస్టు చేసింది. ► బెట్టింగ్ యాప్ జోలికి రాకుండా ఉండడానికి పోలీసులకు, రాజకీయ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు నిర్వాహకులు హవాలా మార్గాల్లో లంచాలు ఇచి్చనట్లు వెల్లడయ్యింది. ► బెట్టింగ్ సిండికేట్ నడిపిస్తున్న ఓ యాప్ను బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ప్రమోట్ చేస్తున్నట్లు ఈడీ చెబుతోంది. ► ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్లో ఓ పెళ్లి నిర్వహణకు రూ.200 కోట్లు నగదు రూపంలో చెల్లించారు. దీనిపై దర్యాప్తు చేయగా మహాదేవ్ బెట్టింగ్ యాప్ గురించి బయటపడింది. ఈ పెళ్లిలో రణబీర్ కపూర్, శ్రద్ధాకపూర్, కపిల్ శర్మ, హీనా ఖాన్తోపాటు మరికొందరు బాలీవుడ్ నటులు ప్రదర్శన ఇచ్చారు. వారికి హవాలా మార్గంలో రూ.కోట్లలో చెల్లింపులు చేసినట్లు తేలింది. పెళ్లిలో ప్రదర్శన ఇవ్వడానికి 17 మంది బాలీవుడ్ సెలబ్రిటీలను చార్టర్డ్ విమానంలో దుబాయ్కి తీసుకెళ్లారని ఈడీ అధికారులు వెల్లడించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
డేటింగ్లో స్టార్ హీరోయిన్.. ముచ్చటగా మూడోసారి!
బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. ఆమె ప్రముఖ నటుడు శక్తి కపూర్ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 2010లో టీన్ పట్టి సినిమాలో ఒక చిన్న పాత్ర ద్వారా కెరీర్ ప్రారంభించిన శ్రద్ధా.. లవ్ కా ది ఎండ్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 2013లో విడుదలైన ఆషికి- 2 చిత్రంలో నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలోని ఆమె నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి నామినేషన్ కూడా లభించింది. శ్రద్దా సినిమాల్లో నటించడంతో పాటు మంచి సింగర్ కూడా. తన సినిమాల్లో చాలా పాటలు పాడింది. (ఇది చదవండి: ప్రతి తండ్రికి ఈ పాట అంకితం: మహేశ్ బాబు ప్రశంసలు) అయితే తాజాగా ఈ భామకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట తెగ వైరలవుతోంది. గతంలో ఆషికి-2 నటుడు ఆదిత్య రాయ్కపూర్తో డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. వారి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ చూసి.. ఆఫ్ స్క్రీన్లోనూ రిలేషన్లో ఉన్నారని అప్పట్లో టాక్ వినిపించింది. ఆ తర్వాత ప్రముఖ ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో చెట్టాపట్టాలేసుకుని పలు పార్టీలకు హాజరైంది. ఆ సమయంలో శ్రద్దా కపూర్పై డేటింగ్ రూమర్స్ వచ్చాయి. తాజాగా శ్రద్ధా కపూర్ అతనితో డేటింగ్లో ఉందన్న వార్త బీటౌన్లో హాట్టాపిక్గా మారింది. తు జూతీ మైన్ మక్కర్' చిత్రానికి సహ రచయితగా పనిచేసిన రాహుల్ మోడీతో శ్రద్ధా కపూర్ డేటింగ్ చేస్తోందని బీ టౌన్ టాక్. అయితే ఈ రూమర్స్పై ఇప్పటివరకు అధికారికంగా ఎవరూ స్పందించలేదు. అయితే ఈ జోడీ రిలేషన్లో ఉన్నట్లు వస్తున్న వార్తలపై ఫ్యాన్స్ ఆసక్తి చూపుతున్నారు. నెటిజన్స్ సైతం న్యూ లవ్ బర్డ్స్ ఇన్ బాలీవుడ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇటీవలే మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో శ్రద్ధా కపూర్కు ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: 'నా భార్య అర్థం చేసుకుంటది.. నువ్వు నా మాట విను'.. ప్రశాంత్పై శివాజీ ఎమోషనల్!) కాగా.. తూ ఝూతీ మైన్ మక్కర్ చిత్రం 2023లో విడుదలైంది. లవ్ ఫిల్మ్స్, టి-సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్లపై లవ్ రంజన్, అంకుర్ గార్గ్ నిర్మించిన ఈ సినిమాకు లవ్ రంజన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్, శ్రద్ధా కపూర్, డింపుల్ కపాడియా, అనుభవ్ సింగ్ బస్సీ ప్రధాన పాత్రల్లో నటించారు. -
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. స్టార్ హీరోయిన్కు సమన్లు!
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ కేసులో రణ్బీర్ కపూర్, కపిల్ శర్మ, హీనా ఖాన్, హ్యూమా ఖురేషికి సమన్లు జారీ చేసిన ఈడీ తాజాగా మరో నటి శ్రద్ధా కపూర్కు సైతం నోటీసులిచ్చారు. ఇవాళ ఈడీ ముందు హాజరవ్వాలని నోటీసుల్లో ప్రస్తావించగా.. రణ్బీర్ కపూర్ హాజరయ్యేందుకు రెండు వారాల గడువు కోరారు. అయితే ఈరోజు శ్రద్ధా కపూర్ ఈడీ ముందుకు హజరవుతారా? లేదా అన్నది తెలియాల్సి ఉంది. (ఇది చదవండి: బాలీవుడ్లో బెట్టింగ్ యాప్ ప్రకంపనలు.. ప్రముఖులకు ఈడీ సమన్లు..!) ఈ కేసులో ఇప్పటికే నోటీసులు అందుకున్న కపిల్ శర్మ, హుమా ఖురేషి, హీనా ఖాన్లకు కూడా వేర్వేరు తేదీల్లో సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే వీరంతా కూడా ఈడీ ముందు హాజరు కావడానికి రెండు వారాల సమయం కోరినట్లు తెలిపారు. అయితే ఈ కేసులో వీరందరినీ నిందితులుగా ఎక్కడా ప్రస్తావించలేదు. కేవలం యాప్ ప్రమోటర్లు వారికి చేసే చెల్లింపు విధానం మాత్రమే ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. రణబీర్ కపూర్ మహదేవ్ యాప్ను ప్రమోట్ చేస్తూ పెద్ద మొత్తంలో డబ్బు అందుకున్నట్లు ఈడీ పేర్కొంది. -
బాయ్ఫ్రెండ్తో కనిపించిన సాహో భామ.. సోషల్ మీడియాలో వైరల్!
బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. ఆషిక్-2 సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న ఆ తర్వాత పలు చిత్రాల్లో ఛాన్సులు కొట్టేసింది. ఈ ఏడాది రణ్బీర్ కపూర్ సరసన తూ జూటి మెయిన్ మక్కర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. హిందీలో బాగీ, ఎక్ విలన్, హాఫ్ గర్ల్ఫ్రెండ్, స్త్రీ, ఓకే జాను లాంటి చిత్రాల్లో నటించింది. టాలీవుడ్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన సాహో చిత్రంలో కనిపించింది శ్రద్ధా కపూర్. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించినస్థాయిలో మెప్పించలేకపోయింది. (ఇది చదవండి: హ్యాపీ బర్త్ డే బాబాయ్.. ఉపాసన స్పెషల్ విషెస్!) అయితే తాజాగా ఈ సాహో భామ ముంబయిలో ఓ థియేటర్ వద్ద కనిపించి ఫ్యాన్స్ను ఆశ్చర్యానికి గురిచేసింది. సినిమా చూసి బయటకు వస్తుండగా కెమెరాల కంటికి చిక్కింది. అయితే ఆమెతో పాటు బాయ్ఫ్రెండ్ రాహుల్ కూడా ఉన్నారు. ఇద్దరు కలిసి థియేటర్లో సినిమా చూసి వెళ్తుండగా ఫోటోలకు పోజులిచ్చింది. దీంతో వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ బీ టౌన్లో చర్చ మొదలైంది. కానీ ఇంతవరకు వీరి రిలేషన్పై ఎక్కడా స్పందించలేదు. అయితే వీరిద్దరు వేరు వేరు కార్లలో అక్కడ నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. రాహుల్ తూ జూతీ మైన్ మక్కార్ సినిమాకు రచయితగా వ్యవహరించారు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా నటించారు. అంతే కాకుండా రాహుల్ ప్యార్ కా పంచ్నామా- 2, సోను కే టిటు కి స్వీటీతో సహా లవ్ రంజన్ చిత్రాలకు కూడా పనిచేశాడు. కాగా.. గతంలో శ్రద్ధా కపూర్.. సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో కొన్నాళ్లుగా రిలేషన్ షిప్లో ఉన్నట్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరు 2022లో విడిపోయినట్లు బీ టౌన్లో రూమర్స్ వినిపించాయి. (ఇది చదవండి: విజయ్ వర్మను ప్రేమించడానికి కారణమదే.. కానీ ఇది ఊహించలేదు: తమన్నా) View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
డ్రగ్స్ కేసులో హీరోయిన్ సోదరుడు.. పార్టీ లోపలి వీడియో వైరల్..
Siddhanth Kapoor Inside Party Video Goes Viral After Consuming Drugs: మొన్నటి ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు మరవకముందే బాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తోంది. స్టార్ హీరోయిన్ సోదరుడు, వెటరన్ యాక్టర్ శక్తి కపూర్ తనయుడు సిద్దాంత్ కపూర్ను పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఆదివారం (జూన్ 12) రాత్రి బెంగళూరులో పార్టీ జరుగుతున్న హోటల్పై పోలీసులు దాడి చేయగా పలువురు డ్రగ్స్ సేవించినట్లు నిర్ధారించారు. వారిలో సిద్ధాంత్ కపూర్ కూడా ఉన్నట్లు ధృవీకరించారు. సిద్ధాంత్తోపాటు మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆరుగురు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరిని ఉల్సూరు పోలీస్ స్టేషన్కు తరిలించినట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్గా మారింది. సిద్ధాంత్ అరెస్ట్ అయిన కొద్ది గంటల తర్వాత ఈ వీడియో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో సిద్ధాంత్ డీజే ప్లే చేస్తూ కనిపించాడు. అతను ప్లే చేస్తున్న సంగీతానికి పార్టీలోని వారంతా డ్యాన్స్ చేయడం మనం చూడొచ్చు. చదవండి: ఇటలీలో ఫ్యామిలీతో మహేశ్ బాబు.. ఫొటో వైరల్.. View this post on Instagram A post shared by Whatsinthenews (@_whatsinthenews) కాగా సిద్ధాంత్.. సల్మాన్ ఖాన్ 'జుడ్వా' చిత్రంతో బాలనటుడిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో రంగీలా పాత్రలో కనిపించాడు. 'భాగమ్ భాగ్', 'చుప్ చుప్కే', 'భూల్ భులాయా' సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గానూ పని చేశాడు. 'అగ్లీ', 'జజ్బా', 'భూత్: పార్ట్ 1', 'చెహ్రే' వంటి పలు సినిమాల్లో నటించాడు. తన సోదరి శ్రద్ధా కపూర్తో కలిసి 'హసీనా పార్కర్' సినిమాలోనూ నటించాడు. -
డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డ హీరోయిన్ సోదరుడు
బెంగళూరు: సినీ ఇండస్ట్రీని డ్రగ్స్ కేసులు పట్టి పీడిస్తున్నాయి. ఆ మధ్య షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కుని జైలు శిక్ష అనుభవించిన విషయం తెలిసిందే కదా! ఇది మరవకముందే బాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తోంది. స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ సోదరుడు సిద్దాంత్ కపూర్ను పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం రాత్రి బెంగళూరులోని రేవ్ పార్టీ జరుగుతున్న హోటల్పై పోలీసులు దాడి చేయగా పలువురు డ్రగ్స్ సేవించినట్లు నిర్ధారించారు. వారిలో సిద్ధాంత్ కూడా ఉన్నట్లు ధృవీకరించారు. అతడితో పాటు డ్రగ్స్ తీసుకున్న మరో ఐదుగురిని ఉల్సూర్ పోలీస్ స్టేషన్కు తరలిచామని పోలీసులు పేర్కొన్నారు. ఈ విషయంపై సిద్ధాంత్ తండ్రి శక్తి కపూర్ స్పందిస్తూ ఇది నమ్మశక్యంగా లేదని, ఇలా జరిగే ఛాన్సే లేదని పేర్కొన్నాడు. తన కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేయలేదని, అదుపులోకి మాత్రమే తీసుకున్నారని స్పష్టం చేశాడు. కాగా సిద్ధాంత్.. సల్మాన్ ఖాన్ 'జుడ్వా' చిత్రంతో బాలనటుడిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో రంగీలా పాత్రలో కనిపించాడు. 'భూల్ భులాయా', 'చుప్ చుప్కే' సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గానూ పని చేశాడు. 'అగ్లీ', 'జజ్బా', 'భూత్: పార్ట్ 1' వంటి పలు సినిమాల్లో నటించాడు. తన సోదరి శ్రద్ధా కపూర్తో కలిసి 'హసీనా పార్కర్' మూవీలోనూ నటించాడు. Actor Shraddha Kapoor's brother Siddhanth detained in Bengaluru for consuming drugs Read @ANI Story | https://t.co/3pl5WyDdnn#ShraddhaKapoor #Siddhanth #Bengaluru #Detained pic.twitter.com/AYvMSOEAHo — ANI Digital (@ani_digital) June 13, 2022 చదవండి: మాజీ భర్త మోసం చేస్తే సల్మాన్ సాయం చేశాడు -
వరస్ట్ కండీషన్స్, డిప్రెస్డ్ ఫీలింగ్స్.. మీకోసమే ఇది.. ఒక్కసారి చదివితే!
‘సాహో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన శ్రద్ధా కపూర్కు పుస్తకాలు శ్రద్ధగా చదువుకోవడం చాలా ఇష్టమైన పని. ఆమెకు బాగా నచ్చిన పుస్తకాల్లో ఒకటి...మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్. ఈ పుస్తకం గురించి తెలుసుకుందాం... ‘ఈ జీవిత పరమార్థం ఏమిటి?’ అనే బరువైన ప్రశ్నకు అంతకంటే బరువైన సమాధానాలు చెప్పిన పుస్తకాలు వచ్చాయి. చాలా తేలికగా చెప్పిన పుస్తకాలు వచ్చాయి. ఈ పరంపరలోనిదే ఈ పుస్తకం. ఆస్ట్రియా న్యూరోలజిస్ట్, సైకియాట్రిస్ట్ రాసిన పుస్తకం...మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్. ఎంత గట్టి మనిషికి అయినా బేలగా మారిపోయి నిరాశలోకి జారిపోయే సందర్భాలు ఎదురవుతుంటాయి. వరస్ట్ కండీషన్స్, డిప్రెస్డ్ ఫీలింగ్స్ నుంచి బయటపడడానికి ఎంతో ఉపకరించే పుస్తకం ఇది. ‘లోగోథెరపీ’ ఫౌండర్గా ప్రసిద్ధి పొందిన విక్టర్ ఫ్రాంక్ల్ ఈ పుస్తకంలో తన నిజజీవిత సంఘటనలు, కేస్స్టడీస్లను ఉదహరించారు. పేథాలాజికల్ టర్మ్స్ను ఉపయోగించి వాటి గురించి వివరించారు. ఫస్ట్ సెక్షన్లో కాన్సన్ట్రేషన్ క్యాంపులలో ఖైదీల దుర్భర జీవితాన్ని గురించి వివరిస్తారు. ఆ అనుభవం తనకు స్వయంగా ఉండడం, ఇతర ఖైదీలతో మాట్లాడే అవకాశం లభించడంతో బలంగా రాయగలిగారు. మొదటి సెక్షన్ ముగిసేలోపు ‘జీవితపరమార్థం ఏమిటి?’ అనే ప్రశ్నకు సమాధానం దొరికినట్లే అనిపిస్తుంది. రెండో సెక్షన్లో లోగోథెరపీ అంటే ఏమిటి? లోగోథెరపీకి, సైకోఎనాలసిస్కు మధ్య ఉండే తేడా ఏమిటి? అనేది తెలియజేస్తారు. ఎగ్జిస్టెన్షియల్ వాక్యూమ్, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సర్వైవల్.... మొదలైన ‘లోగోథెరపీ’ కాన్సెప్ట్ల గురించి వివరంగా తెలియజేస్తారు. ‘ఖాళీ ఛాంబర్లోకి గ్యాస్ వదిలితే కొద్దిసేపట్లోనే ఆ గ్యాస్ ఛాంబర్ను పూర్తిగా ఆక్రమిస్తుంది. ఆ ఛాంబర్ పెద్దదా? చిన్నదా? అనేది విషయం కాదు. గ్యాస్ అంతటా విస్తరించడం అనేది వాస్తవం’ ‘గ్యాస్’ అనేది సమస్య అనుకుంటే అది ఎంతైనా విస్తరిస్తుంది. 170 పేజీల ‘మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్’ పుస్తకం ‘షార్ట్ అండ్ స్వీట్’ అని పేరు తెచ్చుకుంది. ఈ పుస్తకాన్ని ఒక్కరోజులో చదివేయవచ్చు. ఆలోచిస్తూ ఆలోచిస్తూ, మనలోకి మనం ప్రయాణం చేస్తూ సంవత్సరాలు చదివేయవచ్చు. జీవితం అనేది అదుపుతప్పిన బండిలా పరుగులు తీస్తున్నప్పుడో, లక్ష్యం లేని బాణంలా దూసుకుపోతున్నప్పుడో, మనిషిగా కాకుండా మనకు మనమే భౌతికవస్తువుగా అనిపిస్తున్నప్పుడో... ఒక ప్రశ్న తప్పనిసరిగా వేసుకోవాల్సిందిగా చెబుతుంది ఈ పుస్తకం. ‘జీవిత పరమార్థం ఏమిటి?’ ఈ ప్రశ్న తీసుకువచ్చే సమాధానం మన జీవితాన్ని వెలుగుమయం చేయవచ్చు. వేనవేల కొత్తశక్తులను బహుమానంగా ఇవ్వవచ్చు. చదవండి👉🏾 ∙ Pooja Hegde: థింకింగ్, ఫాస్ట్ అండ్ స్లో.. ‘రెండూ అబద్ధాలే ఎందుకు కాకూడదు’! -
ప్రియుడితో బ్రేకప్ తర్వాత తొలిసారి పోస్ట్ చేసిన శ్రద్దా కపూర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ బ్రేకప్ ఇప్పుడు బీటౌన్లో హాట్ టాపిక్గా మారింది. నాలుగేళ్లుగా ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో ప్రేమలో మునిగి తేలుతున్న శ్రద్దా ఊహించని విధంగా బ్రేకప్ చెప్పేయడం ఆమె అభిమానులకు షాకింగ్గా అనిపింస్తుంది. బాలీవుడ్లో క్యూట్ కపుల్గా పేరు తెచ్చుకున్న ఈ జంట అనూహ్యంగా విడిపోవడం ఏంటని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. దీనిపై ఇంతవరకు వీరిద్దరు స్పందించకపోయినా వీరి బ్రేకప్ నిజమేనని బీటౌన్లో జోరుగా ప్రచారం జరుగుతుంది.చదవండి: ప్రియుడితో స్టార్ హీరోయిన్ బ్రేకప్!.. నాలుగేళ్ల బంధానికి ముగింపు గత నాలుగేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న వీరిద్దరూ ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారని అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ ఊహించని విధంగా బ్రేకప్తో తమ లవ్స్టోరికి ఎండ్కార్డ్ వేసేశారు. గోవాలో జరిగిన శ్రద్దా కపూర్ బర్త్డే పార్టీ ఈ రూమర్స్కి మరింత బలం చేకూర్చింది. కాగా సోషల్ మీడియాలో శ్రద్దా బ్రేకప్పై జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె తొలిసారిగా స్పందించింది. ఇన్స్టాగ్రామ్లో ఓ ఫోటోను షేర్ చేస్తూ.. ఔర్ సునావో( ఇంకా వినిపించండి)అంటూ క్యాప్షన్ ఇచ్చింది. సాహో చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకి దగ్గరైన శ్రద్దా రణబీర్ కపూర్ సరసన ఓ సినిమా చేస్తుంది. వీటితో పాటు`చాల్ బాజ్`..`నాగిన్` లాంటి సినిమాలు చేతిలో ఉన్నాయి. చదవండి: 'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్ వాడిన బైక్ కోసం అంత ఖర్చయిందా? -
ప్రియుడితో స్టార్ హీరోయిన్ బ్రేకప్!.. నాలుగేళ్ల బంధానికి ముగింపు
Shraddha Kapoor Rohan Shrestha Break Up: చిత్ర పరిశ్రమలో ప్రేమ వ్యవహారాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడిపోవడం చూస్తుంటాం. ఇటీవలి కాలంలో బ్రేకప్ కహానీలు మరీ ఎక్కువగా చూస్తున్నాం. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ ప్రియుడికి బ్రేకప్ చెప్పేసింది. బాయ్ఫ్రెండ్ రోహన్ శ్రేష్టతో నాలుగేళ్ల ప్రేమ బంధానికి ముగింపు పలుకుతూ అతడి నుంచి విడిపోయింది. దీనిపై ఇంతవరకు ఇద్దరూ స్పందించలేదు. గత కొన్నాళ్లుగా సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ రోషన్ శ్రేష్ట- శ్రద్దా ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. పార్టీలు, పబ్లు, టూర్స్ అంటూ పలుమార్లు మీడియాకు చిక్కిన వీరిద్దరూ ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారని అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి. అయితే అనూహ్యంగా నాలుగేళ్ల లవ్స్టోరీకి ఫుల్స్టాప్ పెట్టేశారు. అయితే విడిపోవడానికి గల కారణాలు ఏంటి అన్నది మాత్రం ఇంకా తెలియలేదు. ఇటీవలె గోవాలో శ్రద్దాకపూర్ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. స్నేహితుల,సన్నిహితులు అంతా హజరయ్యారు. కానీ ప్రియుడు రోహన్ మాత్రం హాజరు కాలేదు. సోషల్ మీడియాలో కూడా రోహాన్ బర్త్డే విషెస్ చెప్పలేదు. దీంతో వీరిద్దరి బ్రేకప్ నిజమేనని బీటౌన్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. -
సౌకర్యంగా ఉంటేనే కాన్ఫిడెంట్గా కనిపిస్తాం
సెట్స్ మీద స్క్రిప్ట్లోని పాత్రల పట్లే కాదు ఆఫ్సెట్స్లో అటెండ్ అవబోతున్న అకేషన్స్కి ధరించబోయే అవుట్ ఫిట్స్ మీదా అంతే శ్రద్ధ పెడుతుంది శ్రద్ధా కపూర్! అందుకే హీరోయిన్గా ఆమెకు ఎంత క్రేజో... ఫ్యాషన్ దివాగానూ ఆమె పట్ల అంతే అభిమానం సినీప్రియులకు. ఆమెను దివానీగా మార్చిన బ్రాండ్స్ ఇవే.. సౌకర్యంగా ఉండే దుస్తులనే ఇష్టపడతా. సౌకర్యంగా ఉంటేనే కాన్ఫిడెంట్గా కనిపిస్తాం. అందుకే నా దృష్టిలో ఫ్యాషన్ అంటే సౌకర్యం. ఆత్మవిశ్వాసానికి ప్రతిబింబం. – శ్రద్ధా కపూర్ ఐవరీ లెహెంగా డిజైనర్: అనీతా డోంగ్రే ధర:రూ. 1,99,000 త్యానీ బంగారు, వజ్రాభరణాలను భారతీయులు ఇష్టపడ్డంతగా ప్రపంచంలో ఇంకెవరూ ఇష్టపడరు. నగలు చేయించడమంటే ఒకరకంగా ఆస్తిని కూడబెట్టడమే మన దగ్గర. అదో ఆనవాయితీగానూ స్థిరపడింది. ఈ పాయింటే ‘త్యానీ’ బ్రాండ్ స్థాపనకు ప్రేరణనిచ్చింది. దీని వెనకున్న వ్యక్తి కరణ్ జోహార్. మీరు సరిగ్గానే చదివారు. బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు, నటుడు కరణ్ జోహారే. తన సృజన తృష్ణకు మరో విండోనే ఈ ‘త్యానీ’. భారతీయ సంప్రదాయ నగలను ఆధునిక మహిళ అభిరుచికి తగ్గట్టుగా మలుస్తోందీ త్యానీ. అదే దాని మార్క్.. బ్రాండ్ వాల్యూనూ! 27 వేల రూపాయల నుంచి లక్షల్లో పలుకుతుంది త్యాగీ జ్యూయెలరీ. అనీతా డోంగ్రే బాల్యంలోని సెలవులను జైపూర్లోని అమ్మమ్మ, తాతయ్య ఇంట్లో గడపడం వల్ల స్థానిక సంప్రదాయ కుట్లు, అల్లికలను చూస్తూ పెరిగింది అనీతా డోంగ్రే. దాంతో చిన్నప్పుడే ఫ్యాషన్, డిజైనింగ్ పట్ల మక్కువ పెంచుకుంది. అందుకే పెద్దయ్యాక ఫ్యాషన్ డిజైన్లో డిగ్రీ చేసింది. సంప్రదాయ కళకు ఆధునిక హంగులను జోడించి సరికొత్త డిజైన్స్ను రూపొందించింది. ఆ సృజనే ఆమె బ్రాండ్ వాల్యూగా మారింది. అంతేకాదు ఎంతో మంది గ్రామీణ మహిళలకు చక్కటి ఉపాధినీ ఇస్తోంది. ఆమె ప్రత్యేకతల్లో ఇంకో మాటా చేర్చాలి. అనీతా డోంగ్రే డిజైన్స్ పర్యావరణ ప్రియంగా ఉంటాయి. రసాయన రంగులు, లెదర్, ఫర్ వంటివి ఉండవు. -
పెళ్లికి సిద్ధమవుతున్న మరో స్టార్ హీరోయిన్, హింట్ ఇచ్చిన నటి
Actress Padmini Kolhapure Hints Shraddha Kapoor Marriage To Be Soon: బాలీవుడ్ యంగ్ స్టార్స్ వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే రాజ్కుమార్, పత్రలేఖ వివాహం చేసుకోగా నేడు(డిసెంబర్ 9, 2021) విక్కీ కౌశల్-కత్రీనా కైఫ్లు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇక త్వరలోనే రణ్బీర్ కపూర్-అలియా భట్లు కూడా ఒకటి కాబోతున్నారు. ఈ క్రమంతో మరో బి-టౌన్ బ్యూటీ పెళ్లికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రముఖ హీరోయిన్ శ్రద్ధా కపూర్ త్వరలోనే పెళ్లి చేసుకుని సెటిలైపోవాలనుకుంటుందట. చదవండి: ఊహ నన్ను చూసి వణికిపోయింది: శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు కాగా కొంతకాలంగా సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్టతో శ్రద్ధా ప్రేమలో ఉన్నట్లు బి-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాక శ్రద్ధా కజిన్ పెళ్లి వేడుకల్లో రోహాన్ సందడి చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో శ్రద్దా-రోహాన్లు నిజంగా డెటింగ్లో ఉన్నట్లు ఫిక్సైయిపోయారు. కాగా శ్రద్ధా కపూర్ వివాహాంపై సీనియర్ నటి, ఆమె బంధువు పద్మిని కొల్హాపురి తాజాగా ఓ హింట్ ఇచ్చింది. పద్మిని కొల్హాపురి గతంలో తను పాడిన పాటను మళ్లీ రీక్రియేట్ చేసింది. శ్రద్ధ ఈ పాటను ఇన్స్టాగ్రామ్లో తన అభిమానులతో షేర్ చేసుకుంది. చదవండి: Katrina-Vicky wedding: సినీ స్టార్ట్స్తోపాటు, అంబానీ ఫ్యామిలీ దీనికి స్పందించిన పద్మిని ‘నీ పెళ్లిలో ఈ పాటనే పాడుబోతున్న’ అని రిప్లై ఇచ్చింది. దీంతో శ్రద్ధా వివాహం అతి త్వరలోనే ఉండబోతుందంటూ ఆమె ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతున్నారు. ఈ నేపథ్యంలో శ్రద్ధా వివాహం త్వరలోనే అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ప్రభాస్ ‘సాహో’ సినిమాతో తెలుగు సినీ ప్రియులను ఆకట్టుకున్న శ్రద్ధా కపూర్… శక్తి కపూర్ ముద్దుల తనయగా బాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తన అందం, అభినయంతో హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ‘ఆషికీ-2’ , ‘భాఘి’ సిరీస్, ‘ఏక్ విలన్’, ‘హాఫ్ గర్ల్ ఫ్రెండ్’, ‘హైదర్’, ‘స్ట్రీట్ డ్యాన్సర్’, ‘చిచ్చోరే’ తదితర హిట్ సినిమాలతో క్రేజీ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) -
'సలార్'లో ఆ సీన్ రీషూట్.. స్పెషల్ సాంగ్లో 'సాహో' బ్యూటీ ?
Interval Scenes From Salaar Movie May Be Reshoot: దర్శకధీరుడు రాజమౌళి తీసిన 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన డార్లింగ్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా స్టార్గా అవతరించాకా ప్రభాస్ నుంచి రాబోతున్న మరో భారీ యాక్షన్ చిత్రం 'సలార్'. కేజీఎఫ్తో అద్భుతమైన హిట్ సొంత చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తున్న 'సలార్' చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇండియన్ స్క్రీన్పైనే మోస్ట్ అవైటెడ్ మూవీగా 'సలార్' మారింది. అయితే ఈ అంచనాలను అందుకోవాలని తపనతో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి సంబంధించి ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కావడం లేదు. అయితే సలార్ ఇంటర్వెల్ సీక్వెన్స్ను మళ్లీ రీషూట్ చేస్తున్నారట. నిజానికి ఈ సీన్ షూట్ ఇదివరకే పూర్తయిన.. ఔట్పుట్ విషయంలో ప్రశాంత్ అసంతృప్తిగా ఉన్నాడట. అందుకే ఈ సీన్ను రీషూట్ చేయాలని భావిస్తున్నారట. ఇంటర్వెల్ సీన్ సినిమాకే హైలెట్గా ఉంటుందన్న నమ్మకంతో ప్రశాంత్ పట్టుదలగా ఉన్నాడని సమాచారం. ఇక 'సలార్' స్పెషల్ సాంగ్లో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటించనుందని తెలుస్తోంది. స్పెషల్ సాంగ్ కోసం శ్రద్ధాను ఎంపిక చేశారట మేకర్స్. సాహో సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్ధా అలరించిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: ప్రభాస్ మంచి మనసు.. ఏపీ వరద బాధితులకు భారీ విరాళం -
ఖరీదైన కారును వదిలి ఆటోలో ప్రయాణించిన హీరోయిన్
Shraddha Kapoor Auto Ride In Mumbai: బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ఆటోలో ప్రయాణించింది. ఖరీదైన కారు ఉన్నా సాధారణ అమ్మాయిలా ఆటోలోనే ప్రయాణం చేసింది. దీనికి సంబంధించి ఆటో జర్నీని తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకుంది. దీనికి లవ్ సింబర్ను జోడించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. సెలబ్రిటీ అయ్యుండి కూడా సింపుల్గా ఆటోలో ప్రయాణించడంపై సాహో బ్యూటీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. శ్రద్ధా సింప్లిసిటీకి అభిమానులు ఫిదా అవుతున్నారు. నేను కూడా అదే ఆటోలో ఉంటే బాగుండేది అంటూ ఓ అభిమాని వీడియోను రీట్వీట్ చేశాడు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం శ్రద్ధా చల్బాజ్ ఇన్ లండన్లో నటిస్తుంది. దీనితో పాటు నాగిన్ సీరియల్ ఆధారంగా తెరకెక్కుతున్న ఓ సినిమాకు సైన్ చేసింది. ఈ సినిమాకు నిఖిల్ ద్వివేది నిర్మించనున్నారు. View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) -
హల్చల్ : క్యూట్గా నజ్రియా...స్టన్నింగ్ లుక్లో కాజల్
► క్యూట్గా నజ్రియా... స్టన్నింగ్ లుక్లో కాజల్ ► పింక్ శారీలో నాజ్రియా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ► కాజల్ స్టన్నింగ్ లుక్స్ ► పర్పుల్ శారీలో యాంకర్ అనసూయ ► వెకేషన్ మూడ్లో అల్లు స్నేహా రెడ్డి ► కత్రినా చేతిలో బ్రేక్ఫాస్ట్ కూడా అందంగా.. ►ప్రేమ పంపిస్తున్న రాశీ ఖన్నా View this post on Instagram A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by syamala Anchor (@syamalaofficial) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor)
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ లండన్ పర్యటన
వ్యక్తి దుర్మరణం
కొనసాగిన ఈ – కంటెంట్ జనరేషన్పై శిక్షణ
‘నన్నయ’ వర్సిటీ అభివృద్ధికి ‘న్యూయోమ్’ సహకారం
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
భూతదయకు ప్రా‘ధాన్యం’
రెండు బైక్లు ఢీకొని వ్యక్తి మృతి
అబ్బుర పర్చిన డాగ్ షో
సమ్మర్లో చదివేద్దాం
వాహనం ఢీకొని వ్యక్తి మృతి
తప్పక చదవండి
- ‘నన్ను పాస్ అవమంటారు.. మరి నాన్నేం చేశారు?’
- తెలంగాణ ఈఏపీ సెట్లో ఏపీ విద్యార్థి సత్తా
- అనంతలో ఘోర ప్రమాదం: పెళ్లి షాపింగ్ చేసి తిరిగొస్తుండగా..
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- అలాంటి సీన్స్ నా వల్ల కాదు.. కొందరు దర్శకులు కావాలనే..
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
- టీడీపీ దాష్టీకానికి పరాకాష్ట
- చివరి బెర్త్ ఎవరిదో?
Advertisement