-
ఫ్యామిలీస్టార్ నుంచి టాప్ సింగర్ పాట రిలీజ్
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ- మృణాల్ ఠాకూర్ జోడీగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రాన్ని రాజు - శిరీశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. నేడు హోలి సందర్భంగా ఒక లిరికల్ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలతో పాటు టీజర్, గ్లింప్స్ విడుదలయ్యాయి. అవన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించాయి. దీంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. తాజాగా 'మధురము కదా ప్రతొక నడక నీతో కలిసేలా..' అనే మెలోడీ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. గోపి సుందర్ సంగీతానికి ప్రముఖ సింగర్ శ్రేయ ఘోషల్ గాత్రం తోడు కావడంతో పాటకు మరింత మధురం వచ్చిందని చెప్పవచ్చు. ‘ఫ్యామిలీస్టార్’ విడుదల తేదీ కూడా ఇప్పటికే ఖరారైంది. వేసవి సందర్భంగా ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రానుంది. -
స్వరమే కాదు.. అందంతో కూడా ఆహా అనిపించే ఈ సింగర్ తెలుసా! (ఫోటోలు)
-
IFFI Goa 2023: గోవా ఇఫి వేడుకల్లో తారాలోకం (ఫొటోలు)
-
చూపున్న పాట
‘నవ్వినా ఏడ్చినా కన్నీళ్లు వస్తాయి’ అన్నాడు కవి. పట్టలేని ఆనందంలో, ప్రశంసించడానికి మాటలు దొరకని పరిస్థితుల్లో కూడా కన్నీళ్లు వస్తాయి. మేనుక పౌదెల్ పుట్టు అంధురాలు. మంచి గాయకురాలు. ఇండియన్ ఐడల్ 14 సీజన్లో ‘లగాన్’ సినిమాలో లతా మంగేష్కర్ పాడిన ‘ఓ పాలన్ హరే’ పాట పాడింది. అద్భుతమైన ఆమె పాట వింటూ జడ్జీలలో ఒకరైన శ్రేయా ఘోషల్ ఏడ్చేసింది. ఈ ఎపిసోడ్ ఇంటర్నెట్లో వైరల్ అయింది. వైరల్ కావడం మాట ఎలా ఉన్నా ‘శ్రేయ ఓవర్గా రియాక్ట్ అయ్యారు’ అని కొందరు విమర్శించారు. మరి ఆమె అభిమానులు ఊరుకుంటారా? వాళ్లు ఇలా స్పందించారు...‘రెండు దశాబ్దాలకు పైగా శ్రేయ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్నారు. ఎన్నో జాతీయ అవార్డ్లు అందుకున్నారు. ఆమెకు ప్రతిభ లేకపోతే ఇలా వచ్చి అలా వెళ్లిపోయేవారు. ఇలాంటి టాలెంటెడ్ సింగర్ గురించి నెగెటివ్ కామెంట్స్ పెట్టడం తగదు’. -
తమిళ సినిమాకు వచ్చిన జాతీయ అవార్డులు ఇవే
69వ సినీ జాతీయ అవార్డుల వివరాలను కేంద్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం ప్రకటించింది. ఇందులో తమిళ చిత్ర పరిశ్రమ నాలుగు అవార్డులను గెలుచుకోవడం, అవన్నీ చిన్న చిత్రాలు కావడం మరింత విశేషం. మణికంఠన్ దర్శకత్వం వహించిన కడైసి వ్యవసాయి చిత్రం ప్రాంతీయ ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకుంది. అదే విధంగా ఆ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన (లేట్) నల్లుండికి ప్రత్యేక అవార్డును ప్రకటించింది. పార్తీపన్ కథానాయకుడిగా నటించి దర్శకత్వం వహించిన ఇరైవిన్ నిళల్ చిత్రంలోని మాయవా ఛాయవా అనే పాటను పాడిన శ్రేయ ఘోషల్ను ఉత్తమగాయని అవార్డు వరించింది. కాగా ఈవీ గణేష్ బాబు దర్శకత్వం వహించిన కరువరై చిత్రానికి గాను సంగీత దర్శకుడు శ్రీకాంత్ దేవాకు ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు వరించింది. (ఇదీ చదవండి: 2023 :అల్లు అర్జున్... ఉత్తమ నటుడు) ఈ సందర్భంగా తన చిత్రంలోని పాటకు గాను ఉత్తమ గాయని అవార్డును ప్రకటించిన అవార్డుల కమిటీకి నటుడు పార్తీపన్ ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. కాగా తెలుగు తేజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆస్కార్ అవార్డు కొల్లగొట్టిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఈసారి ఏకంగా 6 ప్రధాన అవార్డులను దక్కించుకోవడం విశేషం. ఉత్తమగాయనిగా శ్రేయ ఘోషల్కు జాతీయ అవార్డు తెచ్చిన పాట ఇదే... -
వీడియో: హైదరాబాద్కు తిరుగులేదన్న శ్రేయా ఘోషల్, ఆమె తెలుగుకు ఆడియన్స్ ఫిదా!
-
‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ పై బాలీవుడ్ మ్యూజిక్ ఐకాన్స్ ప్రశంసలు
ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమ్ అవుతోన్న ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’కు విశేష ఆదరణ లభిస్తోంది. షో లో ప్రస్తుతం ఉన్న టాప్ 11 కంటెస్టెంట్స్ తమ మధురగానంతో ప్రేక్షకుల మదిని దోచుకుంటున్నారు. సామన్య ప్రేక్షుకులే కాక ఎంతో మంది సినీ సంగీత ప్రముఖులు వీరి గానానికి మంత్రముగ్ధులవుతున్నారు. పోటీలో భాగంగా నిర్వహించిన గాలా విత్ బాలా ఎపిసోడ్ లో సౌజన్య భాగవతుల అనే కంటెస్టెంట్ ఆలపించిన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంలోని 'ఎంకిమీడ నా జతవిడి...' మంచి స్పందన లభించింది. ఆ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న తమన్ ఈ పాట విని.. దీని ఒరిజినల్ వెర్షన్ పాడిన శ్రేయా ఘోషల్కు ఇది వినిపిస్తానని మాట ఇచ్చారు. తాజాగా ఈ సాంగ్ చూసిన శ్రేయా ఓ వీడియోను పంపించారు. దీన్ని స్టేజిపై తమన్ చూపించి సౌజన్యకు సర్ప్రైజ్ ఇచ్చారు. సాంగ్ విన్న ప్రముఖ నేపధ్య గాయని శ్రేయాఘోషల్ సంతోషం వ్యక్తం చేశారు. సౌజన్య గాత్రం అత్యంత మధురంగా ఉందంటూ కితాబిచ్చారు. అలాగే ప్రముఖ బాలీవుడ్ సంగీతకారులు విశాల్ దద్లాని మరియు హిమేష్ రేషిమియా షో కు వస్తున్న ఆదరణను ప్రశంసించారు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 కార్యక్రమం ప్రతి శక్ర, శని వారాల్లో రెండు ఎపిసోడ్లుగా రాత్రి 7 గంటల నుంచి ఆహాలో ప్రసారం అవుతుంది. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
బర్సో రే మేఘా మేఘా అంటున్న ఇన్ఫోసిస్ సుధామూర్తి: వీడియో చూస్తే ఫిదా
న్యూఢిల్లీ: విద్యావేత్త, రచయిత్రి, పరోపకారి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి అంటే పరిచయం అక్కర లేని పేరు. ఇన్ఫోసిస్ 40వ వార్షికోత్సవ ఈవెంట్లో ఆమె స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచారు. ఉరిమే ఉత్సాహం ఉంటే చాలు సంతోషానికి వయసుతో పని లేదంటూ ఆమె సరదాగా కాలు కదిపిన వీడియో సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది. (10 వేలతో..వేల కోట్లు... మీరూ ఇలా చేయండి!) ఈ ఈవెంట్లో బాలీవుడ్ గాయని, మెలోడీ క్వీన్ శ్రేయా ఘోషల్తో కలిసి సుధా మూర్తి చిన్నగా స్టెప్పు లేశారు. బుధారం రాత్రి ఎలక్ట్రానిక్స్ సిటీ బెంగళూరులోని ప్రధాన కార్యాలయంలో జరిగిన ఇన్ఫోసిస్ @ 40 ఈవెంట్లో చాలా చురుగ్గా పాల్గొన్న సుధామూర్తి గురు సినిమాలోని "బర్సో రే మేఘా మేఘా" పాటకు ఉత్సాహంగా పదం కలిపారు. బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ నటించిన ఈ పాటకు సుధామూర్తి ఆనందం ఇంటర్నెట్లో అందరినీ ఆకట్టుకుంటోంది. Someone just sent this to me. Sudha Murty dancing and singing with @shreyaghoshal as part of the #Infy4Decades celebration in Bengaluru last night. Wholesome 😍 pic.twitter.com/I17Ns49qDR — Chandra R. Srikanth (@chandrarsrikant) December 15, 2022 Omg..!!!🙏🏻 legend's Sudhamurthy amma & Shreyaghoshal di . #SudhaMurty mam @shreyaghoshal #Infosys #ShreyaGhoshal #Legends . (Sudha amma dances her heart out on 'Barso Re Megha' with shreya di💃🏻🔥) pic.twitter.com/MmtT1CvZtt — 💕𝑺𝒉𝒓𝒆𝒚𝒂_𝑺𝒖𝒔𝒉💕 (@Sush36068856) December 15, 2022 -
'నా పేరు సీసా' సాంగ్లో అదరగొడుతున్న బాలీవుడ్ బ్యూటీ
మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. కెరీర్లో ఎన్నడూ లేనంత స్పీడ్గా షూటింగ్లను పూర్తి చేస్తూ సినిమాలు వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన సినిమాల నుంచి తరచూ ఏదో ఒక అప్డేట్ బయటకు వస్తోంది. తాజాగా ఆయన నటించిన రామారావు ఆన్ డ్యూటీ నుంచి ఐటం సాంగ్ రిలీజైంది. నా పేరు సీసా.. నా పేరు సీసా.. అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్ను శ్రేయ ఘోషల్ పాడింది. సామ్ సీఎస్ స్వరపరిచిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యాన్ని అందించాడు. బాలీవుడ్ నటి అన్వేషి జైన్ ఐటంసాంగ్లో స్టెప్పులేసింది. కాగా శ్రీలక్ష్మివెంకటేశ్వర సినిమాస్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరితో కలిసి రవితేజ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా జూలై 29న రిలీజ్ కానుంది. చదవండి: చోళులు వచ్చేస్తున్నారు అంటూ పోస్టర్ రిలీజ్ జనవరి టు జూన్.. ఫస్టాఫ్లో అదరగొట్టిన, అట్టర్ ఫ్లాప్ అయిన చిత్రాలివే! -
ఆయన పాటలు అనేక భావోద్వేగాలను పలికించేవి: ప్రధాని మోదీ
PM Narendra Modi Akshay Kumar Condolence On Singer KK Death: బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. పాపులర్ ప్లేబ్యాక్ సింగర్ కేకే (కృష్ణకుమార్ కున్నత్) హఠాన్మరణం చెందారు. కోల్కతాలో ఓ స్టేజ్ షోలో పాల్గొన్న అనంతరం కేకే తాను బస చేస్తున్న హోటల్ గదిలో కుప్పకూలి మరణించినట్లు సమాచారం. కేకే తన ఆఖరి ప్రోగ్రాంకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 53 ఏళ్ల కేకే గత మూడు దశాబ్దాల్లో హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, బెంగాలీ భాషల్లో అనేక హిట్ గీతాలను ఆలపించారు. కేకే హఠాన్మరణం మరణం పట్ల ప్రధాని మోదీతోపాటు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. #WATCH | Singer KK died hours after a concert in Kolkata on May 31st. The auditorium shares visuals of the event held some hours ago. KK was known for songs like 'Pal' and 'Yaaron'. He was brought dead to the CMRI, the hospital told. Video source: Najrul Manch FB page pic.twitter.com/YiG64Cs9nP — ANI (@ANI) May 31, 2022 'కేకేగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్ అకాల మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన పాటలు అన్ని రకాల వయసుల వారికి అనేక రకాల భావోద్వేగాలను ప్రతిబింబించేలా చేశాయి. కేకే పాటలు మనకు ఎప్పటికీ గుర్తుంటాయి. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం. ఓం శాంతి.' అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. 'కేకే హఠాన్మరణం వార్త విని చాలా షాక్కు గురయ్యాను. చాలా బాధగా ఉంది. తీరని లోటు ఇది. ఓం శాంతి.' అని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. వీరితోపాటు దర్శక నిర్మాత కరణ్ జోహార్, సింగర్స్ ప్రీతమ్, జుబిన్ నటియాల్, ఆర్మాన్ మాలిక్, శ్రేయ ఘోషల్ విచారం వ్యక్తం చేశారు. చదవండి: సింగర్ కేకే హఠాన్మరణం: విరహ గీతాలతో కోట్ల హృదయాలను కొల్లగొట్టి.. Saddened by the untimely demise of noted singer Krishnakumar Kunnath popularly known as KK. His songs reflected a wide range of emotions as struck a chord with people of all age groups. We will always remember him through his songs. Condolences to his family and fans. Om Shanti. — Narendra Modi (@narendramodi) May 31, 2022 Extremely sad and shocked to know of the sad demise of KK. What a loss! Om Shanti 🙏🏻 — Akshay Kumar (@akshaykumar) May 31, 2022 Heartbreaking news on the sudden passing away of such an incredible talent…. RIP KK…💔 the entertainment world has lost a true artist today….Om Shanti 🙏 pic.twitter.com/SiKQutPJVO — Karan Johar (@karanjohar) May 31, 2022 In utter shock. Just heard about KK . Someone please tell me it's not true — Pritam (@ipritamofficial) May 31, 2022 Black year for Indian music. Lata didi, bappi da, sidhu paaji and now KK sir. These losses.. all of them feel so personal. — ARMAAN MALIK (@ArmaanMalik22) May 31, 2022 One and only . KK 😔 . — Jubin Nautiyal (@JubinNautiyal) May 31, 2022 My deepest sincerest condolences. His golden, soulful voice echoes in all our hearts. Rest in peace dear #KK🙏🏻💔 — Shreya Ghoshal (@shreyaghoshal) May 31, 2022 Singer KK never smoked or drank! Led the most simple non controversial non media hyped life. Complete family man. Jab bhi mujhe mile he met with so much of love & kindness. God! Too unfair! OM SHANTI. — RAHUL VAIDYA RKV (@rahulvaidya23) May 31, 2022 -
శ్రేయా ఘోషల్కు క్షమాపణలు చెప్పిన టాప్ హీరోయిన్
బాలీవుడ్ సినిమా 'ఆత్రంగి రే'లోని ఫస్ట్సాంగ్ ‘చకా చక్’ పాట ఇప్పటికే యూట్యూబ్ను షేక్ చేస్తుంది. ఈ పాటలో సారా అలీ ఖాన్ గ్రీన్, పింక్ కాంబినేషన్ ఉన్న చీర ధరించి మంచి స్టెప్పులేస్తూ అదరగొట్టారు. తాజాగా ఆమె ఒక ఇంటర్య్వూలో పాల్గొన్నారు. అక్కడ 'ఆత్రంగి రే' సినిమాలోని ‘చకా చక్’ పాటను పాడి అక్కడి వారిలో మరింత జోష్ను నింపారు. నిజానికి ఈ సినిమాలో చకాచక్ పాటను శ్రేయా ఘోషల్ పాడారు. దీంతో సారా అలీఖాన్ పాటను పాడిన తర్వాత.. శ్రేయా ఘోషల్కి నవ్వుతూ.. క్షమాపణలు తెలిపారు. మీ అంత బాగా పాడలేకపోతున్నా.. అంటూ చమత్కరించారు. మరో ప్రమోషన్ కార్యక్రమంలోనూ సారా అలీఖాన్ ఎంతో జోష్గా పాల్గొన్నారు. ఫ్యాన్స్ కోరిక మీద పాట పాడుతూ స్టెప్పులతో అదరగొట్టారు. కాగా ఈ సినిమాలో ధనుష్, అజయ్ దేవ్గణ్ నటించాడు. ఎఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. 'ఆత్రంగి రే' చిత్రం డిసెంబర్ 24న డిస్నీ ప్లస్ హాట్స్టార్లో విడుదల కానుంది. చదవండి: ఆకట్టుకుంటున్న నాగశౌర్య ‘లక్ష్య’ మూవీ ట్రైలర్ -
Parag Agrawal : అడిషనల్ పేపర్ కోసం గొడవ.. ఆ సింగర్ క్లోజ్ ఫ్రెండ్ కూడా!
మైక్రో బ్లాగింగ్ సైట్, సోషల్ మీడియా దిగ్గజ కంపెనీల్లో ఒకటైన ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పరాగ్ అగర్వాల్ నియమితుడైనప్పటి నుంచి అతను ఎవరూ? ఎక్కడ చదివాడు ? అతని కుటుంబ వివరాల గురించి సెర్చ్ చేస్తున్న వారి సంఖ్య పెరిగింది. అయితే వ్యక్తిగత వివరాల విషయంలో పరాగ్ అగర్వాల్ చాలా గోప్యతను పాటిస్తున్నారు. వివిధ మాధ్యమాల ద్వారా ఆయన జీవితానికి సంబంధించి సేకరించిన కొన్ని విశేషాలు... పరాగ్ అగర్వాల్ పుట్టి పెరిగింది అంతా ముంబైలోనే. అటామిక్ ఎనర్జీ సంస్థలో ఉన్నత ఉద్యోగిగా పరాగ్ తండ్రి పని చేశారు. తల్లి స్కూల్ టీచర్గా పని చేసి రిటైర్ అయ్యారు. తండ్రి పని చేస్తున్న అటామిక్ ఎనర్జీ నిర్వహిస్తున్న స్కూల్లోనే పరాగ్ చదువుకున్నారు. శ్రేయా ఘోషల్ క్లాస్మేట్ ముంబైలోని అటామిక్ ఎనర్జీస్కూల్లో పరాగ్ అగర్వాల్, నేటి ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ కలిసే చదువుకున్నారు. పరాగ్ పుస్తకాల పురుగుగా మారి పరీక్షల్లో టాప్ ర్యాంకులు సొంతం చేసుకుంటుంటే శ్రేయ సంగీత ప్రపంచంలో తిరుగులేని మహారాణిగా ఎదిగింది. ముందుగా శ్రేయా ఇండియన్ సెలబ్రిటీగా మారగా.. ఆ తర్వాత కొంత కాలానికి పరాగ్ ఇంటర్నేషన్ ఫేమస్ పర్సన్గా ఎదిగారు. వీరిద్దరి మధ్య ఇప్పటీకీ స్నేహం కొనసాగుతోంది. పరాగ్ ఇండియా వచ్చినా.. శ్రేయా అమెరికా వెళ్లినా కలుస్తుంటారు. ట్విట్టర్లో తరచుగా చాట్ చేస్తుంటారు కూడా. ఇంటర్లోనే గోల్డ్ మెడల్ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో 2001లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలంపియాడ్లో గోల్డ్ మెడల్ సాధించారు. జేఈఈ ఎగ్జామ్లో గొడవ ఐఐటీలో సీటు లక్ష్యంగా ప్రిపేర్ అవుతూ వచ్చిన పరాగ్ జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఇన్విజిలేటర్లతో గొడవ పడ్డాడు. పరీక్ష ప్రారంభమైన నలభై నిమిషాల్లోనే తనకు తెలిసిన అన్ని ప్రశ్నలకు సమాధానం రాసిన పరాగ్.. ఆ తర్వాత అడిషనల్ పేపర్లు కావాలంటూ ఇన్విజిలేటర్ని కోరాడు.. ‘ ఈ పరీక్షలో అడిషనల్ పేపర్ల కాన్సెప్ట్ లేదు’ అంటూ ఇన్విజిలేటర్ సమాధానం ఇచ్చారు. మరి అలాంటప్పుడు ఇన్స్ట్రక్షన్ బుక్లెట్లో ‘‘టై ఆల్ ది సప్లిమెంట్స్ కరెక్ట్లీ ఇన్ రైట్ ఆర్డర్’’ అనే నిబంధన ఎందుకు చేర్చినట్టు అంటూ ఎదురు ప్రశ్నించారు. అలా ఇద్దరి మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. దీంతో పరీక్షలో విలువైన సమయం వృథా అయ్యిందని ఇప్పటికీ పరాగ్ గుర్తు చేసుకుని బాధపడతారు. ముంబై టూ స్టాన్ఫోర్డ్ జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో చిన్న గొడవ జరిగినా.. ఆలిండియా 77వ ర్యాంకు సాధించి ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో చేరాడు. 2005లో పట్టా పుచ్చుకుని ఉన్నత విద్య కోసం అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చేరుకున్నాడు. అక్కడే డాక్టరేట్ పట్టా సైతం పుచ్చుకున్నాడు. అప్పటి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. మైక్రోసాఫ్ట్తో మొదలు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి పరాగ్ బయటకు వచ్చిన తర్వాత మొదటి సారి మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత యాహూ, ఏటీ అండ్ టీల మీదుగా 2011లో ట్విట్టర్లో చేరారు పరాగ్. ఆ సమయంలో ట్విట్టర్ మొత్తం ఉద్యోగుల సంఖ్య వెయ్యికి అటుఇటుగా ఉంది. అప్పటి నుంచి టీమ్ వర్క్ చేస్తూ ట్విట్టర్ ఉన్నతిలో కీలక భూమిక పోషించారు. తొలిచూపులు అక్కడే స్టాన్ఫోర్డ్లో చదివేప్పుడే వినీతతో పరిచయం. అమె అక్కడ మెడికల్ సైన్స్ విద్యార్థిగా చేరింది. ఆ తర్వాత వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. వారికి అన్ష్ అగర్వాల్ అనే బాబు ఉన్నాడు. ప్రస్తుతం అండర్సన్ హారోవిట్జ్ అనే వెంచర్ క్యాపిటల్ సంస్థలో భాగస్వామిగా ఆమె ఉన్నారు. చదవండి: ట్విటర్ కొత్త సీఈవో పరాగ్.. యంగెస్ట్ సీఈవో ఘనత,కానీ చిన్న మెలిక! -
తొలిసారిగా కుమారుడి ఫొటో షేర్ చేసిన శ్రేయా ఘోషల్
ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ మొదటి సారిగా తన కుమారుడు ఫొటోను షేర్ చేశారు. ఇటీవల తనకు పడ్డంటి మగ బిడ్డ జన్మించినట్లు సోషల్ మీడియాలో ప్రకటించిన ఆమె చిన్నారి ఫొటోను మాత్రం షేర్ చేయలేదు. దీంతో ఆమె కుమారుడిని చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు, ఫాలోవర్స్కు తాజాగా శ్రేయా సర్ప్రైజ్ అందించారు. తన భర్త శిలాదిత్యతో కలిసి తమ ముద్దుల తనయుడిని ఎత్తుకుని ఉన్న ఫొటోను షేర్ చేస్తూ కుమారుడిని పరిచయం చేశారు. ఈ సందర్భంగా తన తనయుడికి దేవ్యాన్ ముఖోపాధ్యాయగా నామకరణం చేసినట్లు ఆమె వెల్లడించారు. అయితే ఇందులో దేవ్యాన్ ముఖం మాత్రం కనిపించకుండా వారు జాగ్రత్త పడ్డారు. గత నెల మే 22న శ్రేయా ఘోషల్ పండంటి మగబిడ్డకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శ్రేయా చిన్నారి దేవ్యాన్ ఫొటోను షేర్ చేస్తూ.. ‘ఇంట్రడ్యూసింగ్ దేవ్యాన్ ముఖోపాధ్యాయ. అతను మే 22న మా జీవితంలోకి వచ్చాడు. అతడి రాకతో మా హృదయాలు ఒక రకమైన ప్రేమను నింపాడు. ఒక తల్లి, ఒక తండ్రి మాత్రమే ఇలాంటి మధురమైన అనుభూతిని పొందగలరు. స్వచ్చమైన, హద్దులు లేని ప్రేమకు ఈ చిన్నారి దేవ్యాన్ నిదర్శనం’ అంటు ఆమె మురిసిపోయారు. View this post on Instagram A post shared by shreyaghoshal (@shreyaghoshal) చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సింగర్ శ్రేయా ఘోషల్ -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ సింగర్
ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని శ్రేయా స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇన్స్టాగ్రామ్లో ఆమె పోస్టు షేర్ చేస్తు.. ‘ఈ మధ్యాహ్నం మాకు మగ బిడ్డ పుట్టాడు. ఇంతటి అనుభూతిని గతంలో ఎప్పుడు నేను పొందలేదు. ప్రస్తుతం నేను, నా భర్త శిలాదిత్య, నా కుటుంబం సంతోషంలో మునిగితేలుతున్నాం’ అంటు ఆమె ఈ విషయాన్ని అభిమానులతో, సన్నిహితులతో పంచుకున్నారు. అలాగే తను బిడ్డకు మీరందరు ఇచ్చే లెక్కలేనన్ని ఆశ్వీర్వాదాలకు ధన్యవాదాలు అంటు ఆమె రాసుకొచ్చారు. కాగా శ్రేయా ఇటీవల బేబీ షవర్ కార్యక్రమానికి సంబంధించిన తన బేబీ బంప్ ఫొటోలను షేర్ చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే తాను అమ్మని కాబోతున్నానని, ప్రస్తుతం అమ్మ తనాన్ని ఆస్వాధిస్తున్నానంటు శ్రేయా మురిసిపోయింది. కాగా 2015, ఫిబ్రవరి 5న శ్రేయా తన మిత్రుడైన శైలాదిత్య ముఖోపాధ్యాయను పెళ్లాడిన సంగతి తెలిసిందే. టాలీవుడ్.. బాలీవుడ్.. మాలీవుడ్.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, బెంగాలీ, పంజాబీ, మరాఠీ, మళయాళం, అస్సామీ ఇలా పలు భాషల్లో తన అద్భుత గాత్రంతో అలరిస్తున్నారామె. ఇటీవలె తెలుగులో ‘ఉప్పెన’, ‘టక్ జగదీశ్’ సినిమాల్లో కూడా ఆమె పాడారు. చదవండి: శ్రేయా ఘోషల్ బేబీ బంప్ ఫోటోలు వైరల్ -
బేబీ బంప్తో ఫోటోలకు పోజిచ్చిన శ్రేయా ఘోషల్
ముంబై : ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ ప్రస్తుతం అమ్మతనాన్ని ఆస్వాదిస్తుంది. 'నా జీవితంలోనే అద్భుతమైన దశను అనుభవిస్తున్నా. ఇదంతా దేవుడి లీల' అని బేబీ బంప్తో దిగిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. దీన్ని చూసిన అభిమానులు మరోసారి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం శ్రేయా ఘోషల్ బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇటీవలె తాను తల్లి కాబోతున్నట్లు శ్రేయా ఘోషల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by shreyaghoshal (@shreyaghoshal) బేబీ శ్రేయాదిత్య (శ్రేయా, ఆమె భర్త శిలాదిత్య పేర్లు కలిసేలా) కమింగ్ అంటూ స్వయంగా మధుర క్షణాలను ఫ్యాన్స్కు షేర్ చేశారు. తమ జీవితంలో ఈ సరికొత్త అధ్యాయాన్ని పంచుకోవడం తమకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. కాగా 2015, ఫిబ్రవరి 5న శ్రేయా తన మిత్రుడైన శైలాదిత్య ముఖోపాధ్యాయను పెళ్లాడిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ .. బాలీవుడ్.. మాలీవుడ్.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, బెంగాలీ, పంజాబీ, మరాఠీ, మళయాళం, అస్సామీ ఇలా పలు భాషల్లో తన అద్భుత గాత్రంతో అలరిస్తున్నారామె. ఇటీవలె తెలుగులో ‘ఉప్పెన’, ‘టక్ జగదీశ్’ సినిమాల్లో పాడారు. చదవండి : శ్రేయా సీమంతం అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వచ్చింది : యంగ్ హీరో -
శ్రేయా సీమంతం
శ్రేయా ఘోషల్ మంచి గాయని. హిందీ చిత్రాలతో పాటు దక్షిణాదిన పలు పాటలు పాడారు. ఆమె పాడిన పాటల్లో ‘శ్రీరామరాజ్యం’లోని ‘సీతా సీమంతం..’ ఒకటి. సినిమాలో నయనతార సీమంతం వేడుకప్పుడు వచ్చే పాట ఇది. ఇప్పుడు ‘శ్రేయా సీమంతం’ జరిగే వేళ వచ్చింది. ప్రస్తుతం ఆమె గర్భవతి. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. ‘‘బేబీ.. శ్రేయాదిత్య (శ్రేయా, ఆమె భర్త తమ పేర్లు కలిపి బిడ్డకు పెట్టాలనుకున్నారని ఊహించవచ్చు) ఈజ్ ఆన్ ఇట్స్ వే. నాకు, శిలాదిత్య (శ్రేయా భర్త పేరు)కు చాలా థ్రిల్గా ఉంది. మా జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభిస్తున్న సందర్భంగా మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నాను’’ అంటూ ఓ ఫొటోను షేర్ చేశారు శ్రేయా ఘోషల్. -
తల్లి కాబోతున్న ప్రముఖ గాయని
సాక్షి,ముంబై: ప్రముఖ గాయని శ్రేయా ఘోషాల్ శుభవార్త అందించారు. బేబీ శ్రేయాదిత్య కమింగ్ అంటూ స్వయంగా మధుర క్షణాలను ఫ్యాన్స్కు షేర్ చేశారు. తమ జీవితంలో ఈ సరికొత్త అధ్యాయాన్ని పంచుకోవడం తమకు చాలా ఆనందంగా ఉందని శ్రేయ వెల్లడించారు. ఈ శుభ సమయంలో అందరి ప్రేమ, ఆశీస్సులు కావాలంటూ శ్రేయా ట్వీట్ చేశారు. దీంతో ఆమెకు అభినందనల వెల్లువ కురుస్తోంది. 2015, ఫిబ్రవరి 5న శ్రేయా తన మిత్రుడైన శైలాదిత్య ముఖోపాధ్యాయను పెళ్లాడిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ .. బాలీవుడ్.. మాలీవుడ్.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, బెంగాలీ, పంజాబీ, మరాఠీ, మళయాళం, అస్సామీ ఇలా పలు భాషల్లో తన అద్భుత గాత్రంతో అలరిస్తున్నారామె. తన విశేష ప్రతిభకు గాను పలు భాషల్లో అనేక జాతీయ పురస్కారాలను సొంతం చేసుకున్నారు. Baby #Shreyaditya is on its way!@shiladitya and me are thrilled to share this news with you all. Need all your love and blessings as we prepare ourselves for this new chapter in our lives. pic.twitter.com/oZ6c6fnR6Z — Shreya Ghoshal (@shreyaghoshal) March 4, 2021 -
నా మావయ్య.. భౌతికంగా లేరంతే: సునీత
సాక్షి, హైదరాబాద్: ‘‘ఒక శకం ముగిసింది. సంగీతం, ప్రపంచం ఇకపై మునుపటిలా ఉండబోవు. ఒక మంచి గాయనిగా పేరొందేలా నాకు మార్గనిర్దేశనం చేసిన ఆయనకు ధన్యవాదాలు చెప్పేందుకు మాటలు సరిపోవు. ఆయన సమక్షంలో ఇకపై సంగీత ప్రదర్శనలు ఉండబోవు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. సావిత్రమ్మ, చరణ్, పల్లవి, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని ప్రముఖ గాయని కేఎస్ చిత్ర గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి నివాళులు అర్పించారు. సంగీత ప్రపంచానికి ఆయన లేని లోటు తీర్చలేనిదని ఉద్వేగానికి లోనయ్యారు. (చదవండి: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత) కోలుకుంటారని ఆశించాను: శ్రేయా ఘోషల్ లెజండరీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారులేరనే ఈ విషాదకర వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన కోలుకుంటారని ఎంతగానో ఎదురుచూశాం. గొప్ప కళాకారులు. మంచి మనిషి. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి. ఆయన ఆశీస్సులు నాకు లభించాయి. ఆయనతో కలిసి పాటలు పాడటం నాకు దక్కిన అదృష్టం. సంగీతం ఉన్నంతకాలం మీ వారసత్వం కొనసాగుతుంది. ఎస్పీబీ గారి ఆత్మకు శాంతి చేకూరాలి. - శ్రేయా ఘోషల్ మీ ఆత్మకు శాంతి చేకూరాలి: కౌసల్య ఎస్పీ బాలుగారి మరణం భారత సంగీత ప్రపంచంలో పూడ్చలేని లోటు. సంగీతం పట్ల ఆయనకు ఉన్న ఆరాధనాభావం మనకు వీనులవిందైన పాటలు ఎన్నింటినో అందించింది. తన అద్భుతమైన గాత్రంతో ఎన్నో మధుర గీతాలు ఆలపించిన ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు. - కౌసల్య నా మావయ్య భౌతికంగా లేరు అంతే: సునీత నా ఛిద్రమైన జీవితంలో వెలుగులు నింపిన వ్యక్తి. నాకు పాట మీద ప్రేమ కలిగించి, పాడాలనే తపన పెంచి, నా బాగోగులు గమనిస్తూ నాకు బాసటగా నిలుస్తూ జీవితం మీద మమకారం పెంచిన వ్యక్తి. నా ఆత్మబంధువు. నా మావయ్య భౌతికంగా లేరు అంతే. - సింగర్ సునీత Rest in peace #SPB garu. Very sad to hear this devastating news of the greatest, the legendary #SPBalasubrahmanyam passing away. We were so hopeful that he was on the path to recovery. pic.twitter.com/SnpXYWOXmh — Shreya Ghoshal (@shreyaghoshal) September 25, 2020 -
మ్యూజిక్ లవర్స్కి ఫేవరెట్ ఆ సింగర్..
-
ఆ ‘షో’ కెరీర్ను మలుపు తిప్పింది
శ్రేయా ఘోషల్... పాటలతోనే కాదు అందంతోనూ ఎందరో అభిమానులను సంపాదించుకుంది. అతిచిన్న వయసులో అత్యున్నత స్థాయికి ఎదిగి 5 జాతీయ అవార్డులతో పాటు మరెన్నో ఫిల్మ్ఫేర్ అవార్డులను, ప్రశంసలను తన ఖాతాలో వేసుకుంది. ఆమె ఏ భాషలో పాడినా ఆ పాటకే అందం వస్తుంది. ఆ పాటలోని మాధుర్యాన్ని ప్రతీ ఒక్కరూ ఆస్వాదించేలా అద్భుతంగా పాడి ఎందరో అభిమానులు సంపాదించుకుంది. సినిమాలో శ్రేయా పాడిన మొదటి పాట.. ఆమెకు భారత జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. శ్రేయా ఘోషల్. పుట్టినరోజు సందర్భంగా ఆమె గొంతులో జాలువారిన పాటల ప్రయాణంపై సాక్షి.కామ్ అందిస్తున్న ప్రత్యేక కథనం. -
‘సామజవరగమన’.. మరింత ‘అందం’గా!
ఈ మధ్య కాలంలో ట్రెండ్ సెట్టర్గా నిలిచిన సాంగ్ ‘సామజవరగమన’.. 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్లో ఉన్న తమన్ ఈ పాటను కంపోజ్ చేశాడు. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్గా వచ్చిన ‘సామజవరగమన’అంటూ వచ్చిన లిరికల్ సాంగ్ సంగీత ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకున్న ఈ పాట ట్రెంట్ సెట్టర్గా నిలిచి రికార్డులు కొల్లగొట్టింది. అంతేకాకుండా న్యూఇయర్ కానుకగా వచ్చిన ఈ పాట వీడియో సాంగ్ను కూడా సినీ ప్రేక్షకులు తెగ లైక్ చేసేస్తున్నారు. అయితే ఈ పాటకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సెన్సేషనల్ సాంగ్ ఫీమేల్ కవర్ను ప్రముఖ గాయని శ్రేయా ఘోషాల్ పాడారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఫీమేల్ వర్షన్లో శ్రేయా ఘోషాల్ పాడుతున్న ఈ పాటను నెటిజన్లను కట్టిపడేస్తోంది. అయితే ఫీమేల్ వర్షన్ ఈ పాటకు కాస్త డిఫరెంట్గా ట్యూన్ కట్టిన తమన్.. బేస్ కూడా తగ్గించాడు. అయితే కొత్తగా, అందంగా తయారైన ‘సామజవరగమన’ ఫీమేల్ కవర్ సాంగ్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. సింగింగ్ క్వీన్ శ్రేయా ఘోషాల్ ‘సామజరవగమన’ పాడటంతో ఆ పాటకు మరింత అందం వచ్చిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక ‘జులాయి (2012), సన్నాఫ్ సత్యమూర్తి (2015)’ చిత్రాల తర్వాత అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’. ఇందులో పూజాహెగ్డే కథానాయికగా నటించారు. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు, జయరామ్, మురళీ శర్మ, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి కూడా యు/ఎ సర్టిఫికెట్ లభించింది. కాగా, ఈ చిత్రం ప్రీ–రిలీజ్ (మ్యూజికల్ కన్సెర్ట్) ఈవెంట్ జనవరి 6న హైదరాబాద్లో జరగనుంది. Kashiram wants some kick in life as he is bored & Seetharam gave him the best possible idea! Music gives you the best Kick, let's affirm it by enjoying the Biggest Musical Concert #AVLPMusicalConcerton6thJan 😍🤩 #AlaVaikunthapurramuloo @alluarjun #Trivikram @hegdepooja pic.twitter.com/bswVmF74iA — Haarika & Hassine Creations (@haarikahassine) January 4, 2020 చదవండి: ష్.. ఎవరికీ చెప్పకండి: పూజా హెగ్డే నితిన్, రష్మికలకు థ్యాంక్స్: హృతిక్ -
మేడమ్ టుస్సాడ్స్లో శ్రేయా ఘోషాల్కు చోటు
న్యూఢిల్లీ: ఇండియాలో ఏర్పాటు చేస్తున్న మేడమ్ టుస్సాడ్ వ్యాక్స్ మ్యూజియంలో ప్రముఖ గాయకురాలు శ్రేయా ఘోషాల్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ ఏడాది జూన్లో ఈ మ్యూజియం ప్రారంభం కానుంది. దీంతో ఆలోగా మైనపు విగ్రహాన్ని సిద్ధం చేసేందుకు మేడమ్ టుస్సాడ్ మ్యూజియం నిర్వాహకులు అవసరమైన కొలతల్ని శ్రేయా నుంచి తీసుకున్నారు. ఈ విషయమై శ్రేయా మాట్లాడుతూ... ‘నిజంగా నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది. మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో నా మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నా. సెలబ్రిటీలతోపాటు ప్రతిభావంతుల విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేయాలని భావించిన నిర్వాహకులు నన్ను పరిగణనలోకి తీసుకోవడం ఆనందంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, అమెరికన్ పాప్స్టార్ లేడీ గగా వంటి ప్రముఖుల సరసన నాకు చోటు దక్కుతోంది. ఓ రకంగా ఇది అమరత్వంతో సమానమే. ఇటువంటి గొప్ప ఆలోచన చేసిన మ్యూజియం నిర్వాహకులకు థ్యాంక్స్’ అంటూ పట్టలేని సంతోషాన్ని వ్యక్తం చేసింది. తేరీ మేరీ, డోలా రె డోలా రె, దీవానీ మాస్తానీ, అగర్ తుమ్ మిల్ జావో, సున్ రహా హై, పియా ఓ రె పియా.. తదితర పాటలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన శ్రేయాకు ఇది ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొస్తుందని పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆశాభావం వ్యక్తం చేశారు. -
పద్మావతి పాటలు మొదలయ్యాయి
సంజయ్ లీలా భన్సాలీ అంటే బాలీవుడ్లో రాజమౌళి లాంటి దర్శకుడు. ఆయనేం తీసినా అదో దృశ్యకావ్యం లాగే ఉంటుంది. దేవదాసు, రామ్లీలా, బాజీరావు మస్తానీ.. ఇలా చెప్పుకొంటూ పోతే అన్నీ అద్భుతాలే. తాజాగా ఆయన తీస్తున్న మరో భారీ చిత్రం.. పద్మావతి. ఆ సినిమా పాటల రికార్డింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాలో కూడా మళ్లీ బాజీరావు హీరోయిన్ దీపికా పదుకొనే నటిస్తోందని టాక్ వినిపిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ గాయని శ్రేయా ఘోషల్ ఈ సినిమాలో పాటలు పాడుతోంది. దీనికోసం భన్సాలీ ఒక పాట కంపోజ్ చేశారట. ఆ పాట తన కెరీర్లోనే ఓ పెద్ద మైలురాయిలా మిగిలిపోతుందని శ్రేయా చెబుతోంది. ‘‘నా జీవితంలోనే మైలురాయి లాంటి పాటను రికార్డు చేశాను. ఇది మనసుకు పూర్తిగా సంతృప్తినిచ్చే అద్భుతమైన పాట. ఇలాంటి పాటల కోసమే జీవిస్తున్నానా అనిపిస్తోంది. పద్మావతి సినిమా కోసం సంజయ్ లీలా భన్సాలీ అత్యద్భుతమైన కంపోజిషన్స్ ఇచ్చారు. గుండె లోతుల్లోంచి ఈ పాట పాడాను’’ అని శ్రేయా ఘోషల్ చెప్పింది. బాజీరావు మస్తానీ సినిమాలోని ‘దీవానీ మస్తానీ’ పాటకు గాను ఆమెకు బోలెడన్ని అవార్డులు వచ్చి పడ్డాయి. బాజీరావు మస్తానీ సినిమాను భన్సాలీ నిర్మించడంతో పాటు దానికి సంగీతం కూడా ఆయనే అందించారు. Wondering which song! What outstanding compositions Sanjay Bhansali sir has made for #Padmavati.Sang with all heart! https://t.co/KzzCpcap4Z — Shreya Ghoshal (@shreyaghoshal) 11 July 2016 -
ఆమెను కలుసుకోవాలని ఉంది: శ్రేయా
ముంబై: తన అద్భుత గాత్రంతో యూట్యూబ్ సహా సోషల్ మీడియా అంతటా సంచలనం సృష్టిస్తోన్న అంధ విద్యార్థిని తుంపా కుమారికి ఓ విశిష్ట వ్యక్తి నుంచి పిలుపొచ్చింది. 'ఆశికీ- 2' సినిమాలో తాను పాడిన 'సున్ రహా..' పాటను తన కంటే అందంగా ఆలపించిందంటూ గాయని శ్రేయా ఘోషాల్ బాలికకు కితాబిచ్చింది. అంతేకాదు.. 'ఆమె ఎవరు? ఎక్కడుంటుంది? తొందరగా కలుసుకోవాలని ఉంది..' అంటూ ఫేస్బుక్ ద్వారా ఆహ్వానం పలికింది. జార్ఖండ్లోని బ్రజ్కిశోర్ అంధుల పాఠశాలలో చదువుతున్న తుంపా కుమారి అనే ఈ చిన్నారి.. బాలీవుడ్ సింగర్లందరూ అచ్చెరువొందేలా పాడిన పాట నెట్లో హల్చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ పాటలోని ఆరోహణ.. అవరోహణలను అవలీలగా ఆమె పాడిన తీరు అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటలోని గమకాలను అలవోకగా ఆమె ఆలపించింది. సినిమాలో శ్రేయాఘోషల్ పాడిన ఈ పాటను చిన్న బాలిక పాడటం చూసి నెట్ ప్రపంచం ఆమెకు జోహార్లంటోంది. ఎవరైనా సంగీత దర్శకుల దృష్టికి ఈమె టాలెంట్ వెళ్తే మాత్రం.. తిరుగులేకుండా ఆమె దేశం గర్వించదగ్గ గాయని అవుతుందని సోషల్ మీడియాలో కామెంట్ల మీద కామెంట్లు వస్తున్నాయి. వాట్సప్ గ్రూపుల్లో కూడా 'మీరు చేస్తున్న పని తక్షణం ఆపేసి.. ఈ వీడియో చూడండి. ఈ పాప పాడిన పాట చూస్తే, బాలీవుడ్ సింగర్లంతా సిగ్గుతో తల వంచుకోవాల్సిందే' అన్న సందేశంతో పాటుఈ వీడియో షేర్ అవుతోంది. -
'ఆయన 'ఓ మర్చిపోలేని అనుభూతి!
‘నీ జతగా నేనుండాలి’ (ఎవడు), ‘చలి చలిగా గిల్లింది’(మిస్టర్ పర్ఫెక్ట్), ‘నువ్వేం మాయ చేశావోగానీ’ (ఒక్కడు) ఈ పాటలు వింటే ఠక్కున గుర్తొచ్చే గాయని శ్రేయా ఘోషాల్. పుట్టింది, పెరిగింది ఉత్తరాదిలో అయినా, నిజంగా తెలుగమ్మాయే పాడుతోందేమో అనిపిస్తుందామె గొంతు వింటే. అయిదు నెలల క్రితమే శ్రేయా ఘోషాల్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. వైవాహిక జీవితం గురించి ఆమె మాట్లాడుతూ -‘‘పెళ్లి వల్ల నా జీవితం ఏ మాత్రం మారలేదు. చాలా సంతోషంగా ఉన్నాను. పైగా మా ఇద్దరి అభిరుచులూ, అభిప్రాయాలూ ఒకటే. దీనికి మించిన సంతోషం ఇంకెక్కడా ఉండదేమో’’ అని చెప్పారు. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో పాటలు పాడిన శ్రేయ దక్షిణాదిలో తన వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి చెబుతూ, ‘‘సౌత్లో చాలా మంది సంగీత దర్శకులతో పనిచేశాను. కానీ ‘మేస్ట్రో’ ఇళయరాజా లాంటి మహానుభావుడి సారథ్యంలో పాడే అవకాశం రావడం నా అదృష్టం. ఆయన దగ్గర పాట పాడుతున్నప్పుడు ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటా’’ అన్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ లండన్ పర్యటన
వ్యక్తి దుర్మరణం
కొనసాగిన ఈ – కంటెంట్ జనరేషన్పై శిక్షణ
‘నన్నయ’ వర్సిటీ అభివృద్ధికి ‘న్యూయోమ్’ సహకారం
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
భూతదయకు ప్రా‘ధాన్యం’
రెండు బైక్లు ఢీకొని వ్యక్తి మృతి
అబ్బుర పర్చిన డాగ్ షో
సమ్మర్లో చదివేద్దాం
వాహనం ఢీకొని వ్యక్తి మృతి
తప్పక చదవండి
- తెలంగాణ ఈఏపీ సెట్లో ఏపీ విద్యార్థి సత్తా
- అనంతలో ఘోర ప్రమాదం: పెళ్లి షాపింగ్ చేసి తిరిగొస్తుండగా..
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- అలాంటి సీన్స్ నా వల్ల కాదు.. కొందరు దర్శకులు కావాలనే..
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- Delhi liquor scam: నిందితుల జాబితాలో ఆప్, కేజ్రీవాల్
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
- చివరి బెర్త్ ఎవరిదో?
- బుల్లితెర నటి కేసులో ట్విస్ట్.. ప్రియుడు సూసైడ్!
Advertisement